Doklam
-
ఎల్ఏసీ వెంట చైనా మోహరింపులు
వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది. మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్ల నుంచి తూర్పు సెక్టార్కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు! ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది. ‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది. -
‘డోక్లాం’ దేశ భద్రతకు పెనుముప్పు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారత సరిహద్దు ప్రాంతం డోక్లాం పీఠభూమి దగ్గర చైనా నిర్మాణాలు కొనసాగిస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘డోక్లాం పీఠభూమికి అత్యంత సమీపంలో చైనా మిలటరీ నిర్మాణాలపై భారత సైన్యం తాజాగా మరింత ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరికో వదులుకునే ప్రసక్తి లేదని అమిత్ ప్రకటించారు. కానీ 2020 మే తర్వాత 2,000 కిలోమీటర్ల భారతభూభాగాన్ని గస్తీకాసే అవకాశాన్ని చైనా బలగాలు పోగొట్టాయి. మన డెప్సాంగ్, డెమ్చోక్, హాట్స్ప్రింగ్(కున్గ్రాంగ్ నళా), గోగ్రా పోస్టు వంటి పెట్రోలింగ్ పాయింట్లకు మన బలగాలు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుతగులుతోంది. దీనిపై మోదీ మౌనం వీడాలి’’ అని డిమాండ్ చేశారు. -
‘డోక్లాం’పై భూటాన్తో టచ్లో ఉన్నాం
న్యూఢిల్లీ: డోక్లాం అంశానికి సంబంధించి భూటాన్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా తెలిపారు. రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగెల్ వాంగ్చుక్తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు ద్వైపాక్షిక అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఐదుసూత్రాల రోడ్మ్యాప్ను వాంగ్చుక్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. భేటీ వివరాలను క్వాట్రా మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డోక్లాంపై ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. భద్రతకు సంబందించిన అన్ని అంశాల్లోనూ ఇరు దేశాలు పరస్పరం సహకారం ఇచ్చి పుచ్చుకుంటున్నట్టు చెప్పారు. దీన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు భూటాన్ రాజు పర్యటన దోహదపడుతోందన్నారు. అసోంలోని కోక్రాఝార్ నుంచి భూటాన్లోని గెలెపు వరకు రైల్ లింక్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఇటీవలి కాలంలో భూటాన్ క్రమంగా చైనాకు దగ్గరవుతోందన్న అభిప్రాయాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాంగ్చుక్తో చర్చలు ఫలప్రదంగా జరిగాయంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆయన గౌరవార్థం విందు ఇచ్చారు. డోక్లాం.. అతి కీలకం వ్యూహాత్మకంగా డోక్లాం భారత్కు అత్యంత కీలకం. 2017లో అక్కడ భారత, చైనా సైనికులు ఏకంగా 73 రోజుల పాటు ఎదురెదురుగా మోహరించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. భూటాన్లో తమదిగా చెప్పుకుంటున్న ప్రాంతంలో రోడ్డు వేసేందుకు చైనా ప్రయత్నించడం ఘర్షణకు కారణమైంది. దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భూటాన్కు చైనాతో 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. విపత్తుల స్పందనకు సమగ్ర వ్యవస్థ: మోదీ ప్రాకృతిక విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమగ్రమైన సన్నద్ధత వ్యవస్థ అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంతంలో తలెత్తే విపత్తులు దానికి సుదూరంలో ఉన్న ప్రాంతాలపై కూడా భారీ ప్రభావం చూపించే ఆస్కారముందని గుర్తు చేశారు. విపత్తుల నిర్వహణ సన్నద్ధత వ్యవస్థపై జరిగిన ఐదో అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవలిషన్ ఫర్ డిజాస్టర్ రెజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో ఇప్పటికే 40 దేశాలు భాగస్వాములు కావడం హర్షనీయమన్నారు. ఈ విషయమై ఒక్క తాటిపైకి వచ్చేందుకు అభివృద్ధి చెందుతున్న చిన్న, పెద్ద దేశాలకు ఈ సదస్సు చక్కని వేదికగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. విపత్తు బాధితుల్లో ప్రతి ఒక్కరినీ పూర్తిస్థాయిలో ఆదుకునేలా వ్యవస్థను అభివృద్ధి చేసుకునే దిశగా కృషి జరగాలని ప్రధాని పిలుపునిచ్చారు. విపత్తుల వేళ తక్షణ ఉపశమనంతో పాటు సాధ్యమైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొనేలా చూడటంపై దృష్టి సారించాలన్నారు. ఇందుకు రవాణా సదుపాయాలతో పాటు సామాజిక, డిజిటల్ సదుపాయాలు కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
డోక్లామ్పై భూటాన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు
ఆరేళ్లుగా డోక్లామ్ అంశంపై భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ అంశంపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది కూడా. ఈ నేపథ్యంలో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ చేసిన వ్యాఖ్యలు భారత్ని టెన్షన్లో పడేశాయి. ఇంతవరకు చైనా ఆ ప్రదేశంలోకి అక్రమంగా చోరబడుతోందని విశ్వసిస్తుంటే..ఈ వివాదం పరిష్కరించడంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్ ప్రధాని షెరింగ్ అన్నారు. దీనిపై చర్చించేందుకు తాము సిద్దంగానే ఉన్నామని, భారత్, చైనాలు కూడా రెడీగా ఉంటే చర్చింకుందాం. అయినా మూడు సమాన దేశాలే. ఇందులో పెద్ద లేదా చిన్నా దేశాలు లేవు కదా అని అన్నారు. ఒకరకంగా భూటాన్ తాను చర్చలకు సుముఖంగా ఉన్నట్లు నేరుగానే సంకేతమిచ్చింది. కాగా, భారత్, చైనా, భూటాన్ కూడలిలో ఉండే ప్రాంతమే డోక్లాం. దీన్ని ట్రై జంక్షన్ అని కూడా పిలుస్తారు. ఐతే ఈ ఎత్తైన పీఠభూమి(డోక్లాం) సిలిగురి కారిడార్కి సమీపంలో ఉంది. సరిగ్గా చైనా ఈ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టి విస్తరించే యోచన చేసింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడమే గాక భారత్ బలగాలు ఆ పనులను అడ్డుకున్నాయి కూడా. వాస్తవానికి సిలిగురి కారిడార్ ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్లోని మిగతా భూభాగంతో కలిపే ప్రాంతం. గతంలో 2019లో ఈ ట్రై జంక్షన్ పాయింట్ వద్ద ఏకపక్షంగా ఎటువైపు నుంచి ఎవరూ ఏమి చేయకూడదన్న ఒప్పందానికి భూటాన్ ప్రధాని షెరింగ్ చేసిన ప్రకటన చాలా విరుద్ధంగా ఉంది. దశాబ్దాలుగా ఈ ట్రై జంక్షన్ పాయింట్ అంతర్జాతీయ పటంలో బటాంగ్ లా ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతం చైనాకి ఉత్తరాన, భూటాన్కి ఆగ్నేయం, భారత్కి పశ్చిమాన ఉంది. అయితే చైనా ఆ ట్రై జంక్షన్ని బటాంగ్ లా నుంచి దక్షిణాం వైపు దాదాపు 7 కి.మీ దూరంలో ఉన్న మౌంట్ గిమ్మోచి అనే శిఖరానికి మార్చాలనుకుంటోంది. అదే జరిగితే మొత్తం డోక్లాం భూభాగం చైనాలో భాగమవుతుంది. ఇది భారత్కి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. చైనా 2017 నుంచి డోక్లాం విషయంలో వెనక్కి తగ్గినట్లే తగ్గి..డోక్లాం వెంబడి నేరుగా తూర్పున భూటాన్ భూభాగంలో ఉన్న అమోచు నది లోయం వెంబడి విస్తరించే యత్నం చేసింది. ఈ భూటాన్ భూభాగం గుండా అనేక గ్రామాల మధ్య చైనా రహదారిని నిర్మిచింది. తద్వారా భూటాన్ తన భూభాగాన్ని చైనా అప్పగించవలసి వచ్చిందన్న అక్కసుతో ప్రధాని షెరింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. భూటాన్ భూభాగంలోకి చైనా చొరబడిందని పలు వార్తలు వచ్చినప్పటికి భూటాన్ దాన్ని ఖండిస్తూ ఎలాంటి చొరబాటు జరగలేదని సమర్థించుకుంది. పైగా చైనా దొంగతనంగా ఆక్రమించిన భూభాగాలను భూటాన్ ప్రాంతాలు కాదని భూటాన్ వాదిస్తోందని భారత్ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు డాక్టర్ బ్రహ్మ చెల్లానీ అన్నారు. అంతేగాదు గతేడాది ఇరుపక్షాలు(చైనా, భూటాన్ నిపుణలు) కున్మింగ్లో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు 20 రౌండ్లకు పైగా చర్చలు జరిపింది. సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు భూటాన్ పేర్కొంది. చైనాతో తనకు పెద్దగా సరిహద్దు సమస్యలు లేవని, ఇంకా కొన్ని భూభాగాలను గుర్తించలేకపోయినట్లు చెప్పుకొచ్చింది. పైగా ఒకటో, రెండో సమావేశాల తదనంతరం విభజన రేఖను ఏర్పాటు చేసుకుంటామంటూ.. చైనాను వెనకేసుకు వచ్చే యత్నం చేస్తోంది. (చదవండి: ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..) -
ఆందోళన వద్దు.. చైనా కదలికలపై కన్నేశాం!
న్యూఢిల్లీ: డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలపై ఆందోళన అక్కర్లేదని.. అవసరమైన నిఘా పెంచామని భారత ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిణామాలను ఉపేక్షించబోమని, అలాంటి వాటిని ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని తెలిపింది కేంద్రం. అంతేకాదు.. దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి స్పష్టం చేశారు. డోక్లాం వద్ద భూటాన్ వైపున చైనా ఓ గ్రామాన్ని నిర్మిస్తున్నదని తాజా శాటిలైట్ ఇమేజ్లకు సంబంధించి అడిగిన ప్రశ్నకు బాగ్చి స్పందించారు. ‘పంగ్డా’ గా చైనా వ్యవహరిస్తున్న ఈ గ్రామం కిందటి ఏడాది నుంచి ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అక్కడ ఇళ్ల ముందు కార్ పార్కింగ్కు సంబంధించి శాటిలైట్ ఇమేజ్లు సైతం బయటకు వచ్చాయి. మరోవైపు అక్రమంగా ఎన్నో నిర్మాణాలు చేపడుతోంది డ్రాగన్ కంట్రీ. దీంతో సరిహద్దు భద్రతపై భారత్లో ఆందోళన నెలకొంది. అయితే.. డోక్లాం సమీపంలో చైనా కార్యకలాపాలకు సంబంధించిన వార్తలపై తాను నిర్ధిష్ట వ్యాఖ్యలు చేయబోనని.. దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై ప్రభుత్వం కన్నేసి ఉంచుతుందని, భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని అరిందం బాగ్చి స్పష్టం చేశారు. -
డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్
న్యూఢిల్లీ : తమ భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసిందంటూ వస్తోన్న వార్తల్ని భూటాన్ ఖండించింది. అలాంటిది ఏం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సాప్ నామ్గైల్ ‘మా భూభాగంలో చైనా గ్రామం ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఏం జరగలేదు’ అని స్పష్టం చేశారు. ‘చైనా, భూటాన్ ప్రాదేశిక ప్రాంతంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఓ గ్రామాన్ని ఏర్పాటుచేసింది’ అంటూ చైనాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ షెన్ షివే ట్వీట్ చేశారు. దీనిపై భారత్ భూటాన్ రాయబారి స్పందించారు. ‘నేను ఆ ట్వీట్ని చూశాను. ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ అది. ఇలాంటి ఊహాగానాల గురించి నేను పట్టించుకోను’ అన్నారు. ఇక చైనా తాజాగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్న గ్రామం మూడేళ్ల కిందట భారత్-చైనా సైన్యాలు ఘర్షణ పడిన డోక్లామ్కి సమీపంలోనే ఉండటం గమనార్హం. చైనా మీడియా సీజీటీఎన్ న్యూస్లోని సీనియర్ ప్రొడ్యూసర్గా విధులు నిర్వహిస్తోన్న షెన్ షివే ట్విట్టర్లో ‘ఇప్పుడు కొత్తగా స్థాపించబడిన పాంగ్డా గ్రామంలో శాశ్వత నివాసితులు నివసిస్తున్నారు. ఇది యాడోంగ్ కౌంటీకి దక్షిణాన 35 కిలోమీటర్ల దూరంలో లోయ వెంబడి ఉంది. డోక్లాం ప్రాంతం పరిష్కారం తరువాత ఖచ్చితమైన స్థానాన్ని సూచించింది’ అంటూ దీనికి సంబంధించిన ఫోటోలని ట్వీట్ చేశారు. అయితే, తర్వాత దాన్ని తొలగించారు. షెన్ షివే చేసిన ట్వీట్ను భారత్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు రీట్వీట్ చేశారు. ‘భూటాన్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనడానికి ఇదే సాక్ష్యం’ అని తెలిపారు. ‘భారత్-చైనాల మధ్య కొనసాగిన డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి 9 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందని చైనా జర్నలిస్ట్ షేర్ చేసిన మ్యాప్ను బట్టి అర్ధమవుతుంది’ అన్నారు. అంతేకాదు, భూటాన్ భూభాగంలో రెండు కిలోమీటర్ల చొచ్చుకొచ్చినట్టు తెలియజేస్తుందని పేర్కొన్నారు. (చదవండి: సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ) చైనా ‘ఐదు వేళ్ల’ వ్యూహం సరిహద్దు భూభాగాలపై కన్నేసిన చైనా వాటిని ఆక్రమిచుకోవడానికి ‘ఐదు వేళ్ల’ వ్యూహాన్ని అమలు చేస్తోది. దానిలో భాగంగా టిబెట్ని కుడి చేతి అరచేయిగా భావించగా.. లద్దాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ప్రదేశ్లని ఐదు వేళ్లలాగా భావిస్తోంది. ఇక బీజింగ్ ‘సలామి స్లైసింగ్’ వ్యూహాన్ని తాజాగా నేపాల్లో అమలు చేసి చేసింది. దానిలో భాగాంగా నేపాల్ భూభాగాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించినట్లు సమాచారం. న్యూఢిల్లీ-ఖట్మాండ్ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన సమయంలో డ్రాగన్ ఈ దుశ్చర్యకు పూనుకున్నట్లు తెలిసింది. ఇక ఈ చర్యలని ఉద్దేశిస్తూ ‘మావో కలని నిజం చేయడానికి జిన్పింగ్ కృషి చేస్తున్నాడని’ చైనా మీడియా ప్రశంసిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే భారత్ 17,000 అడుగుల ఎత్తులో లిపులేఖ్ ప్రాంతంలో రహదారి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. దీని వల్ల కైలాస్ మానససరోవర యాత్రికులకు ప్రయాణ సమయం కలిసి వస్తుంది. (చదవండి: తప్పు ఒప్పుకున్న ట్విట్టర్ ) -
సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ
న్యూఢిల్లీ: డోక్లాం పీఠభూమి ప్రాంతంలో అన్ని కాలాలలో రహదారి మార్గం సుగమం చేసుకోవడానికి రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను చైనా వేగవంతం చేసినట్లు ఎన్డీటీవీ సేకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెల్లడయ్యింది. ఈ ప్రాంతంలో 2017లో చైనా భారత్ మధ్య 70 రోజుల పాటు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోని చైనా నిర్మాణ కార్మికులు ఉపరితల సొరంగమార్గాన్ని 500 మీటర్ల వరకు పొడిగించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. శీతాకాలంలో ఈ మార్గం అంతా మంచుతో కప్పబడి ఉంటుందని, దానికోసమే ఏ కాలంలోనైనా ప్రయాణించేలా ఈ రవాణా సౌకర్యాన్ని పెంచుకున్నట్లు స్పష్టమౌతోందని సైనిక నిపుణులు భావిస్తున్నారు. డోక్లాం పీఠభూమి తమ భూభాగంలోనిదేనంటూ చైనా, భూటాన్ ప్రకటించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్, భూటాన్కి మద్దతిస్తోంది. -
డోక్లాం వద్ద చైనా మిస్సైల్ బేస్ల నిర్మాణం!
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ మరోసారి దుందుడుకు వైఖరిని ప్రదర్శించింది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి 5జీ నెట్వర్క్ ఏర్పాటు ప్రయత్నాలతో పాటుగా ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద కొత్తగా నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో దూకుడు చర్యకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలు బయటకు వచ్చాయి. వీటి ద్వారా డోక్లాం, నకు లా, సిక్కిం సెక్టార్ల వద్ద డ్రాగన్ కొత్తగా రెండు ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. డోక్లాం పీఠభూమిలో భారత్- చైనా-భూటాన్ ట్రై జంక్షన్లో ఆర్మీ కార్యకలాపాలకు వీలుగా కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. (చదవండి: చైనాను వణికిస్తోన్న సమాధి ఫోటో..) మూడేళ్ల క్రితం భారత్- చైనాల మధ్య ఘర్షణలకు దారి తీసిన సమస్యాత్మక ప్రాంతాలకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఈ మేరకు ఎయిర్ ఢిపెన్స్ బేస్లను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. డెట్రెస్ఫా పేరిట ఓపెన్ సోర్స్ ఇంటెలిజిన్స్ అనలిస్ట్ ట్విటర్లో షేర్ చేసిన ఫొటోలు, వివరాల ప్రకారం.. లక్ష్యాలను పక్కాగా ఛేదించేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధునాతన క్షిపణులను ప్రయోగించేందుకు వీలుగా ఈ స్థావరాలను అభివృద్ధి చేస్తోంది.(చదవండి: మారని డ్రాగన్ తీరు.. 5జీ నెట్వర్క్, సరికొత్త నిర్మాణాలు!) Investigations with @SimTack of the #Doklam region in the #China, #Bhutan, #India tri junction area present new evidence of PLA air defense infrastructure being constructed roughly 50 Kms from known clash points of the #IndiaChinaStandoff of 2017 & 2020 pic.twitter.com/5JWFZaoXrX — d-atis☠️ (@detresfa_) August 28, 2020 ఇక ఇప్పటికే బలగాల ఉపసంహరణ విషయంలో చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తూర్పు లదాఖ్లోని ఫింగర్ 5,8 ఏరియాల్లో డ్రాగన్ తన బలాన్ని మరింత పెంచుకున్నట్లు సమాచారం. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పడవలు తరలించి, గుడారాలు నిర్మించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో డోక్లాం వద్ద కూడా చైనా కవ్వింపు చర్యలకు దిగడం చూస్తుంటే ఇరు దేశాల వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2017తో డోక్లాం విషయంలో భారత్- చైనాల మధ్య సుమారు 73 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అనేక చర్చల అనంతరం అప్పటి వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. -
చైనా దూకుడు: మళ్లీ అదే టీం రంగంలోకి?!
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన విషయం విదితమే. డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సహా... రక్షణ దళాల మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుల్ని యథాతథంగా కొనసాగించేందుకు అవలంబించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో దౌలత్ బేగ్ ఒల్డీ(డీబీఓ) సెక్టార్ వెంబడి చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసి తీరతామని అధికార వర్గాలు వెల్లడించాయి. (చైనా కవ్వింపు చర్యలపై ఆర్మీ కమాండర్ల భేటీ) ‘‘ఆస్ట్రేలియా నుంచి హాంకాంగ్ దాకా.. హాంకాంగ్ నుంచి తైవాన్, తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రం.. అక్కడి నుంచి అమెరికా దాకా.. ఇలా ప్రపంచవ్యాప్తంగా చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. ఏదేమైనా డర్బుక్-ష్యోక్-డీబీఓ వద్ద చేపట్టిన రోడ్డు నిర్మాణం ఈ ఏడాదికల్లా పూర్తవుతుంది. తద్వారా సరిహద్దుల వద్ద భారత్ మరింత ఎక్కువ బలగాలను మోహరించే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఆ రోడ్డును బ్లాక్ చేస్తే భారత ఆర్మీ సన్సోమా నుంచి ముర్గో- డీబీఓ మీదుగా హిమనీనదాల వెంబడి బయటకు రావాల్సి ఉంటుంది. అయితే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి రహదారి పూర్తి చేయాల్సి ఉంది’’ అని ప్రధాని మోదీతో సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి వెల్లడించారు. (హద్దు మీరుతున్న డ్రాగన్) ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి తలెత్తిన వివాదాన్ని పరస్పర గౌరవమర్యాదలతో కూడిన శాంతియుత చర్చల ద్వారానే వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డోక్లాం వివాద సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించి ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకువచ్చిన తన టీంను ప్రధాని మోదీ మరోసారి రంగంలోకి దించే అంశంపై మంగళవారం నాటి సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, విదేశాంగ మంత్రి జైశంకర్ను తాజా పరిస్థితులపై చైనాతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా డోక్లాం వద్ద ప్రతిష్టంభన తలెత్తిన సమయంలో ఆర్మీ చీఫ్గా ఉన్న బిపిన్ రావత్, విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్ కీలక బాధ్యతల్లో ఉన్న విషయం తెలిసిందే. డ్రాగన్ ఉద్దేశపూర్వకంగానే.. ఇక ప్రపంచమంతా మహమ్మారి కరోనా పుట్టుకకు చైనానే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్న వేళ భారత సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం గమనార్హం. కోవిడ్పై పోరులో భారత్ తలమునకలై ఉండటం, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్- బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతున్న తరుణంలో.. చైనా ఉద్దేశపూర్వంగానే 2017 నాటి డోక్లామ్ తరహా వివాదాన్నితెరమీదకు తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. లదాఖ్ సరిహద్దుల్లో వైమానిక స్థావరం విస్తరించడంతో పాటుగా.. పాంగాంగ్ సరస్సు ప్రాంతానికి 200 కి.మీ. దూరంలో ఎయిర్ బేస్ను నిర్మించేందుకు సన్నద్ధం కావడం చైనా ప్లాన్లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
డొక్లాంలో చైనా.. అడ్డగించని భారత్ : అమెరికా
న్యూఢిల్లీ : డొక్లాం సరిహద్దు ప్రాంతంలో చైనా చాప కింద నీరులా ప్రవేశించిందని, దీన్ని భారత్, భూటాన్లలో ఎవరూ ప్రతిఘటించలేదని అమెరికా పేర్కొంది. గురువారం ఈ మేరకు అమెరికా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో మాట్లాడిన దక్షిణ, మధ్య ఆసియాల ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎలైస్ జీ వెల్స్ భారత్ సరిహద్దులో రోడ్లను నిర్మించడాన్ని చైనా వేగవంతం చేసిందని పేర్కొన్నారు. దాంతో కాంగ్రెస్ సభ్యురాలు వాగ్నర్ మాట్లాడుతూ దక్షిణ చైనా సముద్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే వ్యూహంలో భాగంగానే చైనా ఈ చర్యకు పాల్పడుతుందని అన్నారు. అమెరికా ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతోందని ఆమె వెల్స్ను ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన వెల్స్ అమెరికా ‘దక్షిణ చైనా సముద్రం వ్యూహం’కింద దీన్ని చూస్తోందని చెప్పారు. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాల్లో ఉన్న అపార ఖనిజ సంపద వల్లే చైనా ఇలా చేస్తోందని వ్యాఖ్యానించారు. గతేడాది జరిగిన డొక్లాం వివాదం దాదాపు 73 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్లో చైనా నిర్మాణాలను చేపట్టడంపై మన దేశం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో 73రోజుల పాటు సాగిన ప్రతిష్టంభనలో చైనా వెనకడుగు వేయక తప్పలేదు. తాజాగా చైనా, భారత్ ఆర్మీ క్యాంపులకు 80 మీటర్ల దూరంలోనే నిర్మాణాలు చేపడుతోందని, అయినా భారత్ ఎలాంటి చర్యలకు దిగడం లేని అమెరికా ప్రతినిధి చెప్పడం సంచలనంగా మారింది. 127 ఏళ్ల వివాదం డోక్లామ్తో చైనా–భూటాన్–భారత్ మధ్య ఏర్పడిన ఈ వివాదానికి నూటా పాతికేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1890లో టిబెట్–సిక్కింలకు సంబంధించిన విషయాలపై ఆనాడు భారత్ను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం–క్వింగ్ (చైనా సార్వభౌముల) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఛుంబి లోయ వెంట అంతర్జాతీయ సరిహద్దును నిర్ణయించారు. ఆ తర్వాత కూడా టిబెట్–భూటాన్ మధ్య సరిహద్దు వివాదాస్పదంగానే ఉండేది. దానికి చైనా–భూటాన్–భారత్ కలిసే సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్ (ట్రై జంక్షన్) కేంద్రంగా మారింది. చైనాతో భూటాన్కు ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో ఈ వివాదంలో భారత్ సహకారాన్ని ఆ దేశం కోరుతోంది. భారత్–భూటాన్ మధ్య అనేక ఒప్పందాలున్నాయి. చైనా అధీనంలోని డోక్లామ్ పీఠభూమిలో భారీ సైనిక వాహనాల కోసం రోడ్డు వేసేందుకు చైనా బలగాల సహాయంతో యంత్రాలను తరలించారు. తమ భూభాగంలోకి చొచ్చుకు రావడంపై భూటాన్ ఆర్మీ అభ్యంతరం తెలపడంతో పాటు వారిని వెనక్కు పంపేందుకు భారత్ సైన్యం సాయం కోరింది. -
సరిహద్దుల్లో సైన్యాలకు వ్యూహాత్మక మార్గనిర్దేశాలు
-
మోదీ, జిన్పింగ్ విస్తృత చర్చలు
వుహాన్: ప్రపంచంలోని దాదాపు 40 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు పెద్ద సరిహద్దు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు కీలక ముందడుగు పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య చైనాలోని పర్యాటక కేంద్రం వుహాన్లో శుక్రవారం అనధికార శిఖరాగ్ర భేటీ ప్రారంభమైంది. హృదయపూర్వక సమావేశం (హార్ట్ టు హార్ట్ సమ్మిట్)గా పేర్కొంటున్న ఈ భేటీలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, చైనాల సంప్రదాయ, సాంస్కృతిక స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు. తమ రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రపంచ పురోగతిలో కీలక పాత్ర పోషించే సమర్థత భారత్, చైనాలకుందని స్పష్టం చేశారు. భేటీ అనంతరం తొలి రోజు చర్చలు విస్తృతంగా, ఫలప్రదంగా ముగిశాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రెండో రోజు చర్చలు నేడు ఉదయం ప్రారంభం కానున్నాయి. సరిహద్దు వివాదాలు సహా ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపైనే వీరిరువురు చర్చించారు. ఇరుదేశాల మధ్య ఇలాంటి చర్చలు తరచూ జరుగుతూ ఉండాలని మోదీ అభిలషించారు. 2019లో భారత్లో జరిగే ఈ తరహా చర్చలకు రావాలని జిన్పింగ్ను ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే బలం: భారత్, చైనాలు కలసి పనిచేస్తే తమ దేశాల ప్రజలతోపాటు ప్రపంచానికి మేలు చేసేందుకు గొప్ప అవకాశం లభిస్తుందని మోదీ తెలిపారు. భారత్–చైనాల మధ్య శతాబ్దాల బంధాన్ని మోదీ గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత్, చైనాలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ‘గత 2వేల ఏళ్లలో దాదాపు 1600 ఏళ్ల పాటు భారత్, చైనాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలే దాదాపు 50 శాతం భాగస్వామ్యాన్ని కలిగున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. బీజింగ్కు వెలుపల రెండుసార్లు జిన్పింగ్ స్వాగతం పలికిన తొలి భారత ప్రధానిగా నిలవటం గర్వంగా ఉందని మోదీ తెలిపారు. ఇది భారత ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల కోసం ‘ఉమ్మడి ఆలోచన, సమాచార మార్పిడి, బలమైన బంధం, పరస్పర ఆలోచన విధానం, పరస్పర పరిష్కారం’ అనే ఐదు అంశాలను మోదీ ఈ భేటీలో ప్రతిపాదించారు. సంయుక్త భాగస్వామ్యంతో..: ఇలాంటి చర్చలు భవిష్యత్తులో కూడా జరుగుతాయని ఆశిస్తున్నట్లు జిన్పింగ్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల్లో ఈ భేటీ కొత్త అధ్యాయానికి తెరలేపనుందని ఆయన తెలిపారు. ‘గంగా, యాంగ్జీ నదులు నిరంతరం ప్రవహిస్తున్నట్లే ఇరుదేశాల మధ్య స్నేహం కూడా కొనసాగుతూనే ఉండాలి. భారత్–చైనా సహకారానికి బంగారు భవిష్యత్తు ఉందని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ‘ఐదేళ్లుగా మనం చాలా సాధించాం. సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకున్నాం. ఈ దిశగా సానుకూల ఫలితాలు సాధిస్తున్నాం. మరింత అభివృద్ధి జరిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన భాగస్వామ్య ప్రభావం స్పష్టంగా కనబడుతోంది’ అని జిన్పింగ్ తెలిపారు. ‘మీతో కలిసి పలు అంశాలపై మరింత లోతైన భాగస్వామ్యం ఏర్పడాలని కోరుకుంటున్నాను’ అని ఆయన మోదీతో తెలిపారు. ‘మన దేశాలకు పునరుత్తేజం కల్పించేందుకు అవసరమైన సుస్థిరత కల్పించుకోవటం, అన్ని రంగాల్లో అభివృద్ధి, పరస్పర అభివృద్ధికి సహకారాన్ని బలోపేతం చేసుకోవటం, ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం పనిచేయటంపై భారత్–చైనా దృష్టిపెట్టాలి’ అని చైనా అధ్యక్షుడు పేర్కొన్నారు. అమెరికా సహా పలు దేశాలు రక్షణాత్మక వ్యూహాలు అమలుచేస్తున్న నేపథ్యంలో జిన్పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఘనస్వాగతం పలికిన జిన్పింగ్: శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ వుహాన్ చేరుకున్నారు. మోదీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఘన స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ కార్యక్రమాల అనంతరం అనధికార చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య బంధాన్ని వ్యూహాత్మకంగా, దీర్ఘకాల లాభాలను దృష్టిలో పెట్టుకుని సమీక్ష జరుపుతారని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకున్నారు’ అని ఆయన చెప్పారు. జిన్పింగ్కు అద్భుతమైన కానుక: ఈ చర్చల సందర్భంగా ప్రఖ్యాత చైనా కళాకారుడు జు బీహోంగ్ వేసిన చిత్రాన్ని జిన్పింగ్కు మోదీ కానుకగా ఇచ్చారు. ప్రస్తుత పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీలో 20వ శతాబ్దపు ప్రారంభంలో బీహోంగ్ చిత్రలేఖనం బోధించేవారు. ఆధునిక చైనా చిత్రకళను ఈయన ప్రపంచానికి పరిచయం చేశారు. ‘స్ట్రెంత్’కు మోదీ నిర్వచనం: చైనా పర్యటనలో ప్రధాని మోదీ భారత్, చైనా ప్రజల మధ్య బంధాల బలోపేతాన్ని కాంక్షిస్తూ స్ట్రెంత్ అనే పదానికి కొత్త నిర్వచనాన్నిచ్చారు. స్ట్రెంత్ పదంలోని ఆంగ్ల అక్షరాలకు వరుసగా ఎస్ అంటే ఆధ్యాత్మికత (స్పిరిచువాలిటీ), టీ అంటే సంప్రదాయం, వాణిజ్యం, సాంకేతికత (ట్రెడిషన్, ట్రేడ్, టెక్నాలజీ), ఆర్ అంటే బంధం (రిలేషన్షిప్), ఈ అంటే వినోదం (ఎంటర్టైన్మెంట్ – సినిమాలు, కళలు, నృత్యాలు మొదలైనవి), ఎన్ అంటే పర్యావరణ పరిరక్షణ (నేచర్ కన్జర్వేషన్), జీ అంటే క్రీడలు (గేమ్స్), టీ అంటే పర్యాటకం (టూరిజం), హెచ్ అంటే ఆరోగ్యం (హెల్త్, హీలింగ్) అని పేర్కొన్నారు. అప్పుడు సీఎంగా.. ఇప్పుడు పీఎంగా! గుజరాత్ సీఎంగా స్టడీ టూర్లో భాగంగా ‘త్రీ గార్జెస్ డ్యామ్’ను సందర్శించినట్లు మోదీ తెలిపారు. ‘వేగంగా పూర్తయిన ఈ డ్యామ్ నిర్మాణం, దీని ఎత్తు నన్ను అబ్బురపరిచాయి. ఓ రోజంతా డ్యామ్ దగ్గరే గడిపి దీని విశేషాలు తెలుసుకున్నాం’ అని మోదీ తెలిపారు. యాంగ్జీ నదిపై నిర్మించిన ఆ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు. 2.3 కిలోమీటర్ల పొడవు, 185 మీటర్ల ఎత్తు, 32 హైడ్రో పవర్ టర్బో జనరేటర్లు, ఐదు దశల షిప్ లాక్, షిప్ లిఫ్ట్ వ్యవస్థతో అధునాతన ప్రాజెక్టుగానూ ప్రత్యేకతను చాటుకుంది. డోక్లామ్, సీపీఈసీలను లేవనెత్తండి! న్యూఢిల్లీ/మంగళూరు: చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్తో చర్చల సందర్భంగా డోక్లాం, చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)ల గురించి చర్చించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎలాంటి అజెండా లేకుండానే ఈ సమావేశాలు జరుగుతున్నప్పటికీ భారత్కు నష్టం కలిగించే అంశాలను భేటీలో ప్రస్తావించాలన్నారు. చైనా పర్యటన సందర్భంగా మోదీ కాస్త టెన్షన్గా కనిపించారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి తమ పార్టీ మద్దతుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈస్ట్ లేక్ ఒడ్డున డిన్నర్ చర్చలు చర్చల అనంతరం ఇరువురు నేతలు హుబీ ప్రావిన్షియల్ మ్యూజియంను సందర్శించారు. ఈ మ్యూజియంలో పెద్ద సంఖ్యలో చైనా చారిత్రక, సాంస్కృతిక స్మారకాలున్నాయి. సాయంత్రం ఇరువురు నేతల మధ్య చర్చల్లో ఇరుదేశాల నుంచి ఆరుగురు అధికారుల చొప్పున పాల్గొన్నారు. రాత్రి ఈస్ట్ లేక్ ఒడ్డున ఉన్న అతిథిగృహంలో వీరిద్దరు మాత్రమే భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. దీంతో తొలిరోజు చర్చలు ముగిశాయి. శనివారం ఉదయం పదిగంటలనుంచి (స్థానిక కాలమానం ప్రకారం) మళ్లీ ఇరువురు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. ద్వైపాక్షిక ఒప్పందాలు, సంయుక్త ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా ఒత్తిడిలేని వాతావరణంలో ఈ అనధికార సదస్సు జరగాలని ముందుగానే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ పగ్గాలు చేపట్టాక పలు అంతర్జాతీయ వేదికలపై 12సార్లకు పైగా వీరు కలుసుకున్నారు. అయినప్పటికీ.. ఇద్దరు దేశాధినేతలు మనసువిప్పి మాట్లాడుకోవటం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య ఉన్న పలు సమస్యల పరిష్కారంపై తరచూ సమీక్షలు నిర్వహించాలనే ఆలోచనలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానిగా మోదీకి ఇది నాలుగో చైనా పర్యటన. వుహాన్లోని ఓ ఎగ్జిబిషన్లో వాద్యపరికరాన్ని వాయిస్తున్న మోదీ -
డోక్లాం చైనాదే.. భారత్ తప్పు సరిదిద్దుకో!
బీజింగ్ : డోక్లాం విషయంలో చైనా భారత్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. డోక్లాం ఎప్పటికీ చైనాదేనని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చూస్తే భారత్కు తగిన బుద్ధి చెబుతామని గట్టి హెచ్చరిక జారీ చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియింగ్ సరిహద్దు వ్యవహారాలపై సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘డోక్లాం చైనాదే. అందుకు సంబంధించిన చారిత్రక ఒప్పందాలే ఆధారాలు. గతేడాది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు మా చాకచక్యం కారణంగానే వివాదం సర్దుమణిగింది. గతానుభవాల దృష్ట్యా భారత్ గుణపాఠాలు నేర్చుకుందనే భావిస్తున్నాం. ఇష్టానుసార వ్యాఖ్యలు చేయటం మానుకుని, తప్పులు సరిదిద్దుకుని.. దౌత్య సంబంధాలకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలా కానీ పక్షంలో తీవ్ర పరిస్థితులను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె తెలిపారు. కాగా, తాజాగా సీపీఈసీ సమావేశంలో భారత రాయబారి గౌతమ్ బంబావాలే మాట్లాడుతు.. భారత సరిహద్దులో యథాతథ స్థితి (స్టేటస్ కో)ని చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డోక్లాం తరహా పరిస్థితుల్లో పునరావృతమవుతాయని.. మునుపెన్నడూ చూడని ఘటనలను సైతం ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని డ్రాగన్ కంట్రీకి ఆయన హెచ్చరిక జారీచేశారు. ఈ నేపథ్యంలో చైనా గట్టి బదులు ఇచ్చింది. -
చైనాకు భారత్ వార్నింగ్
డెహ్రాడూన్ : డొక్లాంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికైనా భారత్ సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శత్రువులతో పోరాడటానికి చైనా సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డొక్లాం సమస్యపై నిర్మలా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శనివారం భారత రాయబారి గౌతమ్ బంబావాలే మాట్లాడుతూ.. భారత సరిహద్దులో స్టేటస్ క్యూను చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డొక్లాం లాంటి ఘటన పునరావృతమవుతుందని అన్నారు. మునుపెన్నడూ చూడని ఘటనలను సైతం సరిహద్దులో భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. గత నెలలో రక్షణ శాఖ మంత్రి చైనా డొక్లాంలో హెలికాప్టర్లు, సెంట్రీ పోస్టులు, ట్రెంచెస్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని పార్లమెంట్లో పేర్కొన్నారు. గతేడాది జూన్ 16 నుంచి ఆగష్టు 18ల వరకూ చైనా-భారత్ల మధ్య డొక్లాం సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. -
దాపరికం లేని చర్చలతోనే శాంతి ..
సాక్షి, బీజింగ్ : భారత్, చైనాలు నిర్భయంగా.. ఎలాంటి దాపరికాలు లేకుండా చర్చించడం ద్వారానే రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని చైనాలోని భారత రాయబారి గౌతమ్ బాంబావాలే అన్నారు. డోక్లాంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయన్నారు. చైనాకు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.చైనా గత సంవత్సరం భారత భూభాగమైన డోక్లాంలోకి చొచ్చుకురావడం వల్లే విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. చైనా బీజింగ్ నగరం నుంచి డోక్లాం మీదుగా రోడ్డు మార్గాన్ని నిర్మించాలనుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడి, ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. చైనా తన బలగాలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించడంతో భారత్ కూడా తన బలగాలను సరిహద్దుకు చేర్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇరు దేశాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇది వరకు చాలా చర్చలు జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వలేదని, డోక్లంపై దాపరికం లేని చర్చలు మరిన్ని జరగాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడమే ఇరు దేశాలకు మంచిదన్నారు. -
డోక్లాంలో చైనా నిర్మాణాలు
న్యూఢిల్లీ: డోక్లాం సరిహద్దుల్లో చైనా హెలిప్యాడ్లు, సెంట్రీ పోస్టులను నిర్మించిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. ‘2017లో డోక్లాం సరిహద్దుల్లో ఇరుదేశాలు బలగాలను వెనక్కు తీసుకున్నాయి. అయితే ఇటీవల మళ్లీ భారత్, చైనా దేశాలు మళ్లీ డోక్లాంలోని అదే ప్రాంతంలో తమ బలగాలు (తక్కువ సంఖ్యలో) మోహరించాయి. శీతాకాలంలో ఈ బలగాలను నిర్వహించేందుకు చైనా ఆర్మీ హెలిప్యాడ్లు, సెంట్రీ పోస్టులు, కందకాలు నిర్మించింది’ అని మంత్రి తెలిపారు. ఉపగ్రహ చిత్రాల్లో యుద్ధట్యాంకులు, క్షిపణులను మోహరించటంతోపాటు సరిహద్దుల్లో చైనా ఏడు హెలిప్యాడ్లు నిర్మించినట్లు తెలుస్తోందంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ ఈ సమాధానమిచ్చారు. -
ఖబడ్దార్ చైనా
భారత్–చైనా సరిహద్దు ప్రాంతం ‘డోక్లామ్’ నివురుగప్పిన నిప్పులా ఉంది. కొద్ది నెలలుగా అక్కడ చైనా సైనికుల కదలికలు ఎక్కువయ్యాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించి, గతంలో మాదిరిగా చైనా ఇప్పుడు కూడా స్నేహద్రోహానికి పాల్పడి భారత్పై యుద్ధానికి దిగితే.. గట్టి సమాధానమే ఇచ్చేందుకు భారతీయ సైనికులు కూడా తుపాకులు ఎక్కుపెట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘సర్దార్ జోగీందర్ సింగ్’ అనే పంజాబీ బయోపిక్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దేశంలోని ప్రతి యువకుడూ ‘ఖబడ్దార్ చైనా’ అంటూ, సైనిక దళాల్లో చేరేందుకు స్ఫూర్తినిచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని టీజర్ చూస్తే అర్థమౌతోంది. నెహ్రూ ప్రేమమయుడు. శాంతి ప్రియుడు. శత్రువు ఖడ్గం తీస్తే, ఆ ఖడ్గంతో కరచాలనం కోసం మృదువైన తన చేయిని చాస్తాడు! అయితే ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్లడం లేదు. ‘పరమ వీర చక్ర సుబేదార్ జోగీందర్ సింగ్’ అనే కథలోకి వెళ్తున్నాం. ఇది కేవలం కథ కాదు. నిజ జీవిత కథ. ఏప్రిల్ 6న ‘సుబేదార్ జోగీందర్ సింగ్’ అని సినిమాగా విడుదల కాబోతున్న సాహస గాథ. చైనాను నెహ్రూ గుడ్డిగా నమ్మకపోతే 1962 ఇండో చైనా యుద్ధమే లేదు. ఆ యుద్ధమే లేకపోతే సుబేదార్ జోగీందర్ సింగ్ అనే సినిమానే ఉండబోయేదే కాదు. నిబద్ధతలో గెలుపు మనదే! శత్రువును నమ్మొద్దని ఇండో–చైనా యుద్ధం మనకు నేర్పింది. ‘శత్రువును తరిమికొట్టేందుకు.. సైనికుడా.. నువ్వు నీ చివరి ప్రాణపు చుక్క చిందే వరకు పోరాడుతూనే ఉండు’ అని జోగీందర్ సింగ్ స్ఫూర్తినిచ్చాడు! యుద్ధంలో భారత్ ఓడిపోయింది. నిబద్ధతలో భారత సైన్యానిదే గెలుపని నిరూపించాడు జోగీందర్. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 21 వరకు నెల రోజుల యుద్ధమది. మనవైపు 1383 మంది సైనికులు చనిపోయారు. 3,968 మంది సైనికులు చైనాకు బందీలయ్యారు. బందీ అయ్యాక కూడా తిరగబడి, వీరమరణం పొందిన సైనికుడు సుబేదారు జోగీందర్ సింగ్! గాయాల నుంచి కారుతున్న రక్తపు చుక్కల్ని బౌండరీలపై రెడ్మార్కులుగా పెట్టి, ‘దాటితే చస్తావ్’ అని శత్రు మూకల్ని హడలుకొట్టి, అరుణాచల్ప్రదేశ్ను భరతమాత ఒడి జారనివ్వకుండా ఒడిసిపట్టుకున్నాడు జోగీందర్ సింగ్. అరుణాచల్ప్రదేశ్కు అప్పటికొక పేరు లేదు. ‘నార్త్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ ఏజెన్సీ’ (ఎన్.ఇ.ఎఫ్.ఎ) అది. దాని కోసమే చైనా యుద్ధానికొచ్చింది. యుద్ధంలో గెలిచి కూడా ఎన్.ఇ.ఎఫ్.ఎ.ని పొందలేకపోయింది. ఆ ఘనకీర్తి జోగీందర్దీ, జోగీందర్ నడిపించిన ‘బమ్ లా’ దళానిది. చైనా నుంచి నెహ్రూ ఏం కోరుకున్నాడో అది దక్కనందుకు యుద్ధం వచ్చింది. చైనా ఏం కోరుకుందో అది దక్కకుండా చేసినందుకు జోగీందర్ హీరో అయ్యాడు. చైనా నుంచి నెహ్రూ స్నేహాన్ని కోరుకున్నాడు. చైనా విప్లవ నేత మావో జెడాంగ్ని తన స్నేహితుడు అనుకున్నాడు. ‘‘మనిద్దరం ఇచ్చిపుచ్చుకుంటే మన మధ్య బంధం బలపడుతుంది’’ అన్నాడు నెహ్రూ. ‘‘అలాగైతే అక్సాయ్చిన్ని, అరుణాచల్నీ ఇవ్వు’’ అన్నాడు జెడాంగ్. ‘‘భౌగోళికంగా కాదు, బాంధవ్యాలతో పెనవేసుకుందాం’’ అన్నాడు నెహ్రూ. జెడాంగ్ మౌనంగా ఉండిపోయాడు. భారత్ సరిహద్దుల్లోకి గుట్టు చప్పుడు కాకుండా చైనా చొరబడింది. నెహ్రూకి యుద్ధం చెయ్యక తప్పలేదు. సరిగ్గా ఇక్కడి నుంచే ‘సుబేదార్ జోగీందర్ సింగ్’ సినిమా మొదలౌతుంది. 1962 సెప్టెంబర్ 9. డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మీనన్ నుంచి వేళకాని వేళలో నెహ్రూకి కాల్! ‘‘వేరే దారి లేదు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. చైనా దళాలు ‘తలా రిడ్జ్’లో సౌత్కి వచ్చేశాయి’’ అంటున్నాడు మీనన్. స్నేహాన్ని నమ్మినంత కాలం నమ్మాం. ఇప్పుడు సైన్యాన్ని నమ్ముకోవలసిన కాలం వచ్చేసిందని నెహ్రూకి అర్థమైంది. నెహ్రూ అప్పుడు లండన్లో ఉన్నాడు. కామన్వెల్త్ ప్రైమ్ మినిస్టర్స్ మీట్లో. సరిగ్గా అర నిమిషం తర్వాత నెహ్రూ నుంచి మీనన్కి ‘డన్’ అని సంకేతం. వెంటనే మన సెవన్త్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్.. చైనా సేనలు బలంగా నిలుచుని ఉన్న ‘నమ్కా ఛు’ వైపు కదిలింది. ‘సిక్కు రెజిమెంట్’ ఆ బ్రిగేడ్లోనే ఉంది. జోగీందర్ సింగ్ ఆ రెజిమెంట్లోనే ఉన్నాడు. సుబేదార్ అతడు. దళపతి. ‘నమ్కా ఛు’ని చేరుకునే దారిలో ‘బమ్ లా’ పోస్టు దగ్గర మూడు వైపుల్నుంచీ కదిలి వచ్చిన చైనా సేనల్ని సిక్కు రెజిమెంట్ అడ్డుకుంది. వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్లు తక్కువగా ఉన్నారు. ఎక్కువ తక్కువల్ని చూసుకోలేదు సుబేదార్ జోగీందర్ సింగ్. తన సేనల్లో స్ఫూర్తిని నింపి అన్ని వైపులకు కదిలించాడు. కానీ శత్రువుల బలగం ఎక్కువగా ఉంది. నిమిష నిమిషానికీ మన బ్రిగేడ్ బలం సన్నగిల్లుతోంది. సిక్కు రెజిమెంట్లో ఉన్నదే 20 మంది సైనికులు. వారిలోనూ పది మంది నేలకు ఒరిగారు. మిగిలింది జోగీందర్, మరో తొమ్మిది మంది! వారి దగ్గర కూడా బాయ్నెట్లే మిగిలాయి. వాటితోనే పోరాడుతున్నారు. జోగీందర్ ఒంటినిండా బలమైన గాయాలు. చివరికి ఆ గాయాలు అతడిని చైనా సైనికులకు బందీని చేశాయి! బందీగానే మరణించాడు జోగీందర్ . తండ్రి మరణ వార్త వినగానే జోగీందర్ సింగ్ పెద్ద కూతురు కుప్పకూలిపోయి అక్కడే మరణించారు. చైనా అతడి చితాభస్మాన్ని సైనిక మర్యాదలతో ఇండియాలోని బెటాలియన్కి పంపించింది. భారత ప్రభుత్వం ఆయనకు పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. వందల మంది శత్రుదేశ సైనికులతో పోరాడిన ఇరవైమంది సైనికుల వీరోచిత పోరాటానికి దృశ్యరూపం .. ‘సుబేదార్ జోగీందర్ సింగ్’. సింగ్గా గిప్పీ గ్రేవాల్ నటిస్తున్నారు. టీజర్ చివర్లో.. ‘ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఇండియా’ అంటాడు గ్రేవాల్. అలా అంటున్నప్పుడు అతడిని చూస్తే.. జోగీందర్ సింగ్ ఆత్మ అతడిలో ప్రవేశించిందా అనిపిస్తుంది. పంజాబీలనే కాదు, మిగతా రాష్ట్రాల యువకులనీ సైన్యంలోకి పట్టి తీసుకుపోయేంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది సుబేదార్ జోగీందర్ సింగ్ లైఫ్ హిస్టరీ. అదిప్పుడు తగిన సమయంలో తెరకెక్కబోతోంది. సుబేదార్ జోగీందర్ సింగ్ పరమవీరచ్ర - 1921–1962 జననం : పంజాబ్ -
‘డోక్లాం’పై భారత్ మాట్లాడొద్దు
బీజింగ్: వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో నిర్మిస్తున్న మౌలిక వసతులను చైనా సమర్థించుకుంది. అవి చట్టబద్ధమేనని, తమ సైన్యం, అక్కడ నివసిస్తున్న ప్రజల సౌకర్యార్థమే వాటిని చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్ వ్యాఖ్యలు చేయకూడదని కోరింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ బీజింగ్లో మీడియాతో మాట్లాడుతూ డోక్లాంలోని తమ మిలటరీ కాంప్లెక్స్కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు మీడియాలో వచ్చిన సంగతి తన దృష్టికి వచ్చినట్లు అంగీకరించారు. తమ సైనికులు, డోక్లాంలో నివసిస్తున్న ప్రజల కోసమే చైనా అక్కడ మౌలిక వసతుల కల్పనను చేపడుతోందని అన్నారు. సరిహద్దుల్లో గస్తీ చేయడానికి, సైనికులు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికే రోడ్డు నిర్మాణం వంటి మౌలిక వసతులను నిర్మించామని తెలిపారు. చైనా సొంత భూభాగంపైనే తన సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుంటోందని అన్నారు. ప్రతిష్టంభనతో సంబంధాలకు పరీక్ష ‘డోక్లాంలో మేము చేపడుతున్న నిర్మాణాలు సక్రమం, సమర్థనీయమే. భారత్ తన భూభాగంలో చేపడుతున్న నిర్మాణాలపై చైనా వ్యాఖ్యానించదు. అలాగే మా ప్రాంతంలోని నిర్మాణాలపై భారత్ స్పందించకూడదు. చికెన్ నెక్ కారిడార్లో చైనా రోడ్డు నిర్మాణ పనులను భారత్ అడ్డుకోవడం వల్ల ఇరు దేశాల సంబంధాలకు పెద్ద పరీక్ష ఎదురైంది’ అని కాంగ్ పేర్కొన్నారు. మరోవైపు, డోక్లాంలో పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని, చైనా చేపడుతున్న నిర్మాణాలపై వెలువడిన కథనాలు అవాస్తవమని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. డోక్లాంలో యథాతథ స్థితిలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. -
భారత్ ఎంతో ముఖ్యమైన దేశం
బీజింగ్ : భారత్తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నట్లు చైనా మరోసారి స్పష్టం చేసింది. అసియాలోనే బలమైన దేశాలుగా భారత్-చైనాలు కలిసే ముందుకు సాగాలని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి అభిలషించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఏర్పడే చిన్నచిన్న సమస్యలను పక్కనపెట్టి ముందుకు సాగాలని ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య అత్యంత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన డోక్లాం వివాదాన్నికూడా నిగ్రహంతో, దౌత్యపరంగానే చైనా పరిష్కరించుకుందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య శాంతికి చైనా కృషి చేస్తుందన్నారు. డోక్లాం సరిహద్దులోకి భారత దళాలు అక్రమంగా ప్రవేశించినా.. చైనా ఉద్రిక్తతలు పెంచకుండా.. దౌత్యపరంగానే సమస్యను పరిష్కరించిందని చెప్పారు. భారత్-చైనా దేశాలు భవిష్యత్లో ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉందని.. ఆయన చెప్పారు. గత అనుభవాల వల్ల ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అనుమానాలు, సందేహాలు చాలానే ఉన్నాయని.. అయితే వాటిని నిరంతర చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని వాంగ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. చైనా, రష్యా, భారత్ దేశాల చర్చల్లో భాగంగా వాంగ్ యి పాల్గొననున్నారు. డోక్లాం వివాదం తరువాత చైనా అత్యున్నత మంత్రి ఒకరు భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. -
డోక్లాం వద్ద మళ్లీ కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం వద్ద మళ్లీ చైనా బలగాలు భారీగా మోహరించాయి. సుమారు 1600 నుంచి 1800 మందితో కూడిన చైనీయ సైన్యం అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసింది. గడ్డ కట్టే చలిలో రెండు హెలిప్యాడ్లు, గుడిసెలు, స్టోర్లు ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇక డొక్లాం దక్షిణ ప్రాంతమైన ఝంపేరి రిడ్జ్ దగ్గర చైనా ఆర్మీ మోహరించిందని భారత సైన్యం కూడా ధృవీకరించింది. ఈ విషయంపై చైనా తన వాదనను వినిపించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా సైన్యం) ప్రతీ ఏటా వేసవి, శీతాకాలాల్లో ఇక్కడ క్యాంపులు నిర్వహించటం సహజం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత క్యాంపును ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. కానీ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న భారత సైన్యం మాత్రం అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించింది. కాగా, సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రై జంక్షన్ అయిన డోక్లాం వద్ద 73 రోజులపాటు భారత్-చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారీ ఆయుధాల తరలింపు.. ఎదురుపడినప్పుడల్లా, కవ్వింపు చర్యలకు పాల్పడిన చైనా, భారత్ సైనికుల దృశ్యాలు అప్పట్లో కంగారు పుట్టించాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
భారత్కు చైనా మీడియా దురుసు హెచ్చరిక!
చైనీస్ భూభాగంలోకి ప్రవేశించిన భారత్ డ్రోన్ను కూల్చివేశామని ఆ దేశం వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్ను తీవ్రంగా హెచ్చరిస్తూ చైనా ప్రభుత్వ మీడియా కథనాలు ప్రచురించింది. ఇరుదేశాల నడుమ సైనిక ప్రతిష్టంభన తలెత్తిన డోక్లాం కొండప్రాంతం సమీపంలోనే భారత్ డ్రోన్ చైనా భూభాగంలోకి ప్రవేశించి కూలిపోయిందని చైనా జాతీయవాద టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. డ్రోన్తో చైనాలోకి అక్రమంగా చొరబడినందుకు భారత్ క్షమాపణ చెప్పాలంటూ ఆ పత్రిక ఓ సంపాదకీయాన్ని రాసుకొచ్చింది. ఇలా చొరబడినందుకు డ్రోన్ను కోల్పోవడమే కాదు.. అంతకంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరించింది. 'సైనిక ప్రతిష్టంభన తలెత్తిన ప్రాంతంలో.. ఈ సైనిక ప్రతిష్టంభన ముగిసి ఎంతోకాలం కాకముందే తాజా చొరబాటు చోటుచేసుకుంది. ఉద్రిక్తతలు ఉన్న సమయంలో సున్నితమైన ప్రాంతంలో ఎదుటిపక్షాలు రెచ్చగొట్టే చర్యలుగా భావించే వాటిని ఇరువర్గాలు నివారించాల్సి ఉంటుంది. కానీ భారత్ అందుకు విరుద్ధంగా దురుసుగా ప్రవర్తించింది' అని గ్లోబల్ టైమ్స్ రాసుకొచ్చింది. -
శీతాకాలంలోనూ డోక్లాంలో చైనా సైన్యం?
బీజింగ్: శీతాకాలంలో డోక్లాం వద్ద కాస్త ఎక్కువ సంఖ్యలోనే బలగాలను మోహరిస్తామని చైనా ఆర్మీ సంకేతాలిచ్చింది. ఆ ప్రాంతం చైనాదేనని మరోసారి పేర్కొంది. సరిహద్దుల్లో చైనా రోడ్డు నిర్మాణాన్ని ఆపేయడంతో రెండున్నర నెలల వివాదానికి ముగింపు పలుకుతూ భారత్ గత ఆగస్టు 28న ఈ సమస్యను పరిష్కరించుకోవడం తెలిసిందే. సాధారణంగా డోక్లాం వద్ద చలికాలంలో వాతావరణం మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో భారత్, చైనాలు డోక్లాం ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించేవి. -
మరిన్ని డోక్లామ్లకు సిద్ధమవ్వాల్సిందే
జమ్మూ: భారత్–చైనా సరిహద్దులో భవిష్యత్లో డోక్లామ్ లాంటి ఉద్రిక్తతలు తలెత్తితే ఎదుర్కొనడానికి సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. పర్వత ప్రాంతాల్లో శత్రువుల్ని నిలువరించేందుకు, ఎదురుదాడి చేసేందుకు మోహరించే ‘17 కోర్’ను ప్రబల నిరోధక శక్తిగా మార్చే ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు. శనివారం నాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా 47వ ఆర్మర్డ్ రెజిమెంట్కు ‘ప్రెసిడెంట్ స్టాండర్డ్’ విశిష్ట గౌరవాన్ని అందజేశారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు రావత్ సమాధానాలిచ్చారు. 17 కోర్ను చైనాను దృష్టిలో ఉంచుకునే ఏర్పాటు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘అలా అని ఎందుకు అనుకోవాలి? శత్రువుల చొరబాటును అడ్డుకోవడానికి, దేశ రక్షణకు ప్రమాదకరంగా మారే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నాం’ అని జవాబిచ్చారు. 2014 జనవరిలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ(రక్షణ) ‘17 కోర్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 90,274 సైనికులతో 2021 నాటికి ఈ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. కాగా, కశ్మీర్లోని యువతలో తీవ్రవాద భావజాలం పెంపొందడానికి సామాజిక మాధ్యమాలే కారణమని రావత్ అన్నారు. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియంత్రణా రేఖ(ఎల్వోసీ) వెంట పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పటికీ ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు. -
హైస్పీడ్ రైలుకు ‘డోక్లామ్’ సెగ
న్యూఢిల్లీ: డోక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చేపట్టిన మౌలిక ప్రాజెక్టులను చైనా నిర్లక్ష్యం చేస్తోందా? అంటే భారత రైల్వే వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి. దాదాపు 492 కి.మీ పొడవున్న చెన్నై–బెంగళూరు–మైసూరు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తిచేసి ఏడాది అయినప్పటికీ.. చైనా రైల్వే పనుల్లో ఎలాంటి పురోగతి చూపలేదని అధికారులు తెలిపారు. ఇందుకు భారత్–చైనాల మధ్య డోక్లామ్లో తలెత్తిన ఉద్రిక్తతే కారణమై ఉండొచ్చని రైల్వే శాఖ మొబిలిటి డైరెక్టరేట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘చైనా రైల్వే ఎరియువన్ ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్(సీఆర్ఈఈసీ) 2016 నవంబర్లో నివేదిక సమర్పించిన అనంతరం రైల్వే బోర్డు అధికారులతో నేరుగా సమావేశం అవుతామని విజ్ఞప్తి చేసింది. ఆ తరువాత వారివైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయమై సీఆర్ఈఈసీ స్పందన కోసం గత 6 నెలలుగా ఈ–మెయిల్స్ పంపిస్తూనే ఉన్నాం. చివరికి ఇక్కడి చైనా ఎంబసీ ద్వారా కూడా ప్రయత్నించాం. కానీ వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదు’ అని ఓ రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. కేవలం హైస్పీడ్ కారిడార్ మాత్రమే కాకుండా పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి చైనా రైల్వే ఆసక్తి చూపినప్పటికీ..డోక్లామ్ ఘటనతో వాటన్నింటిపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న 80 కి.మీ/గంట నుంచి 160 కి.మీ/గంటకు పెంచేందుకు వీలుగా చెన్నై–బెంగళూరు–మైసూరు వంటి 9 హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. -
డొక్లామ్లో మళ్లీ రోడ్డేస్తున్న చైనా..!
న్యూఢిల్లీ : డొక్లామ్లో పీఠభూమి వివాదానికి మళ్లీ తెర లేచాలా ఉంది. చికెన్ నెక్ ప్రాంతంలో రోడ్డు వేసే ప్రక్రియను నిలిపేసి, సైన్యాన్ని వెనక్కు పిలిచిన చైనా.. గత వివాదాస్పద ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో మళ్లీ రోడ్డు వేయడం ప్రారంభించింది. దాదాపు 500 మంది చైనా జవాన్లు రోడ్డు నిర్మిస్తున్న కార్మికులకు రక్షణగా ఉంటున్నట్లు తెలిసింది. చైనా రోడ్డు నిర్మిస్తున్న ఈ ప్రాంతం నుంచి యాటుంగ్ పట్టణానికి కేవలం 20 కిలోమీటర్లే. ప్రస్తుతం చైనా రోడ్డు నిర్మిస్తున్న ప్రాంతం అతి శీతలంగా ఉంటుంది. చలికాలంలో మంచు దుప్పటిని పరుచుకుంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయి. దీంతో జవాన్లు, కూలీలు యాటుంగ్లో బస చేస్తూ రోడ్డు నిర్మాణ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు భారతీయ ఆర్మీ అధికారి తెలిపారు. పట్టణం చేరువలో ఉండటంతో అవసరమైతే మరింత మంది సైనికులను మొహరించే వెసులుబాటు చైనాకు ఉందని ఆయన చెప్పారు. -
ఇండో-చైనా సరిహద్దులో రాజ్నాథ్ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రహోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వారంలో ఉత్తరాఖండ్లోని ఇండో-చైనా సరిహద్దులో పర్యటిస్తారని ఆర్మీ అధికార వర్గాలు ఆదివారం ప్రకటించాయి. ఈ మధ్యకాలంలో చైనా బలాగాలు సరిహద్దును అతిక్రమించి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన నేపథ్యంలో రాజ్నాథ్ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. భారతీయ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. చైనా బలగాలు వెనక్కు మళ్లిన సంగతి తెలిసిందే. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ పర్యటనలో ఇండో టిబెటన్ సరిహద్దు బలగాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. డోక్లామ్ వివాదం ముగిసిన తరువాత కేంద్ర అత్యున్నత మంత్రి ఈ ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. భూమి 12,500 అడుగుల ఎత్తులో ఉన్న రిమ్కిమ్, 10,500 అడుగుల ఎత్తులో ఉన్న మనా, 10,200 అడుగుల ఎత్తులో ఉన్న ఆర్మీ పోస్టులను రాజ్నాథ్ ఈ నెల 28న సందర్శిస్తారని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. జూలై 25న చైనా బలగాలు ఉత్తరాఖండ్లోని ఛమోలి జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన బార్హోతిలోకి 800 అడుగుల మేర చొచ్చుకుని వచ్చి.. కొన్ని గంటలు ఉండి.. తిరిగి వెనక్కు వెళ్లాయి. ఈ పర్యటనలోనే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ముస్సోరిలోని లాల్బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అఫ్ అడ్మినిస్ట్రేషన్లోని శిక్షణ కొందుతున్న యువ ఐఏఎస్, ఐపీఎస్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే చైనా సరిహద్దులో నిర్మిస్తున్న రహదారి పనులను రాజ్నాథ్ పర్యవేక్షిస్తారు. -
చైనా దొంగబుద్ధి
సరిహద్దు ప్రాంతాల్లో రహదారుల విస్తరణ భారత్ను ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు సాక్షి : భారత్ - చైనా సరిహద్దులో డోక్లాం తరహాలో మరిన్నిప్రాంతాల్లో చైనా రహదారలు వేసేందుకు ప్రణాళికలు రచిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ వ్యూహకర్తలు. భారత్తో సరిహద్దు ఉన్న టిబెట్, జిన్జియాంగ్ ప్రాంతాల్లో మరిన్ని చోట్ల కొత్తగా రహదారులు వేసేందుకు చైనా సిద్ధమవుతోందని తెలుస్తోంది. సరిహద్దుల్లో అదికూడా మా భూభాగంలో రహదారులు నిర్మించుకోవడం మా హక్కు.. దానిని కాదనే అధికారం ఎవరికీ లేదు.. అని చైనా రాజకీయ వ్యూహకర్త విక్టర్ గో ప్రకటించారు. ఆయన ఒక చైనా పత్రికతో మాట్లాడుతూ మా భూభాగంలో.. మేం రహదారులు నిర్మించుకుంటే భారత్కు ఎందుకు భయపడుతోందని అని ప్రశ్నించారు. మేం డోక్లాం సహా.. సరిహద్దు ప్రాంతాల్లో హైవేల నిర్మాణం చేస్తామని ప్రకటించారు. చైనా చేపడుతున్న రహదారులు, భవనాల నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహాన్నిప్రకటించారు. ప్రస్తుతం బిక్స్ సదస్సు జరుగుతున్న దృష్ట్యా.. వివాదాల ప్రస్తావన లేకుండా చూసుకోవాలన్నది చైనా వ్యూహం. అందువల్లే 73 రోజుల డోక్లాం వివాదానికి బీజింగ్ ముగింపు పలికిందని విశ్లేషకుల మాట. అయితే బ్రిక్స్ సదస్సు అనంతరం సరిహద్దు ప్రాంత్లాల్లో రహదారుల నిర్మాణ క్రమాన్ని వేగంగా ముందుకు తీసుకువెళుతుందని చైనా మేధావులు చెబుతున్నారు. -
‘డోక్లామ్’ సుఖాంతం
దాదాపు 75 రోజుల తర్వాత భారత్–చైనాల మధ్య భారత్–భూటాన్–చైనా సరిహద్దుల కూడలిలో తలెత్తిన వివాదం సద్దుమణిగింది. అయితే ఇదంత సజావుగా ఏమీ పూర్తి కాలేదు. ఇరు దేశాల మధ్య దౌత్య స్థాయిలో సాగిన సంభాషణల పర్యవసానంగా రెండు పక్షాలూ దళాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం జరిగిందని మన విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. అందుకు సంబంధించిన పని ప్రారంభమై కొనసాగుతున్నదని చెప్పింది. కానీ చైనా విదేశాంగ శాఖ మాత్రం భారత దళాలు తిరిగి తమ సరిహద్దులకు మళ్లాయని, చైనా దళాలు వివాదాస్పద ప్రాంతంలో కొనసాగుతాయని ప్రకటించి గందరగోళంలో పడేసింది. ఇరుగుపొరుగు దేశాల మధ్య వివాదాలు తలెత్తడం, అవి కొనసాగుతున్న సమయంలో మాటల తీవ్రత పెరగడం సహజమే. అవి సద్దుమణిగే క్రమంలో సైతం ఆ తీవ్రత ఎంతో కొంత కొనసాగుతుంది. ముఖ్యంగా వీరావేశంతో మాట్లాడినవారు వెనక్కి తగ్గే క్రమం కొంత భిన్నంగా ఉంటుంది. డోక్లామ్ వివాదం మొదలైన దగ్గరనుంచీ మన దేశం సంయమనంతోనే మాట్లాడింది. సమస్యపై సైన్యం స్థాయిలోనూ, దౌత్య స్థాయిలోనూ చర్చలు కొనసాగుతాయని, త్వరలోనే వివాదం సమసిపోతుందని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల జూలైలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రెండు దేశాలూ తమ తమ సైన్యాలను వెనక్కి పిలిపించుకుని, అటుమీదట చర్చలు ప్రారంభించాలని ప్రతిపాదించారు. కానీ ఈ ప్రకటనలన్నిటికీ చైనా వైపునుంచి దూకుడే జవాబైంది. 1962నాటి అనుభవాలు మర్చిపోవద్దని హెచ్చరించడంతో మొదలుపెట్టి రెండు దేశాల సైనిక వ్యయం, జీడీపీ, రక్షణ సామర్ధ్యం వగైరాల మధ్య పోలిక తెచ్చి మీరు అన్నివిధాలా తీసికట్టని చెప్పడం వరకూ అందులో ఎన్నో ఉన్నాయి. ఎలాంటి చర్చలు జరగాలన్నా ముందు భారత్ బేషరతుగా అక్కడినుంచి వెనక్కి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. దళాల ఉపసంహరణ విషయంలో అంగీకారానికొచ్చాక కూడా ఈ ధోరణి పోలేదు. అందుకే ఉపసంహరించుకున్నది భారత్ మాత్రమే తప్ప తాము కాదంటోంది. దీన్నుంచి గుణపాఠం తీసుకోవాలని హితవు చెబుతోంది. సరిహద్దుల్లో యథాతథంగా తమ దళాల గస్తీ కొనసాగుతుందని చెప్పింది. చైనా దళాలు సరిహద్దుల్లో గస్తీ కాస్తే భారత్కు అభ్యంతర ఉండాల్సిన పనిలేదు. ఆ సరిహద్దును వదిలి 2012 సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించి డోక్లామ్ పీఠభూమి వరకూ రహదారిని పొడిగించడానికి చైనా ప్రయత్నించడమే వివాదానికి కారణం. చైనా రోడ్డు పనుల్ని నిలిపేసిందని, అక్కడి సామగ్రిని, దళాలను తరలించిందని ఇప్పటికే వెల్లడైంది. ఇతరత్రా మాటలన్నీ భారత్ కంటే చైనా జనాన్నుద్దేశించి చేసినవే. తీవ్ర పదజాలంతో ప్రకటనలు చేశాక ఇవన్నీ తప్పనిసరి. త్వరలో చైనా రాజధాని బీజింగ్లో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడానికి ఈ దళాల ఉపసంహరణ నిర్ణయం ఎంతో దోహదపడింది. ఆ సదస్సుకు మోదీ వెళ్లకపోతే చైనాపై బ్రిక్స్లోని ఇతర సభ్య దేశాల్లో సందేహాలు తలెత్తుతాయి. బ్రిక్స్లో చైనా తర్వాత భారత్ ఆర్థిక వ్యవస్థే పటిష్టంగా ఉంది. ఈ రెండు దేశాలూ సరిహద్దు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటేనే బ్రిక్స్ వంటి సంస్థలు సమర్ధవంతంగా పనిచేయగలవని ఆమధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చైనా తన దూకుడు ధోరణిని తగ్గించుకున్నదని కొందరు చెబుతున్నారు. అయితే తాజా పరిణామాలకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను ప్రక్షాళన చేయాలని గత కొంతకాలంగా చైనా అనుకుంటోంది. ముఖ్యంగా ఉన్నతస్థాయి సైనికాధికార వ్యవస్థను చక్కదిద్దాలని, దళాల సామర్ధ్యాన్ని పెంచేలా పునశ్చరణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని భావిస్తోంది. ముఖ్యంగా వైమానిక, నావికాదళాల సామర్ధ్యం మరింత మెరుగుపరచాలని చైనా నాయకత్వం అనుకుంటోంది. మరోపక్క అక్టోబర్లో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ కాంగ్రెస్ జరగాల్సి ఉంది. భారత్తో యుద్ధం వచ్చి ఆ సమయానికి తేలకపోతే రాజకీయంగా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు అది ఇబ్బందికరం. మరోపక్క పొరుగునున్న ఉత్తర కొరియాకు అమెరికాతో తలెత్తిన వివాదం ఒక కొలిక్కి రాలేదు. అంచనాలకు దొరక్కుండా క్షిపణి పరీక్ష ద్వారానో, అణు పరీక్ష ద్వారానో అమెరికాను కవ్విస్తున్న కిమ్ వల్ల ఆ ప్రాంతంలో ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇలాంటి తరుణంలో భారత్తో ఘర్షణకు దిగి శక్తియుక్తులన్నీ దానిపైనే కేంద్రీకరించడం వల్ల సమస్య అవుతుందని చైనాకు అనుమానాలున్నాయి. వచ్చేది శీతాకాలం కావడంతో డోక్లామ్ పీఠభూమి ప్రాంతం చైనా దళాల కదలికకు అనువుగా ఉండదు. భారత దళాలకు అది అలవాటైన ప్రాంతం. యుద్ధం దేనికీ పరిష్కారం కాదు. అది ప్రారంభించడం తేలిక. గౌరవప్రదంగా దాన్నుంచి బయటకు రావడం అంత సులభం కాదు. ప్రత్యర్థి పక్షంపై మొదట వేసుకున్న అంచనాలు తలకిందులవుతున్నాయని తెలిసినప్పుడు మరింత దూకుడుగా ముందుకెళ్లాలి తప్ప వెనక్కిరావడం కుదరదు. ఉన్నకొద్దీ ఇది తీవ్రమవుతున్నదనుకుంటే ఎవరో ఒకరి మధ్యవర్తిత్వం కోసం అర్రులు చాచటం తప్ప గత్యంతరం ఉండదు. అందుకు భిన్నంగా వివాదం తలెత్తిన పక్షంతో చర్చించడం ప్రారంభిస్తే తన వైఖరిలోని సహేతుకతను చెప్పవచ్చు. ఒప్పించే ప్రయత్నాలు చేయొచ్చు. పరస్పర అవగాహన సాధ్యమవుతుంది. ప్రపంచ దేశాల్లో పరిణతితో వ్యవహరించిన ఖ్యాతి దక్కుతుంది. సంక్షోభం తలెత్తినప్పుడు సంయమనం పాటించడం, ఓపికతో వేచి ఉండటం అవసరం. అది అర్ధం చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటికీ అతీతంగా ఆచితూచి వ్యవహరించినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇదే స్ఫూర్తితో చైనాతో ఉన్న ఇతర వివాదాల విషయంలోనూ పరిష్కారాన్ని సాధిస్తుందని ఆశిద్దాం. -
మరోసారి వక్రబుద్ధి చాటుకున్న చైనా
-
డోక్లాం ప్రతిష్టంభన: బుద్ధి చాటుకున్న డ్రాగన్!
భారత్ బలగాలు మాత్రమే వైదొలిగాయి మేం యథాతథంగా గస్తీ నిర్వహిస్తున్నాం: చైనా సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా, భూటాన్ దేశాల మధ్య ఉన్న ట్రై జంక్షన్ 'డోక్లాం'లో సైన్యాన్ని వెనక్కు రప్పించేందుకు భారత్, చైనాలు ఒప్పుకున్నాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించిన కాసేపటికే చైనా భిన్నంగా స్పందించింది.. వివాదాస్పద డోక్లాం కొండప్రాంతం నుంచి భారత్ మాత్రమే తన సైన్యాలను ఉపసంహరించుకుందని, చైనా సైన్యం ఇంకా అక్కడ గస్తీ కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో తన సార్వభౌమాధికారాన్ని కొనసాగిస్తామని మరోసారి పేర్కొంది. డోక్లాంలో రెండు నెలలుగా భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టంభనకు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకున్నట్లు భారత్ తెలిపింది. సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాలూ తమ సైన్యాన్ని డోక్లాం సరిహద్దు నుంచి ఉప సంహరించే ప్రక్రియను ముగిస్తాయని కూడా భారత్ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన నేపథ్యంలో డోక్లాం వివాదానికి ఈ మేరకు తెరదించినట్టు భారత్ విదేశాంగ శాఖ ప్రకటించగానే.. చైనా అందుకు భిన్నంగా స్పందించడం గమనార్హం. 'చారిత్రక ఒప్పందాల ప్రకారం చైనా తన సార్వభౌమాధికారాన్ని యథాతథంగా కొనసాగిస్తూ.. ప్రాంతీయ సమగ్రతను కాపాడుకుంటుంది' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ తెలిపారు. ఈ నెల 28న (సోమవారం) భారత్ తన చొరబాటు చేసిన బలగాలను, సైనిక సంపత్తిని ఉపసంహరించుకుందని, చైనీస్ బలగాలు మాత్రం దేశ సార్వభౌమాధికార, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించి చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రాంతంలో మరింత సమర్థమైన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. 'భారత్తో స్నేహపూర్వక సంబంధాలకు చైనా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. భారత్ కూడా చారిత్రక సంబంధాల కట్టుబడి.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పరస్పర సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తుందని, సరిహద్దుల్లో శాంతి, భద్రతలకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం' అని హు చున్యింగ్ తెలిపారు. చదవండి: సమసిన డోక్లాం వివాదం -
సమసిన డోక్లాం వివాదం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా, భూటాన్ దేశాల మధ్య ఉన్న ట్రై జంక్షన్ 'డోక్లాం'లో సైన్యాన్ని వెనక్కు రప్పించేందుకు భారత్, చైనాలు ఒప్పుకున్నాయని భారతీయ విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో నెలలుగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తెర పడినట్లు అయింది. ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాలు సైన్యాన్ని డోక్లాం సరిహద్దు నుంచి ఉప సంహరించే ప్రక్రియను ముగిస్తాయని వెల్లడించింది. కాగా, భారత్-చైనాల మధ్య ఈ ఏడాది జూన్ నుంచి డోక్లాంలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనకు ముందు డోక్లాం వివాదం సమసిపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్రిక్స్ గ్రూప్ సమావేశానికి త్వరలో మోదీ చైనా పర్యటనకు వెళ్తారు. రహస్య సమాచారం ప్రకారం.. భారత్-చైనా బలగాలు ఇప్పటికే డోక్లాం నుంచి వెనక్కురావడం ప్రారంభమైందని తెలిసింది. కానీ సోమవారమే సైన్యం మొత్తం వెనక్కు వస్తుందా? లేదా అన్న విషయంపై క్లారిటీ రాలేదు. డోక్లాంలో సైన్యం ఉపసంహరణతో భారత్ తన మాట నెగ్గించుకున్నట్లయింది. ఇరు దేశాలు ఒకేసారి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్ చైనాకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, మాటలతో భారత్ను లొంగదీయాలని చూసిన చైనా ఆటలు సాగలేదు. ఆఖరుకు తనే ఒక మెట్టు దిగి భారత్తో కలసి నడవాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. -
డోక్లామ్ లాంటి చొరబాట్లు పెరగొచ్చు: ఆర్మీ
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా కొనసాగుతున్న డోక్లామ్ ప్రతిష్టంభన తరహా ఘటనలు వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) మీదుగా మరింతగా పెరిగే అవకాశముందని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఇరుదేశాల సరిహద్దుల విషయంలో యథాతథస్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తుండటమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతమైన టిబేట్లో బలగాల తరలింపు, ఆపరేషన్ కొనసాగింపు సామర్థ్యాలను చైనా గణనీయంగా పెంచుకున్నదని ఆయన తెలిపారు. 'సరిహద్దుల్లో యథాతథ పరిస్థితిని మార్చడం ద్వారా డోక్లామ్ కొండప్రాంతంలో ప్రతిష్టంభన చైనా కారణమైంది. ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. భవిష్యత్తులో ఇవి మరింతగా పెరగొచ్చు' అని జనరల్ రావత్ తెలిపారు. ఇరుదేశాల సరిహద్దుల్లో వివాదాలు, ఎల్వోసీ అలైన్మెంట్ విషయమై విభేదాలు కొత్త కావని, ఈ వివాదాలను పరిష్కరించేందుకు ఉమ్మడి యంత్రాంగం కూడా ఉందని ఆయన చెప్పారు. -
భారత్లోని చైనీయులకు భద్రతా సలహా!
బీజింగ్: డోక్లాంలో రెండు నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్లో నివసిస్తున్న చైనీయులకు ఆ దేశ ప్రభుత్వం తాజాగా భద్రతా సలహాను జారీచేసింది. వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టాలని, స్థానిక భద్రతాపరమైన పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరిజు వేసుకోవాలని భారత్లోని చైనీయులకు సూచించింది. డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా సర్కారు జారీచేసిన రెండో భద్రతాపరమైన సలహా ఇదని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది. భారత్లో చైనీయులు ఎదుర్కొంటున్న పలు బెదిరింపులు, ముప్పుల గురించి వివరించిన ఆ దేశ మీడియా.. అనవసరంగా భారత్కు వెళ్లొద్దని తమ దేశ పౌరులకు సూచించింది. గతంలో జూలై 8న చైనా జారీచేసిన అడ్వయిజరీ కన్నా తాజా అడ్వయిజరీ తీవ్రంగా ఉండటం గమనార్హం. 'ప్రకృతి విపత్తులు, ట్రాఫిక్ ప్రమాదాలు, వ్యాధుల వ్యాప్తి తరచూ భారత్లో చోటుచేసుకుంటాయి' అంటూ ఈ అడ్వయిజరీలో చెప్పుకొచ్చింది. ఈ కారణాల వల్లే వీసా గడువు ముగిసినా పలువురు చైనీయులు ఇంకా భారత్లోనే ఉన్నారంటూ పేర్కొంది. -
భారత్ మా మాటలను లెక్కచేయడం లేదు: చైనా
బీజింగ్: డొక్లాం పీఠభూమిపై తమ వాదనను భారత్ లెక్కచేయడం లేదని మంగళవారం చైనా విస్మయం వ్యక్తం చేసింది. పద్దతి మార్చుకోకపోతే భారత్లోకి మేం ప్రవేశించాల్సివుంటుందని హెచ్చరించింది. అప్పుడు చేయడానికి ఇంకేమీ మిగలదని గత కొన్ని వారాలుగా పాడుతున్న పాటనే మరలా వినిపించింది. గొంతు సవరించుకుని చైనా ఎన్నిమార్లు హెచ్చరికలు చేసిన భారత్ బెదరడం లేదు. సోమవారం త్వరలో డొక్లాం సమస్యకు శుభం కార్డు వేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు దేశాలు(చైనా, భారత్, భూటాన్) కలసి చర్చించుకున్న అనంతరమే డొక్లాంపై ఓ నిర్ణయానికి రావాలని భారత్ చైనాను అభ్యర్థించింది కూడా. భూటాన్ డొక్లాం తమ భూభాగంలోనిదని చెబుతుండగా.. చైనా డొక్లాం తమదని అంటోంది. మంగళవారం చైనా విదేశాంగ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా రోడ్డు నిర్మాణం చేస్తున్న ప్రదేశంలోకి భారత్ చొరబాటు చేసిందని వ్యాఖ్యానించింది. అందుకు భారత్ చెబుతున్న కారణాలు చైనాను విస్మయానికి గురి చేశాయని పేర్కొంది. భారత్ లాజిక్ సరిగా లేదని, అదే లాజిక్తో ప్రతి ఒక్కరూ పొరుగు దేశంలోకి చొరబాటు చేయొచ్చని వ్యాఖ్యానించింది. భారత్.. చైనా సరిహద్దులో భారీ నిర్మాణాలు చేపడితే.. అభద్రతా భావంతో తాము భారత్లోకి చొరబాటు చేస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది. -
‘త్వరలో డోక్లామ్ ప్రతిష్టంభన వీడుతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లామ్ ప్రతిష్టంభనకు తెరపడేలా చైనా త్వరలోనే చర్చలకు ముందుకొస్తుందని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సిక్కిం సరిహద్దు వెంబడి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి సమసిపోయేలా సంప్రదింపుల ప్రక్రియకు చైనా చొరవ చూపుతుందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. పొరుగు దేశాలన్నింటితో భారత్ శాంతియుత సంబంధాలను ఆకాంక్షిస్తుందని చెప్పారు. భారత్ శాంతినే కోరుకుంటుందనే సందేశాన్ని పొరుగు దేశాలకు చాటుతున్నామన్నారు. డోక్లాంపై మూడు నెలలుగా భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు, పరస్పర హెచ్చరికలతో ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో హోంమంత్రి రాజ్నాథ్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు భారత్తో భారీగా వాణిజ్య సంబంధాలు నెరపడం, ఆర్థిక శక్తిగా అమెరికాకు దీటుగా ఎదగాలని భావిస్తుండటంతో చైనా దూకుడుగా వెళ్లబోదని భావిస్తున్నారు. -
చైనా దూకుడుకు బ్రేక్లు ఇవే....
సాక్షి, న్యూఢిల్లీ : ఇండో- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమై యుద్ధానికి దారితీసినా చైనాకు ఒరిగేదేమీలేదని ఇరు వైపులా ప్రాణ నష్టం మినహా సాధించేదేమీ లేదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. చైనా భేషజాలకు పోయి హెచ్చరికలు జారీ చేయడం కట్టిపెట్టి చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడమే మేలని భావిస్తోంది. 1962లో చైనాతో తలపడిన భారత్ తాజా ఉద్రిక్తతలకు బెదరబోదని, ఆసియా ప్రబల శక్తిగా ఎదిగి అమెరికాకు దీటైన సవాల్ విసురుతున్న చైనాకే యుద్ధంతో సవాళ్లు ఎదురవుతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో డోక్లామ్ వద్ద భారత్కే ప్రాబల్యం ఉందని, సేనల పరంగా మనమే ముందున్నామని, అయితే సరిహద్దులో మౌలిక వసతుల విషయంలో చైనాదే పైచేయి అని తెలిపాయి. యుద్ధం వస్తే 3488 కిలోమీటర్ల ఇండో-చైనా సరిహద్దు వెలుపలకూ అది విస్తరించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఊపందుకున్నక్రమంలో ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉండబోదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యుద్ధం దిశగా సాగుతున్న చైనా దూకుడుకు ఆర్థిక, వ్యూహాత్మక అంశాలు బ్రేక్ వేస్తాయని చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ తొలివారంలో చైనాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, జిన్పింగ్ల భేటీ డోక్లాం ప్రతిష్టంభనకు తెరదించే దిశగా సాగుతుందని భావిస్తున్నారు. -
డోక్లామ్ ఇష్యూ.. మా మద్ధతు భారత్కే...
-
దక్షిణ చైనా సముద్రంలో భారతీయ మిస్సైల్
న్యూఢిల్లీ: దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అంటున్న చైనాకు భారత్ షాకిచ్చింది. దక్షిణ చైనా సముద్రంపై భారతీయ క్షిపణులు చైనాకు సవాలుగా మారనున్నాయి. వాస్తవానికి దక్షిణ చైనా సముద్రంపై బ్రూనై, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్, వియత్నాంలకు కూడా అధికారాలు ఉన్నాయి. అయితే చైనా మిగిలిన దేశాలను బెదిరిస్తూ సముద్రం మొత్తం తమ కిందకే వస్తుందని వాదిస్తోంది. దక్షిణ చైనా సముద్ర తీరం కలిగిన వియత్నాంతో భారత్కు ఎప్పటినుంచో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా వియత్నాంకు ఓడలపై నుంచి ప్రయోగించే అత్యధిక శక్తిమంతమైన మిస్సైల్ బ్రహ్మోస్ను అందించింది. కొన్నేళ్లుగా భారత్-వియత్నాంల మధ్య ఈ మిస్సైల్ అమ్మకానికి చర్చలు జరుగుతూ వచ్చాయి. చైనా భారత్పై కవ్వింపు చర్యలకు దిగుతుండటంతో ప్రభుత్వం ఈ మిస్సైల్స్ను వియత్నాంకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత నేవీ వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన మిస్సైల్ బ్రహ్మోసే. ధ్వని వేగం కంటే రెండున్నర రెట్లు అధిక వేగంతో ప్రయాణించగల సామర్ధ్యం దీని సొంత. దీన్ని ఓడల నుంచి సులువుగా ప్రయోగించొచ్చు. ప్రపంచ దేశాల వద్ద ఉన్న ఈ తరహా మిస్సైల్స్లో బ్రహ్మోసే అత్యాధునికం. భారత్ నుంచి తొలి విడతగా అందాల్సిన బ్రహ్మోస్ మిస్సైల్స్ తమ వద్దకు చేరుకున్నట్లు వియత్నాం అధికారి ఒకరు తెలిపారు. అయితే, బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకంపై భారత్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
ప్రతి భారతీయుడూ తెల్సుకోవాల్సిన నిజాలు
న్యూఢిల్లీ: డొక్లాం సమస్యపై చైనా అధికారిక మీడియా 'భారత్ చేసిన ఏడు పాపాలు' అంటూ వీడియో విడుదల చేసింది. అందులో చైనా చేసిన ప్రతిదీ ఒక పచ్చి అబద్దం. డొక్లాంపై భారత్ ఎలాంటి పాపాలు చేయలేదు. సిక్కిం, భూటాన్, చైనా దేశాల మధ్య ఉన్న డొక్లాం సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రతి భారతీయ పౌరుడు/పౌరురాలు డొక్లాం సమస్య గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. భారత్ ఎలాంటి పాపాలు చేయలేదనడానికి మన వద్ద ఆధారాలు ఉన్నాయి. వీటితో చైనా దుర్భుద్దిని మనం ఎండగట్టాలి. భారత్ పాపాలు చేయలేదనడానికి ఈ క్రింది విషయాలే తార్కాణాలు. అసలు నిజాలివీ.. చైనా మీడియా చేసిన ఆరోపణలను నిరూపించాలంటే చారిత్రక డాక్యుమెంట్లను పరిశీలించాల్సిన పని లేదు. చైనా సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా భారత్.. వారి దేశంలోకి ప్రవేశించిందన్న ఆరోపణ అవాస్తవం. తద్వారా అంతర్జాతీయ చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందన్న మాట అసలే పచ్చి అబద్దం. డొక్లాం.. భూటాన్, చైనాల మధ్య వివాదం నెలకొన్న ప్రదేశం. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు 1990 నుంచి ఇప్పటివరకూ చైనా-భూటాన్లు 24 రౌండ్లు సమావేశమయ్యాయి. అసలు భూటానే చైనాకు డొక్లాంను అప్పగిస్తే.. మరి సమస్యేమి లేకుండా అన్ని రౌండ్లు ఎందుకు సమావేశాలు జరిపినట్లు?. భూటాన్తో చర్చలు జరుగుతుండగానే చైనా డొక్లాంలో రోడ్డు వేసేందుకు ప్రయత్నించింది. అసలు నిజమేమిటంటే చైనానే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది. భారత్ చట్టాన్ని కాపాడేందుకు అడ్డుగా నిలిచింది. 1890 ఒప్పందం యూకే, చైనా, టిబెట్ల మధ్య 1890లో ఓ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందం వల్ల తమకు నష్టం వాటిల్లవచ్చని భావించిన భూటాన్ ఒప్పందంపై సంతకం చేయలేదు. భూటాన్కు ఈ ఒప్పందంతో అసలు సంబంధమే లేదు. బ్రిటన్, చైనాలు 1890లో కలకత్తా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో మొత్తం ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి. మొదటి ఆర్టికల్ ప్రకారం డొక్లాం తమ భూభాగామని చైనా వాదిస్తోంది. భూటాన్కు చేరువలోని మౌంట్ గ్యెమొచెన్ నుంచి నేపాల్ను ఆనుకుంటూ చైనా సరిహద్దు ఉంటుందని మొదటి ఆర్టికల్ సారాంశం. దీంతో డొక్లాం భూభాగం కూడా తమదేనని చైనా ప్రకటించుకుంది. అక్కడ రోడ్డు నిర్మించడానికి సన్నాహాలు మొదలెట్టింది. దీంతో భూటాన్ తొలుత చైనాకు వ్యతిరేకంగా గళమెత్తింది. 18, 19 శతాబ్దాల్లో ఉన్న మ్యాప్లను, ఒప్పందంలోని ఆర్టికల్ 1ను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా డొక్లాంతో చైనాకు సంబంధం లేదని భారత్ వాదిస్తోంది. చైనా సరిహద్దు నేపాల్కు చేరువలోని బటాంగ్ లా అనే ప్రదేశం వద్ద ముగుస్తుందని అంటోంది. యథాతథ స్థితి 2012.. డొక్లాంలో 2012 నుంచి కొనసాగుతున్న యథాతథ స్థితికి భారత్ చేటు చేస్తుందని చైనా ఆరోపిస్తోంది. కానీ, ఈ ఆరోపణలో నిజం లేదు. భారత సైనికులు ఎన్నో ఏళ్లుగా డొక్లాం సరిహద్దులో భూటాన్ సైనికులతో సమన్వయం చేసుకుంటూ కావలి కాస్తున్నారు. మధ్యలో కొన్నేళ్ల పాటు చైనా బలగాలు డొక్లాం ప్రాంతంలో పహారా కాస్తుండకపోవడంతో భారత్ కూడా అక్కడి నుంచి సైన్యాన్ని ఉప సంహరించింది. 2012లో భారత విదేశాంగ శాఖ చైనా, భారత్, భూటాన్ల మధ్య జరిగిన యథాతథ స్థతికి సంబంధించిన ఒప్పందంపై వివరణ ఇచ్చింది. మూడు దేశాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే డొక్లాంపై ఒక నిర్ణయానికి రావాలనేది దీని సారాంశం. దీని ద్వారా భూటాన్, భారత్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా డొక్లాం తమదేనని అంటున్న చైనా వాదన సరైనది కాదని తెలిసిపోతుంది. భూటాన్-చైనాల సరిహద్దు చర్చలను భారత్ అడ్డుకుంటోందా? చైనా-భూటాన్ల సరిహద్దు చర్చలలోకి భారత్ తలదూర్చి, ఒప్పందాలు కుదరకుండా చేస్తోందనేది చైనా మరో ఆరోపణ. ఇది మరో పచ్చి అబద్దం. గత ఇరవై ఏళ్లుగా చైనాతో భూటాన్ జరుపుతున్న చర్చలే ఇందుకు నిదర్శనం. 2007 వరకూ అంతర్జాతీయ రాజకీయాలన్నింటిని భూటాన్ భారత్ ద్వారా జరిపిందన్న మాట వాస్తవం. ఇందుకు భారత్-భూటాన్ల మధ్య స్నేహహస్తం ఒప్పందం ఉంది. భారత్ ఓ చొరబాటు దేశమా? డొక్లాంలోకి భారత్ సైన్యంతోటి చొరబాటుకు పాల్పడిందని చైనా ఆరోపించింది. ఇందులో నిజం లేదు. భారత్ ఎప్పుడూ డొక్లాం తన భూభాగామని పేర్కొన లేదు. భూటాన్ సైన్యాన్ని తమకు అడ్డు తొలగించుకోవాలని చైనా ప్రయత్నించింది. దీంతో సాయం కోసం భూటాన్ భారత్ తలుపు తట్టింది. ఆపన్న హస్తంతో మేం ఉన్నామంటూ భారత్ చైనా ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పాటు, భూటాన్కు రక్షణగా నిలవడానికి యథాతథ స్ధితి ఒప్పందాన్ని చైనాకు చూపింది. ముందు చైనా సైనికులను ఉపసంహరించుకుంటే మేం కూడా ఉపసంహరించుకుంటామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకే భారత్పై చైనా బుసలు కొడుతోంది. సంబంధిత వార్త : భారత్పై చైనా విద్వేషపూరిత వీడియో -
భారత్పై చైనా విద్వేషపూరిత వీడియో
న్యూఢిల్లీ: భారత్ ఏడు పాపాలు చేసిందంటూ చైనా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా ఆ వీడియో ఉంది. చైనా మీడియా విడుదల చేసిన వీడియోలో ఉన్న ఏడు పాపాల వివరాలు ఇలా ఉన్నాయి. 1. ట్రెస్పాసింగ్ డొక్లాంలోకి భారత్ చైనా అనుమతి లేకుండా ప్రవేశించింది. భారీగా ఆయుధ సామగ్రితో పాటు బుల్డోజర్లను చైనా భూభాగంలోకి భారత్ తీసుకొచ్చింది. వివాద రహితమైన చైనా భూభాగంలోకి భారత్ చొచ్చుకురావడం దుర్మార్గం. మీకు తెలియకుండా మీ ఇంటిపైకి బుల్డోజర్లను తీసుకొస్తే మీకెలా ఉంటుందో ఆలోచించండి. ఇరుగు పొరుగు దేశాలతో ఎలా ప్రవర్తించాలో భారత్ తెలుసుకోవాలి. 2. ద్వైపాక్షిక ఒప్పందం ఉల్లంఘన చైనా-భారత్ల మధ్య జరిగిన ఒప్పందాన్ని తొలుత భారతే ఉల్లంఘించింది. 3. అంతర్జాతీయ చట్టాన్ని తుంగలో తొక్కడం డొక్లాంను వివాదాస్పద ప్రదేశంగా భారత్ భావించొచ్చు. కానీ, అంతర్జాతీయంగా డొక్లాంను చైనాలో అంతర్భాగంగా గుర్తించారు. 1890లో గ్రేట్ బ్రిటన్, చైనాల మధ్య జరిగిన ఒప్పందంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. దీనికి అంతర్జాతీయ చట్టం రక్షణ కల్పిస్తోంది. భారత్కు ఎవరూ చట్టాన్ని ఉల్లంఘించకూడదని నేర్పించలేదా?. 4. తప్పు, ఒప్పుల పేరుతో గందరగోళం చైనా తప్పు చేసింది, మేం ఒప్పు చేశామంటూ భారత్ ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతోంది. 5. బాధితులపై ఆరోపణలు చేయడం తప్పు చేసిన భారత్.. బాధితుల(చైనా)పై తిరిగి ఆరోపణలు చేయడం హస్యాస్పదం. డొక్లాంలో రోడ్డు నిర్మించడం భారత్కు భద్రతాపరంగా సమస్యలు తెస్తుందనే ఆరోపణలు సరైనవి కావు. 6. భూటాన్ను లాగారు..! డొక్లాం సమస్యలోకి భారత్ భూటాన్ను అనసరంగా లాక్కొస్తోంది. వాళ్లు భారత్ నుంచి ఎలాంటి రక్షణను కోరడం లేదు. డొక్లాం అసలు మా భూభాగామే కాదని భూటానే చైనా అధికారులకు చెప్పింది. 7. తప్పని తెలిసి కూడా చేయడం.. చైనా భూభాగంలోకి వచ్చిన భారత సైనికులు ముందు బయటకు వెళ్లిపోవాలి. ఆ తర్వాతే చర్చలకు రావాలి. -
'భళా భారత్' చైనా విషయంలో యూఎస్ ప్రశంస
వాషింగ్టన్: భారత్పై అమెరికా ప్రశంసల జల్లు కురిపించింది. చైనా విషయంలో భారత్ చాలా పరిణితి చెందిన శక్తిగా వ్యవహరిస్తోందని, ఆ దేశం మాత్రం అసహనంతో వ్యవహరిస్తోందని పేర్కొంది. అమెరికాకు చెందిన నేవీ యుద్ధ కళాశాలకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ జేమ్స్ ఆర్ హోమ్స్ భారత్ చైనా మధ్య నెలకొన్న డోక్లామ్ విషయంపై స్పందించారు. గత 50 రోజులుగా రెండు దేశాల మధ్య ఈ సమస్య రగులుతుందని, ఇప్పటి వరకు తాను చేసిన విశ్లేషణలో భారత్ చాలా వ్యూహాత్మకంగా, పరిణతి చెందిన దేశంగా వ్యవహరించిందని అన్నారు. భారత్ చేస్తూ వస్తున్న పనులన్నీ కూడా సరైనవేనని, వివాదం విషయంలోగానీ, సమాధానం ఇవ్వడంలోగానీ చైనాకంటే గొప్పగా భారత్ వ్యవహరిస్తోందంటూ ఆయన కితాబిచ్చారు. 'భారత్ చాలా పరిణతి చెందిన శక్తిగా వ్యవహరిస్తూ ఓ పరిపక్వత లేని పెంకితనంతో వ్యవహరించే దేశం ఎలా వ్యవహరిస్తుందో అలాంటి దేశంగా చైనాను ప్రపంచానికి చూపిస్తోంది. సరిహద్దు వద్ద వివాదం కొనసాగించాలని చైనా చూస్తున్నట్లు తెలుస్తోందన్నారు. హిమాలయాల సరిహద్దు విషయంలో కూడా ఆయన స్పందిస్తూ ప్రధాని నరేంద్రమోదీగానీ, ఆయన సలహాదారులుగానీ ఈ విషయంలో అమెరికా జోక్యాన్ని ఆహ్వానించబోరని, ఒక వేళ ఆ సమస్య ముదిరితే మాత్రం భారత్కు మద్దతుగానే అమెరికా వస్తుందని తెలిపారు. -
భారీగా దళాలను మోహరించిన భారత్
న్యూఢిల్లీ: భారతదేశానికి ఉన్న సరిహద్దును అత్యధికంగా పంచుకుంటున్న రెండో దేశం చైనా. డొక్లాం సమస్యపై చైనా తరచూ ఘాటు వ్యాఖ్యలకు దిగడంతో పాటు వెనక్కు తగ్గకపోతే ఘోర ప్రభావాన్ని భారత్ చవి చూస్తుందని హెచ్చరిస్తోంది. చైనా వ్యాఖ్యలకు అడపా దడపా భారత్ తరఫు నుంచి మన నాయకులు దీటుగా జవాబిస్తున్నారు. కానీ అది చైనా దూకుడుకు సరిపోవడం లేదు. అందుకే మాటలతో కాదు చేతలతోనే చైనాకు సమాధానం చెప్పాలని భారత్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. డొక్లాంలో భారీగా బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయని తెలిసింది. ఈశాన్య రాష్ట్రాల్లో భారత వాయుదళానికి కూడా ఆపరేషనల్ అలర్ట్ జారీ అయిందని సమాచారం. శుక్రవారం భారత్-చైనాల మేజర్ జనరల్ స్ధాయి సమావేశాలు ముగిసిన తర్వాత ఈ అలర్ట్లు జారీ కావడం గమనార్హం. అంటే చైనా తాను వెనక్కు తగ్గకుండా కేవలం నోటిమాటతో తన పంతం నెగ్గించుకోవాలని చూస్తోందని అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో బెదిరింపులకు చైనా సరిహద్దులో ఏదైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉందని భారత్ నమ్ముతోంది. అందుకే ఉన్న పళంగా 3,488 కిలోమీటర్ల సరిహద్దులోని భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని జారీ చేసిన అలర్ట్లో పేర్కొంది. అంతేకాదు అత్యవసర పరిస్ధితుల్లో వాయుదళం సేవలను కూడా వినియోగించి ప్రత్యర్థికి ముచ్చెటమలు పట్టించాలని యోచన మన సేనల్లో ప్రస్ఫుటమవుతోంది. సమస్య ఉన్న ప్రాంతంలో మాత్రం భారత్ నుంచి 350 మంది సైనికులు, చైనా నుంచి 350 మంది సైనికులు ఉన్నారు. యుద్ధ సన్నహకాల్లో భాగంగా సరిహద్దులోని గ్రామాలను భారత సైన్యం ఖాళీ చేయిస్తోందంటూ వచ్చిన వార్తలను భారతీయ ఆర్మీ ఖండించిన విషయం తెలిసిందే. అయితే, డొక్లాం పీఠభూమికి 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలకు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తే మంచిదని భారత సైన్యం సూచన చేసినట్లు తెలిసింది. -
యుద్ధానికి భారత్ సిద్ధం?
డోక్లామ్కు సమీప గ్రామాలను ఖాళీ చేయిస్తున్న భారత ఆర్మీ ఇప్పటికే నథాంగ్ గ్రామానికి ఆదేశాలు సైన్యం వస్తోందని స్పష్టం చేసిన గ్రామస్థులు యుద్ధం వస్తే ప్రజలకు ఏం కాకుడదనే సురక్షిత ప్రాంతాలకు తరలింపు సాక్షి, న్యూఢిల్లీ: చైనాతో అమీతుమీ తేల్చుకునేందుకే భారత ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరు దేశాలకు గత రెండు నెలలుగా కొనసాగుతున్న వివాదానికి కారణమైన డోక్లామ్ ప్రాంతానికి సమీపంలోని సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయాలని ఆర్మీ ఆదేశించింది. వారిని సురక్షిత ప్రాంతాలకు పంపిస్తోంది. ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం నథాంగ్ అనే గ్రామంలో ఉన్న ప్రజలను వెంటనే వారి ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఆ ప్రాంతానికి వేలమంది సైనికులను తరలిస్తోంది. ఈ ప్రాంతం వివాదానికి కారణమైన డోక్లామ్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ చైనా మీడియా పేర్కొనడం, ఆ మరుసటి రోజే డోక్లామ్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడం నిజంగానే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా అనే అనుమానానికి తావిస్తోంది. అయితే, నిజంగానే యుద్ధం జరిగితే ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోకూడదని ముందస్తు జాగ్రత్త మేరకే సైన్యం ఈ పనిచేస్తోందని సమాచారం. నథాంగ్ గ్రామస్తులు కూడా అక్కడికి పెద్ద మొత్తంలో సైనికులు వస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆర్మీ మూవ్మెంట్పై అధికారికంగా ఆర్మీ అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోపక్క, డోక్లామ్ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ ముందునుంచే చైనా బెదిరింపులకు లొంగని విషయం తెలిసిందే. -
టార్గెట్ ఇండియా.. చైనా మిలిటరీ ఆపరేషన్!
యుద్ధోన్మాద చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్ టైమ్స్' మరోసారి డోక్లామ్ వివాదంపై చెలరేగిపోయింది. డోక్లామ్లో మోహరించిన భారతీయ సైన్యాన్ని తరిమికొట్టేందుకు చిన్నస్థాయి మిలటరీ ఆపరేషన్ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఈ వారాంతంలో చేపట్టనుందని 'నిపుణుల'ను ఉటంకిస్తూ ఆ పత్రిక చెప్పుకొచ్చింది. ' చైనా భూభాగంలోకి భారత సైనికుల చొరబాటును ఎక్కువకాలం చైనా సహించలేదనే విషయాన్ని గడిచిన 24 గంటల్లో చైనా వైపు నుంచి వెలువడిన వ్యాఖ్యలు.. భారత్కు తెలిపాయి. అయినా, భారత్ వెనుకకు తగ్గడానికి నిరాకరిస్తే.. రెండువారాల్లోపు చైనా చిన్నస్థాయి మిలిటరీ ఆపరేషన్ను చేపట్టవచ్చు' అని 'గ్లోబల్ టైమ్స్' పత్రిక హు ఝియాంగ్ను ఉటంకిస్తూ పేర్కొంది. దాదాపు రెండునెలలుగా వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ను చొరబాటుదారుగా అభివర్ణిస్తూ చైనా 15 పేజీల వివరణాత్మక పత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. డోక్లామ్ నుంచి భారత సైనికులు స్వచ్ఛందంగా, బేషరతుగా వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేసింది. డోక్లామ్ ప్రతిష్టంభన నెలకొని 50 రోజులైంది. నిజానికది భూటాన్ భూభాగం. అక్కడ చైనా రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయగా... అది తమ ప్రయోజనాలకు భంగకరమని భారత్ అడ్డుపడింది. కానీ చైనా మాత్రం వివాదాన్ని పెద్దది చేయడం ద్వారా తాము అనుకున్నది సాధించింది. అక్కడేదో వివాదాస్పద అంశం ఉందనే అభిప్రాయాన్ని అంతర్జాతీయంగా కలిగించడంలో విజయవంతమైంది. చైనా తమ భూభాగాన్ని విస్తరించే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. తొలుత సైనిక బలంతో ఇతర దేశాల భూభాగాన్ని దురాక్రమణ చేయడం, తర్వాత అది తమ అంతర్భాగమని అన్ని అంతర్జాతీయ వేదికలపై నొక్కి చెప్పడం. సాధ్యమైనంత ఎక్కువగా అంతర్జాతీయ వేదికలపై దీని ప్రస్తావన తెస్తుంది. ఫలితంగా సదరు చైనా ఆక్రమిత భూభాగం కాస్తా... వివాదాస్పద భూభాగంగా మారిపోతుంది. మరో విధానాన్ని కూడా డ్రాగన్ అనుసరిస్తోంది. చిలకొట్టుడుతో ప్రారంభించి మెల్లిగా దురాక్రమణను విస్తరిస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో పారాసెల్స్, స్ప్రాట్లీ దీవుల సముదాయాలు పూర్తిగా తమవేనని చెప్పడం, కృతిమ దీవులను నిర్మించి ఆర్మీబేస్ కింద మార్చేందుకు మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయడం... ఇలాంటిదే. డోక్లామ్ కవ్వింపును కూడా చైనా విస్తరణ కాంక్షలో భాగంగానే ప్రపంచ దేశాలు చూడాల్సిన అవసరం ఉంది. 1949లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అధికారాన్ని హస్తగతం చేసుకున్నపటి నుంచీ చైనా దురాక్రమణల ద్వారా తమ భూభాగాన్ని విస్తరిస్తూనే ఉంది. పూర్తి కథనం: కబలిం‘చైనా’ చదవండి: మావో వల్లే 1959 సరిహద్దు వివాదం -
కబలిం‘చైనా’
డోక్లామ్ ప్రతిష్టంభన నెలకొని 50 రోజులైంది. నిజానికది భూటాన్ భూభాగం. అక్కడ చైనా రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయగా... అది తమ ప్రయోజనాలకు భంగకరమని భారత్ అడ్డుపడింది. కానీ చైనా మాత్రం వివాదాన్ని పెద్దది చేయడం ద్వారా తాము అనుకున్నది సాధించింది. అక్కడేదో వివాదాస్పద అంశం ఉందనే అభిప్రాయాన్ని అంతర్జాతీయంగా కలిగించడంలో విజయవంతమైంది. చైనా తమ భూభాగాన్ని విస్తరించే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. తొలుత సైనిక బలంతో ఇతర దేశాల భూభాగాన్ని దురాక్రమణ చేయడం, తర్వాత అది తమ అంతర్భాగమని అన్ని అంతర్జాతీయ వేదికలపై నొక్కి చెప్పడం. సాధ్యమైనంత ఎక్కువగా అంతర్జాతీయ వేదికలపై దీని ప్రస్తావన తెస్తుంది. ఫలితంగా సదరు చైనా ఆక్రమిత భూభాగం కాస్తా... వివాదాస్పద భూభాగంగా మారిపోతుంది. మరో విధానాన్ని కూడా డ్రాగన్ అనుసరిస్తోంది. చిలకొట్టుడుతో ప్రారంభించి మెల్లిగా దురాక్రమణను విస్తరిస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో పారాసెల్స్, స్ప్రాట్లీ దీవుల సముదాయాలు పూర్తిగా తమవేనని చెప్పడం, కృతిమ దీవులను నిర్మించి ఆర్మీబేస్ కింద మార్చేందుకు మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయడం... ఇలాంటిదే. డోక్లామ్ కవ్వింపును కూడా చైనా విస్తరణ కాంక్షలో భాగంగానే ప్రపంచ దేశాలు చూడాల్సిన అవసరం ఉంది. 1949లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అధికారాన్ని హస్తగతం చేసుకున్నపటి నుంచీ చైనా దురాక్రమణల ద్వారా తమ భూభాగాన్ని విస్తరిస్తూనే ఉంది. టిబెట్తో మొదలు... మావో జెడాంగ్ నేతృత్వంలో కౌమితాంగ్ రాజవంశ పాలనను కూలదోసి సీపీసీ అధికారం చేపట్టిన కొద్దినెలల్లోనే చైనా విస్తరణపై దృష్టి పెట్టింది. బౌద్ధమతగురువుల పాలనలో స్వతంత్ర దేశంగా ఉన్న టిబెట్ను బలవంతంగా ఆక్రమించి... 12 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమలో కలిపేసుకుంది. 1959లో తప్పించుకున్న దలైలామా భారత్లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. టిబెట్ పీఠభూమికి పశ్చిమాన ఉన్న షిన్జియాంగ్ ప్రాంతాన్ని కూడా కలిపేసుకుంది. 12 లక్షల చదరపు కిలోమీటర్ల టిబెట్, 16.64 లక్షల చదరపు కిలోమీటర్ల షిన్జియాంగ్ కలవడంతో చైనా భూభాగం ఏడాదిలోపే రెట్టింపైంది. అక్సాయ్ చిన్... హాంఫట్ 1962లో అక్సాయ్చిన్, అరుణాచల్ప్రదేశ్లు తమవేనంటూ చైనా– భారత్తో యుద్ధానికి దిగింది. అరుణాచల్లో తవాంగ్ను ఆధీనంలోకి తీసుకున్నా... యుద్ధం ముగిశాక తిరిగి ఇచ్చేసింది. తమ ప్రాంతాలుగా పేర్కొంటున్నవి తమ ఆధీనంలోకి వచ్చినందున... ఇక ముందుకు చొచ్చుకెళ్లే ఉద్దేశం లేదని, కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు చైనా అక్టోబరు 19, 1962న ప్రకటించింది. కాల్పుల విరమణ 21 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. తవాంగ్ నుంచి వెనక్కితగ్గి... మెక్మెహన్ లైన్ను గౌరవిస్తున్నట్లు ప్రకటించిన చైనా... మరోవైపు 37,224 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అక్సాయ్చిన్ను ఆక్రమించి కలిపేసుకుంది. అక్సాయ్చిన్ సముద్రమట్టానికి 5 వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఎడారి ప్రాంతం. ఆవాసయోగ్యమైనది కాదు. షిన్జియాంగ్– టిబెట్లను కలిపే రహదారి నిర్మాణాన్ని చైనా 1952లో ప్రారంభించి... 1957లో పూర్తిచేసింది. ఇది అక్సాయ్చిన్ మీదుగా వెళుతుంది. భారత భూభాగంలో చైనా నిర్మాణం చేపట్టినా... మన నిఘావర్గాలు ఆలస్యంగా మేలుకొన్నాయి. అయితే నెహ్రూ ప్రభుత్వం దీన్ని అనధికారికంగా చైనా వద్ద లేవనెత్తింది తప్పితే... బహిరంగపర్చలేదు. చివరికి 1959లో పార్లమెంటులో చైనా దురాక్రమణతో రోడ్డు నిర్మాణం చేపట్టిందని నెహ్రూ అంగీకరించారు. 1993లో కుదిరిన ఒప్పందం ద్వారా అక్సాయ్చిన్పై చైనా నియంత్రణను పరోక్షంగా అంగీకరిస్తూ వాస్తవధీన రేఖను భారత్ గుర్తించింది. దీవులపై డ్రాగన్ కన్ను.... తర్వాత చైనా వ్యూహాత్మకంగా కీలకమైన దీవులపై దృష్టి పెట్టింది. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో దీవులను వేర్వేరు దేశాల నుంచి లాగేసుకుంది. 1974లో వియత్నాం ఆధీనంలోని పారాసెల్ దీవులను చేజిక్కించుకుంది. 130 చిన్నాచితక దీవులున్నా... వీటి మొత్తం వైశాల్యం 7.7 చదరపు కిలోమీటర్లే. అయితే సముద్రరవాణా మార్గంలో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఇవి ఉన్నాయి. 1988లో వియత్నాం నుంచి జాన్సన్ రీఫ్ను, 1995లో మిస్చీఫ్ రీఫ్ను స్వాధీనం చేసుకుంది. 2012లో ఫిలిప్పీన్స్ నుంచి స్కార్బొరో షోల్ను స్వాధీనం చేసుకుంది. వీటి సమీపంలోకి ఇతర దేశాల నౌకల రాకపోకలను నియంత్రించింది. అయితే 2016లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టే అమెరికాతో దీర్ఘకాలిక సంబంధాలను తెంచుకొని చైనా పంచన చేరడంతో ఇప్పుడు ఫిలిప్సీన్స్ మత్యకారులను అక్కడికి అనుమతిస్తున్నారు. జపాన్తో జగడం... తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెంకాకూ దీవుల తమవేనంటూ వివాదం చేస్తోంది చైనా. సెంకాకూ దీవులు 1895 నుంచి జపాన్ ఆధీనంలోనే ఉన్నాయి. 1945 నుంచి 1972 వరకు రుక్యూ దీవులతో పాటు సెంకాకూ కూడా అమెరికాకు లీజుకు ఇచ్చింది జపాన్. 1972లో అమెరికా వీటిని ఖాళీచేసే సమయానికి చైనా ఇవి తమవేననే వాదనను తెరపైకి తెచ్చింది. సెంకాకూ దీవులు ఆవాసయోగ్యం కావు. అయితే వీటి పరిసరాల్లో మత్స్యసంపద సమృద్ధిగా ఉంది. దానితో పాటు చమురు నిక్షేపాలున్నట్లు 1970లో కనుగొన్నారు. దాంతో చైనా కన్ను సెంకాకూ దీవులపై పడింది. అప్పటినుంచి ఏదో ఒక మిషతో సెంకాకూ దీవులను చైనా వివాదాస్పదమైనవిగా చూపే ప్రయత్నం చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై పేచీ... సహజ వనరులు, అసార సహజవాయువు నిలువలున్న దక్షిణ చైనా సముద్రంలో దాదాపు 80 శాతం తమ ప్రాదేశిక జలాలేనని చైనా వాదిస్తోంది. ఇతర దక్షిణ చైనా సముద్ర తీరదేశాలైన... తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, ఇండోనేషియా, సింగపూర్, వియత్నాం... చైనా వాదనతో విభేదిస్తున్నాయి. చైనా ఇక్కడ కృత్రిమ దీవులను నిర్మించి ఆర్మీబేస్గా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుండటాన్ని అమెరికా, జపాన్ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ నౌకా రవాణాకు అత్యంత కీలకమైన ప్రాంతాన్ని గుప్పిటపట్టే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్. విటన్నింటిలోనూ చైనా విస్తరణ కాంక్ష ప్రస్పుటమవుతోంది కాబట్టి... డోక్లామ్లో చైనాను అడ్డుకోవడం పొరుగునున్న భారత్కు ముఖ్యం. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సహనానికీ హద్దు ఉంటుంది
►డోక్లాంపై చైనా ►భారత్...తన బలగాలను ఉపసంహరించాల్సిందే బీజింగ్: డోక్లాం వివాదం విషయంలో భారత్పట్ల తాము ఎంతో సౌహార్ద్ర భావనతో మెలిగామని, అయితే సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని డ్రాగన్ తాజాగా వ్యాఖ్యానించింది. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత నెలకొనడమనేది ఎంత సున్నితంగా మెరుగుపరుచుకుంటామనేదానిపై ఆధారపడి ఉంటుందంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొన్న నేపథ్యంలో డ్రాగన్ శుక్రవారం పైవిధంగా స్పందించింది. డోక్లాం వివాదంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ గత నెలలో పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే ఇరుదేశాలు వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాలను విధిగా వెనక్కి తీసుకుంటేనే చర్చలు జరుపుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఈ విషయమై చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రెన్ గ్యుయో కియాంగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సరిహద్దులో శాంతిని పునరుద్ధరించడంకోసం భారత్ తగురీతిలో వ్యవహరించాలని సూచించారు. ‘వివాదం తలెత్తిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగేలా చూడడంకోసం మా బలగాలు ఎంతో సంయమనం పాటించాయి. అయితే మా సౌహార్ద్రతకు, సంయమనానికి కూడా ఓ హద్దు ఉంటుంది’అని హెచ్చరించారు. జాప్యం చేస్తే సమస్య సమసిపోతుందనే ఎత్తుగడను భారత్ విడనాడాలన్నారు. తమ సైనిక బలగాల సత్తాను తక్కువ అంచనా వేయొద్దంటూ హెచ్చరించారు. ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి డోక్లాం వివాదం విషయంలో ఒకవైపు చైనాతో దౌత్యపరంగా, మరోవైపు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం భూటాన్తో సమన్వయంతో ముందుకుసాగుతున్నామని భారత్ శుక్రవారం పేర్కొంది. డోక్లాంలో భారత్...తన బలగాలను 400 నుంచి 40కి తగ్గించాలంటూ చైనా డిమాండ్ చేసిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా సూటిగా జవాబిచ్చేందుకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే నిరాకరించారు. ఇది కార్యాచరణకు సంబంధించిన విషయమన్నారు. సరిహద్దులో శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమన్నారు. -
డోక్లాంపై చర్చలే ఉత్తమం: అమెరికా
వాషింగ్టన్: భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది. ఇరు దేశాల మధ్య చర్చల్ని అమెరికా ప్రోత్సహిస్తుందని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి గ్యారీ రాస్ చెప్పారు. ఈ వివాదంలో అమెరికా ఎవరికి మద్దతు ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలు నేరుగా సమస్య పరిష్కరించుకోవాలనే కోరుతున్నామని, ఈ అంశంపై అమెరికాకు ఎలాంటి అభిప్రాయాలు లేవని రాస్ పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా అమెరికా విదేశాంగ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది. సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో భారత, చైనాలు సైన్యాన్ని మోహరించడంతో గత నెలరోజుల నుంచి ఉద్రిక్తత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ట్రై జంక్షన్ ప్రాంతంలో భూటాన్ సరిహద్దులో చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భారత్ తన సైన్యాన్ని మోహరించింది. మరోవైపు జులై 27–28 తేదీల్లో చైనాలో జరిగే బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏ అధినేతల భేటీ కోసం భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై ఈ పర్యటనలో ఆయన చర్చించే అవకాశముంది. దోవల్ చైనా పర్యటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు ఉపయోగపడుతుందని చైనా విశ్లేషకుడు మా జిలాయ్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో గ్జియామెన్లో నగరంలో జరిగే బ్రిక్స్ అధినేతలు సదస్సుకు సన్నాహకంగా ఎన్ఎస్ఏ అధినేతల భేటీ నిర్వహిస్తున్నారు. -
డోక్లామ్పై దొంగాట !
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేందుకు డ్రాగన్ కుయుక్తులు డోక్లామ్... భారత్, చైనా, భూటాన్ సరిహద్దులు కలిసే పీఠభూమి! 38 రోజుల క్రితం ఈ ప్రాంతంలో రగిలిన వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. భారత్–చైనా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కూడా దీనిపై దృష్టి సారించింది. రెండు దేశాలూ ప్రత్యక్ష చర్చలతో సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి గారి రాస్ సూచించారు. ఈ వివాదంపై మొదట్నించీ చర్చలకు, శాంతియుత పరిష్కారానికి భారత్ ఎన్నిసార్లు పిలుపునిచ్చినా చైనా సానుకూలంగా స్పందించడం లేదు. డోక్లామ్ పీఠభూమి తమదేనంటూ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోంది. పైపెచ్చు రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు భూటాన్ సేనలకు మద్దతుగా ఆ ప్రాంతానికి వచ్చిన భారత దళాలే భూటాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయంటూ బుకాయిస్తోంది. డోక్లామ్పై చైనాతో సంప్రదింపులకు సిద్ధమేనని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ 11న ప్రతిపాదించినా ఆ దేశం ఆసక్తి ప్రదర్శించలేదు. డోక్లామ్పై చైనా ఆడుతున్న దొంగాటపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ భారత్, చైనా మధ్య రోజురోజుకూ ముదురుతున్న వివాదం డోక్లామ్ ప్రాంతం నుంచి ఉభయ పక్షాలూ మొదట తమ సేనలను ఉపసంహరించుకుంటే వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని గురువారం పార్లమెంటులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాల్సిన చైనా ఉద్రిక్తతలు మరింత పెంచేలా జవాబిచ్చింది. సుష్మ అబద్ధమాడారంటూ తన తెంపరితనాన్ని చాటుకుంది. చైనాకు నిజంగా ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఇలా స్పందించేది కాదనీ, సిక్కిం సెక్టార్లో ఉద్రిక్తతలు కొనసాగాలనే కోరుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉభయ దేశాల దళాలూ ఈ ప్రాంతం నుంచి వైదొలగాలని సుష్మ ప్రతిపాదిస్తుండగా.. భారత దళాలు ఉపసంహరిస్తేనే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉంటుందని చైనా చెబుతోంది. అంతేగాక భారత్ను పలుచన చేసి మాట్లాడటానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’తో హెచ్చరికలు చేయిస్తోంది. 1962 యుద్ధంలోనే భారత్ వెనకబడిపోయిందనీ, అప్పటితో పోల్చితే చైనా రక్షణపరంగా బాగా బలోపేతమైందనీ, ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధమే వస్తే భారత్ తీవ్రంగా నష్టపోతుందని ఈ పత్రిక పదేపదే ‘భయపెట్టే’ ప్రయత్నాలు చేస్తోంది. మంచుకొండల్లో ఎప్పటిదాకా ఈ వేడి? 1986లో భారత్, చైనా మధ్య అరుణాచల్ప్రదేశ్ ప్రాంతంలోని సుమ్దొరాంగ్ చూలో రాజుకున్న వివాదం దాదాపు ఏడాది పాటు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈసారి భారత్కు ఎంతో కీలకమైన సిలిగురి కారిడార్(కోడిమెడ) దగ్గరలో రాజుకున్న నిప్పురవ్వలు మంటలుగా మారకుండా ఎప్పుడు మామూలు పరిస్థితులు ఏర్పడతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నవంబర్లో జరిగే చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ(కాంగ్రెస్) ముగిసే వరకూ డోక్లామ్ వివాదం రగులుతూనే ఉంటుందని భారత మాజీ జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి శివశంకర్ మీనన్ అభిప్రాయపడుతున్నారు. ‘‘చైనా అధ్యక్షుడు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) ప్రధాన కార్యదర్శి జిన్పింగ్.. పార్టీ 19వ జాతీయ కాంగ్రెస్ నాటికి బలమైన నేతగా నిలబడటమేగాక పొరుగుదేశాల విషయంలో కరకుగా వ్యవహరించే పాలకునిగా కనిపించాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే.. సీపీసీ కాంగ్రెస్ వరకూ డోక్లామ్ ఉద్రిక్తతలు కొనసాగుతాయి’’ అని మీనన్ చెప్పారు. అయితే ఈ నెలాఖరులో బీజింగ్లో జరిగే బ్రిక్స్ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా ఉన్నతాధికారులతో భేటీ సందర్భంగా డోక్లామ్పై చర్చించే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. అప్పుడు అరుణాచల్ సరిహద్దులో.. 1986లో ఇలాగే భారత్–చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధ వాతావరణం కనిపించింది. అరుణాచల్ప్రదేశ్ సమీపంలోని సుమ్దొరాంగ్ వద్ద జరిగిన ఓ సంఘటన కారణంగా ఈ ప్రాంతంలోని సరిహద్దులో భారత్, చైనాలు వేల సంఖ్యలో తమ సేనలను ఏడాదిపాటు సమీకరించారు. తర్వాత ఉభయ దేశాల మధ్య చర్చలు జరిగి ఉద్రిక్తతలు చల్లారడానికి ఎనిమిదేళ్లు పట్టింది. దీని ఫలితంగా అప్పట్నుంచి ఇప్పటి వరకూ జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్ప్రదేశ్ వరకూ 3,844 కిలోమీటర్ల సరిహద్దులో శాంతియుత వాతావరణం కొనసాగింది. తాజాగా డోక్లామ్తో సిక్కిం సెక్టార్ మళ్లీ వేడెక్కింది. వాచ్ టవర్తో వివాదం! 2014లో డోక్లామ్లో నిర్మించిన సైనిక వాచ్ టవర్కు రోడ్డు నిర్మించాలన్న చైనా సర్కారు నిర్ణయమే ఈ వివాదానికి దారితీసి ఉండొచ్చని చైనాలోని ఓ ప్రముఖ ఇంటర్నెట్ బ్లాగ్ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో అంతంతమాత్రంగా ఉన్న భూటాన్ సేనలను గమనించిన చైనా 2007 తర్వాతే డోక్లామ్ పీఠభూమిని తన అధీనంలోకి తెచ్చుకుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘‘డోక్లామ్ ఎప్పుడూ చైనా అంతర్భాగమేగానీ 2007 దాకా భూటాన్ అధీనంలో ఉండేది. ఆ తర్వాతే పూర్తిగా చైనా చేతికి చిక్కింది. 1890 బ్రిటన్–చైనా ఒప్పందం ప్రకారం ఈ పీఠభూమి చైనాకే చెందినా కొన్నేళ్ల క్రితం ఇక్కడ భూటాన్ రెండు వాచ్ టవర్లు నిర్మించి తన అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో చైనా 2007లో వాటిని ధ్వంసం చేసి అదే చోట కొత్త టవర్లు నిర్మించింది’’ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వాచ్ టవర్లకు రోడ్లు వేస్తున్న క్రమంలోనే ఈ వివాదం రాజుకుంది. మన ఆయుధ సామగ్రి పదిరోజులకే కాగ్ నివేదిక డోక్లామ్ వద్ద భారత్–చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ఆయుధ సామగ్రిపై కాగ్ ఇచ్చిన తాజా నివేదిక చర్చనీయాంశమైంది. యుద్ధం వస్తే మన ఆర్మీ వద్దనున్న ఆయుధ సామగ్రి పది రోజుల్లోనే ఖర్చయిపోతుందని ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఈ విషయాన్ని 2013లోనే గుర్తించి వెలుగులోకి తెచ్చినా గత నాలుగేళ్లలో ఎలాంటి మార్పు కనిపించలేదని కాగ్ పేర్కొంది. మరోవైపు చైనా తన ఆయుధ సామగ్రిని గణనీయంగా పెంచుకుంటోంది. రక్షణ మంత్రిత్వశాఖ అధీనంలోని 41 ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీల ద్వారా భద్రతా దళాలకు ఆయుధ సామగ్రి అందుతోంది. ఈ ఫ్యాక్టరీలకు రక్షణ ఉత్పత్తుల తయారీలో 200 ఏళ్లకు పైగా అనుభవం ఉందని చెబుతున్నా.. 2013 నుంచి ఆర్మీకి సరఫరా చేసిన ఆయుధ సామగ్రి నాణ్యత నాసిరకంగా ఉందని కాగ్ స్పష్టంచేసింది. 127 ఏళ్ల వివాదం డోక్లామ్తో చైనా–భూటాన్–భారత్ మధ్య ఏర్పడిన ఈ వివాదానికి నూటా పాతికేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1890లో టిబెట్–సిక్కింలకు సంబంధించిన విషయాలపై ఆనాడు భారత్ను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం–క్వింగ్ (చైనా సార్వభౌముల) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఛుంబి లోయ వెంట అంతర్జాతీయ సరిహద్దును నిర్ణయించారు. ఆ తర్వాత కూడా టిబెట్–భూటాన్ మధ్య సరిహద్దు వివాదాస్పదంగానే ఉండేది. దానికి చైనా–భూటాన్–భారత్ కలిసే సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్ (ట్రై జంక్షన్ ) కేంద్రంగా మారింది. చైనాతో భూటాన్కు ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో ఈ వివాదంలో భారత్ సహకారాన్ని ఆ దేశం కోరుతోంది. భారత్–భూటాన్ మధ్య అనేక ఒప్పందాలున్నాయి. చైనా అధీనంలోని డోక్లామ్ పీఠభూమిలో భారీ సైనిక వాహనాల కోసం రోడ్డు వేసేందుకు గతనెల 16న చైనా బలగాల సహాయంతో యంత్రాలను తరలించారు. తమ భూభాగంలోకి చొచ్చుకు రావడంపై భూటాన్ ఆర్మీ అభ్యంతరం తెలపడంతో పాటు వారిని వెనక్కు పంపేందుకు భారత్ సైన్యం సాయం కోరింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు జూన్ 18న భారత్ సేనలు అక్కడకు చేరుకున్నాయి. ఇది కొనసాగుతుండగానే గతనెల 28న సిక్కిం సెక్టార్లోకి చైనా ప్రవేశించినట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రదేశం కూడా ట్రై జంక్షన్కు సమీపంలోనే ఉండటం భారత్కు ఆందోళన కలిగించే అంశం. ఈ ప్రాంతమే ఈశాన్య రాష్ట్రాలతో దేశాన్ని కలుపుతుండటం గమనార్హం. నాథూలాలోనూ వివాదమే.. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ను, పశ్చిమబెంగాల్లోని కళింపాంగ్, చైనా అ«ధీనంలోని టిబెట్ యాతుంగ్ను కలిపేదే నాథూలా మార్గం. టిబెట్ భాషలో నాథూలా అంటే వింటున్న చెవి అని అర్థం. చైనాతో 1962 యుద్ధం తర్వాత భారత్ దీన్ని మూసేసింది. ఆనాటి నుంచి సరిహద్దుల్లో అతిక్రమణలు కొనసాగుతూనే వచ్చాయి. అయితే 1967లో నాథూలా సమీపంలోని భూభాగాన్ని చైనా ఆక్రమించే ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ పోరులో 400 మంది చైనా సైనికులు చనిపోగా.. భారత్ 70 మంది జవాన్లను కోల్పోయింది. ఈ మార్గాన్ని 2006లో భారత్ తెరిచింది. డోక్లామ్ వద్ద ఇరుదేశాల ఉద్రిక్తతల మధ్య భారత్ నుంచి మానససరోవర్ యాత్రికులు వెళ్లకుండా నాథూలా మార్గాన్ని చైనా మూసేసింది. భూటాన్–చైనాలు 470 కి.మీ. సరిహద్దును కలిగి ఉన్నాయి. 1972–1984 మధ్యలో భారత్ సహకారంతో భూటాన్ చైనాతో సరిహద్దు చర్చలు జరిపింది. ఈ ప్రాంతంలో శాంతిని, యథాతథ స్థితిని కొనసాగించేందుకు 1988, 1998లలో ఈ దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. -
అది భారత్, చైనాకు నష్టమే: అమెరికా
వాషింగ్టన్: భారత్, చైనా దేశాల మధ్య కొనసాగుతోన్న సరిహద్దు వివాదాలపై అమెరికా మరోసారి స్పందించింది. యుద్ధానికి దిగితే ఇరు దేశాలకు నష్టమేనని, నేరుగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా రక్షణ విభాగం హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆ శాఖ అధికార ప్రతినిధి గ్యారీ రోస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పొరుగుదేశం చైనా దురాక్రమణలను ఏమాత్రం సహించేది లేదని భారత్ పలుమార్లు సందేశాలు పంపినా ప్రయోజనం లేకపోయింది. చైనా పదేపదే సరిహద్దు విషయాల్లో కయ్యానికి కాలుదువ్వడాన్ని ఆమెరికా సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిక్కింలోని డోక్లామ్ లో చైనా రోడ్డు నిర్మించ తలపెట్టడంతో భారత్ రంగంలోకి దిగి వారి ఆధిపత్యాన్ని అడ్డుకుంటోంది. గత నెల నుంచి చైనాను పలుమార్లు హెచ్చరించినా వెనక్కి తగ్గకపోగా, సరిహద్దు వివాదానికి ఆజ్యం పోస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని భావించిన పెంటగాన్ బృందం చైనా ప్రభావాన్ని తగ్గించే యత్నాల్లో బిజీగా ఉందని ఓ టాప్ కమాండర్ చెప్పారు. చైనా తమ సైన్యాన్ని ఆధునికీకరించడంతో పాటు ఆర్థికపరమైన అంశాల్లో సరిహద్దు దేశాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తుందని గ్యారీ రోస్ చెప్పారు. బీజింగ్లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరుకానున్నారు. ఆ పర్యటనలో భాగంగా డోక్లామ్ వివాదంపై చైనా ప్రతినిధులతో దోవల్ చర్చించనున్నట్లు సమాచారం. నేరుగా ఇరుదేశాల ప్రతినిధులు చర్చించి, సామరస్యపూర్వకంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని లేని పక్షంలో ఇరుదేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. -
భారత్ ఇలా చేయొద్దు..వెంటనే తగ్గాలి: చైనా
బీజింగ్: భారత్ తన రాజీకయ లక్ష్యాలకోసం సిక్కింలోని డోక్లామ్ భూభాగాన్ని పాలసీ టూల్గా ఉపయోగించుకోవద్దని చైనా చెప్పింది. ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు పెరగకుండా ఉండాలంటే భారత్ వెంటనే డోక్లామ్లోని తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలని చైనా విదేశాంగ శాఖ కోరింది. విదేశాంగ వ్యవహారాల విషయంలో తమకు భారత్కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని, వీటిపై ముందుకు వెళ్లాలంటే ముందు భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, అప్పటి వరకు తమ మధ్య సంబంధాలపై ఎలాంటి సమాధానం ఇవ్వలేమని పేర్కొంది. 'అక్రమంగా భారత సరిహద్దు సేనలు డోక్లామ్కు చేరుకున్నాయని తెలిశాక చైనాలోని పలువురు విదేశాంగ ప్రతినిధులు షాకయ్యారు. ఈ విషయం నిజమేనా అని తెలుసుకోవాలనుకుంటున్నారు' అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి లూకాంగ్ మీడియాకు తెలిపారు. రాజకీయ లక్ష్యాలకోసం భారత్ ఇలాంటి విధానం ఎంచుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. 'భారత్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితిని భారత్ అర్థం చేసుకొని వెంటనే అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన తన సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాం' అని ఆయన పేర్కొన్నారు. -
మళ్లీ బరితెగించిన చైనా మీడియా
బీజింగ్: చైనా మీడియా మరింత హద్దు మీరుతోంది. ఒక్క సిక్కింలోని డోక్లామ్లోనే కాకుండా ఇప్పుడు మరిన్ని ప్రాంతాల విషయంలో రాద్ధాంతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. డోక్లామ్ మాత్రమే కాకుండా నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాలను కూడా భారత భూభాగంగా చైనా గుర్తించబోదంటూ రెచ్చగొట్టేలాగా కథనాలు వెలువరించింది. చైనాలో గ్లోబల్ టైమ్స్ అనే మీడియా సంస్థ తన కథనంలో చైనా కేవలం డోక్లామ్ భూమినే కాకుండా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఇతర భూభాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని, వాటిని భారత భూభాగంగా గుర్తించబోదని పేర్కొంది. అంతేకాదు, తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు యుద్ధానికి కూడా వెనుకాడబోమంటూ మరోసారి రెచ్చగొట్టేలా కథనం వెలువరించింది. అంతేకాదు, సరిహద్దు నిర్మాణం విషయంలో చైనా మరింత కఠినంగా ఉండాలని, వేగంగా సైన్యాన్ని సరిహద్దు వద్ద మోహరించి తిప్పాలని, డోక్లామ్ వద్ద సరిహద్దు నిర్మాణం పూర్తి చేయాలంటూ పేర్కొంది. -
మంత్రులు వెళ్లొచ్చు.. నేను వెళ్లకూడదా?: రాహుల్
న్యూఢిల్లీ: చైనా రాయబారితో సమావేశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ మంత్రులు చైనాకు వెళ్లిరావచ్చు కానీ, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ తరఫు నుంచి భారత్లో ఉన్న చైనా అంబాసిడర్ను తాను కలవకూడదా? అని రాహుల్ ప్రశ్నించారు. చైనా అంబాసిడర్ను కలవడంపై మోదీ ప్రభుత్వం ఎందుకు రాద్దాంతం చేస్తోందో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు చైనా హాస్పిటాలిటీ సర్వీసులను ఎందుకు వినియోగించుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వారంలో మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చైనా పర్యటనకు ఎందుకు వెళ్లారో చెప్పాలని అన్నారు. జాతీయ సమస్యల వివరాలను తనకు తెలియజెప్పడం ప్రభుత్వ కనీస ధర్మమని అన్నారు. చైనీస్ అంబాసిడర్, మాజీ భద్రతాసలహాదారు, ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు, భూటాన్ అంబాసిడర్లను తాను కలిసినట్లు వెల్లడించారు. -
మేం చెప్తుంటే భారత్ వినట్లే.. ఇక తప్పదు: చైనా
బీజింగ్: సిక్కిం సెక్టార్ దోక్లామ్ విషయంలో తాము చెప్పే విషయం భారత్ వినడం లేదని, అందుకే ఇక చైనా బలవంతంగానైనా సైనిక చర్యతో ముందుకు వెళ్లనుందని చైనా నిపుణుడు హు జియాంగ్ చెప్పారు. గత మూడు వారాలుగా డోక్లామ్ విషయంలో భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులపాటు ఇరు దేశాల మధ్య అప్రమత్తత ఉండటం ఇదే తొలిసారి. ‘చారిత్రక అంశాలు వివరించడం ద్వారా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకు చైనా అత్యుత్తమ ప్రయత్నాలు చేస్తోంది. కానీ భారత్ మాత్రం వినడానికి నిరాకరించింది. అందుకే ఈ సమస్య పరిష్కారం కోసం చైనాకు సైనిక చర్య తీసుకోవడం తప్ప ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో ఉన్నప్పుడు ఎందుకు భారత్ చైనాను రెచ్చగొట్టిందంటే తాము చైనాను నిలువరించగలం అని అమెరికా ముందు రుజువు చేయడానికే. డోనాల్డ్ ట్రంప్ తన కంటే ముందు అధికారంలో ఉన్న బరాక్ ఒబామాను అస్సలు ఇష్టపడే వ్యక్తి కాదు. ఒబామా భారత్ను ఎందుకు విశ్వసించేవారంటే ఇరు దేశాలు ఒకే విధమైన విలువలు పంచుకునేవి. కానీ, ట్రంప్ మాత్రం అలా కాదు.. భారత్ను విలువైన భాగస్వామిగా ట్రంప్ భారత్ను గుర్తించడు. ఎందుకంటే బీజింగ్ను ఎదుర్కొనే విషయంలో భారత్ బలహీనమైనది’ అని అంటూ జియాంగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.