fighter
-
హెజ్బొల్లాపై పోరు: ఆరుగురి ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్ సరిహద్దు సమీపంలో బుధవారం జరిగిన దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందినట్లు సైన్యం వెల్లడించింది.‘‘దక్షిణ లెబనాన్లో జరిగిన యుద్ధంలో ఆరుగురు సైనికులు మృతిచెందారు’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటివరకు లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లాతో చేస్తున్న యుద్ధంలో 47 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించటం గమనార్హం.🔴Eliminated: Muhammad Musa Salah, Ayman Muhammad Nabulsi and Hajj Ali Yussef Salah—Hezbollah’s Field Commanders of Khiam, Tebnit and Ghajar were eliminated in two separate strikes. These terrorists directed many terror attacks against Israelis, and were responsible for the…— Israel Defense Forces (@IDF) November 13, 2024 ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతికి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. మరోవైపు.. లెబనాన్లోని హెజ్బొల్లాకు వ్యతిరేకంగా యుద్ధంలో ఎలాంటి సడలింపు ఉండదని ఇజ్రాయెల్ కొత్త రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం.💔 pic.twitter.com/FGY2iDlvaA— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 13, 2024 సెప్టెంబరు 23 నుంచి లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలపై బాంబు దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం వేగం పెంచింది. ప్రధానంగా దక్షిణ బీరుట్, దేశంలోని తూర్పు, దక్షిణాన ఉన్న హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అక్టోబర్ 7, 2023 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు పాలస్తీనా మిత్రపక్షం హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. -
దీపావళి మర్నాడు.. హింగోట్ యుద్ధంలో 15 మందికి గాయాలు
ఇండోర్: మనదేశంలో విభిన్న సంప్రదాయాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని ఎంతో వింతగా అనిపిస్తాయి. ఇటువంటి వింత సంప్రదాయం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కొనసాగుతోంది. దీపావళి మర్నాటి రోజున ఇండోర్ జిల్లా గౌతమ్పురాలో సంప్రదాయం పేరుతో కళంగి- తుర్రా సమూహాల మధ్య హింగోట్ యుద్ధం శుక్రవారం జరిగింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ యుద్ధాన్ని వీక్షించేందుకు ఇండోర్, ఉజ్జయిని, ధార్, దేవాస్ సహా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో దీపావళి మర్నాడు ఈ తరహా యుద్ధం జరిగే ఏకైక ప్రదేశం గౌతమ్పురా. ఈ యుద్ధంలో 15 మందికి పైగా యోధులు మరియు ప్రేక్షకులు గాయపడ్డారు.ఇండోర్ హింగోట్ యుద్ధం చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం స్టేడియం ప్రాంతంలో 25 అడుగుల ఎత్తులో నెట్ను ఏర్పాటు చేశారు. యుద్ధభూమిలో భద్రతను దృష్టిలో ఉంచుకుని, 300 మందికి పైగా పోలీసులను మోహరించారు. దీంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.గౌతమ్పురాను గౌతమ ఋషి నగరంగా పరిగణిస్తారు. ఏళ్ల తరబడి సాగుతున్న హింగోట్ యుద్ధం ఎలాంటి ప్రచారం లేకుండానే ఉత్కంఠభరితంగా సాగుతుంటుంది. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి వేలాది మంది ప్రేక్షకులు హింగోట్ యుద్ధాన్ని వీక్షించేందుకు తరలివస్తుంటారు. ఈ సారి ఈ యుద్ధాన్ని చూసేందుకు వచ్చేవారితో మైదానం మొత్తం నిండిపోయింది. హింగోట్ యుద్ధంలో ముందుగా ఇరువర్గాల యోధులు డప్పుల మోతతో ఊరేగింపుగా వచ్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తలపై శిరస్త్రాణం, చేతుల్లో కవచాలు, నిప్పుల బాణాలు భుజాలకు తగిలించుకుని యోధులు మైదానంలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో 50 నుండి 60 మంది యోధులు ముఖాముఖి తలపడ్డారు. సుమారు గంటపాటు జరిగిన ఈ యుద్ధం రాత్రి 7.30 గంటలకు ముగిసింది. ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు -
చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి : ఆమె మహిళలకు ఆదర్శం
సాక్షి, ముంబై: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న రజక బాంధవులు వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్రను గురించి స్మరించుకున్నారు. బోరీవలిలో....గొరాయి రజక మిత్రమండల్ అధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వీరనారి చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. దొరలకు ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మకు జోహార్లు చెబుతూ.... కొవ్వొత్తులు వెలిగించి పురవీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు. ఐఈసందర్భంగా మండల్ కోశాధికారి చింతకింది మల్లేష్ మాట్లాడుతూ.... కోఠిలోని మహిళా యునివర్సిటికీ చాకలి ఐలమ్మ పేరిట నామకరణం చేయడం అభినందనీయమని, ఐలమ్మ ధైర్య, సాహసాలు ప్రతి మహిళకు ఆదర్శమని పేర్కొన్నారు. దీంతో బావితరాలకు ఐలమ్మ పేరు చిరస్మరణీయంగా మిగిలి పోతుందని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ అధ్యక్షురాలియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు ముత్యాల బాల నరసయ్య, సెక్రటరీ బాగోలా అంజయ్య,కోశాధికారి చింతకింది మల్లేశ్, సంఘం సభ్యులు ముత్యాల భూ లచ్చయ్య, ముత్యాల స్వామి, యాదగిరి నిమ్మరాజు, మహిళలు నిమ్మరాజు భాగ్యలక్ష్మి, ముత్యాల వసంత, కిచిగారి కళావతి, చింతకింది కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు అంటాప్హిల్లో... ముంబై, అంటాప్ హిల్లోని తెలుగు రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఆమె చేసిన త్యాగాలు, సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నదిగోటి వెంకటేష్, ఉపాధ్యక్షుడు మరిపెళ్లి మల్లేష్ కోశాధికారి భూమ చిన్న నర్సింహ, ఉప కోశాధికారి భూమా యాదయ్య, కార్యవర్గ సభ్యులు అక్కనపెల్లి నరసింహ, తాందారి వెంకన్న, బొమ్మపాలెం వెంకటేష్బాసవాడ కృష్ణ, అయితే రాజు మల్లేష్, పొన్న సోమయ్య, రెడ్డిపల్లి ఎల్లయ్య, భూమా వెంకటేష్, రెడ్డిపల్లి లింగయ్య, చర్లపల్లి వెంకటే‹Ù, వడ్డెబోయిన నాగరాజు, మనపెద్ది శ్రీనివాస్, భూమా అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కాందివలిలో... పశ్చిమ కాందివలి చార్కోప్లోని బుద్దవిహార్లో ముంబై రజక ఫౌండేషన్ అధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో రజక ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చింతల మహేందర్, ముత్యాల సంతోష్, మదనాల సత్తన్న, మదనాల నర్సింహులు, అక్కోల శ్రీనివాస్, గోలి శంకర్, స్వామి నల్లూరి, పోగుల రాజేశ్, గాయకులు దుబ్బాక నరేష్ లక్ష్మణ్ ఎనగందుల మమత, దవనపల్లి సుమ, కూన స్వరూప, శోభ, పద్మ, పూజ, లలిత తదితరులు పాల్గొన్నారు. -
Rajasthan: కూలిన మిగ్ 29 యుద్ధ విమానం.. పైలట్లకు తప్పిన ప్రమాదం
బార్మర్: రాజస్థాన్లోని బార్మర్లో ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఓలానియోక్లోని ధాని సమీపంలో యుద్ధ విమానం మిగ్ 29కు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నాగనా పోలీస్స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం నుంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.మిగ్ 29 యుద్ధ విమానం భారతదేశంలోని ముఖ్యమైన విమానాలలో ఒకటి. ఈ జెట్ విమానం బార్మర్లో రాత్రిపూట సాధారణ శిక్షణ మిషన్లో సాంకేతిక లోపానికి గురైందని వైమానిక దళం తెలిపింది. ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. మిగ్ 29 విమానంలో మంటలు చెలరేగిన వీడియోను డిఫెన్స్ కోర్ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. During a routine night training mission in Barmer sector, an IAF MiG-29 encountered a critical technical snag, forcing the pilot to eject. The pilot is safe and no loss of life or property was reported. A Court of Inquiry has been ordered.— Indian Air Force (@IAF_MCC) September 2, 2024మిగ్ 29 విమానం 1987 నుండి అంటే దాదాపు 36 సంవత్సరాలుగా భారత వైమానిక దళం సేవలో ఉంది. సోవియట్ యూనియన్ నుంచి భారత్ ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. ఈ విమానాన్ని పలుమార్లు నవీకరించారు. విమానంలోని ప్రాథమిక నిర్మాణం మినహా దాదాపు ప్రతిదీ మార్చారు. ఇందులో కొత్త కాక్పిట్, నూతన రాడార్, కొత్త ఇంధన ట్యాంక్ ఉన్నాయి. కొత్త ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కూడా అమర్చారు. కొత్త క్షిపణులను అమర్చడం ద్వారా దీనికి పూర్తిగా ఆధునిక రూపాన్నిచ్చారు.మిగ్ 29 వేగంగా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఆరు నిమిషాల్లో లక్ష్యన్ని ఛేదించగలదు. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. బాలాకోట్ ఘటన సమయంలో కూడా తీవ్రవాద శిబిరంపై వైమానిక దాడిలో మిగ్ 29 పాల్గొంది. ఈ విమానంలో రెండు ఇంజన్లు ఉంటాయి. పరిమాణంలో చిన్నదిగా ఉన్నా చాలా చురుకైనది. ఇది నాల్గవ తరం యుద్ధ విమానం. గంటకు దాదాపు 2,500 కిలోమీటర్ల వేగంతో ఎగిరే సామర్థ్యం దీని సొంతం.Another crash this time IAF's MIG-29 in Barmer, Rajasthan. Pilot is safe, and no damage reported on the ground. More details to follow. pic.twitter.com/5hkXpUt9lY— Defence Core (@Defencecore) September 2, 2024 -
Daughter Save Father: సాయుధులతో ఒంటరిగా పోరాడి..
పదిహేడేళ్ల అమ్మాయి. ఏడో తరగతితోనే చదువు ఆపేసింది. పనికిమాలిన పిల్ల అంటూ ఊర్లో అంతా హేళన చేశారు. తనను ఎవరు ఏమన్నా నవ్వుతూ భరించింది. కానీ, కన్నవాళ్లకు ఆపదొస్తే చూస్తూ ఊరుకుంటుందా?. శివంగిల దూకి రక్షించుకుంది.ఛత్తీస్గఢ్ జారా గ్రామంలో ఆగష్టు 7వ తేదీ సాయంత్రం.. సోమ్దర్ కొర్రం అనే వ్యక్తి ఇంటిపైకి ఆయుధాలతో ఎనిమిది మంది వచ్చారు. పదునైన ఆయుధాలతో మెడ మీద వేటు వేయాలని ప్రయత్నించారు. కానీ, ఆయన తప్పించుకోవడంతో అది ఛాతీలో దిగబడింది. ఆ వెంటనే మరో దెబ్బతో ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నించారు. అయితే..ఇంట్లో తండ్రికి భోజనం వడ్డిస్తూ ఆ అలికిడి విన్న కొర్రం కూతురు సుశీల.. ఒక్క దూటున వాళ్ల మధ్యకు చేరింది. తండ్రిని చుట్టుముట్టిన నలుగురు ఆగంతకులపై పిడిగుద్దులు గుప్పించింది. ఆ పెనుగులాటలో ఒకరి చేతిలో గొడ్డలి లాక్కుని.. కింద రక్తపు మడుగులో ఉన్న తండ్రికి రక్షణ కవచంలా నిలిచింది. అయితే..బయట నలుగురు కాపలా.. లోపల నలుగురు. వాళ్లతో ఎక్కువసేపు ఒంటరిగా పోరాడలేనని ఆమెకు అర్థమైంది. సాయం కోసం గట్టి గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరారు. అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సాయంతో జగదల్పూర్లోని దిమ్రాపాల్ ఆస్పత్రికి తీవ్రంగా గాయపడ్డ తండ్రిని తీసుకెళ్లింది. సకాలంలో చికిత్స అందడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో.. ఇది మావోయిస్టుల పనని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పోలీస్ విచారణలో కాదని తేలింది. భూ తగాదాలతో ఆయన చిన్న తమ్ముడే ఈ దాడి చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.अपने पिता की जान बचाने के लिए एक बेटी 8 हथियार बंद नक्सलियों से भिड़ गई... बहादुर बेटी की कहानी देख लीजिए @gyanendrat1#Chhattisgarh #Narayanpur #NaxalAttack #CGNews #SeedheMuddeKiBaat #GyanendraTiwari #VistaarNews pic.twitter.com/d6PFOlsOnf— Vistaar News (@VistaarNews) August 6, 2024 Video Credits: Vistaar News -
కూటమిలో కత్తులు
సాక్షి నెట్వర్క్ : ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకుంటామని ఇన్నాళ్లూ చెబుతూ వచి్చన టీడీపీ, జనసేన మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజును మార్చాలని టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై రెండురోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబు క్యాంప్ వద్దకు వెళ్లి మరీ బొరగం వర్గీయులు ధర్నా చేశారు. పేరుకే రిజర్వుడు నియోజకవర్గమైనా ఇక్కడ పెత్తనమంతా బాబు, పవన్ సామాజికవర్గాలదే. దీంతో బాబు వర్గం బొరగం వర్గీయుల్లో అసమ్మతిని రాజేసింది. ప్రతిపనికీ పవన్ సామాజిక వర్గం వద్దకు వెళ్లి అడగలేమని, ఇక్కడ అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలని బాబు సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ముందు సీటు ఎవరికి ఇచ్చినా ఓకే అన్న బొరగం భీమవరంలో అంజిబాబు తరహాలో తనను జనసేనలో చేర్చుకుని టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే అనూహ్యంగా జనసేన నేతకు ఇవ్వడంతో బొరగంతోపాటు బాబు సామాజికవర్గ నేతలు కంగుతిన్నారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని పలువురు సీనియర్ నాయకులు రాజకీయ నైరాశ్యంలో మునిగిపోయారు. టికెట్ ఆశ చూపి చివరకు రూ.కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులకు పెద్దపీట వేయడంతో దశాబ్దాల తరబడి పార్టీ కోసం రెక్కలుముక్కలు చేసుకున్న నేతలు లబోదిబోమంటున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడికి బాబు మొండిచేయి చూపారు.ఉమామహేశ్వరనాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. హనుమంతరాయచౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కోలుకోలేని దెబ్బతిన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేత ప్రభాకర్ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎంపీగా చేసిన బీసీ నేత నిమ్మల కిష్టప్పనూ బాబు నట్టేటముంచారు. ► అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చకుంటే ఘోర పరాజయం తప్పదని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పింది. ఆదివారం కలికిరిలోని పార్టీ కార్యాలయంలో శంకర్ వర్గీయులు కిరణ్తో సమావేశమయ్యారు. శంకర్కి టికెట్ ఇవ్వకుంటే సహకరించబోమని స్పష్టం చేశారు. ► తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల క్రితం పశి్చమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం చైర్మన్, సినీ నిర్మాత బన్నీ వాసుకు ఘోర అవమానం జరిగింది. వేదిక ఎక్కుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. జనసేన ఇన్చార్జి అని చెప్పినా వినిపించుకోలేదు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులూ దీనిని పట్టించుకోలేదు. అవమానంగా భావించిన బన్నీ వాసు అక్కడి నుంచి ని్రష్కమించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బన్నీ వాసుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు (మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావమరిది)ని రాజీకి పంపారు. ఆయన వాసు దగ్గరకు వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వాసుకు జరిగిన అవమానంపై జనసైనికులు మండిపడుతున్నారు. ► ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అశోక్రెడ్డికి సీటు కేటాయించడంపై జనసేన నేత ఆమంచి స్వాములు కారాలుమిరియాలు నూరుతున్నారు. తాను ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. గిద్దలూరు జనసేన ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబుతోనూ ఆయనకు పొసగడం లేదు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న స్వాములు వెంటే ఆ సామాజికవర్గం ఉండడంతో టీడీపీ అభ్యర్థి అశోక్రెడ్డి ఆందోళన చేస్తున్నారు. ► కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ పార్థసారథికి సహకరించేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రకా‹Ùజైన్ తేలి్చచెప్పారు. కూటమిలో ఆ ఆరు ఓసీలకే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సామాజిక న్యాయానికి పాతరేసింది. విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, మైలవరం, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీలకే సీట్లు కేటాయించింది. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఐదు టీడీపీ అధినేత సొంత సామాజికవర్గానికే కేటాయించారు. ఒకటి పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి ఇచ్చారు. దీంతో బలహీనవర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాస్తవానికి విజయవాడ పశి్చమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ. చంద్రబాబు తొలుత మైనార్టీలకు సీటు ఇస్తామని చెప్పి, పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆ పార్టీ తన సామాజికవర్గానికి చెందిన సుజనా చౌదరికే టిక్కెట్టు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఈ సీటు తొలుత జనసేనకు కేటాయించారు. ఇక్కడ పదేళ్లుగా బీసీ అయిన పోతిన మహేష్ డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ జెండా మోశారు. తీరా చివరకు బీజేపీకి సీటు ఇవ్వడంతో పోతిన నైరాశ్యంలో కూరుకుపోయారు. సామాజిక న్యాయం పాటించిన వైఎస్సార్ సీపీ సామాజిక న్యాయం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ల కేటాయింపులో చేసి చూపారు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ (కమ్మ), సెంట్రల్లో వెలంపల్లి శ్రీనివాస్ (వైశ్య), విజయవాడ వెస్ట్లో షేక్ ఆసిఫ్ (ముస్లిం మైనార్టీ), పెనమలూరులో జోగి రమేష్ (గౌడ–బీసీ), మైలవరంలో సర్నాల తిరుపతిరావు (యాదవ బీసీ), గన్నవరంలో వల్లభనేని వంశీ (కమ్మ)కి టికెట్లు ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్కు విశేష ఆదరణ లభిస్తోంది. పిఠాపురంలో జనసేనానికి అసమ్మతిసెగ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో అసమ్మతి సెగ రేగింది. స్థానికేతరులు పిఠాపురంలో పెత్తనం చెలాయిస్తున్నారంటూ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ పార్టీ గొల్లప్రోలు మండల నేత అరవ వెంకటాద్రి నాయుడు (భారతీయుడు) ఆదివారం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి పోటీకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్థానికేతరుడే కావడంతో లేఖ పార్టీలో కలకలం రేపింది. -
తేజస్ మార్క్1ఏ సక్సెస్
సాక్షి బెంగళూరు: అధునిక యుద్ధసామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్1ఏ తేలికపాటి యుద్ధవిమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. గురువారం బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని 18 నిమిషాలపాటు గాల్లో నిర్దేశిత ‘పథం’లో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. తేజస్ ఎంకే1ఏ సిరీస్లో ఎల్ఏ5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హెచ్ఏఎల్లోని చీఫ్ టెస్ట్ పైలెట్ గ్రూప్ కెపె్టన్ కెకె వేణుగోపాల్(రిటైర్డ్) ఈ విమానాన్ని నడిపారు. విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్తో అధునాతన యుద్ధవిమానాలను తయారుచేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. ‘‘ అంతర్జాతీయ పరిణామాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్తో స్వదేశీ 4.5 నూతనతరం యుద్ధవిమానాన్ని తయారుచేయడంలో హెచ్ఏఎల్ సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ, భారత వాయుసేన, రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థకు కృతజ్ఞతలు’ అని హెచ్ఏఎల్ చీప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్ చెప్పారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఆయుధాలు, ఆధునిక ఎల్రక్టానిక్ రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్, స్వీయ రక్షణకు జామర్ పాడ్లను దీనిలో అమర్చారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్1ఏలను తయారుచేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ‘ ఫ్లయింగ్ డ్యాగర్’, ‘ ఫ్లయింగ్ బుల్లెట్’ పేరుతో రెండు బృందాలు ఉన్నాయి. -
మరికొద్ది గంటల్లోనే ఫైటర్ వచ్చేస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?
హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్. ఫైటర్ మూవీ స్ట్రీమింగ్ డేట్ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే అంటే ఈనెవ 21న స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ చిత్రం తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించింది. మార్చి 21న అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం ఆడియోల్లోనూ స్ట్రీమింగ్కు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండునున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో యుద్ధ విమానాల విన్యాసాలు, వీఎఫ్ఎక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్.. ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా ఈ మూవీలో నటించారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. Ladies and Gentlemen, FIGHTER is all set for landing!! ✈️🔥 🤩 Fighter is releasing tonight at 12am on Netflix! pic.twitter.com/KYqnb3hKFL — Netflix India (@NetflixIndia) March 20, 2024 -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం పరీక్షల కాలం నడుస్తుండటం వల్ల థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. ఉన్నవాటిలో 'ఓం భీమ్ బుష్' కాస్త ఆసక్తికరంగా అనిపిస్తోంది. లాజిక్స్ కంటే కామెడీని నమ్ముకున్న ఈ చిత్రం ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి. మరోవైపు ఓటీటీలో కూడా ప్రస్తుతం 'హనుమాన్' హవా నడుస్తోంది. అలానే ఈ వారమైతే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. కానీ పలు డబ్బింగ్ చిత్రాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. (ఇదీ చదవండి: సింపుల్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగు స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్కి సిద్ధమైపోయాయి. అలానే పలు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మార్చి 18 నుంచి 24 వరకు) నెట్ఫ్లిక్స్ యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ సినిమా) - మార్చి 18 3 బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 21 ఫైటర్ (హిందీ మూవీ) - మార్చి 21 (రూమర్ డేట్) బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22 షిర్లే (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22 ద కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 22 హాట్స్టార్ అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 20 సాండ్ ల్యాండ్: ద సిరీస్ (జపనీస్ సిరీస్) - మార్చి 20 ఎక్స్-మ్యాన్ '97 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20 అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22 డేవీ & జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22 లూటేరే (హిందీ సిరీస్) - మార్చి 22 ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 24 అమెజాన్ ప్రైమ్ మరక్కుమ నెంజమ్ (తమిళ మూవీ) - మార్చి 19 ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా) - మార్చి 21 రోడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 21 జియో సినిమా ఓపెన్ హైమర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 21 బుక్ మై షో ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 19 ఆపిల్ ప్లస్ టీవీ పామ్ రాయల్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20 ఆర్గిల్లీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 23 (ఇదీ చదవండి: Priyanka Chopra: ఒక్క నెక్లెస్.. ఏకంగా అన్ని కోట్లు.. ఏంటంత స్పెషల్?) -
మనుమరాలిని విషనాగు నుంచి కాపాడి.. కన్నుమూసిన బామ్మ!
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లోని అందరినీ కంటతడి పెట్టించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి షాహ్గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్గుపూర్ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న బామ్మ, మనవరాలి మంచంపైకి ఒక భారీ నాగుపాము చేరింది. ఆ పాము మనుమరాలి వైపు కదులుతున్న విషయాన్ని గమనించిన బామ్మ దానిని చేత్తో పట్టుకుంది. వెంటనే ఆ విషనాగు బామ్మను కాటేసింది. ఈ సమయంలో బామ్మ ఆర్తనాదాలను విన్న కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే బామ్మను సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్కు తరలించారు. అయితే ఆ బామ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా పామును చేత్తో పట్టుకుని, మనుమరాలిని కాపాడున్న బామ్మ సాహసానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వీక్షకులు బామ్మ సీతాదేవి(72) తెగువకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె మనుమరాలు(24)కు ఎటువంటి హాని జరగలేదు. కాగా పాము కాటుకు బామ్మ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయకుండా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. -
బాబు లీల.. కేడర్ గోల
సాక్షి, అమరావతి: అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేస్తున్న హడావుడితో తెలుగుదేశం పార్టీ కేడర్లో అయోమయం నెలకొంది. తమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రోజుకో నేత పేరు.. అదీ సంబంధం లేని ప్రాంతాలకు చెందిన వారి పేర్లు వస్తుండటంతో కేడర్ నిర్ఘాంతపోతున్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఇప్పటికే పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మిగిలిన సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కసరత్తు కేడర్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారో, ఎందుకు అలా చేస్తున్నారో అర్థంకాక పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.ఐవీఆర్ఎస్ సర్వే అంటూ కేడర్కు వారి నియోజకవర్గానికి సంబంధం లేని కొత్త వ్యక్తుల పేర్లు చెప్పి వారు ఆ స్థానంలో పోటీ చేస్తే గెలుసారో లేదో చెప్పండని నిలదీస్తుండటంతో ఏమి చేయాలో కార్యకర్తలకు పాలుపోవడం లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సీటును వసంత కృష్ణప్రసాద్కి ఖరారు చేయడంతో ఉమా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పెనమలూరుకు సిద్ధంగా ఉండాలని ఉమాకు చంద్రబాబు సూచించారు.పెనమలూరులో అభ్యర్థి ఉమా అయితే సమ్మతమేనా అని ఫోన్లు వస్తుండడంతో కేడర్ తెల్లబోతోంది. ఉన్నట్టుండి ఉమాను ఇక్కడకు దిగుమతి చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడి ఇన్ఛార్జి బోడె ప్రసాద్ తనకు కాకుండా మరొకరికి సీటు ఇస్తే తాను చేతగానివాడిలా చూస్తూ ఊరుకోనంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దేవినేని ఉమా కూడా పెనమలూరులో కొందరు టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందని ఆరా తీస్తుండటంతో ఇదేమి పరిస్థితంటూ స్థానిక నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావును నిన్నటి వరకు చంద్రబాబు గాల్లో పెట్టారు. మొదటి జాబితాలో ఆయన పేరు గల్లంతైంది. ఇప్పడు ఆయన్ని గురజాల నుంచి నర్సరావుపేటకు మార్చాలనే ఆలోచన చేస్తున్నారు. నర్సరావుపేట టీడీపీ అభ్యర్థిగా యరపతినేని అయితే ఎలా ఉంటుందోనని ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. దీంతో అక్కడి ఇన్ఛార్జి చదలవాడ అరవింద్బాబు వర్గం లబోదిబోమంటోంది. మరోవైపు గురజాలలో వలస వచ్చిన నేత జంగా కృష్ణమూర్తి అభ్యర్థిత్వంపై సర్వే చేస్తున్నారు. గురజాలలో తనను కాదని ఉన్నట్టుండి జంగాను తేవడంతో యరపతినేని కారాలు మిరియాలు నూరుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అయితే ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం చేస్తుండడంతో ఉత్తరాంధ్ర టీడీపీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఆయన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తేవడం, ఆయన నిరాకరిస్తుండటం గందరగోళానికి దారితీసింది. విజయవాడ పశ్చిమ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. మరోవైపు ఆ సీటు తమదేనని జనసేన హడావుడి చేస్తోంది. ఈ మూడు శిబిరాలు నివ్వెరపోయేలా కొత్తగా ఎంకే బేగ్ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఆయన అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుండటంతో స్థానిక నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
హృతిక్ రోషన్కు తీవ్ర గాయాలు.. జూ ఎన్టీఆర్ 'వార్- 2' మరింత ఆలస్యం
ప్రముఖ బాలీవుడ్ కథా నాయకుడు హృతిక్ రోషన్ కాలికి గాయమైంది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేసి ఆయన తెలిపారు. నడుముకు ఒక బెల్ట్ పెట్టుకుని క్రచెస్ సాయంతో నిలుచున్న ఒక ఫోటోను ఆయన షేర్ చేశారు. గతంలో మీలో ఎంతమందికి ఈ క్రచెస్, వీల్ చైర్ అవరసమెచ్చింది..? ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి..? అని రాసుకొచ్చారు. గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ వంటి స్టార్స్తో పాటు అభిమానులు మెసేజ్లు చేస్తున్నారు. హృతిక్ త్వరగా కోలుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఫోటోలో హృతిక్ రోషన్ను గమనిస్తే ఆయనకు తీవ్రమైన గాయాలే అయినట్లు ఉన్నాయి. అందుకు గల కారణాలను మాత్రం ఆయన తెలపలేదు. ఫైటర్ షూటింగ్ సమయంలో ఏమైనా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆయన కాలికి గాయం కావడంతో కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబినేషన్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రం వార్-2 షూటింగ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. 'వార్' మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా పోటాపోటీగా నటించారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దీంతో 'వార్2'పై సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్ డేట్స్ కూడా ఇచ్చేశారు. త్వరలో షూటింగ్ అనుకుంటున్న సమయంలో హృతిక్ రోషన్కు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 'ఫైటర్' సినిమాతో హిట్ కొట్టారు హృతిక్ రోషన్. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణె ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం బాలీవుడ్లో ఇప్పటికి కూడా రన్ అవుతుంది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి!
జోర్డాన్లోని సైనిక స్థావరంపై డ్రోన్ దాడికి ప్రతిగా యూఎస్ మిలటరీ ఇరాక్లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలీషియా స్థావరాలపై బాంబు దాడి చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సిరియాలో జరిగిన యూఎస్ వైమానిక దాడుల్లో ఆరుగురు మిలీషియా ఫైటర్లు మరణించారు. వారిలో ముగ్గురు నాన్ సిరియన్లు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతు కలిగిన 85 మిలీషియా స్థావరాలపై అమెరికా ప్రతీకార వైమానిక దాడులను ప్రారంభించిందని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సైనిక వైమానిక దాడులు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్ దళాలు 125కు మించిన యుద్ధ సామగ్రితో 85కు మించిన లక్ష్యాలపై దాడి చేశాయి. అదే సమయంలో సిరియాలోని ఎడారి ప్రాంతాలు, ఇరాక్ సరిహద్దు సమీపంలో ఉన్న లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడిలో పలువురు మృతి చెందారని, చాలామంది గాయపడ్డారని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. It is bring reported that the #US has began air strikes on #Iraq Earlier we saw 5 B1 lancers flying from US towards Middle East region pic.twitter.com/bjGntkKz9I — Free Pakistan 🇺🇦 🇷🇺 🇮🇱 🇵🇸 🇺🇸 (@ukr69h) February 3, 2024 ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటనలో అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని అన్నారు. గత ఆదివారం జోర్డాన్లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు. శుక్రవారం డోవర్ ఎయిర్ఫోర్స్ బేస్లో వీర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. గత వారంలో జోర్డాన్లోని సైనిక స్థావరంపై జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు యూఎస్ సైనికులు మృతిచెందారు. ఈఘటనలో సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద గ్రూపులపై ప్రతీకార దాడులు ప్రారంభించారు. ARE WE AT WAR😳😳😳 The United States has begun a wave of airstrikes in Iraq and Syria. This is retaliation for a fatal drone attack that killed three soldiers. pic.twitter.com/JmJsM5Gpe3 — Graham Allen (@GrahamAllen_1) February 2, 2024 -
‘ఫైటర్’తో 14వ సారి 100 కోట్ల క్లబ్ లోకి హృతిక్ రోషన్!
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో 14వ సారి 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ చిత్రం విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ ఘనత సాధించింది. ఈ చిత్రంతో హృతిక్ కి మరో రికార్డ్ కూడా దక్కింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డే కి విడుదలై 100 కోట్ల గ్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది. మంచి పాజిటివ్ టాక్, హృతిక్ రోషన్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో ఫైటర్ మూవీ ఆడియన్స్ ని అలరిస్తోంది. (చదవండి: ఆదిపురుష్..కొన్ని సీన్స్ నచ్చలేదు: ప్రశాంత్ వర్మ) ఓవర్సీస్ లో సైతం ఫైటర్ మూవీ అద్భుతంగా రాణిస్తోంది.వార్ తర్వాత సింగిల్ డే లో 40 కోట్లు సాధించిన హృతిక్ రెండవ చిత్రంగా ఫైటర్ రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాలో సైతం హృతిక్ కెరీర్ లో ఫైటర్ హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన చిత్రంగా దూసుకుపోతోంది. ఫైటర్ చిత్రం సాధించిన రికార్డులు ఇంకా చాలానే ఉన్నాయి. హృతిక్ రోషన్ కెరీర్ లో ఫైటర్ చిత్రం వరుసగా 100 కోట్లు సాధించిన 10వ చిత్రంగా నిలిచింది. ఈ 100 కోట్ల పరంపర 2001లో కభీ ఖుషి కభీ గమ్ చిత్రంతో ప్రారంభం అయింది. ఈ చిత్రంతో పాటు క్రిష్, ధూమ్ 2, జోధా అక్బర్ చిత్రాలు కూడా అప్పట్లో 100 కోట్లు సాధించాయి. హృతిక్ రోషన్ కెరీర్ లో 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలు లివే! కభీ ఖుషి కభీ గమ్ క్రిష్ ధూమ్2 జోధా అక్బర్ 5.జిందా న మిలేగా దోబారా అగ్నిపథ్ క్రిష్ 3 బ్యాంగ్ బ్యాంగ్ మొహంజదారో కాబిల్ 11,సూపర్ 30 వార్ విక్రమ్ వేద ఫైటర్ -
దీపికా పదుకొణ్ మసాలా సాంగ్ను తొలగించిన 'ఫైటర్' టీమ్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ జోడీగా నటించిన ఫైటర్ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైంది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. సినిమా బాగుందని మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్తో రన్ అవుతుంది. కాగా, ఈ చిత్రం నుంచి ‘ఇష్క్ జైసా కుచ్’ సాంగ్ను తొలగించేశారు. ఈ సాంగ్ యూట్యూబ్లోకి వచ్చిన రోజు నుంచి దీపికా అందాలకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికే యూట్యూబ్లో సాంగ్ను చూసినవారు థియేటర్లో కూడా చూడొచ్చు అనుకుంటే ఫైటర్ మేకర్స్ షాక్ ఇచ్చారు. బిగ్ స్క్రీన్పై ఈ సాంగ్ కనిపించకపోయేసరికి వారిలో కొంతమేరకు నిరాశ కలిగింది. ఈ సాంగ్లో హీరోయిన్ దీపికా పదుకొణ్ విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. కానీ సినిమాలో ఆమె పాత్ర ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కీలకమైన పదవిలో ఉంటూ ఇలాంటి అసభ్యకరమైన సాంగ్లో చూపించడం కరెక్ట్ కాదని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైనల్గా ఆ సాంగ్ను దర్శక నిర్మాతలు సినిమా నుంచి తొలగించడం జరిగింది. గతంలో పఠాన్ సినిమాలో కూడా దీపికా పదుకొణ్ మితిమీరిన అందాల ప్రదర్శన ఇచ్చింది. అప్పుడు ఆమె దుస్తుల మీద కూడా వివాదం చెలరేగింది. కానీ ఆ సమయంలో షారుక్ ఖాన్ వివరణ ఇవ్వడంతో ఆ సాంగ్ థియేటర్లో కూడా రన్ అయింది. ప్రస్తుతం ఫైటర్ సినిమా విషయంలో ఎయిర్ ఫోర్స్ అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ‘ఇష్క్ జైసా కుచ్’ సాంగ్ను తొలగించేశారు. యూట్యూబ్లో మాత్రం ఈ సాంగ్ను చూడవచ్చు. సినిమా చూసిన తర్వాత ఇలాంటి దేశభక్తి సినిమాలో ఆ సాంగ్ లేకపోవడమే మంచిదని కూడా కామెంట్లు వస్తున్నాయి. -
హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాపై పబ్లిక్ టాక్
బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం ఫైటర్.దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఫైటర్ చిత్రంపై బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. సినిమా చాలా బాగుందని ఆయన తెలపారు. ఫైటర్ సినిమాను చాలా బ్రిలియంట్గా తెరకెక్కించాడని ఆయన తెలిపారు. ఈ సినిమాను మిస్ చేసేకోవద్దని ఆయన చెప్పారు. సోషల్మీడియాలో ఫైటర్ సినిమాకు 4.5 రేటింగ్ ఇచ్చారు.సినిమాకు అంతగా బజ్ లేకపోడంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేవని ఆయన తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ చిత్రం ద్వారా హ్యట్రిక్ కొట్టారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్తో పాటు డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి అన్నీ ఉన్నాయని తెలిపారు. సినిమా కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాలో షో టాపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు తరణ్ ఆదర్శ్. దీపికా పదుకోన్తో ఆయన కెమిస్ట్రీ సూపర్ అంటూ పేర్కొన్నారు. అనిల్ కపూర్ ఎప్పటిలా అద్భుతంగా నటించారని చెప్పారు. సెకండాఫ్ ఫైటర్ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఇందులో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్ ఉన్నట్లు చెప్పారు. హృతిక్ రోషన్ భారీ హిట్ కొట్టాడని మాస్ కా బాప్ అంటూ ఈ చిత్రంలోని బీజీఎమ్ సూపర్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. ఫైటర్ సినిమా మెగా బ్లాక్ బస్టర్ అని ఈ చిత్రంలోని గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ పనితీరు చాలా బాగుందని ఒక నెటిజన్ తెలిపాడు. దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియాల్ యాక్షన్ను ఇంతవరకు చూడలేదని ఒక నెటిజన్ తెలిపాడు. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. దీపికా పదుకొణె తన కెరీర్లో ఈ చిత్రం బెస్ట్గా ఉంటుంది. అనిల్ కపూర్ ఫైటర్ సినిమాకు ఆత్మలాంటివాడు. హృతిక్ రోషన్కు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమా అని నెటిజన్లు తెలుపుతున్నారు. #OneWordReview...#Fighter: BRILLIANT. Rating: ⭐️⭐️⭐️⭐️½#War. #Pathaan. Now #Fighter. Director #SiddharthAnand scores a hat-trick… Aerial combat, drama, emotions and patriotism, #Fighter is a KING-SIZED ENTERTAINER, with #HrithikRoshan’s bravura act as the topping… JUST DON’T… pic.twitter.com/t9fmssfw2P — taran adarsh (@taran_adarsh) January 24, 2024 Baap Level Entry of #HrithikRoshan BGM + Greek God Screen Present is Totally Goosebumps, Goosebumps. MASS KA BAAP 🔥🔥🔥#FighterReview #Fighter #HrithikRoshan𓃵 pic.twitter.com/n92lKNlG1L — AMIR ANSARI (@amirans934) January 25, 2024 #FighterReview - ⭐⭐⭐⭐⭐ Lots of Action, VFX is Top Level, and Storytelling is Masterclass, best movie of #HrithikRoshan𓃵 Career. A MUST WATCH 🔥🔥🔥#HrithikRoshan #Fighter pic.twitter.com/Grl1RTPriE — FMOVIES 🎥 (@FMovie82325) January 24, 2024 EXCLUSIVE 🚨🚨🚨 #Fighter Public Review Action Sequences are never seen before Once in a lifetime experience for Everyone #SiddharthAnand #HrithikRoshan#FighterReview#FighterOn25thJan #FighterFirstDayFirstShowpic.twitter.com/txIAHM8tcM — The Unrealistic Guy (@Guy_Unrealistic) January 25, 2024 FIGHTER RECEIVED EXCELLENT RESPONSE IN AUSTRALIA AND NEW ZEALAND 🔥🔥 People Call it Dhamaka of Entertainment and Patriotism 🇮🇳🇮🇳#FighterFirstDayFirstShow #FighterReview #Fighter https://t.co/dFow4B2YG1 — Anand Abhirup 📌 🧡 🦩 (@SanskariGuruji) January 25, 2024 #Fighter is a MASTERPIECE and a MEGA BLOCKBUSTER Film filled with a lot of Action, Drama, emotions and full-on patriotism. From Hrithik performance to the direction Everything was so good about the movie. This will take the Box office by storm. Rating - 5/5 #FighterReview pic.twitter.com/RG1w74ZvN5 — Renjeev Chithranjan (@RenjeevC) January 25, 2024 #FighterReview 1st half done: It’s okay so far those who have seen top gun but built up is nice.#HrithikRoshan𓃵 entry will have whistles and that arrogance is just amazing Hrithik and #DeepikaPadukone has better chemistry on screen than promos. — MeerajRules (@meerajrules) January 25, 2024 -
స్టార్ హీరో దేశభక్తి సినిమాపై వివాదం.. ఆ దేశాల్లో నిషేధం
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్'. దేశభక్తి నేపథ్యంలో తీసిన ఈ యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ.. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న అంటే గురువారమే థియేటర్లలోకి రానుంది. హిందీలో ఒకింత పర్లేదు గానీ తెలుగులో అసలు ఈ మూవీ ఒకటి వస్తుందని కూడా చాలామందికి తెలియదు. అలాంటిది విడుదలకు కొన్ని గంటల ముందు ఈ చిత్రబృందానికి మరో షాక్ తగిలింది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) బాలీవుడ్ మరీ దారుణంగా తయారవుతోంది. ఈ మధ్య కాలంలో దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ తరహా మూవీస్ మరీ ఎక్కువైపోతున్నాయి. పఠాన్, టైగర్.. ఇలా లెక్కకు మించి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఇలాంటి కథతోనే తీసిన ఏరియల్ యాక్షన్ మూవీ 'ఫైటర్'. హృతిక్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ లాంటి స్టార్స్ నటించారు. అలానే 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. యూఏఈ మినహా దాదాపు గల్ఫ్ దేశాలన్నింట్లోనూ 'ఫైటర్' సినిమాపై నిషేధం విధించారు. సాధారణంగా తీవ్రవాదం లేదా భారత్-పాకిస్థాన్ వివాదాల లాంటి అంశాలతో తీసిన చిత్రాల్ని గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తుంటారు. రీసెంట్గా సల్మాన్ 'టైగర్ 3' ఇలానే నిషేధానికి గురవగా, ఇప్పుడు 'ఫైటర్'కి అలాంటి పరిస్థితే ఎదురైంది. యూఏఈలో మాత్రం పీజీ 15 వర్గీకరణతో సెన్సార్ ఆమోదించారు. ఇకపోతే గల్ఫ్ కంట్రీస్లో నిషేధం వల్ల 'ఫైటర్' మూవీకి మిలియన్ డాలర్ల వసూళ్లు నష్టం ఉండే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
Hrithik Roshan: కష్టాన్నీ ప్యార్ కియా.. సూపర్హీరో బన్గయా!
హాలీవుడ్ సినిమాలకి ఎంతోమంది సూపర్ హీరోలు. సూపర్ మేన్, స్పైడర్ మేన్, బ్యాట్ మేన్, ఫెంటాస్టిక్ ఫోర్... ది లిస్ట్ నెవర్ స్టాప్స్... మరి మనకు సూపర్ హీరో? క్రిష్.. క్రిష్ 1.. క్రిష్ 2.. క్రిష్ 3... అందం ఉంది, నటన ఉంది, పర్సనాలిటీ ఉంది, ఎనర్జీ ఉంది, సిక్స్ ప్యాక్ ఉంది... వీటన్నింటికి తోడు ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొనే ఆత్మశక్తి ఉంది. అందుకే హృతిక్... సూపర్ రోషన్. దేవుడు మనకు ఏదైనా అదనంగా ఇస్తే సంతోషించాలి. కానీ హృతిక్ విషయంలో అది రివర్స్ అయ్యింది. దేవుడు అతనికి ఒకటి అదనంగా ఇచ్చాడు. ఏమిటో తెలుసా? కుడి చేతికి ఆరో వేలు. స్కూల్లో పిల్లలు అతణ్ణి వింతగా చూసేవారు. వెక్కిరించేవారు. వికృత పిల్లవాడి కింద జమకట్టేవారు. కుడి చేతి బొటన వేలు పక్కన ఇంకో బొటన వేలు ఉండటం హృతిక్ లోపం. దానిని కట్ చేసి తీసేయలేము. అలాగని ఉంచుకోలేము. ఎటువంటి ఇతర సమస్యలేని ఈ సమస్య చిన్నారి హృతిక్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎవరితోనూ కలిసేవాడు కాదు. మాట్లాడేవాడు కాదు. ఫలితం... నత్తి. చిన్నప్పుడు హృతిక్ రోషన్కు నత్తి ఉండేది. మాట్లాడటానికి తడబడేవాడు. స్కూల్లో ఓరల్ టెస్టులు ఉంటాయి కదా. లేచి నిలబడి ఏదో ఒకటి ఒప్పజెప్పాలి. ఆ రోజు తప్పనిసరిగా స్కూల్ ఎగ్గొట్టేవాడు. ఇంట్లో ఇదంతా పెద్ద నరకం. జె.ఓం ప్రకాష్ పేరు ఎవరైనా వినే ఉంటారు. ఇతడు నిర్మాత– దర్శకుడు. ‘జైజై శివశంకర్’ వంటి రాజేష్ ఖన్నా సూపర్హిట్ పాటలున్న ‘ఆప్ కి కసమ్’ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇతడే. ఇతని కుమార్తెనే నటుడు రాకేష్ రోషన్ వివాహం చేసుకున్నాడు. వీళ్లకు పుట్టినవాడే హృతిక్ రోషన్. తాత జె.ఓం ప్రకాష్ మాత్రం హృతిక్ మానసిక, శారీరక సమస్యలను పట్టించుకునేవాడు కాదు. తన మనవడు పెద్దయ్యి పెద్ద హీరో అవుతాడని అతడి నమ్మకం. అందుకే తాను తీసే సినిమాల్లో చైల్డ్ అప్పియరన్స్ ఇప్పించేవాడు. హృతిక్ అలా అరడజను సినిమాల్లో నటించాడు. సినిమా వాతావరణం అలా తెలుసు. తండ్రి రాకేష్ రోషన్ హీరో కనుక అలా కూడా సినిమాలు తెలుసు. బాబాయ్ రాజేష్ రోషన్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా కుటుంబంలో పుట్టిన హృతిక్ కచ్చితంగా సినిమా హీరోయే కావాలి. కాని అదంత సులభం కాలేదు. తండ్రులు కొడుకులను కాపాడాలనుకుంటారు. రాకేష్ రోషన్ కూడా హృతిక్ని కాపాడాలనుకున్నాడు. ఎందుకంటే అతడి జీవితం సాఫీగా సాగలేదు. హీరోగా పెద్దగా సక్సెస్ కాలేదు. నిర్మాతగా ట్రై చేశాడు. అందులోనూ ఫ్లాప్స్ చూశాడు. అప్పటికే ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఇక చివరి ప్రయత్నంగా దర్శకుడిగా మారి ‘ఖుద్గర్జ్’ సినిమా తీశాడు. అది హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘ఖూన్ భరీ మాంగ్’, ‘కిషన్ కన్హయ్య’ వంటి భారీ హిట్స్ ఇచ్చాడు. అయినా సరే గ్యారంటీ లేని ఈ రంగంలోకి వచ్చే ముందు ఏదో ఒక బతుకు విద్య ఉండాలని కొడుకు విషయంలో భావించాడు. ‘అమెరికా వెళ్లి స్పెషల్ ఎఫెక్ట్స్ నేర్చుకునిరా’ అన్నాడు హృతిక్ని. హృతిక్ అంగీకరించాడు. దానికి ముందు ఏదైనా టెక్నికల్ కోర్సు కూడా చదివించాలని నిర్ణయించుకున్నాడు. దానికీ సరే అన్నా హృతిక్ మనసు చెబుతోంది– ఇవన్నీ తన పనులు కాదని, తను పుట్టింది వీటి కోసం కాదని, తను హీరో కావాలని. ఒకరోజు నేరుగా వెళ్లి తండ్రి వద్ద చెప్పేశాడు– నాన్నా... ఇవన్నీ నా వల్ల కాదు. నేను హీరోనే అవుతా. రాకేష్ రోషన్ పరికించి చూశాడు. ‘సరే... స్క్రీన్ మీద ఏదైనా ఒకటి జరగాలంటే స్క్రీన్ వెనుక ఎంత కష్టం ఉంటుందో నీకు తెలియాలి. అసిస్టెంట్ డైరెక్టర్గా చేరు’ అని ఆదేశించాడు. హృతిక్ రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు– ఆరో అసిస్టెంట్ డైరెక్టర్గా. రాకేష్ రోషన్ కొడుకు అన్న అదనపు గౌరవం సెట్లో హృతిక్కు ఏ మాత్రం ఉండేది కాదు. అందరిలాగే కష్టపడాలి. అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి ఉండాలి. ‘కోయ్లా’, ‘కరణ్ అర్జున్’ సినిమాలకు అలా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. నైరోబీలో షూటింగ్ జరుగుతుంటే అందరూ ముందే స్నానాలు చేసి వెళ్లిపోతే తను ఆరోవాడు కనుక ఆఖరు చేయాల్సి వచ్చేది. అప్పటికి నీళ్లు అయిపోయి బురద నీళ్లు వచ్చేవి. ఆ బురదనీళ్లలోనే స్నానం చేసి షూటింగ్కు వెళ్లేవాడు. పైకి రావాలంటే కష్టం చేయాలి. పైకి వచ్చిన ప్రతివాడూ ఇలాంటి కష్టం తప్పనిసరిగా చేసే ఉంటాడు. హృతిక్ని హీరోగా లాంచ్ చేయాలి. తాను హీరోగా ఫ్లాప్ అయ్యాడు... కాని తన కొడుకు హీరోగా ఫ్లాప్ కాకూడదు అనుకున్నాడు రాకేష్ రోషన్. కానీ ఈ విషయంలో రెండు సమస్యలు ఉన్నాయి. హృతిక్కు ఉన్న నత్తి ఒక సమస్య. రెండు అతడి వెన్నులో, మోకాలిలో మరో సమస్య. డాక్టర్ పరీక్షించి చూసి ‘నువ్వు జన్మలో డాన్స్ చేయలేవు. చేయకూడదు’ అని చెప్పాడు. ఓడిపోయేవాడైతే ఆ మాట విన్న వెంటనే పోతాడు. కానీ హృతిక్ గెలవాలని నిశ్చయించుకున్నవాడు. అంతే ఆ మాటనే సవాలుగా చేసుకుని డాన్స్ క్లాసుల్లో చేరాడు. మోకాలూ వెన్నూ విరగనీ.. నాశనం కానీ తాను మాత్రం బెస్ట్ డాన్సర్గా నిలవాలి అని ప్రాక్టీస్ చేశాడు. డాక్టర్ చెప్పిన సమస్య ఎటు పోయిందో ఏమో. హృతిక్ ఇప్పుడు బెస్ట్ డాన్సర్ అయ్యాడు. ఇక నత్తి విషయం. స్పీచ్ థెరపీ తీసుకున్నాడు. అంతే కాదు అర్ధరాత్రి రెండు గంటలకు లేచి ఏదో ఒక సినిమాలోని ఏదో ఒక డైలాగును గుర్తు చేసుకుని నత్తి లేకుండా దానిని చెప్పడానికి పొద్దున వరకూ ప్రాక్టీసు చేసేవాడు. నత్తి పోయింది. డాన్స్ వచ్చింది. ఇక హీరో కావడానికి రెడీగా ఉన్నాడు. కానీ అందుకు దారిలో మూడు కొండలు అడ్డంగా నిలుచుని ఉన్నాయి. ‘కహో నా ప్యార్ హై’ 2000 సంవత్సరంలో వచ్చింది. కానీ అప్పటికి ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ బాలీవుడ్ను ఏలుతున్నారు. బాలీవుడ్ అంటే ఈ ఖాన్ త్రయమే. దీనిని బద్దలు కొట్టే హీరో కోసం బాలీవుడ్ ఎదురు చూస్తోంది. అలాంటి వారు ఎవరూ రారనే ధైర్యంతో ఖాన్లు ఉన్నారు. ఇప్పుడు హృతిక్ వస్తే వీరి చరిష్మాను బ్రేక్ చేసే స్థాయిలో రావాలి. అలా అతణ్ణి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. రాకేష్ రోషన్ ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. లవ్ స్టోరీ, మంచి పాటలు, కొత్త రకమైన డాన్సులు, అందంగా కనిపించే హీరోయిన్ అమీషా పటేల్.... జనవరి 14, 2000 సంవత్సరంలో ‘కహో నా ప్యార్ హై’... విడుదలైంది. ఖాన్ త్రయం పేరుతో అలుముకున్న ఆకాశం బద్దలైంది. జనం ఆమిర్, షారుక్, సల్మాన్ ఖాన్లను తాత్కాలికంగా మర్చిపోయారు. ఎక్కడ చూసినా హృతిక్ రోషన్ జపమే. రాజేష్ ఖన్నా తర్వాత ఆ స్థాయిలో ఆడపిల్లలు వెర్రెత్తి పోయింది హృతిక్ రోషన్ కోసమే. దేశంలో ఎక్కడ కనిపించినా వేలాది మంది మూగిపోవడం మొదలుపెట్టారు. నెల్సన్ మండేలా అంతటి వాడు తమ దేశంలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావలసిందిగా హృతిక్కు వర్తమానం పంపాడు. హిమాలయాల్లో ముక్కు మూసుకొని ఉండే సాధువులు కూడా గుంపులుగా ముంబై వచ్చి హృతిక్ని చూసి వెళ్లారనేది నిజంగా జరిగిన నిజం. కొందరు హృతిక్ని కొత్త అవతార్ అన్నారు. మీడియా దీనికి ‘హృతిక్ మేనియా’ అని పేరు పెట్టింది. హృతిక్ ఓవర్నైట్ సూపర్ స్టార్. కాని ప్రకృతి బేలెన్స్ చేయడం లేదు. ఎగరేసిన వస్తువు కింద పడాలి. అది రూలు. పడ్డాక స్థిరత్వం వస్తుంది. ఎగిరినా సరే కాళ్లు నేల మీద ఉండాలన్న తత్త్వం తెలిసొస్తుంది. ‘కహో నా ప్యార్ హై’ తర్వాత హృతిక్ రోషన్ వరుస పెట్టి ఫ్లాప్స్ ఇచ్చాడు. ‘ఫిజా’, ‘మిషన్ కాశ్మీర్’, ‘యాదే’, ‘ఆప్ ముఝే అచ్ఛే లగ్నే లగే’, ‘ముజ్సే దోస్తీ కరోగే’, ‘మై ప్రేమ్ కీ దీవానీ హూ’... ఈ సినిమాల్లో యశ్రాజ్ ఫిల్మ్స్ వారి సినిమా ఉంది. ప్రఖ్యాత దర్శకుడు సూరజ్ భరజ్యాతా దర్వకత్వం వహించిన సినిమా కూడా ఉంది. కానీ ఏవీ బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. రెండేళ్లలో ఆరేడు ఫ్లాప్స్ ఇచ్చే సరికి ఖాన్ త్రయం బహుశా ముసిముసిగా నవ్వు కొని ఉంటుంది. పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని అనుకొని ఉంటుంది. మీడియా అయితే హృతిక్ ఒన్ ఫిల్మ్ వండరనీ అతడి పని అయిపోయినట్టేనని శాసనాలు దండోరా వేయించింది. కానీ అయిపోయిందంటే అయిపోయినట్టు కాదు. తిరిగి మొదలైనట్టు. తండ్రి దర్శకత్వంలో హృతిక్ హీరోగా మళ్లీ మొదలైన సినిమా ‘కోయి మిల్గయా’. హీరోకి బుద్ధిమాంద్యం... తోడుగా ఒక అంతరిక్ష జీవి... ‘కోయి మిల్గయా’ ఆడకపోయి ఉంటే కథ ఎలా ఉండేదో కానీ ఆబాల గోపాలం ఆ సినిమా చూసింది. తండ్రీ కొడుకులు మళ్లీ హిట్ కొట్టారు. వాళ్లు ఒకటి అనుకున్నారు. హృతిక్ మిగిలిన దర్శకుల దర్శకత్వంలో భిన్నమైన సినిమాలు చేస్తూ ఉంటాడు... కానీ తండ్రి మాత్రం రెగ్యులర్గా అతడితో కమర్షియల్ సినిమాలు తీస్తూ ఉంటాడు అని. అందుకనే హృతిక్ బయట దర్శకుల దర్శకత్వంలో ‘జోధా అక్బర్’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ వంటి సినిమాలు చేస్తే తండ్రి దర్శకత్వంలో ‘క్రిష్’, ‘క్రిష్ 3’ వంటి సూపర్ హీరో సినిమాలు చేసి హాలీవుడ్కి స్పెడర్ మేన్, ఐరన్ మేన్ ఉన్నట్టు మనకు ఒక ‘క్రిష్’ ఉన్నాడని, ఉండగలడని నిరూపించాడు. అయితే అతడు కేవలం కమర్షియల్ హీరో మాత్రమే కాదని అతడిలో ఒక మంచి నటుడు ఉన్నాడని ‘జోధా అక్బర్’, ‘జిందగీ నా మిలేగి దొబారా’ నిరూపించాయి. హృతిక్ ఎంతో కష్టపడి చేసిన ‘మొహంజొదారో’ ఆడలేదు. కానీ అంధుడుగా నటించి, విడుదల చేసిన ‘కాబిల్’ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హృతిక్ ప్రస్తుతం ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఫైటర్' నుంచి మరో సాంగ్ రిలీజ్.. వింటుంటే అలా!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్'. వార్, పఠాన్ చిత్రాలతో అలరించిన సిద్ధార్థ్ ఆనంద్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ పాట విడుదల చేశారు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!) ఇప్పటికే 'ఫైటర్' మూవీ నుంచి టీజర్, సాంగ్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అలానే అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా 'హీర్ ఆస్మాని' అని మరో పాటని రిలీజ్ చేశారు. ఎయిర్ఫోర్స్ పైలెట్ లుక్లో హృతిక్ రోషన్ వావ్ అనిపిస్తున్నాడు. పాట కూడా వినసొంపుగా ఉంది. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా దీపికా పదుకొనే కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
ఇష్క్ జైసా కుచ్..
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ‘ఇష్క్ జైసా కుచ్..’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ‘‘హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ల మధ్య వచ్చే ఫుల్ రొమాటింక్ సాంగ్ ‘ఇష్క్ జైసా కుచ్..’. దీపిక, హృతిక్ డ్యాన్స్ అదరగొట్టారని ప్రేక్షకులు అంటారు. ఈ సినిమాలో హృతిక్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా (పాటీ) కనిపించనుండగా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నీగా (దీపికా) కనిపిస్తారు’’ అని మేకర్స్ అన్నారు. -
హృతిక్-దీపిక రొమాంటిక్ సాంగ్.. రెచ్చిపోవడంలో పీక్స్!
బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న సినిమా 'ఫైటర్'. 'వార్', 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ సాగుతున్నాయి. (ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'ఇష్క్ జైసా కుచ్' అని సాగే ఓ రొమాంటిక్ వీడియో గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటలో హృతిక్, దీపిక ఫుల్ రొమాటింక్ మోడ్లో రెచ్చిపోయారు. ఇక వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించైతే చెప్పడానికి ఇంకేం లేదు. అంతలా అదరగొట్టేశారు! వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు 'ఫైటర్' సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హృతిక్.. స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా.. దీపిక పదుకొణె స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా కనిపించనున్నారు. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ సందడి చేయనున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుక్కి పెళ్లి కుదిరిందా?) -
హృతిక్ రోషన్, దీపికా పదుకొనె 'ఫైటర్' నుంచి పార్టీ సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఫైటర్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ఎక్కువగా ఏరియల్ యాక్షన్ సన్నివేశాలే ఉండనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నాటి నుంచి అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్గా నిర్మిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా దీనిని 2024 జనవరి 25న గ్రాండ్గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. తాజాగా ఫైటర్ మూవీ నుంచి "షేర్ కుల్ గయ" అనే పార్టీ సాంగ్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇందులో హృతిక్ రోషన్ , దీపికా పదుకొనె డాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ను ఫిదా చేస్తున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ , హృతిక్ రోషన్ కాంబినేషన్లో గతంలో 'బ్యాంగ్ బ్యాంగ్, వార్' సినిమాలు వచ్చాయి. అవి రెండూ కూడా సంచలన విజయాలు సాధించాయి, ఆ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మరింత ఎక్కువ అంచనాలతో ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
భారీ యాక్షన్ సీన్స్తో 'ఫైటర్' టీజర్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- దీపికా పదుకోన్ కాంబినేషన్లో ఫైటర్ చిత్రం రానుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఫైటర్ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ నేపథ్యంలో సాగే భారతీయ మొదటి ఏరియల్ యాక్షన్గా ఈ సినిమాను నిర్మించారు. 'ఫైటర్' టీజర్లో జెట్ ఫ్లైట్స్ విన్యాసాలు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. టీజర్ ఎండ్ వరకు ఫైట్ జెట్స్తో వాళ్లు చేసే సాహసాలు ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే ఏడాదిలో షారుక్ ఖాన్తో పఠాన్ లాంటి హిట్ కొట్టిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మళ్లీ ఫైటర్ చిత్రంతో అదే రేంజ్ విజయాన్ని అందుకోవాలని ప్లాన్ చేశాడు. ఆ మేరకు ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్లో దీపికా పదుకోన్- హృతిక్ రోషన్ల మధ్య హాట్ రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ కానుంచి ఫైటర్. ఇదే ఏడాది అదే తేదీన పఠాన్ రిలీజ్ అయి ఎంతటి సంచలన విజయం సాధించిందో చూశాం. ఏకంగా షారుక్ ఖాన్కు కమ్బ్యాక్ చిత్రంగా అది నిలిచి రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసింది. -
ఓ వృద్ధ మహిళ కోసం యూకేలో పోరాటం!
ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆనైలైన్లో సైతం ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు వెల్లవలా వచ్చింది. ఆమె బ్రిటన్లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరుఫున పోరాడుతున్నాడు. ఇంతకీ ఎవరీ మహిళ? ఎందుకంతా క్రేజ్ అంటే.. అసలేం జరిగిందంటే..78 ఏళ్ల గుర్మిత్ కౌర్ 2009లో యూకేకి వచ్చారు. అప్పటి నుంచి స్మెత్విక్లోనే ఆమె నివాసం ఉంటోంది. బ్రిటన్ ఆమెను బహిష్కరించడంతో వందలాది మంది బిట్రన్ సిక్కు కమ్యూనిటీలు ఆమె కోసం గట్టిగా పోరాడుతున్నారు. జూలై 2020 నుంచి ప్రారంభమైన ఈ పోరాటానికి ఆన్లైన్లో సుమారు 65 వేల మందిదాక ఆ వృద్ధ మహిళకే మద్దతు తెలపడం విశేషం. యూకే ఆ మహాళను బహిష్కరించడానికి కారణం.. గుర్మిత్ కౌర్ తొలిసారిగా 2009లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు యూకే వెళ్లింది. మొదట్లో తన కొడుకుతో కలిసి ఉండేది. క్రమంగా ఆమె తన కొడుకు కుటుంబం నుంచి దూరమయ్యాక అపరిచిత వ్యక్తుల దయపై ఆధారపడి జీవించేది. ఆ తర్వాత స్థానిక సిక్కు కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ స్మెత్విక్లో పనిచేస్తూ అక్కడే ఆశ్రయం పొందింది. క్రమంగా ఆ స్వచ్ఛంద సంస్థ ఆమె నివాసంగా మారిపోయింది. ఆ మహిళకు ఎలాగో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ భారతలోని పంజాబ్లో కూడా కుటుంబం లేదని ఆ స్వచ్ఛంద సంస్థ ఆమెను దత్తత తీసుకుంది. దీంతో గుర్మిత్ కౌర్ తాను ఇక్కడే ఉండేలా యూకే హోం కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకు యూకే హోం కార్యాలయం తిరస్కరించింది. ఆమెకు ఇక్కడ యూకేలో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ పంజాబ్లోనూ కుటుంబం లేదు కానీ అక్కడ ఆమె ఇల్లు ఉంది. అక్కడ స్థానికులతో ఆఎ ఇంకా టచ్లోనే ఉన్నారు కాబట్టి ఆమె మళ్లీ అక్కడే తన జీవితాన్ని మొదలు పెట్టగలదు కావున ఇక్కడే తన మిగతా జీవితం గడపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కనివినీ ఎరుగని రీతిలో గుర్మిత్ కౌర్ని ఇక్కడ ఉండేలా అనుమతివ్వాలంటూ పలువురు స్థానికులు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు ఇస్తూ పోరాడారు. "ఆమె చాలా మంచి వ్యక్తిత్వం గలది. దయార్థహృదయం గలది ఇలా సడెన్గా ఆమెను ఇండియాకు పంపించేస్తే ఎలా బతుకుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉండటంతో పంజాబ్లోని ఆమె ఇల్లు పాడుబడిపోయి ఉంటుంది. పైగా ఆమె వృద్ధరాలు ఈ వయసులో పనిచేయలేదు. వండుకుని తినడం కూడా కష్టం కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థలోనే ఆశ్రయం పొంది తన శేష జీవితాన్ని గడుపుతుందని ఇమ్మిగ్రేషన్ సలహాదారు సల్మాన్ మీర్జా పిటిషన్ వేసి ఆమె తరుఫున పోరాడుతున్నారు. ఆమెకు వీసా లభించేలా సాయం చేస్తున్న వారిలో అతను ఒకరు అంతేగాదు ఆమెకు అనూహ్యంగా ఆన్లైన్లో కూడా విశేషమైన మద్దతు లభించింది. వారంతా ఆమె బ్రిటన్లోనే ఉండేలా వీసా జారీ చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక సాధారణ వితంతు సిక్కు మహిళకు విశేషమైన ప్రజాధరణ లభించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారి తెగ వైరల్ అవుతోంది. అంతేగాదు వెస్ట్మిడ్లాండ్స్లోని కొందరూ మద్దతుదారులు ఆమె బహిష్కరణపై యూకే హోం కార్యాలయంపై గట్టిగా పోరాడుతున్నారు. (చదవండి: అమ్మ ఎక్కడైనా అమ్మే) -
నుక్భా ఫైటర్స్ ఎవరు? హమాస్తో సంబంధం ఏమిటి?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీనిలో చాలా మంది ఇజ్రాయిలీలు మృతి చెందారు. లెక్కకు మించిన యూదులు బందీలుగా మారారు. హమాస్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్ను శ్మశానవాటికగా మార్చివేసింది. అలాగే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో పడింది. ఈ యుద్ధం నేపధ్యంలో నుక్భా ఫైటర్స్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ వీరు ఎవరు? హమాస్తో వారికి సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హమాస్ ఒక పెద్ద విభాగం. దీనిలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఇజ్రాయెల్పై దాడి చేసిన గ్రూపు పేరు ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్. నుక్భా ఈ బ్రిగేడ్కు చెందిన అత్యంత క్రూరమైన పోరాట యోధులు. వారిలో మానవత్వం మచ్చుకైనా ఉండదు. ఎదురుగా ఏది అడ్డుపడినా, ధ్వంసం చేసుకుంటూ, ముందుకు వెళ్లడమే వారి లక్ష్యం. నుక్భా ఫైటర్స్ చాలా ప్రమాదకరమైనవారు. వారు పిల్లలను, వృద్ధులను కూడా విడిచిపెట్టరు. నుక్భా ఫైటర్స్ ఇజ్రాయెల్కు నిరంతరం సవాల్గా నిలుస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ చాలాకాలం నుంచి వారితో పోరాడుతూనే ఉంది. వారిని వెతికి పట్టుకుని మరీ మట్టుపెడుతూ వస్తోంది. నుక్భా ఫైటర్లు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో నిష్ణాతులు. వారు గెరిల్లా యుద్ధాన్ని అనుసరిస్తుంటారు. హమాస్ తన సైన్యాన్ని ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ద్వారా రిక్రూట్ చేస్తుంది. వీరి శిక్షణ సమయంలో బలంగా ఉండే కొంతమంది యువకులను గుర్తిస్తారు. వారిని నుక్భా ఫైటర్స్గా తీర్చిదిద్దుతారు. ఇది కూడా చదవండి: ఆదివాసీల ‘జలియన్వాలాబాగ్’ ఘటన ఏమిటి? ఖర్సవాన్లో ఏం జరిగింది? -
ఆపరేషన్ అజయ్: ఢిల్లీ చేరుకున్న రెండో విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండో విమానం 235 మందితో ఢిల్లీ చేరుకుంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా 212 మంది భారతీయులతో శుక్రవారమే మొదటి విమానం చేరుకున్న విషయం తెలిసిందే. సొంత ఖర్చులతో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంపై బాధితులు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ అజయ్లో భాగంగా మొదటగా రిజస్టర్ చేసుకున్నవారిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. రెండో విమానం రాత్రి 11.02కు ఢిల్లీ చేరుకుంది. ఆదివారం కూడా ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ ఎంబసీలో రిజస్టర్ చేసుకున్నవారికి నేడు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. నేడు కూడా మరో విమానం భారత్ చేరనుంది. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఇజ్రాయెల్లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వెస్ట్బ్యాంకు, గాజాలోనూ కొందరు భారతీయులు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: 212 మంది భారతీయుల తరలింపు -
హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి..
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగిస్తున్న ఆందోళనకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్నది జర్మనీ పౌరురాలైన తన సోదరి అని ఓ మహిళ ధృవీకరించింది. సోషల్ మీడియాలో కనిపించిన వీడియోల దృశ్యాల ప్రకారం కొంతమంది హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగించారు. ఆ వాహనాన్ని చుట్టుముట్టి కేకలు వేస్తూ రాక్షసానందాన్ని పొందుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. మొదట ఆ మహిళా మృతదేహం ఒక మహిళా ఇజ్రాయెల్ సైనికురాలికి చెందినదని హమాస్ పేర్కొంది. అయితే, వీడియోలో కనిపించిన మహిళ తన సోదరి, జర్మన్ పౌరురాలు అని ట్విట్టర్ వేదికగా ఓ మహిళ నివేదించినట్లు న్యూయార్క్ పోస్టు తెలిపింది. The mother of Shani Louk, the woman whose body was seen on video in the back of a pick-up truck driven by Palestinian terrorists to Gaza, released a statement earlier today. She confirmed she had seen her daughter on the video & asked the public for help with more information pic.twitter.com/LDcPsjGHP8 — Visegrád 24 (@visegrad24) October 8, 2023 ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్పై హమాస్ దాడులు -
పాక్ బాంబు దాడికి బలైన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఆ రోజు ఏం జరిగింది?
ఆయన గుజరాత్ రెండో ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ పితామహునిగానూ పేరొందారు. ఆయనే బల్వంత్ రాయ్ మెహతా. భారత్- పాక్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికుల చేతిలో హతమైన ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతి గడించారు. 1965వ సంవత్సరంలో ఆయన మరణించారు. 1965, సెప్టెంబరు 19 న ఇండో-పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో నాటి గుజరాత్ సీఎం బల్వంత్రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ఛాపర్ బీచ్క్రాఫ్ట్ భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లోని కచ్ మీదుగా వెళుతోంది. ఈ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం సీఎం ప్రయాణిస్తున్న ఛాపర్పై బాంబు దాడి చేసింది. ఈ ప్రమాదంలో మెహతాతో పాటు మరో ఏడుగురు మరణించారు. వీరిలో ఆయన భార్య సరోజ్బెన్, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు. ఆ రోజు సీఎం బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ఛాపర్ మిథాపూర్ నుండి కచ్కి బయలుదేరిన వెంటనే, దానిని పాకిస్తాన్ ఫైటర్ పైలట్ కైస్ హుస్సేన్ అడ్డగించాడు. పాకిస్తాన్ ఛాపర్ అడ్డగించడం చూసిన భారత పైలెట్ బీచ్క్రాఫ్ట్ ఫ్యాన్ రెక్కలను కదిలించాడు. ఇది దయ చూపించి, విడిచిపెట్టాలని కోరుతూ చేసిన సూచన. అయితే అప్పటికి పాక్ పైలట్ గాలిలోకి రెండుసార్లు కాల్పులు జరిపాడు. అవి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న బీచ్క్రాఫ్ట్ను తాకాయి. అంతే.. హఠాత్తుగా బీచ్క్రాఫ్ట్ పేలిపోయి, నేల మీదకు ఒరిగిపోయింది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం 25 ఏళ్ల వయసు కలిగిన పాకిస్తాన్ పైలెట్ హుస్సేన్ ఆ రోజు 20 వేల అడుగుల ఎత్తులో తన ఛాపర్తో భారత గగనతలంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో నాటి గుజరాత్ సీఎం ప్రయాణిస్తున్న బీచ్క్రాఫ్ట్ను గుజరాత్ ప్రభుత్వ చీఫ్ పైలట్ జహంగీర్ నడుపుతున్నారు. ఆయన భారత వైమానిక దళంలో పైలట్, కో-పైలట్గా పనిచేశారు. ఈ ఘటన జరిగిన 46 ఏళ్ల తర్వాత పాక్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పైలెట్ హుస్సేన్ ఒక లేఖలో దివంగత సీఎం బల్వంత్ రాయ్ మెహతా కుమార్తెకు క్షమాపణలు తెలిపారు. ఈ లేఖకు ఆమె సమాధానమిస్తూ, తాను తన తండ్రి హంతకుడిని క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్కు రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన బల్వంత్ రాయ్ మెహతా 1963 జూన్ నుండి 1965 సెప్టెంబర్ 1965 వరకు పదవిలో ఉన్నారు. ఇది కూడా చదవండి: సౌరభ్ చంద్రకర్ ఎవరు? పెళ్లి నేపధ్యంలో ఈడీకి ఎందుకు చిక్కాడు? -
పార్కింగ్ కోసం గొడవ.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడికి దిగి చేతికి దొరికిన వస్తువుతో ఘర్షణకు దిగారు. హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వాగ్వాదం కాస్త గొడవకు దారితీసిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న పోలీసులపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ వీడియో స్థానికంగా వైరల్గా మారింది. ఘర్షణకు దిగిన నిందితులను పోలీసు వ్యాన్లోకి ఎక్కించడానికి ప్రయత్నించగా.. వారు నిరాకరించారు. పోలీసులు హౌసింగ్ సొసైటీలోకి రాకుండా నిందితులు అడ్డుకున్నారు. మరికొంత మంది స్థానికులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు కూడా తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ మహిళల మొబైల్ ఫోన్లను కూడా లాక్కెళ్లారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/iTA7e29Hu6 — POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) August 14, 2023 ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పార్కింగ్ విషయంలో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్లో జల ప్రళయం.. 29 మంది మృతి.. -
డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఫైటింగ్.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు..!
అమెరికాలోని అలబామాలోని రివర్ ఫ్రంట్ పార్క్లో దారుణం జరిగింది. కొందరు యువకులు ఓ సెక్యూరిటీ గార్డ్పై పిడిగుద్దులు కురిపించారు. ఓ బోటును పక్కకు జరపమని సెక్యూరిటీ గార్డ్ అడిగిన నేపథ్యంలో ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. Yo this is wild 😭 A group of white men attacked a black security guard after the security asked them to move their pontoon boat so the big Harriot can dock. They refused to & attacked the security guard. A group of black men seen & went defend him by beating the white men 💯🙌🏾 pic.twitter.com/Qzo3U3Kq1r — Shannonnn sharpes Burner (PARODY Account) (@shannonsharpeee) August 6, 2023 యువకులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. మొదట ఓ యువకుడు సెక్యూరిటీ గార్డ్పై దాడి చేశాడు. అనంతరం అతనికి మద్దతుగా వచ్చిన మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. విచక్షణా రహితంగా ఆయనపై దాడి చేశారు. చొక్కాలు విప్పుకుని ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డారు. డబ్ల్యడబ్ల్యూఈ స్థాయిలో కుర్చీలతో చొక్కాలు విప్పుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందులో మహిళలు కూడా పాలు పంచుకున్నారు. ఘర్షణలో కొందరిని నదిలో నెట్టేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇదీ చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
డబుల్ బెడ్రూం కోసం నడిరోడ్డుపై హల్చల్.. ఇంతలో ప్రమాదం..
సంగారెడ్డి: కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంటిని త్వరగా అందజేయాలని ఓ వ్యక్తి రోడ్డుపై హల్చల్ చేసి ప్రమాదానికి గురయ్యాడు. మండల కేంద్రం పుల్కల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుల్కల్ గ్రామానికి చెందిన బట్టు చిరంజీవి రాజుకు అతని భార్య మమత పేరుపై పుల్కల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం మంజూరైంది. అయితే వాటిలో కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేదు. దీంతో ఇల్లు మంజూరైనా కాలయాపన జరుగుతుండటంతో అసహనానికి గురైన చిరంజీవి రాజు శుక్రవారం ఉదయం పెట్రోలు సీసాతో పుల్కల్ ప్రధాన రోడ్డుపై హల్చల్ చేశాడు. వచ్చిపోయే వాహనాలను ఆపుతు ఇబ్బంది కలిగించారు. ఇదే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నిస్తుండగా కింద పడిపోయాడు. గమనించిన డ్రైవర్ ఆపే ప్రయత్నం చేస్తుండగానే వెనుక చక్రాలు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ విజయ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తహసీల్దార్ రాజయ్య మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను గుర్తించామని, ఇళ్లను కూడా కేటాయించామని తెలిపారు. చిన్న చిన్న పనులు మిగిలిపోవడంతో కేటాయింపులో జాప్యం జరుగుతోందన్నారు. -
థియేటర్లో సీటు కోసం గొడవ.. వృద్ధునిపై యువకుని పిడిగుద్దులు..
అమెరికాలో దారుణం జరిగింది. సినిమా హాల్లో సీటు కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడ్ని చితకబాదాడో యువకుడు. 63 ఏళ్ల వృద్ధినిపై పిడిగుద్దులు కురిపించాడు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫ్లోరిడాలోని పొంపానో బీజ్ ఏఎంసీ సినిమా థియేటర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బీచ్ పక్కనే ఉన్న ఫస్ట్ క్లాస్ థియేటర్లో సినిమా ఆరంభమైంది. అందరూ తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. ఇంతలో వీఐపీ టికెట్టు కొనుగోలు చేసిన ఓ వృద్ధ జంట తమ సీట్ల వద్దకు వచ్చారు. కానీ అప్పటికే అందులో ఇద్దరు యువ జంట కూర్చున్నారు. దీంతో మరో సీటులో కూర్చోవలసిందిగా అభ్యర్థించాడు ఆ వృద్ధుడు. Cops in Florida looking for a man who beat up a 63-year-old man because he asked to switch seats in a Pompano Beach AMC movie theater.#TrueCrime pic.twitter.com/jBvs5IDCat — Joseph Morris (@JosephMorrisYT) July 20, 2023 ఈ చిన్న విషయానికి తీవ్ర కోపోద్రిక్తుడైన యువకుడు వృద్ధునిపై దాడికి పాల్పడ్డాడు. కిందపడిన వృద్ధునిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. పక్కనే ఉన్న కొందరు అతన్ని అడ్డగించారు. దీంతో వివాదం అప్పటికి సద్ధుమణిగింది. కానీ ఈ ఘటనలో వృద్ధుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: పొగలుకక్కే ఫుడ్ పెట్టినందుకు..మెక్డొనాల్డ్స్ రూ. 6 కోట్లు చెల్లించింది! -
ఎంత పెద్ద గాంగ్ స్టార్ అయితేనేంటీ? నేను ఫైటర్ ను
-
నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా!
భగభగ మండుతున్న నిప్పుతో స్టంట్ చేస్తున్న ఒక యువతి ఇప్పుడు వార్తల్లో చర్చాంశనీయంగా నిలిచింది. అమెరికాలోని టేనస్సీలోని నాష్విల్లేకు చెందిన ఈ అమ్మడు అద్భుత ఫైర్ పర్మార్మర్గా పేరుగాంచింది. మంటల్లో శ్వాస తీసుకోవడం, సయ్యాటలాడటం ఆమె ప్రదర్శించే అత్యంత భయంకర ఫైర్ స్టంట్స్. ఈ ప్రదర్శనల్లో చాలాసార్లు ప్రాణాపాయం వరకూ చేరుకున్నా తిరిగి ప్రాణాలతో బయటపడింది. ప్రతీరోజూ నిప్పుతో తనను తాను కాల్చుకోవడం అంటే సాధారణ విషయం కాదు. నిరంతరం రిస్క్ తీసుకోవడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. అయితే కొందరికి ప్రమాదాలతో ఆడుకోవడమంటే ఎంతో సరదా. అటువంటి ఒక యువతికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 30 ఏళ్ల ఫైర్ పర్ఫామర్ అమెరికాలోని పలు టీవీ చానళ్లలో తరచూ కనిపిస్తుంటుంది.ఆమె పేరు గ్రేస్. ఆమె ‘బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆమె హైడిమాండ్ ప్రొఫెషనల్ అయినందున ఒక్కోసారి రోడ్లమీద కూడా ప్రదర్శనలిస్తూ అత్యధిక ఆదాయం సంపాదిస్తుంటుంది. గ్రేస్కు చెందిన ట్విట్టర్ అకౌంట్ @gracegoodcirqueకు 3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఈ ఖాతాలో ప్రతీరోజూ తన ప్రదర్శనకు సంబంధించిన క్లిప్లను పోస్ట్ చేస్తుంటుంది. ప్రదర్శనలు నిర్వహిస్తున్న సందర్భాలలో చాలాసార్లు ఆమె కురులు కాలిపోయాయి. అలాగే ప్రాణాపాయం కూడా ఏర్పడింది. అయినా ఆమె వాటిని ఏమాత్రం లెక్క చేయదు. మంటల్లో భోజనం చేస్తూ... ఆమె మీడియాతో మాట్లాడుతూ మంటల్లో ప్రదర్శన ఇస్తున్నప్పుడు నా కురులను లూజ్గానే వదిలేస్తాను. వాటిని చూసినవారంతా హడలిపోతుంటారు. కురులకు నిప్పు అంటుకుంటే నీటితో ఆ మంటలను ఆర్పేస్తాను. నేను హెయిర్ ఎక్స్టెన్సన్ చేయించుకున్నాను. ఇది ఎంతో ఖరీదైనది. అది కురులను కాపాడుతుంది. తన ప్రదర్శనలలో నిప్పులో శ్వాస తీసుకోవడం, భోజనం చేయడం, తగలబడటం మొదలైనవి ఎంతో కఠినమైనవని అన్నారు. నేను నా ప్రోప్ స్టాఫ్ సహాయంతో నాకు నేను నిప్పంటించుకుంటాను. అప్పుడు అగ్ని నన్ను చుట్టుముడుతుంది. గాలి వీచినప్పుడు నా శరీరమంతటికీ త్వరగా నిప్పు పాకుతుంది. నా ముఖాన్ని కూడా అగ్ని తాకుతుంది. మంటల్లో ఆహారం తినడం, శ్వాస తీసుకోవడం ఎంతో ప్రమాదకరమైనవి. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వీటిని ప్రదర్శిస్తుంటాను. 12 ఏళ్లుగా ఇదే ప్రొఫిషన్లో ఉన్నాను. నన్ను చూసి ఎవరూ ఇలా నిప్పుతో చెలగాటం ఆడకూడదని ఆమె తెలిపింది. చదవండి: అమ్మకోసం తాజ్మహల్.. ఫిదా అవుతున్న జనం -
మటన్ పెట్టకుండా సాంబారు పోశాడని.. పెళ్లి విందులో కొట్లాట
సాక్షి, మెదక్: పెళ్లి విందులో తలెత్తిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. నర్సాపూర్ మండల పరిధిలోని చండి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ మండల పరిధిలోని చండి గ్రామానికి చెందిన అమ్మాయిని అదేమండలం నత్నయిపల్లికి చెందిన అబ్బాయితో శనివారం చండి గ్రామంలో పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం భోజనం వడ్డిస్తున్న క్రమంలో అబ్బాయి తరఫు వ్యక్తికి మటన్ ముక్కలు వేయకుండా సాంబార్ పోశాడని గొడవకు దిగారు. మటన్ వడ్డిస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిపై అబ్బాయి తరఫు వారు దాడి చేయగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి నలుగురిపై కేసు నమోదు చేశారు. చదవండి: ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు! -
వైరల్ వీడియో: తన బిడ్డ కోసం పాముతో పోరాడిన ఎలుక
-
మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అకాల మరణం.. 18 ఏళ్లకే..!
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC) భవిష్యత్ ఆశాకిరణం విక్టోరియా లీ అకాల మరణం చెందింది. హవాయ్లో పుట్టిన ఈ అప్కమింగ్ ఫైటర్ 18 ఏళ్లకే తనువు చాలించి, తన కుటుంబంతో పాటు యావత్ మార్షల్ ఆర్ట్స్ రంగాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. 16 ఏళ్లకే సింగపూర్ బేస్డ్ ప్రమోటర్ వన్ ఛాంపియన్షిప్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుని అపజయమెరుగని ఫైటర్గా చలామణి అవుతున్న లీ.. హఠాత్తుగా ఈ లోకాన్ని వదిలి వెల్లడం పట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. View this post on Instagram A post shared by Angela Lee Pucci (@angelaleemma) లీ మరణ వార్తను ఆమె సోదరి ఏంజెలా లీ నిన్న (జనవవరి 8) సోషల్మీడియా వేదికగా వెల్లడించింది. విక్టోరియా ఎలా మరణించిందో ప్రస్తావించని ఏంజెలా.. డిసెంబర్ 26వ తేదీనే తన సోదరి మరణించినట్లు పేర్కొంది. విక్టోరియా మరణం తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని, గతంలోలా ఇక తామెప్పుడూ ఉండలేమని, తాము ఎదుర్కొంటున్న పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని ఏంజెలా సోషల్మీడియా సందేశాన్ని పెట్టింది. View this post on Instagram A post shared by ONE Championship (@onechampionship) విక్టోరియా మృతి పట్ల ప్రముఖ UFC ఫైటర్లు కానర్ మెక్ గ్రెగర్, ఖబీబ్, జాన్ జోన్స్, బ్రాక్ లెస్నర్ సంతాపం తెలిపారు. కాగా, అతి చిన్న వయసులోనే విక్టోరియా మృతి చెందడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైటింగ్ రింగ్లో కనపడని గాయాలు తగిలి ఆమె మృతి చెంది ఉంటుందని కొందరంటుంటే, మరికొందరేమో విక్టోరియా వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. -
ప్రభాస్ ‘సలార్’-‘హృతిక్’ ఫైటర్ ఢీకొట్టనున్నాయా?!
దక్షిణాది ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అందరి అంచనాలను మరింత రెట్టింపు చేస్తూ ఆగస్ట్ 14న చిత్రం బృందం ప్రభాస్ ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని ఇంటెన్సివ్ లుక్లో కనిపించాడు ప్రభాస్. ఈ పోస్టర్తో పాటు మూవీ రిలీజ్ డేట్ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28,2023న ప్రపంచవ్యాప్తంగా సలార్ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ భారీ చిత్రం ఫైటర్ను కూడా అదే రోజున విడుదల చేస్తామని సలార్ మూవీ కంటే ముందే ప్రకటించారు. చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండియన్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హృతిక్ జోడిగా దీపికా పదుకొనె నటించనుండగా.. అగ్ర నటుడు అనిల్ కపూర్ కీ రోల్ పోషించనున్నాడు. అంతేకాదు ప్రముఖ హాలీవుడ్ యాక్టర్లు కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం కానున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రెండు భారీ యాక్షన్ చిత్రాలు ఒకే రోజున బాక్సాఫీసు వద్ద తలపడితే? ఎలా అని అందరిలో ఆసక్తినెలకొంది. దీంతో ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమైనదని, భారతీయ సైనిక వీరత్వాన్ని చాటిచెప్పే విధంగా అంత్యంత ప్రతిష్టాత్మగా ఫైటర్ను హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తానని డైరెక్టర్ సిద్ధార్థ్ చెప్పాడు. చదవండి: స్పెయిన్లో జెండా ఎగురవేసిన నయనతార అంతేకాదు ఈ సినిమాను సెప్టెంబర్ నెలాఖరున రిలీజ్ చేస్తానని చెప్పడం, ఇప్పుడు సలార్ మూవీ రిలీజ్ అప్పుడే ఉండటంతో ఈ రెండు చిత్రాలు ఒకవేళ ఢీ కొంటే? దేని ఫలితం ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. సలార్ బడ్జెట్ రూ. 200 కోట్లు కాగా.. ఫైటర్ను రూ. 250 కోట్లు. ఫైటర్ బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు. అయితే ఇప్పటికీ ఈ మూవీ సంబంధించిన ఎలాంటి ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేయకపోవడం గమనార్హం. ఇప్పటికి ఇంకా సెట్స్పైకి రానీ ఫైటర్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే రోజు తలపడితే ఏది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది.. మరి డార్లింగ్ కోసం హృతిక్ వెనక్కి తగ్గుతాడా? లేదా చూడాలి. -
ఉక్రెయిన్పై వార్.. ఊహించినట్లే రష్యా అడుగులు!
ఉక్రెయిన్పై యుద్ధంలో మాస్కో వర్గాలు.. పాశ్చాత్య దేశాల ఊహకు తగ్గట్లే అడుగులు వేస్తున్నాయి. ప్రధాన నగరాలు, ఆపై అణు రియాక్టర్లు, అటుపై పోర్టు సిటీలు దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నిఘా వర్గాలు ఊహించినట్లే మరొకటి జరిగింది. రెండు దేశాల మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి ఇతర దేశాల ఫైటర్లను రష్యా నియమించుకుంటోంది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే లక్ష్యంతో చేస్తున్న యుద్ధంలో రష్యా భారీ విధ్వంసానికి దిగినప్పటికీ.. ఉక్రెయిన్ దళాల నుంచి ప్రతిఘటనే ఎదురవుతోంది. రష్యా సైన్యం భారీగా నష్టపోతోంది. ఇప్పటికే ఎంతో మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు చంపేశాయి. మరెందరో రష్యన్ సైనికులు ఉక్రెయిన్ కు బంధీలుగా చిక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం బయటకు వచ్చాయి. ఇక రష్యా కాంట్రాక్ట్ ఫైటర్లను నియమించుకుంటున్న విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. నలుగురు అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. సిరియాతో పాటు చెచెన్యా ఫైటర్లను ఇప్పటికే నియమించుకుందట రష్యా. ఇందుకోసం ఫైటర్లతో ఆరు నెలల ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నట్లు సమాచారం. రోజూ 200 నుంచి 300 డాలర్ల జీతం వీళ్లకు ముట్టజెప్పనుంది రష్యా. రాజధాని కీవ్ ముట్టడి కోసమే ఈ నియామకాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ ప్రైవేట్ ఫైటర్లు నగరాల ముట్టడిలో రాటుదేలిన వాళ్లని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎంత మందిని, ఈ రెండు దేశాల నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా నియమించుకుందా? అనే సమాచారం మాత్రం వెల్లడించలేదు సదరు కథనం. మరోవైపు ఈ యుద్ధంలో రష్యా గనుక సిరియా సాయం తీసుకుంటే.. తాము ఉక్రెయిన్కు మద్ధతుగా రంగంలోకి దిగుతామని సిరియా రెబెల్స్ ఇప్పటికే ప్రకటించేశారు. చదవండి: ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేరళ హోటల్ నిర్ణయం వైరల్ -
ఇరు కుటుంబాల్లో చిచ్చు రేపిన కూతురి నిర్వాకం.. తల్లి ఉసురు తీసిన వాట్సాప్ స్టేటస్!
ఇంతవరకు మనం సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను, ఫోటోలను పెట్టి సమస్యల్లో చిక్కుకుని మృతి చెందిన ఉందంతాల గురించి విన్నాం. కానీ వాట్సాప్ స్టేటస్ల కారణంగా నేరాలకు పాల్పడిన సందర్భాలు గురించి విని ఉండం. అచ్చం అలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో 48 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. మృతురాలి కుమార్తె ప్రీతి ప్రసాద్(20) పెట్టిన వాట్సాప్ స్టేటస్ అదే పరిసరాల్లో నివసిస్తున్న ఆమె స్నేహితుడు..17 ఏళ్ల మైనర్ యువకుడి కుటుంబానికి ఆగ్రహం తెప్పించింది. నిజానికి ఆ వాట్సాప్ స్టేటస్తో ఆ మైనర్కి సంబంధం లేదు. కానీ ఆ యువకుడు ప్రీతి పెట్టిన వాట్సాప్ తనకు సంబంధించిందేనని భావించి ఆగ్రహంతో అతను, అతని తల్లి, సోదరుడు ప్రీతి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ప్రీతి తల్లి లీలావతి దేవి ప్రసాద్ పక్కటెముకాలకు తీవ్రంగా గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడు తల్లి, మరో ఇద్దరు కుట్టుంబ సభ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ.. "వాట్సాప్ స్టేటస్ గురించి వెల్లడించలేం. కానీ మైనర్ యువకుడు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశం మాత్రం కాదు. అంతేకాదు మృతురాలికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఈ దాడిలో జరిగిన తీవ్ర గాయం కారణంగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది" అని తెలిపారు. -
శ్వేత దేశపు నాణేంపై నల్ల జాతి మ(తె)గువ
వర్ణ వివక్షకు కేరాఫ్ అయిన అగ్రరాజ్యంలో.. ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి ఓ నల్ల జాతి మగువ ముఖచిత్రంతో అమెరికన్ కాయిన్ విడుదల చేశారు. అమెరికన్ ఉమెన్ క్వార్టర్స్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్రో-అమెరికన్ రైటర్ మయా అంజెలు ముఖచిత్రంతో కాయిన్ను విడుదల చేశారు. ఏడేళ్ల వయసులో తల్లి ప్రియుడి చేతిలో అఘాయిత్యానికి గురై.. చావు దెబ్బలు తింది మయా అంజెలు. చివరికి బంధువుల చొరవతో ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారి.. ఆరేళ్లపాటు మూగదానిగా ఉండిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి బయటపడేందుకు ఆ చిన్నవయసు నుంచే అక్షరాల్ని ఆశ్రయించింది. కాలక్రమంలో ఆఫ్రో-అమెరికన్ రచయితగా, జాతి-వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలిగా మయా అంజెలుకు ఒక పేరు దక్కింది. ఉద్వేగంగా సాగే ఆమె రచనలు ప్రముఖులెందరినో ప్రభావితం చేశాయి కూడా. ఆమె ఆత్మకథ I Know Why the Caged Bird Sings ద్వారా ఎన్నో సమస్యల గురించి చర్చించారామె. 1993లో బిల్క్లింటన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్వయంగా కవిత వినిపించి.. ఆ అరుదైన గౌరవం అందుకున్న తొలి బ్లాక్ లేడీగా గౌరవం అందుకుంది. తన జీవిత కాలంలో 30కి పైగా అత్యున్నత డాక్టరేట్లు అందుకున్న మయా అంజెలు.. 2010లో అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా ‘స్వేచ్ఛా’ మెడల్ను సైతం స్వీకరించింది. 2014లో 86 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది. మయా అంజెలుతో పాటు చైనా సంతతికి చెందిన హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్, అమెరికా తొలి మహిళా వ్యోమగామి సాలీ రైడ్ ముఖ చిత్రాల మీదుగా కూడా కాయిన్స్ రిలీజ్ చేసింది అమెరికా మింట్. -
‘మార్షల్’ మెరుపులు
-
‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘తెలుగు ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాలను బాగా ఇష్టపడతారు. తమిళంలో కాస్త తక్కువ. కానీ రజనీకాంత్, విజయ్ వంటి హీరోలకు మాత్రం వారి అభిమానులు భారీ యాక్షన్ సీక్వెన్సెస్నే కోరుకుంటారు’’ అని స్టంట్ శివ అన్నారు. బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ చిత్రానికి పనిచేసిన ఫైట్ మాస్టర్, యాక్టర్ శివ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మెకానిక్గా ఉన్న నేను సినిమాలపై ఆసక్తితో ఫైట్ మాస్టర్గా మారాను. బాలకృష్ణగారి ‘లక్ష్మీనరసింహా, విజయేంద్ర వర్మ, సింహా’ చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశాను. ఇప్పుడు ‘అఖండ’ కు వర్క్ చేయడం సంతోషంగా ఉంది. బాలకృష్ణగారి ‘అఘోరా’ పాత్రకు ఫైట్స్ కంపోజ్ చేశాం. ఫైట్స్ మాస్టర్స్లా కాకుండా బాలకృష్ణగారి అభిమానుల్లా ఫైట్స్ కంపోజ్ చేశాం. ఈ సినిమాకి దాదాపు 65 రోజులు ఫైట్స్ తీయగా, మరో 15 రోజులు యాక్షన్ సీన్స్లోని మిగతా వర్క్, ఎలివేషన్ షాట్స్ తీశాం. క్లైమాక్స్ ఫైట్ కంపోజింగ్ కాస్త కష్టంగా అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ను బాలకృష్ణగారు సూపర్హీరోలా చేశారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో బోయపాటిగారు ఓ ఫైట్మాస్టర్లానే ఆలోచిస్తారు. నిర్మాత రవీందర్రెడ్డిగారు బాగా హెల్ప్ చేశారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం కూడా ఫైట్స్కి ప్లస్ అయ్యాయి. (అన్స్టాపబుల్ షోలో సూపర్ స్టార్ సందడి.. ఫొటోలు వైరల్) ‘క్రాక్’ తర్వాత యాక్టర్గా నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ‘ఎఫ్ 3’ చిత్రంలో నేనే మెయిన్ విలన్. ఫైట్ మాస్టర్గా ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ తో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. పీటర్ హెయిన్స్ సోదిరిని వివాహం చేసుకున్నాను. నా కుమారులు కెవిన్, స్టీవెన్ కూడా ఫైట్ మాస్టర్స్గా చేస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిన్, స్టీవెన్ పాల్గొన్నారు. (‘అఖండ’ లోని గిత్తలు ఎవరివో, వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?) -
సినిమా షూటింగ్లో కరెంట్ షాక్తో ఫైటర్ మృతి.. స్పందించిన సీఎం
యశవంతపుర: ‘లవ్ యూ రచ్చు’ చిత్రం షూటింగ్లో కరెంట్ షాక్తో సహాయ ఫైటర్ మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన వివేక్ (28) రామనగర తాలూకా జోగనదొడ్డి వద్ద సోమవారం షూటింగ్ చేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు సహాయకులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు. దర్శకుడు శంకర్రాజ్, నిర్మాత గురుదేశ్పాండె, ఫైట్ మాస్టర్ వినోద్లను బిడిది పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరో వైపు కన్నడ చిత్రపరిశ్రమలో జరుగుతున్న లోపాలు, భద్రత ప్రమాణాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిత్రయూనిట్, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని వివేక్ కుటుంబసభ్యులు, డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. షూటింగ్లకు సంబంధించిన కొన్ని నిబంధనలను ప్రభుత్వం త్వరలో జారీ చేస్తుందని చెప్పారు. -
ఫైటర్ పైలట్
‘బ్యాంగ్ బ్యాంగ్, వార్’ చిత్రాల తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, హీరో హృతిక్ రోషన్ మూడో సినిమా కోసం కలిశారు. ఆదివారం హృతిక్ రోషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాజా చిత్రాన్ని ప్రకటించారు. ‘ఫైటర్’ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హృతిక్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తారు. ఇందులో పైలట్గా కనిపించనున్నారు హృతిక్. ‘సిడ్’ (సిద్ధార్థ్)తో మూడోసారి, దీపికతో తొలిసారి కలసి పని చేయడం ఎగ్జయిటింగ్గా ఉంది. మీ అందరికీ ఓ సూపర్ రైడ్ను అందిస్తాం’’ అన్నారు హృతిక్ రోషన్. ఈ ఏడాది చివర్లో ‘ఫైటర్’ సెట్స్ మీదకు వెళ్లనుంది. 2022 సెప్టెంబర్ 30న సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. -
ఫైటర్ కోసం ఫిట్గా..
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్లోని 360 డిగ్రీ ఫిట్నెస్ కార్యక్రమంలో 30 రోజుల్లో బరువు తగ్గే చాలెంజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా జిమ్కు వస్తున్నట్లు చెప్పారు. మరో ప్రాజెక్ట్ ఫైటర్ సినిమా కోసం బెస్ట్ బాడీ షేప్ని తయారు చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మంచి డైట్ ప్లాన్తో ఫిట్నెస్పై జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిట్నెస్ ట్రైనర్ కులదీప్ సేతి, 360 డిగ్రీ ఫిట్నెస్ ఎండీ సునితారెడ్డి పాల్గొన్నారు. -
నవంబర్లో ‘స్టార్స్’ హుషార్
స్టార్స్ ఉంటే ఆకాశం నిండుగా ఉంటుంది. స్టార్స్ ఉంటే సినిమాలు సందడిగా ఉంటాయి. కోవిడ్ వల్ల సినిమాల చిత్రీకరణలు అటూఇటూ అయ్యాయి. స్టార్స్ సినిమాలంటే భారీ కాన్వాస్తో కూడుకున్నవి. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగుతున్నారు. ఈ నవంబర్లో చాలా మంది స్టార్స్ మళ్లీ సెట్స్లోకి అడుగుపెడుతున్నారు. కొందరు కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మరికొందరు మధ్యలో ఉన్నవాటిని ముగించనున్నారు. ఆ విశేషాలు. వేసవిలో మెగామాస్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 9న మళ్లీ ఆరంభం కానుంది. ‘నెలరోజుల పాటు సాగే షెడ్యూల్తో చాలా శాతం చిత్రీకరణ పూర్తి చేయనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్లో మెగామాస్ చూస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఎంట్రీ షురూ బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. అయితే నవంబర్ 16 నుంచి బాలకృష్ణ లొకేషన్ ఎంట్రీ షురూ అయిందని తెలిసింది. క్రాక్ టు ఖిలాడీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నుంచి పక్కా పోకిరిగా మారబోతున్నారు రవితేజ. ఆయన ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నారు. అందులో రవితేజ పోలీస్గా కనిపిస్తారు. ఇది పూర్తి కాగానే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా ప్రారంభించనున్నారు. ఇందులో ఆయన ఖిలాడీగా కనిపిస్తారు. నవంబర్ చివరి వారంలో చిత్రీకరణలో పాల్గొంటారట రవితేజ. అడవిలోకి పుష్ప అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రీకరణ కోసం నవంబర్ 6 నుంచి 10 మధ్యలో రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవులకు ప్రయాణం కానుంది యూనిట్. 30 రోజుల పాటు దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరపనున్నారు. ముంబైలో ఫైటర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్లో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. ఇందులో కిక్ బాక్సర్గా విజయ్ దేవరకొండ కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ మూడు లేదా నాలుగో వారం నుంచి ముంబైలో ఆరంభం కానుంది. శ్రీదేవి సోడా సెంటర్ సుధీర్బాబు హీరోగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే కొత్త చిత్రం ఇటీవలే ప్రకటించారు. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకుడు. గోదావరి పరిసర ప్రాంతాల్లో నవంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి, వేసవికి సినిమాలను థియేటర్స్లోకి తీసుకురావడానికి చిత్రబృందాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏడాది మిస్సయిన జోష్ని వచ్చే ఏడాది రెండింతలు ఇవ్వడానికి ఇండస్ట్రీ రెడీ అవుతోంది. ఫుల్ స్పీడ్ స్టార్స్ అందరిలో ముందుగా షూటింగ్లో పాల్గొన్న హీరో నాగార్జున. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ను పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. అలాగే పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’, ఎన్టీఆర్, రామ్చరణ్ల ‘ఆర్ఆర్ఆర్’, నాగచైతన్య ‘లవ్స్టోరీ’, శర్వానంద్ ‘శ్రీకారం’, నాగశౌర్య కొత్త చిత్రం, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ సినిమాలు ఫుల్ స్పీడ్లో షూటింగ్స్ జరుగుతున్నాయి. -
విజయ్ దేవరకొండకి ఫాదర్గా బాలీవుడ్ నటుడు?
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ఫైటర్’. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. తండ్రి పాత్రను బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి చేయనున్నారని సమాచారం. సినిమాలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాల్లో సునీల్ శెట్టి పాత్ర కనిపిస్తుందట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ ప్రారంభం కానుంది. -
ఎవరినైనా కొట్టగలగాలి
‘‘ఫైటర్ నా తరహా కమర్షియల్ సినిమాగా తయారవుతోంది. మామూలుగా మనం చూసే, చూస్తూ పెరిగిన రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు, కమర్షియల్ జానర్లోకి వచ్చే ఇలాంటి సినిమానే చెయ్యాలనుకున్నాను. కమర్షియల్ సెన్సిబిలిటీస్కు పేరు పొందిన పూరి జగన్నాథ్గారు డైరెక్టర్ కావడం వల్ల ఈ సినిమాకి మరింత వాణిజ్య మద్దతు లభించింది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో అనన్యా పాండే హీరోయి¯Œ గా టాలీవుడ్కి పరిచయమవుతున్నారు. చార్మీ కౌర్, కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పునఃప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఫైటర్ రోల్ చేస్తున్నాను. ఎవరినైనా కొట్టగల ఫైటర్లా కనిపించాలి. అందుకే ఎనిమిది నెలలుగా నేను వర్కవుట్స్ చేస్తున్నాను. ఈ మధ్య నేను మోటివేషన్ కోల్పోయాను. కానీ తర్వాత నన్ను నేను మోటివేట్ చేసుకొని నా¯Œ స్టాప్గా వర్కవుట్ చేస్తున్నాను. పూరి జగన్నాథ్గారు నాకు ఇష్టమైన దర్శకుడు. ఆయన సినిమాల్లో ‘పోకిరి’ నా ఫేవరేట్ ఫిల్మ్’’ అన్నారు. -
సివంగిలా దూకి....దొంగకు చుక్కలే!
సాక్షి, జలంధర్: తన చేతిలోని ఫోన్ లాక్కుని పారిపోతున్న దుండగులకు ఒక బాలిక (15) చుక్కలు చూపించింది. ఏ మాత్రం పట్టువిడవకుండా.. సివంగిలాగా దూకి వాడి ఆటకట్టించింది. సీసీటీవీలో ఈ రికార్డైన ఈ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబ్ లోని జలంధర్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఓ వీధిలోంచి నడుచుకుంటూ వెళుతున్న అమ్మాయి నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఫోన్ లాక్కున్నారు. అనంతరం సిద్ధంగా ఉన్న బైక్ పై పారిపోయే ప్రయత్నంలో ఉండగానే, మెరుపు వేగంగా కదిలింది ఆ అమ్మాయి. వెనుక కూర్చున్న ఒక దొంగను దొరక బుచ్చుకుంది. అతగాడు బైక్ దిగి ఆ అమ్మాయిని కొడుతున్నా ఏ మాత్రం వెరవలేదు..పట్టువిడవలేదు. అలానే అతని కాలర్ పట్టుకుంది. చేతికి దొరికిన ఆ దొంగను పారిపోనివ్వకుండా నిలువరించింది. ఈ లోపు స్థానికులు రావడంతో బైక్ పై ఉన్న మరో దొంగ మాత్రం పారిపోగా, దొరిగిన దొంగకు బడిత పూజ చేశారు. దీంతో ఆ అమ్మాయి తెగువ, ధైర్యంపై అభినందనలు కురుస్తున్నాయి. #Punjab: 15-year-old girl fights snatchers to save her mobile phone in #Jalandhar pic.twitter.com/MTqYvwiXPr— The Tribune (@thetribunechd) September 1, 2020 -
పాము ముంగిసల ఫైట్ వీడియో వైరల్!
పాము ముంగిసల వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా శత్రువులు అని చెప్పాలంటే కూడా వాళ్లు పాము, ముంగిసలు లాంటోళ్లు అని చెబుతాం. అలాంటిది ఒక పాము, ముంగిస రోడ్డు మీద కొట్టుకుంటూ కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అబ్ధుల్ కయ్యూమ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 29 సెకన్ల నిడివిగల ఈవీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ‘ఇదే ప్రకృతి అంటే. ఏ యోధుడు కూడా వెళ్లి వాటిలో ఏదో ఒకదానిని కాపాడటానికి ప్రయత్నించలేదు. అందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రకృతిలో పోరాడే వాళ్లే జీవించగలుగుతారు అని మరోసారి అర్థం అవుతుంది’ అని ఫారెస్ట్ ఆఫీసర్ ట్వీట్ చేశారు.దీనికి నెటిజన్లు స్పందిస్తూ అక్కడ ఉన్నవారికి జంతువుల పట్ల చాలా దయ ఉంది అందుకే అక్కడ వారు ఎవరు వాటిని విషయంలో కలగజేసుకోలేదు అని కామెంట్ చేశారు. నిజంగా ప్రకృతి అంటే ఇదే అని మరొకరు కామెంట్ పెట్టారు. వాటిని మధ్యలోకి మనం వెళ్లకూడదు వాటి పనిని వాటిని చేసుకోనివ్వాలి అని మరొక యూజర్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. This is absolutely natural. I am happy that no crusader jumped in to save either species. It’s the survival of fittest which prevails in #nature Vid-WA. @IfsJagan @vivek4wild pic.twitter.com/RtsR5LosnI — Dr Abdul Qayum, IFS (@drqayumiitk) August 18, 2020 చదవండి: వైరల్: టాయిలెట్లోకి పాము ఎలా వచ్చింది! -
ప్రెసిడెంట్ ఫైట్!
-
బై బై ముంబై
గత నలభై రోజులుగా ముంబై వీధుల్లో విహరిస్తున్నారు విజయ్ దేవరకొండ.. రేసింగ్ చేస్తున్నారు.. ఫైటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఓ చిన్న బ్రేక్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్). బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. చార్మీ, పూరి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 40 రోజుల ముంబై షెడ్యూల్ను మొన్న పూర్తి చేశారు. చిన్న బ్రేక్ తర్వాత కొత్త షెడ్యూల్ను ప్రారంభిస్తారు. ఈ సినిమాలో విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని టాక్. -
మీకు మీరే ప్రేరణ అవ్వండి
13 ఏళ్ల వయసులో హీరోయిన్గా ఎంటరై ఓ 13 ఏళ్లు నటిగా వెనక్కి తిరిగి చూసుకోనంత బిజీగా సినిమాలు చేశారు చార్మి. ‘నీ తోడు కావాలి’ (2002) నుంచి ‘జ్యోతిలక్ష్మి’ (2015) వరకూ కథనాయికగా, ప్రత్యేక పాటల్లో, అతిథి పాత్రల్లో చార్మి మెరిశారు. ‘జ్యోతిలక్ష్మి’తో నిర్మాతగా మారారు. ‘పూరి కనెక్ట్స్’ బేనర్లో వచ్చిన జ్యోతిలక్ష్మి రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ‘రొమాంటిక్’ సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండతో ప్యాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా చార్మితో జరిపిన ఇంటర్వ్యూ. ► స్క్రీన్ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ నిర్మాణ రంగంలో తక్కువమంది ఉన్నారు. మీరు యాక్టర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తెరవెనకతో పోల్చితే తెర మీద కనిపించే స్త్రీల సంఖ్య ఎక్కువే. కానీ యాక్టింగ్ అనేది సాధారణ విషయం కాదు. ఎంతో అంకితభావం, ఇష్టం ఉండాలి. దాంతోపాటు ఎంతో త్యాగం కూడా ఉంటుంది. అప్పుడే ఇండస్ట్రీలో ఉండగలుగుతాం. నా యాక్టింగ్ కెరీర్లో నేను చాలా ఎత్తుకి ఎదిగాను, అవార్డులు తీసుకున్నాను. కానీ ‘జ్యోతిలక్ష్మి’ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో నటిస్తూ, నిర్మించాను. ఒకవైపు ప్రొడక్షన్కి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటూ, ఎవరిని ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకుంటూ మరోవైపు నటనని కూడా బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. అయితే యాక్టింగ్ కంటే ప్రొడక్షన్ చాలా చాలెంజింగ్గా అనిపించింది. ఒక మంచి సినిమా ఇవ్వడానికి నిర్మాత పడే కష్టాలు తెలిశాయి. ఒక స్త్రీగా నిర్మాణం సవాల్ అయినప్పటికీ సంతృప్తినిస్తోంది. అందుకే ప్రొడక్షన్ని కెరీర్గా చేసుకుని తెరవెనక పని చేస్తున్నాను. దేశంలో మనకున్న అతి తక్కువమంది సక్సెస్ఫుల్ యంగ్ లేడీ ప్రొడ్యూసర్స్లో నేను ఒకదాన్ని కావడం ఆనందంగా, గర్వంగా ఉంది. ► డైరెక్టర్ పూరీ జగన్నాథ్గారు సపోర్ట్ చేయడంవల్లే మీరు ప్రొడక్షన్ చూసుకోగలుగుతున్నారా? లేక మీ అంతట మీరు సొంతంగా ప్రొడక్షన్ని హ్యాండిల్ చేసే ధైర్యం మీకుందా? పూరీగారు, నేను ఒకర్నొకరం సపోర్ట్ చేసు కుంటాం. మా మంచీ చెడులకు మేం ఒకరికొకరం అండగా నిలబడ్డాం. ఇక నేను ఓన్గా ప్రొడక్షన్ చూసుకోగలనా అంటే.. ‘జ్యోతిలక్ష్మి’ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు విజయ్ దేవరకొండతో తీస్తున్న సినిమాతో కలిపి ఐదేళ్లుగా సినిమాలు నిర్మిస్తున్నాను. మరి నాకు ఓన్గా ప్రొడక్షన్ని హ్యాండిల్ చేసేంత ధైర్యం ఉందో లేదో చెప్పండి (నవ్వుతూ). ► మేల్, ఫిమేల్ ప్రొడ్యూసర్కి ఉన్న డిఫరెన్స్? జెండర్ తేడా తప్ప పని విషయంలో ఏ తేడా ఉండదు. పీపుల్ని డీల్ చేసే విషయంలోను, సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలోనూ అంతా ఒకటే. అయితే పెద్ద తేడా ఏంటంటే.. ఆడవాళ్లను నిరుత్సాహపరచడానికి చాలామంది ట్రై చేస్తారు. ఈ బిజినెస్కి పనికి రావు అన్నట్లుగా డౌన్ చేస్తారు. అలాంటి సమయాల్లో స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటివాళ్లను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి. కేవలం వాళ్లకున్న అభద్రతాభావంవల్లే స్త్రీలను నిరుత్సాహపరచడానికి ట్రై చేస్తారు. ► హీరోయిన్గా ఎదుర్కొన్న సవాళ్లు? ఇప్పుడు నిర్మాతగా ఎదుర్కొంటున్న వాటి గురించి? నా పదమూడేళ్ల వయసులో యాక్టింగ్ కెరీర్ని మొదలుపెట్టాను. అప్పటినుంచి నటిగా నా చివరి సినిమా ‘జ్యోతిలక్ష్మి’ వరకు కెరీర్ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ చాలా ఎత్తుపల్లాలు చూశాను. తట్టుకుని ముందుకెళ్లాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. మన ప్రతిభే మనల్ని శిఖరానికి చేర్చుతుంది. నటిగా నన్ను ప్రూవ్ చేసుకున్నాక అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టాక చాలామంది ‘నెగటివ్ అడ్వైస్’లు ఇచ్చారు. ప్రొడక్షన్ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చాను. పైగా ఫిమేల్ ప్రొడ్యూసర్. అయితే మానసికంగా స్ట్రాంగ్గా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఫైనల్లీ ప్యాన్ ఇండియా మూవీ (‘ఫైటర్’) ప్రొడ్యూసర్గా బెస్ట్ స్పేస్లో ఉన్నాను. ► నటన, నిర్మాణం ఏది సౌకర్యంగా ఉంది? మీరు ఒక పని చేస్తున్నప్పుడు నేను ‘కంఫర్ట్బుల్గా ఉన్నాను’ అనే ఫీలింగ్ వస్తే అక్కడితో లైఫ్ చివరి దశకు చేరుకున్నట్లే. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. జీవితం అంటేనే సాహసం. అది కంఫర్ట్గా ఉండేకన్నా చాలెంజింగ్గా ఉంటేనే బాగుంటుంది. ► ఫైనల్లీ.. నటిగా ఇండస్ట్రీని చూశారు. ఇప్పుడు నిర్మాతగా చూస్తున్నారు. ఈ రెండింటిలో స్త్రీకి ఏది సేఫ్? ఏది సేఫ్ అని అడుగుతున్నారంటేనే స్త్రీకి ఎక్కడైనా కష్టాలు ఉన్నట్లే. ముఖ్యంగా మన సమాజంలో స్త్రీలకు ఏదో ఒక అసౌకర్య పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. నటన, నిర్మాణం అనేది పక్కన పెడదాం. ప్రతి ఫీల్డ్లోనూ స్త్రీలకు సవాళ్లు, కష్టాలు ఉంటాయి. వాటికి భయపడిపోకూడదు. ‘స్ట్రాంగ్గా ఉండండి. మీకు మీరే ప్రేరణ అవ్వండి’. -
పడబోయిన అర్జున్రెడ్డి.. అనన్యపై సెటైర్లు!
హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ భామ అనన్య పాండేలు జంటగా నటిస్తున్న సినిమా ‘ఫైటర్’. ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల వీరిద్దరూ ముంబై వీధుల్లో బైక్పై చక్కర్లు కొడుతూ రైడ్ను ఆస్వాదిస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్కి సంబంధించిన మరో వీడియో సోషల్ వీడియాలో వైరల్ అవుతోంది. ఇక విజయ్ షూటింగ్ స్పాట్కు కొంత మందితో నడుచుకుంటూ వస్తుండగా ఆకస్మాత్తుగా కాలు జారి పడిపోబోయాడు. దాదాపు కింద పడిపోతున్న సమయంలో తన చుట్టూ ఉన్న వారు విజయ్ను పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రొమాంటిక్ రైడ్ View this post on Instagram Slippery when wet, cautious Vijay ji you are precious to all of us✋ A post shared by Viral Bhayani (@viralbhayani) on Mar 4, 2020 at 10:36am PST నా క్యారెక్టర్ నాలానే ఉంటుంది! ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘కాస్త చూసుకోండి అర్జున్రెడ్డి సార్.. ప్రీతి బాగానే ఉంది కదా. మీకేమైనా అయితే తను ఏం అయిపోతుంది!’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక ఈ ‘ఫైటర్’ భామ అనన్యను ఉద్దేశించి... ‘అరె.. అనన్య నీ తాజా జోడి(అనకొండ) పడిపోబోయాడు.. తనని జాగ్రతగా చూసుకోవాలి కదా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా టాలీవుడ్ కమర్షియల్ దర్శకుడు పూరీ జగన్నాద్ రూపొందిస్తున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీనులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సెట్స్పైకి వచ్చిన ‘ఫైటర్’ను ఏకకాలంలో తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కిస్తున్నారు. -
రొమాంటిక్ రైడ్
ముంబై వీధుల్లో బైక్పై రొమాంటిక్ రైడ్ను ఆస్వాదిస్తున్నారు విజయ్ దేవరకొండ, అనన్యా పాండే. ఇదంతా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న ‘ఫైటర్’(వర్కింగ్ టైటిల్) సినిమా కోసం. ఛార్మి, పూరి, కరణ్ జొహర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై నగరంలో జరుగుతోంది. బైక్ రేసింగ్కి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బైక్పై అనన్యా పాండేతో రేస్లో పాల్గొన్నారు విజయ్. మరి రేస్ గెలిచారా? వేచి చూడాలి. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. -
ఫైటింగ్ షురూ
‘ఫైటర్’ చిత్రానికి ముంబైలో ముహూర్తం జరిపారు పూరి జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫైటర్’. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సోమవారం ఉదయం ముంబైలో ప్రారంభమయింది. విజయ్ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చార్మి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమా హిందీ, తెలుగు, దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండను సరికొత్త లుక్లో చూపించనున్నారట పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ఫైటర్కు జోడి?
మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుని ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఇక రంగంలోకి దిగడమే ఆలస్యం. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నా«థ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సిక్స్ప్యాక్తో కనిపిస్తారు. ఈ సినిమాలో చేయబోయే ఫైట్స్ కోసం విజయ్ థాయ్ల్యాండ్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలో ముంబైలో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ సినిమాలో కథనాయికగా ఇప్పటికే చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే పేరు తెరపైకి వచ్చింది. మరి.. ఫైటర్కు అనన్య జోడీ అవుతారా? ఈ సినిమాతో సౌత్కు ఎంట్రీ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా అనన్య వెండితెర ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్‘పతీపత్నీ ఔర్ ఓ’ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించుకున్న అనన్య ప్రస్తుతం ‘ఖాలీ పీలి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
స్టయిలిష్ ఫైటర్
పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రం ‘ఫైటర్’ కోసం విజయ్ దేవరకొండను ఫైటర్లా మారుస్తున్నారు. ఈ ఫైటర్ను ఫీల్డ్లో దింపే టైమ్ను రెడీ చేసుకున్నారు పూరి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్న చిత్రం ‘ఫైటర్’. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ను ముంబైలో ప్రారంభించనున్నారని తెలిసింది. జనవరి 13న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఎక్కువ శాతం షూటింగ్ ముంబైలోనే జరగనుంది. ఈ సినిమాలో విజయ్ వేషధారణ, శరీరాకృతిని సరికొత్తగా డిజైన్ చేశారట పూరి. ప్రముఖ బాలీవుడ్ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఈ సినిమాకు పని చేయనున్నారు. సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, రణ్బీర్ కపూర్తో పాటు ‘సాహో’లో ప్రభాస్కు స్టయిలింగ్ చేశారు ఆలిమ్ హకీమ్. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్కు స్టయిలిస్ట్గా చేస్తున్నారాయన. ఇప్పుడు విజయ్ దేవరకొండకు స్టయిలిస్ట్గా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటించనున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానున్న ఈ సినిమాను పూరి, ఛార్మీ నిర్మిస్తారు. -
5 భాషల్లో ఫైటర్
కథలో సత్తా ఉంటే ఒక్క భాష అని హద్దులు పెట్టలేం. ఇప్పుడు కథలన్నీ హద్దులు దాటుతున్నాయి. దర్శకులందరూ ప్యాన్ ఇండియా సినిమాలపై దృష్టిపెడుతున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఓ ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశారు. విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు పూరి. చార్మితో కలసి ఈ సినిమాను నిర్మిస్తారాయన. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్కు కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించనున్నారట. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగనున్న ఈ కథలో విజయ్ కొత్త లుక్లో కనిపిస్తారట. దీనికి సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టారు. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
పవర్ఫుల్ పాత్రలో
‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్బస్టర్హిట్ని అందుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండను ‘ఫైటర్’గా మార్చే పనిలో పడ్డారు పూరి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను సంప్రదించినట్టు తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో విజయ్ హీరోగా ‘ఫైటర్’ చిత్రం తెరకెక్కనుంది. పూరి, చార్మి నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
ఫైటర్ విజయ్
‘ఇస్మార్ట్ శంకర్’ తో పూరి జగన్నాథ్ బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సక్సెస్ జోష్లోనే మరో హిట్ సాధించాలని స్రిప్ట్ వర్క్ని స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండను హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు పూరి. ఈ సినిమాను పూరి జగన్నాథ్, చార్మీ నిర్మించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్లో విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని తెలిసింది. ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసుకుని జనవరి నుంచి చిత్రీకరణ మొదలుపెట్టా లేనుకుంటున్నారు. హీరోయిజాన్ని ఓ లెవల్లో చూపించే పూరి...విజయ్ దేవరకొండను ఏ మాస్ యాంగిల్లో ప్రజెంట్ చేయబోతున్నారా? అని విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
‘ఫైటర్’గా రౌడీ!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో త్వరలో ఓసినిమా పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం పూరి ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావటంతో విజయ్ కూడా పూరి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. విజయ్ యాటిట్యూడ్కి, పూరి మార్క్ టేకింగ్కు ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామాతో పాటు, తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హీరో’ సినిమాల్లో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే పూరి సినిమా పట్టాలెక్కనుంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న పూరి, విజయ్ దేవరకొండ సినిమాతో తన సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పూరి, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దూషించుకున్న టీడీపీ, బీజేపీ శ్రేణులు
-
కర్నూలు జిల్లాలో ప్రజాదర్బార్లో రసాభాస
-
తాగుబోతుల అడ్డగా మారిన అన్నా క్యాంటీన్లు
-
సాయుధ పోరాట యోధుడికి సన్మానం
కోదాడ: తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంకు, నడిగూడెం దొరకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన నడిగూడెం మండలం వాయిల సింగారానికి చెందిన చండూరు రామారావును ఆదివారం సీపీఎం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక సుందరయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కుక్కడపు ప్రసాద్ మాట్లాడుతూ మునగాల పరగణాకు చెందిన నడిగూడెం జమిందార్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. సర్పంచ్గా పనిచేసిన 15 సంవత్సరాల కాలంలో 100 ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత రామారావుదన్నారు. పేదల కోసం నిరంతర ఉద్యమాలు నిర్వహించిన రామారావును స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమపంగు రాధాకృష్ణ, సూర్యనారాయణ, స్వరాజ్యం, కృష్ణ, లక్ష్మయ్య, శ్రీనివాస్, సతీశ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
మధిర రూరల్ : స్వాతంత్య్ర సమరయోధుడు, మధిర మున్సిపల్ మాజీ చైర్మన్ మందడపు ప్రభాకర్రావు(97) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతిచెందారు. 1964లో మధిర మున్సిపాల్టీకి చివరి చైర్మన్గా పనిచేశారు. డీసీఎంఎస్ చైర్మన్గా, మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డికి ముఖ్య సహచరుడిగా పనిచేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని మధిర మాజీ సర్పంచ్ వాసంశెట్టి లక్ష్మీప్రియ తెలిపారు. గురువారం పలువురు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా, ప్రభాకర్రావుకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
అమెరికా రాయితీ ఇవ్వకపోతే కొనుగోలు కష్టమేః పాకిస్తాన్
వాషింగ్టన్ః ఎఫ్-16 యుద్ధవిమానాలు కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ మొత్తం డబ్బు చెల్లించాల్సిందేనని, ఎటువంటి రాయితీలు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేసింది. అవసరమైతే పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి విమానాలు కొనుగోలు చేయొచ్చని సలహా కూడ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ కూడ తన నిర్ణయం మార్చుకునేట్లు కనిపిస్తోంది. ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా రాయితీలు ఇవ్వని పక్షంలో అంత పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి విమానాలను కొనుగోలు చేయడం కష్టమేనని పాకిస్తాన్ విదేశీ వ్యవహారల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే తీవ్రవాద వ్యతిరేక ప్రచారంలో తాము వాడే ఎఫ్-17 థండర్ జెట్స్ స్థానంలో ప్రభావవంతమైన ఎఫ్-16 కు ప్రాధాన్యతనిచ్చామని అజీజ్ తెలిపినట్లు ఓ పాకిస్తానీ వార్తా పత్రిక తెలిపింది. చైనా ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ద్వారా అభివృద్ధి చేసిన జెఎఫ్-17 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఇకపై వెన్నెముకగా మారుతుందని కూడ ఆయన అభిప్రాయపడ్డట్టు వెల్లడించింది. అమెరికానుంచి ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనేందుకు ఇంతకు ముందు పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న ప్రకారం అమెరికా రాయితీని కల్పించి ఉంటే... ఎనిమిది విమానాలకు పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి అమెరికాకు 270 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. అయితే కొనుగోలుకు కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ, విదేశీ మిలటరీ ఫైనాన్సింగ్ నిధులను వినియోగించడంపై అమెరికా సెనేటర్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పరిస్థితి తారుమారైంది. -
రోడ్డుపై కూలిన విమానం ఏడుగురు మృతి
లండన్: ఇంగ్లాండ్లోని బ్రిగ్టన్ సిటీ సమీపంలో వైమానిక విన్యాసాల్లో పాల్గొన్న ఓ యుద్ధ విమానం కూప్పకూలడంతో ఏడుగురు చనిపోయారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, దాదాపు 14 మంది గాయాలపాలయ్యారని శనివారం పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఇంగ్లాండ్లోని బ్రిగ్టన్ దగ్గర్లో శనివారం మధ్యాహ్నం సమయంలో ‘షోరెహామ్ ఎయిర్ షో’లో 1950లనాటి హ్యాకర్ హంటర్ యుద్ధవిమానం వృత్తాకారంలో వైమానిక విన్యాసం ప్రదర్శిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో ఎయిర్పోర్టు సమీపంలో రద్దీగా ఉన్న రహదారిపై కుప్పకూలింది. విమానం నిట్టనిలువుగా పడడంతో ఏడుగురు అక్కడిక్కడే మరణించారని వెస్ట్ ససెక్స్ విభాగం పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పిం చారు. రోడ్డుపై విమానం కూలడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. -
శ్రీకాంత్... పోరాట యోధుడు
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ముఖచిత్రంపై భారత స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ అద్భుత విజయాలతో తనదైన ముద్ర వేస్తున్నాడు. గతేడాది లిన్ డాన్ను మట్టికరిపించి చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ను గెలుచుకోగా తాజాగా ఇండియా ఓపెన్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన 22 ఏళ్ల శ్రీకాంత్ సూపర్ షోపై బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. అతణ్ని ఓ పోరాట యోధుడిగా కొనియాడారు. అద్భుతమైన స్ట్రోక్ షాట్లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ దూసుకెళుతున్నాడని చెప్పారు. అయితే మున్ముందు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేందుకు మరింత పరిణతి సాధించాల్సిన అవసరం ఉందని సూచించారు. నిలకడగా ఆడితేనే: రాబోయే రోజుల్లో శ్రీకాంత్ మరిన్ని విజయాలు సాధించాలంటే నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. అదే అతడికి కీలకం కానుంది. ఇప్పటికైతే బాగా ఆడుతున్నాడు. ఎప్పుడైతే టైటిల్స్ గెలుస్తామో.. ప్రత్యర్థులకు అసాధ్యులుగా కనిపిస్తాము. కొందరు మ్యాచ్లను గెలిచినా హఠాత్తుగా పరాజయాల బాట పడుతారు. ఆ విషయంగా ఆలోచిస్తే శ్రీకాంత్ చాలా మెరుగ్గా ఉన్నాడు. మంచి స్ట్రోక్స్తో ఆటను తనవైపు తిప్పుకుంటున్నాడు. మానసికంగా పరిణతి సాధించాలి: విజయాలను అలవాటుగా మార్చుకోవాలంటే మానసికంగా పరిణతి సాధించాల్సి ఉంటుంది. అలాగే శారీరకంగానూ ఫిట్గా ఉండాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. భారీ స్మాష్, నెట్ గేమ్, స్ట్రోక్స్తో తను ప్రత్యర్థులకు అందకుండా ఉన్నాడు. కల నిజమైనట్టుంది: ఇండియా ఓపెన్ టైటిల్స్ను సైనా, శ్రీకాంత్ గెలవడం కల నిజమైనట్టుగా ఉంది. నిజంగా అద్భుతం. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రణయ్, గురుసాయిదత్ ప్రదర్శన కూడా బావుంది. వీరంతా యువకులే కాబట్టి భవిష్యత్ విజయాలకు ఇది మంచి ప్రారంభంగా చెప్పుకోవచ్చు. సైనా ర్యాంకుతో సంతోషం: ప్రపంచ నంబర్వన్గా సైనా నెహ్వాల్ నిలవడం అత్యద్భుతం. కొన్నేళ్లుగా ఆమెకు మంచే జరుగుతుంది. ఆటతీరులోనే కాకుండా కోర్టులోనూ చురుగ్గా కదులుతోంది. ఈ ర్యాంకు సైనాకే కాకుండా దేశంలోని క్రీడకు కూడా మేలు చేస్తుంది. -
నింగిలోకి ‘తేజస్ పీవీ-6’ యుద్ధ విమానం
తొలిసారిగా ఎగిరిన తుది ట్రెయినర్ వెర్షన్ తేజస్ ప్రాజెక్టులో మరో కీలక విజయం న్యూఢిల్లీ: భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ పీవీ(ప్రొటోటైప్ వెహికల్)-6’ శుక్రవారం మధ్యాహ్నం విజయవంతంగా నింగికి ఎగిరింది. తేజస్ యుద్ధ విమానాల్లో తుది రకం శిక్షణ విమానం అయిన రెండు సీట్ల తేజస్ పీవీ-6ను గ్రూప్ కెప్టెన్లు వివర్త్ సింగ్, అనూప్ కబద్వాల్లు విజయవంతంగా నడిపారు. రెండు దశాబ్దాల కాలంలో మొత్తం 15 వెర్షన్ల తేజస్ విమానాలు గాలిలోకి ఎగరగా.. ఇది చివరిదైన 16వ వెర్షన్కు చెందినది. ఇప్పటిదాకా తేజస్ విమానాలు 2,500 సార్లకుపైగా నింగికి ఎగిరాయి. అన్ని తేజస్ విమానాల్లోనూ ఉన్న ప్రధాన సాంకేతికతలను తేజస్ పీవీ-6లో పొందుపర్చారు. తేజస్ శిక్షణ విమానాలకు ఇదే తుది వెర్షన్ విమానం. దీనిలో ఆధునిక కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలు, ఈడబ్ల్యూ సెన్సర్లు, ఆటోమేటిక్ ల్యాండింగ్ కోసం కొత్త నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. తాజా విజయంతో స్వదేశీ తేజస్ యుద్ధవిమానం, శిక్షణ విమానాల తయారీ విజయవంతం అయిందని, దీంతో దేశ రక్షణ రంగానికి కొత్త బలం చేకూరుతుందంటూ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) డెరైక్టర్ జనరల్ అవినాశ్ చందర్ తేజస్ బృందాన్ని అభినందించారు. కాగా, తేజస్ను డీఆర్డీవో, హెచ్ఏఎల్లు సంయుక్తంగా అభివృద్ధిపరుస్తున్నాయి. 1983లోనే ఈ ప్రాజెక్టు మొదలైనా.. అనేక అవాంతరాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తేజస్ విమానానికి ప్రాథమిక అనుమతి గతేడాదే లభించింది. మరికొన్ని నెలల్లో తుది అనుమతి (ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్) లభించాల్సి ఉంది. -
ఈ అమ్మాయి ఆల్రౌండర్!
అమెరికాలో ఉంటున్న భారతీయసంతతి అమ్మాయి సురభిని చూస్తే ముచ్చటేస్తుంది. పదిహేనేళ్ల సురభి బెరివాల్ బహుముఖ ప్రజ్ఞాశాలి. రైటర్, డ్యాన్సర్, ఫైటర్గా రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్న సురభి చదువులో కూడా దూసుకుపోతోంది. స్పానిష్ భాష నేర్చుకొని ‘నేషనల్ స్పానిష్ ఎగ్జామ్’లో బంగారు పతకాన్ని అందుకుంది. ‘‘రచన అంటే నాకు చాలా ఇష్టం’’ అని చెబుతున్న సురభి కోల్కతాలో జన్మించింది. మూడు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో పాటు పెన్సిల్వేనియా(అమెరికా)కు వచ్చింది. వ్యాసాలు, నాటికలు, కవిత్వం రాయడం అంటే సురభికి చాలా ఇష్టం. ‘ఆస్క్ ఆల్సన్’ పేరుతో ఆమె రాసిన నాటికకు మంచి పేరు వచ్చింది. వివిధ సామాజిక సమస్యపై సురభి రాసిన వ్యాసాలకు ఎన్నో బహుమతులు వచ్చాయి. గత సంవత్సరం ఫోర్త్-డిగ్రీ బ్లాక్బెల్ట్ తీసుకోవడం ద్వారా కరాటేలో తన సత్తా చాటింది సురభి. స్కూల్ ‘స్పీచ్ అండ్ డిబేట్ టీమ్’కు సెక్రటరీగా మంచి మార్కులు కొట్టేసింది. స్వచ్ఛంద సేవ అంటే సురభికి చాలా ఇష్టం. స్థానిక రోటరీ క్లబ్, స్కూల్లోని ‘నేషనల్ హానర్స్ సొసైటీ’ తరఫున ఎన్నో రకాల సేవా కార్యక్రమాలలో పాల్గొంది. ‘‘ప్రతి విషయంలోనూ నా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. గాంధీ, మార్టిన్ లూథర్కింగ్ బోధనల గురించి ఎప్పుడూ చెబుతుంటారు’’ అంటుంది సురభి. తన సోదరుడు సంజీత్ తరచుగా గుర్తు చేసే వాక్యం- ‘కల కను. కలను నిజం చేసుకో’ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న యువతను ఉద్దేశించి ఒక నవల రాసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉంది సురభి.