go
-
రహస్య జీవోలిస్తూ పారదర్శక పాలనంటే ఎలా?
సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలపై నీతులు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడె కట్టేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన ఏడు నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి, పైకి మాత్రం పారదర్శక ప్రభుత్వం అని చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన నేతృత్వం వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకేరోజు ఏకంగా 6 రహస్య జీవోలు ఇచ్చి ఆయనేమీ తక్కువ తినలేదని నిరూపించుకున్నాడని చెప్పారు.ఆ రహస్య జీవోలన్నీ కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పేవి, కన్సల్టెన్సీలకు బిల్లులు చెల్లించేవే అని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని, పవన్ సైతం అబద్ధాల్లో చంద్రబాబునే మించిపోయారని అన్నారు. తాము ఏ వివరాలను గోప్యంగా ఉంచబోమని, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని, ఇదే పారదర్శక పాలనకు సాక్ష్యమంటూ గత ఏడాది ఆగస్టు 30న ప్రకటించిన చంద్రబాబు, పవన్.. వాస్తవంలో అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారని వివరించారు.కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించి 36, మున్సిపల్ శాఖలో 14, జనరల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి 4, ఆర్థిక శాఖకు చెందినవి 5, ఇరిగేషన్లో 6, హోంశాఖలో 4 జీవోలు రహస్యంగా ఇచ్చారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనూ ఒకే రోజు 6 రహస్య జీవోలిచ్చారని, ఇవన్నీ కీలకమైన జీవోలేనని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఆ జీవోలన్నీ బహిర్గతం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు. -
మీ సపోర్ట్కు హృదయపూర్వక ధన్యవాదాలు.. అల్లు అర్జున్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. సినిమాకు మీరు ఇస్తున్న సపోర్ట్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. పుష్ప-2 టికెట్స్ పెంచుకునేందుకు జీవో ఇవ్వడం లాంటి మీ ఆలోచనాత్మక నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంవో, సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.(ఇది చదవండి: తెలంగాణలో పుష్ప-2 రిలీజ్కు తొలగిన అడ్డంకులు)కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 సినిమాకు బెనిఫిట్ షోలతో పాటు టికెట్స్ పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే పడనున్న బెనిఫిట్ షోలకు గరిష్ఠంగా రూ.800 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. అలాగే అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతించింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్లో రూ.200 పెంపుకోవచ్చని జీవోలో తెలిపింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.105, మల్టీఫ్లెక్స్లో రూ.150, డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.20, మల్టీఫ్లెక్స్లో రూ.50 పెంచుకునేలా జీవో జారీ చేసింది.A heartfelt thank you to the Government of Telangana for their support through the approval of ticket hikes and the new GO. Your thoughtful decision fosters the growth of Telugu cinema. A special thank you to Hon’ble @TelanganaCMO Sri @revanth_anumula garu for his unwavering…— Allu Arjun (@alluarjun) December 3, 2024 -
TG: పలువురు ఐఏఎస్ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి శనివారం(ఆగస్టు31)ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో సురేంద్రమోహన్,యాస్మిన్బాషా,వినయ్ కృష్ణారెడ్డి, మల్సూర్ తదితరులున్నారు. వీరిలో సురేంద్రమోహన్ను మైన్స్ అండ్ జియాలజీ సెక్రటరీగా యాస్మిన్ బాషాను హార్టీ కల్చర్ డైరెక్టర్గా మల్సూర్ను మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్చైర్మన్గా నియమించారు. -
ఏపీలో ఇసుక విధానం కోసం మార్గదర్శకాలు
అమరావతి, సాక్షి: ఏపీలో కొత్త ఇసుక విధానం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 40 పేరిట.. 2019, 2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2024 ఇసుక విధానం రూపకల్పన జరగాల్సిన ఉందని చెబుతూ.. అప్పటిదాకా కలెక్టర్లకు ఇచ్చిన ఈ అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఎస్పీ, జేసీ, పలువురు శాఖల అధికారులు కమిటీలుగా నియమించింది. అయితే భవన నిర్మాణాలు మినహా మరేయితర అవసరాలకు ఇసుకను వినియోగించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాపై అధికారికంగా ఇంకా ఉత్తర్వులు విడుదల కాలేదు. అయితే వీటిని కమిటీలు పర్యవేక్షించాలని ప్రభుత్వం తాజా జీవోలో తెలిపింది. ఇక కొత్త ఇసుక విధానంపై త్వరలో ఉత్తర్వులు జారీ కావొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
TG: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ బదిలీలు చేసింది. మొత్తం 28 మంది పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణపరిపాలన శాఖ సోమవారం(జూన్17) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్ప్లాన్ను రూపొందించాలని, ట్రిపుల్ వన్లోని ప్రాంతాలను కూడా మాస్టర్ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్ప్లాన్లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్ప్లాన్లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్ప్లాన్లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
AP: ఎస్మా పరిధిలోకి అంగన్వాడీ సర్వీసులు
సాక్షి, విజయవాడ: అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి రాష్ట్రంలోని అంగన్వాడీలను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా ప్రభుత్వం పరిగణించింది. ఆరు నెలల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో సమ్మెలు నిషేధించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇదీచదవండి.. సంక్రాంతికి స్పెషల్ రైళ్లు -
అవసరంలేని, అప్రాధాన్య జీవోలనే వెబ్సైట్లో ఉంచడం లేదు
సాక్షి, అమరావతి: ప్రజలకు ఏ మాత్రం అవసరంలేని, ప్రాధాన్యతలేని, ఇతర సాధారణ జీవోలను అధికారిక వెబ్సైట్లో ఉంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. మెడికల్ బిల్లులు, పెట్రోల్ అలవెన్సులు, ఇతర చెల్లింపులు తదితరాలకు సంబంధించిన జీవోలు ప్రజలకు అంత అవసరంలేదని, అందుకే వాటిని వెబ్సైట్లో ఉంచడం లేదని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ హైకోర్టుకు వివరించారు. ఇందులో దాచేందుకు ఏమీలేదని తెలిపారు. మిగిలిన జీవోలను విడుదలైన వారం రోజుల్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామన్నారు. అత్యవసర జీవోలను మరుసటిరోజే అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు. జీవోల విషయంలో గోప్యత పాటించాల్సిన అవసరం లేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై ఈ నెల 22న విచారిస్తామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. జీవోలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచారహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జి.ఎం.ఎన్.ఎస్.దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు, బాపట్ల జిల్లాకు చెందిన సింగయ్య తదితరులు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు విచారణ జాబితాలో ఉన్నప్పటికీ విచారణకు నోచుకోని వీటిపై అత్యవసర విచారణ జరపాలంటూ పిటిషనర్ల న్యాయవాదులు బుదవారం సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యధిక జీవోలను ప్రభుత్వం అప్లోడ్ చేయకుండా గోప్యత పాటిస్తోందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జీవోలను వెబ్సైట్లో ఉంచడం వల్ల నష్టమేముందని ప్రశ్నించింది. జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచితే మంచిదేగా అని వ్యాఖ్యానించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ స్పందిస్తూ.. ప్రజలకు అవసరంలేని, ప్రాధాన్యతలేని, సాధారణ జీవోలనే వెబ్సైట్లో ఉంచడం లేదని తెలిపారు. మిగిలిన జీవోలను వెబ్సైట్లో ఉంచుతున్నామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాల్లో విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. -
వీఆర్వోలకు మేలు చేసేలా జీవోలు
సాక్షి, అమరావతి: వీఆర్వోలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం 154, 64, 6538, 166, 31 జీవోలు జారీ చేసిందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (వీఆర్వో అసోసియేషన్) అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు త్వరలో రాష్ట్రస్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో రవీంద్రరాజు మాట్లాడుతూ.. రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులలో వీఆర్వోలకు ప్రస్తుతం ఉన్న కోటా 40 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని, ఖాళీగా ఉన్న సీనియర్ సహాయకుల పోస్టులలో వన్టైమ్ సెటిల్మెంట్ ప్రకారం 70 శాతం పదోన్నతులను వీఆర్వోలతో భర్తీ చేయాలని కోరారు. సర్వే సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గ్రేడ్–2 వీఆర్వోల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, నాయకులు బాలాజీరెడ్డి, మౌళి భాష, లక్ష్మీనారాయణ, బాపూజీ పాల్గొన్నారు. -
ఆ జీవోలపై హైకోర్టు పునర్విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ స్కాంలతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ 1411.. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ను సవాలుచేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు శనివారం తిరిగి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, కేంద్రం దాఖలు చేసే కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్లయిన రామయ్య, రాజేంద్రప్రసాద్లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పట్టించుకోని సింగిల్ జడ్జి.. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు జీఓలను సవాలుచేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్లు 2020లో వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై విచారణ జరిపిన నాటి న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, ఆ జీఓల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2020 సెపె్టంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే సంపూర్ణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత ప్రభుత్వాలు తప్పనిసరిగా కొనసాగించాలన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సైతం న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ జీఓలవల్ల వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్లు బాధిత వ్యక్తులు కాదని, వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సైతం జస్టిస్ సోమయాజులు పరిగణనలోకి తీసుకోలేదు. ‘సుప్రీం’ ఆదేశాలతో తిరిగి విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తిరిగి ఈ ఏడాది జూన్లో విచారణ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. అటు తరువాత పలుమార్లు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. తాజాగా.. శనివారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. కౌంటర్ల దాఖలుకు కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ తరఫు న్యాయవాది వరుణ్ బైరెడ్డి గడువు కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. సిట్ పరిధిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలంటూ తాజాగా పిల్ దాఖలైందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యం విచారణకు వస్తే అందులోనూ కేంద్రం తన వైఖరిని తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి గడువునిచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేశారు. అప్పటికల్లా ఇరుపక్షాలు కౌంటర్లు, వాటికి రిప్లైలు దాఖలు చేయడం పూర్తిచేయాలని న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు.. దీంతో.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టి వాటిని రద్దుచేసింది. హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీఓలను పరిశీలిస్తే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు ఆ జీఓ జారీ అయినట్లు భావించడానికి వీల్లేదంది. కేంద్రాన్ని సైతం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేర్చుకోవాలని హైకోర్టును ఆదేశించింది. కేంద్రం అభిప్రాయం కూడా తెలుసుకోవాలంది. కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను మూడునెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో హైకోర్టుకు స్పష్టం చేసింది. -
‘పాలమూరు–రంగారెడ్డి’ జీవోపై సుప్రీంకోర్టుకు ఏపీ
సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలు కేటాయించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల(జీవో)ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జీవోపై విచారణ చేపట్టడం తమ పరిధిలోకి రాదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్(ఐఏ)ను తిరస్కరిస్తూ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్చ ఏపీ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని నివేదించనుంది. ఆ జీవోను రద్దు చేయడం ద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. -
'పాక్కు వెళ్లండి..' టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకాలో ఓ టీచర్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి పాకిస్థాన్కు వెళ్లండి.. ఇది హిందూ దేశం అని అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు వారి కుటుంబంతో కలిసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శివమొగ్గ జిల్లాలోని ఓ ఉర్దూ ఇన్స్టిట్యూషన్లో ఈ ఘటన జరిగింది. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కన్నడ భాష క్లాస్ జరుగుతుండగానే అల్లరి చేశారు. ఒకరిపై మరొకరు ఘర్ణణకు దిగారు. దీంతో విసిగిపోయిన కన్నడ భాష బోధించే టీచర్.. విద్యార్థులను పాకిస్థాన్కు వెళ్లాలని.. ఇది హిందూ దేశమని అన్నారు. సదరు టీచర్ను బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఉర్దూ స్కూల్లో ఆ టీచర్ ఎనిమిదేళ్లుగా బోధిస్తున్నారని, మొత్తం 26 ఏళ్ల అనుభవం ఉన్నట్లు గుర్తించారు. ఆమె రెగ్యులర్ ఉద్యోగిని అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఘటనల తర్వాత మళ్లీ కర్ణాటకాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ముజఫర్నగర్లో ఓ ముస్లిం విద్యార్థిని తోటి పిల్లలతో టీచర్ కొట్టించారు. చివరికి పిల్లాడిని దండించాలనే తప్పా మతపరమైన ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఢిల్లీలో తరగది గదిలో ఓ టీచర్ విద్యార్థులను పాక్కు వెళ్లాలని సూచించారు. అనంతరం మళ్లీ కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఇదీ చదవండి: సోనియాగాంధీకి ఆస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స.. -
సర్దార్ పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం
గన్పౌండ్రీ (హైదరాబాద్): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ మహరాజ్ 373వ జయంతి జాతీయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ కులస్తుల అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. పాపన్న చరిత్ర తెలుసుకుంటే జాతిపట్ల అప్పట్లో ఎంత వివక్షత ఉందో తెలుస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. ట్యాంక్బండ్పై పాపన్న విగ్రహాన్ని పెట్టేందుకు జీవో జారీ చేశామని హెచ్ఎండీఏ అధికారులు స్థలాన్ని అన్వేషీస్తున్నట్లు వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ, బహుజనులంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు భరత్కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. 75 సంవత్సరాల రాజమండ్రి పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తి పార్లమెంటుకు ఎంపిక కావడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ బయోపిక్పై రూపొందించిన సినిమా వాల్పోస్టర్ను ఆవిష్కరించగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లే రవికుమార్గౌడ్, జై గౌడ్ ఉద్యమం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వి.రామారావుగౌడ్ పాల్గొన్నారు. -
జీవో కాపీలను వీసీ రాజారెడ్డికి ఇచ్చిన నాన్ టీచింగ్ స్టాఫ్
-
111 జీవో పూర్తిగా రద్దు
-
AP: ఉద్యోగుల పదవీ విరమణ ఫేక్ జీవోపై ఆర్థిక శాఖ సీరియస్
సాక్షి, అమరావతి: ఉద్యోగుల పదవీ విరమణ ఫేక్ జీవోపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సీరియస్ అయ్యింది. ఉద్యోగుల రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ జీవోపై గుంటూరు డీఐజీకి ఆర్థికశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ ఎస్పీని డీఐజీ ఆదేశించారు. మేమెలాంటి సర్వే చేయలేదు.. ఇదిలా ఉండగా, ఎల్లో మీడియాలో ప్రచురితమైన ‘మంత్రులకు ముచ్చెమటలే’ వార్త పూర్తిగా అబద్ధమని ఐ–ప్యాక్ సంస్థ శుక్రవారం ట్విట్టర్లో స్పష్టంచేసింది. తాము ఎలాంటి సర్వేలు చేయలేదని తేల్చిచెప్పింది. ఐ–ప్యాక్ సర్వే చేసినట్లు ప్రచురించిన కథనాల్లో వీసమెత్తు కూడా వాస్తవం లేదని ట్వీట్ చేసింది. చదవండి: లోకేష్ పాదయాత్రలో ఏం కనిపించింది?.. వర్కౌట్ అవుతుందా? #Factcheck G.O. (pdf file named as GO MS NO15. ANDHRA PRADESH) mentioning that the age of retirement of Government employees is raised from 62 years to 65 years is under circulation. No such G.O. has been issued by the Finance Department, Government of Andhra Pradesh. pic.twitter.com/8CuFVVHzJp — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 28, 2023 -
బీజేపీ వాయిస్ లో నాయిస్..!
-
జీవోపై టీడీపీ నేతల అసత్య ప్రచారం : ఎంపీ మార్గాని భరత్
-
నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి తదితరాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ జీవో బుధవారం వెలుగులోకి వచ్చింది. సర్వత్రా హర్షం కులదూషణను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో ఎంఎస్ 50ను విస్తృతంగా ప్రచారం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. (క్లిక్: ఏదినిజం.. గోబెల్స్ను మించిన రామోజీ!) తెలంగాణలోనూ అమలు చేయండి నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలను ఏపీ ప్రభుత్వం నిషేధించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలంగాణలోనూ ఇటువంటి జీవో తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. (క్లిక్: గోరంట్ల మాధవ్ పేరిట వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు) -
AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లు మినహా ఇతర ఆహార దుకాణాలు ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎఫ్ఏసీ) జి.అనంతరాము మార్గదర్శకాలు విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల గడువు మార్చితో ముగియడంతో కొత్త ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఏపీ హోటల్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు వ్యాపార వేళలను పెంచినట్టు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారులు, వినియోగదారులు విధిగా మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్ వాడాలని సూచించారు. చదవండి: (ఎలాంటి కాన్పులైనా అమ్మకు 5,000) -
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధం విధిస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నేరుగా నియమితులైన క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలకు చెందిన స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు వైద్యులు గానీ, బోధనేతర విభాగం నుంచి బదిలీపై వచ్చిన వైద్యనిపుణులు గానీ ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం పరిధిలోకి వస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య విభాగంలో ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులో చేరే వైద్యులకు, తెలం గాణ వైద్య విధాన పరిషత్ విభాగాల పరిధిలో స్పెషలిస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా నియమితు లయ్యే వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమితులయ్యే డాక్టర్లంద రికీ ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం నిబంధన వర్తిస్తుంది. కొత్తగా నియమితులయ్యే డాక్టర్లంతా తమ అర్హత ధ్రువపత్రాలను రాష్ట్ర వైద్య మండలిలో తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 12,755 వైద్య పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయ నుంది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం పోస్టు లను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుం డగా..ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. డీఎంఈ పరిధిలోని కాలేజీల్లో నియమితులయ్యే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్వీస్ రూల్స్లో మార్పులు చేర్పులు చేసింది. ఏడాది సీనియర్ రెసిడెంట్ అనుభవం క్లినికల్ విభాగంలో మొత్తం 18 రకాల స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. వాటికి అర్హత వివరాలను మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, రెస్పి రేటరీ మెడిసిన్, సైకియాట్రీ, డెర్మటాలజీ, వెనిరీయోలజీ లెప్రసీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, రేడియో డయాగ్నసిస్, రేడియేషన్ ఆంకాలజీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, హాస్పిటల్ అడ్మిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్ క్లినికల్ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఎండీ/డీఎన్బీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే ఎండీ పూర్తి చేసిన తర్వాత ఏడాదిపాటు సీనియర్ రెసిడెంట్లుగా పనిచేసిన అనుభవం ఉండాలి. 500కు పైగా పడకలున్న ఆసుపత్రిలో డీఎన్బీ కోర్సు చేస్తే.. ఒక ఏడాది సీనియర్ రెసిడెంట్గా పని చేయాలి. ఒకవేళ 500లోపు పడకలున్న ఆసుపత్రిలో డీఎన్బీ కోర్సు చేస్తే.. రెండేళ్లపాటు సీనియర్ రెసిడెంట్గా సేవలందించిన వారే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హులవుతారని స్పష్టం చేశారు. నాన్ క్లినికల్ విభాగంలో... నాన్ క్లినికల్ విభాగంలో అసిస్టెంట్ పోస్టులుగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకా లజీ, పాథాలజీ, మైక్రోబయోలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ఉన్నాయి. వీటికి ఎండీ/ డీఎన్బీ/ఎంఎస్ చదివి ఉండాలి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీలకు సబ్జెక్టుల్లో ఎండీ తత్సమాన కోర్సు చేసినవారు లేకుంటే ఆ కోర్సుల్లో ఎంఎస్సీ (పీహెచ్డీ) చేసిన వారిని 15% వరకు తీసుకోవచ్చు. ఈ పోస్టుల్లో చేరేవారు ఏడాదిపాటు ట్యూటర్గా పనిచేసిన అను భవం ఉండాలి. సూపర్ స్పెషాలిటీలో.. సూపర్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగం లో కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, థోరాసిక్ సర్జరీ/కార్డియాక్ సర్జరీ (సీటీ సర్జరీ), యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ పోస్టులున్నాయి. వీటికి ఆయా కోర్సులను బట్టి డీఎం/డీఎన్బీ లేదా ఎంసీ హెచ్/డీఎన్బీ చదివి ఉండాలి. కాగా, విదేశాల్లో 18 రకాల పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తారా లేదా అన్న విషయంపై ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు. వైద్యుల వ్యతిరేకత.. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయ కుండా నిషేధం విధించడంపై పలువురు వైద్యులు వ్యతిరే కత వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం తక్కువ వేతనాలు ఇస్తూ, ఇలా నిషేధం విధించడం తగదన్నారు. కనీ సం ప్రోత్సాహకాలు ఇవ్వడమో లేదా నిమ్స్ మాదిరిగా సాయంత్రం వేళల్లో పనిచేస్తే ఆదా యం వచ్చే మార్గమైనా వెతికే పనిచేస్తే బాగుంటుందని అంటున్నారు. -
ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఆమేరకు విధించిన బ్యాన్ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుంచి 17వరకు బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐదేళ్లకు పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం ఆధారంగా బదిలీలను చేపడుతున్నారు. చదవండి: (CM YS Jagan: ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్) -
పుప్పాలగూడ భూముల వ్యవహారం.. హైకోర్టులో తెలంగాణ సర్కార్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని సర్వే నంబరు 335, 336, 338, 340, 341, 342లో 80.25 ఎకరాల కాందిశీకులకు సంబంధించిన భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఈ భూమిపై కాందిశీకులకు హక్కులు ఉన్నాయంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని, ఆ తీర్పులో జోక్యం చేసుకోమంటూ ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. కాందిశీకులకు 1956లో కేటాయించిన భూమిని మిగులు భూమిగా పేర్కొంటూ ఏపీఐఐసీకి కేటాయిస్తూ 2008లో రెవెన్యూ శాఖ జీవో జారీచేసింది. ఈ జీవోను సవాల్చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. చదవండి👉🏻ఇంగ్లిష్–1 బండిల్లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు! ‘వాసుదేవ్కు 1956లో ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. తర్వాత వాసుదేవ్ పలువురికి ఈ భూమిని విక్రయించారు. ఇందులో 11.05 ఎకరాలను 1968లో ఇద్దరు వ్య క్తులు అతని నుంచి కొనుగోలు చేశారు. అయితే ఈ భూమి యూఎల్సీ పరిధిలో ఉందంటూ 2006లో ప్రభుత్వం ఆ మేరకు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. వాసుదేవ్కు 2006లో నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ చిరునామాలో లేరని రెవె న్యూ అధికారులు పేర్కొన్నారు. 1998లోనే వాసుదేవ్ చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టబద్దంగా కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా మిగులు భూమిగా చూపించడం, పట్టాదారుకు నోటీసులు ఇవ్వకుండా ఆ కేటాయింపులను రద్దు చేయడం చట్టవిరుద్ధం. ఈ మేరకు ఏపీఐఐసీకి కేటాయిస్తూ ఇచ్చిన జీవోను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తున్నాం. కేటాయింపులు రద్దు చేస్తున్నాం’అని సింగిల్ జడ్జి 2017లో తీర్పునిచ్చారు. చదవండి👉 300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్లకు ఉద్వాసన -
111 జీవో ఎత్తేస్తే నగరానికి ముప్పు
సాక్షి,బంజారాహిల్స్: హైదరాబాద్ నగరానికి వరదల నివారణ కోసం నిర్మించిన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాలను కాపాడుకోకపోతే భవిష్యత్తులో భాగ్యనగరానికి ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు. జలాశయాల పరిరక్షణకు తెచ్చిన 111 జీవోను ఎత్తేయడం వల్ల రాబోయే రోజుల్లో నగరానికి ముప్పు పొంచి ఉన్నట్లేనని అభిప్రాయపడ్డారు. 111 జీవో ఎత్తివేతపై శుక్రవారం బంజారాహిల్స్లోని లామకాన్లో త్రిసభ్య పీపుల్స్ కమిటీ సమావేశం జరిగింది. ఐఐసీటీ హైదరాబాద్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబూరావు కలపాల, సుప్రీంకోర్టు కమిటీ సభ్యుడు సాగర్ దార, ఎన్జీఆర్ఐ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బి. రామలింగేశ్వర్రావు, వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ లుగ్నా సార్వత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేకూర్చేందుకే 111 జీవో ఎత్తేశారనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. ఈ జీవో ఎత్తివేత వల్ల జంట జలాశయాలు హుస్సేన్సాగర్లాగా మారబోతున్నాయని చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి పంప్ల ద్వారా ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు నీళ్లు నింపుతామని చెబుతున్నారని.... అయితే ఈ నీటిని తీసుకొచ్చేందుకు ఎంత విద్యుత్ అవసరమవుతుందో తెలుసా అని ప్రశ్నించారు. 90 శాతం ఓపెన్ ఏరియాను కాపాడతామని ప్రభుత్వం చెబుతున్నదని... తీరా నిర్మాణాలు జరిగాక బీఆర్ఎస్ పేరుతో వాటిని రెగ్యులరైజ్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదని మరో హైదరాబాద్గా 111 జీవో ప్రాంతమంతా మారబోతున్నదని హెచ్చరించారు. వాతా వరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుందని.. రాబోయే రోజుల్లో హైదరాబాద్కు ఈ ప్రమాదం పొంచి ఉందని సాగర్ ధార పేర్కొన్నారు. -
పోలీస్ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో పలు గ్రామాల పోలీసుస్టేషన్ల పరిధిని మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల విభజన సందర్భంగా జీవో ఎంఎస్ నెంబర్ 93 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసే క్రమంలో ప్రస్తుతం కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న ఇతర రెవెన్యూ మండలాల గ్రామాలను ఆయా రెవెన్యూ మండలాల పరిధిలోని పోలీసుస్టేషన్కు కింద మార్పు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు మార్పులకు గురైన గ్రామాలు ఏ పోలీసుస్టేషన్ పరిధిలో చేరాయనే దానిపై సంబంధిత గ్రామాల్లో పోలీసు అధికారులు గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ గ్రామాలు మార్చి 1వ తేదీ నుంచి సంబంధిత మండలానికి సంబంధించిన పోలీసుస్టేషన్ల పరిధిలోకి రానున్నాయి. మారిన గ్రామాలు ఇవే.. రాచర్ల రెవెన్యూ మండలానికి చెందిన యడవల్లి, రంగారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, చెర్లోపల్లి, వద్దులవాగుపల్లి, మేడంవారిపల్లి, గుడిమెట్ల, కొత్తపల్లి, రామాపురం, అచ్చంపల్లి గ్రామాలు రాచర్ల పోలీసుస్టేషన్ పరిధిలో చేరాయి. గిద్దలూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న కొమరోలు రెవెన్యూ మండలానికి చెందిన దద్దవాడ , నారాయణపల్లి, గుండ్రెడ్డిపల్లి, అలసందలపల్లి, గోవిందపల్లి, అక్కపల్లి, వెంకటంపల్లి, కంకరవారిపల్లి, పొట్టుపల్లి, తాటిచర్ల, హసనాపురం, నాగిరెడ్డిపల్లి, ముత్తరాసిపల్లి కొమరోలు పోలీసుస్టేషన్ పరిధిలోకి మారాయి. వేటపాలెం పీయస్ పరిధిలోని ఎన్జీపాడు రెవెన్యూ మండలానికి చెందిన మట్టిగుంట (ఎన్జీపాడు పరిధిలోకి), ఇంకొల్లు పీయస్ పరిధిలో ఉన్న ఎన్జీపాడు రెవెన్యూ మండలానికి చెందిన తిమ్మసముద్రం, మద్దిరాల, ముప్పాల గ్రామాలు ఎన్జీపాడు పోలీసుస్టేషన్ పరిధిలోకి చేరాయి. చదవండి: (తిరుమల: టీటీడీ కీలక నిర్ణయం) కందుకూరు టౌన్ పీయస్ పరిధిలో ఉన్న మోపాడు, కంచరగుంట గ్రామాలు కందుకూరు రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి చేరాయి. కందుకూరు టౌన్ పీయస్ పరిధిలో ఉన్న వలేటివారిపాలెం రెవెన్యూ మండలానికి చెందిన కాకుటూరు, బడేవారిపాలెం, నేకునాంపురం (అత్తింటివారిపాలెం), నూకవరం, పోకూరు, సింగమనేనిపల్లి, కొండారెడ్డిపల్లి, నలదలపూర్ గ్రామాలు వలేటివారిపాలెం పోలీసుస్టేషన్ పరిధిలోకి మారాయి. గుడ్లూరు పీయస్ పరిధిలో ఉన్న లింగసముద్రం రెవెన్యూ మండలానికి చెందిన చిన్నపవని, పెద్ద పవని, ముత్యాలపాడు, ముత్తంవారిపల్లి, అంగిరేకులపాడు, మేదరమెట్లవారిపాలెం, అన్నెబోయినపల్లి గ్రామాలు లింగసముద్రం పీఎస్ పరిధిలోకి వచ్చాయి. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవో విడుదల
-
జీవో 317పై స్టేకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన జీవో 317పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే తామిచ్చే తుది తీర్పునకు లోబడే కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలీతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సీనియారిటీకి విరుద్ధంగా తమను కొత్త జిల్లాలకు కేటాయించారంటూ పలువురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు, సీనియారిటీకి విరు ద్ధంగా కోరుకున్న ప్రాంతానికి కాకుండా పిటిషనర్లను కేటాయించారని వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కొత్త జిల్లాలకు కేటాయించిన వారంతా విధుల్లో చేరారని ప్ర భుత్వ న్యాయవాది నివేదించారు. దీనిపై కౌం టర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. -
తల్లి ఖాతాలో కాదు..కాలేజీ ఖాతాలో జమచేయాలి
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోనే జమచేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్లో జారీచేసిన జీవో 28ని హైకోర్టు రద్దుచేసింది. అదేవిధంగా జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వం చెల్లించిన ఫీజును విద్యార్థి తల్లి కాలేజీకి చెల్లించకపోతే ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదంటూ గత ఏడాది నవంబర్ 6న జారీచేసిన జీవో 64లో పేర్కొన్న క్లాజులన్నింటినీ కొట్టేసింది. ఇకపై జగనన్న విద్యాదీవెన పథకం కింద స్కాలర్షిప్పులను, ఫీజులను ఆయా కాలేజీల ఖాతాలకే జమచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమచేసిన డబ్బు విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఈ మొత్తాలను ఆయా విద్యార్థుల నుంచి కాలేజీలే వసూలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. జీవోలు 28, 64లను సవాలు చేస్తూ అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకృష్ణదేవరాయ ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఎస్.హెచ్.ఆర్.ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ విజయలక్ష్మి విచారణ జరిపారు. స్వీయ అవసరాలకు వాడుకునే పరిస్థితులున్నాయి పిటిషనర్ న్యాయవాది మోతుకుమిల్లి విజయకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఫీజులను, స్కాలర్షిప్పులను విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయడం వల్ల కాలేజీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రామీణ విద్యార్థుల తల్లులు నిరక్షరాస్యులుగా ఉంటున్నారని, వారి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విద్యార్థి చదువుకోసం ప్రభుత్వం జమచేస్తున్న ఫీజుల డబ్బును స్వీయ అవసరాల నిమిత్తం మళ్లించాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని చెప్పారు. దీంతో ప్రభుత్వం చెల్లించిన ఫీజు మొత్తం కాలేజీలకు చేరడంలేదని, తల్లి ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం జీవో కూడా జారీచేసిందని పేర్కొన్నారు. దీంతో జగనన్న విద్యాదీవెన పథకం తీసుకొచ్చిన సదుద్దేశం నెరవేరకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది తల్లులు ప్రభుత్వం చెల్లించిన ఫీజులను తిరిగి కాలేజీలకు చెల్లించడం లేదో పేర్కొంటూ జిల్లాల వారీగా వివరాలను ఆయన కోర్టు ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? లేదా? కాలేజీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? తదితరాలను పరిశీలించే నిమిత్తమే తల్లి ఖాతాలో డబ్బు జమచేయడం వెనుకున్న ప్రధాన ఉద్దేశమని చెప్పారు. మహిళా సాధికారతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాలేజీ ఖాతాలో డబ్బు వేస్తే చదువు ఆపేసే అవకాశాలు స్వల్పం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మి.. దాదాపు 40 శాతంమంది విద్యార్థులు ప్రవేశాల సమయంలో ఫీజులు చెల్లించలేదని, ప్రభుత్వ జీవో ప్రకారం ఫీజుల కోసం వారిని కాలేజీలు ఒత్తిడి చేయడానికి వీల్లేదని, తల్లులు ఫీజు చెల్లించకపోతే ప్రభుత్వానిది బాధ్యత కాదని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల వల్ల విద్యార్థి బలవంతంగా చదువు ఆపేయాల్సి వస్తోందని, అంతిమంగా ఓ సీటు వృథా అవుతోందని తెలిపారు. కాలేజీల ఖాతాల్లో డబ్బు జమచేస్తే విద్యార్థి చదువు ఆపేసే పరిస్థితులు చాలా స్వల్పమని చెప్పారు. ఒకవేళ ఆ కాలేజీలో సౌకర్యాలు సరిగా లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులు దానిపై ఫిర్యాదుచేసే అవకాశం ఉంటుందన్నారు. తల్లి ఖాతాలో ఫీజు జమచేయడం వల్ల చదువు కొనసాగింపునకు హామీ లభించడంలేదని చెప్పారు. ఇది జగనన్న విద్యాదీవెన పథకం లక్ష్యానికి విరుద్ధమన్నారు. అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు జస్టిస్ విజయలక్ష్మి తన తీర్పులో పేర్కొన్నారు. -
వారి అంత్యక్రియలకు రూ.15 వేలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు. ( చదవండి: విడిపించేందుకు వెళ్లి.. ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు ) -
కరోనా నివారణ: ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేస్తోంది. తాజాగా కరోనా నివారణకు కేంద్రం చేసిన మరో సూచన అమల్లోకి తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధించింది. ఉమ్మివేయడం, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై నిషేధం విధిస్తూ.. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్ సమీక్ష తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, తదితర ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు అసలీ జీవో చదివారా?
ఇంగ్లిష్ వచ్చిన వాళ్లు చదివితే ఈ జీవోలో తప్పు కనిపించదు. ఇంగ్లిష్ రాకపోతేనో, అర్థం చేసుకోవడంలో లోపం ఉంటే తప్ప.. తప్పుగా అనిపించదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ పెద్ద మనిషికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏదీ లేదు. సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్య హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో గురువారం 2430 జీవో రద్దుకు విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో సీఎం స్పందిస్తూ మాట్లాడారు. ‘ప్రభుత్వం ఇచ్చిన 2430 జీవోను రద్దు చేయాలని టీడీపీ అడుగుతున్న ధోరణి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అసలీ జీవోను చంద్రబాబు నాయుడు చదివారా? ఒకవేళ చదివుంటే ఇంగ్లిష్ భాషను అర్థం చేసుకోవడంలో లోపం ఉందేమో! నేనోసారి జీవోను చదివి విన్పిస్తాను. ఇందులో ఎక్కడైనా, ఏదైనా తప్పుంటే మీరే ఆలోచించి చెప్పండి. (జీవో చదివి విన్పించారు) ఇందులో ఏం తప్పుందని చెబుతున్నారు. ఎక్కడైనా, ఎవరైనా అన్యాయంగా, ఉద్దేశ పూర్వకంగా, ఆధారాలు లేకుండా, తప్పుడు వార్తలు, పరువు తీసే వార్తలు వేస్తే.. అలాంటప్పుడు సంబంధిత విభాగాల కార్యదర్శులు రిజాయిండర్ జారీ చేయడం, ఫిర్యాదు చేయడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఉంది. అవతల వాళ్లు ఏ తప్పులు రాసినా, టీవీల్లో తప్పులు చూపించినా, జరగనివి జరిగినట్టు చూపించినా, రాసినా.. ప్రభుత్వం, అధికారులు ఆ చెడ్డ పేరు మోస్తూ మౌనంగా ఉండాల్సిందేనా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్లు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కాబట్టి, వాళ్లు ఇష్టమొచ్చినట్టు చంద్రబాబు నాయుడును భుజానికెత్తుకుని మోస్తూ.. ప్రభుత్వంపై నిందలు మోపినా కూడా పడి ఉండాల్సిందేనా? న్యాయం ఉండదా? ఎవరైనా తప్పు చేస్తే, అబద్ధాలు రాస్తే నా ఇమేజ్ను నేను కాపాడుకునే స్వేచ్ఛ అది. ప్రజాస్వామ్య హక్కు. అందులో భాగంగానే రిజాయిండర్స్ ఇవ్వచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసులు వేయొచ్చు’ అని సీఎం జగన్ వివరించారు. -
ఇంజినీర్లకు ఊరట!
రాష్ట్ర జలవనరుల శాఖలో తన అనుయాయులను కీలక పోస్టుల్లో నియమించుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం జారీచేసిన అడ్డగోలు ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు అడ్డంగా కొట్టేసింది. రాజ్యాంగంలోని రాష్ట్రపతి ఉత్తర్వులకు, జోనల్ వ్యవస్థకు భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. టీడీపీ నాయకుల వ్యవహారాల వల్ల నష్టపోయిన ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఇంజినీర్లకు దీంతో ఎంతో ఊరట లభించింది. సాక్షి, విశాఖపట్నం: పదోన్నతులు ఒక పద్ధతి ప్రకారం జరిగితే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) కనిష్టంగా మూడేళ్ల సర్వీసుతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా పదోన్నతి పొందుతారు. ఈఈ కూడా కనిష్టంగా మూడేళ్ల సర్వీసు తర్వాత సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) అవుతారు. ఎస్ఈ పదోన్నతిపై చీఫ్ ఇంజినీర్ (సీఈ) పోస్టులోకి వెళతారు. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రాంగంతో పదోన్నతుల విధానం క్రమం తప్పింది. తనకు కావాల్సిన వ్యక్తులను కీలక పోస్టుల్లో కూర్చోబెట్టుకునేందుకు నిబంధనలను, పదోన్నతుల సంప్రదాయాలను తుంగలోకి తొక్కారు. దీంతో జోన్–1 ప్రాంతమైన ఉత్తరాంధ్రకు చెందిన ఇంజినీర్లు తీవ్రంగా నష్టపోయారు. 53 మంది ఇంజినీర్లు తామున్న పోస్టు నుంచి దిగువ పోస్టుకు రివర్సన్ అయ్యారు. చివరకు 2014 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ద్వారా పదోన్నతి పొందినవారికీ రివర్సన్ వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వ అడ్డగోలు వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. ఇదేమి న్యాయమంటూ ఉత్తరాంధ్ర ఇంజినీర్లు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఏకంగా 31 మంది బాధిత ఇంజినీర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన విషయం కాబట్టి తెలంగాణ హైకోర్టు పరిధిలో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్లతో కూడిన ధర్మాసనం ఈనెల 22వ తేదీన తీర్పు ఇచ్చింది. ఐదుగురు రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ సిఫారసులను సాకుగా చూపించి 2017లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. నిబంధనలకు అనుగుణంగా జలవనరుల శాఖలో పదోన్నతుల ప్రక్రియను రెండు నెలల్లోగా చక్కదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఊరట చెందిన ఉత్తరాంధ్ర ఇంజినీర్ల సంఘం హర్షం ప్రకటించింది. ఏమిటీ వివాదం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరు జోన్లను విద్య, ఉద్యోగాల విషయంలో సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో భౌగోళికంగా విభజించారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక అంశాల్లో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే భారత రాజ్యాంగంలోని 371(డి) అధికరణ ప్రకారం ఈ ఏర్పాటు చేశారు. 1975 సంవత్సరంలో 32వ రాజ్యాంగం సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ ప్రకారం రాష్ట్రంలోని జోన్–1లో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, జోన్–2లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్–3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జోన్–4లో రాయలసీమ నాలుగు జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాలన్నీ 5, 6 జోన్లలో ఉన్నాయి. కొన్ని విభాగాల్లో ఉద్యోగులు తమ విద్యాభ్యాసం, స్థానికత ఆధారంగా సొంత జోన్లలోనే పనిచేసే అవకాశం కల్పిస్తూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 610 జీవో తీసుకొచ్చారు. ఏ జోన్కు చెందినవారు ఆ జోన్లోనే ఎక్కువ కాలం పనిచేస్తే స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహనతో ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించవచ్చనేది ఆ జీవో ఉద్దేశం. ఈ ప్రకారమే ఇప్పటివరకూ జోన్ల వ్యవస్థ అమల్లో ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన జలవనరుల శాఖలో కీలకమైన పోస్టుల్లో తమకు కావాల్సినవారిని కూర్చోబెట్టడానికి ఈ జోన్ల విధానంపై సరికొత్త ఆలోచనకు తెరతీశారు. నాటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మౌఖికంగా ఆదేశాలివ్వడంతో ఇంజనీర్–ఇన్–చీఫ్ కార్యాలయం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయం తెలిసి ఉత్తరాంధ్ర ఇంజినీర్ల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. రాజధాని అమరావతికి వెళ్లి మరీ రద్దు నిర్ణయం వద్దంటూ వేడుకున్నారు. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విన్నవించారు. భయపడినట్లు ఏమీ జరగదని, అందరికీ న్యాయం జరుగుతుందని సర్దిచెప్పి పంపించారు. తీరా రాష్ట్రంలోని 83 మంది ఇంజినీర్లకు రివర్సన్ ఇచ్చేశారు. వారిలో ఉత్తరాంధ్రకు చెందినవారే 53 మంది ఉన్నారు. వారికి రివర్సన్ ఇస్తూ నాటి ప్రభుత్వం 2017, 2018 సంవత్సరంలో జీవోలు జారీ చేసింది. వారిలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు ఉండటం గమనార్హం. వారికన్నా దిగువస్థాయిలోని సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్ఈ)గా మారిపోయారు. ఎస్ఈ పోస్టు నుంచి 19 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఈఈ)గా మారిపోయారు. ఈఈ పోస్టు నుంచి 32 మందికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ)గా రివర్సన్ అయ్యారు. ఇలా దిగువ స్థాయికి వెళ్లి పోస్టింగ్లోకి వెళ్లడం ఇష్టంలేక చాలామంది దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారంటే పరిస్థితిని ఊహించవచ్చు. -
నకిలీ జీవోతో ప్రభుత్వానికే బురిడీ
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఉద్యోగాలు.. నకిలీ నోట్లు.. నకిలీ ఎరువులు, విత్తనాలే కాదు.. ఏకంగా నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. లబ్ధి కోసం ప్రభుత్వ సీఎస్ పేరిటే నకిలీ ఉత్తర్వులు సృష్టించి దాంతో ప్రభుత్వ అధికారులనే బురిడీ కొట్టించే ప్రయ త్నం చేస్తున్నారు. తాజాగా సెక్రటేరియట్లో అలాంటి వ్యవహారమే వెలుగుచూసింది. సకాలంలో పనులు చేయకపోయిన కారణంగా విజిలెన్స్ శాఖ సిఫార్సు చేసిన పెనాల్టీని మాఫీ చేసేందుకు ఏకంగా నకిలీ ఉత్తర్వులను సృష్టించారు. అధికారుల ముందుచూపుతో ఇది ప్రాథమిక స్థాయిలోనే బయటపడటం, అది సీసీఎస్ దర్యాప్తు వరకు వెళ్లడం చర్చనీయాంశమైంది. జీవో ఉద్దేశమిదీ..: నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులను వరల్డ్బ్యాంకు నిధులతో ఇరిగేషన్ శాఖ చేపట్టింది. దీంతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పరిధిలోని డీసీ–8 ప్యాకేజీ పనులను చేపట్టారు. ఈ పనులను సుదర్శన్రెడ్డి అనే కాంట్రాక్టర్ చేపట్టగా, ఆయన మరణంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత ప్రాజెక్టు పనులను ఇతర కాంట్రాక్టర్కు ఇచ్చి పనులు పూర్తి చేయించారు. అయితే ఈ పనులపై విచారణ జరిపిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ పనులు పూర్తికాని నేపథ్యంలో కాంట్రాక్టర్ నుంచి లిక్విడేటీవ్ డ్యామేజెస్ చార్జీ (ఎల్డీసీ) కింద రూ.88.21 లక్షలు పెనాల్టీ కింద వసూలు చేయాలని నీటి పారుదల శాఖకు సూచించింది. పనుల పూర్తి విషయంలో కాంట్రాక్టర్ తప్పులేదని, శాఖ పొడగించిన గడువు మేరకు పనులు పూర్తి చేసి కాల్వలకు నీళ్లిచ్చారని తెలిపింది. పెనాల్టీని రద్దు చేయాలని కోరుతూ నీటి పారుదల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనిపై ప్రభుత్వం ఏæ నిర్ణయం చేయలేదు. నీటిపారుదల శాఖ సిఫార్సు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉండగానే ఈ నెల 25న ప్రభుత్వం పెనాల్టీ మాఫీ చేస్తున్నట్లు స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి పేరిట జీవో 2136 విడుదలైంది. గుర్తించారిలా.. ఈ జీవో కాఫీని పట్టుకొని ఈ నెల 26న కొందరు వ్యక్తులు బీఆర్కేఆర్ భవన్లోని సెక్షన్ అధికారులను కలిసి ఉత్తర్వులను అమలు చేయాలని కోరినట్లుగా తెలిసింది. అయితే వాళ్లెవరనేది ఇంకా తెలియలేదు. ఈ క్రమంలో జీవో అంశం ఇరిగేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ సుబ్బమ్మ దృష్టికి వెళ్లింది. అయితే జీవో కాపీపైన తెలంగాణ ప్రభుత్వం చిహ్నం ఉంది. సాధారణ జీవోల్లో అలాంటి చిహ్నం ఉండదు. అలాగే ఎస్కే జోషి పేరు మీద ఏ జీవో ఇచ్చినా, పూర్తి పేరు శైలేంద్రకుమార్ జోషి అనే పేరుతో విడుదలవుతాయి. అదీగాక జీవో నంబర్: 2136గా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో జీవోల సీరియల్ నంబర్ 854 వద్దే ఉంది. ఈ ఆధారాలతో దాన్ని నకిలీ జీవోగా గుర్తించిన సుబ్బమ్మ సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు సుబ్బమ్మ గురువారం రాత్రి సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు గురువారం కేసు నమోదు (ఎఫ్ఐఆర్ నెం.205) చేశారు. ప్రాథమికంగా ఏ కాంట్రాక్టర్ను ఉద్దేశించి ఆ జీవో జారీ అయిందో దృష్టి పెట్టారు. శుక్రవారం ప్రాథమిక ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధి కారులు శనివారం నోటీసులు జారీ చేయనున్నారు. -
చంద్రబాబు రహస్య జీవోలన్ని బయట పెట్టాలి
-
జీవోల పై కన్నా లక్ష్మీనారాయణ పిటిషన్
-
ఏపీకి హైకోర్టు అవసరం లేదని బాబు జీవో తెస్తారేమో
-
జీవో86 రద్దు చేయాలని న్యాయవాదుల నిరసన
-
జీవో 550 పునఃసమీక్ష కేసు 21కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: మెడికల్ అడ్మిషన్స్కు సంబంధించి జీవో 550లోని పేరా 5(2) అమలు చెల్లదని హైకోర్టు వెలువరించిన తీర్పు పునఃసమీక్ష పిటిషన్పై విచారణ 21వ తేదీకి వాయిదాపడింది. జీవో నిబంధనలకు అనుగుణంగా తొలుత 50 శాతం ఓపెన్ కేటగిరీ సీట్లను భర్తీ చేయాలని, ఆ తర్వాత మిగిలిన 50 శాతం సీట్లను రిజర్వేషన్ కోటాలో భర్తీచేసేలా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆదేశాలు ఇవ్వాలని కె.ఉర్జిత యాదవ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను విచారించాలని పిటిషనర్ న్యాయవాది మంగళవారం ధర్మాసనాన్ని అభ్యర్థించారు. పిటిషన్ను వచ్చేవారం విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈలోగా ప్రభుత్వాల వైఖరి తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా ఓపెన్ కేటగిరీ సీటును ఎంపిక చేసుకుని ఆ తర్వాత దానిని వదులుకుని మరో కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీ కోటా సీటులో చేరితే, వారు వదులుకున్న సీటును అదే సామాజికవర్గంలోని అభ్యర్థితోనే భర్తీ చేసేందుకు వీలుకల్పించే జీవోలోని ఆ పార్ట్ను హైకోర్టు కొట్టివేసింది. -
ఆర్జిత సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న దేవాలయాల్లో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దేవాలయాల్లో అర్చనాభిషేకాలు నిలిపివేస్తామని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి వెల్లడించారు. గురువారం హైదరాబాద్ న్యూనల్లకుంటలోని రామాలయంలో అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దేవాలయాలు తెరిచే ఉంటాయని, నిత్యపూజలు, మహానైవేద్యం సమర్పిస్తామని, అయితే, భక్తులు ఫీజు చెల్లించి జరిపించుకునే అర్చనాభిషేకాలను మాత్రం నిలిపివేస్తామని చెప్పారు. తాము సీఎం కేసీఆర్కు, దేవాదాయ మంత్రి, కమిషనర్లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేయడం లేదని, కేవలం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగానే ఆందోళన చేస్తున్నామని ఆయన చెప్పారు. అర్చక, ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని గత ఏడాది సెప్టెంబర్లో జీవోనెం.577 విడుదల చేశారని, మళ్లీ సెప్టెంబర్ వస్తున్నా అధికారులు ఈ జీవోను అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే విడుదల చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, కేడర్ ఫిక్సేషన్లో జరిగిన అవకతవకలు సరిచేయాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు దిగుతున్నామని చెప్పారు. గత మూడు రోజుల నుంచి ఈ విషయమై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నామని, అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు భానుమూర్తి చెప్పారు. -
జీవోల గోప్యత.. ఏదీ పారదర్శకత!
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో నిర్ణయాల అమలుకు ఉద్దేశించి వెలువరించే జీవోల గోప్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం జీవో రూపంలో ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంచే సంప్రదాయం క్రమంగా కనుమరుగవుతోంది. ప్రభుత్వం 2016లో వెలువరించిన జీవోల్లో 56 శాతాన్నే వెబ్సైట్లో పెడితే, 2017లో 42 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద సేకరించిన జీవోల వివరాలను శుక్రవారం వెల్లడించింది. జీవోలన్నింటినీ ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలన్న డిమాండ్ను ఇప్పటికే ప్రభుత్వం, గవర్నర్, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లింది. అయినా ప్రభుత్వం మాత్రం గత రెండేళ్లలో మొత్తం 44,329 జీవోలకు గాను 21,869 అంతర్గత (ఇంటర్నల్) జీవోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని సమాచారహక్కు చట్టం ద్వారా ఐటీశాఖ తేల్చిచెప్పింది. జీవోలన్నీ పెట్టేదాకా పోరాటం ప్రభుత్వం ఇప్పటికే అంతర్గత జీవోల పేరుతో ఏసీబీ కేసుల విత్డ్రా, ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, న జరాల ప్రకటనలకు సంబంధించిన నిర్ణయాల జీ వోలను ‘ఇంటర్నల్’పేరుతో వెబ్సైట్లో ప్రజలకు అం దుబాటులో ఉంచకపోవటం సరైన నిర్ణయం కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి అన్నారు. తాము ఇప్పటికే గవర్నర్ను కలిశామని, హైకోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు. వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్న జీవోలు అధికారుల టూర్లు, అలవెన్సులకు సంబంధించినవే ఉంటున్నాయని, దీని వల్ల ప్రజల కు ఏమీ ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు. ప్రజల నిధులు, వారి అవసరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు వెల్లడించకపోవటం దారుణమైన పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకత కోసం కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని పద్మనాభరెడ్డి చెప్పారు. -
అన్నా క్యాంటీన్ల అంచనాలు పెంచి కోట్లు కొట్టేశారు
-
ఆంత్రాక్స్పై యాక్షన్ ప్లాన్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో మహమ్మారిలా మారిన ఆంత్రాక్స్ నివారణకు ప్రభుత్వం ఐదేళ్ల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ ఏజెన్సీలో ఏటా ఆంత్రాక్స్ కలకలం రేపుతున్న నేపథ్యంలో పశుసంవర్థక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆమోదం తెలుపుతూ నిధుల విడుదలకు ప్రభుత్వం జీవో నంబరు 21ని జారీచేసింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేస్తారు. పాడేరు కేంద్రంగా ఇతర కార్యక్రమాల అమలుకు ఏటా గిరిజన సంక్షేమ శాఖ నుంచి అవసరమైన నిధులు కేటాయిస్తారు. రాష్ట్రంలో ఆంత్రాక్స్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం లేదు. దీంతో వ్యాధి నివారణకు అవసరమయ్యే 3 లక్షల డోస్ల ఆంత్రాక్స్ డోస్ను సరఫరా చేయాలని పశుసంవర్థకశాఖ జేడీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు మృత పశువుల బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా సరిగా ఖననం చేస్తారు. ఇంకా 500 పశుమిత్రలను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తారు. వీరు ఏజెన్సీ 11 మండలాల్లోని 3700 శివారు గ్రామాలను కవర్ చేస్తారు. వీరికి కిట్లను అందజేస్తారు. ఇందుకు రూ.1.48 కోట్లు, గిరిజనులకు గొర్రెలు, మేకల పెంపకానికి రూ.1.72 కోట్లు కేటాయించారు. వ్యాక్సినేషన్ ఇన్సెంటివ్లకు రూ.49 లక్షలు, గిరిజనుల్లో అవగాహనకు రూ.15.40 లక్షలు, ప్రచారానికి రూ.25.50 లక్షలు, పశువుల గుర్తింపునకు రూ.1.25 కోట్లు, పశువుల బీమాకు రూ.19.36 కోట్లు వెరసి రూ.25 కోట్లు మంజూరు చేశారు. దీర్ఘకాలిక ప్రణాళిక కింద గోకులంలు, వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రూ.104 కోట్లు వెచ్చించనున్నారు. -
మార్చి 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
అమరావతి : వచ్చే మార్చి నెల 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభా, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం జోవో నెంబర్ 4,5 లను విడుదల చేసింది. శాసనసభ, శాసన మండలి సమావేశాలు వెలగపూడి సచివాలయంలోని అసెంబ్లీ హాలులో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమౌతాయని తెలిపింది. -
ప్రభుత్వంపై థియేటర్ల న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని సినిమా థియేటర్లు న్యాయ పోరాటానికి దిగాయి. ఆన్లైన్ టికెటింగ్ అమలు చేసే దిశగా ఒక్కో టికెట్పై పోర్టల్, ఎఫ్డీసీ కింద 1.98 శాతం చార్జీ వసూలు చేసుకోడానికి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ)కి అనుమతిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టును ఆశ్రయించాయి. సెంచురీ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టికెటింగ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఆదేశిస్తూ జారీ చేసిన సర్కులర్ను కూడా కోర్టులో సవాలు చేశాయి. జీవో, సర్కులర్లను కొట్టేయాలంటూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్.. జీవో, సర్కులర్పై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ టీఎస్ఎఫ్డీసీ ఎండీ, సమాచార, ప్రజా సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సెంచురీ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. సెంచురీ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పోర్టల్లో థియేటర్లు నమోదు చేసుకోవాలని, లేదంటే ప్రతీ షో హౌస్ఫుల్ అయినట్లు భావించి పన్నులు విధిస్తామని ప్రభుత్వం సర్కులర్లో పేర్కొందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కంచర్ల దుర్గాప్రసాద్ కోర్టుకు నివేదించారు. తమ పోర్టల్ ద్వారానే టికెట్లు అమ్మేలా ప్రభుత్వాన్ని, పోలీస్ కమిషనర్ను సెంచురీ టెక్ ప్రభావితం చేసిందన్నారు. ఇప్పటి వరకు టిక్కెట్లు అమ్ముకున్నందుకు ఆయా సంస్థలు ఆయా థియేటర్లకు చార్జీలు ఇచ్చేవని, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల థియేటర్లే ఎదురు చార్జీలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. -
ఫుల్లుగా తాగించేద్దాం..
- ఆదాయం కోసం సర్కారు సరికొత్త ఎత్తుగడ - సుప్రీంకోర్టు ఆదేశాలు తుంగలోకి.. - నగర, పురపాలక సంస్థల్లో యథాస్థానాల్లోనే షాపుల కొనసాగింపు? - పట్టణాల పరిధిలో ఎన్హెచ్, ఎస్హెచ్లను ఎండీఆర్ పరిధిలోకి తీసుకువచ్చే యత్నం - ఇప్పటికే కేబినేట్ భేటీలో నిర్ణయం - నేడో, రేపో జీఓ విడుదల - ఎక్సైజ్ శాఖకు చేరిన మౌఖిక ఆదేశాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న చంద్రబాబు సర్కారు సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతోంది. ఫుల్లుగా తాగించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మద్యం ద్వారా అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న నగర, పురపాలక సంస్థల్లో.. జాతీయ, రాష్ట్ర రహదారులకు దగ్గరగా ఇప్పుడున్న షాపులను యథాస్థానాల్లోనే కొనసాగించేందుకు సరికొత్త ఎత్తుగడ వేసింది. ఇందుకు సుప్రీం ఆదేశాలు ఆటంకం కావడంతో.. పట్టణ ప్రాంతాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులను మున్సిపల్ డెవలప్మెంట్ రోడ్లు(ఎండీఆర్)గా మార్చేందుకు కసరత్తు చేపట్టింది. మండపేట : రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ (ఎన్హెచ్), రాష్ట్ర (ఎస్హెచ్) రహదారులకు కాస్త దూరంగా మద్యం షాపులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆ తేదీ నుంచి నూతన విధానం అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో మద్యం పాలసీ జూలై 1వ తేదీ నుంచి జూన్ 31వ తేదీ వరకు ఉండటంతో జూలై 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం 20 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాన్ని నేషనల్, స్టేట్ హైవేలకు 220 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. 20 వేలకు పైబడి జనాభా ఉన్న ప్రాంతాలైతే 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. సగానికి పైగా వ్యాపారం పట్టణాల్లోనే.. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మద్యం వ్యాపారం ఎక్కువగా జరిగేది పట్టణ ప్రాంతాల్లోనే. జిల్లావ్యాప్తంగా 555 మద్యం షాపులుండగా, వీటిలో ఆయా నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 126 షాపులతోపాటు 34 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 31, కాకినాడలో 41, అమలాపురం మున్సిపాలిటీలో 7, మండపేటలో 7, రామచంద్రపురంలో 7, పిఠాపురంలో 7, పెద్దాపురంలో 10, సామర్లకోటలో 7, తునిలో 9 మద్యం షాపులున్నాయి. జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు రూ.1.9 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో సగానికి పైగా అమ్మకాలు పట్టణ ప్రాంతాల్లోనే జరగడం గమనార్హం. మద్యం సిండికేట్ల ఆందోళనతో.. జూలై 1వ తేదీ నుంచి నూతన విధానం అమలులోకి రానుండగా.. కొత్త షాపుల ఏర్పాటు తలకు మించిన భారమవుతుందని, కొత్త నిబంధనలతో అమ్మకాలు తగ్గిపోతాయని మద్యం సిండికేట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రభుత్వ పెద్దలకు భారీగానే ముడుపులు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతోపాటు ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పాలకులు సరికొత్త విధానాన్ని తెరపైకి తెస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి 220 మీటర్ల లోపే మద్యం షాపులు ఏర్పాటు చేసుకునే వీలుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఈ దూరం రెట్టింపునకు మించి పెరిగిపోతోంది. దూరం తక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, పట్టణాలకు వచ్చేసరికి అమ్మకాలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. సుప్రీం తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా.. సుప్రీంకోర్టు ఎన్హెచ్, ఎస్హెచ్లను మాత్రమే తీర్పులో ఉటంకించడంతో నగర, పురపాలక సంస్థల్లోని జాతీయ, స్టేట్ హైవేలను మున్సిపల్ డెవలప్మెంట్ రోడ్లు(ఎండీఆర్)గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. నేడో, రేపో ఈ మేరకు జీఓ విడుదల కావచ్చని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. దీనిపై ఇప్పటికే తమకు మౌఖికంగా సమాచారం అందినట్టు ఒక ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఎండీఆర్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా మద్యం షాపులను ఇప్పుడున్నచోటే కొనసాగించుకునేందుకు వ్యాపారులకు వీలు కల్పించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా సర్కారు చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు తావిస్తున్నాయి. స్థానిక సంస్థలపై భారం జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి ఇప్పటివరకూ ఆయా శాఖల పరిధిలోనే జరిగేది. జాతీయ రహదారుల అభివృద్ధికి అయ్యే వ్యయాన్ని కేంద్రం భరించేది. రాష్ట్ర రహదారి అయితే ఆర్అడ్బీ నుంచి నిధుల విడుదల జరిగేది. మద్యం వ్యాపారుల కోసం ఆయా రోడ్లను నగర, పురపాలక సంస్థల పరిధిలోకి తీసుకురానుండటంతో వాటి నిర్వహణ, అభివృద్ధికి అయ్యే కోట్లాది రూపాయలు భారాన్ని ఆయా స్థానిక సంస్థలే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే స్థానిక సంస్థల పరిస్థితి అంతంతమాత్రంగా ఉండగా.. వీటి రూపంలో కోట్లాది రూపాయల అదనపు భారం పడటంతో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతుందని పలువురు విమర్శిస్తున్నారు. -
‘మంజునాథ కమిషన్ గో బ్యాక్’
కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : అర్హత లేని కులాలను బీసీ జాబితాలో ఎలా చేరుస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. అధ్యయనం చేసేందుకు బుధవారం కాకినాడ వస్తున్న మంజునాథ కమిషన్ను వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్ల సీతారత్నం ఆధ్వర్యంలో ‘మంజునాథ కమిషన్ గో బ్యాక్’ అంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు నుంచి దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని బైఠాయించారు. వెంకట మహేష్ మాట్లాడుతూ రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా బీసీ జాబితాలో చేర్చడాన్ని తమ సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అర్హత లేని కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర జనాభాలో 55 శాతం కంటే పైగా ఉన్న బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తున్నారని, దానిని 50 శాతానికి పెంచాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకే ఎసరు పెడుతున్నారన్నారు. ఒక కమిషన్ ఏర్పాటు చేసి బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తమాషా చేస్తోందన్నారు. రాష్ట్ర బీసీ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు లద్దిక మల్లేష్, బీసీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్, నాయకులు రాయుడు రాకేష్, బండారు రాజేశ్వరరావు, గెడ్డం నాగరాజు, విత్తనాల శివ వెంకటేష్, విష్ణు, సాయిరాంసింగ్, ప్రశాంత్, కోటి తదితరులు పాల్గొన్నారు. -
డీఈఓకు పదోన్నతి కల్పిస్తూ జీఓ జారీ
కర్నూలు(సిటీ): ప్రభుత్వ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్గా పని చేస్తూ, డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.రవీంద్రనాథ్రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్దాసు జీఓ ఆర్టీ నెం.23 జారీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనకు ఒకేషనల్ విద్య జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి కల్పిస్తూ అమరావతికి బదిలీ చేశారు. డీఈఓ ఇన్చార్జి బాధ్యతలను ఇతరులకు అప్పగించేందుకు కలెక్టర్ సుముఖంగా లేకపోవడంతో జేడీగా బాధ్యతలు తీసుకున్నా పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు డీఈఓగా రవీంద్రనాథ్రెడ్డినే కొనసాగించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు తెలిసింది. -
కంచె దాటిన కరుణ
మిత్రపక్షమైన బీజేపీపై టీడీపీ సర్కారు ఉదారత 300 గజాలకు మించి ఇచ్చే అవకాశం లేకున్నా.. విశాఖలో బీజేపీ కార్యాలయానికి 87 సెంట్ల భూమి రూ.55 కోట్ల విలువైన భూమికి ఏడాదికి రూ.870 లీజు రేటు పాత జీవోకు తూట్లు పొడిచి.. 526 జీవో జారీ చేసిన సర్కార్ కంచే చేను మేసింది.. తాను జారీ చేసిన జీవోకే సర్కారు తూట్లు పొడిచింది. రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాల కేటాయింపునకు సంబంధించిన జీవోకు అదే గతి పట్టింది. ఇప్పటికే వందల కోట్ల విలువైన భూములను తమ తాబేదార్లకు.. అంతేవాసులకు కట్టబెట్టేస్తున్న టీడీపీ సర్కారు.. తాజాగా తన మిత్రపక్షమైన బీజేపీ విషయంలోనూ అదే ఉదారత చూపింది. అడిగిందే తడవుగా.. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత నామమాత్రపు ధరకు నగరంలోని ఖరీదైన ప్రాంతంలో స్థలాన్ని అప్పగించికమలంపై అలవిమాలిన కరుణ చూపింది. అందుకు అడ్డుపడుతున్న జీవోనే సవరించేసింది. విశాఖపట్నం:గతంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది. భారతీయ జనతా పార్టీకి కార్యాలయ నిర్మాణానికి విశాఖ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని దాదాపు ఉచితంగా కట్టబెట్టింది. తాను తెచ్చిన జీవోలోని నిబం«ధనలనే ఖాతరు చేయకుండా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా భూకేటాయింపులు జరిపింది. పరిమితులు ఇలా.. రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాల కేటాయింపునకు సంబంధించి కొద్ది నెలల క్రితం రాష్ట్ర కేబినెట్లో చర్చించి కొన్ని నిబంధనలు రూపొందించారు. ఆ మేరకు ఈ ఏడాది జూలై 21న ప్రభుత్వం జీవో నెం. 340 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం అసెంబ్లీలో పార్టీల సభ్యుల సంఖ్యను బట్టి కార్యాలయాల నిర్మాణాలకు భూ కేటాయింపులు జరపాలి. 50 శాతానికిపైగా సంఖ్యాబలం ఉన్న పార్టీలకు రాజధానిలో 4 ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో 2 ఎకరాలు కేటాయించొచ్చు. అదే 25 నుంచి 50 శాతం మధ్య సభ్యులుంటే రాజధానిలో అర ఎకరం, జిల్లా కేంద్రాల్లో వెయ్యి గజాలు కేటాయించొచ్చు. 25 శాతం లోపు సభ్యులున్న పార్టీలకు రాజధానిలో వెయ్యి చదరపు గజాలు, జిల్లా కేంద్రాల్లో 300 చదరపు గజాలకు మించి స్థలాలు కేటాయించడానికి వీల్లేదు. నిబంధనలు కాదంటున్నా.. జీవోలోని గైడ్లైన్స్ ప్రకారం చూస్తే అసెంబ్లీలో బీజేపీకి ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే జిల్లా కేంద్రాల్లో ఆ పార్టీకి 300 చదరపు గజాలకు మించి భూమి కేటాయించడానికి వీల్లేదు. కానీ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు విశాఖపట్నం నడిబొడ్డున చినవాల్తేరులోని సర్వే నెం.13లో ఉన్న 87 సెంట్ల స్థలాన్ని తమ కార్యాలయం కోసం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పైగా ఎకరా రూ. 10 లక్షల ధరకు కేటాయించాలని లేదా ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి రేటుతో 99 ఏళ్లకు లీజుకివ్వాలని ఆ లేఖలో ఎమ్మెల్యే కోరారు. నిబంధనలు అంగీకరించకపోయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్ విలువ ప్రకారం చదరపు గజం రూ.55వేల ధరకు కేటాయించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ ప్రవీణŠæకుమార్ ప్రతిపాదనలు పంపించారు. అంటే.. 87 సెంట్ల(4176 చదరపు గజాల)స్థలం విలువ రూ.22.96 కోట్లన్న మాట. కలెక్టర్ ప్రతిపాదననూ తోసిరాజని.. కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వాదేశాల మేరకు జీవో 340ను సవరించి మరీ బీజేపీ కార్యాలయానికి 87 సెంట్ల çస్థలాన్ని కేటాయించారు. కలెక్టర్ గజం రూ.55 వేల ధర సిఫార్సు చేస్తే.. దాన్ని కాదని ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి లీజుకే 33 ఏళ్లకు కేటాయిస్తూ జీవో 526ను జారీ చేసింది. అంటే 87 సెంట్ల స్థలానికి ఏడాదికి రూ.870 లీజు ధరకే కట్టబెట్టారన్నమాట. తదుపరి చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్కు అధికారమిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేసీ శర్మ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో కనీసం పదిశాతం సభ్యులు కూడా లేని బీజేపికి ఏకంగా కోట్ల విలువైన 87 సెంట్ల భూమిని కేటాయించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ల్యాండ్ పూలింగ్లో రూ.కోట్ల అక్రమాలు
సీతంపేట (విశాఖ): విశాఖ జిల్లాలో అనందపురం, భీమిలి మండలాల్లో ఉడా సేకరించిన ల్యాండ్పూలింగ్ వ్యవహారంలో రూ.600 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పత్రికల్లో అనేక కథనాలొచ్చాయని, దీనిపై లోక్సత్తా పార్టీ కీలక అంశాలను పరిశీలించి అక్రమాలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చిందన్నారు. సీఎం బాబు తక్షణమే ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. పూలింగ్ అక్రమాల వల్ల పెద్ద ఎత్తున పేద రైతులు నష్టపోతారన్నారు. పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం, ఆనందపురం మండలం దబ్బంద, గండిగుండం, కొమ్మాది, భీమిలి మండలంలో నేరెâýæ్ళవలస గ్రామాల్లో కొన్ని నెలలుగా రాజకీయ దళారీలు పక్కా ప్రణాళికలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దీని వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం ఉన్నట్టు స్పష్టమైందని తెలిపారు. తొలిదశలో ఉడా సేకరించిన 359 ఎకరాలు, రెండో దశలో 183 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ల్యాండ్పూలింగ్ కోసం మూడు జీవోలు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. భూమి సేకరించనున్న రైతుల పేర్లు, సర్వే నంబర్లతో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎం.ఎస్.ఎ¯ŒS.మూర్తి, వడ్డిహరి గణేష్, చంద్రమౌళి, చిరంజీవి, హర్ష, పక్కి శంకర్ పాల్గొన్నారు. -
చంద్రన్న బీమా జీవో కాపీలు దహనం
ప్రభుత్వ ఆదేశాలపై భగ్గుమన్న భవన నిర్మాణ కార్మికులు పెద్దాపురంలో నిరసన ప్రదర్శన పెద్దాపురం : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును చంద్రన్న బీమా పథకంలో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై పెద్దాపురం అర్బన్, రూరల్ ప్రాంతాల భవన నిర్మాణ కార్మికులు మండిపడుతున్నారు.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కార్మికులంతా రోడెక్కారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనం నుంచి శోభా థియేటర్, నువ్వులగుంట వీధి, పాత ఆసుపత్రి మీదుగా మెయిన్ రోడ్డు వరకూ వారు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గడిగట్ట సత్తిబాబు, సీపీఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఎత్తివేసేందుకే ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసిందన్నారు. సంక్షేమ బోర్డును చంద్రన్న బీమాలో కలిపితే భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను వారు దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, కంచుమర్తి కాటంరాజు, మాగాపు నాగు, రాజమహేంద్రపు రామారావు, సిద్ధాంతపు వెంకటరమణ, పాలిపర్తి భద్రరావు, కర్రి వీరశివ, ముమ్మన శ్రీను, బల్ల రాంబాబు, బుడత రవీంద్ర, గంగాధర్ పాల్గొన్నారు. -
మున్సి‘పోల్స్’ లేనట్లే!
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఆరు గ్రామాల విలీనాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను, ఇటీవలే 36 వార్డులను 50 డివిజన్లుగా పునర్విభజన చేసేందుకు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను పురపాలక శాఖ మంత్రి నారాయణ మిరచిపోయారు. సాంకేతిక సమస్యలు... న్యాయవివాదం... అంటూ పాత విషయాన్ని తెరపైకి తెచ్చారు. అయితే నగరపాలక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరగవని, వచ్చే మార్చి నెల తర్వాతే ఉంటాయన్న విషయాన్ని ‘సాక్షి’ మూణ్నెల్ల క్రితమే వెల్లడించింది. ప్రత్యక్ష ఎన్నికలలో ఓటమి భయంతోనే మంత్రి నారాయణ కుంటిసాకులు చెబుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గ్రేడ్-1 మున్సిపాలిటీ అయిన శ్రీకాకుళాన్ని నగరపాలక సంస్థగా మార్పు చేయాలనే ప్రతిపాదన తొలుత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చింది. అప్పట్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవ తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఒక గ్రేడ్-1 మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేయాలంటే కనీసం లక్షా యాభై వేల జనాభా ఉండాలి. కానీ అప్పటికి శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 1.25 లక్షల జనాభా మాత్రమే ఉంది. దీంతో మున్సిపాలిటీ పరిసర గ్రామ పంచాయతీలైన చాపరం, కిల్లిపాలెం, పెద్దపాడు, ఖాజీపేట, పాత్రునివలస, ఎచ్చెర్ల మండలంలోని తోటపాలం, కుశాలపురం గ్రామాలను విలీనం చేస్తూ 2012, ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో నం.30 జారీ చేసింది. వాటిలో పెద్దపాడు పంచాయతీ మాత్రమే విలీనానికి అంగీకరిస్తూ తీర్మానం చేసింది. మిగతా పంచాయతీలు విలీన ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. నగరపాలక సంస్థ పరిధిలోకి వెళ్తే పన్నుల భారం పెరుగుతుందనే వాదనలను అప్పట్లో టీడీపీ నాయకులు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పెద్దపాడు మినహా మిగిలిన పంచాయతీల్లో 2014 సంవత్సరంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. అలా ఎన్నికై న జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు కూడా పంచాయతీల విలీనాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదిలావుండగా పంచాయతీల విలీన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేస్తూ గత ఏడాది మే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. నెల క్రితమే ‘పునర్విభజన’ జీవో.. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల ఎన్నికలు డిసెంబర్లోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణతో పాటు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్చార్జి పరిటాల సునీత కూడా నిన్నటివరకూ పదేపదే చెబుతూ వచ్చారు. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగానే శ్రీకాకుళం నగరంలోని 36 వార్డులను 50 డివిజన్లుగా పునర్విభజన చేయడానికి నెల రోజుల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలీన గ్రామాలను మినహయించి గత 36 వార్డుల పరిధిలోనే 50 డివిజన్లను ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అధికారులు ముసాయిదా (డ్రాఫ్ట్) తయారు చేశారు. వాస్తవానికి ఆ ముసాయిదాను ఈనెల 2వ తేదీలోగా విడుదల చేయాల్సి ఉంది. వ్యతిరేక పవనాల వల్లే వాయిదా? విశ్వసనీయ సమాచారం ప్రకారం... టీడీపీ ప్రభుత్వం పోలీసు ఇంటెలిజెన్స విభాగంతో, అలాగే ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జరిపిన సర్వేల్లోనూ, ఓ సామాజికవర్గం నాయకులు తమ అనుచరులతో ప్రత్యేకంగా చేయించిన అభిప్రాయ సేకరణలోనూ వ్యతిరేక ఫలితాలే వస్తాయని తేలింది. దీనికితోడు డివిజన్ల విభజనపై టీడీపీలో స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచరులు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అనుచరుల మధ్య వర్గపోరు మొదలైంది. మంత్రి ఆదేశాలతో డివిజన్ల విభజన ఫైల్కు బ్రేక్ పడిందని ‘సాక్షి’ ఇప్పటికే వెల్లడించింది. ఇటీవలే విజయనగరం జిల్లా సారిక గ్రామ పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సర్పంచిగా విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్తే భంగపడక తప్పదనే వాదన టీడీపీలోనే అంతర్గతంగా మొదలైంది. ఇక విశాఖ నగరంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ విజయవంతం కావడం కూడా టీడీపీ నాయకులు వెనకడుగు వేయడానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వాయిదా వేయడానికి కారణమేదీ కనిపించక మంత్రి నారాయణ కుంటిసాకులు చెబుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
కొత్త చట్టం ప్రకారమే పోలవరం ప్యాకేజి
మరో 90 గ్రామాలను ముంపులో చేరుస్తూ త్వరలో జీవో సర్వే పనులు వేగవంతం చేస్తాం పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్ నెల్లిపాక : కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి , పునరావాసం కల్పిస్తామని పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ) భానుప్రసాద్ స్పష్టం చేశారు. ఎటపాక మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా నాలుగు విలీన మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన నెల్లిపాకలో నిర్వాసితులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. గోదావరి వరదల సమయంలో నెల్లిపాక జలదిగ్బంధంలో ఉంటుందని 90 శాతం భూములు ముంపునకు గురవుతాయని గ్రామస్తులు వివరించారు తమ గ్రామాన్ని కూడా పోలవరం ముంపు జాబితాలో చేర్చాలని వారు కలెక్టర్ను కోరారు. ఇందుకు భానుప్రసాద్ బదులిస్తూ నాలుగు మండలాల్లో 191 హేబిటేషన్లు ముంపునకు గురవుతున్నట్టు ఇరిగేష¯ŒS శాఖ గుర్తించిందన్నారు. వాటిలో పూర్తిగా, పాక్షికంగా ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మొదట గెజిట్లో ఉన్న ముంపు గ్రామాల్లో భూసేకరణ సర్వేను వేగవంతం చేయనున్నామని చెప్పారు. మరో 90 గ్రామాలు ముంపు జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కొత్తగా జీఓ విడుదల చేయనుందని ప్రకటించారు. ఎఫ్ఆర్ఎల్ ప్రకారం బౌండరీ నుంచి 100 మీటర్ల దూరం వరకు భూసేకరణ చేస్తామని చెప్పారు. గిరిజనేతరులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించి గృహాలు నిర్మించి కాలనీల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ముంపునకు గురయ్యే గిరిజనుల రెండున్నర ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని ఇస్తామన్నారు. మిగిలిన భూమికి పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటూ డి పట్టాలు పొందిన రైతులకు కూడా పరిహారం వర్తిస్తుందన్నారు. నిర్వాసితుల కోసం రూ. 27 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ 36 వేల కోట్లయితే, అందులో 370 ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ 27 వేల కోట్లను పరిహారం, ప్యాకేజి, పునరావాసాలకు ఖర్చవుతుందని అంచనా అని భానుప్రసాద్ తెలిపారు. ఈ జిల్లాలోని నిర్వాసితులు కోరుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పునరావాసం, భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 2018 నాటికి పోలవరం కుడి, ఎడమ కాలువల నుంచి నీటిని విడుదల చేయాలనే ఉద్దేశంతో మొదటి ఫేజ్లో వీఆర్పురం మండలంలో 11, కూనవరం మండలంలో ఒక గ్రామంలో సర్వే పనులు ప్రారంభించామని తెలిపారు. సమావేశంలో ఎస్డీసీ ఎల్లారమ్మ, తహసీల్దార్లు చిట్టిబాబు, నర్శింహులు, జీవీఎస్ ప్రసాద్ ఉన్నారు. -
తెలంగాణ వారైనా స్థానికేతరులే
కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివితే అలాగే గుర్తింపు ఆందోళనలో పూర్వ విద్యార్ధులు మిర్యాలగూడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన తెలంగాణ విద్యార్థులు నాన్లోకల్ శాపగ్రస్తులుగా మిగిలారు. సొంత రాష్ట్రంలో ఉండి కూడా నాన్లోకల్గా ముద్రపడి ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలారు. రాష్ట్ర విభజన నాటికి కోరుకొండ సైనిక్ స్కూల్లో తెలంగాణ ప్రాంతం నుంచి సుమారుగా 500 మంది విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేశారు. ఇందులో కొంత మంది ఉద్యోగాలు సాధించగా.. మరికొంత మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేయడంతోపాటు ఉన్నత చదువులు చదువుతున్నారు. కానీ.. తెలంగాణ ప్రాంతంలో ఇటీవల ఉద్యోగాలకు నిర్వహించిన పోటీ పరీక్షల్లో మాత్రం విజయనగరం జిల్లా కోరుకొండలో చదివిన వారిని స్థానికేతరులుగా గుర్తించారు. తెలంగాణలో పుట్టి పెరిగిన వారు అయినప్పటికీ.. చదువురీత్యా ఉమ్మడి రాష్ట్రంలో కోరుకొండ స్కూల్లో చదవడం వల్ల స్థానికేతరులుగా గుర్తింపు ఇస్తున్నారు. దీంతో సైనిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జీఓ జారీ చేస్తేనే తీరనున్న కష్టాలు విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన తెలంగాణ విద్యార్థులను కూడా స్థానికులుగా పరిగణించడానికి ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయాల్సి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, వారి నివాసం, ఆధార్కార్డు, రేషన్కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల ఆధారంగా లోకల్ సర్టిఫికెట్ జారీ చేయాలి. అందుకుగాను ప్రత్యేకంగా జీఓ జారీ చేయాలని..అలా చేస్తేనే సైనిక్ స్కూల్ విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం లోకల్గా గుర్తించాలి మాది తెలంగాణ. మా తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఉంటారు. మేము మెరుగైన విద్య కోసం కోరుకొండ సైనిక్ స్కూల్లో ప్రవేశపరీక్ష ద్వారా సీటు సాధించా. ఆరు నుంచి 12వ తరగతి వరకు అక్కడే చదివా. కోరుకొండలో చదవడం వల్ల రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నాన్లోకల్గా పరిగణిస్తున్నారు. మా సొంత రాష్ట్రంలో మమ్మల్ని లోకల్గా గుర్తించాలి. - వినోద్కుమార్, బీటెక్ ఫైనల్ ఇయర్, మిర్యాలగూడ నాన్ లోకల్ అనడం అన్యాయం తెలంగాణ ప్రాం తానికి చెందిన వారమైనా విజయనగరం జిల్లా కోరుకొండలో చదడవం వల్ల నాన్లోకల్గా పరిగణించడం అన్యాయం. ఐదో తరగతి వరకు తెలంగాణాలోనే చదువుకున్నాం. సైనిక్ స్కూల్లో ప్రవేశపరీక్ష ద్వారా చేరి 12వ తరగతి వరకు చదివాం. దీంతో మమ్ములను తెలంగాణా వారు కాదని నాన్లోకల్గా పరిగణించడం సరికాదు. ప్రభుత్వం లోకల్గా గుర్తించి న్యాయం చేయాలి. - హరిహర భార్గవ, బీటెక్ ద్వితీయ సంవత్సరం, మిర్యాలగూడ -
ఆ జీఓను రద్దు చేయాలి
శిరోముండనం కేసులో పీపీ తొలగింపుపై నిరసన ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా రామచంద్రపురం: వెంకటాయపాలెం శిరోముండనం కేసులో బాధితుల తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తొలగిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఆ జీవోను నిరసిస్తు సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ, ఏఐకేఎంఎస్, దళిత సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రజా సంఘాల నాయకుడు చీకట్ల వెంకటేశ్వరరావు, జె.æ సత్తిబాబు, ఆర్. రాగులు, జి. ఆదినారాయణ, వి. భీమశంకరం, వైఎస్సార్ సీసీ నాయకుడు పెట్టా శ్రీనివాసరావు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బి. సిద్ధూ తదితరులు మాట్లాడుతూ పీపీని తొలగించి ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తోట త్రిమూర్తులును భుజాన మోస్తూ దళితులకు అన్యాయం చేసిందని విమర్శించారు. ఆ జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని, లేనిపక్షంలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాయన్నారు. ఈమేరకు ఆర్డీఓ కె. సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు. తొలుత ప్రధాన రహదారిలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం కళ్లకు నల్లబ్యాడ్జిలు కట్టారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. వెంకటాయపాలెం ఎంపీటీసీ సభ్యుడు దడాల రవికుమార్, నాయకులు దడాల వెంకటరమణ, బొమ్ము మోహనరావు, మందపల్లి చిట్టిబాబు, దొమ్మలపాటి శ్యాం, వినకోటి కొండ, పలివెల ప్రభాకర్, బొమ్ము సతీష్, ఇసుకపట్ల కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అతడి అరెస్టుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో
సాక్షి, సిటీబ్యూరో: అర్షద్ మాలిక్... మంగళవారం వరంగల్ జైలు నుంచి అలా విడుదలై, ఇలా మళ్లీ ‘లోపలకు’ వెళ్లిపోయాడు. ఇతగాడిని మళ్లీ‘అరెస్టు చేయడం’ కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక జీవో కూడా తీసుకొచ్చింది. మళ్లీ ఎప్పుడు ‘బయటకు వస్తాడో’ చెప్పలేని పరిస్థితి. ఇంతకీ అసలు ఎవరీ అర్షద్ మాలిక్? అతడిపై ఉన్న కేసు ఏంటి? శిక్ష పూరై్తనా బయటకు ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నలకు సమాధానామే ఈ కథనం... ఐఎస్ఐ ప్రోద్భలంతో భారత్కు... అర్షద్ మహమూద్కు అలియాస్ అర్షద్ మాలిక్ అలియాస్ అర్షద్ కబీర్ అలియాస్ అచ్చీ అలియాస్ జీవ అనే మారుపేర్లూ ఉన్నాయి. పాకిస్థాన్లోని రహీమైఖర్ఖాన్ జిల్లా ఖాన్పూర్ ఇతడి స్వస్థలం. 2002 నవంబర్లో ఐఎస్ఐ అధికారులైన ఫీర్జీ, లియాఖత్ ఇతన్ని ఖాన్పూర్లోనే కలిసి తమ తరఫున భారత్లో పని చేయడానికి వెళ్లాలని కోరారు. అర్షద్ అంగీకరించడంతో రహీమైఖర్ఖాన్లో దాదాపు మూడు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. భారత ఆర్మీ యూనిట్లే టార్గెట్గా చేసుకొనే ఈ శిక్షణ మొత్తం ఇచ్చారు. పాక్ టు భారత్ వయా బంగ్లా... అర్షద్ మాలిక్కు భారత్ ఆర్మీలో ఉండే అధికారుల ర్యాంకులు, వారి విధులు, ఆర్మీ యూనిట్లు ఉన్న ప్రాంతాలు, కంప్యూటర్ ద్వారా మ్యాపుల అధ్యయనం, ఈ–మెయిల్ ద్వారా సంప్రదింపులు జరపడం తదితర అంశాలన్నీ నేర్పారు. శిక్షణ ముగిశాక పాకిస్థానీ పాస్పోర్ట్ ఇచ్చి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు పంపారు. అక్కడ కలిసిన పాకిస్థాన్ గూఢచార సంస్థ ప్రతినిధులు బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ఇచ్చి 2003 మార్చిలో బెహ్రామ్పూర్ మీదుగా కోల్కతా పంపారు. కోల్కతా, ముంబయిల్లో కొన్ని ప్రాంతాలను పరిశీలించి తర్వాత అదే ఏడాది మేలో తిరిగి ఢాకా వెళ్లాడు. హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఐఎస్ఐ నుంచి 2003 జూలైలో ఆదేశాలు అందడంతో అదే ఏడాది ఆగస్టులో భోపాల్ మీదుగా కోల్కతా చేరుకున్నాడు. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి ముత్యాల్బాగ్లో గది అద్దెకు తీసుకొని మకాం పెట్టాడు. ‘వైద్యం’ ముసుగులో గూఢచర్యం... ముత్యాల్బాగ్లో వారికి అర్షద్ తాను వైద్య పరికరాలు అమ్మే చిన్న వ్యాపారినని, కోల్కతా నుంచి వచ్చానని చెప్పాడు. పగలంతా ఆర్మీ ప్రాంతాల్లో తిరిగి రాత్రి 10 గంటల తర్వాత కింగ్కోఠి అగర్వాల్ ఛాంబర్స్లోని హైదరాబాద్ సైబర్ కేఫ్ నుంచి ఈ–మెయిల్స్ ద్వారా రక్షణ రహస్యాలను పాకిస్థాన్కు పంపేవాడు. ఇందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్ నుంచి ఫీర్జీ హవాలా ద్వారా ఎప్పటికప్పుడు ఇతనికి సొమ్ము పంపేవాడు. నగరంలో కొరియర్ సర్వీసు నిర్వహించే మిలింద్ ద్వారా పలుమార్లు అర్షద్కు వేల రూపాయలు అందాయని పోలీసులు అభియోగం మోపారు. 2004 మార్చి 9న సైబర్కేఫ్లో ఉన్న అర్షద్ను టాస్క్ఫోర్స్ అరెస్టు చేసింది. ఐదేళ్లకు దోషిగా నిరూపణ... అప్పట్లో టాస్క్ఫోర్స్ పోలీసులు ఇతని వద్ద రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ ఫ్లాపీ, కెమెరా, ఆర్మీ లొకేషన్స్ ఫొటోలు, సికింద్రాబాద్–హైదరాబాద్ల్లో ఉన్న ఆర్మీ లొకేషన్స్ స్కెచ్లు, ఆర్మీ అధికారుల టెలిఫోన్ డైరెక్టరీలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతని గదిలో బూట్లలో దాచి ఉంచిన మరో రూ.21 వేలు, అర్షద్ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు పంపిన కొన్ని ఈ–మెయిల్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తొలుత అబిడ్స్ పోలీసుస్టేçÙన్లో నమోదైన ఈ కేసు ఆ తరవాత సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు బదిలీ అయింది. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు అర్షద్ను దోషిగా నిర్థారిస్తూ 2009 ఏప్రిల్లో 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో అర్షద్ను చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడ ఇతర ఖైదీలతో ఘర్షణ పడటంతో 2011లో విశాఖపట్నం జైలుకు మార్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 జూన్ 7న వరంగల్ జైలుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి అదే జైలులో ఉన్న అర్షద్ మాలిక్ శిక్షా కాలం జైలు నిబంధనల ప్రకారం మంగళవారంతో ముగిసింది. ఓన్’ చేసుకోని పాకిస్థాన్... అర్షద్ మాలిక్ పాకిస్థానీ కావడంతో పాటు బంగ్లాదేశ్కు చెందిన బోగస్ పాస్పోర్ట్తో భారత్కు వచ్చారు. దీన్ని అతడి అరెస్టు సందర్భంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇతడు పాస్పోర్ట్ లేని విదేశీయుడిగా మారిపోయాడు. ఇలాంటి వాళ్ల శిక్షాకాలం పూర్తయిన తర్వాత సైతం బయటకు పంపాలంటే ఆయా దేశాలు సదరు వ్యక్తి మా పౌరుడే అని అంగీకరించి, తమ ఆధీనంలోకి తీసుకోవాలి. ఈ కేసులో పాక్ అలా అంగీకరిస్తే ఐఎస్ఐ వ్యవహారాలు బహిర్గతమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశం అర్షద్ను ‘ఓన్’ చేసుకోకపోవడంతో తిరిగి జైలుకు తరలించారు. ఈ తరహాలో ఇప్పటికే సలీం జునైద్ అనే పాకిస్థానీ ఇక్కడే ఉండిపోయాడు. -
గార్గేయపురం వద్ద విద్యుత్ప్లాంట్
కర్నూలు (టౌన్): చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కర్నూలులో ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని గార్గేయపురం వద్ద సర్వే నంబర్ 751, 180/2 లో 6 ఎకరాల 178 సెంట్లు కేటాయిస్తు శనివారం ప్రభుత్వం జీవో 204 జారీ చేసింది. బెంగళూరుకు చెందిన నెక్సాస్ నోవోస్ ఇంపోర్టు అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్త్రెవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 25 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఆర్. కరికాల్ వలవన్ పేర్కొన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ప్లాంటుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబును ఆ ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేసింది. -
జీవో 271ని రద్దు చేయాలి
– అఖిల పక్షాల రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కర్నూలు(న్యూసిటీ): భూమిపై రైతుకు ఉన్న యాజమాన్య హక్కులను హరించే జీవో నెం.271ని రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం, రైతు సంఘం, భారతీయ కిసాన్సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెం.271 ప్రకారం యాజమాన్య హక్కు పత్రాలు ఉండి భూమిని సాగు చేసుకుంటున్నా.. 1బీలో ఆరైతు పేరు లేకపోతే హక్కులు చెల్లబోవన్నారు. ఈ జీవోతో నిజమైన రైతుల భూములు చేజారే అవకాశం ఉందన్నారు. జీఓ నెం.271ని రద్దు చేసి గతంలో మాది పాస్పుస్తకం టైటిల్డీడ్లకు ఉన్న సాధికారతను కొనసాగించాలన్నారు. అవి లేకుండా భూముల రిజిస్ట్రేషన్ను జరగకుండా ఉండేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలకు భూములను కట్టబెట్టడానికి సీఎం చంద్రబాబు జీవో నెం.271ని విడుదల చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.ప్రతాప్రెడ్డి విమర్శించారు. రాజధాని పేరుతో రైతుల భూములను సింగపూర్ కంపెనీలకు అప్పజెపుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నీరుగారుస్తోందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జ గన్నాథం ఆరోపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భీమలింగప్ప, హంద్రీనీవా పరివాహక గ్రామాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎం.రామకష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ హఫీజ్ఖాన్, రైతు సంఘం కార్యదర్శి సోమన్న, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆదిశేషన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
జీవో 271 నిలిపివేయాలి
– నేడు మండల కార్యాలయాల వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ధర్నా – విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు గౌరు పిలుపు కర్నూలు(ఓల్డ్సిటీ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 271 జీవోను వెంటనే నిలిపివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టైటిల్డీడ్ లేకుండానే కేవలం 1బీ ఆధారంగానే రైతులకు భూములు బదలాయింపు, బ్యాంకు రుణాలు అందజేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. దీంతో పట్టాదార్ పాస్బుక్, టైటిల్డీడ్లకు విలువ లేకుండా పోతుందని, ఈ విధానం అనేక రకాలైన వివాదాలకు దారి తీస్తుందని తెలిపారు. 1బీలో ఉద్దేశపూర్వకంగా అసలు భూమి యజమానికి బదులు మరొకరి పేరు చేర్చి రిజిష్టర్ జరిపిస్తే ఆ రైతు కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. 1బీలో మార్పులు, భూమిపై హక్కులు, రికార్డుల్లో మార్పు, మ్యుటేషన్ వంటి వాటి కోసం అర్జీలు ఇచ్చి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా మార్పులు చేయడం లేదని, వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఆన్లైన్లో జరిగిన మార్పులను చదువులేని సామాన్య రైతులు ఏవిధంగా చూసుకోగలరని ప్రశ్నించారు. జీవో నిలిపివేయాలనే డిమాండ్తో బుధవారం అఖిల పక్ష రైతు సంఘాలు మండల కార్యాలయాల వద్ద చేపట్టే ధర్నాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గౌరు వెంకటరెడ్డి ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు. -
పిచ్చెక్కిస్తున్న పోకెమాన్ గో..
-
పిచ్చెక్కిస్తున్న పోకెమాన్ గో.. జపాన్ లో లాంచింగ్ వాయిదా..!
పోకేమాన్ గో గేమ్.. జపాన్ లో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. లొకేషన్ ఆధారంగా ఆడే ఈ ఆగ్ మెంటెడ్ రియాల్టీ గేమ్.. ఇప్పటికే అనేక దేశాల్లో విడుదలై ప్రపంచానికి పిచ్చెక్కిస్తున్న విషయం తెలిసిందే.. గేమ్ తయారీ సంస్థ నియాంటిక్.. ప్రస్తుతం జపాన్ లో ఈ గేమ్ విడుదలను విరమించుకుంది. ఇంటర్నెట్ లో ఓ ఈ మెయిల్ వైరల్ గా మారడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో విడుదలై జనాన్ని కట్టిపడేస్తున్న 'పోకేమాన్ గో'.. విడుదల వాయిదా పడటం జపాన్ వాసులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే జపాన్లోనూ తమ గేమ్ కు నిస్పందేహంగా అత్యంత ఆదరణ లభిస్తుందని నియాంటిక్ సీఈవో జాన్ హంక్ తెలిపారు. పోకేమాన్ గో కోసం తగినన్ని సర్వర్లు కావాలంటే కొంత సమయం అవసరమని, దీంతో గేమ్ ప్రారంభం ఆలస్యం అవుతోందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు అత్యధికంగా ఉండే జపాన్ లోని సుమారు 3000 జిమ్ లలో తమ స్టోర్లను ప్రారంభించేందుకు మొదటి స్పాన్సరర్ మెక్ డొనాల్డ్ అంగీకరించినట్లు తెలిపారు. అంతేకాక ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడ భాగస్వామ్యాన్ని అందించే ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్లు హంక్ వివరించారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన స్పందన కనిపిస్తున్న ఈ పోకేమాన్ గో గేమ్ లో పడి కొందరు బాహ్య ప్రపంచాన్నే మరచిపోయి ప్రమాదాలను సైతం కొనితెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఓ ఆటగాడు పోకేమాన్ లను వెతికే పనిలో పడి.. న్యూయార్క్ లో ట్రాఫిక్ జామ్ కు కారణమవ్వగా.. ఓ వ్యక్తి పార్కులో ఆడుతూ పరధ్యానంగా పూల్ లో పడ్డ ఘటన వెలుగు చూసింది. రియాల్టీ గేమ్ ప్రపంచంలోకి ఆటగాళ్ళను తీసుకెళ్ళి వారికి కొత్త అనుభూతినివ్వడంతోపాటు.. ఈ గేమ్ ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతోందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పోకెమాన్ గో గేమ్ యాప్ ను స్మార్ట్ ఫోనుల్లో డౌన్ లోడ్ చేసుకుని, పోకెమాన్ లను వెతికి పట్టుకోవడం కోసం క్రీడాకారులు వీధుల వెంట,పార్కుల వెంట పిచ్చి పట్టినట్లు తిరుగుతున్నారు. వాటిని వెతుక్కుంటూ మైళ్ళకొద్దీ దూరాలు ప్రయాణించేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లో యాప్ ద్వారా ఆడే ఈ ఆట.. ఇంటర్నెట్ తో కనెక్ట్ అవ్వగానే దగ్గరలోని పోకెమాన్ లను చూపిస్తుంటుంది. ఇలా కనిపించిన పోకేమాన్ లు ఉన్న ప్రాంతానికి జీపీఎస్ ఆధారంగా వెతుక్కుంటూ వెళ్ళి, పోకేబాల్ తో కొడితే అక్కడున్న పోకేమాన్ లు వారి సొంతమౌతాయన్నమాట. అంటే వారి లిస్టులో చేరిపోతాయి. ఇలా పలు దశల్లో ఈ ఆట ఆడే అవకాశం ఉంటుంది. అమెరికాలో విడుదలైన రెండు వారాల్లోనే పోకేమాన్ గో అద్భుత విజయాన్ని చవిచూసిందట. 30 మిలియన్ల డౌన్ లోడ్లతో, 35 మిలియన్ డాలర్లు సంపాదించేసి, ఏకంగా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ట్విట్టర్, ఫేస్ బుక్ వినియోగదారులను దాటిపోయింది. అయితే పోకేమాన్ స్వస్థలమైన జపాన్ లో ప్రారంభం కాకముందే ఈ వినూత్న గేమ్ ప్రపంచంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. ఇప్పటికే 30 దేశాల్లో పైగా అందుబాటులో ఉన్న పోకేమాన్ గో.. గతవారం యూరప్ మార్కెట్లలో స్థిరంగా ఉండటంపై సంస్థ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఒకసారి జపాన్ లో ఈ గేమ్ ప్రారంభమైతే.. ఆసియాలోనే ఇతర దేశాలకంటే ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
మళ్లీ గలీజుదందా!
మున్సిపల్ దుకాణాల బహిరంగ వేలంలో కొత్త ట్విస్ట్ * 100 శాతం పెంచి పాత వారికే ఇస్తారంటా.. * పోతూ.. పోతూ పాత కమిషనర్ నిర్ణయం * 30 ఏళ్లు వారికే ఇవ్వాలని జీఓ వచ్చిందంట కోదాడటౌన్ : కోదాడ పురపాలక సంఘానికి చెందిన దుకాణాల సముదాయ బహిరంగ వేలం విషయంలో పాలకులు, అధికారులు పట్టణ ప్రజలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు వేలం వేస్తాం అదిగో.. ఇదిగో అంటూ చెప్పిన అధికారులు తెరవెనుక వేరే రాజకీయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత కమిషనర్ ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడానికి ముందు దుకాణాల లీజు దారుల నుండి 100 శాతం అద్దెలు పెంచి ఏప్రిల్ 1 నుండి వసూలు చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. కౌన్సిలర్లు మొదలుకొని అధికారుల వరకు కుమ్మక్కై అడుగడుగునా బహిరంగ వేలానికి మొకాలడ్డుతూ లీజుదారుల కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెరపైకి కొత్త విషయం మున్సిపల్ దుకాణాల వేలం విషయంలో తాజాగా వెలుగులోకి వస్తున్న సమాచారం ప్రకారం కొందరు లీజు దారులు కొత్త విషయాన్ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్త జీఓ తెచ్చిందని దాని ప్రకారం ఒక సారి లీజు దక్కించుకున్న వారు 30 ఏళ్ల వరకు దానిపై హక్కులు ఉంటాయని చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి రెండు లేదా మూడేళ్లకు ఒకసారి వేలం వేసి దుకాణాలను కేటాయించాల్సి ఉండగా మరీ 30 సంవత్సరాల మాటేమిటో విషయం అర్థం కావడం లేదని పలువురు విపక్ష కౌన్సిలర్లు అంటున్నారు. అసలు ఆ జీఓ ఎపుడు వచ్చింది? దాని అర్థం ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది? అసలు అది అసలు జీఓనేనా? ముందు తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా జనవరిలో జరిగిన పాలకవర్గ సమావేశంలో పాతవారికే ఇపుడు ఉన్న అద్దెలపై 100 శాతం పెంచి దుకాణాలను కేటాయించాలని తీర్మానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విపక్ష కౌన్సిలర్లు మాత్రం ఈ విషయం అసలు మాకు తెలియదని, దీనిపై తమకు పూర్తి వివరాలను ఇవ్వాలని వారం క్రితం జరిగిన సమావేశంలో ప్లోర్లీడర్ దండా వీరభద్రం కోరారు. గుడ్విల్ తీసుకొని ఇతరులకు.. దుకాణాల వేలం విషయం పక్కన పెడి తే దీనిలో వ్యాపారులు అనేక ఉల్లంఘనలకు పా ల్పడ్డట్లు తెలుస్తోంది. గతం లో లీజుకు తీసుకున్న వారిలో సగానికి పైగా వ్యాపారులు ఈ దుకాణాలను లక్షల రూపాయల గుడ్విల్ కింద ఇతరులకు అమ్ముకున్నారు. వాస్తవానికి లీజుదారుడు ఇతరులకు దుకాణాన్ని ఇస్తే వెంటనే లీజు ర ద్దువుతుంది. దీన్ని లీజు అగ్రిమెంట్లో ప్ర ముఖంగా పేర్కొంటారు. అంతే కాకుండా ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకూడదు. కానీ, పలువురు వ్యాపారులు తమ దుకాణాలను రెండుగా విభజించి ఇతరులకు అద్దెకు ఇచ్చారు. కొందరు రెండు షాప్లను కలిపి ఒకటి చేశారు. ఈ మార్పులను దొడ్డిదారిని రికార్డుల్లో కూడా నమోదు చేయించారంటే ఈ వ్యవహారంలో సిబ్బంది చేతివాటం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. లీజు అగ్రిమెంట్ కాగితాలు ఒక్కసారి బయటకు తీస్తే ఆ వ్యవహారం బయటపడే అవకాశం ఉన్నా దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కారణం ఇదంతా బహిరంగ రహస్యమే కాబట్టి. 100 శాతం పెంచినా తక్కువే.. దుకాణాల వేలం జరగకుండా అడ్డుకోవడానికి లీజుదారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం వెనక అనేక కారణాలే ఉన్నాయి. ఈ దుకాణాల అద్దెల్లో ఉన్న తేడాతో పాటు షాప్లు పట్టణ నడిబొడ్డున ఉండడం, ఈ ప్రాంతంలో నిత్యం రద్దీ ఉండడం కారణమని తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో షాప్ అద్దె రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఉన్నది. కానీ, మున్సిపల్ దుకాణాల అద్దె మాత్రం కేవలం రూ.3 నుంచి రూ.5 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ లెక్కన తాజాగా అద్దెలను 100 శాతం పెంచినా అది రూ.5 నుంచి రూ.6వేలు కూడా దాటదు. అంతే కాదు లక్షల రూపాయలు అడ్వాన్సగా చెల్లించినా షాప్ అద్దెకు దొరకడం కష్టమే. పాత కమిషనరే నిర్ణయం తీసుకున్నారు కమినర్గా బాలోజీనాయక్ ఉన్న సమయంలోనే సాయికృష్ణ థియేటర్ రోడ్డులో ఉన్న దుకాణాల అద్దెపై 100 శాతం పెంచి ఏప్రిల్-2016 నుంచి వసూళ్లు చేయాలని ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త కమిషనర్ వచ్చారు. ఈ విషయాన్ని మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. - బుచ్చిబాబు, మున్సిపల్ మేనేజర్ -
జీవో-78 రాజ్యాంగ విరుద్ధం: కోదండరాం
రాజేంద్రనగర్: ఉద్యాన వర్సిటీలో ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి జీవో నంబర్ 78 రాజ్యాంగ విరుద్ధమని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. శనివారం రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీల రిసెర్చ్ స్కాలర్స్ జేఏసీ ఆధ్వర్యంలో 'వర్సిటీలు-స్వయం ప్రతిపత్తి' అంశంపై జేఏసీ కన్వీనర్ కాటం శ్రీధర్ అధ్యక్షతన వెటర్నరీవర్సిటీ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ చేసిన చట్టం ద్వారా యూనివర్సిటీలు ఏర్పడ్డాయని తెలిపారు. వర్సిటీకి సంబంధించిన చట్టం ముందు ప్రభుత్వం ఇచ్చే జీవోలు చెల్లవని ఆయన తెలిపారు. యూనివర్సిటీ చట్టం ప్రకారమే అధ్యాపకుల నియామకాలు జరగాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం సర్వీస్ కమిషనర్ ద్వారా అధ్యాపక నియామకాలు చేపడితే వర్సిటీలు బాగుపడతాయా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ... విశ్వవిద్యాలయాల నియామకాల్లో గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే ఓ కమిటీ వేసి అవి మరోసారి జరగకుండా చూడాలన్నారు. అంతేకానీ, అధ్యాపకుల నియామక బాధ్యతలను టీఎస్పీఎస్సీకి ఇవ్వడం ద్వారా సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థల కన్వీనర్ ప్రభాకర్రెడ్డి, ప్రొఫెసర్లు జానయ్య, లక్ష్మణ్, విద్యాసాగర్, గోవర్థన్, హనుమాన్నాయక్, జేఏసీ నాయకులు సాయికుమార్, సంపత్, కిరణ్, శ్రావణ్, విద్యాసాగర్, రాజశేఖర్ తదితరులున్నారు. -
వచ్చే జూన్లోగా ఏపీకి వస్తే స్థానికులు
- ‘స్థానికత’ను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ - తాజా ఉత్తర్వుల మేరకు జూన్ 2, 2017 నాటికి - వెళ్లే వారికి ఆంధ్రప్రదేశ్ స్థానికత సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థిరపడి తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారి స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1974, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిని గెజిట్లో పొందుపరిచింది. ఆర్టికల్ 371–డీ లోని క్లాజ్(1), క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారంతో ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ) ఉత్తర్వులు–1974ను సవరిస్తూ రాష్ట్రపతి ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ) సవరణ ఉత్తర్వులు–2016గా పరిగణిస్తారు. 1974 ఉత్తర్వుల్లోని 4వ పేరాగ్రాఫ్లో సబ్ పేరా 2 తర్వాత ‘సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా.. ఒక అభ్యర్థి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వస్తే వారిని ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్గా గుర్తిస్తారు. వారిని స్థానికులతో సమానంగా పరిగణిస్తారు. విద్య నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది’ అని పొందుపరిచారు. ఉద్యోగాలకు సంబంధించి..: ఆర్టికల్ 371–డీ లోని క్లాజ్(1), క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఉత్తర్వులు–1975ను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ ఉత్తర్వులు–2016గా పరిగణిస్తారు. 1975లోని ఉత్తర్వుల్లో పేరా 7లో సబ్ పేరా 2 తర్వాత ‘సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వచ్చేవారిని ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థి(లోకల్ క్యాండిడేట్)గా గుర్తిస్తారు. ఆ ప్రాంతంలో నివసించే స్థానికులతో సమానంగా పరిగణిస్తారు. ఉద్యోగాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది’ అని పొందుపరిచారు. కాగా, రాష్ట్రపతి జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ స్థానికత కోరుకునే వారు ఇప్పటికే అక్కడికి వెళ్లుంటే పరవాలేదు. లేదంటే మరో ఏడాదిలోపు వెళ్లాల్సి ఉంటుంది. -
'బీడీ కార్మికుల పొట్టకొట్టే జీఓ రద్దు చేయాలి'
హైదరాబాద్: బీడీ కార్మికుల పొట్టకొట్టే జీఓ నెం 727(e) ను రద్దు చేయాలంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మహిళలు, బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని జగద్గిరిగుట్టలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇటీవల బీడీ కట్టలపై ఉండే పుర్రె బొమ్మను 40 శాతం నుంచి 80 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని నిరసిస్తూ..వెంటనే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. -
రెండంచెల వ్యవస్థ రెడీ
ఇకపై ప్రాథమిక, ఉన్నత పాఠశాలలే.. 2015 ఏప్రిల్ ఆధార్ లింక్తో రేషనలైజేషన్ 25న జీవో విడుదల! ఉపాధ్యాయ నేతల ఆందోళన మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలలపై సర్కారు కన్నెర్ర చేస్తోంది. ఇప్పటివరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. 2015 ఏప్రిల్ నాటికి విద్యార్థుల ఆధార్ అనుసంధానాన్ని బట్టి పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రక్రియను అమలుచేయనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్య డెరైక్టర్ ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేశారు. వీటిని ఆయా జిల్లాల విద్యాశాధికారులకు పంపారు. డెరైక్టర్ ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా ఈ నెల 25న రేషనలైజేషన్ అమలుకు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఇవి అమలైతే జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మాత్రమే కొనసాగుతాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు దాదాపు మూతపడే అవకాశం మెండుగా ఉందని ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు. అన్ని స్కూళ్లపై ప్రభావం జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2606, ప్రాథమికోన్నత పాఠశాలలు 907, ఉన్నత పాఠశాలలు 929 మొత్తం 4442 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 2,09,387, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98,767, ఉన్నత పాఠశాలల్లో 2,92,517 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ విడుదల చేసిన విధివిధానాల్లో ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7తరగతుల్లో 35 మంది లోపు, 6, 7, 8 తరగతుల్లో 50 మంది లోపు, ఉన్నత పాఠశాలల్లో 75 మందిలోపు విద్యార్థులు ఉంటే సంబంధిత పాఠశాలను మూసివేయాలని నిర్ణయించారు. 2015 విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో 2014 ఏప్రిల్ నాటికి ఆధార్ లింకు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రేషనలైజేషన్ను అమలు చేశారు. 2015 ఏప్రిల్ నాటికి ఆధార్ లింకు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రేషనలైజేషన్ అమలు చేయనున్నారు. 2015లో ప్రాథమిక పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలు చేసిన సమయంలో రైల్వేట్రాక్లు, పెద్దకాలువలు, జాతీయ రహదారులను దాటి వేరే ప్రాంతానికి విద్యార్థులు వెళ్లాల్సి ఉంటే మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ రద్దు చేశారు. ఈ విధివిధానాలను తయారుచేసి గత నెల చివరి వారంలో ఉపాధ్యాయ సంఘ నాయకుల సమావేశం నిర్వహించి పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలు చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ విషయంపై కొందరు ఉపాధ్యాయ సంఘ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయడమే తప్ప ఉపాధ్యాయ సంఘం నాయకుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని చెప్పకనే చెప్పారని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. పదో తరగతి మూల్యాంకనం పూర్తయిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలుకు రంగం సిద్ధమైనట్లేనని ఉపాధ్యాయులు అంటున్నారు. సక్సెస్ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు పైగా ఇంగ్లిషు మీడియం చదువుతుంటే ఆ పాఠశాలలను ఇంగ్లిషు మీడియం పాఠశాలగా మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా అదే పాఠశాలలో తెలుగు మీడియం చదివే విద్యార్థులను వేరే పాఠశాలలో కలిపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇబ్బందులు ఇవీ ప్రభుత్వం ముందూవెనుక ఆలోచించకుండా రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాయటమేననే వాదన వినిపిస్తోంది. పిల్లల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలను మూసివేస్తే కిలోమీటరు దూరంలోని మరో ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి ఉంది. ఒకటి, రెండు తరగతులు చదివే విద్యార్థులు గ్రామాన్ని విడిచి కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు ఎలా వెళ్లివస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉంది. 75 మందిలోపు విద్యార్థులు ఉంటే సంబంధిత ఉన్నత పాఠశాలను మూసివేస్తే 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థినులు ఐదు కిలోమీటర్లు ఎలా వెళ్లి వస్తారనే ప్రశ్నను వారి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా గ్రామం నుంచి పాఠశాలను పూర్తిగా తొలగిస్తే ఆ ప్రభావం స్థానికంగా పడుతుందని, కనీసం ఐదు నుంచి ఏడు శాతం వరకు చిన్నారులు పాఠశాలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు. పాఠశాలను మూసివేసి ఉపాధ్యాయులను ఎక్కడికి బదిలీ చేస్తారనేది అర్ధం కాని పరిస్థితి. ఇప్పటికే కొంత మంది ఉపాధ్యాయులను వయోజన విద్యా విభాగానికి కేటాయించారు. ఉపాధ్యాయ సంఘ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వారికి ఆర్డర్లు ఇవ్వకుండా తొక్కిపట్టారు. రేషనలైజేషన్ అమలు చేస్తే మరికొంత మంది ఉపాధ్యాయులు మిగులుబాటుగా ఉండే అవకాశం ఉంది. వీరిని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఉపయోగించుకుంటారనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయటం దుర్మార్గపు చర్యగానే పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై విద్యాశాఖ త్వరలో జీవో జారీ చేయనుండటంతో జిల్లాలో ఎన్ని పాఠశాలలు మూతపడతాయో వేచి చూడాలి. -
జీవోల ఎలుక...
హ్యూమర్ ఫ్లస్ ఒక ఎలుక సెక్రటేరియట్ కలుగులో నివసిస్తూ ఉండేది. చిన్నప్పుడే దానికి జ్ఞానదంతం మొలిచింది. దాంతో దొరికిన ప్రతి జీవో కాగితాన్ని తినేసింది. ప్రభుత్వ పారిభాషిక పదాలన్నీ కంఠతా పట్టేసింది. నిద్రలో లేపి అడిగినా జీవోలు అప్పజెప్పేది. తోటి ఎలుకలతో కూడా జీవో భాషతోనే సంభాషించేది. ‘‘జీవో నంబర్ 79 ప్రకారం నిర్దిష్ట నిర్మాణాత్మక, నిష్టుర నిర్హేతుక, సాంకేతిక, చట్టబద్ధ, ఛందస్సహిత తాత్పర్య, విమోచనం దృష్ట్యా క్యాంటిన్ ఉత్తరం వైపున మనకీ రోజు భోజనం దొరకొచ్చు’’ అని చెప్పేది. అక్షరమ్ముక్క అర్థంకాకపోవడం వల్ల సాటి ఎలుకలు దాన్ని జ్ఞానిగా పరిగణించేవి. అనేక జీవోల మధ్య ఇరుక్కుపోయిన అధికారులు, ఏ జీవో ఎందుకుందో అర్థంకాక తలలు బద్దలు కొట్టుకునేవారు. అప్పుడు మన జ్ఞాన ఎలుక వచ్చి మాటసాయం చేసేది. ‘‘జీవో నం. 22లో ప్రజాబాహుళ్య చట్టపర, చర్యాత్మక, విశ్రాత్మ పరమాత్మ చేతన్ చేన్ తోడన్ తోన్, విభక్తి, అన్వయ, ప్రత్యామ్నాయ దోషరహిత కార్యాచరణవల్ల ప్రజలకు మేలు జరగొచ్చు’’ అని అధికారులు చెప్పేవారు. ‘‘మీరు పొరపడుతున్నారు. జీవో నంబర్ 36, సవరణ నంబర్ 116 ప్రకారం చేతనాత్మక ప్రక్రియలో స్థూలవిచారణ, సూక్ష్మదర్శినితో శోధన, సాధన, వేదన, సంవేదన సకలాత్మక, గుణాత్మక, క్రియాత్మక శూన్యంలోంచి కాలానుగుణ త్రిలోక దండకారులై మసలితే జనానికి క్షేమం’’ అని ఎలుక సవరించేది. ఇలా జరుగుతూ ఉండగా జ్ఞానికి మరో జ్ఞాని ఎదురవడం సంభవమే కాబట్టి పొరుగూరి ఎలుక దారి తప్పి సెక్రటేరియట్లోకి చొరబడింది. జ్ఞానదంతం వల్ల అది కూడా జ్ఞానీకరించబడి ఉంది. ‘‘జీవో నంబర్ 170 ప్రకారం ఎలుకైనా, చిలుకైనా, పంచదార పలుకైనా ఈ కార్యాలయ క్రమబద్ధీకరణ, యోగ్యతాపత్ర, కార్యోన్ముఖ, సహిష్ట, సంతుష్ట, సంభావనాదృష్ట్యా ప్రవేశం నిషిద్ధం’’ అని జ్ఞాన ఎలుక అంది. ఈ భాష విని కొత్త ఎలుక కొంచెం కంగారుపడింది. అవతలివాడు మనకి అర్థంకానపుడు మనమంటే ఏమిటో అర్థం అయ్యేలా మాట్లాడాలి. ‘‘అయ్యా మీ జీవోల గురించి నాకు తెలియదు. నంబర్ల ప్రకారం లెక్కలే నడవనపుడు ఇక ఎలుకలేం నడుస్తాయి. దంతాలున్నవాడికి జీవోలతో పనిలేదు. దంతంలోనే వేదాంతం, సిద్ధాంతం దాగున్నాయి. జీవోలున్నవి తిండి తనడానికే. నమిలి తినాలన్నా, కొరికి తినాలన్నా దంతాలుండాలి. అజీర్ణమే అజ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకోవడం దేవుడి అజ్ఞానం. జ్ఞానమైనా, దంతమైనా ఊగిసలాడుతున్నపుడే జాగ్రత్తపడితే, ఊడిపోకుండా కాపాడుకోవచ్చు. అంతటా తాను ఉండలేడు కాబట్టి దేవుడు ఈ భూమ్మీద డెంటిస్ట్ని సృష్టించాడు. పళ్లతోపాటు డబ్బుని రాలగొట్టడం వారి విధి. గతంలో నేను దంత వైద్యశాలలో పనిచేయడం వల్ల ఈ అనుభవం సంపాదించాను’ అని కొత్త ఎలుక చెప్పింది.‘‘దంత వైద్యశాలలో ఎలుక పనిచేయడం ఎలా సాధ్యం?’’ అని జీవో ఎలుక అడిగింది. ‘‘డాక్టర్లకైనా, అధికారులకైనా ఇప్పుడు దంతసిరి ముఖ్యం. జనాన్ని కొరికి నమలాలి. అందువల్ల నన్ను ఎలుకగా గుర్తించలేకపోయారు. నువ్వు సెక్రటేరియట్లో ఉన్నప్పుడు నేను డెంటిస్ట్ దగ్గర ఉండకూడదా?’’ ఎలుకలు ఇలా సంవాదిస్తుండగా ఒక పిల్లి నిశ్శబ్దంగా వచ్చి ఎలుకల తోకల్ని కాలితో అదిమి పెట్టింది. ఎలుకలు గాబరాపడ్డాయి. ‘‘జీవో నంబర్ 99 ప్రకారం విచిత్ర ఉన్మత్త, వేదాంత స్థితిగతి యోచనలో క్రూరపరివర్తన మార్జాల ప్రవేశం నిషిద్ధం’’ అని జీవో ఎలుక బెదిరించింది. కొత్త ఎలుక బెదిరిపోతూ ‘‘అయ్యా నా వేదాంతమంతా తిండికోసమే కానీ, ఇతరులకు తిండిగా మారడానికి కాదు’’ అంది. సత్యాన్ని తేలిగ్గా ఒకప్పుకున్నందుకుగానూ దాన్ని గుటుక్కున మింగి మ్యావ్మని త్రేన్చింది పిల్లి. జీవో ఎలుక మాత్రం తనకు తెలిసిన జీవోలన్నీ వివరిస్తూ పిల్లికి చట్టపరంగా వచ్చే చిక్కులు గురించి హెచ్చరించింది. అంతా సావధానంగా విన్న పిల్లి ‘‘వొరే పిచ్చోడా, ఎలుకల చట్టం పిల్లికి పనికిరాదు. జీవోల ప్రకారం ప్రభుత్వాలే నడవవు. ఇక పిల్లేం నడుస్తుంది. ఎలుక తెలుసుకోవాల్సింది జీవోలు కాదు, పిల్లి అడుగుల చప్పుడుని. పిల్లిని గుర్తించడమే ఎలుకకి దివ్యజ్ఞానం. ఎలుకని పిల్లి తినాలని జీవోలో ఉంది నీకు తెలియదా?’’ అంది.‘‘ఎన్నో నంబర్ జీవో’’ ఉక్రోషంగా అడిగింది ఎలుక. ‘‘జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కాదురా కుయ్యా గాడ్స్ ఆర్డర్’’ - జి.ఆర్. మహర్షి -
అవినీతి నిరోధానికి జీవో జారీ చేస్తాం
రెవెన్యూ, విద్యుత్ శాఖల్లో అవినీతిపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదన సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ, విద్యుత్ శాఖల్లో అవినీతిని నిరోధించడానికి హైకోర్టు చేసిన సూచనలు, సలహాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. దీనికి సంబంధించి త్వరలోనే జీవో జారీ చేస్తామని వివరించింది. అయితే ముందు ముసాయిదా జీవోను తమ ముందుంచాలని.. దాన్ని పరి శీలించి మరిన్ని సూచనలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ చర్యలతో అవినీతి 75% తగ్గినా విజయం సాధించినట్లేనని వ్యాఖ్యాని స్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసిం ది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారన్న పత్రికా కథనాన్ని హైకోర్టు పిల్గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. -
చీకట్లో ఉత్తర్వులు!
♦ జీవోలు బహిర్గతం కాకుండా వెబ్సైట్ నిలుపుదల ♦ వివాదాస్పద జీవోలపై సీఎం అసంతృప్తే కారణం! సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)ల వెబ్సైట్ను మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే సాధారణ, విధాన నిర్ణయాలన్నింటినీ ఏ రోజుకారోజు ప్రజలకు వెల్లడించే (goir.telangana.govt.in) వెబ్సైట్ను ఎలాంటి ప్రకటన లేకుండా నిలిపివేయడంపై మేధావులు, సమాచార హక్కు కార్యకర్తలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు వెంటనే ప్రజలకు వెల్లడికాకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల జారీ చేసిన కొన్ని జీవోలు వివాదాలకు దారితీయడంతోనే జీవోల వెబ్సైట్ను నిలుపుదల చేసి, ఉంటారని పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ చైనా పర్యటన కోసం ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకున్న విషయం.. ఆ వ్యయం నిమిత్తం నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో వల్లే బహిర్గతమైంది. దీనిని ఎండగడుతూ జాతీయ మీడియా అప్పట్లో ప్రత్యేక కథనాలు వెల్లడించింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవోల ద్వారా జీహెచ్ఎంసీ చట్టానికి పలుమార్లు సవరణలు జరపడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దాంతో ప్రభుత్వం అత్యవసరంగా ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. ఇలా జీవోల వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు బహిర్గతం కావడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జీవోల వెబ్సైట్ను నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏయే నిర్ణయాలను ప్రజలకు వెల్లడించాలి, మరే నిర్ణయాలను వెల్లడించవద్దన్న అంశాలపై అధ్యయనం జరిపి నూతన విధానాన్ని సిఫారసు చేసేందుకు ఐటీ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని ఇదే సమావేశంలో సీఎం ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి కొత్త మార్గదర్శకాలను సిఫారసు చేయనుందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ మేరకు మార్పు చేర్పులతో జీవోల వెబ్సైట్ను పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కేవలం కొన్ని రకాల విధాన పరమైన నిర్ణయాలు, భారీ మొత్తంలో నిధులకు సంబంధించి మాత్రమే ఇకపై జీవోలు జారీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ ప్రభుత్వ అవసరాలు, స్వల్ప వ్యయాలకు ఇకపై జీవోలు జారీ కావని తెలుస్తోంది. దీనితోపాటు ప్రజలకు బహిర్గతమైతే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే నిర్ణయాలపై ఏ తరహాలో ఉత్తర్వులు జారీ చేయాలన్న అంశంపై ఈ కమిటీ ప్రత్యమ్నాయాలను సిఫారసు చేయనుందని సమాచారం. -
చెప్పినట్లే కేటీఆర్కు మున్సిపల్ శాఖ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించినట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకాలం తన వద్ద ఉన్న మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖను తనయుడు కేటీఆర్ కు అప్పగించారు. ఆ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో కీలక శాఖ కేటీఆర్ ఆధీనంలోకి వచ్చింది. ప్రస్తుతం పంచాయతీ రాజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలను నిర్వహిస్తున్న కేటీఆర్ కు అదనంగా మున్సిపల్ శాఖ కేటాయించారు. జీహెచ్ ఎంసీ ఎన్నిక ప్రచార బాధ్యతను కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించగా గత చరిత్రలో ఎప్పుడూ లేనంతగా టీఆర్ఎస్ అత్యధికంగా 99 డివిజన్లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ అదే వేదిక నుంచి మున్సిపల్ శాఖ మార్పుపై ప్రకటన చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం అహోరాత్రులు కష్టపడుతూ గల్లీ గల్లీ తిరుగుతున్న కేటీఆర్ ఆ సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి వీలుగా ఆయనకు మున్సిపల్ శాఖను బదలాయిస్తానని ప్రకటించారు. అదే క్రమంలో బిజినెస్ రూల్స్ మేరకు శాఖను కేటీఆర్ పరిధిలోకి బదలాయిస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో గ్రేటర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కేటీఆర్ కృషిని అభినందించింది. కేబినేట్ లో అత్యంత కీలకమైన శాఖల్లో మున్సిపల్ వ్యవహారాల శాఖ కూడా ఒకటి. ప్రస్తుతం కేటీఆర్ వద్ద కీలకమైన పంచాయతీరాజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు ఉండగా, వాటికి అదనంగా ఇప్పుడు మరో కీలక శాఖ దక్కింది. కేబినేట్ లో మార్పులు లేనట్టే కేబినేట్ విస్తరణ లేదా మార్పుచేర్పులకు ఇక ఇప్పట్లో అవకాశం లేదని తాజా మార్పుతో స్పష్టమైందని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ప్రారంభమయ్యే శాసనసభ బడ్జెట్ సమావేశాల లోపు కేబినేట్లో మార్పుచేర్పులకు అవకాశాలు ఉంటాయని గతంలో కొంత ప్రచారం జరిగింది. అలాంటి ఆలోచన ఉండి ఉంటే మున్సిపల్ శాఖ మార్పు కూడా ఆ సమయంలోనే చేసేవారని, అందుకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా శాఖ బదలాయింపు విషయాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేశారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా ప్రస్తుతం కేబినేట్లో మొత్తం 17 మంది మంత్రులున్నారు. -
'కోడి పందేల'తో గ్రామాల అభివృద్ధి
- పందేలు చూసేందుకు వచ్చే ఎన్నారైలు గ్రామాభివృద్ధికి విరాళాలిస్తారు - కోడి పందేల కోసం జీవో తెస్తామన్న ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు దేవరపల్లి (పశ్చిమగోదావరి): కోడి పందేలు సంప్రదాయ క్రీడ అని, వీటిని అధికారికంగా నిర్వహించుకునే విషయమై జీవో తీసుకొస్తామని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురంలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేల నిర్వహన ఏళ్లుగా వస్తోన్న సంప్రదాయమని, న్యాయస్థానాలు వీటిని నిలుపుదల చేయటం సరికాదని, అయితే కోర్టులను తాను గౌరవిస్తున్నానని ఎంపీ బాబు అన్నారు. కోడి పందేల వల్ల పట్టణవాసులకు గ్రామీన వాతావరణ అలవాటవుతుందని, విదేశీయులు, బంధువులు, స్నేహితులు పందేలను తిలకించి ఆనందం పొందుతారని ఎంపీ చెప్పుకొచ్చారు. కోడి పందేలు జూదం కాదన్న మాగంటి.. గ్రామాల అభివీద్ధికి పందేలకు లింకుందన్నారు. పండక్కి పందేలు చూసేందుకు వచ్చే ఎన్నారైలు గ్రామాల అభివృద్ధి కోసం ధారళంగా విరాళాలు అందిస్తున్నారని, జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి 12 వేల మంది ఎన్ఆర్ఐలు ముందుకొస్తున్నారని గుర్తుచేశారు. వేల కోట్ల వ్యయంతో గుర్రపు పందేలు నిర్వహించటానికి అనుమతి ఇస్తున్నప్పుడు కోడి పందేలకు అభ్యంతరం దేనికని ప్రశ్నించారు. -
ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై స్టే
జీవో ద్వారా జీహెచ్ఎంసీ చట్ట సవరణ సరికాదన్న హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.5పై హైకోర్టు స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-101ను అనుసరించి కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఉమ్మడి ఏపీలో ఉన్న జీహెచ్ఎంసీ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు అది తెలంగాణ రాష్ట్రానికి చట్టం అవుతుందని... కాబట్టి చట్టానికి సవరణలను శాసనవ్యవస్థ ద్వారానే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాథమిక అభిప్రాయం ఆధారంగా జీవో నం.5పై స్టే విధిస్తున్నామని, జీహెచ్ఎంసీ ఎన్నికలను పాత విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజర్వేషన్లను వీలైనంత త్వరగా ఖరారు చేసి, శనివారం లేదా అంతకన్నా ముందే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రిజర్వేషన్ల ప్రకటన వచ్చిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి గరిష్టంగా 31 రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు పిటిషన్లపై విచారణ.. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియను కుదించి, ఆ మేర జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.5ను సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన చక్కిలం రఘునాథరావు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు గ్రేటర్ ఎన్నికల నిర్వహణ గడువును మరో 45 రోజుల పాటు పొడిగించాలంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వానికి ఉన్న అధికారంతోనే... తొలుత చట్ట సవరణ ద్వారా ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియను కుదించవచ్చా, చట్టాన్ని అడాప్ట్ చేసుకున్న తరువాత దానికి సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామమూర్తి స్పందిస్తూ... ఆ చట్టానికి సవరణ చేయవచ్చని, కానీ అది కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కాకుండా శాసన వ్యవస్థ ద్వారా జరగాలని కోర్టుకు వివరించారు. దీంతో తమ ఉద్దేశం ప్రకారం కూడా ఆ కుదింపు సబబు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-101 ప్రకారం ఉమ్మడి ఏపీలో ఉన్న ఏదైనా చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకుంటే, అపాయింటెడ్ డే నుంచి రెండేళ్లలోపు ఆ చట్టానికి సవరణలు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనానికి తెలిపారు. బిహార్ రాష్ట్ర విభజన కేసులో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందంటూ.. ఆ తీర్పు ప్రతిని చదివి వినిపించారు. ఈ మేరకు సెక్షన్-101 కింద తమకున్న అధికారాన్ని ఉపయోగించి చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఏజీ వాదనతో ఏకీభవించలేం... ఏజీ వివరణ అనంతరం సీతారామమూర్తి జోక్యం చేసుకుంటూ... జీహెచ్ఎంసీ చట్ట సవరణ ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా ఎందుకు ఎన్నికల షెడ్యూల్ను కుదించారనే కారణాలను వివరించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... ప్రభుత్వ వాదనలతో ఏకీభవించడం కొంత కష్టసాధ్యంగా ఉందని వ్యాఖ్యానించింది. చట్టాన్ని అడాప్ట్ చేసుకునేటప్పుడే దానిలో మార్పులు, సవరణలు చేయాలని పేర్కొంది. ఆ సమయంలో సవరణలు చేయకపోతే తరువాత శాసనవ్యవస్థ ద్వారానే సవరణలు చేసేందుకు అవకాశం ఉందని, ఇది తమ ప్రాథమిక అభిప్రాయమని ధర్మాసనం తెలిపింది. అసలు నోటిఫికేషన్ జారీ తరువాత ఎన్నికల నిర్వహణకు ఎన్ని రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది జి.విద్యాసాగర్ను ధర్మాసనం ప్రశ్నించింది. దానికి 22 నుంచి 25 రోజుల సమయం పడుతుందని విద్యాసాగర్ తెలిపారు. దీంతో రిజర్వేషన్లను ఎప్పుడు జారీ చేయగలరనేదానిపై ప్రభుత్వంతో మాట్లాడి చెప్పాలని ఏజీ రామకృష్ణారెడ్డిని ఆదేశిస్తూ.. ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. కుదింపుతో ఇబ్బందులు.. మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభం కాగానే.. రిజర్వేషన్ల ప్రకటన తేదీని నిర్దిష్టంగా చెప్పలేమని, ఒకటి రెండు రోజుల్లో జారీ చేసే అవకాశం ఉందని రామకృష్ణారెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో మర్రి శశిధర్రెడ్డి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ... ఎన్నికల షెడ్యూల్ కుదింపు వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం... సెక్షన్-101 కింద చట్ట సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా, లేదా? అన్న వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సంక్రాంతి సెలవుల తరువాత ఆ పని చేస్తామని తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ కుదిస్తూ జారీ చేసిన జీవోపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
క్రమబద్ధీకరణ జీవో వచ్చేస్తోంది!
► అక్రమ లే అవుట్లు, భవనాల క్రమబద్ధీకరణకు సీఎం ఆమోదం ► ఒకట్రెండు రోజుల్లో ఎల్ఆర్ఎస్ ఉత్తర్వులు ► చట్ట సవరణ తర్వాతే బీపీఎస్.. నెల రోజులు పట్టే అవకాశం ► క్రమబద్ధీకరణకు కటాఫ్ 2015, ఆగస్టు 31 ► స్లమ్స్లో క్రమబద్ధీకరణకు చదరపు గజానికి రూ.15 ► గడువు ముగిసిన తర్వాత అక్రమాలపై కఠిన చర్యలు ► కూల్చివేతలతో పాటు యజమానులపై క్రిమినల్ కేసులు ► అనుమతులు లేని కట్టడాలు, లే అవుట్ల రిజిస్ట్రేషన్లకు నో సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలు, లే అవుట్లు ఉన్న వారికి శుభవార్త. వాటి క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరిసారిగా రాష్ట్రంలో భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీపీఎస్)తో పాటు లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్ఆర్ఎస్) ప్రవేశపెట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు సంబంధిత ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారు. న్యాయ శాఖ ఆమోదం తెలిపిన వెంటనే ఎల్ఆర్ఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఈ తంతు పూర్తయ్యే అవకాశముంది. బీపీఎస్ అమలుకు ముందు న్యాయపరమైన చిక్కులను తొలగించిన తర్వాతే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఒకేసారి (వన్ టైమ్ స్కీం) అంటూనే గత ప్రభుత్వాలు పదేపదే అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టడంపై అభ్యంతరం తెలిపిన హైకోర్టు.. 1998లో నాటి ప్రభుత్వం జారీ చేసిన బీపీఎస్ ఉత్తర్వుల (జీవో 419)ను కొట్టేసింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ ద్వారా 2007-08లో మళ్లీ బీపీఎస్ను అమలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మళ్లీ ఆర్డినెన్స్ ద్వారా ఏపీ మునిసిపాలిటీ చట్టం, జీహెచ్ఎంసీ చట్టం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంతో పాటు భవన నిర్మాణ నియమావళి మార్గదర్శకాల (జీవో 168)ను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ ముగిసి బీపీఎస్ ఉత్తర్వులు జారీ అయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశముంది. చివరిసారిగా అమలు చేసిన క్రమబద్ధీకరణ పథకాల గడువు 2013 జూన్ 12తో ముగిసిపోగా, వేల సంఖ్యలో దరఖాస్తులు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఈ దరఖాస్తులను సైతం పరిష్కరించాలని సర్కారు నిర్ణయించింది. పేద, మధ్యతరగతికి వెసులుబాటు అక్రమాల క్రమబద్ధీకరణ కోసం 2015 ఆగస్టు 31ని కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ తర్వాత చేపట్టిన కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించకూడదని నిర్ణయించింది. అవినీతికి తావు లేకుండా ‘టీఎస్-ఐపాస్’ తరహాలో క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించనున్నారు. అక్రమ ప్లాట్లు, కట్టడాల మార్కెట్ ధరల ఆధారంగా రుసుం వసూలు చేయనున్నారు. వైశాల్యం ఆధారంగా వాటి మార్కెట్ విలువలో 20 నుంచి 100 శాతం వరకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, పేద, మధ్య తరగతి వర్గాలకు ఫీజుల విషయంలో వెసులుబాటు కల్పించనున్నారు. 500 చ.మీ.లోపు ప్లాట్లకు నామమాత్రంగా రుసుములు ఉండనున్నాయి. 5 వేల చ.గజాలు దాటిన అక్రమ లే అవుట్లపై మాత్రం భారీగా వడ్డీంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. మురికివాడల్లో నిర్మించిన ఇళ్లు/కట్టడాలకు చ.గజానికి కేవలం రూ.15 చొప్పున క్రమబద్ధీకరణ ఫీజు వసూలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 100 చ.గజాలలోపు ఉండే కట్టడాలకు సైతం ఇదే ఫీజులను వర్తింపజేసే అవకాశముంది. బీపీఎస్ ద్వారా ఒక్క జీహెచ్ఎంసీలోనే సుమారు రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. ఇకపై ‘అక్రమం’ క్రైమే! ఇదే చివరిసారి అంటూ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాలను ప్రవేశపెట్టబోతోంది. ఈ పథకాల గడువు ముగిసిన తర్వాత అక్రమ కట్టడాలు, లే అవుట్లపై ఉక్కుపాదం మోపనుంది. ఎక్కడికక్కడ కూల్చివేతలతో పాటు తొలిసారిగా యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టనుంది. కేసులు పెట్టేందుకు అనువుగా కొత్త భవన నిర్మాణ నియమావళికి రూపకల్పన చేస్తోంది. ఇది అమలులోకి వస్తే అక్రమ లే అవుట్లు, భవనాలకు రిజిస్ట్రేషన్లు జరపరు. -
‘బ్యాంకు గ్యారంటీ’కి జీవోనా?
ప్రైవేట్ ఎంసెట్ వ్యవహారంపై హైకోర్టు విస్మయం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద మొదటి ఏడాది ఫీజుతో పాటు మిగతా నాలుగేళ్లకూ ముందే బ్యాంకు గ్యారంటీ తీసుకునేందుకు యాజమాన్యాలకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘‘బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందుకు ఇదేమైనా జాతీయ రహదారి నిర్మాణ పనుల వ్యవహారమా? ఇలాంటి జీవో ఇచ్చే అధికారం మీకెక్కడిది?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవోను సవాలు చేస్తూ కామినేని వైద్య కళాశాలలో సీటు పొందిన విద్యార్థిని మృదుల, మరికొందరు వేర్వేరుగా వేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఇలా బ్యాంకు గ్యారంటీ తీసుకునే విధానం దేశంలో ఎక్కడా లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది రవీందర్ వాదించారు. విద్యార్థులు మధ్యలో మానేస్తే కాలేజీలు నష్టపోతాయని, అందుకే నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ నిబంధన అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి ధర్మాసనం వాయిదా వేసింది. -
గంటా.. ఇదేమి తంటా?
- ట్రిపుల్ఐటీ సూపర్ న్యూమరీ సీట్లకు జీవో ఏదీ - అయోమయంలో 88 మంది విద్యార్థుల భవితవ్యం - 27న కౌన్సెలింగ్కి పిలిచినా.. నేటికీ విడుదల కాని జీవో - వేరే జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇబ్బందులు నూజివీడు : నూజివీడు ట్రిపుల్ఐటీకి మంజూరుచేసిన సూపర్ న్యూమరీ సీట్లకు సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు జీవోను విడుదల చేయకపోవడంతో 88 మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కౌన్సెలింగ్ సమయానికి కూడా ప్రభుత్వం ఈ సీట్ల గురించి ఏవిధమైన ఉత్తర్వులూ జారీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఒకవేళ ట్రిపుల్ఐటీలో సీటు రాకపోతే తమ పిల్లల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 27న కౌన్సెలింగ్కు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 28న మధ్యాహ్నం రెండు గంటల వరకు నూజివీడు ట్రిపుల్ఐటీలోనే ఉండి తమ సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఒకటిన ప్రకటించిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇన్ని రోజులు గడిచినా జీవో విడుదల చేసేలా చర్యలు తీసుకోకపోవడంపై వారు మండిపడ్డారు. తమ చేతిలో ఏమీలేదని, ప్రభుత్వం జీవో ఇవ్వగానే కబురుచేస్తామని వారికి ఇన్చార్జి డెరైక్టర్ కె.హనుమంతరావు స్పష్టంచేశారు. దీంతో చేసేదేమీ లేక వారంతా వెనుదిరిగారు. ఒకటో తేదీనే ప్రకటన... ట్రిపుల్ ఐటీలోని ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి గాను ఎంపిక చేసిన జాబితాను ఈ నెల ఒకటో తేదీన ప్రకటించిన సమయంలోనే సూపర్ న్యూమరీ సీట్ల గురించి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నూజివీడు ట్రిపుల్ఐటీకి 113 సీట్లు సూపర్ న్యూమరీ సీట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఆంధ్రా రీజియన్లో 96 మండలాల నుంచి ఒక్కరు కూడా ఎంపిక కాకపోవడంతో ట్రిపుల్ఐటీల లక్ష్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆయా మండలాల నుంచి ఒక్కొక్కరిని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సీట్లను ప్రకటించారు. వీటి కోసం ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ నెల 27న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, సర్టిఫికెట్లతో హాజరుకావాలని ట్రిపుల్ఐటీ అధికారులు కబురు చేశారు. దీంతో 113 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని రాగా, వారి సర్టిఫికెట్లన్నీ వెరిఫికేషన్ చేసిన అధికారులు.. ప్రభుత్వం నుంచి జీవో రాగానే కబురు చేస్తామని, అప్పుడు మీ పిల్లలను తీసుకుని రావాలని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, విద్యార్థులు జీవో రాకుండా కౌన్సెలింగ్ ఎందుకు పిలిచారని మండిపడ్డారు. ప్రభుత్వం జీవో ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం కచ్చితంగా జీవో ఇస్తుందని చెప్పినా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వినకుండా సోమవారం రాత్రంతా ట్రిపుల్ ఐటీలోనే ఉన్నారు. మంగళవారం ఉదయం కూడా అధికారులు పదేపదే చెప్పడంతో అక్కడినుంచి వెనుదిరిగారు. వేరే జిల్లాల నుంచి కౌన్సెలింగ్ కోసం వచ్చిన వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఉద్యోగులకు ఉచిత వైద్యపరీక్షలు
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. త్వరలో జీవో సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. నిమ్స్ సహా రాష్ట్రంలోని ప్రభుత్వ, బోధనాసుపత్రులన్నింటిలోనూ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 3.97 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో ఔట్ పేషెంటు(ఓపీ) ఫీజు వసూలు చేయడంలేదు. నిమ్స్లో మాత్రం రూ.60 వసూలు చేస్తున్నారు. ఇక నుంచి నిమ్స్లో కూడా ఓపీ ఫీజును ఎత్తివేయాలని సర్కారు నిర్ణయించింది. జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు, నిమ్స్, ఉస్మానియా, నీలోఫర్ తదితర ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించడానికి వెసులుబాటు కల్పిస్తోంది. ఉద్యోగులందరికీ ఆరోగ్యకార్డులు ఇచ్చినా ముఖ్యమైన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీపై శస్త్రచికిత్సలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. పైగా అక్కడ వైద్య పరీక్షలకు డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తే ఉద్యోగులను ప్రభుత్వ ఆసుపత్రుల వైపు ఆకర్షించవచ్చని సర్కారు ఆలోచన. ప్రస్తుతం కార్పొరేట్స్థాయిలో ఉన్న నిమ్స్ తరహాలోనే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు అత్యాధునిక ల్యాబ్, వైద్య పరీక్షలకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. -
రిమ్స్ రూటే సెపరేటు
రోజుకో జీవోతో అక్కడి ఉద్యోగుల్లో గందరగోళం ఏళ్ల తరబడి అక్కడే ఉంటున్నా కదలలేని పరిస్థితి ఆన్లైన్లో ఖాలీలను నమోదు చేయాలని ఉద్యోగుల డిమాండ్ శ్రీకాకుళం సిటీ :జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడినెలకంటే.. వైద్య, ఆరోగ్యశాఖలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు. అందునా జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) నర్సింగ్ సిబ్బంది బదిలీలపై విడుదలవుతున్న జీవోలపై స్పష్టత లేకపోవడంతో వారంతా సతమతమవుతున్నారు. బదిలీల ప్రక్రియ మొద లైనప్పటి నుంచి కోరుకున్నచోటకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా రోజుకో జీవో విడుదలవుతుండటంతో తలలు పట్టుకోవాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. ఉదయం ఒక జీవో వెలువడగానే, రాత్రికి మరో జీవో వెలువడుతోందని చెబుతున్నారు. దీనికి తోడు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో ఖాళీల ప్రక్రియను తొలుత చూపించగా ఇప్పుడు మూడు రోజులుగా వాటిని కూడా చూపించడం లేదంటూ రిమ్స్ నర్సింగ్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. రిమ్స్లో సుమారు 230 వరకు నర్సింగ్ సిబ్బంది విధులను నిర్వర్తిస్తుండగా బదిలీలకు అర్హులైన ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకున్నారన్నారు. విశాఖ కేజీహెచ్లో, ఘోషా ఆస్పత్రి, మెంటల్ ఆస్పత్రిలో తొలుత ఖాళీలను చూపించినా ప్రస్తుతం ఆన్ లైన్లో వాటిని అధికారులు చూపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సుమారు 75 మంది సిబ్బంది నకిలీ సర్టిఫికెట్స్ సంపాదించుకొని వారిని అక్కడే ఉంచేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు వీరు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఆన్లైన్లో ఖాళీలను చూపించడం లేదంటూ చెబుతున్నారు. దీనికి తోడు ఇంత సీనియారిటీ ఉండి దరఖాస్తు చేసుకుంటే విశాఖపట్నంలో పీహెచ్సీ, సీహెచ్సీలో వేసేందుకు కొందరు ముందస్తు చర్యలు ప్రారంభించడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆన్లైన్లో ఖాళీలను నమోదు చేయాలని, అర్హులై న సిబ్బందికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
చారిత్రక కట్టడంగా గురజాడ గృహం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం విజయనగరం కంటోన్మెంట్: నవయుగ వైతాళికుడిగా ఖ్యాతిగాంచిన గురజాడ నివసించిన గృహాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది. విజయనగరంలోని గురజాడ గృహాన్ని చారిత్రక కట్టడంగా, ఆ గృహ సముదాయాన్ని పురావస్తు కట్టడంగా గుర్తిస్తున్నట్టు పురావస్తు, మ్యూజియం శాఖ శనివారం ప్రకటించింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ జీఓ నంబర్-8ను విడుదల చేశారు. దీని ప్రకారం గురజాడ గృహాన్ని చారిత్రక కట్టడంగా, పురావస్తు ప్రదేశంగా గుర్తిస్తూ గెజిట్ పబ్లికేషన్ను విడుదల చేయనున్నారు. -
రాజ్యాంగ విరుద్ధంగా జీవోల జారీ
- రౌండ్టేబుల్ సమావేశంలో - పలువురు వక్తల ధ్వజం గాంధీనగర్ : రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని, రాజ్యాంగ విరుద్ధంగా జీవోలు జారీ చేస్తోందని పలువురు వక్తలు ఆరోపించారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రాజధాని భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా గురువారం రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ అవసరం లేకపోయినప్పటికీ రైతులనుంచి వేల ఎకరాల భూమిని బలవంతంగా లాగేసుకుంటున్నారన్నారు. రాజ్యాంగ విరుద్దంగా జీవోలు జారీ చేసి రైతులను మోసగిస్తోందన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1.39లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీచేయకుండా నిరంతరం రాజధాని చుట్టూ పాలకులు చక్కర్లు కొడుతున్నారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ 109, 110 ,166.జీవోలతో ప్రభుత్వ మోసం బయటపడిందని చెప్పారు, సీపీడీఎంసీ పేరుతో కంపెనీ పాలనకు తెరతీశారన్నారు. కంపెనీ పేరును తర్వాత కార్పొరేషన్గా ప్రభుత్వం మార్పు చేసిందన్నారు. రైతులు తమకు అంగీకారం ఉంటేనే భూముఇలివ్వండని నమ్మబలుకుతూ మరో వైపు బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. కార్పొరేషన్ పాలన అమల్లోకి వస్తే ప్రతి పనికి పన్ను వసూలు చేస్తారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ రాజధాని పేరుతో భూములు సమీకరించి కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారన్నారు. తులసీదాసు మాట్లాడుతూ క్రెడా చట్టం ప్రకారం భూములు సేకరించి కార్పొరేషన్కు అప్పగిస్తోందని విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ నాయకుల పోలారి, సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి జేవీ రాఘవులు, రాజధాని ప్రాంత కన్వీనర్ రాధాకృష్ణ, సీపీఐ నాయకులు, వై. కేశవరావు, కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న భూములను 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తే రైతులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొటుందన్నారు. ప్రభుత్వా నిర్ణయాలకు వ్యతిరేకంగా సమైక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎం. విజయ్కుమార్, గంగాధరరావు, శ్రీనివాస్, జి. వీరాంజనేయులు, యలమందరావు పాల్గొన్నారు. -
జీవోలో తెల్లకాగితం!!
- సంగపూర్ పర్యటనకు రూ.13 లక్షలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో విచిత్రం హైదరాబాద్: సింగపూర్ తరహా ఆర్థికాభివృద్ధి మండలిని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అక్కడ మండలి ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీ.వీ.రమేశ్, ప్రణాళికా శాఖ అధికారితో పాటు మరో ఇద్దరు కన్సల్టెంట్లను సింగపూర్ పంపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే ఈ పర్యటన కోసం ఆర్థిక శాఖ శుక్రవారం రూ.13 లక్షలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవోలో తెల్లకాగితం ఉంచడం గమనార్హం. -
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఎంపికకు ఓసీలతో కమిటీయా?
ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్ష నేత జగన్మోహన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారుల ఎంపిక తీరుపై శనివారం రాష్ట్ర శాసనసభలో ఆగ్రహావేశాలతో కూడిన చర్చ జరిగింది. కిరణ్ సర్కారు తెచ్చిన జీవో 101ను చంద్రబాబు జమానా అమలు చేస్తోందంటూ విపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ‘‘జీవో 101 ప్రకారం లబ్ధిదారుల ఎంపిక కమిటీలో సామాజిక కార్యకర్తలను పెడుతున్నామంటున్నారు. ఈ జీవో అన్యాయమైంది. ఓసీలతో కూడిన ఈ కమిటీకి ఎస్సీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఏ అధికారం ఉంది? ప్రభుత్వ అధికారులు, ఎస్సీ, ఎస్టీ విభాగాల అధికారులు, బ్యాంకర్లు, ఆ వర్గాలకు చెందినవారుంటే సరిపోతుంది గానీ సామాజిక కార్యకర్తలు ఎందుకు? పాత విధానాన్నే అమలు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. అంతకుముందు వైఎస్సార్సీపీ సభ్యులు ఆదిమూలపు సురేష్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ జవాబు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వర్గాలకు రూ.580 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించామని చెప్పారు. అయితే మంత్రి కిషోర్ బాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన తేవడం, లేనిపోనివి ఆపాదించడంతో పలువురు అభ్యంతరం తెలిపారు. అనంతరం ఏ.సురేష్ మాట్లాడుతూ... ఎస్సీ లబ్ధిదారుల ఎంపికకు ఉద్దేశించిన 135, 101 జీవోలను తప్పుబట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ పేరును సామాజిక సాధికారత సంస్థగా మారుస్తామంటూ ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ గొడవ చెలరేగింది. అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘‘సామాజిక కార్యకర్తలు దళారులుగా మారి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు ఇచ్చేందుకు దళారులు ఎందుకు? వాళ్లను పెట్టి గబ్బులేపొద్దు. దీనికో ప్రత్యక్ష ఉదాహరణ కూడా చెప్పగలను. సలగాల సురేష్ అనే వ్యక్తి రుణానికి దరఖాస్తు చేసుకుంటే పైనుంచి కింది దాక అన్ని టిక్కులు (సరైనవేనని) పెట్టి చివర్లో తిరస్కరించారు. కారణమేమిటా? అని ఆరా తీస్తే ఆ వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని తిరస్కరించారు. దయచేసి వారి జీవితాలతో చెలగాటమాడవద్దు. అన్యాయమైన 101 జీవోను రద్దు చేయండి’’ అని డిమాండ్ చేశారు. -
కొత్త జీఓలతో ఆడుకుంటున్న ప్రభుత్వం
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి సుండుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీఓలతో ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకుంటోందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మడితాడు ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎస్టీయూ మండలశాఖ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎస్టీయూ రాయచోటి రీజినల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల వేళలు పెంచడంతో ఉపాధ్యాయులకు అదనపు భారం పెరుగడంతోపాటు, మానసిక వత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. 3 కిలో మీటర్లలోపు పాఠశాలలను ఒకేచోట ఏర్పాటు చేసి క్లస్టర్ పాఠశాలగా పెట్టాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనను ఎస్టీయూ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రభుత్వ కొత్త విధానాల వల్ల ఉపాధ్యాయ పోస్టులకు గండి పడడమే కాక ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఉర్దూ, డిగ్రీ కళాశాలను తప్పకుండా ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్టీయూ సర్వసభ్య సమావేశంలో మండల స్థాయి ఆర్థిక, కార్యకర్తల రిపోర్టు తప్పనిసరిగా చూపించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ మెడలు వంచాలంటే ఉపాధ్యాయ సంఘాలన్ని కలిసి పోరాటం చేయాలన్నారు. ఉపాధ్యాయులు కూడా తమ బాధ్యతను గుర్తుంచుకొని నిరుపేదల విద్యాభివృద్ధికి నిత్యం కృషి చేయాలన్నారు. అనంతరం సుండుపల్లెనుంచి రాయచోటికి బదిలీ అయిన ఎంఈఓ రామకృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. అలాగే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులైన సురేందర్ రెడ్డి, సత్యరాజ్, హాజిరా, రవీంద్రనాయక్తో పాటు మండలంలో ఎస్టీయూ స్థాపనకు కృషి చేసిన విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్బ రామరాజు, సదాశివరాజును సన్మానించారు. సమావేశంలో ఎస్టీయూ ఉర్దూ వింగ్ రాష్ట్ర కన్వీనర్ ఇలియాజ్, రాష్ట్ర మాజీ సంయుక్త అధ్యక్షులు పిసి రెడ్డన్న, సంయుక్త అధ్యక్షులు సురేష్ బాబు, రాష్ట్ర నాయకులు సజ్జల రమణారెడ్డి, లెక్కల జమాల్రెడ్డి, రవీంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, ఆర్థిక కార్యదర్శి రామలింగరాజు, సంయుక్త అధ్యక్షులు హైదర్అలి, ప్రధానోపాధ్యాయులు నాగమునిరెడ్డి, చిన్నప్పరెడ్డి, చక్రే నాయక్, పాల కొండమ్మ, రవీంద్ర నాయక్, ఆరిఫుల్లా, రాయచోటి రీజనల్ ఎస్టీయూ సభ్యులు పాల్గొన్నారు. -
416 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
నెల్లూరు (విద్య) : టెట్, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా జిల్లాలో 416 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ సారి ప్రత్యేకంగా మున్సిపాల్టీల్లో ఖాళీగా ఉన్న పోస్ట్లను భర్తీచేసేందుకు జీఓ విడుదల చేశారు. దీంతో 78 పోస్టులు అధికంగా భర్తీ కానున్నాయి. మొత్తం 494 పోస్ట్లు భర్తీకానున్నాయి. మున్సిపాల్టీకి కేటాయించిన పోస్టుల్లో 78 స్కూల్ అసిస్టెంట్స్ 4, ఎస్జీటీలు 42, తెలుగు పండిట్లు 18, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు 14 పోస్ట్లు ఉన్నాయి. జిల్లాలో జెడ్పి, ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 416 పోస్టుల్లో ఎస్జీటీ తెలుగు 289, ఉర్దూ 18, భాషా పండితులు తెలుగు 35, ఉర్దూ 4, సంస్కృతం 2, హిందీ 1, పీఈటీలు 10, స్కూల్ అసిస్టెంట్స్ పిఎస్ 3, బయోలాజికల్ సైన్స్ 8, సోషల్ స్టడీస్ 29, ఇంగ్లీష్ 6, తెలుగు 8, హిందీ 3 పోస్ట్లకు అభ్యర్థులు అర్హత పరీక్షలను రాయనున్నారు. పోస్ట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండబోతోంది. ఎట్టకేలకు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జెండా ఊపడంతో అభ్యర్థుల్లో నూతన ఉత్సాహం కనబడుతోంది. -
చెరువుల జీవో రద్దు!
-
చంద్రబాబు సింగపూర్ పర్యటనకు జీవో జారీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై సోమవారం జీవో జారీ అయ్యింది. ఈనెల 11వ తేదీ నుంచి 14 వరకూ చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 12మంది సింగపూర్ వెళ్లడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు వివిధ రంగాల నిపుణులు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా రాజధాని నిర్మాణం కోసం బీఏసీ నిపుణుల బృందంతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. సీఎంతోపాటు నిపుణుల బృందం సింగపూర్లోని నగరాల మాస్టర్ ప్లాన్లను, నిర్మాణాలలో అనుసరించిన టెక్నాలజీని అధ్యయనం చేస్తారు. -
లక్షలోపు రుణమాఫీ, జీవో జారీ చేసిన టీ.ప్రభుత్వం!
హైదరాబాద్: 2014 మార్చి 31 వరకు ఉన్న లక్షలోపు వ్యవసాయ రుణాలు రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణమాఫీ జీ వోను బుధవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రైతు రుణమాఫీ మార్గదర్శకాలతో కూడిన జీ వో నం.69ను ప్రభుత్వం తరపున తెలంగాణ వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున రుణమాఫీ వర్తింపు ఉంటుందని, స్వల్పకాలిక, వ్యవసాయ గోల్డ్ లోన్స్ కూడా రుణమాఫీ చేస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణాల మాఫీ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని, బ్యాంకులు తక్షణమే రైతులకు కొత్త రుణాలివ్వాలని బ్యాంకర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. -
గోవిందుడు అందరి వాడేలే' టీజర్ ఆవిష్కరణ
-
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు
-
30న కార్మికులకు సెలవు
శివాజీనగర్ న్యూస్లైన్ : ఈనెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దృష్ట్యా జిల్లాలోని దుకాణ సముదాయాలకు, ఫ్యాక్టరీల్లో పనిచ్తేన్న కార్మికులందరికీ ప్రభుత్వం సెలవుదినం ప్రకటిస్తూ జీఓ జారీ చేసిందని కార్మికశాఖ ఉపకమిషనర్ చతుర్వేది గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సంస్థల యజమానులు తమ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ వేతనంలో కూడిన సెలవు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే కార్మికశాఖ అధికారులు దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల చేత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఓటర్ల ప్రతిజ్ఞను చదివించారు. గురువారం నగర శివారులోని సుఖ్జిత్ ఫ్యాక్టరీలో కార్మికుల చేత ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సుఖిజిత్ ఫ్యాక్టరీ మేనేజర్ రాజీవ్దువా కార్మికులు నర్సయ్య, కార్మికులు పాల్గొన్నారు. -
జీవో 177 (నో వర్క్, నో పే) జారీ
-
ఢిల్లీ బయలుదేరిన సిఎం