Greater
-
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే.. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన.. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో... దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 మున్సిపాలిటీలివే.. ► రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ►మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ ►యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ►సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ►మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ -
పార్కింగ్ కోసం గొడవ.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడికి దిగి చేతికి దొరికిన వస్తువుతో ఘర్షణకు దిగారు. హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వాగ్వాదం కాస్త గొడవకు దారితీసిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న పోలీసులపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ వీడియో స్థానికంగా వైరల్గా మారింది. ఘర్షణకు దిగిన నిందితులను పోలీసు వ్యాన్లోకి ఎక్కించడానికి ప్రయత్నించగా.. వారు నిరాకరించారు. పోలీసులు హౌసింగ్ సొసైటీలోకి రాకుండా నిందితులు అడ్డుకున్నారు. మరికొంత మంది స్థానికులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు కూడా తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ మహిళల మొబైల్ ఫోన్లను కూడా లాక్కెళ్లారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/iTA7e29Hu6 — POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) August 14, 2023 ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పార్కింగ్ విషయంలో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్లో జల ప్రళయం.. 29 మంది మృతి.. -
జనాభాలోనూ గ్రేటరే..! 140 దేశాల కన్నా హైదరాబాద్ జనాభా ఎక్కువ
హైదరాబాద్ జనాభా దాదాపు 140 దేశాల కంటే ఎక్కువ. చాలా దేశాల జనాభా కోటికి లోపు ఉండటం గమనార్హం. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం లెక్కల మేరకు 2020లో కోటి కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 90 లక్షలపైన కోటి లోపు జనాభా ఉన్న దేశాలు ఆరు ఉన్నాయి. లక్ష జనాభా కంటే తక్కువగా జనాభా దేశాలు 35 ఉన్నాయి. మన దేశానికి వస్తే.. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే కూడా హైదరాబాద్ జనాభాయే ఎక్కువ. ఏదైనా రాష్ట్రం జనాభా అంటే కోట్లలో.. జిల్లా జనాభా అంటే లక్షల్లో ఉంటుందనేది మామూలే. కానీ మన గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా లక్షలనే కాదు.. కోటిని కూడా దాటేసింది. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా మేరకు గ్రేటర్ హైదరాబాద్ జనాభా ప్రస్తుతం 1.05 కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం చివరినాటికి ఇది 1.08 కోట్లకు చేరనుంది. దేశంలో జనా భా లెక్కల గణాంకాల మేరకు.. వందేళ్ల క్రితం అంటే 1921లో హైదరాబాద్ జనాభా 4.05 లక్షలు. 2011 నాటి లెక్కల మేరకు హైదరాబాద్ జిల్లా జనాభా 67.31 లక్షలకు చేరింది. కరోనా కారణంగా 2021లో జనగణన నిర్వహించలేదు. అయినా సుమారు 82 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. అదే గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం తీసుకుంటే జన సంఖ్య కోటికి పైనే ఉంటుందని తేల్చారు. చదవండి: బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాలు -
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
∙వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షులు దుర్గేష్ మధురపూడి నుంచి భారీ కాన్వాయితో ఘనస్వాగతం పలికిన అభిమానులు దానవాయిపేట(రాజమహేంద్రవరం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజవర్గాల్లో పటిష్ట కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి డివిజన్స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా నియామకం అనంతరం గురువారం నగరానికి వచ్చిన దుర్గేష్కు పార్టీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మధురపూడి విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయి, మోటర్ సైకిళ్ల తో ర్యాలీగా ఆయన వెంట వచ్చారు. గాడాల, కోలమూరు, కొంతమూరు, క్వారీ సెంటర్ మీదుగా కంబాలచెరువు సెంటర్కు చేరుకుని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్లి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో పటిష్ట కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెలావారీ సమావేశాలు నిర్వహించి ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం చేస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టి పాలకుల వైపల్యాలను ప్రజల్లోకి తీసుకువెళతామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చేలా పని చేయడమే తన ధ్యేయమని ప్రకటించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచంద్రరావు, నక్కా రాజబాబు, ఆచంట సుబ్బారాయుడు, ఆచంట కళ్యాణ్, గంటి నరసయ్య, సలాది ప్రసాద్, వెలుగుబంటి అచ్యుతరామయ్య, సాపిరెడ్డి సూరిబాబు, ముద్రగడ జమ్మి, యొజ్జు వాసు, చెరుకూరి సత్యనారాయణ, తాడేపల్లి గణేష్, తోరాటి శ్రీను, మెండా దత్తులు, యండ్ల మహేష్, మార్తి లక్షీ్మనాగేశ్వరావు, సిటీ, రూరల్ నియోజక వర్గాల నేతలు ఆయన వెంట ర్యాలీగా Ðð ంట వచ్చారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల అభినందనలు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా ఎన్నికైన కందుల దుర్గేష్ను ఆ పార్టీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, పెంకె సురేష్ గురువారం ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. -
విద్యుత్ వినియోగం పైపైకి..
గ్రేటర్లో 47.48 మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుత్ వాడకం మార్చి చివరినాటికి 60 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం వేసవిలో నిరంతరాయ సరఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ వినియోగం రోజురోజుకు మరింత పెరుగుతోంది. రెండు రోజుల క్రితం సిటీజనులు 47.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. ఫిబ్రవరి మొదటి వారంలో 40–42 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ వినియోగం..మూడో వారం నాటికి అదనంగా ఐదు మిలియన్ యూనిట్లు పెరిగింది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది వేసవిలో గరిష్టంగా 52–55 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈసారి 60 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉంది. భవిష్యత్తు డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని డిస్కం ఇప్పటికే సర్కిళ్ల వారిగా విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఒత్తిడిని తట్టుకునేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేశారు. మార్చి తొలినాటికి పునరుద్ధరణ పనులన్నీ పూర్తి చేసి, ఆ తర్వాత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని నిర్ణయించారు. ఒత్తిడి తట్టుకునేలా... హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ ఈస్ట్, రంగారెడ్డి సౌత్, రంగారెడ్డి నార్త్ సర్కిళ్ల పరిధిలో సుమారు 42 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 34 లక్షల గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా, మిగిలినవి చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. వచ్చే వేసవిలో వీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చాలంటే రోజుకు సగటున 60 మిలియన్ యూనిట్లకుపైగా అవసరం. రాబోయే ఒత్తిడిని తట్టుకుం టూ ఫీడర్లలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మేరకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల పునరుద్ధరణ, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల నరికివేత, ఆయిల్ లీకేజీలను అరికట్టడం వంటి పనుల కోసం రూ.25 కోట్లకుపైగా ఖర్చు చేస్తుంది. ఇప్పటికే సగం పనులు కూడా పూర్తి చేసినట్లు డిస్కం అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని చెబుతున్నారు. -
వైన్ షాపు.. వెల వెల..
• ‘గ్రేటర్’లో 60% పడిపోరుున మద్యం అమ్మకాలు • పాత నోట్ల కారణంగా బోసిపోయిన వైన్ షాపులు, బార్లు పెద్ద నోట్ల రద్దు గ్రేటర్లో మందుబాబులకూ కష్టాలు తెచ్చిపెట్టింది. బుధ, గురువారాల్లో మహానగరం పరిధిలోని 300మద్యం దుకాణాలు, 571 బార్లలో మద్యం అమ్మకాలు 60% మేర పడిపోరుునట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణంలో కొనుగోలు కోసం వస్తున్న వారు రూ.500, రూ.1,000 నోట్లను తీసుకువస్తుండడంతో దుకాణదారులు ఆ నోట్లను తిరస్కరిస్తున్నారు. దీంతో 50 నుంచి 60 శాతం మంది మద్యం కొనకుండానే తిరిగి వెళ్లిపోతున్నారని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. నగర శివారు ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి కటాన్ల కొద్ది మద్యం కొనుగోలు చేసేవారు సైతం దిక్కులేకపోవడంతో దుకాణాలు వెలవెలబోతున్నారుు. కోఠి రంగ్మహల్ చౌరస్తాలోని బగ్గా వైన్సలో ఈ రెండు రోజుల్లో 40% అమ్మకాలు మాత్రమే జరిగినట్టు దుకాణం యజమానులు తెలిపారు. హైదరాబాద్ వైన్ షాపుల నిర్వాహకులు వంద నోట్లు ఉంటేనే మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. కొన్ని దుకాణాల్లో మాత్రం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా అమ్మకాలు సాగుతున్నారుు. మద్యం ప్రియులకు డెబిట్, క్రెడిట్ కార్డుల వల్ల మద్యం సీసాలు దొరుకుతుండడంతో వారు కొంత ఊరట చెందుతున్నారు. వైన్ షాపు నిర్వాహకులు సైతం డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నవారికి మాత్రం ఆహ్వానించి కార్డు స్వైప్ చేసుకుని మద్యం బాటిళ్లను వారి చేతుల్లో పెడుతున్నారు. బార్లు సైతం వెలవెల.. పెద్ద నోట్ల రద్దుతో బార్లు కూడా వెలవెలబోతున్నారుు. బారు వద్ద పార్కింగ్ నుంచి మొదలుకుని వెరుుటర్ వరకు వంద నోట్లు ఉన్నాయా అని మందుబాబులను ముందే ప్రశ్నిస్తున్నారు. బారులో బిల్లు వందల నుంచి వేల రూపాయల వరకు అరుునా దర్జాగా కట్టి వెరుుటర్కు ఓ వంద టిప్పు ఇచ్చే వాళ్లను సైతం వంద నోటు ఉంటేనే సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దీంతో చాలా బార్లు మందుబాబులు లేక వెలవెలబోతున్నారుు. -
సకాలంలో మెట్రో పూర్తి
ఎల్అండ్టీ మెట్రో రైల్ డిప్యూటీ ఎండీ సుబ్రమణ్యన్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మెట్రో రైల్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సకాలంలో పూర్తి చేస్తామని ఎల్అండ్టీ మెట్రో రైల్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్ చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టులో 67 శాతం పనులు పూర్తయ్యాయని ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో పనులకు ఎదురవుతున్న ఆటంకాలను గుర్తించి వాటిని అత్యున్నత స్థాయిలో పరిష్కరిస్తున్నామన్నారు. తద్వారా పనుల జాప్యం లేకుండా చూస్తున్నామన్నారు. నాగోల్-రహేజా ఐటీపార్క్, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్నుమా మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ. మెట్రో ప్రాజెక్టును 2018 డిసెంబరులోగా పూర్తిచేస్తామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతి ఇలా... * నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్ఆర్నగర్ రూట్లో మొత్తం 20 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలకు వీలుగా కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ పత్రాలు అందాయి. * ఇప్పటికే 59 కి.మీ. మార్గంలో పునాదులు, 56.61 కి.మీ. మార్గంలో పిల్లర్లు, 35.70 కి.మీ. మార్గంలో రైళ్ల రాకపోకలు సాగించేందుకు ట్రాక్ సిద్ధమైంది. హా అమీర్పేట్, ఎంజీబీఎస్, పరేడ్గ్రౌండ్స్ల వద్ద ఇంటర్చేంజ్ స్టేషన్ల నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. * మియాపూర్, ఉప్పల్ మెట్రో డిపోల్లో 57 మెట్రో రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. * భరత్నగర్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. మరో 7 ఆర్ఓబీల పని శరవేగంగా జరుగుతోంది. * సుల్తాన్బజార్, మలక్పేట్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో పనులు ఊపందుకున్నాయి. -
కేన్సర్ మందుల తయారీలో ‘గ్రేటర్’
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వివిధ రకాల కేన్సర్ల మందుల తయారీకి రాజధాని గ్రేటర్ నగరం చిరునామాగా నిలుస్తోంది. నగరంలో 500కి పైగా అతిపెద్ద మెడికల్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోని నిత్యం ప్రతి ముగ్గురు వ్యక్తులు వాడేమందుల్లో ఒకరు వాడేవి హైదరాబాద్లో తయారైన మందులే. నగరంలో తయారవుతున్న పలు అరుదైన డ్రగ్స్ అమెరికా, యూరప్, ఆఫ్రికా లాంటి ఎన్నో దేశాలకు ఎగుమతవుతున్నాయి’ అని ఇన్నోవేట్ -16 కన్వీనర్, పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్, డాక్టర్ వి. రామమోహన్ గుప్తా తెలిపారు. రవీంద్రభారతిలో పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఇస్పోర్ ఇండియా తెలంగాణ చాప్టర్ సంయుక్తంగా జాతీయ ఔషధ విధానంపై అంతర్జాతీయ సదస్సు(ఇన్నోవేట్-16) నిర్వహించాయి. సదస్సులో పాల్గొన్న రామమోహన్ సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యాంటీ కేన్సర్ డ్రగ్స్ ఎక్కువగా హైదరాబాద్లోని పరిశ్రమల్లోనే తయారు చేస్తారని తెలిపారు. ఇక్కడ ప్రధానంగా బల్క్ డ్రగ్స్, ఫార్మేషన్ డ్రగ్స్ తయారు చేస్తారన్నారు. రెడ్డీస్, హెటిరో వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మెడిసిన్ను తయారు చేయటంలో పేరెన్నిక గన్నవన్నారు. కొన్ని కంపెనీలు యాంటీ సైకో మెడిసిన్ను కూడా ఇక్కడ తయారు చేస్తుండటం విశేషంగా చెప్పవచ్చని తెలిపారు. ముగిసిన అంతర్జాతీయ సదస్సు యూజ్ఫుల్ నేషనల్ మెడికల్ పాలసీ(జాతీయ ఔషధ విధానం) పై రెండు రోజుల పాటు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సదస్సు గురువారం ముగిసిందని డాక్టర్ రామమోహన్ తెలిపారు. ఇందులో మలేసియా, థాయ్లాండ్ నుంచి మూడు వర్సిటీ ప్రతినిధులు పాల్గొని పవర్పాయింట్ ప్రజెంటేషన్ చే శారని తెలిపారు. మలేసియా టైలర్స్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ పీటీ థామస్ సేప్రేషనల్ అపాడ్ బుక్ గుడ్ క్వాలిటీ డ్రగ్స్ అనే అంశంపై చేసిన ఉపన్యాసం ఫార్మసీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకారిగా ఉండబోతుందని చెప్పారు. మలేసియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జోరియా అజీజ్ ప్రత్యేకంగా మెటా అనాలిసిస్పై చేసిన ప్రసంగం ఫార్మసీ విద్యార్థులకు ఒక చరిత్రగా మిగిలిపోతుందన్నారు. ఐటీ పార్కు సిటీకి ఒక వైపు ఉన్నట్లుగానే ఫార్మా హబ్ కూడా శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్నదని రామమోహన్ గుప్తా తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు మందుల కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన 12 మంది ఫార్మసీ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారని ఆయన చెప్పారు. సదస్సు ముగింపు సందర్భంగా గురువారం మధ్యాహ్నం ఫార్మసీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ ఔషధ విధానంపై నిర్వహించిన పోస్టర్ల ప్రదర్శన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. -
గ్రేటర్ లో ‘కేరళ మోడల్’ రోడ్లు
♦ నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే ♦ 20 నుంచి 50 భాగాలుగా రోడ్ల విభజన ♦ నేటి వర్క్షాప్లో నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్లో రహదారుల దుస్థితి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏటా మరమ్మతుల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఈ అవస్థలను ఇటీవలే గవర్నర్ నరసింహన్, మునిసిపల్ మంత్రి కేటీఆర్లు కూడా వీక్షిం చారు. వివిధ ప్రభుత్వ శాఖల నడుమ సమన్వ య లేమి, పనుల నాణ్యతపై శ్రద్ధ లోపించడం, ఎప్పుడు పడితే అప్పుడు .. ఎక్కడ పడితే అక్క డ తవ్వకాలు తదితరమైనవి ఇందుకు కారణాలని కేటీఆర్ గుర్తించారు. నగర రోడ్లను బాగు చేసేందుకు అవసరమైతే కొత్త విధానాల్ని అవలంభిస్తామని ఆరోజే ప్రకటించారు. వివిధ విభాగాల అధికారులు, నిపుణులతో గురువా రం జరుగనున్న వర్క్షాప్లో అన్ని అంశాలు పరిశీలించి ఈమేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా నగరంలో రోడ్ల నిర్వహణను రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రతిపాదనలు గతంలోనూ వచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. గతంలో కృష్ణబాబు కమిషనర్గా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణను ప్రయోగాత్మకంగా ప్రైవేట్కు అప్పగించాలని భావించారు. కానీ అమలు కాలేదు. రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లకే డిఫెక్ట్ లయబిలిటీ కింద రెండేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలుండాల్సినప్పటికీ పట్టించుకోవడం లేరు. బీటీ రోడ్లు వర్షానికి నిలవవు కనుక ఏమీ చేయలేమని తప్పించుకుంటున్నారు. ఈపరిస్థితి నివారణకు ఐదు, పది, పదిహేనేళ్ల వరకు రోడ్ల నిర్వహణను కాంట్రాక్టర్లకే అప్పగించే ఆలోచనలున్నట్లు తెలుస్తోంది. కేరళ రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానంతో మంచి ఫలితాలున్నట్లు గుర్తించారు. అక్కడ కొన్ని రోడ్లను ప్రైవేటు నిర్వహణకిచ్చారు. వాటితో మంచి ఫలితాలు కనిపించడంతో గ్రేటర్లోనూ ఆవిధానాన్ని అమలు చేసే దిశగా యోచిస్తున్నారు. నగరంలో దాదాపు 9 వేల కి.మీ.లమేర రహదారులున్నాయి. 625 చ.కి.మీ.ల విస్తీర్ణంలోని నగరాన్ని 20 నుంచి 50 యూనిట్ల వరకు విభజించి ఒక్కో యూనిట్ వంతున రోడ్ల నిర్వహణను కాంట్రాక్టుకిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వేసే రోడ్డు బీటీయా, సీసీయా, వైట్టాపింగా అన్నదాంతో సంబంధం లేకుండా సాఫీ ప్రయాణానికి మన్నికగా ఉండే రోడ్లను నిర్మించే సంస్థ నిర్ణీత కాలవ్యవధి వరకు నిర్వహణ బాధ్యత వహించాలి. గడువు ముగిసేంత వరకు రోడ్ల నిర్వహణ పూర్తి బాధ్యత వారికే అప్పగిస్తారు. -
ఆన్లైన్ లుక్... అక్రమాలకు చెక్!
గ్రేటర్లో ఇక ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు * జూన్ 1 నుంచి అమలు * లేఔట్ అనుమతులు కూడా.. * 'టౌన్ప్లానింగ్’లో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే... * అవకతవకలకు అడ్డుకట్ట పడే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. వచ్చేనెల (జూన్) ఒకటో తేదీ నుంచి భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్ అనుమతుల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఆన్లైన్ ద్వారానే అనుమతుల్ని జారీ చేయనున్నారు. ప్రస్తుతం వ్యక్తిగతంగా ఈ దరఖాస్తులను సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తు అందజేశాక సైతం అనుమతుల కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్పెట్టేందుకు, పారదర్శక సేవల కోసం ఆన్లైన్ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆటో డీసీఆర్ సాఫ్ట్వేర్ వినియోగంతో వచ్చే ఒకటో తేదీనుంచి ఆన్లైన్ ద్వారా ఈ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ విధానంలో మొదట ఆటో డీసీఆర్ ద్వారా ఆటోక్యాడ్లో ప్లాన్ను రూపొందించి, సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తుల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఏవైనా లోటుపాట్లుంటే ప్రాథమిక దశలో ఆటోమేటిక్గా తెలుస్తుంది. తద్వారా ఉద్యోగులకు సమయం కలిసి రావడమే కాక, నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీ తనం ఉంటుంది. టౌన్ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీకి అవసరమైన సాఫ్ట్వేర్ను పుణేకు చెందిన సాఫ్టెక్ సంస్థ రూపొందించింది. ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించేందుకు ప్రజలు ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సహకారం పొందవచ్చు. ఇందుకుగాను వారికి ఈనెల 6వ తేదీన భవననిర్మాణ, లే ఔట్ల అనుమతుల జారీకి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీలో పేర్లు నమోదు చేసుకున్న లెసైన్సుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ అవ గాహన కార్యక్రమం ఉంటుందని కమిషనర్ తెలిపారు. సులభతరమైన పరిపాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఆన్లైన్ అప్రూవల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన వందరోజుల ప్రణాళికలోనూ ఈ కార్యక్రమం ఉంది. దీంతోపాటు జీహెచ్ఎంసీలో ఏ ఫైలు ఎక్కడ ఉందో తెలిసేలా ఈ- ఆఫీస్ ప్లస్ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. దాదాపు ఏడాదిగా ఈ- ఆఫీస్ అమల్లో ఉన్నప్పటికీ, అది కేవలం అధికారులకు మాత్రమే పరిమితమైంది. ఈ-ఆఫీస్ ప్లస్తో ప్రజలు కూడా తమ ఫైలు ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే వెసులుబాటు ఉంది. విశ్వనగరంగా ఎదగాలనే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీ వెబ్సైట్కు సైతం కొత్త హంగులద్దారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో తాజాగా ‘ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్సిటీ’ అనే నినాదం కొత్తగా దర్శనమిస్తోంది. వెబ్సైట్లో గతంలో లేని పింక్ కలర్ను చేర్చారు. ప్రయోజనాలెన్నో.. ⇒ ఆన్లైన్లో దరఖాస్తుల్ని స్వీకరించడం వల్ల దరఖాస్తు ఏ రోజు, ఏ సమయంలో సమర్పించింది స్పష్టంగా తెలుస్తుంది. ⇒ దరఖాస్తుతోపాటు జతపరచాల్సిన పత్రాలు జత చేయలేదనేందుకు, ఎవరైనా మాయం చేసేందుకు ఆస్కారం ఉండదు. ⇒ భవనం విస్తీర్ణానికి అనుగుణంగా సెట్బ్యాక్లు తదితరమైనవి ప్లాన్లో సరిగ్గా ఉన్నదీ లేనిదీ సాఫ్ట్వేరే గ్రహిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా లేనివాటిని తిరస్కరిస్తుంది. తద్వారా అధికారులకు పనిభారం తగ్గుతుంది. సమయం కలసి వస్తుంది. అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది. ⇒ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ లేదని కొర్రీలు వేస్తూ , ప్రజలను పదేపదే తిప్పేందుకు అవకాశం ఉండదు. ⇒ దరఖాస్తు ఎప్పుడు ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే వీలు. ⇒ దరఖాస్తు పరిశీలన పూర్తయి, అనుమతి జారీ అయితే ⇒ ఆ విషయం సెల్ఫోన్కు సమాచారం అందుతుంది. ఈమెయిల్ ద్వారాను తెలుస్తుంది. ఎక్కడైనా ఫైలు ఎక్కువ రోజులు ఉంటే, ఆ విషయం పైఅధికారులకు తెలుస్తుంది. తద్వారా జాప్యం తగ్గుతుంది. ⇒ 30 రోజుల నిర్ణీత వ్యవధిలో అనుమతుల జారీకి అవకాశం. ⇒ నిర్లక్ష్యం కనబరుస్తూ, జాప్యం చేసే అధికారులకు పెనాల్టీలు వేసేందుకు వీలు. ⇒ 30 రోజుల్లోగా ఫైలు పరిష్కారమో, తిరస్కారమో తెలుస్తుంది. -
ఆర్టీసీ బస్సుల ‘బ్రేక్’ డ్యాన్స్
♦ ఎక్కడికక్కడే నిలిచిపోతున్న ఆర్టీసీ బస్సులు ♦ ప్రతిపాదనలకే పరిమితమైన మొబైల్ వాహనాలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీ ప్రతిపాదనలు ఆరంభశూరత్వమే అనిపిస్తోంది. ఎక్కడికక్కడ రోడ్లపై చెడిపోయి ఇటు ప్రయాణికులను, అటు వాహనచోదకులను సిటీ బస్సులు బెంబేలెత్తిస్తున్నాయి.రోడ్డెక్కిన బస్సు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో చెడిపోతుందో తెలియ ని పరిస్థితి నెలకొంది. బ్రేక్డౌన్స్ను అధిగమించేందుకు డిపోస్థాయిలోనే పూర్తిస్థాయి మరమ్మతులన్నారు.. రోడ్డుపై చెడిపోయిన బస్సుకు క్షణాల్లో రిపేరింగ్లన్నారు.. మొబైల్ మెకానిక్ కేంద్రాలన్నారు.. ఇవన్నీ ప్రతిపాదనలే.. ప్రణాళికలే.. ఆచరణలో మాత్రం అంతా శూన్యం. ఫలితంగా ఎప్పటిలాగే బస్సులు చెడిపోతున్నాయి. ప్రతి నెలా 200 నుంచి 300 బస్సులు రోడ్లపైనే ఆగిపోతున్నాయి. కాలం చెల్లిన వెయ్యికి పైగా డొక్కు బస్సులు గ్రేటర్ ఆర్టీసీ నష్టాలకు ఆజ్యం పోస్తున్నాయి. అంతా ప్రహసనం ప్రతి రోజూ పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతోంది. మెట్రో పనుల వల్ల రహదారులు కుచించుకుపోవడం, అదే మార్గాల్లో బ్రేక్డౌన్స్ కారణంగా బస్సులు నిలిచిపోవడంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం బస్సుల్లో వెళ్లే ప్రయాణికులే కాకుండా, సొంత వాహనాలు, ట్యాక్సీలు, ఆటోలు వంటి వాటిల్లో వెళ్లే ప్రయాణికులు సైతం రోడ్లపైనే నిలిచిపోవలసి వస్తోంది. బ్రేక్డౌన్స్ నియంత్రణ కోసం క్షణాల్లో బస్సు వద్దకు చేరుకొనే మొబైల్ రిలీఫ్ వాహనాలు, బైక్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. విడిభాగాలు, మెకానిక్లతో కూడిన 6 మెబైల్ రిలీఫ్ వాహనాలు ట్రాఫిక్ రద్దీకి దారితీసే, మెట్రో పనులు జరుగుతున్న కోఠీ, లకిడికాఫూల్, ఎల్బీనగర్,ఈఎస్ఐ,లింగంపల్లి,సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు. అయితే ఎక్కడా వాటి జాడ కనిపించడం లేదు. రోజుకు 10 నుంచి 15 బస్సులు బ్రేక్డౌన్... గ్రేటర్లో 28 డిపోల నుంచి ప్రతి రోజు 3850 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో కాలం చెల్లినవి, సామర్ధ్యం లేనివి. నాణ్యతలేని విడిభాగాల కారణంగా చెడిపోయేవి రోజూ 10 నుంచి 15 బస్సులు ఉంటాయి. ఒక బస్సు ఆగిపోతే ఆ రోజు 250 కిలోమీటర్ల వరకు రవాణా సదుపాయం నిలిచిపోయినట్లే. ఈ లెక్కన 2500 కిలోమీటర్ల నుంచి 3750 కిలోమీటర్ల వరకు సర్వీసులు నిలిచిపోతున్నాయి. జీతభత్యాలు, ఇంధనభారం, విడిభాగాల కొనుగోళ్లు వంటి వివిధ కారణాల వల్ల రోజూ రూ.కోటి నష్టాన్ని ఎదుర్కొంటున్నా ఆర్టీసీకి ఇది మరింత ఆజ్యం పోస్తోంది. ఆక్యుపెన్సీ పడిపోతోంది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ రూ.289 కోట్ల నష్టాలను ఎదుర్కొంటోంది. వీటిలో ఏసీ బస్సులతో పాటు, కాలం చెల్లిన డొక్కు బస్సుల వల్ల నమోదైనవే ఎక్కువగా ఉన్నాయి. హడావిడి చేశారు... వదిలేశారు... అప్పట్లో ఎల్బీనగర్ నుంచి పటాన్చెరు వెళ్లే బస్సు ఒకటి పంజగుట్ట చౌరస్తాలో చెడిపోయింది. ఎలక్ట్రానిక్ డివైజ్ కంట్రోలర్ చెడిపోయినట్లు డ్రైవర్ గుర్తించాడు. దాంతో బస్సు అంగుళం కూడా ముందుకు కదలలేని పరిస్థితి. క్షణాల్లో రెండు కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు బస్సును అతి కష్టంగా పక్కకు తప్పించారు. ఆ మరుసటి రోజే అమీర్పేట్ మైత్రీవనవం వద్ద ఇదే తరహాలో మరో బస్సు చెడిపోయింది. రెండు చోట్ల ట్రాఫిక్ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. ట్రాఫిక్ నిర్వహణలో కొరకరాని కొయ్యగా మారిన సిటీబస్సుల బ్రేక్డౌన్స్పై ఆర్టీసీ అధికారులు ఎంతో హడావిడి చేశారు. కానీ అంతా మూణాళ్ల ముచ్చటగానే మారింది. తిరిగి బ్రేక్డౌన్స్ సమస్య మొదటికొచ్చింది. ఇదీ పరిస్థితి నగరంలోని మొత్తం బస్సులు 3850 డిపోలు 28 ప్రయాణికులు 33 లక్షలు 2014 ఏప్రిల్-సెప్టెంబర్ వరకు బ్రేక్డౌన్స్ : 1596 (నెలకు సగటున 266 చొప్పున) 2015 ఏప్రిల్-సెప్టెంబర్ వరకు: 2100 (నెలకు సగటున 350 చొప్పున) 2016 జనవరి,ఫిబ్రవరి నెలల్లో సుమారు: 500 బస్సులు -
గ్రేటర్లో 9 బస్తీల్లో ‘డబుల్’ ఇళ్లు
రూ.150 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని తొమ్మిది బస్తీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ.. టెండర్ల నిర్వహణకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా నగరంలో 46 బస్తీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించినప్పటికీ.. పలు కారణాల రీత్యా ఈ బస్తీల సంఖ్యను 30కి కుదించారు. గ్రేటర్లో లక్ష ఇళ్ల నిర్మాణంలో భాగంగా సత్వరమే 9 బస్తీల్లో 2,158 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించటానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సయ్యర్ సాహాబ్ బాడలో జీ ప్లస్ త్రీ భవనాలు(అంతస్తులు), పిల్లిగుడిసెలు, సరళాదేవినగర్, కామ్గారి నగర్, లంబాడీ తండా, హమాలీ బస్తీ, చిలుకలగూడ, ఇందిరానగర్, జంగంమెట్ బస్తీల్లో జీప్లస్ 9 భవనాల(అంతస్తులు)లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడానికి సత్వరమే టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అలాగే మహబూబ్నగర్లోని ఒక ప్రాంతంలో 2,300 డబుల్బెడ్ రూమ్ ఇళ్లు, మెదక్లో తొమ్మిది ప్రాంతాల్లో 6,385 ఇళ్లు, నిజామాబాద్లో తొమ్మిది ప్రాంతాల్లో 6,245 ఇళ్లు, ఆదిలాబాద్లోని ఒక ప్రాంతంలో 218 ఇళ్లు, కరీంనగర్లో 14 చోట్ల 5,447 ఇళ్లు, ఖమ్మంలో రెండు చోట్ల 2,022 ఇళ్లు, వరంగల్లో మూడు ప్రాంతాల్లో 1,784 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడానికి టెండర్ల కోసం పరిపాలన అనుమతులు మంజూరీ ఇస్తూ... ఆయా జిల్లాల గృహ నిర్మాణ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిధులు కూడా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. -
గ్రేటర్ లో ఓటేసిన ప్రముఖులు
-
ముగిసిన గ్రేటర్ ప్రచార పర్వం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. చివరిరోజు అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిన ప్రచారపర్వం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మంగళవారం జరగనున్న పోలింగ్లో హైదరాబాద్ మహానగర ఓటర్లు 150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నగర వ్యాప్తంగా 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఐదో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. -
నగర అభివృద్ధి బాధ్యత నాదే: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే సత్తా ఒక్క టీఆర్ఎస్కే ఉందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం గ్రేటర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తప్పించి చేసిందేమీ లేదన్నారు. ఒక్క అవకాశం ఇస్తే హైదరాబాద్ నగర రూపురేఖలే మార్చేస్తామని కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపిస్తే నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. -
'ప్రభుత్వ పథకాలు ఆపుతామంటున్నారు'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలను నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం చివరిరోజు గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న ఆయన అబద్ధాలతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శింఆచరు. తమ పార్టీకి ఓటెయ్యకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపుతామని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో ఓల్డ్ సిటీని ఒవైసీ కుటుంబానికి, న్యూ సిటీని కేసీఆర్ కుటుంబానికి రాసేసుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. -
ఉండేదెవరు?.. ఊడేదెవరు?
-
'టీఆర్ఎస్' ఓడితే రాజీనామా చేస్తా
-
ఎన్నికల్లో ముమ్మర ప్రచారం
-
ప్రభుత్వం ఎవరిపైనా విపక్ష చూపడంలేదు
-
ప్రచారానికి నేడు శ్రీకారం
-
గ్రేటర్ డిబేట్..
-
బీజేపీ శ్రేణులు గ్రేటర్లో ప్రతీ ఓటరును కలవాలి: దత్తాత్రేయ
బీజేపీ అభ్యర్థులకు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రతీ ఓటరును కలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రేటర్లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉందని, అధికార టీఆర్ఎస్కు బలం లేక ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులను డివిజన్ల బాధ్యతలు అప్పగించి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రచారం చేయాలని అభ్యర్థులకు దత్తాత్రేయ సూచించారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్ప ఆచరణలో అభివృద్ధిని, అమలును చూపించడం లేదని టీఆర్ఎస్ను కిషన్రెడ్డి విమర్శించారు. -
గల్లీల నోట.. గెలుపు పాట
►గ్రేటర్లో ఇవే కీలకం ►ఓటు బ్యాంకులుగా వినియోగం ►మౌలిక సదుపాయాలకు దూరం సిటీబ్యూరో: వాళ్లు ఉన్న ఇళ్లు... కిల్లీ కొట్ల కన్న సిన్నగున్నయీ... గల్లీ సిన్నది...’ అంటూ సాగిపోయే గోరటి ఎంకన్న పాట సంగతి ఎలాగున్నా... ఇప్పుడు ఈ గల్లీలే గ్రేటర్ దశను, దిశను మలుపు తిప్పబోతున్నాయి. కోటికి చేరువైన గ్రేటర్ జనాభాలో ఎంతోమంది ఈ ఇరుకు గల్లీల్లోనే జీవనం సాగిస్తున్నారు. రాజకీయ పార్టీల హామీలకు, వాగ్దానాలకు, మేనిఫెస్టోలకు మధ్య తరగతి, ఆ పై వర్గాల కంటే ఎక్కువగా ప్రభావితమయ్యేది... ఆకర్షితులయ్యేదీ ఇక్కడి జనాభాయే. ఏ పార్టీ నేత తమ ప్రాంతానికి వచ్చినా సాదరంగా ఆహ్వానించి... ముందు వరుసలో నిలుచొని జెండాలు మోసేదీ... నినాదాలు చే సేదీ ఈ గల్లీలే. అందుకే అన్ని రాజకీయ పార్టీల దృష్టి వీటిపై పడింది. కాలనీలు, అపార్ట్మెంట్ల కంటే గల్లీలను నమ్ముకుంటేనే కాసిన్ని ఎక్కువ ఓట్లు రాలుతాయనే ఆశ కావచ్చు. తమ హమీలను నమ్మేసి... ఓట్లేసేదీ గల్లీలే అనే ధీమా కావచ్చు.కానీ మొత్తంగా అటు వామపక్షాల నుంచి ఇటు పాలక పక్షాల వరకు అన్ని పార్టీలూ గల్లీల కే జైకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్లీల సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.... అమలుకు నోచని హామీలు స్వచ్చంద సంస్థలు, హక్కుల సంఘాల సర్వేల ప్రకారం నగరంలో మొత్తం 2,200 మురికివాడలు ఉన్నాయి. వీటిలో 1,492 బస్తీలను ప్రభుత్వం గుర్తించింది. 30 లక్షల మందికి పైగా ప్రజలు ఈ ఇరుకు గల్లీల్లో, బస్తీల్లో అనేక సమస్యల మధ్య జీవిస్తున్నారు. దినసరి కూలీలుగా, చిరు వ్యాపారులుగా, ఇళ్లలో పనులు చేస్తూ, ఆటోలు, ట్రాలీలు నడుపుతూ బతుకుతున్నారు. అప్పటి ఉమ్మడి రాష్ర్టం మొదలుకొని ఇప్పటి ప్రత్యేక రాష్ర్టం వరకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ను మురికివాడల రహితంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించినవే. ఏళ్లు గడుస్తున్నాయి... ఎన్నికల పైన ఎన్నికలు వస్తూనేఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకులైన గల్లీల బతుకులు మాత్రం మారడం లేదు. కనీస సదుపాయాలు కరువు మురికివాడల ప్రజల ప్రధాన సమస్య పారిశుద్ధ్య లోపం. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ఎన్ని వచ్చినా గల్లీల్లో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు. మంచినీటి కొరత, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదు. వందలకొద్దీ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ మరుగుదొడ్లు, తగినన్ని తరగతి గ దులు, ఉపాధ్యాయులు లేక వెలవెలబోతున్నాయి. నగరంలో ఒకవైపు పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు విస్తరిస్తున్నాయి. మరోవైపు పేదల బస్తీల్లోని పాఠశాలలు విచ్ఛిన్నమవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల వేళ అనేక హామీలతో మేనిఫెస్టోలను ముద్రించుకొని గల్లీల్లోకి ప్రవేశిస్తున్న రాజకీయ పార్టీలు, నేతలు బస్తీ వాసుల కనీస సదుపాయాలపై దృష్టి సారించవలసి ఉంది. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించవలసి ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 95 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వైద్యులు, నర్సులు లేరు. మందులు లేవు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు కూడా లేవు. మొత్తంగా గల్లీల్లో సర్కారీ వైద్యం శిథిలమైపోతోంది. దీంతో ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా జనం ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆస్పత్రులకు వెళ్లవలసి వస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు,తలనొప్పి వంటి చిన్న సమస్యలకు కూడా పెద్దాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు గర్భిణులు రక్తహీనతకు గురికాకుండా అందజేయవలసిన ఐరన్ మాత్ర లూ అందుబాటులో ఉండడం లేదు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిరోధించి, స్కూల్కు పంపించే దిశగా కృషి చేయవలసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పక్కా భవనాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలూ సక్రమంగా పని చేయడం లేదు. కార్యరూపం దాల్చని హాకర్స్ పాలసీ... నగరంలోని అనేక బస్తీలు ఏళ్ల క్రితమే తమ ఉపాధికి అనుగుణంగా ఏర్పాటయ్యాయి. మార్కెట్లను, ప్రధాన కూడళ్లను ఆశ్రయించుకొని మూసీకి అటూ.. ఇటూ ఇవి ఆవిర్భవించాయి. బస్తీల జనాభాలో ఎక్కువ శాతం వీధి వ్యాపారులే. మలక్పేట్, దిల్సుఖ్నగర్, కోఠి, సుల్తాన్బజార్, అబిడ్స్, మొజాంజాహీ మార్కెట్, ఉస్మాన్గంజ్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, మెహదీపట్నం, తదితర ప్రధాన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వీధి వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. వీరితో పాటు నాలుగు చక్రాల బండ్లతో వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి చిరు వ్యాపారులకు ‘స్ట్రీట్ వెండర్స్’గా గుర్తింపు కార్డులు అందజేయడంతో పాటు, సామాజిక భద్రత కల్పించే దిశగా అప్పటి ఉమ్మడి ప్రభుత్వం హాకర్స్ పాలసీని రూపొందించింది. వీధి వ్యాపారుల సంఖ్యపై అప్పట్లో మెప్మా అనే సంస్థ సర్వే చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాలను ‘రెడ్, గ్రీన్, అంబర్’ రంగులతో హాకర్స్ జోన్గా విభజించారు. రెడ్జోన్లలో హాకర్స్ వ్యాపారం చేయడానికి వీల్లేదు. గ్రీన్ జోన్లో ఎప్పుడైనా అనుమతినిస్తారు. అంబర్ జోన్లలో నిర్ణీత వేళల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. హాకర్స్ పాలసీ రూపొందించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటి వరకూ వారికి లెసైన్సులు ఇవ్వలేదు. దీంతో నిత్యం అభద్రతా భావంతో వారు వ్యాపారం కొనసాగిస్తున్నారు. మురికివాడలను ఓటు బ్యాంకులుగా పరిగణించే దృష్టితో కాకుండా వారి సమస్యల పరిష్కారం దిశగా రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి. -
గ్రేటర్లో ఊపందుకున్న ప్రచారం