Haris Rauf
-
భారత్తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అసలు సిసిలైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్దులు భారత్-పాకిస్తాన్(India-Pakistan) అమీతెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఐసీసీ ఈవెంట్లలో పాక్పై తమ అధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ట్రోఫీ-2017 ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది.ఓవరాల్గా ఐసీసీ టోర్నీల్లో పాక్పై భారత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్ల్లో తలపడగా.. 16 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా, పాక్ కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్తో జరిగే మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని రౌఫ్ తెలిపాడు."భారత్తో మ్యాచ్ సందర్బంగా మాపై ఎలాంటి ఒత్తడి లేడు. ఆటగాళ్లందరూ రిలాక్స్గా ఉన్నారు. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే. పాకిస్తాన్-భారత్ మ్యాచ్ అన్ని క్రికెట్ మ్యాచ్లనే జరుగుతుంది" అని జియో న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రౌఫ్ పేర్కొన్నాడు. ఇక ఈ మెగా టోర్నీని భారత్ అద్భుతమైన విజయంతో ఆరంభించింది. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. పాక్ మాత్రం కివీస్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసింది.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్.. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్కు భారీ షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు పాకిస్తాన్ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఇప్పటికే యువ సంచలనం సైమ్ అయూబ్ సేవలను కోల్పోయిన పాకిస్తాన్కు మరో భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ స్టార్ పేసర్ హరీస్ రవూఫ్ గాయపడ్డాడు. అతడి చీలమండకు గాయమైంది.దీంతో మ్యాచ్ మధ్యలోనే రవూఫ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం తీవ్రతపై పీసీబీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో గాయపడకముందు రవూఫ్ తన స్పెల్లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. కివీస్ స్టార్ ప్లేయర్ టామ్ లాథమ్ను రవూఫ్ పెవిలియన్కు పంపాడు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి రవూఫ్ దూరమైతే పాక్కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.ఎందుకంటే ఈ మెగా టోర్నీ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడంతో పాకిస్థాన్ పేస్ త్రయం షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీం షాపై ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు రవూఫ్ గాయం బారిన పడడం పాక్ జట్టు మెనెజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది.కాగా ఫిబ్రవరి 12 వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే దేశాలు తమ జట్లలో మార్పులు చేసుకునే అవకాశముంది. ఈ క్రమంలో పాక్ జట్టులో కూడా మార్పులు చేసే ఛాన్స్ ఉందని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చారు. కాగా ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన పాక్ జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందకంటే ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఫహీమ్ అష్రఫ్ ఖుష్దిల్ షాలను ఎంపిక చేయడం వివాదానికి తావిచ్చింది. పీసీబీ సెలక్షన్ కమిటీపై మాజీలు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 19న న్యూజిలాండ్తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్దీప్ సింగ్ -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న అర్షదీప్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాళ (జనవరి 28) జరుగబోయే మూడో టీ20లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే.. టీ20ల్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం అర్షదీప్ 62 మ్యాచ్ల్లో 98 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 21వ స్థానంలో ఉన్నాడు.తొలి పేసర్గా చరిత్రకెక్కనున్నాడు..!నేటి మ్యాచ్లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన పేసర్గా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాక్ పేసర్ హరీస్ రౌఫ్ పేరిట ఉంది. రౌఫ్ 71 మ్యాచ్ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. అర్షదీప్కు తన 63వ మ్యాచ్లోనే 100 వికెట్ల మైలురాయిని క్రాస్ చేసే అవకాశం వచ్చింది.రషీద్ 53 మ్యాచ్ల్లోనే..!టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 53 మ్యాచ్ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు. 2021లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఈ ఫీట్ను సాధించాడు. రషీద్ తర్వాత అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఘనత నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచ్చనేకు దక్కుతుంది. సందీప్ 54 మ్యాచ్ల్లో 100 వికెట్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లురషీద్ ఖాన్ (53 మ్యాచ్లు)సందీప్ లామిచ్చనే (54 మ్యాచ్లు)వనిందు హసరంగ (63 మ్యాచ్లు)ఎహసాన్ ఖాన్ (71 మ్యాచ్లు)హరీస్ రౌఫ్ (71 మ్యాచ్లు)నేటి మ్యాచ్లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన మూడో బౌలర్గా హసరంగతో కలిసి సంయుక్తంగా నిలుస్తాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్లో ఉన్న అర్షదీప్కు నేటి మ్యాచ్లో రెండు వికెట్లు తీయడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో అర్షదీప్ 3 వికెట్లు తీశాడు. అర్షదీప్ రెండు రోజుల కిందటే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎంపికైన విషయం తెలిసిందే.భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. నేటి మ్యాచ్లోనూ భారత్ ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తుంది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ (39 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), రెండో మ్యాచ్లో తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విశేషంగా రాణించారు. వీరి ప్రదర్శనల కారణంగానే భారత్ తొలి రెండు టీ20ల్లో నెగ్గింది. -
ఇంగ్లండ్తో రెండో టీ20.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన అర్ష్దీప్
చెన్నై వేదికగా ఇంగ్లండ్తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ శనివారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్లో ఆధిక్యం పెంచుకోవాలని భారత జట్టు యోచిస్తోంది.అందుకు తగ్గట్టు తమ ఆస్త్రశాస్త్రాలను భారత్ సిద్దం చేసుకుంది. ఇక చెపాక్ టీ20కు ముందు భారత యువ పేసర్ అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh)ను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో అర్ష్దీప్ మరో మూడు వికెట్లు పడగొడితే.. టీ20ల్లో అత్యంతవేగంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న ఫాస్ట్బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. అర్ష్దీప్ ఇప్పటివరకు 61 మ్యాచ్లు ఆడి 97 వికెట్లు పడగొట్టాడు.ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ పేరిట ఉంది. రౌఫ్ 71 మ్యాచ్ల్లో వంద వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. చెపాక్ టీ20లో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీస్తే ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకుంటాడు. అర్ష్దీప్ ఉన్న ఫామ్లో రౌఫ్ రికార్డు బద్దలు అవ్వడం ఖాయం.తొలి టీ20లో కూడా ఈ పంజాబీ పేసర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా అర్ష్దీప్(97) రికార్డులకెక్కాడు.టీ20ల్లో అత్యంతవేగంగా 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లు వీరే..హ్యారీస్ రౌఫ్ - పాకిస్తాన్ (71 మ్యాచ్లు)మార్క్ అడైర్-ఐర్లాండ్(72 మ్యాచ్లు)బిలాల్ ఖాన్-ఒమన్(72 మ్యాచ్లు)షాహీన్షా అఫ్రిది- పాకిస్తాన్(74 మ్యాచ్లు)లసిత్ మలింగ-శ్రీలంక(76 మ్యాచ్లు)చదవండి: ముంబైను చిత్తు చేసిన జమ్మూ కాశ్మీర్.. అంతా రోహిత్ వల్లే? -
బుమ్రాకు నిరాశ.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న పాక్ బౌలర్
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు నిరాశ ఎదురైంది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (నవంబర్) అవార్డును పాక్ పేసర్ హరీస్ రౌఫ్ ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం హరీస్ రౌఫ్తో పాటు బుమ్రా, సౌతాఫ్రికా ఆల్రౌండర్ మార్కో జన్సెన్ పోటీపడ్డారు. అంతిమంగా అవార్డు హరీస్ రౌఫ్నే వరించింది. రౌఫ్ నవంబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రౌఫ్ ప్రదర్శనల కారణంగా రెండు దశాబ్దాల తర్వాత పాక్ ఆస్ట్రేలియాను వారి సొండగడ్డపై వన్డే సిరీస్లో ఓడించింది. ఆసీస్తో వన్డే సిరీస్లో రౌఫ్ ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో పాక్ ఆసీస్పై 2-1 తేడాతో గెలుపొందింది. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లోనూ రౌఫ్ సత్తా చాటాడు. పొట్టి ఫార్మాట్ సిరీస్లో రౌఫ్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ సిరీస్ తర్వాత జింబాబ్వే పర్యటనలోనూ రౌఫ్ రాణించాడు. ఈ సిరీస్లో రౌఫ్ 3 వికెట్లు తీశాడు. మొత్తంగా రౌఫ్ నవంబర్ నెలలో 18 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు.వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న డానీ వ్యాట్నవంబర్ నెలకు గానూ మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్కు చెందిన డానీ వ్యాట్ గెలుచుకుంది. నవంబర్ నెలలో సౌతాఫ్రికాపై అద్భుతమైన ప్రదర్శనల కారణంగా వ్యాట్ ఈ అవార్డు గెలుచుకుంది. ఈ సిరీస్లోని మూడు టీ20ల్లో వ్యాట్ 163.21 స్ట్రయిక్ రేట్తో 142 పరుగులు చేసింది. ఇదే సిరీస్లో వ్యాట్ టీ20ల్లో 3000 పరుగుల అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ అవార్డు కోసం వ్యాట్ షర్మిన్ అక్తెర్, నదినే డి క్లెర్క్లతో పోటీపడింది. -
ICC: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో జస్ప్రీత్ బుమ్రా
నవంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ గురువారం (డిసెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్లిస్ట్ చేసింది. ఈ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ స్పీడ్ స్టార్ హ్యారీస్ రవూఫ్, దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్కో జాన్సెన్ ఉన్నారు. వీరి ముగ్గురూ నవంబర్ మంత్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.జస్ప్రీత్ బుమ్రా..గత నెలలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బుమ్రా అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి మొత్తం 8 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు కివీస్తో సిరీస్ కోల్పోయినప్పటికి బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు బుమ్రా నామినేట్ అయ్యాడు.హ్యారీస్ రవూఫ్..ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో పాక్ స్పీడ్ స్టార్ హ్యారీస్ రవూఫ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. మూడు వన్డేల సిరీస్లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి సిరీస్ను పాక్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కంగారులతో జరిగిన టీ20 సిరీస్లో కూడా అతడు 5 వికెట్లు పడగొట్టాడు.మార్కో జాన్సెన్..భారత్తో జరిగిన టీ20 సిరీస్లో సఫారీ ఆల్రౌండర్ మార్కో జాన్సెన్ తన ఆల్రౌండ్ స్కిల్స్ను చూపించాడు. బ్యాట్తోనూ బంతితోనూ అదరగొట్టాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 11 వికెట్లు పడగొట్టి ప్రోటీస్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
ఐదేసిన స్పెన్సర్ జాన్సన్.. పాక్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో నెగ్గిన ఆసీస్.. ఇవాళ (నవంబర్ 16) జరిగిన రెండో మ్యాచ్లోనూ గెలుపొందింది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.SPENSER JOHNSON FIVE WICKET HAUL.- A terrific spell against Pakistan! 👌pic.twitter.com/W8J1lMp4Xl— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. జాన్సన్కు టీ20 కెరీర్లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత. మరో ఎండ్లో ఆడమ్ జంపా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. జంపా నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరో పేసర్ జేవియర్ బార్ట్లెట్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశాడు. బార్ట్లెట్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.పాక్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖాన్ 52 పరుగులతో టాప్ స్కోరర్గా నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్ (37 నాటౌట్), మొహమ్మద్ రిజ్వాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బాబర్ ఆజమ్ 3, ఫర్హాన్ 5, అఘా సల్మాన్ 0, అబ్బాస్ అఫ్రిది 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 0, సూఫియాన్ ముఖీమ్ 0, హరీస్ రౌఫ్ 2 పరుగులకు ఔటయ్యారు. ఈ గెలుపుతో ఆసీస్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 హోబర్ట్ వేదికగా నవంబర్ 18న జరుగుతుంది. -
చరిత్ర సృష్టించిన హరీస్ రౌఫ్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా షాదాబ్ ఖాన్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 16) జరుగుతున్న మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్ ఈ ఘనత సాధించాడు. రౌఫ్ తన 72 ఇన్నింగ్స్ల టీ20 కెరీర్లో 107 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ 96 ఇన్నింగ్స్ల్లో 107 వికెట్లు పడగొట్టాడు. పాక్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ తర్వాత షాహిద్ అఫ్రిది (97 వికెట్లు), షాహీన్ అఫ్రిది (96) ఉన్నారు. 2020లో టీ20 అరంగేట్రం చేసిన రౌఫ్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే పాక్ తరఫున లీడింగ్ వికెట్టేకర్గా అవతరించాడు.ఆసీస్తో మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్ మరో ఘనత కూడా సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు (4-0-22-4) నమోదు చేసిన విదేశీ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన నువాన్ కులశేఖర పేరిట ఉండేది. కులశేఖర 2017లో నాలుగు వికెట్లు తీసి 31 పరుగులిచ్చాడు. ఈ జాబితాలో రౌఫ్, కులశేఖర తర్వాత కృనాల్ పాండ్యా (4/36), క్రిస్ వోక్స్ (3/4), టిమ్ సౌథీ (3/6) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పాక్ గెలవాలంటే 12 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుపొందిన విషయం తెలిసిందే. -
నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన ఆస్ట్రేలియా
సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. హరీస్ రౌఫ్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. రౌఫ్ వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరో బౌలర్ అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. అబ్బాస్ కీలకమైన మాథ్యూ షార్ట్ వికెట్తో పాటు టెయిలెండర్ల వికెట్లు తీశాడు. స్పిన్నర్ సూఫియాన్ ముఖీమ్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ 20, జోస్ ఇంగ్లిస్ 0, మ్యాక్స్వెల్ 21, స్టోయినిస్ 14, టిమ్ డేవిడ్ 18, ఆరోన్ హార్డీ 28, జేవియర్ బార్ట్లెట్ 5, స్పెన్సర్ జాన్సన్ 0 పరుగులకు ఔటయ్యారు. నాథన్ ఇల్లిస్ 1, ఆడమ్ జంపా 0 పరుగులతో అజేయంగా నిలిచారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో గెలుపొందిన విషయం తెలిసిందే. 7 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా.. పాక్ 7 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్స్వెల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
AUS Vs PAK: ఏడేళ్ల తర్వాత పాక్ సాధించింది..!
ఆసీస్ గడ్డపై పాక్ ఏడేళ్ల తర్వాత తొలిసారి ఓ వన్డేలో విజయం సాధించింది. జనవరి 15, 2017లో పాక్ చివరిసారి ఆసీస్ను వారి సొంతగడ్డపై (మెల్బోర్న్) ఓ వన్డేలో ఓడించింది. 2854 రోజుల తర్వాత పాక్ తిరిగి ఆసీస్ను వారి సొంతగడ్డపై ఓడించింది. అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 8) జరిగిన మ్యాచ్లో పాక్ ఆసీస్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో పాక్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్లో హరీస్ రౌఫ్ (8-0-29-5).. ఆతర్వాత బ్యాటింగ్లో సైమ్ అయూబ్ (71 బంతుల్లో 82; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరికి తోడు మొహమ్మద్ రిజ్వాన్ వికెట్కీపింగ్లో చెలరేగాడు. రిజ్వాన్ ఈ మ్యాచ్లో ఏకంగా ఆరు క్యాచ్లు పట్టాడు. ఈ మ్యాచ్లో గెలుపుతో పాక్ మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో నవంబర్ 10న పెర్త్ వేదికగా జరుగనుంది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా హరీస్ రౌఫ్ (5/29), షాహీన్ అఫ్రిది (3/26), నసీం షా (1/65), మొహమ్మద్ హస్నైన్ (1/27) ధాటికి 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 26.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజతీయాలకు చేరింది. ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో (69 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపాకు ఓ వికెట్ దక్కింది. -
నిప్పులు చెరిగిన రౌఫ్.. ఆసీస్ను చిత్తుగా ఓడించిన పాక్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాలో 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. హరీస్ నిప్పులు చెరిగే బంతులలో ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. రౌఫ్ 8 ఓవర్లలో 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మరో ఎండ్ నుంచి ఫాహీన్ అఫ్రిది కూడా ఆసీస్ బ్యాటర్లపై అటాకింగ్ చేశాడు. అఫ్రిది 8 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పేసర్లు నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో పాక్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్లు పట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోరర్గా నిలువగా.. మాథ్యూ షార్ట్ 19, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ 13, జోష్ ఇంగ్లిస్ 18, లబూషేన్ 6, హార్డీ 14, మ్యాక్స్వెల్ 16, కమిన్స్ 13, స్టార్క్ 1, జంపా 18, హాజిల్వుడ్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. 26.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఓపెనర్ సైమ్ అయూబ్ మెరుపు హాఫ్ సెంచరీతో (71 బంతుల్లో 82; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అలరించగా.. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ (69 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు. బాబర్ ఆజమ్ 20 బంతుల్లో సిక్సర్ సాయంతో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే నవంబర్ 10న పెర్త్ వేదికగా జరుగనుంది. -
Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్.. కుప్పకూలిన ఆసీస్! ఇమ్రాన్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షాహిన్, రవూఫ్ దెబ్బకు కమిన్స్ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్ వేదికగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ షార్ట్(19), జేక్ ఫ్రేజర్ మెగర్క్(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్కు పంపాడు.ఐదు కీలక వికెట్లు అతడి సొంతంవన్డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్ అతడిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్ రవూఫ్ జోస్ ఇంగ్లిస్(18), మార్నస్ లబుషేన్(6), ఆరోన్ హార్డీ(14), గ్లెన్ మాక్స్వెల్(16), ప్యాట్ కమిన్స్(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. The man of the moment #AUSvPAK pic.twitter.com/t0UJ3iZJLh— cricket.com.au (@cricketcomau) November 8, 2024 మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్ స్టార్క్(1)ను షాహిన్ అవుట్ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్ చేసి పని పూర్తి చేశాడు.Vintage Smith 👌#AUSvPAK pic.twitter.com/PWKlbk4NgK— cricket.com.au (@cricketcomau) November 8, 2024 ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆసీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్తో రెండో వన్డేలో హ్యారిస్ రవూఫ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్ హస్నైన్ ఒక్కో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన హ్యారిస్ రవూఫ్.. పాక్ తరఫున తొలి పేసర్గాఆసీస్తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ పేసర్గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును రవూఫ్ బద్దలు కొట్టాడు.ఇక అడిలైడ్లో అంతకు ముందు స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్గా కొనసాగుతున్నాడు.అడిలైడ్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్ బౌలర్లుహ్యారిస్ రవూఫ్- 5/29*సక్లెయిన్ ముస్తాక్- 5/29ఇజాజ్ ఫాకిహ్- 4/43ఇమ్రాన్ ఖాన్-3/19షాహిన్ ఆఫ్రిది- 2/24.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
నా కుటుంబం జోలికి వస్తే ఇలాగే చేస్తా: పాక్ స్పీడ్స్టర్
పాకిస్తాన్ స్పీడ్స్టర్ హ్యారిస్ రవూఫ్ తనపై జరుగుతున్న ట్రోలింగ్ పట్ల స్పందించాడు. ఆటగాడిగా తనను విమర్శిస్తే పట్టించుకోనని.. అయితే.. తన కుటుంబం జోలికి వస్తే అస్సలు ఊరుకోనని స్పష్టం చేశాడు.ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయంతో కూడా తన సంబంధం ఉండదని.. తన స్పందన ఇలాగే ఉంటుందని రవూఫ్ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.గ్రూప్-ఏలో ఉన్న బాబర్ ఆజం బృందం తొలుత అమెరికా, టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లీగ్ మ్యాచ్లన్నీ అమెరికాలోనే ఆడిన పాక్.. సూపర్-8 రేసు నుంచి అప్పటికే అవుటై పోయింది.పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలుఈ క్రమంలో మాజీ క్రికెటర్లు సహా సొంత అభిమానులు సైతం పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులో ఐక్యత లేకుండా గ్రూపులు కట్టి.. సర్వనాశనం చేశారని మండిపడుతున్నారుఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్ తన భార్యతో కలిసి అమెరికా వీధుల్లో వెళ్తుండగా ఓ వ్యక్తి అతడిని విమర్శిస్తూ మాటల యుద్ధానికి దిగాడు. దీంతో రవూఫ్ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తూ.. అతడి పైకి దూసుకెళ్లాడు.భార్య వద్దని వారిస్తూనే ఉన్నా.. కోపాన్ని నియంత్రించుకోలేక సంమయనం కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్ తొలిసారిగా స్పందించాడు.నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంతవరకే‘‘సోషల్ మీడియా వరకు ఈ విషయం రావొద్దని అనుకున్నా. కానీ వీడియో ఎలాగో బయటకు వచ్చింది. కాబట్టి నేను స్పందించక తప్పడం లేదు.పబ్లిక్ ఫిగర్లుగా ఉన్న కారణంగా పబ్లిక్ నుంచి అన్ని రకాల ఫీడ్బ్యాక్ను మేము తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లే మమ్మల్ని సమర్థిస్తారు. ఒక్కోసారి విమర్శిస్తారు కూడా!కానీ.. నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంతవరకే నేను వాటన్నింటినీ భరిస్తాను. ఒకవేళ ఈ విషయంలో వాళ్లు హద్దు దాటితే నేను కూడా వారికి తగ్గట్లుగానే బదులిస్తాను.ప్రొఫెషన్లకు అతీతంగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది’’ అని హ్యారిస్ రవూఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో ఈ రైటార్మ్ పేసర్ ఏడు వికెట్లు తీశాడు.pic.twitter.com/KuUSZWoDaq— Haris Rauf (@HarisRauf14) June 18, 2024 -
T20 World Cup 2024: అభిమానిపైకి దూసుకెళ్లిన పాక్ పేసర్.. భార్య వారించినా..!
టీ20 వరల్డ్కప్ 2024లో పాక్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో పాక్.. భారత్, యూఎస్ఏ చేతుల్లో ఓటమిపాలై సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది. పాక్ కంటే మెరుగ్గా రాణించిన ఆతిథ్య దేశం యూఎస్ఏ.. భారత్తో పాటు సూపర్-8లోకి ప్రవేశించింది.ప్రస్తుత ప్రపంచకప్లో పాక్ పోరాటం ముగిసినా ఆ జట్టు ఇంకా స్వదేశానికి తిరుగు ముఖం పట్టలేదు. మరికొద్ది రోజుల పాటు పాక్ బృందం యూఎస్ఏలోనే గడపనున్నట్లు సమాచారం.A heated argument between Haris Rauf and a fan in the USA. pic.twitter.com/d2vt8guI1m— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2024అయితే ఈ మధ్యలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్కు చేదు అనుభవం ఎదురైంది. భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్ సైతం గట్టిగానే స్పందించాడు. తాను ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతని చెప్పులు సైతం జారిపోయినా పట్టించుకోలేదు. ఆ అభిమాని ఏమన్నాడో తెలియదు కానీ.. రౌఫ్ కోపంతో ఊగిపోయాడు. దారిన పోయేవారు.. సెక్యూరిటీ వారిండంతో రౌఫ్ ఆడిపోయాడు. ఈ లోపు రౌఫ్ను రెచ్చగొట్టిన అభిమాని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అభిమాని పట్ల రౌఫ్ ప్రవర్తన చూసి సొంత దేశ అభిమానులు కూడా అతన్ని అసహ్యించుకుంటున్నారు. రౌఫ్ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి వీధి రౌడీలా ప్రవర్తించాడని చివాట్లు పెడుతున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు సహజమేనని.. ఇలాంటి సందర్భాల్లో పరిణితి ప్రదర్శించి చూసీ చూడనట్లు వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖరారైన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి భారత్తో (A1) పాటు యూఎస్ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
T20 World Cup 2024: పాక్ పేసర్పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు
టీ20 వరల్డ్కప్ 2024లో పటిష్టమైన పాకిస్తాన్పై పసికూన యూఎస్ఏ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో యూఎస్ఏ పాక్పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించి చిరస్మరణీయ విజయం నమోదు చేసుకుంది. ఇరు జట్ల నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయగా.. సూపర్ ఓవర్లో యూఎస్ఏ మరింత అద్భుతంగా ఆడి పాక్ను మట్టికరిపించింది.యూఎస్ఏ ఆటగాళ్లు ఈ విజయాన్ని ఆస్వాధిస్తుండగానే ఆ దేశానికే చెందిన బౌలర్ (ప్రపంచకప్ జట్టులో సభ్యుడు కాడు) రస్టీ థెరాన్ పాక్ పేసర్ హరీస్ రౌఫ్పై సంచలన ఆరోపణలు చేశాడు. రౌఫ్ బాల్ టాంపరింగ్కు పాల్పడ్డాడని థెరాన్ ఆరోపించాడు. కేవలం రెండు ఓవర్లు వాడిన బంతిని రౌఫ్ వేళ్లతో రద్దుతూ (బంతిని పాతగా చేసే ఉద్దేశంతో) కనిపించాడని అన్నాడు. బంతి రివర్స్ స్వింగ్ అవుతున్నందుకు రౌఫ్ ఈ పనికి చేశాడని కామెంట్ చేశాడు.ఈ విషయాన్ని ఐసీసీ చూసీ చూడనట్లు వదిలేసిందని మండిపడ్డాడు. రౌఫ్ బాల్ టాంపరింగ్కు పాల్పడుతున్నట్లు టీవీల్లో స్పష్టంగా కనిపించిందని అన్నాడు. రౌఫ్పై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు థెరాన్ ట్వీట్ చేశాడు.38 ఏళ్ల థెరాన్ 2010 నుంచి 2019 వరకు సౌతాఫ్రికాకు ఆడాడు. ఆ తర్వాత ఆ దేశం తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వలస వచ్చాడు. 2019 సెప్టెంబర్ నుంచి థెరాన్ యూఎస్ఏ జట్టుకు ఆడుతున్నాడు. యూఎస్ఏ టీ20 వరల్డ్కప్ జట్టులో థెరాన్కు చోటు దక్కలేదు. థెరాన్ 2010-15 మధ్యలో వివిధ ప్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన థెరాన్ 10 ఐపీఎల్ మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. -
పాకిస్తాన్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు.. 48 ఏళ్ల వరల్డ్కప్ చరిత్రలోనే
పాకిస్తాన్ స్టార్ పేసర్ హ్యారీస్ రవూఫ్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్కప్ ఎడిషన్ లీగ్ స్టేజిలోలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా రవూఫ్ నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023లో కోల్కతా వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో రవూప్ ఈ చెత్త రికార్డును సాధించాడు. ఈ ఏడాది వరల్డ్కప్లో 9 మ్యాచ్లు ఆడిన రవూఫ్ ఏకంగా 533 పరుగులిచ్చి.. ఈ ఆ ప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ పేరిట ఉండేది. 2019 వరల్డ్కప్లో రషీద్ 11 మ్యాచ్ల్లో 526 పరుగులు సమర్పించుకున్నాడు. తాజా వరల్డ్కప్తో రషీద్ చెత్త రికార్డును రవూఫ్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో రవూఫ్ అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. రషీద్, శ్రీలంక పేసర్ మధుషంక మూడో స్ధానంలో కొనసాగుతున్నారు. మధుషంక కూడా ఈ వరల్డ్కప్లోనే 525 పరుగులిచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. జోరూట్(60), జానీ బెయిర్ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30), డేవిడ్ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 15) మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇఫ్తికర్ అహ్మద్కు ఒక వికెట్ దక్కింది. చదవండి: World Cup 2023: మిచెల్ మార్ష్ విధ్వంసకర శతకం.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం -
ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా?
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: భారత్లో వన్డే ప్రపంచకప్-2023.. రెండు వరుస విజయాలు.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు.. వెరసి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం.. ఇలాంటి దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో దురదృష్టం వెక్కిరించింది.. ‘చోకర్స్’ అన్న పేరున్న జట్టు చేతిలో ఘోర పరాభవానికి గురై సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే దుస్థితికి చేరుకుంది.. ఈ ఉపోద్ఘాతమంతా పాకిస్తాన్ జట్టు గురించే అని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆరంభ శూరత్వమే! వరల్డ్కప్-2023లో నెదర్లాండ్స్తో తొలి మ్యాచ్ ఆడిన బాబర్ ఆజం బృందం 81 పరుగులతో జయభేరి మోగించింది. అనంతరం మ్యాచ్లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత గెలుపు అన్న మాటనే మరిచిపోయింది. చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత.. పాకిస్తాన్ను వరుసగా పరాజయాలే పలకరించాయి. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా సైతం తమపై జయకేతనం ఎగురవేయడంతో బాబర్ బృందం సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. నువ్వా- నేనా.. నరాలు తెగే ఉత్కంఠ అయితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అటు పాకిస్తాన్ ఆటగాళ్లు.. తమపై పాక్ ఆధిపత్యాన్ని తగ్గించడం సహా టేబుల్ టాపర్గా నిలించేందుకు ఇటు సౌతాఫ్రికా ప్లేయర్లు పోరాడిన తీరు మాత్రం క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. పాక్ విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ జట్టు మరోసారి చోకర్స్ అనిపించుకోవడం ఖాయమంటూ విశ్లేషణలు ఓవైపు.. ఆఖరి వికెట్ తీసేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ డూ ఆర్ డై మ్యాచ్లో గెలిచి నిలుస్తుందా అన్న చర్చలు మరోవైపు.. చివరి వరకు హైడ్రామా.. పాక్ గెలుపు ఖాయమైందన్నంతగా ఆ మధ్యలో 46వ ఓవర్ ఆఖరి బంతికి పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్.. సఫారీ జట్టు టెయిలెండర్ తబ్రేజ్ షంసీని అవుట్ చేసినంత పనిచేశాడు. పాక్కు గెలుపు ఖాయమైపోయిందన్నంత నమ్మకంగా ఎల్బీకి అప్పీలు చేశాడు. అయితే అనుభవజ్ఞుడైన అంపైర్ అలెక్స్ వార్ఫ్ అదేమీ లేదన్నట్లు అడ్డంగా తలూపాడు. పాకిస్తాన్కు వేరే ఆప్షన్ లేదు. రవూఫ్ ఓవైపు.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మరోవైపు నమ్మకంగా చెప్పడంతో కెప్టెన్ బాబర్ ఆజం రివ్యూకు వెళ్లాడు. సఫారీల అదృష్టం బాగుంది కానీ.. షంసీ అదృష్టం బాగుంది. బంతి లెగ్ స్టంప్ను జస్ట్ అలా ముద్దాడినట్లుగా అనిపించింది గానీ మిస్ అయింది.. అంపైర్స్ కాల్ నాటౌట్ కావడంతో సౌతాఫ్రికాకు ఫేవర్గా ఫలితం వచ్చింది. అంతే.. పాక్ ఆటగాళ్లు ఒక్కసారిగా నీరుగారిపోయారు. రవూఫ్ అయితే ఏడ్చినంత పనిచేశాడు. రిజ్వాన్ సైతం ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చి రవూఫ్ను హత్తుకుని ‘ఎమోషనల్’ అయ్యాడు. పాకిస్తాన్ శిబిరం మొత్తం నిరాశలో కూరుకుపోయింది. ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లలో కొందరు పాక్ ఆటగాళ్లకు సానుభూతి తెలుపుతుండగా.. ‘‘ఓవరాక్షన్ రిజ్వాన్ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. కాగా పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కాస్త అతి చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ సమయంలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించే క్రమంలో మాటిమాటికి గట్టిగా అప్పీలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆటతో సంబంధంలేని విషయాల్లోనూ తలదూరుస్తూ ఉంటాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. మేము చోకర్స్ కాదు.. అర్థమైందా? ఇక చెన్నై మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో పాక్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ప్రొటిస్ ఇన్నింగ్స్లో 48వ ఓవర్ రెండో బంతికి కేశవ్ మహరాజ్ ఫోర్ బాది పాకిస్తాన్ ఓటమిని ఖరారు చేసి సౌతాఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’(అంతా బాగా ఆడి ఆఖరి నిమిషంలో చేతులెత్తేస్తారన్న అర్థంలో) అన్న ట్యాగ్ ఇకపై తమకు వాడొద్దనేలా సంకేతాలు ఇచ్చాడు. ఇక సఫారీల చేతిలో ఓటమితో పాక్ సెమీ ఫైనల్ ఆశలకు దాదాపు గండిపడినట్లే! చదవండి: Ind vs Aus: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ అతడే WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్
ICC WC 2023- Pak Vs SA- Babar Azam Comments On Loss: ‘విజయానికి అత్యంత చేరువగా వచ్చాం.. కానీ సరైన ముగింపు ఇవ్వలేకపోయాం. జట్టు మొత్తం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఆఖరి ఓవర్లలో మేము తిరిగి పుంజుకున్న తీరు.. కనబరిచిన పోరాట పటిమ అద్భుతం. కానీ ఇలా జరిగిపోయింది’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విచారం వ్యక్తం చేశాడు. అలా అయితే ఫలితం వేరేలా ఉండేది తాము మరో 10-15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్కప్-2023లో హ్యాట్రిక్ ఓటములతో డీలాపడిన పాకిస్తాన్.. శుక్రవారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ప్రొటిస్ టెయిలెండర్ కేశవ్ మహరాజ్ ఫోర్ బాదడంతో.. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ రేసులో ముందుకు వెళ్లాలనుకున్న పాకిస్తాన్కు భంగపాటు ఎదురైంది. అందుకే ఓడిపోయాం ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బాబర్ ఆజం.. తమ ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారని.. కానీ దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాబట్టలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. అతడు అవుట్ అయితే సెమీస్ రేసులో ఉండేవాళ్లం అదే విధంగా.. 46వ ఓవర్ ఆఖరి బంతికి సౌతాఫ్రికా టెయిలెండర్ తబ్రేజ్ షంసీ విషయంలో ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేసిన పాకిస్తాన్కు ప్రతికూల ఫలితం వచ్చిన విషయాన్ని బాబర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘డీఆర్ఎస్ ఆటలో భాగం. ఒకవేళ అతడిని అవుట్గా పరిగణించినట్లయితే.. ఫలితం మాకు అనుకూలంగా ఉండేది. సెమీస్ రేసులో నిలిచేందుకు మాకు అవకాశాలు ఉండేవి. కానీ అలా జరుగలేదు’’ అని అంపైర్ కాల్ వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి మూడు మ్యాచ్లలో బాగా ఆడి పాకిస్తాన్ను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్న బాబర్.. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో ఎక్కడి వరకు చేరుకుంటామో చూద్దామంటూ నిర్వేదంగా మాట్లాడాడు. హైడ్రామా.. కాగా పేసర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో షంసీ ఎల్బీడబ్ల్యూ అయినట్లు నమ్మకంగా ఉన్న పాకిస్తాన్కు అంపైర్స్ కాల్ షాకిచ్చిన విషయం తెలిసిందే. రవూఫ్ సంధించిన ఇన్స్వింగర్ లెగ్ స్టంప్స్ను తాకినట్లుగా అనిపించింది. అయితే, బాల్ ట్రాకింగ్లో తృటిలో మిస్ అయినట్లు కనిపించగా.. నాటౌట్గా పేర్కొన్న అంపైర్స్ కాల్ వల్ల సౌతాఫ్రికా బతికిపోయింది. మరుసటి రెండో ఓవర్ వరకు హైడ్రామా నడవగా కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికా విజయ లాంఛనం పూర్తి చేశాడు. పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లు: ►వేదిక: చెన్నై చెపాక్ స్టేడియం ►టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ ►పాక్ స్కోరు: 270 (46.4) ►సౌతాఫ్రికా స్కోరు: 271/9 (47.2) ►ఫలితం: ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తబ్రేజ్ షంసీ(4 వికెట్లు) చదవండి: WC 2023: అతడు లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి! గిల్ కూడా.. View this post on Instagram A post shared by ICC (@icc) -
మరీ చెత్తగా! బ్యాటర్లంతా అతడి వెంటే పడుతున్నారు: పాక్ బౌలర్పై సెటైర్లు
ICC ODI WC 2023: పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో వన్డే వరల్డ్కప్-2023 బరిలోకి దిగిన అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడని విమర్శించాడు. రవూఫ్ బౌలింగ్ అంటే చాలు బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో మరీ చెత్తగా బౌలింగ్ చేశాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121) విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు పాక్ బౌలర్ల పప్పులు ఉడకలేదు. వీరిద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించారు. ఇక ఈ మ్యాచ్లో పాక్ ఫాస్ట్బౌలర్ హ్యారిస్ రవూఫ్ 8 ఓవర్ల బౌలింగ్లో ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసినప్పటికీ వార్నర్- మార్ష్ ద్వయం కారణంగా అప్పటికే ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. వికెట్లు తీసి ఏం లాభం? ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో పాక్ 305 పరుగులకే కుప్పకూలడంతో 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘షాహిన్ ఆఫ్రిది 5 వికెట్లు తీయడంతో పాకిస్తాన్ తిరిగి పుంజుకోగలిగింది. హ్యారిస్ రవూఫ్ కూడా ఆఖర్లో వికెట్లు తీశాడు. బ్యాటర్లు అతడి వెంట పడి తరుముతున్నారు కానీ ఏం లాభం! ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ట్యాప్ విరిగి నీళ్లు పారినట్లుగా ఆసీస్ బ్యాటర్లు అతడి బౌలింగ్లో పరుగుల వరద పారించారు. రవూఫ్ బౌలింగ్లో చితక్కొట్టారు. ఇప్పటికే ఈ టోర్నీలో చాలా మంది బ్యాటరుల రవూఫ్ బౌలింగ్ను ఓ ఆటాడుకున్నారు. టెర్రర్ బౌలర్గా టోర్నమెంట్లో అడుగుపెట్టిర రవూఫ్ ఆ స్థాయికి తగ్గట్లు ప్రభావం చూపలేకపోతున్నాడు. బ్యాటర్లు అతడి వెంట పరిగెడుతూ పరుగులు సాధిస్తున్నట్లుగా అనిపిస్తోంది’’ అంటూ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్ను విమర్శించాడు. అయితే, తనదైన రోజు అతడు కచ్చితంగా ప్రభావం చూపుతాడని ఆకాశ్ చోప్రా పేర్కొనడం కొసమెరుపు. చదవండి: కోహ్లి సెంచరీ చేసిన తీరును తప్పుబట్టిన పుజారా! త్యాగం చేయాల్సింది.. View this post on Instagram A post shared by ICC (@icc) -
పాక్ స్టార్ పేసర్ ఓవరాక్షన్.. అయ్యర్పైకి బాల్ త్రో! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్, సిరాజ్, బుమ్రా, హార్దిక్, జడేజా తలా రెండు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ ఆజం(50),మహ్మద్ రిజ్వాన్(49) టాప్ స్కోరర్లగా నిలిచారు. రవూఫ్ ఓవరాక్షన్.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పేసర్ హ్యారీస్ రవూఫ్ ఓవరాక్షన్ చేశాడు. ఈ మ్యాచ్లో రవూఫ్కు తన తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ చుక్కలు చూపించాడు. టీమిండియా ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన రవూఫ్.. తన మొదటి ఓవర్లోనే 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో రవూఫ్ కాస్త అసహనానికి లోనయ్యాడు. ఈ క్రమంలో తన తదుపరి ఓవర్లో శ్రేయస్ అయ్యర్ ఓ బంతిని బౌలర్ దిశగా డిఫెన్స్ ఆడాడు. అయితే బంతిని అందుకున్న రవూఫ్.. శ్రేయస్పై త్రో చేశాడు. దీంతో ఒక్కసారిగా అయ్యర్ పక్కకు తప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: #Virat Kohli: రిజ్వాన్ ‘ఓవరాక్షన్’కు కోహ్లి రియాక్షన్ అదిరింది! ఇంకెంత సేపు.. చాలుగానీ.. pic.twitter.com/ISKrDbMJFt — Cricket Videos Only (@cricketvideos23) October 14, 2023 -
పాక్ స్టార్ బౌలర్ను కొట్టిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన తమ మొదటి మ్యాచ్లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. మహ్మద్ రిజ్వాన్(68), సౌధ్ షకీల్(68) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడటంతో 286 పరుగులు సాధించింది. అనంతరం బౌలింగ్లో హారీస్ రవూఫ్, హసన్ అలీ చెలరేగడంతో డచ్ జట్టు 205 పరుగులకు ఆలౌటైంది. రవూఫ్ను కొట్టిన బాబర్.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరదగా పేసర్ హ్యారీస్ రవూఫ్ చెంపపై కొట్టాడు. రవూఫ్ తన ఓవర్ వేసేందుకు సిద్దమవుతుండగా బాబర్ ఏదో చెప్పడానికి వెళ్లి నవ్వుతూ చెంపపై టచ్ చేశాడు. దీంతో రవూఫ్ కూడా నవ్వుతూ ఎదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో రవూఫ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 9 ఓవర్లలో 43 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. చదవండి: థాంక్యూ హైదరాబాద్.. చాలా సంతోషంగా ఉంది! క్రెడిట్ మొత్తం వాళ్లకే: బాబర్ pic.twitter.com/R2yqeleKPj — cricbaaz2 (@cricbaaz2) October 6, 2023 -
'వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని! ఎన్నో కష్టాలు'
హారీస్ రవూఫ్.. ప్రస్తుత పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. తన పేస్ బౌలింగ్తో ప్యత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలిగే సత్తా ఉన్న స్పీడ్ స్టార్. 2020లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రవూఫ్.. వరల్డ్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రవూఫ్ ఈ స్ధాయికి ఎదగడం వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. చదువుకునే రోజుల్లో కనీసం ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బులు లేకపోయేవి అంట. ఈ విషయాలను అతడే స్వయంగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. "పదో తరగతి తర్వాత నేను ఇంటర్మీడియట్లో చేరాను. కానీ మా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడేవాళ్లు. దీంతో నా ఫీజు చెల్లించడానికి ప్రతీ ఆదివారం మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని. వారంలో మిగిలిన రోజుల్లో క్లాస్లకు హాజరయ్యేవాడిని. ఆ తర్వాత నేను యూనివర్శిటీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఫీజులు చాలా ఎక్కువగా ఉండేవి. మా నాన్నతో పాటు నేను కూడా ఆ ఫీజులను భరించలేకపోయాను. ఈ సమయంలో టేప్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాను. నాకు బాగా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులతో యూనివర్శిటీ ఫీజు కట్టేవాడిని. పాకిస్తాన్లో టేప్-బాల్ క్రికెట్ ఆడే ఆటగాళ్లు బాగా సంపాదిస్తారు. నెలకు దాదాపు 2 నుంచి 3 లక్షలవరకు సంపాదించవచ్చు. నేను నా ఫీజు కట్టగా.. మిగిలిన డబ్బులను మా అమ్మకు ఇచ్చేవాడిని. నేను ఈ స్ధాయికి చేరుకోవడం వెనక మా అమ్మనాన్న కష్టం కూడా ఉంది. మాది ఉమ్మడి కుటంబం. మొత్తం మా నాన్నకు నలుగురు అన్నదమ్ములు. అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. దీంతో చోటు సరిపోక కొన్ని రోజుల పాటు వంటగదిలో నిద్రపోయేవాళ్లం. నా చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించాను”అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవూఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: IND vs NEP: 23 పరుగుల తేడాతో ఘన విజయం.. సెమీస్కు చేరిన టీమిండియా -
Asia Cup 2023: పాకిస్తాన్కు బ్యాడ్ న్యూస్
ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకతో రేపు (సెప్టెంబర్ 14) జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. టీమిండియాతో సూపర్-4 మ్యాచ్ సందర్భంగా గాయపడిన ఆ దేశ స్టార్ పేసర్ నసీం షా ఆసియా కప్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇవాళ (సెప్టెంబర్ 13) అధికారికంగా ప్రకటించింది. నసీం షా గాయం (భుజం) తీవ్రత అధికంగా ఉండటంతో, త్వరలో జరుగనున్న వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని అతనికి పూర్తి విశ్రాంతినిచ్చినట్లు పీసీబీ పేర్కొంది. నసీం షా స్థానాన్ని జమాన్ ఖాన్తో రీప్లేస్ చేస్తున్నట్లు వెల్లడించింది. జమాన్ ఇప్పటికే జట్టులో చేరిపోయాడని, ట్రైనింగ్లో కూడా పాల్గొంటున్నాడని తెలిపింది. నసీం షా జట్టును వీడినప్పటికీ, అతను నిరంతరం పీసీబీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని, ప్రపంచకప్ సమయానికంతా అతను పూర్తి ఫిట్నెస్ట్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు భారత్తో సూపర్-4 మ్యాచ్ సందర్భంగానే గాయపడిన మరో పేసర్ హరీస్ రౌఫ్పై పీసీబీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పీసీబీ డాక్టర్లు నసీం, రౌఫ్లు ఇద్దరు తమ పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు కాని, రౌఫ్ గురించి ప్రత్యేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో రౌఫ్ గాయం నుంచి కోలుకున్నాడని తెలుస్తుంది. నసీంతో పోలిస్తే రౌఫ్ గాయం తేలికపాటిదని, అతను పూర్తిగా రికవర్ అయ్యాడని సమాచారం. తొలుత పీసీబీ రౌఫ్కు కూడా రీప్లేస్మెంట్ను ప్రకటించాలని భావించినప్పటికీ, అతను వేగంగా కోలుకోవడంతో ఆ అవసరం లేదని భావించినట్లు తెలుస్తుంది. రౌఫ్ రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉంటాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి నసీం షా ఒక్కడే గాయం కారణంగా పాక్ జట్టును వీడాడు. కాగా, భారత్తో మ్యాచ్ తర్వాత గాయపడిన రౌఫ్కు రీప్లేస్మెంట్గా షానవాజ్ దహానిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023లో పాక్ భవితవ్యం రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరిగే మ్యాచ్తో తేలిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో పాక్ ఓడినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా ఆ జట్టు ఫైనల్కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తే మాత్రం సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో భారత్తో తలపడుతుంది. -
ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు బిగ్షాక్.. ఇక కష్టమే మరి!
ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 228 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే పాకిస్తాన్కు మరో బిగ్షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీం షా గాయం కారణంగా ఆసియాకప్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు సమాచారం. భారత్తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్చేస్తుండగా వీరిద్దరూ గాయపడ్డారు. దీంతో రవూఫ్ పూర్తిగా రిజర్వ్డే రోజు మైదానం అడుగుపెట్టకపోగా.. నసీం షా బ్యాటింగ్కు రాలేదు. మరోవైపు వీరిద్దరూ బ్యాకప్గా యువ పేసర్లు షానవాజ్ దహానీ,జమాన్ ఖాన్లకు పాకిస్తాన్ క్రికెట్ పిలుపునిచ్చింది. వీరిద్దరూ మంగళవారం పాక్ జట్టుతో కలవనున్నారు. "హారీస్ రవూఫ్, నసీం షా ఇద్దరూ మా మెడికల్ ప్యానెల్ పరిశీలనలో ఉంటారు. వారి గాయాలు అంత తీవ్రమైనవి కావు. కానీ వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా వారిద్దరి ఆడించి రిస్క్ చేయకూడదని అనుకుంటున్నాము. ఈ నేపథ్యంలో షానవాజ్ దహానీ,జమాన్ ఖాన్లకు సిద్దంగా ఉండమని సమాచారమిచ్చాం. ఒక వేళ వీరిద్దరిని భర్తీ చేయాలని అనుకుంటే ఏసీసీ టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకుంటామని" పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో సెప్టెంబర్ 14న శ్రీలంకతో తలపడనుంది. చదవండి: అతడికి 5 నిమిషాల ముందు చెప్పాం.. కానీ! వాళ్లందరికీ చాలా థ్యాంక్స్: రోహిత్ -
Asia Cup 2023: పాకిస్తాన్కు భారీ షాక్! స్టార్ ప్లేయర్ దూరం.. కారణమిదే
Asia Cup 2023- Pakistan vs India: టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హ్యారిస్ రవూఫ్ రిజర్వ్ డే బౌలింగ్కు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ధ్రువీకరించాడు. కాగా ఆసియా కప్-2023లో భారత్- పాకిస్తాన్ తొలిసారి ఎదురుపడిన సందర్భంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైపోయింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని పల్లెకెల్లెలో జరిగిన గ్రూప్ మ్యాచ్లో దాయాదుల పోరు పూర్తి కాకుండానే అర్ధంతరంగా ముగిసిపోవడంతో చెరో పాయింట్ లభించింది. మరోసారి వర్షం ఆటంకం ఈ నేపథ్యంలో గ్రూప్-ఏలో అప్పటికే నేపాల్పై విజయంతో ఉన్న పాకిస్తాన్ సూపర్-4లో అడుగుపెట్టగా.. తమ రెండో మ్యాచ్లో నేపాల్ను చిత్తు చేసి రోహిత్ సేన సైతం అర్హత సాధించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆదివారం(సెప్టెంబరు 10) టీమిండియా- పాకిస్తాన్ మరోసారి పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బాబర్ ఆజం బృందం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ దిగిన భారత జట్టుకు ఓపెనర్లు.. కెప్టెన్ రోహిత్ రోహిత్ శర్మ(56), శుబ్మన్ గిల్(58) హాఫ్ సెంచరీలతో శుభారంభం అందించారు. వాళ్లకు చెరో వికెట్ అయితే, కొలంబోలో జరుగుతున్న ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో రిజర్వ్ డే ఉన్న కారణంగా ఆదివారం ఆటను నిలిపివేశారు. అప్పటికి.. 24.1 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా మళ్లీ వరుణుడు అడ్డుపడటంతో ఆలస్యమైంది. ఇక సెప్టెంబరు 10న ఆట రద్దు చేసే సమయానికి పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది, ఆల్రౌండర్ షాబాద్ ఖాన్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. హ్యారిస్ రవూఫ్ అవుట్.. కారణమిదే ఇక 5 ఓవర్ల బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చిన ఫాస్ట్బౌలర్ హ్యారిస్ రవూఫ్నకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ క్రమంలో రిజర్వ్ డే అయిన సోమవారం అతడు పూర్తిగా బౌలింగ్కు దూరంగా ఉండనున్నాడు. వరల్డ్కప్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విషయం గురించి మోర్నీ మోర్కెల్ స్పందిస్తూ.. అజీర్తి, కడుపులో మంట కారణంగా రవూఫ్ పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అతడిని ఈ మ్యాచ్కు దూరం ఉంచుతున్నట్లు తెలిపాడు. అదే సమయంలో ఇతర బౌలర్లను కూడా పరీక్షించే అవకాశం దొరుకుతుందని పాక్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో గత మ్యాచ్లో హ్యారిస్ రవూఫ్ మూడు వికెట్లతో రాణించాడు. చదవండి: Asia Cup: కొలంబోలో ఎడతెగని వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం! ఇక.. -
IND Vs. PAK: ఇది ఆరంభం మాత్రమే.. మున్ముందు: షాహిన్ ఆఫ్రిది వార్నింగ్!
Shaheen Afridi Ahead of Indo-Pak Asia Cup 2023 Clash: ‘‘టీమిండియాతో ప్రతి మ్యాచ్ దేనికదే ప్రత్యేకం. అభిమానులకు ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే పండుగే! నేను కూడా అండర్-16 క్రికెట్ మొదలుపెట్టక ముందు మిగతా ఫ్యాన్స్లాగే మ్యాచ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడిని. ఇప్పటి వరకు టీమిండియాతో నా బెస్ట్ స్పెల్ ఇదీ అని స్పెషల్గా చెప్పలేను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు సాధించాల్సింది.. అత్యుత్తమంగా చేసి చూపాల్సింది చాలా ఉంది’’ అని పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది అన్నాడు. టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చి కాగా 2018లో పాకిస్తాన్ తరఫున 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన షాహిన్ ఆఫ్రిది.. అద్భుత బౌలింగ్తో అందరి దృష్టిని ఆకర్షించారు. అనతికాలంలో జట్టులో కీలక సభ్యుడిగా మారి.. ప్రస్తుతం ప్రధాన పేసర్ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 252 వికెట్లు పడగొట్టిన షాహిన్ ఆఫ్రిది.. ఆసియా కప్-2023తో బిజీగా ఉన్నాడు. టీమిండియాతో సెప్టెంబరు 2 నాటి మ్యాచ్లో 4 వికెట్లు తీసిన ఆఫ్రిది తదుపరి ఆదివారం మరోసారి భారత్తో మ్యాచ్లో మెరవాలనే పట్టుదలతో ఉన్నాడు. అదే మా విజయాలకు కారణం ఈ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు ఏడు వికెట్లు పడగొట్టిన షాహిన్.. సహచర పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్లతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో మేము పోషించాల్సిన పాత్రలేంటో మాకు తెలుసు. కొత్త, పాత బంతితో ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా అవగాహన ఉంది. హ్యారిస్ తన వైవిధ్యమైన పేస్తో ప్రభావితం చేయగలడు. ఇక నసీం, నేను ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తాం. మా మధ్య ఉన్న సమన్వయమే మా విజయాలకు కారణం’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా కొలంబోలో ఆదివారం.. సూపర్-4 దశలో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డే కేటాయించారు. చదవండి: ఆ సిరీస్ నాటికి అందుబాటులోకి పంత్?; అలాంటి బ్యాటర్ కావాలి: రోహిత్ రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్ ఆఫ్రిది.. ఆరోజే బరాత్! -
Asia cup 2023: చెలరేగిన పాకిస్తాన్ బౌలర్లు.. కుప్పకూలిన బంగ్లాదేశ్
ఆసియాకప్-2023లో పాకిస్తాన్ పేసర్లు మరోసారి నిప్పులు చేరిగారు. ఈ మెగా టోర్నీ సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్కు పాకిస్తాన్ పేస్ త్రయం అఫ్రిది, హారీస్ రౌఫ్, నసీం షా చుక్కలు చూపించారు. వీరిముగ్గురు దాటికి బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరగులకే కుప్పకూలింది. హారీస్ రౌఫ్, నసీం షా తలా మూడు వికెట్లతో బంగ్లాను దెబ్బతీయగా.. అఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, అష్రఫ్ చెరో వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్(64) పరుగులతో టాప్స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ షకీబ్ అల్హసన్(53) పరుగులతో రాణించాడు. కాగా అంతకుముందు ఈ పేస్ త్రయం భారత్తో మ్యాచ్లో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: WC 2023: జింబాబ్వేపై ఆడాడని వరల్డ్కప్కు సెలక్ట్ చేశారా? జట్టులో దండుగ అతడు -
పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో అతృతగా ఎదురుచూసిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లింది. ఆసియాకప్-2023లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం కురవడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలవ్వలేదు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ని రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్లకి చెరో పాయింట్ దక్కింది. దీంతో సూపర్-4కు గ్రూపు-ఏ నుంచి పాకిస్తాన్ అర్హత సాధించింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ను ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కిషన్ 82 పరుగులు చేయగా.. హార్దిక్ 87 పరుగులతో అదరగొట్టాడు. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. హారీస్ రవూఫ్, నషీం షా తలా మూడు వికెట్లు సాధించారు. హారీస్ రవూఫ్ ఓవరాక్షన్.. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ స్టార్ పేసర్ హారీస్ రవూఫ్ ఓవరాక్షన్ చేశాడు. ఇషాన్ కిషన్న్ను ఔట్ చేసిన తర్వాత రౌఫ్ చేసిన సెలబ్రేషన్స్ శృతి మించాయి. భారత ఇన్నింగ్స్ 38వ ఓవర్ వేసిన రవూఫ్ బౌలింగ్లో కిషన్ భారీ షాట్కు ప్రయత్నించి బాబర్కు క్యాచి ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే రవూఫ్.. కిషన్ వైపు వేలు చూపిస్తూ ఇక చాలు వెళ్లు వెళ్లు అంటూ సైగలు చేశాడు. అయితే కిషన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుపోయినప్పటికీ.. మరో ఎండ్లో ఉన్న హార్దిక్ మాత్రం సీరియస్గా తీసుకున్నాడు. రవూఫ్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది బ్యాట్తో సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. pic.twitter.com/n01RoPaDgb — Nihari Korma (@NihariVsKorma) September 3, 2023 -
Asia Cup 2023 IND VS PAK: చరిత్ర సృష్టించిన పాక్ పేసర్లు
ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్లో పాక్ పేస్ త్రయం (షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్) చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) చరిత్రలో 10కి 10 వికెట్లు (ఓ మ్యాచ్లో) తీసిన తొలి పేస్ బౌలింగ్ అటాక్గా రికార్డుల్లోకెక్కింది. ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో ఓ ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు పేసర్లే తీయడం ఇదే మొదటిసారి. 39 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ పేసర్లే మొత్తం 10 వికెట్లు తీసింది లేదు. కాగా, నేటి మ్యాచ్లో పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (10-2-35-4), నసీం షా (8.5-0-36-3), హరీస్ రౌఫ్ (9-0-58-3) టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ త్రయం భారత బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. టీమిండియాపై ఈ ముగ్గురు స్పష్టమైన ఆధిపత్యం కనబర్చారు. ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్) ఆదుకోకపోయుంటే భారత పరిస్థితి దారుణంగా ఉండేది. ఇషాన్, హార్దిక్లతో పాటు ఆఖర్లో బుమ్రా కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ 266 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్ ముగిసాక వర్షం మొదలుకావడంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభంకాలేదు. వర్షం కారణంగా మ్యాచ్ను కుదించాల్సి వస్తే 40 ఓవర్లలో 239 పరుగులు, 30 ఓవర్లలో 203, 20 ఓవర్లకు 155 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఛేదించాల్సి ఉంటుంది. -
కొనసాగుతున్న గిల్ వైఫల్యాల పరంపర.. ఏకి పారేస్తున్న అభిమానులు
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. గతకొంతకాలంగా చెత్త ప్రదర్శనలతో అభిమానులకు విసుగు తెప్పిస్తున్న గిల్.. తాజాగా పాక్తో జరుగుతున్న కీలక సమరంలో మరోసారి ఘోరంగా విఫలమై, భారత అభిమానులకు టార్గెట్గా మారాడు. నెటిజన్లు గిల్ను ఏకి పారేస్తున్నారు. గిల్ను జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. Shubman Gill is very scared of Naseem Today😂🤦♂️.#PAKvIND #INDvPAK #pakvsind #INDvsPAK pic.twitter.com/YGF81raK3a — F A ح A D.. 🖤 (@Ziddi_bOy_) September 2, 2023 గిల్ కేవలం ఐపీఎల్కు మాత్రమే పనికొస్తాడని, ఇంటర్నేషనల్ క్రికెట్లో అతనికి అంత సీన్ లేదని విమర్శిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో గత 17 ఇన్నింగ్స్ల్లో (20, 0, 37, 13, 18, 6, 10, 29, 7, 34, 85, 3, 7, 6, 77, 9, 10 (పాక్తో మ్యాచ్లో)) అతను కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే చేశాడని, ఈ మాత్రం దానికి అతనికి వరుస అవకాశాలు ఇవ్వడం ఎందుకుని సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు. గిల్ను తప్పిస్తే తుది జట్టు కూర్పు కూడా సెట్ అవుతుందని.. రోహిత్కు జతగా ఇషాన్ కిషన్ను ఓపెనర్గా పంపవచ్చని అంటున్నారు. 147kph thunderbolt from Haris Rauf cleans up Shubman Gill 🚀 pic.twitter.com/Y7Oovl6uYD — CricTracker (@Cricketracker) September 2, 2023 పాక్తో జరుగుతున్న మ్యాచ్లో గిల్ బ్యాటింగ్ లోపాలు స్పష్టంగా బయటపడ్డాయని, అతను పాక్ పేసర్లను ఎదుర్కోలేక నానా ఇబ్బందులు పడ్డాడని అంటున్నారు. ముఖ్యంగా నేటి మ్యాచ్లో నసీం షాను ఎదుర్కొనేందుకు గిల్ చాలా బయపడ్డాడని, ఇది అతని ముఖంలో స్పష్టంగా కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గిల్ పాక్తో జరుగుతున్న మ్యాచ్లో 32 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు చేసి హరీస్ రౌఫ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో గిల్ పాక్ పేసర్లు సంధించిన బంతులను ఎదుర్కోలేక చేతులెత్తేశాడు. 🎯 Rohit Sharma - Clean-bowled by Shaheen Afridi 🎯 Virat Kohli - Bowled by Shaheen Afridi 🎯 Shubman Gill - Castled by Haris Rauf India's top-order was dismissed in a similar fashion.#INDvPAK pic.twitter.com/9YL2dD6H3K — CricTracker (@Cricketracker) September 2, 2023 ఇదిలా ఉంటే, పాక్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఎదురీదుతుంది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఇషాన్ కిషన్ (54), హార్ధిక్ పాండ్యా (37) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 29 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 147/4గా ఉంది. రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లి (4)లను అఫ్రిది క్లీన్ బౌల్డ్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (14), శుభ్మన్ గిల్లను (10) హరీస్ రౌఫ్ పెవిలియన్కు పంపాడు. -
పాక్ పేసర్ల విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా టాపార్డర్
ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. పాక్ పేసర్ల ధాటికి వణికిపోతుంది. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో భారత టాపార్డర్ 66 పరుగులకే కుప్పకూలింది. తొలుత షాహీన్ అఫ్రిది భారత టాపార్డర్ బ్యాటర్ల భరతం పట్టగా.. తర్వాత హరీస్ రౌఫ్ టీమిండియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. SHAHEEN SHAH AFRIDI! Rohit Sharma is clean bowled 🎯#ShaheenShahAfridi #INDvsPAK #INDvPAK #PAKvIND #AsiaCup23 #AsiaCup #RohitSharma pic.twitter.com/MNBGY2ywza — Haqeeq Ahmed (@eyemHaqeeq) September 2, 2023 అఫ్రిది.. ఐదో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మను (11), ఏడో ఓవర్ మూడో బంతికి విరాట్ కోహ్లి (4) క్లీన్ బౌల్డ్ చేయగా.. హరీస్ రౌఫ్.. 10వ ఓవర్ ఆఖరి బంతికి శ్రేయస్ అయ్యర్ను (14), 15వ ఓవర్ తొలి బంతికి శుభ్మన్ గిల్ను (10) ఔట్ చేశాడు. దీంతో భారత్ 14.1 ఓవర్లలో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి టాప్-4 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా టాప్-3 బ్యాటర్లు అఫ్రిది, రౌఫ్ల చేతుల్లో క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. Shaheen Afridi has Rohit Sharma AND Virat Kohli. Castles them both. There is absolutely no doubt about it. Best in the WORLD! 🔥🔥🔥 #PAKvIND #INDvsPAK #AsiaCup #AsiaCup23 #ShaheenAfridi #ViratKohli #RohitSharma pic.twitter.com/wk4YUVCoig — King Babar Azam Army (@kingbabararmy) September 2, 2023 శ్రేయస్ అయ్యర్ (14).. రౌఫ్ బౌలింగ్లో ఫకర్ జమాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/4గా ఉంది. ఇషాన్ కిషన్ (28), హార్దిక్ పాండ్యా (7) క్రీజ్లో ఉన్నారు. అఫ్రిది 5 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. రౌఫ్ 5 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. Haris Rauf claims his first wicket and India loses three wickets inside 50 runs. 📸: Disney + Hotstar pic.twitter.com/KJbPCSt0QD — CricTracker (@Cricketracker) September 2, 2023 147kph thunderbolt from Haris Rauf cleans up Shubman Gill 🚀 pic.twitter.com/Y7Oovl6uYD — CricTracker (@Cricketracker) September 2, 2023 Shreyas Iyer's bat broken on Haris Rauf's delivery. pic.twitter.com/CWs68vOGgC — Mufaddal Vohra (@mufaddal_vohra) September 2, 2023 -
పాక్ స్టార్ బౌలర్ను కలిసిన విరాట్ కోహ్లి.. టీ20 ప్రపంచకప్ రిపీట్ అవుతుందా?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు సమయం అసన్నమైది. శనివారం క్యాండీ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని భారత్ భావిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం టీమిండియాను ఓడించి ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి. 2019 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డేలో ముఖాముఖి తలపడడం ఇదే తొలిసారి. కాబట్టి ఎవరూ పై చేయి సాధిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హారిస్ రవూఫ్ను కలిసిన విరాట్ కోహ్లి.. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు రెండు రోజులు ముందే క్యాండీకి చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, పాక్ పేసర్ హారిస్ రవూఫ్ కాసేపు ముచ్చటించారు. ఇందకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోహ్లి-హారిస్ రవూఫ్ అంటే అందరికి గుర్తుచ్చేది టీ20 ప్రపంచకప్-2022. ఈ మెగా టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్లో రవూఫ్కు కోహ్లి చుక్కలు చూపించాడు. అతడి వేసిన 19 ఓవర్లో వరుసగా రెండు అద్భుతమైన సిక్స్లు బాదిన విరాట్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ముఖ్యంగా అతని తలమీదుగా విరాట్ కొట్టిన సిక్సర్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే మరోసారి భారత్-పాక్ తలపడతుండంతో ప్రపంచకప్ను రిపీట్ చేయాలని కింగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్తో జాగ్రత్త.. ఒకప్పటిలా లేదు! కొంచెం తేడా జరిగినా చాలు Moment of the day. Virat Kohli meets Haris Rauf ahead of the Asia Cup. [Star Sports] pic.twitter.com/WDnZVIo1kp — Johns. (@CricCrazyJohns) September 1, 2023 -
మా దగ్గర షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ లేరు.. అదే ప్లస్: రోహిత్ శర్మ
మీడియా సమావేశంలో చిరాకు తెప్పించే ప్రశ్నలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ ఉంటాడు. గతంలో విరాట్ కోహ్లితో విభేదాలు, మేజర్ ఈవెంట్లలో భారత జట్టు చేతులెత్తేయడం గురించి ప్రశ్నించిన వారితో పాటు.. బయటివాళ్ల మాటలు తమకు పట్టవంటూ విమర్శకులకూ గట్టిగానే బదులిచ్చాడు. తాజాగా మరోసారి హిట్మ్యాన్కు ఇలాంటి పరిస్థితే ఎదురుకాగా.. మాటల ‘బౌన్సర్’ సంధించాడు. ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో టీమిండియా తమ తొలి మ్యాచ్లో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్కు అభిమానుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాలతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం దాయాదుల పోరు కోసం ఎదురుచూస్తుందనడం అతిశయోక్తి కాదు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే.. పాకిస్తాన్కు తమ పేస్ దళమే ప్రధాన బలం. కాబట్టి ఎప్పటిలాగే ఈసారి కూడా భారత బ్యాటింగ్- పాక్ బౌలింగ్ మధ్య హోరాహోరీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా శనివారం ఈ హైపర్ టెన్షన్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు సారథి రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాక్ పేస్ త్రయాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నెట్స్లో షాహిన్ ఆఫ్రిది, నసీం షా లేదంటే హ్యారిస్ రవూఫ్.. వీరిలో ఎవరూ కూడా మాకు బౌలింగ్ చేయలేదు కదా! మా బౌలర్లతోనే మేము ప్రాక్టీస్ చేస్తాం. మా దగ్గర నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. రేపటి మ్యాచ్లో కేవలం మా అనుభవమే అక్కరకు వస్తుంది’’ అని రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాక తమకు సానుకూలాంశంగా మారిందన్న హిట్మ్యాన్.. ‘‘ప్రస్తుతం మా జట్టులో ఆరుగురు గొప్ప బౌలర్లు అందుబాటులో ఉన్నారు. ఐర్లాండ్ పర్యటనతో పునరాగమనం చేసిన బుమ్రా పూర్తి ఫిట్గా కనిపిస్తున్నాడు. బెంగళూరు ట్రెయినింగ్ క్యాంపులోనూ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ముగ్గురు పేసర్లూ ఫిట్గా ఉండటం కలిసి వస్తుంది. మాకు ఇది గొప్ప సానుకూల అంశం’’ అని చెప్పుకొచ్చాడు. బుమ్రాతో పాటు షమీ, సిరాజ్లు కూడా రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. -
ఆ ముగ్గురితో జాగ్రత్త.. రోహిత్ ఆ విషయం గుర్తు పెట్టుకో: ఆసీస్ దిగ్గజం వార్నింగ్
Asia Cup 2023- India Vs Pakistan: ఆసియా కప్-2023 టోర్నీలో తమ తొలి మ్యాచ్లో టీమిండియా తప్పక విజయం సాధిస్తుందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హెడెన్ అన్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి రోహిత్ సేన శుభారంభం చేస్తుందని పేర్కొన్నాడు. అయితే, పాక్ పేస్ దళం వ్యూహాలను భారత బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోవాలని.. లేదంటే చేదు అనుభవం తప్పదని హెడెన్ హెచ్చరించాడు. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో శనివారం టీమిండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగమైన నేపాల్పై ఘన విజయంతో ఆధిక్యంలో ఉన్న పాక్ తదుపరి మ్యాచ్లో దాయాదిని ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్లో భాగంగా మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భూగ్రహం మీద అత్యంత ఆసక్తికర మ్యాచ్ ‘‘భూగ్రహం మీద అత్యంత ఆసక్తికర మ్యాచ్ అనడంలో సందేహం లేదు. అయితే, పాకిస్తాన్ పేస్త్రయం విషయంలో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఉండాలి. షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా.. భిన్న రకాల, వైవిధ్యం కలిగిన బౌలర్లు. రవూఫ్ తక్కువేమీ కాదు భారత బ్యాటర్ల కోసం ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుని ఉంటారు. క్యాండీలో బౌన్సీ వికెట్కు ఆస్కారం ఉంది. కాబట్టి పేసర్ల విషయంలో ముఖ్యంగా రవూఫ్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఒక్కసారి పట్టు దొరికితే భారత బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేయగల సత్తా అతడికి ఉంది. ఆఫ్రిది విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఇక షాహిన్ ఆఫ్రిది.. గత వరల్డ్కప్ సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే! షాహిన్ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అద్భుత బంతితో అవుట్ చేసిన తీరు ఎవరూ మర్చిపోలేరు. అయితే, క్లాసిక్ బ్యాటర్లు గెలిపించగలరు కాబట్టి ఈసారి షాహిన్ ఆఫ్రిది ఎదుర్కొనేటపుడు రోహిత్ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అతడి బౌలింగ్లో మొదటి మూడు ఓవర్లలో ఆచితూచి ఆడాల్సి ఉంటుంది’’ అని మాథ్యూ హెడెన్ టీమిండియాకు సలహా ఇచ్చాడు. అయితే, పటిష్ట టీమిండియా బ్యాటర్లు పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచగలరని.. తద్వారా జట్టుకు విజయం అందించగలరని అభిప్రాయపడ్డాడు. నాడు ఘోర ఓటమి.. కాగా టీ20 వరల్డ్కప్-2021లో షాహిన్ ఆఫ్రిది.. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(3), రోహిత్ శర్మ(0)ల వికెట్లు తీసి ఆరంభంలోనే టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. వన్డౌన్ బ్యాటర్, టాప్ స్కోరర్ విరాట్ కోహ్లి (57) వికెట్ కూడా అతడే దక్కించుకున్నాడు. నాటి మ్యాచ్లో భారత జట్టు కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. చదవండి: పాకిస్తాన్దే పైచేయి! అక్కడ టీమిండియాదే హవా.. నాడు రోజర్ బిన్నీ, రవిశాస్త్రి కారణంగా.. -
అఫ్గనిస్తాన్పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్
Afghanistan vs Pakistan, 1st ODI: అఫ్గనిస్తాన్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. శ్రీలంకలోని హంబన్టోటాలో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఏకంగా 142 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా తన పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టింది. కాగా తొలి వన్డేలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, అఫ్గన్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ అర్ధ శతకంతో(61)తో రాణించగా.. షాబాద్ ఖాన్ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. చుక్కలు చూపించిన రవూఫ్ మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాకిస్తాన్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్కు పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ చుక్కలు చూపించాడు. 6.2 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు కూల్చాడు. రవూఫ్ దెబ్బకు అఫ్గన్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. 19.2 ఓవర్లలో 59 పరుగుల వద్ద అఫ్గన్ కథ ముగిసిపోయింది. అఫ్గన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన హారిస్ రవూఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. పాత రికార్డు బద్దలు కొట్టిన పాక్.. చెత్త రికార్డుతో అఫ్గన్ ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బాబర్ ఆజం బృందం సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసిన పాక్ జట్టుగా నిలిచింది. అంతకు ముందు 1998లో శ్రీలంకపై పాకిస్తాన్ 110 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు అఫ్గన్పై విజయంతో ఈ రికార్డును బాబర్ బృందం చెరిపేసింది. కాగా వన్డేల్లో అఫ్గనిస్తాన్కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. చదవండి: Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్లకు ఛాన్స్! A spectacle of pace, intensity and pure fire! 🚀🔥 Witness the explosive magic of @HarisRauf14's five-wicket haul ✨#AFGvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/cEG8HoPl63 — Pakistan Cricket (@TheRealPCB) August 22, 2023 -
నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్.. 59 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘనిస్తాన్
3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా హంబన్తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (ఆగస్ట్ 22) జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ పేసర్ హరీస్ రౌఫ్ నిప్పులు చెరిగాడు. 6.2 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో రౌఫ్కు ఇది తొలి ఫైఫర్ కావడం విశేషం. రౌఫ్ భీకర స్పెల్కు షాహీన్ అఫ్రిది (4-2-9-2), నసీం షా (5-0-12-1), షాదాబ్ ఖాన్ (1-1-0-1) తోడవ్వడంతో పాక్.. ఆఫ్ఘనిస్తాన్ను 59 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా ఆ జట్టు ఆఫ్ఘన్పై 142 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాక్ పేసర్ల ధాటికి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. ఏకంగా నలుగురు ఆటగాళ్లు డకౌట్లయ్యారు. ఓపెనర్ రహానుల్లా గుర్భాజ్ చేసిన 18 పరుగులే ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్గా నిలిచింది. ఒమర్జాయ్ 16 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు చేరాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఇమామ్ ఉల్ హాక్ (61), షాదాబ్ ఖాన్ (39), ఇఫ్తికార్ అహ్మద్ (30), మహ్మద్ రిజ్వాన్ (21), నసీం షా (18 నాటౌట్) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోవడంతో 47.1 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1) ధాటికి పాక్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. -
PAK VS NZ 2nd T20: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ధోని, రోహిత్ రికార్డులు బద్దలు
పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ టీ20ల్లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. లాహోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో అత్యధిక విజయాలు (42) సాధించిన కెప్టెన్గా ఇంగ్లండ్ మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ స్టానిక్జాయ్ (42) సరసన నిలిచాడు. ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును(41) అధిగమించాడు. తన కెరీర్లో మొత్తంగా 101 టీ20లు ఆడిన బాబర్ కెప్టెన్గా 68 మ్యాచ్ల్లో 42 విజయాలు సాధించాడు. ఇదే మ్యాచ్లో బాబర్ ఈ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్తో రెండో టీ20లో శతక్కొట్టిన బాబర్ (58 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్గా మూడు సెంచరీలు సాధించి, టీ20ల్లో అత్యధిక సార్లు ఈ మార్కును అందుకున్న కెప్టెన్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో బాబర్ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (2), స్విట్జర్లాండ్ సారధి ఫహీమ్ నజీర్ (2) ఉన్నారు. ఇక ఇదే మ్యాచ్లో పాక్ ఓపెనింగ్ జోడీ బాబర్-మహ్మద్ రిజ్వాన్ సంయుక్తంగా ఓ రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్లో తొలి వికెట్కు 99 పరుగులు జోడించిన బాబర్-రిజ్వాన్ జోడీ టీ20ల్లో 19వ సారి 50 ప్లస్ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో ఏ ఇతర జోడీ కూడా ఇన్ని సార్లు ఈ ఘనత సాధించలేదు. టీమిండియా ఓపెనింగ్ పెయిర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీ20ల్లో 15 సార్లు 50 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో బాబర్ (101 నాటౌట్), రిజ్వాన్ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో పాకిస్తాన్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టీ20లో 4 వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచిన హరీస్ రౌఫ్ ఈ మ్యాచ్లోనూ 4 వికెట్లతో చెలరేగాడు. -
సెంచరీతో చెలరేగిన బాబర్.. ఎవరికీ అందనంత ఎత్తులో!
Pakistan vs New Zealand, 2nd T20I: న్యూజిలాండ్తో రెండో టీ20లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. కివీస్పై 38 పరుగులతో గెలుపొంది ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0కు ఆధిక్యాన్ని పెంచుకుంది. లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సెంచరీతో చెలరేగిన బాబర్ ఓపెనర్లలో మహ్మద్ రిజ్వాన్ 50 పరుగులు సాధించగా.. కెప్టెన్ బాబర్ ఆజం సెంచరీతో చెలరేగాడు. 58 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 101 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో ఫఖర్ జమాన్, సయీమ్ ఆయుబ్ డకౌట్ కాగా.. ఇమాద్ వాసిం(2) కూడా పూర్తిగా నిరాశపరిచాడు. ఆఖర్లో ఇఫ్తికర్ అహ్మద్ 19 బంతుల్లో 33 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి బాబర్తో కలిసి నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. చాప్మన్ పోరాడినా మార్క్ చాప్మన్ (65- నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. హారిస్ రవూఫ్.. విల్ యంగ్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్రలను అవుట్ చేసి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన పాక్ బౌలర్లలో ఇమాద్ వాసిం, జమాన్ ఖాన్, షాదాబ్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. ధోని రికార్డు సమం చేసిన బాబర్ ఆజం కివీస్తో తొలి టీ20లో ధోని రికార్డు సమం చేశాడు బాబర్ ఆజం. అంతర్జాతీయ టీ20లో సారథిగా బాబర్కిది 41వ గెలుపు. తద్వారా పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ధోనితో కలిసి రెండోస్థానంలో నిలిచాడు. తాజా విజయంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అఫ్గనిస్తాన్ మాజీ సారథి అస్గర్ స్టానిక్జైలను సమం చేశాడు. 42 విజయాలతో ప్రపంచ రికార్డు అందుకుని సమకాలీనులలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇదిలా ఉంటే కివీస్తో సొంతగడ్డపై రెండో మ్యాచ్ బాబర్ కెరీర్లో 100వ అంతర్జాతీయ మ్యాచ్, కెప్టెన్గా 67వది కావడం విశేషం. చదవండి: Mike Tyson: 38 సార్లు అరెస్ట్! జైలర్ చొరవతో ఇలా! వివాహేతర సంబంధాలు.. ఈ ‘హీరో’ విలన్ కూడా! కోట్లాది సంపద ఆవిరి.. ఆఖరికి IPL 2023: మా ఓటమికి కారణం అదే..! అవునా.. ఓర్వలేకే చెత్త కామెంట్లు! The build-up, the execution, the celebration 👏 Everything to adore about the final over as we witnessed a @babarazam258 special 🌟#PAKvNZ | #CricketMubarak pic.twitter.com/gilvozw9Zj — Pakistan Cricket (@TheRealPCB) April 15, 2023 -
షాహీన్ అఫ్రిది 'నిఖా' హోగయా.. ప్రత్యేక అతిధి ఎవరంటే..?
పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిది వివాహం ఇవాళ (ఫిబ్రవరి 3) పాకిస్తాన్లోని కరాచీ నగరంలో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో షాహీన్.. పాక్ దిగ్గజ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాను నిఖా చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమానికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు. షాహీన్-అన్షా జంటకు పాక్ సహచర క్రికెటర్లు, అలాగే షాహీన్ పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) జట్టు లాహోర్ ఖలందర్స్ జట్టు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. షాహీన్ను అత్యంత సన్నిహితులైన పాక్ క్రికెటర్ హరీస్ రౌఫ్, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీస్ ట్విటర్ ద్వారా విషెస్ తెలిపారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ వివాహం కోసం ప్రత్యేకంగా కరాచీకి వచ్చినట్లు సమాచారం. నిఖా తర్వాత జరిగే మెహంది కార్యక్రమం ఇవాళ రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాక్ క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. కాగా, షాహీన్-అన్షాల ఎంగేజ్మెంట్ రెండేళ్ల క్రితమే జరిగింది. నాటి నుంచి వీరి వివాహం అదిగో ఇదిగో అంటూ మీడియాలో పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం పాక్కు అంతర్జాతీయంగా ఎలాంటి షెడ్యూల్ లేకపోవడంతో ఆ దేశ క్రికెటర్లంతా విదేశీ లీగ్ల్లో బిజీగా ఉన్నారు. షాహీన్ అఫ్రిది కూడా వివాహానికి కొద్ది రోజుల ముందు వరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు. Skipper is on his way to Karachi to attend Shaheen's wedding 🙌 Photo Courtesy: @mirzaiqbal80 #PakistanCricket #ShaheenAfridi pic.twitter.com/ynJ67vSnv1 — Cricket Pakistan (@cricketpakcompk) February 3, 2023 పాకిస్తాన్ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 13 నుంచి మొదలవుతుంది. 5 టీ20లు, 5 వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. 22 ఏళ్ల షాహీన్ అఫ్రిది ఇప్పటివరకు పాక్ తరఫున 25 టెస్ట్లు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. ఇందులో 99 టెస్ట్ వికెట్లు, 62 వన్డే వికెట్లు, 58 టీ20 వికెట్లు పడగొట్టాడు. 🎉Haris Rauf's reaction on Shaheen ka Nikah🎉#MainHoonQalandar #DilSe pic.twitter.com/CsjIQPxzsS — Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023 🎉Shaheen ka Nikah🎉 "Happy Wife, Happy Life"#MainHoonQalandar #DilSe pic.twitter.com/Zi6WGUNFiP — Lahore Qalandars (@lahoreqalandars) February 2, 2023 -
నోబాల్ విషయంలో పాక్ క్రికెటర్ నానా యాగీ
పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ నోబాల్ విషయమై అంపైర్తో నానా యాగీ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో భాగంగా ఇది చోటుచేసుకుంది. లీగ్లో భాగంగా రంగ్పూర్ రైడర్స్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 20వ ఓవర్ రోబుల్ హక్ వేశాడు. వరుసగా రెండు బంతులు బౌన్సర్లు వేయడంతో.. ఫీల్డ్ అంపైర్ రెండో బంతిని నోబాల్గా ప్రకటించాడు. అయితే అంపైర్ నో బాల్ ఇవ్వడంపై రంగ్పూర్ రైడర్స్ కెప్టెన్ నురుల్ హసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంపైర్తో వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన హారిస్ రవూఫ్ జోక్యం చేసుకొని అసలెలా నోబాల్ ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బౌన్సర్లు వేస్తే వార్నింగ్తో సరిపెట్టాలని రూల్ ఉన్నా.. పట్టించుకోకుండా నోబాల్ ఇవ్వడమేంటన్నాడు. అయితే అంపైర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో నురుల్ హసన్, హారిస్ రవూఫ్లు కోపంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రంగ్పూర్ రైడర్స్ సిల్హెట్ స్ట్రైకర్స్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రైకర్స్.. రంగ్పూర్ రైడర్స్ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. 18 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో తంజిమ్ హసన్ సకీబ్(41 పరుగులు), కెప్టెన్ మొర్తజా(21 పరుగులు).. ఎనిమిదో వికెట్కు 50 పరుగులు జోడించారు. రంగ్పూర్ రైడర్స్ బౌలర్లలో హసన్ మహ్మూద్, అజ్మతుల్లాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రంగ్పూర్ రైడర్స్ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రోనీ తాలుక్దార్ 41 పరుగులు నాటౌట్గా నిలిచాడు. Haris Rauf In fight With Umpire over a no Ball. #BPL #Bpl2023 pic.twitter.com/oLLme81d7f — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 27, 2023 చదవండి: 'స్లమ్డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్లో గోల్డ్ మెడల్ బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు? -
PAK VS NZ 2nd ODI: పాక్ జెర్సీని నేలకేసి కొట్టిన అంపైర్
కరాచీ వేదికగా పాకిస్తాన్తో నిన్న (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. నవాజ్ (4/38), నసీమ్ షా (3/58) కివీస్ పతనాన్ని శాశించారు. అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, సాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే శుక్రవారం (జనవరి 13) జరుగుతుంది. Ouch 😬🙏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/JyuZ0Jwxi5 — Pakistan Cricket (@TheRealPCB) January 11, 2023 కాగా, ఈ మ్యాచ్లో చోటు చేసుకున్న ఓ ఊహించని పరిణామం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో (39వ ఓవర్లో)పాక్ ఆటగాడు మహ్మద్ వసీం జూనియర్ వికెట్లకు గురిపెట్టి విసిరిన ఓ త్రో ఫీల్డ్ అంపైర్ అలీం దార్ కాలికి బలంగా తాకింది. బంతి తాకిడికి చిర్రెత్తిపోయిన అంపైర్, చేతిలో ఉన్న పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఆతర్వాత గ్రౌండ్లో ఉన్న పాక్ ఆటగాళ్లు అంపైర్ కాలిని రుద్దుతూ సేవలు చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డే సోషల్మీడియాలో షేర్ చేసింది. -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! స్టార్ పేసర్ వచ్చేశాడు
స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. ఇక గాయం కారణంగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు దూరమైన పాక్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ తిరిగి వన్డే జట్టకు ఎంపికయ్యాడు. అదే విధంగా పాక్ మిడిలార్డర్ బ్యాటర్ షాన్ మసూద్, వెటరన్ ఆటగాడు హరీస్ సోహైల్ ఛాన్నాళ్ల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు. మరో వైపు పాకిస్తాన్ వన్డే కప్లో అదరగొట్టన టయ్యాబ్ తాహిర్, స్పిన్నర్ ఉస్మా మీర్కు తొలి సారి పాక్ జట్టులో చోటు దక్కింది. కాగా జనవరి 9న కరాచీ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హరీస్ సోహైల్, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్, నసీమ్ అలీ అఘా, షానవాజ్ దహానీ, షాన్ మసూద్, తయ్యబ్ తాహిర్, ఉసామా మీర్ -
ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు భారీ షాక్!
ఇంగ్లండ్తో తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు బిగ్ షాక్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ గాయం కారణంగా సిరీస్లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టు సందర్భంగా రౌఫ్ రెడ్బాల్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ చారిత్రాత్మక టెస్టులో మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా రౌఫ్ కుడి కాలికి గాయమైంది.అనంతరం అతడిని ఆసుపత్రికి తరిలించి స్కాన్ చేయించగా గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో అతడికి దాదాపు నెల రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమచారం. ఈ క్రమంలోనే హరీస్ మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక గాయపడిన రౌఫ్ స్థానంలో ఫహీమ్ అష్రఫ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పుడు రౌఫ్ దూరం కావడం పాక్ను కలవరపెడుతోంది. ఇక ఇది ఇలా 17 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ముల్తాన్ వేదికగా డిసెంబర్ 9 నుంచి జరగనుంది. చదవండి: World Test Championship: పాకిస్తాన్కు ఊహించని షాక్.. ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం! మరి టీమిండియా పరిస్థితి? -
Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’
Pakistan vs England - Pakistan vs New Zealand: టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది కుడి మోకాలికి గాయమైన విషయం విదితమే. ఈ గాయం తీవ్రతరం కావడంతో అతడు స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్తో సిరీస్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గాయం తీవ్రత దృష్ట్యా అతడు సుమారు ఆర్నెళ్ల పాటు జట్టు నుంచి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సొహైల్ సలీమ్ మాట్లాడుతూ.. ‘‘కేవలం మోకాలి గాయం మాత్రమే అయితే అతడు కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు నెలల కాలం సరిపోతుంది. ఇదే కాకుండా గతంలో అయిన గాయాలు మళ్లీ తిరగబెడితే మాత్రం సుమారు ఆరు నుంచి ఏడు నెలల పాటు విశ్రాంతి అవసరం. సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఆఫ్రిది గతంలో గాయపడ్డ సమయంలో చికిత్స అందించే క్రమంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అన్న అంశంపై పీసీబీ విచారణ చేయాల్సి ఉంది’’ అని స్థానిక మీడియా డాన్తో పేర్కొన్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆఫ్రిది గనుక దూరమైతే.. వచ్చే నెలలో ఇంగ్లండ్తో సిరీస్ నేపథ్యంలో అతడి స్థానంలో హారీస్ రవూఫ్ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. డిసెంబరు 1 నుంచి 21 వరకు పాకిస్తాన్ వేదికగా ఇంగ్లండ్ ఆతిథ్య జట్టుతో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత పాక్ స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు, వన్డే సిరీస్లు ఆడనుంది. అంచనాలు తలకిందులు మెల్బోర్న్లో జరిగిన ఆదివారం నాటి వరల్డ్కప్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 13 ఓవర్లో హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకునే క్రమంలో ఆఫ్రిది మోకాలికి గాయమైంది. ఈ క్రమంలో చికిత్స అనంతరం 16వ ఓవర్ వేసేందుకు అతడు మైదానంలోకి వచ్చాడు. ఆ సమయంలో ఇంగ్లండ్ 30 బంతుల్లో 41 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఒక బంతి వేయగానే ఆఫ్రిది బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ను, స్వల్ప లక్ష్యాన్ని చూస్తే ఆఫ్రిది మిగతా 11 బంతులు వేసినా పెద్దగా ఫలితం ఉండేదో లేదో చెప్పలేం కానీ... అతని తొలి 2 ఓవర్ల బౌలింగ్ చూస్తే మాత్రం పాక్ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుందనేది వాస్తవం. ఇక వరల్డ్ కప్ తొలి 2 మ్యాచ్లలో సగం ఫిట్నెస్తోనే ఇబ్బందిగా ఆడిన షాహిన్, తర్వాతి 4 మ్యాచ్లలో పూర్తి ఫిట్గా మారి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అసలు పోరులో మోకాలి గాయం తిరగబెట్టడంతో అంచనాలు తలకిందులయ్యాయి. ఇక ఇప్పుడు ఈ కీలక పేసర్ మరికొంత కాలం జట్టుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: IND vs NZ: టీ20, వన్డే సిరీస్.. న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా T20I Team Rankings: వరల్డ్కప్ గెలవకపోయినా, టీమిండియానే నంబర్ 1 -
పాకిస్తాన్ బౌలర్ రాకాసి బౌన్సర్.. బద్ధలైన బ్యాటర్ ముఖం, రక్తం ధారలా..!
టీ20 వరల్డ్కప్-2022 గ్రూప్-2లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 30) జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డి లీడ్ తీవ్రంగా గాయపడ్డాడు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ విసిరిన రాకాసి బౌన్సర్.. బాస్ డి లీడ్ హెల్మెట్ లోపలికి చొచ్చుకుపోయి ముఖాన్ని బద్ధలు కొట్టింది. ఈ దెబ్బకు విలవిలలాడిపోయిన డచ్ బ్యాటర్ కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్ధంకాక అలాగే క్రీజ్లో కూలబడిపోయాడు. 142 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి బాస్ డి లీడ్ ముఖానికి బలంగా తాకడంతో రక్తం ధార కట్టింది. దీంతో బ్యాటర్తో సహా గ్రౌండ్లో ఉన్న వారంతా ఆందోళన చెందారు. కుడి కంటి కింది భాగంలో తగిలిన ఈ గాయం బాస్ డి లీడ్ ముఖాన్ని చీల్చేసింది. బంతి ఏమత్రం అటుఇటు అయినా లీడ్ కంటిని కోల్పోయే వాడు. దీంతో అతను బతుకు జీవుడా అని మైదానాన్ని వీడాడు. లీడ్ గాయం తీవ్రత కారణంగా తిరిగి బరిలోకి కూడా దిగలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండింగ్ ఉంది. Comeback soon, Bas De Leede. pic.twitter.com/bd0r2HzxHY — Johns. (@CricCrazyJohns) October 30, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్పై పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డచ్ జట్లు నిర్ధేశించిన 92 పరుగుల సునాయాస లక్ష్యాన్ని పాక్ ముక్కి మూలిగి 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత పాక్ బౌలర్లు షాదాబ్ ఖాన్ (3/22), మహ్మద్ వసీం జూనియర్ (2/15), షాహీన్ అఫ్రిది (1/19), నసీం షా (1/11), హరీస్ రౌఫ్ (1/10) సత్తా చాటడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేయగా, ఛేదనలో పాకిస్తాన్ నానా కష్టాలు పడి అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 4 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. అయితే మహ్మద్ రిజ్వాన్ (49), ఫఖర్ జమాన్ (20) బాధ్యతాయుతంగా ఆడి జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. 30 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో పాక్ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో షాన్ మసూద్ (12) ఔట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ (6), షాదాబ్ ఖాన్ (4) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాక్ ప్రస్తుత ప్రపంచకప్లో బోణీ కొట్టడంతో పాటు ఆసీస్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. -
కింగ్ కోహ్లిని కలిసిన పాక్ పేసర్లు.. హోరెత్తుతున్న సోషల్మీడియా
టీ20 వరల్డ్కప్-2022 సూపర్-12 గ్రూప్-2లో భాగంగా రేపు (అక్టోబర్ 30 టీమిండియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సేన మ్యాచ్ వేదిక అయిన పెర్త్కు ఇవాళ ఉదయమే చేరుకుంది. ఇదే వేదికపై రేపే పాకిస్తాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ కూడా జరుగనుంది. పాక్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుండగా.. టీమిండియా మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. గ్రూప్-2కు సంబంధించి పెర్త్ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్లు నాలుగు జట్లకు (భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్) కీలకం కావడంతో ఆయా జట్లన్నీ ప్రాక్టీస్లో తలమునకలై ఉన్నాయి. భారత్, పాక్ మ్యాచ్లు ఒకే వేదికపై ఒకదాని తర్వాత మరొకటి జరుగనుండటంతో స్టేడియం క్యాంటీన్ వద్ద ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు ఎదురెదురుపడ్డారు. ఈ సందర్భంగా పాక్ స్టార్ పేసర్లు హరీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిదిలు.. టీమిండియా ఆటగాడు కింగ్ కోహ్లిని కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ ముగ్గురు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సమయంలో తీసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో సోషల్మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ ఫోటోను బేస్ చేసుకుని భారత అభిమానులు పాక్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భయ్యా.. నీ వల్ల మా జిందగీ బర్బాద్ (నాశనం) అయ్యిందంటూ పాక్ పేస్ ద్వయం కోహ్లితో గోడు వెల్లబుచ్చుకుంటున్నట్లుందని కామెంట్లు చేస్తున్నారు. తదుపరి మ్యాచ్ల్లో ఎలా గెలవాలో చిట్కాలైన చెప్పు భయ్యా అంటూ పాకీలు ప్రాధేయపడుతున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మీ ఖేల్ ఖతమైంది.. ఇక దుఖానం సర్దేయండి అంటూ కోహ్లి పాక్ బౌలర్లు చెబుతున్నాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో కానీ, భారత అభిమానులు మాత్రం రకరకాలుగా ఊహించుకుని పాక్ను ఆటాడేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 23న జరిగిన భారత్-పాక్ మ్యాచ్లో విరాట్ ఈ ఇద్దరు పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన విషయం తెలిసిందే. హరీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్లో కోహ్లి వరుసగా రెండు అద్భుతమైన సిక్సర్లు బాది మ్యాచ్ను భారత్వైపు తిప్పాడు. అప్పటి దాకా టీమిండియాను గడగడలాడించిన రౌఫ్.. కోహ్లి మహోగ్రరూపం చూసి నిశ్రేష్ఠుడయ్యాడు. అదే మ్యాచ్లో అఫ్రిదిని సైతం కోహ్లి ఓ ఆటాడుకున్నాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతి వరకు సాగిన ఆ మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
అప్పుడు మాటలు పేలావు! తట్టుకోలేరన్నావు! ఇప్పుడు తుస్సుమన్నావు! మ్యాచ్కే హైలైట్గా..
T20 World Cup 2022 - Ind Vs Pak- Virat Kohli: టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతున్న మెల్బోర్న్ పిచ్పై.. విరాట్ కోహ్లి ఆడిన కోహినూర్ వజ్రంలాంటి ఇన్నింగ్స్.. సగటు టీమిండియా అభిమాని మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. పాకిస్తాన్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ... భారత విజయ సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారిన తరుణంలో... కోహ్లి ఆడిన షాట్లు ఇంకెవరికీ సాధ్యం కావు. మ్యాచ్కే హైలైట్ షాట్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ తొలి 4 బంతుల్లో 3 పరుగులిచ్చాడు. దాంతో భారత్ గెలవాలంటే 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఈ దశలో రవూఫ్ వేసిన ఐదో బంతిని అతని తలమీదుగా సిక్సర్ బాదాడు కోహ్లి. ఈ షాట్ మ్యాచ్లోనే హైలైట్. ఇక ఆరో బంతిని కోహ్లి ఫైన్లెగ్లో ఫ్లిక్ షాట్తో సిక్స్గా మలిచాడు. భారత విజయసమీకరణాన్ని 6 బంతుల్లో 16గా మార్చేశాడు. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్లో ఆఖరి బంతికి అశ్విన్ మిడాఫ్లో ఫీల్డర్ మీదుగా షాట్ ఆడి పరుగు తీయడంతో టీమిండియా విజయం ఖరారైంది. తద్వారా గత ప్రపంచకప్లో దాయాది చేతిలో ఎదురైన పరాభవానికి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బదులు తీర్చుకుంది. నా హోం గ్రౌండ్ అన్నావు కదా! ఈ అద్భుత విజయం నేపథ్యంలో... టీమిండియాతో మ్యాచ్కు కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎంసీజీ తన హోం గ్రౌండ్ లాంటిదన్న(బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్కు ప్రాతినిథ్య వహిస్తున్న నేపథ్యంలో) రవూఫ్.... తన బెస్ట్ ఇచ్చానంటే భారత బ్యాటర్లు తట్టుకోవడం కష్టమేనంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఆదివారం నాటి(అక్టోబరు 23) మ్యాచ్లో అతడు బాగానే బౌలింగ్ చేసినప్పటికీ.. ఆఖరి ఓవర్లో కోహ్లి రెండు సిక్సర్లతో చెలరేగడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో రవూఫ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మాటలు పేలావు.. తుస్సుమన్నావు ‘‘రవూఫ్ ఆనాడు ఏమన్నావో గుర్తుందా? చూశావా నీ హోం గ్రౌండ్లో.. నీ బౌలింగ్లో మా కింగ్ కోహ్లి వరుస సిక్సర్లు బాది మ్యాచ్ను మా వైపు తిప్పేశాడు. థౌజండ్వాలా పేల్చేశాడు. మాటలు పేలిన నువ్వేమో తుస్సుమన్నావు!’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక టీమిండియాతో మ్యాచ్లో రవూఫ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: No Ball Call: అంపైర్లపై అక్తర్ ట్వీట్.. అంతగా బుర్ర చించుకోకు! బాగా మండుతున్నట్లుంది కదా! ఓటమిని జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టిన పాక్ అభిమాని.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్ Virat Kohli: కోహ్లి తప్ప ఇంకెవరూ ఆ షాట్లు ఆడలేరు.. ఆ రెండు సిక్స్లు ప్రత్యేకం.. పాండ్యా ఫిదా.. కింగ్పై ప్రశంసల జల్లు View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇంకా నయం బ్యాట్ మాత్రమే విరిగింది..
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ వేసిన బంతి స్పీడుకు గ్లెన్ పిలిప్స్ బ్యాట్ విరగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ హారిస్ రౌఫ్ వేశాడు. ఆ ఓవర్ హారిస్ వేసిన నాలుగో బంతి 143 కిమీ వేగంతో గ్లెన్ పిలిప్స్ వైపు దూసుకొచ్చింది. షాట్ ఆడడానికి ప్రయత్నించిన పిలిప్స్ బ్యాట్ను అడ్డుపెట్టాడు. అంతే బులెట్ వేగంతో దూసుకొచ్చిన బంతి బ్యాట్ ఎడ్జ్ను చీల్చడంతో బ్యాట్ చివరిభాగం విరిగింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక హారిస్ రౌఫ్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి డెవన్ కాన్వే, ఇష్ సోదీల రూపంలో రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ ఐదు వికెట్లతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 59 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. గ్లెన్ పిలిప్స్ 29, మార్క్ చాప్మన్ 25 పరుగులు చేశారు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 34 పరుగులు), మహ్మద్ నవాజ్(22 బంతుల్లో 38 పరుగులు), హైదర్ అలీ(15 బంతుల్లో 31 పరుగులు).. చివర్లో ఇప్తికర్ అహ్మద్(14 బంతుల్లో 25 నాటౌట్) సంయుక్తంగా రాణించారు. Haris Rauf firing bullets today that was Phillips’ favourite bat apparently 😂 pic.twitter.com/8WPcVEEi1b — adi✨|| haris rauf cheerleader (@adidoescricket) October 14, 2022 చదవండి: సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. ముంబై భారీస్కోరు 'భయపడితే పనులు కావు.. పరుగులు చేయడమే' -
పాకిస్తాన్ ప్లేయర్ నోటిదూల ... భారత్ ఫ్యాన్స్ ఫైర్
-
Ind Vs Pak: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లకు చుక్కలే! నీకంత సీన్ లేదు!
T20 World Cup 2022- India Vs Pakistan: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ తన ప్రణాళికల గురించి వెల్లడించాడు. ముఖ్యంగా టీమిండియాను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. భారత బ్యాటర్లను త్వరగా పెవిలియన్ చేర్చేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నానన్నాడు. హారిస్ రవూఫ్ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా లాహోర్ వేదికగా బుధవారం జరిగిన ఐదో మ్యాచ్లో అతడు 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఎంసీజీ నా హోం గ్రౌండ్ ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రవూఫ్ ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్కప్ సన్నాహకాల గురించి చెప్పుకొచ్చాడు. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పోరు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నా హోం గ్రౌండ్ లాంటిది. అక్కడి పిచ్లు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. టీమిండియాను ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నా. నా నైపుణ్యాలకు పదును పెట్టి.. నా బెస్ట్ ఇచ్చానంటే వాళ్లు(టీమిండియా బ్యాటర్లు) తట్టుకోవడం కష్టమే. హోం గ్రౌండ్లో ఆడనుండటం నాకు సానుకూల అంశంగా మారింది’’ అని రవూఫ్ పేర్కొన్నాడు. కాగా బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్కు రవూఫ్ ప్రాతినిథ్యం వహిస్త్ను విషయం తెలిసిందే. కాగా అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుండగా.. అక్టోబరు 23న భారత్, పాకిస్తాన్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తలపడనున్నాయి. నీకంత సీన్ లేదులే! ఇక 28 ఏళ్ల రవూఫ్ ఇటీవల జరిగిన ఆసియా కప్-2022లో భాగంగా రోహిత్ సేనతో మొదటి మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, సూపర్ -4 స్టేజ్లో మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేసి కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రవూఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ అతడికి కౌంటర్ ఇస్తున్నారు. ‘‘నీకంత సీన్ లేదు. సొంతగడ్డ మీదే పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నావు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నావు. చూద్దాం ఎవరు పైచేయి సాధిస్తారో’’ అంటూ ఇంగ్లండ్తో ఐదో టీ20లో అతడి గణాంకాలను ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా ఫాస్ట్బౌలర్లకు అనుకూలించే ఆసీస్ పిచ్లపై రవూఫ్నకు మంచి రికార్డే ఉంది. బీబీఎల్లో 18 మ్యాచ్లలో అతడు 30 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND vs SA: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్.. తొలి భారత కెప్టెన్గా Ind Vs SA T20 Series: బుమ్రా స్థానంలో జట్టులోకి సిరాజ్: బీసీసీఐ