humans
-
World Kindness Day 2024 : హృదయాన్ని కదిలించే వీడియోలు!
ప్రపంచ దయ దినోత్సవాన్ని (World Kindness Day ) ఏటా నవంబర్ 13న జరుపుకుంటారు. వ్యక్తులుగా ఒకరిపట్ల ఒకరు, తమ పట్ల , వారి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల దయ చూపేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. మానవులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ, తోటివారితోపాటు ఈ ప్రకృతి, జంతువుల పట్ల ప్రేమతో, దయతో కృతజ్ఞతగా ఉండడంలోని ప్రాధాన్యతను గుర్తించే రోజు ప్రపంచ దయ దినోత్సవం. చుట్టూ ఉన్న సమాజం పట్ల దయతో ఉండటం మనుషులుగా మనందరి ప్రాథమిక లక్షణం,ప్రపంచ దయ దినోత్సవం: చరిత్రవరల్డ్ కైండ్నెస్ డేని 1998లో వరల్డ్ కైండ్నెస్ మూవ్మెంట్ ప్రారంభించింది. సామరస్య ప్రపంచాన్ని సృష్టించడంలో దయ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యం. 1997లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన మొదటి ప్రపంచ దయ ఉద్యమ సదస్సు తర్వాత ప్రపంచ దయ ఉద్యమం ఏర్పడింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్గా మారాయి.మనసు అందరికీ ఉంటుందికానీ అది గొప్పగా కొందరికి మాత్రమే ఉంటుంది..❤️✨#WorldKindnessDay2024 pic.twitter.com/MwM1NRPexm— Do Something For 👉Better Society ✊ (@ChitraR09535143) November 13, 2024 It is called true happiness which gives peace to the heart and smile to the faces. In fact, the beauty of nature lies in its precious creations, animals and birds. Make your contribution in protecting nature, environment, animals, birds and creatures.#WorldKindnessDay2024 pic.twitter.com/kpXDNaRRZ8— Munesh Kumar Ghunawat (@GhunawatMunesh) November 13, 2024 -
కాకి పగ పదిహేడేళ్లు..
పాములు పగబడతాయన్న మాట అప్పుడప్పుడూ వింటుంటాం. పాత సినిమాల్లో అయితే పగబట్టి వెంటాడే పాముల సీన్లూ చూసి ఉంటాం. మరి అవి అలా నిజంగా పోగబడతాయా? ఏమో చెప్పలేం. కానీ కాకులు మాత్రం పగబడతాయట. అదీ నెలో, ఏడాదో కాదు.. ఏకంగా 17 ఏళ్ల పాటు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ పగ తీర్చుకునేందుకు ప్రయతి్నస్తాయట. వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దామా..కొన్ని కాకులను బంధించి.. పక్షుల్లో కాకులను బాగా తెలివైనవిగా భావిస్తారు. తమకు ఆహారం వేసే మనుషులను గుర్తించగలవని కూడా ఇంతకుముందే తేల్చారు. అదే సమయంలో తమకు కీడు చేయడానికి ప్రయతి్నంచిన, భయపెట్టినవారిపై పగబడతాయని తాజాగా తేల్చారు. దీనిపై వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ నేతృత్వంలోని పరిశోధకులు సుదీర్ఘ ప్రయోగం చేశారు. 2006లో దెయ్యం లాంటి ఓ మాస్కు పెట్టుకుని.. యూనివర్సిటీ క్యాంపస్లో కొన్ని కాకులను పట్టి బంధించారు. వాటిని కాసేపు భయపెట్టినట్టుగా చేశారు. తర్వాత వాటి కాళ్లకు ఐడెంటిఫికేషన్ రింగులను వేసి వదిలేశారు.మాస్క్ తో వెళితే వెంటాడుతూ.. శాస్త్రవేత్తలు ఆ తర్వాతి నుంచి క్యాంపస్లో ఆ దెయ్యం మాస్కు వేసుకుని కొన్నిసార్లు, వేసుకోకుండా మరికొన్నిసార్లు, వేరే ఇతర మాస్క్ లు పెట్టుకుని ఇంకొన్నిసార్లు తిరుగుతూ కాకులకు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. ఈ సమయంలో వాటి స్పందనను రికార్డు చేస్తూ వచ్చారు. శాస్త్రవేత్తలు దెయ్యం మాస్కు వేసుకుని వెళ్లినప్పుడు కాకులు.. తీవ్రంగా అరుస్తూ, వెంటాడుతూ రావడాన్ని.. మాస్క్ లేనప్పుడు, వేరే మాసు్కలు వేసుకున్నప్పుడు అవి మామూలుగానే ఉండటాన్ని రికార్డు చేశారు. అయితే క్రమంగా ఇలా వెంటాడటం తగ్గిందని, సుమారు 17 ఏళ్ల తర్వాత అవి వెంటాడటం ఆగిపోయిందని ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ చెప్తున్నారు.పక్కాగా గుర్తించి మరీ వెంటాడాయి..‘‘కొందరు వలంటీర్లకు వేర్వేరు మోడళ్లలోని మాస్కులు ఇచ్చి, యూనివర్సిటీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగాలని చెప్పాం. అందులో మేం కాకులను పట్టుకుని, భయపెట్టినప్పటి మాస్క్ లు వేసుకున్నవారిని మాత్రమే కాకులు టార్గెట్ చేశాయి. గట్టిగా అరవడం, వేగంగా వచ్చి కాళ్లతో తన్నడం వంటివి చేశాయి. మేం బంధించిన కాకులు మాత్రమేకాకుండా వేరే కాకులు కూడా ఇలా చేశాయి. అవి ప్రమాదకరమని భావించిన వాటిపై సమాచారం ఇచి్చపుచ్చుకోవడమే దీనికి కారణం’’ అని ప్రొఫెసర్ వెల్లడించడం గమనార్హం. ..: సాక్షి సెంట్రల్ డెస్క్ :.. -
ప్రాణులు నేర్పే పాఠాలు
ప్రపంచమంతా పచ్చగా ఉందని, తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని అనుకుంటే పొరపాటే! రంగు రంగుల లోకంలోనే రకరకాల రాకాసి జంతు ప్రవృత్తులు ఉంటాయి. జంతుతతి నుంచి మనిషి వేరుపడి సహస్రాబ్దాలు గడచిపోయాయి. అయినా, మనుషుల్లోని జంతుప్రవృత్తి పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని సందర్భాల్లో జంతువుల కంటే క్రూరంగా, దారుణంగా ప్రవర్తించే మనుషుల ఉదంతాలు వార్తలకెక్కుతుండటం మనకు తెలియనిదేమీ కాదు. ఆకుపచ్చని పచ్చికబయళ్లలో సుతిమెత్తని పచ్చిక మాత్రమే కాదు, విషపూరితమైన పసరిక పాములు కూడా ఉంటాయి. దట్టమైన అడవుల్లో పచ్చని చెట్లూ చేమలు, రంగు రంగుల పువ్వులూ పిట్టలూ పిచుకలూ, జంతువులూ మాత్రమే కాదు, ఏమరుపాటుగా దొరికితే మనుషులను పలారం చేసే క్రూరమృగాలు ఉంటాయి. కసిగా కాటు వేసే కాలసర్పాలు ఉంటాయి. కీకారణ్యాల్లో పొంచి ఉండే ప్రమాదాలన్నీ జనారణ్యంలోనూ ఉంటాయి. జనారణ్యంలో అడుగడుగునా తారసపడే చాలా మంది మనుషుల్లో జంతులక్షణాలు కనిపిస్తాయి. మనుషుల్లోని మేకపోతు గాంభీర్యాలు, గోడమీది పిల్లి వాలకాలు, గుంటనక్క తెలివితేటలు అపరిచితమైనవేమీ కాదు. మనుషుల్లోని జంతులక్షణాలను గుర్తించడం వల్లనే విష్ణుశర్మ ‘పంచతంత్రం’ రాశాడు. జంతు పాత్రల ద్వారా మనుషుల స్వభావాలను తేటతెల్లం చేస్తూ కథలు చెప్పాడు. ‘పంచతంత్రం’ కథలు చిన్నపిల్లలకు కూడా తేలికగా అర్థమవుతాయి. ఆ తర్వాత చాలాకాలానికి జార్జ్ ఆర్వెల్ ‘యానిమల్ ఫామ్’ రాశాడు. ఇది కూడా దాదాపు ‘పంచతంత్రం’లాంటి ప్రయోగమే! ‘పంచతంత్రం’ నాటికి, ‘యానిమల్ ఫామ్’ నాటికి సమాజం చాలా మారింది. ‘యానిమల్ ఫామ్’లో దోపిడీ సమాజంలో నలిగిపోతున్న మనుషుల పరిస్థితిని, శ్రమదోపిడీలో నలిగిపోయేవారి స్వేచ్ఛాభిలాషను, వారి స్వేచ్ఛకు తూట్లు పొడిచే శక్తుల కుతంత్రాలను జంతుపాత్రల ద్వారా ఆర్వెల్ చెప్పాడు. జంతువులను పాత్రలుగా చేసుకుని కథలు చెప్పడం ‘పంచతంత్రం’తోనే మొదలు కాలేదు.‘పంచతంత్రం’ దాదాపుగా క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటిది. అంతకు దాదాపు వెయ్యేళ్ల ముందే– క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన గ్రీకు బానిస ఈసప్ ఇలాంటి కథలనే ఎన్నో చెప్పాడు. ప్రాచీన రోమన్ సాహిత్యంలోని ‘ఫెడ్రస్ కథలు’, గ్రీకు సాహిత్యంలోని బాబ్రియస్ కథలు ఇలాంటివే!ఫ్రెంచ్ సాహిత్యంలోని ‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ కూడా ఇలాంటివే!‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ రచయిత జీన్ డి లా ఫోంటేన్ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల్లో ప్రచారంలో ఉన్న జంతువుల పాత్రలు ప్రధానంగా ఉన్న కథలను సేకరించి, పదిహేడో శతాబ్దిలో ఈ కథల పుస్తకాలను పన్నెండు భాగాలుగా వెలువరించాడు. జంతువులను ప్రధాన పాత్రలుగా చేసుకున్న ఈసప్ కథలు, పంచతంత్ర కథలు అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం పొందాయి. ఇవి ఈనాటికీ తాజాగానే ఉన్నాయి. ఇప్పటి సమాజంలో సంచ రిస్తున్న మనుషుల స్వభావాలు పంచతంత్ర కథల్లోనూ, ఈసప్ కథల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మనుషుల స్వభావాలను జంతువులకు ఆపాదించి చెప్పడం సమస్త భాషల సాహిత్యంలోనూ ఒక పురాతన కళాత్మక పద్ధతి. ఓపిక ఉన్న రచయితలు కథలు చెప్పారు. అనుభవం ఉన్నవాళ్లు సామెతలను సృష్టించారు. మన పురాణాల్లోనూ జంతువులు, పక్షులు పాత్రలుగా ఉన్న పిట్ట కథలు కనిపిస్తాయి. బైబిల్లోనూ జంతువుల గురించిన సామెతలు ఉన్నాయి. ‘సోమరీ! చీమల యొద్దకు వెళ్లుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును’– ఇది బైబిల్ సామెతల గ్రంథంలోనిది. చీమను చూసి కష్టపడటం నేర్చుకోవాలని సోమరులకు చేసే హెచ్చరిక ఇది.ప్రాచీన సాహిత్యంలో జంతుపాత్రలు ఉన్న కథలు, జంతువులపై ప్రాచుర్యంలో ఉన్న సామెతలు మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ప్రవర్తన లోపాలను ఎత్తిచూపి, సుతిమెత్తని హెచ్చరికలు చేస్తాయి. వీటిని పూర్తిగా ఆకళింపు చేసుకుంటే చాలు, మనుషులు మనుషుల్లా తయారవడం కష్టమేమీ కాదు. వీటిని పిట్ట కథల్లా కొట్టిపారేసే అతితెలివిపరులు జంతువుల కంటే హీనంగా మిగులుతారు. కానికాలం దాపురించినప్పుడు దిక్కుతోచని గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుని, నానా అవస్థలు పడతారు.మహాభారతంలోని ‘కాకి హంస’ల కథ ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రాజ్యంలో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలేది. వర్తకుడి పిల్లలు దానికి తమ ఎంగిళ్లు పెట్టేవారు. ఎంగిళ్లు తిన్న కాకి వారికి బాగా మాలిమి అయింది. ఎంగిళ్లు తిని తెగబలిసిన కాకి ఒకనాడు ఏకంగా హంసలతో పందేనికి తెగబడి, భంగపడింది.ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు. కర్ణుడికి కథలోని నీతి తలకెక్కలేదు. ఫలితం ఏమైందో మనకు తెలిసిందే! కొందరు ఇప్పటికీ ఎంగిళ్లు తిని బలిసిన కాకుల్లాగే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లు రాజకీయ రంగంలోను, సాహితీ సాంస్కృతిక రంగాల్లోను, వివిధ రకాల వృత్తి ఉద్యోగాల్లోనూ ఉంటారు. ఎవరో పెట్టే ఎంగిలి మెతుకులు తిని బలిసి, విర్రవీగినంత కాలం కాకికి తన బలహీనత ఏమిటో ఎరుక పడనట్లే, ఇలాంటి స్వభావం ఉన్నవారికి ఎప్పటికీ ఈ కథల్లోని మర్మం అవగతం కాదు. మానవ సమాజంలో బతుకుతున్నా, వారు ఎప్పటికీ సంపూర్ణ మానవులు కాలేరు. -
ఆ ఏజ్లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి
వయసు పెరిగే కొద్ది వృద్దాప్య ఛాయలు వస్తాయని అందరికి తెలుసు. అయితే ఏ ఏజ్లో వృధాప్యం వేగవంతం అవుతుందనేది తెలియదు. మనం కూడా గమనించం. చూస్తుండగానే మనకే తెలియని విధంగా వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. మన శరీరంలో ఈ మార్పు ఏ నిర్ధిష్ట ఏజ్ నుంచి మొదలవుతుందనేది తెలియదు. ఆ విషయాన్నే తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేగాదు అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటంటే..స్టాన్ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనం ఇన్నాళ్లు వృధాప్యం అనేది కాలానుగుణంగా వచ్చేది అనే సంప్రదాయ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. మానవ శరీర పరమాణు కూర్పు పరంగా వృద్ధాప్యం అనేది రెండు నిర్ధిష్ట వయసులలో వేగవంతమవుతుందని నిర్ధారించారు పరిశోధకులు. ఆ సమయంలోనే శరీరం విపరీతమైన మార్పులకు లోనవుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. సరిగ్గా చెప్పాలంటే భూకంపం మాదిరిగా శరీరం ఒక్కసారిగా సడెన్ మార్పులకు లోనయ్యి వేలాదిగా అణువులు, సూక్ష్మజీవులు పెరగడం, పడిపోవడం జరుగుతుంది. సరిగ్గా అప్పుడే ఆరోగ్యం వేగంగా క్షీణించడం జరుగుతుంది. అదే వృద్ధాప్యం వేగవంతమవుతుందనడానికి సంకేతమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చెప్పాలంటే సరిగ్గా 44, 60 ఏళ్ల వయసులలో శరీరం వేగవంతమైన మార్పులకు లోనవ్వుతుందని వెల్లడించారు. అందుకోసం తాము 25 నుంచి 75 ఏళ్ల వయసు వారిపై పరిశోధనలు చేయగా వారిలో ఉండే విభిన్న అణువులు, సూక్ష్మజీవులు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, శిలింధ్రాలను నిశితంగా గమనించారు. వాటి వృద్ధి కాలక్రమేణ మారదని, నిర్ధిష్ట వయసు 40, 60 ఏజ్లలో వేగవంతమైన మార్పులకు లేదా ఆకస్మిక మార్పులకు లోనవ్వడాన్ని అధ్యయనంలో గుర్తించారు.ఈ పెద్ద మార్పులే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. అంతేగాదు తమ అధ్యయనంలో ఈ రెండు నిర్ధిష్ల వయసుల్లోనే శరీరం గణనీయమైన మార్పులకు లోనవ్వుతుందని నిర్థారించారు. ముఖ్యంగా రోగనిరోధక పనితీరు బలహీనమవ్వడం 60వ దశకం నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ పరిశోధన పుట్టుక, మరణంలానే వృద్ధాప్యం అనేది సర్వసాదారణమే అని చెబుతున్నప్పటికీ..ఏఏ ఏజ్లో ఈ వృధ్ధాప్యం ప్రారంభమవుతుందనేది తెలియజేసిందన్నారు. పైగా ఈ పరిశోధన భవిష్యత్తులో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఇస్తుందని నమ్మకంగా చెప్పారు. (చదవండి: బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!) -
మానవుల వల్లే వైరస్ల విజృంభణ!
వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికం అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క ప్యారిస్లో భారీ మహోత్సవాల మధ్య ఒలింపిక్స్ జరుగుతుండగా... ఇంకోపక్క దేశంలో నిఫా, చాందీపుర వైరస్లు కూడా ఒలింపిక్స్ మాదిరిగానే వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని హెచ్చరి స్తుండటం గమనార్హం. వీటన్నింటినీ పక్కనపెట్టినా, సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్ రకాలు తెరిపి లేకుండా మనిషిని జబ్బున పడేస్తూనే ఉన్నాయి. అనేక వైరస్ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకు తున్నవే. అదేదో జంతువులు మనపై కక్షకట్టి చేస్తున్న పనేమీ కాదు. మానవులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలను మళ్లీ సంపాదించు కునే పనిలో ఉన్నాయనీ కాదు. అడవిలో బతికే జంతుజాలాన్ని మనం మన ఆవాసాల్లోకి చేర్చుకున్నాం కాబట్టి! అలాగే మన మధ్యలో ఉన్న జంతువులు అటవీ ప్రాంతాల్లోకి చేరేందుకు తగిన ‘మార్గం’ వేశాము కాబట్టి! అటవీ ప్రాంతాల విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతూండటం, రకరకాల పెంపుడు జంతువుల ఎగు మతి, దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తూండటం వంటివన్నీ వైరస్లు కూడా మనుషుల్లోకి జొరబడేందుకు అవ కాశాలు పెంచుతున్నాయి. పెరుగుతున్న వేడి... తరుగుతున్న నీరువాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషు లతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వైరస్లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కలిగించేందుకు వీలు కల్పించే కొత్త కొత్త జంతు అతిథులు వైరస్లకు లభిస్తున్నాయి. సైన్ ్స రచయిత ఎడ్ యంగ్ ఇటీవల ‘ది అట్లాంటిక్’లో రాస్తూ... మనిషి ‘ప్యాండెమిసీన్’ యుగాన్ని సృష్టించుకున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్ అని, మనిషి పుట్టుక తరువాతి యుగాన్ని ఆంత్రో పసీన్ అని పిలిస్తే... ప్రస్తుత మహమ్మారుల యుగాన్ని ప్యాండెమిసీన్ (పాండమిక్ = మహమ్మారి) అని పిలిచాడన్నమాట. జార్జ్టౌన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ ఛేంజ్ జీవశాస్త్రవేత్త కాలిన్ కార్ల్సన్ ఈ మధ్యే ఈ ప్యాండెమిసీన్ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనుషులకు సోకే అవకాశముందో అంచనా కట్టారు. ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం... మనిషిని ముట్టడించేందుకు అవకాశమున్న వైరస్ల సంఖ్య ఏకంగా పదివేల రకాలు! ప్రస్తుతం వీటిల్లో అత్యధికం జంతువుల్లో మాత్రమే తిరు గుతూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతూండటంతో అవి ఇతర జంతువులకు అంటే మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. వాతావరణ సంక్షోభం కాస్తా జంతువులు, మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తూండటం గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందం అయిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వైరస్లకు జాతర లాంటిది అంటే అతిశయోక్తి కాదు. అసలు పరిచయమే లేని బోలెడన్ని వైరస్లు ఒక దగ్గర చేరితే ఎన్ని కొత్త స్నేహాలు, బంధుత్వాలు కలుస్తాయో ఊహించుకోవచ్చు.వినాశకర మార్పులువేర్వేరు వాతావరణ, భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్ల్సన్ వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3,139 క్షీరద జాతులు (పాలిచ్చి పెంచే జంతువులు) సహజ ఆవాసాలకు దూరంగా వలస వెళతాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎతై ్తన, జీవవైవిధ్య భరిత, జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్ల సంచారం నాలుగు వేల రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియా లోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్లు మను షులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని కార్ల్సన్ బృందం అంచనా వేస్తోంది. వీటిల్లో 15,000 వరకూ క్షీరదాలు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్సన్ హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగవచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. కనిపించేది కొంతే... పొంచివున్నది ఎంతో!కార్ల్సన్ బృందం చేపట్టిన ఈ అధ్యయనం పేరు ‘ఐస్బర్గ్ స్టడీ’. అంటే పైకి కనిపించే భాగం మాత్రమే. కనిపించనిది ఇంకా చాలానే ఉందన్నమాట. ప్రస్తుతం ఎక్కువ అవుతున్న జూనోటిక్ వ్యాధులు రాగల ప్రమాదాలతో పోలిస్తే చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతుంది. క్షీరదాల్లో గబ్బిలాలు జూనోటిక్ వైరస్ల విజృంభణలో ముందు వరసలో ఉన్నాయి. సార్స్ కోవ్–2 కూడా వూహాన్ ప్రాంతంలోని గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందే. ఎక్కువ దూరాలు ప్రయాణించగల సామర్థ్యం వల్ల ఈ గబ్బిలాలు వాతావరణ మార్పులకు వేగంగా స్పందిస్తాయి. వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తాయి. తమతోపాటు వైరస్లను కూడా మోసుకొస్తాయి.పండ్లను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఈ వైరస్ జాడలు పండ్ల నుంచి మనకూ సోకుతాయన్నమాట. నిఫా వైరస్ ప్రస్థానం కూడా దాదాపుగా ఇలాంటిదే. ఆగ్నేయాసియా ప్రాంతంలో గబ్బిలాల జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి సరికొత్త వ్యాధులు పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువే. అయితే జలచరాలు, పక్షుల ద్వారా కూడా వైరస్లు మనిషికి సోక వచ్చు. ఇన్ ఫ్లుయెంజా వైరస్ రకాలకు పక్షులు ఆతిథ్యమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు అనేవి వ్యవస్థ మొత్తాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్యను మనం మరింత తీవ్రతతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ఐస్బర్గ్ స్టడీ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన వన్ హెల్త్ (మనుషులతోపాటు పరిసరాల్లోని జంతువులపై కూడా పర్యవేక్షణ) మైక్రోబియల్ నిఘా వ్యవస్థ, వేర్వేరు ప్రాంతాలు, జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించడం వంటివి ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను సరిగ్గా అంచనా కట్టే ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటూ తప్పనిసరి. అప్పుడే కొత్త వ్యాధుల ఆగమనం, వాటిని అడ్డుకోవడం, సమర్థంగా తిప్పికొట్టడం సాధ్య మవుతుంది. కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ మాజీ అధ్యక్షులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ముసుగు మనుషులు
‘సుగుణం మేలిముసుగు, దుర్గుణం దొంగముసుగు’ అన్నాడు ఫ్రెంచ్ రచయిత, రాజనీతిజ్ఞుడు విక్టర్ హ్యూగో. ‘కరోనా’ కాలంలో మనుషులందరికీ ముసుగులు అనివార్యంగా మారాయి. మహమ్మారి కాలంలో మూతిని, ముక్కును కప్పి ఉంచే ముసుగులు లేకుంటే మాయదారి మహమ్మారి రోగం మరెందరిని మట్టుబెట్టేదో! ముసుగులు పలు రకాలు. అన్నింటినీ ఒకే గాటన కట్టేయలేం. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం కుదరదు కదా! అనివార్యంగా ధరించే ముసుగులు కొన్ని, మతాచారాల కారణంగా ధరించే ముసుగులు ఇంకొన్ని– ఇవి ప్రమాదకరమైన ముసుగులు కాదు. ఇలాంటి ముసుగుల చాటున ఉన్న మనుషులను గుర్తించడమూ అంత కష్టం కాదు.అయితే, వచ్చే చిక్కంతా దేవతా వస్త్రాల్లాంటి ముసుగులతో మన మధ్య తిరుగుతుండే మనుషులతోనే! కనిపించని ముసుగులు ధరించే మనుషుల బతుకుల్లో లెక్కలేనన్ని లొసుగులు ఉంటాయి. వాటిని దాచుకోవడానికే ముఖాలకు దేవతావస్త్రాల ముసుగులను ధరిస్తుంటారు. అలాంటివారు మన మధ్య ఉంటూ, మనతోనే సంచరిస్తుంటారు. మనం పనిచేసే కార్యాలయాల్లో, మనం నివసించే కాలనీల్లో ఉంటారు. ముసుగులకు చిరునవ్వులు అతికించుకుని మనల్ని పలకరిస్తుంటారు కూడా! వాళ్లను ముసుగులతో తప్ప ముఖాలతో గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకుం టాం. వాళ్ల అసలు ముఖాలను పోల్చుకునే సరికి కనిపించని ఊబిలో కూరుకుపోయి ఉంటాం.గాంభీర్యం చాలా గొప్పగా ఉంటుంది గాని, చాలా సందర్భాల్లో అది పిరికిపందలు ధరించే ముసుగు. అలాగే, పలు సందర్భాల్లో భూతదయా ప్రదర్శనలు క్రౌర్యానికి ముసుగు; బహిరంగ వితరణ విన్యాసాలు లుబ్ధబుద్ధులకు ముసుగు; నిరంతర నీతి ప్రవచనాలు అలవిమాలిన అవినీతి పనులకు ముసుగు; సర్వసంగ పరిత్యాగ వేషాలు సంపన్న వైభోగాలకు ముసుగు– ఇలా చెప్పుకుంటూ పోతే ముసుగుల జాబితా కొండవీటి చేంతాడు కంటే పొడవుగా తయారవుతుంది. ‘ఒక్క బంగారు ముసుగు అన్ని వైకల్యాలనూ కప్పిపుచ్చుతుంది’ అన్నాడు ఇంగ్లిష్ నాటక రచయిత థామస్ డెకర్. బంగారు ముసుగులు తొడుక్కోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకని తెలివిమంతులు దేవతా వస్త్రాల ముసుగులలో తమ తమ లొసుగులను కప్పిపుచ్చుకుంటూ, నిక్షేపంగా సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయిపోతుంటారు. ఇలాంటి పెద్దమనుషుల అసలు ముఖాలేవో గుర్తించడం దుస్సాధ్యం. ముసుగుల మాటునున్న ముఖాలను గుర్తించేలోపే అమాయకులు కాటుకు గురైపోతారు. సాధారణంగా ముసుగులు నాటకాది ప్రదర్శనల వేషధారణలో భాగంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో ముసుగులూ వేషాలూ దైనందిన జీవితంలో నిత్యకృత్యాలుగా మారిపోయాయి.అతి వినయం ధూర్త లక్షణానికి ముసుగు. ‘వదనం పద్మదళాకారం వచశ్చందన శీతలం/ హృదయం కర్తరీ తుల్యం, అతి వినయం ధూర్త లక్షణం’ అని మనకో సుభాషిత శ్లోకం ఉంది. అలాగే, ‘జటిలో ముండీ లుంభిత కేశః/ కాషాయాంబర బహుకృత వేష/ పశ్యన్నిపిచ న పశ్యతి మూఢో/ ఉదర నిమిత్తం బహుకృత వేషం’ అన్నాడు ఆదిశంకరుడు. పైన ఉదహరించిన సుభాషిత శ్లోకాన్ని, ఆదిశంకరుడి శ్లోకాన్ని గమనిస్తే, ముసుగులూ వేషాలూ ఆనాటి నుంచే ఉన్నట్లు అర్థమవుతుంది. కాకుంటే, అప్పటివి సత్తెకాలపు ముసుగులు. అతి తెలివిని ప్రదర్శించబోయిన అమాయకపు వేషాలు. ప్రధానంగా వాటి ప్రయోజనం ఉదర నిమిత్తానికే పరిమితమై ఉండేది. కేవలం ఉదర నిమిత్తం వేసుకునే ముసుగులూ వేషాల వల్ల ఎంతో కొంత వినోదమే తప్ప సమాజానికి పెద్దగా చేటు ఏమీ ఉండదు. అయినా, ఆనాటి సమాజంలోని ప్రాజ్ఞులు ముసుగులనూ, వేషాలనూ నిరసించేవారు. అలాంటివారి నిరసనల వల్ల ముసుగులూ వేషాలూ శ్రుతి మించకుండా ఉండేవి. అప్పట్లో ముసుగులకూ వేషాలకూ పెద్దగా ప్రచారం ఉండేది కాదు. అంతగా జనాదరణ ఉండేది కాదు. సినిమాలు వచ్చాక చిత్రవిచిత్ర వేషాలకు ప్రచారమూ పెరిగింది. నాటకాలు, సినిమాలు మాత్రమే వినోద సాధనాలుగా ఉన్న కాలంలో నటీనటులు మాత్రమే పాత్రోచిత వేషాలు వేసేవారు. సమాజంలో పెద్దమనుషుల ముసుగులో ఉండే వేషధారులు అక్కడక్కడా మాత్రమే ఉండేవారు. ఇక స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక మనుషులంతా వేషధారులుగా మారిపోయిన పరిస్థితి దాపురించింది. కృత్రిమ మేధ తోడయ్యాక మనుషుల అసలు ముఖాలను పోల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి వాటిల్లింది. ఇప్పుడు నటీనటులే కాదు, వారికి పోటీగా దేశాధినేతలు కూడా యథాశక్తిగా దేవతావస్త్రాల ముసుగులను తొడుక్కుని, రకరకాల వేషాలతో నవరసాభినయ చాతుర్యంతో జనాలను విస్మయంలో ముంచెత్తుతున్నారు.‘స్మార్ట్’ వేషాల సంగతి ఒక ఎత్తయితే, ఇప్పుడు చైనాలో సిలికాన్ ముసుగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అలాంటిలాంటివి కావు, అల్ట్రా రియలిస్టిక్ ముసుగులు. ఒక నలభయ్యేళ్ల వ్యక్తి ఒక వృద్ధుడి ముఖాన్ని పోలిన సిలికాన్ ముసుగు వేసుకుని నేరాలకు పాల్పడిన సంగతి బయటపడటంతో కలకలం మొదలైంది. సిలికాన్ ముసుగుల చట్టబద్ధతపై కూడా చర్చ మొదలైంది. అయినా, ఎంత సిలికాన్ ముసుగులైతే మాత్రం అవేమైనా దేవతా వస్త్రాల ముసుగులా? అసలు ముఖాలను ఎంతకాలం దాచగలవు పాపం?! -
మిగిలేది... మానవత్వ పరిమళమే!
సమాజం భ్రష్టు పట్టిపోయింది. మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. నిజమే! కాని, మానవత్వం గల మనుషులు కొందరైనా ఉన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. అయితే, సమాజంలో వీరి శాతాన్ని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్ లోని గ్రేమోత్ లోకల్ మార్కెట్లో ఒక దయార్ద్ర హృదయుడు తిరుగుతుంటాడు. రొయ్యల, చేపలూ లాగా అక్కడ ఫుడ్ మార్కెట్లో తాబేళ్ళను కూడా అమ్ముతారు. మనం చెప్పుకుంటున్న దయార్ద్ర హృదయుడు తాబేలు మాంసం కోసం రాడు. తాబేళ్ళను రక్షించడానికి వస్తుంటాడు. బేరమాడి మార్కెట్లో బతికి ఉన్న తాబేళ్ళన్నింటినీ కొంటాడు. వాటిని ట్రక్కులో వేసుకుని పోయి సముద్రంలోకి వదులుతాడు. అక్కడ తాబేళ్లు అంతరించి పోయే దశలో ఉన్నాయి. అందుకే ఈ పని! ఏదో విధంగా తమ పని గడిస్తే చాలుననుకుంటూ కాలుష్యాలు పెంచుతున్న మనుషుల మధ్య ఎంతో బాధ్యతతో ‘మనిషి’లా ప్రవర్తించే వారున్నారు. ‘ప్రపంచమేమీ గొడ్డుపోలేదు’ అని అన్నది అందుకే! పాపువా న్యూ గినియా – మార్కెట్ల దగ్గరా ఇలాంటి జీవ పరిరక్షకులు ఉన్నారు. ఇటీవల రాజస్థాన్ జైపూర్లో మానవత్వం మతాన్ని గెలిచింది. మధూలిక అనే ఒక 48 ఏళ్ల హిందూ మహిళ 13 మంది ముస్లింల ప్రాణాలు కాపాడింది. భర్త చనిపోయి, ఇద్దరు పిల్లలతో ఒక బట్టల కొట్టు నడుపుకుంటూ జీవిస్తోంది. ఆమె బట్టల కొట్టు ఉన్న ఆ వీధిలో ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారు. ఒకరోజు హిందూ వర్గానికి చెందిన గుంపు – శోభాయాత్ర ఊరేగింపు తీస్తూ అల్లర్లు సృష్టించింది. అందులో భాగంగా అక్కడ ఉన్న 13 మంది ముస్లింలపై దాడిచేయడానికి వారి వెంట పడ్డారు. ఇదంతా గమనించిన మధూలిక ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చిన ముస్లింలను తన కొట్టులోకి పంపి వెంటనే షట్టర్ వేసేసింది. తర్వాత హిందూ దుండగుల్ని ధైర్యంగా ఎదుర్కొని, చాకచక్యంగా వారిని వెనక్కి పంపించింది. ‘మానవత్వం అన్నిటికన్నా గొప్పదని భావించి, ముస్లిం సోదరులకు ఆశ్రయమిచ్చాన’ని– ఆ తర్వాత ఆమె పత్రికల వారికి చెప్పింది. ఒక సామాన్య మహిళ ఆచరణాత్మకంగా, ఎంతో గొప్ప సందేశం ఇచ్చింది. హైదరాబాదు పాత బస్తీలో గాజుల అంజయ్య అందరికీ తెలిసినవాడు. అతని మిత్రులలో చాలా మంది ముస్లింలే. 2022, ఏప్రిల్ 17న తన కొడుకు పెళ్ళికి మిత్రులందరినీ ఆహ్వానించాడు. అవి రంజాన్ రోజులు గనుక ‘రోజా’ పాటించే తన ముస్లిం మిత్రులెవరూ ఇబ్బంది పడకూడదని వారి కోసం నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. ఇఫ్తార్ విందూ ఏర్పాటు చేశాడు. వారంతా మరునాడు ఉపవాసం పాటించేందుకు ‘సహౌరీ’ ఏర్పాటు చేశాడు. స్వార్థప్రయోజనాల కోసం విద్వేషాలు నూరిపోసే వారి వలలో పడకూడదనీ, గంగా జమునా తహజీబ్ను కాపాడుకోవడం అందరి బాధ్యత అనీ పాతబస్తీ అంజయ్య ఎప్పుడూ చెబుతుంటాడు. ఇలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది. ఒక ముల్లాగారు తమ మసీదులో హిందూ అమ్మాయి వివాహం జరిపించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.ముస్లింల, క్రైస్తవుల సఖ్యత గూర్చి కూడా ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. ఇది 2022 ఏప్రిల్ 21న మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్లో ముస్లింలు చర్చిలో నమాజు చదివారు. ఇఫ్తార్ విందుకోసం అజ్మల్ ఖాన్ అనే వ్యక్తి అన్ని మతాల మత పెద్దల్ని ఆహ్వానించాడు. అయితే, అక్కడ చర్చి ఫాదర్ ఆ విందు అహ్వానాన్ని అంగీకరించడమే కాకుండా, ఆ ఇఫ్తార్ విందు తమ చర్చిలోనే నిర్వహించాలని సూచించాడు. ఆ రకంగా తొలిసారి ఇస్తార్ విందు చర్చిలో, ఫాదర్ పర్యవేక్షణలో జరిగింది. పరమత సహనం, సహకారం అంటే ఇదే కదా! అసలైన భారతదేశపు ‘ఆత్మ’ అక్కడ తొణికిసలాడింది. ఆత్మ అంటే... ఆత్మ – పరమాత్మలు కావు. అంతరంగంలోని ఒక సమర్పణ భావం! ఆలోచనల ఐక్యత!! గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం. మనిషి మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమించడం. ఇక్కడ చెప్పుకున్న సంఘటనలన్నింటికీ ఒక అంతస్సూత్రం ఉంది. ‘దేవుడు లేడు – మతం అనేది వ్యక్తిగతం – మన చివరి గమ్యం – మానవవాదం’ అనేది సాధించడానికి... ఇలా మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయేమో!క్రమంగా తరతమ భేదాలు మరిచి, మనుషులంతా ఒక్కటే అనే విషయం జీర్ణించుకునేందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయేమో? మనిషికి మనిషే ముఖ్యం – దేవుళ్ళు కాదు, అనే భావనలోకి సమాజం ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా ‘మన మార్గం సుదీర్ఘమైంది. రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. మన పరిమితులు మనకు తెలుసు. ఇరవై ఒకటవ శతాబ్దపు స్త్రీ – పురుషుల్ని అంటే మనల్ని మనం కొత్తగా తయారు చేసుకోవడానికి రోజు వారీగా కృషి చేస్తూనే ఉండాలి’ అన్న చే గువేరా మాటలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నిజమే– బూజు పట్టిన భావజాలాన్ని వదిలి, కొంచెం కొంచెంగా పైపైకి ఎదుగుతూనే ఉండాలి. పైకి ఎదిగితేనే (ఎగిరితేనే) అద్భుతమైన మానవత్వ దృశ్యాలు కనబడతాయి. నువ్వు బతికి ఉన్నావంటే...నీ జీవితపు విజయోత్సవాన్ని పంచుకోస్వర్గమనేది ఎక్కడైనా ఉంటే...దాన్ని భూమి మీదికి దించుకో–అని ఎలుగెత్తి చెబుతూ ముందుకు సాగాల్సి ఉంది.డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత -
సకామ కర్మ – అకామ కర్మ
మనిషి ఏ పనీ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండటం అసాధ్యం. ఏమీ చేయటం లేదు అన్నప్పుడు ఆ మాట పలకటం కర్మయే కదా! అప్పుడు కూడా గాలి పీల్చటం, తిన్న దానిని అరిగించుకోవటం వంటి పనులు చేస్తూనే ఉంటాము కదా! ఇవి కూడా మనని పట్టి బంధించి మరొక జన్మకి కారణం అవుతాయా? అనే సందేహం కలగటం సహజం. దీనిని గురించి భగవద్గీతలో కృష్ణుడు వివరంగానే చె΄్పాడు. ‘అకర్మ’ అని. నిజానికి జీవించి ఉండటమే ఒక కర్మ. జీవ చైతన్యం జీవికి ధర్మం. దాని వ్యక్త స్వరూపం కదలిక. అప్పుడే పుట్టిన బిడ్డ కాళ్ళు చేతులు కదిలిస్తూ ఏడుస్తాడు. బిడ్డ ఏడవక ΄ోయినా, కదలికలు లేక΄ోయినా పెద్దలు ఏడవ వలసి ఉంటుంది. ఏదోవిధంగా ఏడిపించే ప్రయత్నం చేస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న ఈ కదలికలు, ధ్వనులు క్రమేణా వయస్సుని బట్టి సంకల్పాలతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే అభి్ర΄ాయానికి అనుగుణంగా కదలికలు ఉంటాయి. మొదట్లో నవ్వటం, ఏడవటం అకారణంగా ఉంటాయి. ఇది నిష్కామకర్మ. రాను రాను వయసుని బట్టి ఈ ఏడుపులు, నవ్వులు సకారణంగా మారుతాయి. తెలిసినవారిని చూసి నవ్వటం, కొత్తవారిని చూసి ఏడవటం, ఆకలి వేస్తే, చీమ కుడితే ఏడవటం సకారణమేగా. పైగా ఎవరైనా వచ్చి తన బాధ తీర్చాలనే కోరికతో చేసినదే కనుక సకామ కర్మ అవుతుంది. చేతులు కదలి నోటి దాకా వచ్చి వ్రేళ్ళు చీకటం మొదలవుతుంది. చేతిని నోటిదాకా తీసుకు రావటానికి ఎంత తాపత్రయ పడతారో పిల్లలు గమనించ వచ్చు. ఆ పైన ఆ కదలిక వస్తువులను చూపించటం, పట్టుకోవటంలో నేర్పు చూపించటంగా మార్పు చెందుతుంది. అదే విధంగా ఏడవటం ఊ కొట్టటంగా మారి, క్రమంగా మాటలుగా పరిణామం జరుగుతుంది. తన అభి్ర΄ాయాలు, కోరికలు వ్యక్తీకరించటానికి మాటలని ఉపయోగించటం జరుగుతుంది. ఇది ఎంతో సహజంగా, అప్రయత్నంగా జరిగే పరిణామం. మనోవాక్కాయకర్మలచే మొదలైన దివ్యకర్మ మానవకర్మగా మలచ బడింది. అకామకర్మ బంధించదు. సకామకర్మ బంధ హేతువు. అకామకర్మ సకామకర్మగా రూ΄ాంతరం చెందుతున్న క్రమంలో అది ఘనీభవించి తాను అందులో బంధించబడకుండా జాగరూకత వహించవలసి ఉంటుంది. ప్రతిదీ లాభనష్టాల లెక్కలతో బేరీజు వేయటానికి అలవాటు పడిన మనిషికి ఇది సాధ్యమా? అనిపించటం సహజం. కానీ ఆ విధంగా ఉండటమే సహజం. స్వార్థపూరితంగా ఉండటమే తెచ్చిపెట్టుకున్న లక్షణం. ఎందుకంటే పుట్టిన కొత్తలో ప్రతి మనిషి శిశువుగా ఏ పని చేసినా ప్రయోజనాన్ని ఆశించి చేయటం ఉండదు. చిన్నపిల్లలు ఒక్క క్షణం కూడా ఒక చోట స్థిరంగా కూర్చోరు. గిరా గిరా తిరుగుతూనే ఉంటారు. ఎందుకు అని అడిగితే ‘ఊరికే’ అంటారు. పెరిగి పెద్ద అయినాక కూడా ఏదో ఒక పని చేయకుండా ఉండలేము. దానికి ఒక సంకల్పం, లేదా కోరిక జత చేయటం జరుగుతుంది. ఈ కోరిక బంధిస్తుంది. ఎలాగూ ఏమి చేయకుండా ఉండలేము కనుక ఏదైనా మనస్సుతో, వాక్కుతో, చేతులతో ఫలితాన్ని ఆశించకుండా పదిమందికి ఉపయోగ పడే పని చేస్తూ ఉంటే అది నిష్కామకర్మ అవుతుంది. దేహం ఉన్నంత వరకు కర్మాచరణ మాన రాదు.గాలి పీల్చటం, గుండె కొట్టుకోవటం, ఊపిరితిత్తులు పని చేయటం మన ప్రయత్నం లేకుండా ఎట్లా జరుగుతున్నాయో నిత్యకృత్యాలు కూడా అదేవిధంగా యాంత్రికంగా, అప్రయత్నంగా కొనసాగిస్తూ, వాటిలో మానసికంగా లగ్నం కాకుండా ఉన్నప్పుడు సకామకర్మ అవదు. కనుక బంధించదు, మరొక జన్మకి కారణం కాదు. -
ధర్మం అంటే..? మంచిమాట
ప్రకృతి ఎలా ప్రవర్తించాలి, ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే ధర్మం. అది మార్పు చెందే ప్రసక్తే ఉండదు. మనిషికి ఆధ్యాత్మికోన్నతి అందించేదే ధర్మం. మానవ ధర్మాల్లో ముఖ్యమైనవి– నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, అలాగే మనిషిని దహింప జేసేవి– అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ. మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతరప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు. మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించవలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ఠ, దయాగుణం, తపస్సు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, నిజాయితీ, నిష్కపటం, ఓర్పు, వినయం మొదలైనవి ప్రతి వ్యక్తి పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. ఇవి వ్యక్తిగతంగా తనకే గాక తాను జీవిస్తున్న సమాజానికి, సర్వమానవాళికి కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. మానవులకు, జంతువులకు, వస్తువులకు పరమాత్మ ధర్మాలను నిర్దేశించాడు. వినయం, సహనం, ఆచారం, పరాక్రమం మనిషికి సంస్కారం అందించే సాధనాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తన దారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం. అగ్ని వేడిని, నీరు చల్లదనాన్ని అందిస్తాయి. సింహం గర్జిస్తుంది. అటు ఇటూ పరుగెత్తుతూ చపలత్వాన్ని ప్రదర్శించడం లేడి లక్షణం. ఈ రకంగా ప్రతిదీ తన ధర్మాన్ని పాటింపజేయడం కేవలం పరమాత్మ సృజన. ఆయన సంకల్పం లేనిదే మానవ ధర్మం మృగ్యమే. ప్రతి పనిలో మనిషి అభివృద్ధిని ఆశిస్తాడు. అది సాధించాలంటే కఠోర సాధన అవసరం. సాధనే ధర్మం. అది మనిషిని పతనం కానివ్వకుండా కాపాడుతుంది. ధర్మాచరణ వ్యక్తి మనఃస్థితిని బట్టి ఆధారపడి వుంటుంది. తన వ్యక్తిగత ధర్మాన్ని విడిస్తే అది అభివృద్ధిని నిరోధిస్తుంది. అటువంటి వ్యక్తికి సుఖ సంతోషాలు, శాంతి లభించవు. ప్రతి వ్యక్తి ధర్మాన్ని రక్షించాలి. ప్రతి పనినీ ధర్మబద్ధంగా చేయాలి. ధర్మాచరణను కొనసాగించాలి. ‘ధర్మో రక్షతి రక్షితః’. ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడో, అట్టి వ్యక్తిని ధర్మమే కాపాడుతుంది. ధర్మానికి హాని చేసేవాడిని ధర్మమే హతమారుస్తుంది. కొలిమిద్వారా పుట్టిన వేడివల్ల ఇనుము వేడెక్కుతుంది. బంగారం శుద్ధి అవుతుంది. అట్లే ధర్మాచరణ వ్యక్తిని, మనసును శుద్ధిపరుస్తుంది. ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా చేసుకోవాలి గాని అధర్మం చేస్తూ ఇతరులను భయపెట్టకూడదు. ఎంత సంపాదించినా పైకి తీసుకొని పోయేటపుడు కేవలం పాపపుణ్యాలే కాని మణి మాణిక్యాలు కావు. మన తర్వాత ఉన్నవాళ్లు మనం సంపాదించింది తింటారో తినరో వారికే విధంగా విధి రాసి ఉందో తెలియదు. వారికి భగవంతుడే విధంగా తినేప్రాప్తిని రాసి పెట్టాడో వారు అలానే ఉంటారు. కనుక రాబోయే తరాలకు నువ్వు సంపాదించి ఇచ్చే తాపత్రయం పెంచుకోకూడదు. ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతనీ బాధ్యతనీ మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. అదే ధర్మో రక్షతి రక్షితః. ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి: ధర్మాచరణ వలన అర్థప్రాప్తి, ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మ సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది. స్వధర్మానికి బాధ కలిగించేది–విధర్మం, ఇతరుల ప్రేరణచే ఇతరుల ధర్మాన్ని ఆచరించేది – పరధర్మం, భగవంతుడి పట్ల విశ్వాసరహితులైన వారు చేసేది, చెప్పేది – ఉపధర్మం. తన «దర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, చెప్పబడిన ధర్మానికి విపరీతార్థాలను తీసి వివరించడం అనే అయిదు ‘అధర్మాలు’ త్యజించవలసినవిగా వేదవ్యాసుడు పేర్కొన్నాడు. కరుణ, ఆదర్శ గృహస్థ జీవనం, నిత్యకర్మాచరణ శీలత లోక కల్యాణకార కాలు, భగవద్భక్తి మార్గ నిర్దేశాలు. వీటిని మరవడం మన ధర్మాన్ని మనం మరచిపోవడమేనన్నది సత్యం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
AI: త్వరలోనే ‘ఏఐ’తో ఆ ముప్పు!
కాలిఫోర్నియా: కీడెంచి మేలు ఎంచాలంటారు పెద్దలు. కానీ జనరేటివ్ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విషయంపై అందరూ చేస్తోంది దాంతో వచ్చే మేళ్ల గురించిన చర్చే. ఈ అత్యాధునిక టెక్నాలజీతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఎవరూ ఆలోచించడం లేదు. అయితే మెషిన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఎలిజర్ యడ్కోవ్స్కీ మాత్రం ఈ కోణంలో ఆలోచించి మానవాళికి ఏఐతో ఏ రేంజ్లో ముప్పు పొంచి ఉందో చెబుతున్నాడు. గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐకి సంబంధించి యడ్కోవ్స్కీ ఒక సంచలన విషయం వెల్లడించాడు. మరో రెండేళ్లు లేదంటే ఐదేళ్లు, మరీ అడిగితే ఓ పదేళ్లు మాత్రమే మానవాళికి మిగిలి ఉన్న గడువని చెప్పాడు. మిగిలిన గడువు అని యడ్కోస్కీ వాడిన పదానికి ఆయనను ఇంటర్వ్యూ చేసిన టామ్ లామంట్ అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు. టర్మినేటర్, మ్యాట్రిక్స్ సినిమాల్లో చూపించినట్లు మెషీన్లతోనే అంతం అని లామంట్ వివరించాడు. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని చాలా మంది ఏఐని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే యడ్కోవ్స్కీ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఏఐతో ఏకంగా మానవాళికే ముప్పు అని అతని స్టైల్లో హెచ్చరించాడు. గతంలోనూ డేటా సెంటర్ల విషయంలో బాంబింగ్ డేటా సెంటర్లనే పదాన్ని ఈయన వాడాడు. అయితే దీని విషయంలో కొద్దిగా పునరాలోచనలో పడ్డానని కూడా అతడే తర్వాత చెప్పడం గమనార్హం. ఇదీ చదవండి.. సొంత దేశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
మానవాళికి హమాస్ అపచారం
ఇజ్రాయెల్ గతాన్ని చూపి హమాస్ నేరాలను సమర్థించటం ఎంతమాత్రమూ సాధ్యం కాదు. రెండు తప్పులు ఒక ఒప్పుగా మారవు. దురాక్రమణతో దశాబ్దాలుగా లక్షలాదిమంది పాలస్తీనియన్లను చెరబట్టడం, ఇటీవలి సంవత్సరాల్లో శాంతి కోసం చిత్తశుద్ధితో జరిగిన ప్రయత్నాలను వమ్ము చేయటం విషయంలో ఇజ్రాయెల్ను కచ్చితంగా విమర్శించాల్సిందే. అయితే హమాస్ దుశ్చర్యలు శాంతిప్రక్రియ పునఃప్రారంభం కోసం చేసినవి కాదు. ఆ దారుణాలు దురాక్రమణను అంతం చేసేవి కూడా కాదు. దానికి విరుద్ధంగా హమాస్ ప్రారంభించిన యుద్ధం లక్షలాదిమంది పాలస్తీనా పౌరుల ఎడతెగని వ్యథకు కారణమైంది. అవీవ్ కుట్జ్ నా బాల్య స్నేహితుడికి చాలా సన్నిహిత మిత్రుడు. ఇజ్రాయెల్లో కఫార్ అజా ప్రాంతంలో భార్య లివ్నాత్, ముగ్గురు పిల్లలతో అవీవ్ చాలా కాలం నుంచి నివసిస్తున్నాడు. తమ కిబుట్జ్ (కిబుట్జ్ అంటే హిబ్రూ భాషలో పెద్ద వ్యవసాయ క్షేత్రం. స్వచ్ఛందంగా, పోటీరహితంగా పనిచేయడానికి ముందుకొచ్చే వ్యక్తుల సమూహం అక్కడ నివసిస్తుంది)పై హమాస్ జరిపే రాకెట్లు, మోర్టార్ల దాడులు చూస్తూనేవున్నా ఏదో ఒక నాటికి ప్రశాంతత ఏర్పడక పోతుందా అన్న ఆశతో కుట్జ్ కుటుంబం అక్కడే వుంటోంది. యుద్ధ క్షేత్రంలో కాస్తయినా శాంతిని వెదుక్కోవాలనే సంకల్పంతో యేటా పతంగుల పండుగ నిర్వహించటం కుట్జ్ కుటుంబానికి అలవాటు. ఆ ఉత్సవంలో రంగురంగుల గాలిపటాలు, అందులో కొన్నింటిపై శాంతి సందేశాలు– అన్నిటినీ గాజా సరిహద్దు ముళ్ల కంచెకు సమీపంలోనే ఎగరేస్తారు. ‘మేం ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాం తప్ప ఘర్షణను కాదని చెప్పటమే ఈ ఉత్సవ సారాంశం’ అని గతంలో జరిగిన పతంగుల పండుగలో పాల్గొన్న లివ్నాత్ సోదరి చెప్పారు. ఈసారి పతంగుల పండుగ అక్టోబర్ 7న జరపాలని నిర్ణయించారు. కానీ ఆ ఉత్సవ ప్రారంభానికి కొన్ని గంటల ముందు హమాస్ ఉగ్రవాదులు కఫార్ అజాపై విరుచుకు పడ్డారు. దాన్ని చెరబట్టారు. కుట్జ్ అయిదుగురు కుటుంబ సభ్యులనూ హత మార్చారు. ఇటువంటి ఉదంతాలు మనసును కలచివేస్తాయి. మనుషులు ఎందుకీ దారుణాలకు పాల్పడతారు? దీనిద్వారా హమాస్ సాధించదల్చుకున్నది ఏమిటి? ఒక ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవటం సంప్రదాయ సంగ్రామం లక్ష్యంగా ఉంటుంది. హమాస్ ఉగ్రవాదం దీనికి భిన్నం. భయోత్పాతాన్ని వ్యాపింపజేయటం, లక్షలమంది ఇజ్రా యెలీ, పాలస్తీనా పౌరుల్లోనూ, ప్రపంచ ప్రజానీకంలోనూ విద్వేష బీజాలు నాటడం దాని మానసిక యుద్ధతంత్ర ఆంతర్యం. పీఎల్ఓ వంటి ఇతర పాలస్తీనా సంస్థలకు హమాస్ భిన్నమైనది. మొత్తం పాలస్తీనా పౌరులందరితో దాన్ని సమం చేయకూడదు. హమాస్ తన పుట్టుక నుంచీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ ఉనికిని, మనుగడ సాగించేందుకు దానికిగల హక్కును గుర్తించ నిరాకరిస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇతర అరబ్బు దేశాల పౌరుల మధ్య శాంతి సాధనకు ఏర్పడే ప్రతి అవకాశాన్నీ తన శక్తికొద్దీ ధ్వంసం చేస్తోంది. ప్రస్తుత హింసా పరంపరకు నేపథ్యం ఇజ్రాయెల్కూ, గల్ఫ్ దేశాలకూ మధ్య కుదురుతున్న శాంతి ఒప్పందాలు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య సైతం శాంతి ఒప్పందం చిగురించబోతున్నది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్యా సాధారణ సంబంధాలు ఏర్పర్చడం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దురాక్రమణలో బతుకులు వెళ్లదీస్తున్న లక్షలాదిమంది పాలస్తీనా వాసులకు ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించటానికి తోడ్పడుతుంది. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతి ప్రక్రియ పునఃప్రారంభం కావటానికి దోహదం చేస్తుంది. శాంతి స్థాపన అవకాశాల కన్నా హమాస్ను భయపెట్టగలిగేది మరేదీ వుండదు. అందుకే అది అక్టోబర్ దాడులకు తెగబడింది. కేవలం ఆ కారణంతోనే కుట్జ్ కుటుంబ సభ్యులనూ, మరో వేయిమందికి పైగా ఇజ్రాయెలీ పౌరులనూ అత్యంత పాశవికంగా హతమార్చింది. హమాస్ చర్య దాని సంపూర్ణ అర్థంలో అక్షరాలా మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరమే. మానవత్వంలో మనకుండే విశ్వాసాన్ని ధ్వంసం చేయటమే. ఇజ్రాయెల్ గతాన్ని చూపి హమాస్ నేరాలను సమర్థించటం ఎంత మాత్రమూ సాధ్యంకాదు. రెండు తప్పులు ఒక ఒప్పుగా మారవు. దురాక్రమణతో దశాబ్దాలుగా లక్షలాదిమంది పాలస్తీనియ న్లను చెర బట్టడం, ఇటీవలి సంవత్సరాల్లో శాంతికోసం చిత్తశుద్ధితో జరిగిన ప్రయత్నాలను వమ్ము చేయటం విషయంలో ఇజ్రాయెల్ను కచ్చితంగా విమర్శించాల్సిందే. అయితే కుట్జ్ కుటుంబ సభ్యుల హత్య, ఇతర దుశ్చర్యలు శాంతిప్రక్రియ పునఃప్రారంభం కోసం చేసినవి కాదు. ఆ దారుణాలు దురాక్రమణను అంతం చేసేవి కూడా కాదు. దానికి విరుద్ధంగా హమాస్ ప్రారంభించిన యుద్ధం లక్షలాది మంది పాలస్తీనా పౌరుల ఎడతెగని వ్యథకు కారణమైంది. హమాస్పై సాగిస్తున్న యుద్ధంలో తన ప్రాంతాన్నీ, పౌరులనూ పరిరక్షించుకోవటం మాత్రమే కాదు... తన మానవీయతను కాపాడు కోవటం కూడా ఇజ్రాయెల్ కర్తవ్యమే. తమ స్వస్థలంలో శాంతి సౌభాగ్యాలు అనుభవించే హక్కు పాలస్తీనా పౌరులకుంది. దాంతోపాటు ఘర్షణల మధ్య కూడా వారి మౌలిక మానవ హక్కులను అన్ని పక్షాలూ గుర్తించి తీరాలి. ఇది ఒక్క ఇజ్రాయెల్కు మాత్రమే కాదు... గాజా స్ట్రిప్తో సరిహద్దు వుండి, దాన్ని పాక్షికంగా మూసివేసిన ఈజిప్టుకు కూడా వర్తిస్తుంది. ఇక హమాస్ విషయానికొస్తే మాన వాళి మొత్తం ఆ సంస్థనూ, దాని మద్దతుదార్లనూ వెలివేయాలి. గాజా యుద్ధ ఉద్దేశాలేమిటో విస్పష్టంగా ఉండాలి. హమాస్ను నిరాయుధీకరించాలి. గాజా స్ట్రిప్ను నిస్సైనికీకరించాలి. అలాగైతేనే పాలస్తీనా పౌరులు గౌరవ మర్యాదలతో మనుగడ సాగి స్తారు. వారితోపాటు ఇజ్రాయెల్ పౌరులు కూడా నిర్భయంగా జీవనం కొనసాగిస్తారు. ఈ లక్ష్యాలు సాధించేంతవరకూ మన మానవీయతనుకాపా డుకోవటం ఎంతో కష్టంతో కూడుకున్న పని. తీరని వేదన అనుభవిస్తున్న పాలస్తీనియన్లకు సహానుభూతి ప్రకటించటం మానసికంగా అశక్తతలో, అచేతనలో కూరుకుపోయిన చాలామంది ఇజ్రాయెలీ పౌరులకు కష్టమే. మనసులు స్వీయ విషాదంతో నిండి పోయిన వర్తమానంలో కనీసం వేరేవారి వ్యథను గుర్తించటానికి కూడా అందులో చోటు మిగలదు. ఎన్ని కష్టాల్లోనైనా అలాంటి చోటును నిలుపుకోగలిగిన కుట్జ్ కుటుంబం, వారిలాంటి అనేకులు ఇవాళ మృత్యు ఒడికి చేరారు. లేదా తీవ్ర మనోవ్యాకులత లోనికి జారుకున్నారు. అటు పాలస్తీనా పౌరులదీ ఇదే పరిస్థితి. వారు సైతం చెప్పలేనంత వ్యథను అనుభవిస్తున్నారు. మా బాధలను గమనించే స్థితిలో లేరు. కానీ ఈ వేదనాభరిత స్థితికి దూరంగావున్న ఇతరులంతా వాస్తవాలను పాక్షిక దృష్టితో చూసే మందబుద్ధిని వదుల్చుకుని బాధాసర్పద్రష్టులందరికీ సహానుభూతి ప్రకటించటానికి కృషి చేయాలి. శాంతి స్థాపనకు చోటుండేలా సహాయపడటం వెలుపలి వారి కర్తవ్యం. ఆ బాధ్యతను మీకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే ఆ విషయంలో మేం అశక్తులమయ్యాం. మా కోసం మీరు ఆ మంచి పని చేయండి. ఏదో ఒకరోజు ఈ కష్టాలన్నీ కడతేరినప్పుడు, ఈ గాయాలు మానినప్పుడు ఇజ్రాయెలీ పౌరులూ, పాలస్తీనా పౌరులూ ఆ చోటులో సురక్షితంగా మనుగడ సాగిస్తారు. యువల్ నోవా హరారి ఇజ్రాయెల్ పౌరుడు. చరిత్రకారుడు, తత్వవేత్త. ‘సేపియన్స్’, ‘హోమో డియుస్’, ‘అన్స్టాపబుల్ అజ్’ తదితర పుస్తకాల రచయిత. యువల్ నోవా హరారి (‘టైమ్’ సౌజన్యంతో) -
మొత్తం మానవాళికే సమస్య!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ‘కాప్ 28’ సదస్సు జరగనుంది. పూర్వ సగటు ఉష్ణోగ్రతల కంటే 2023లో 1.4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. వాతావరణ మార్పుల సదస్సు కోసం ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు సమావేశమవుతున్నప్పుడు, ఇంతకంటే కీలక సమస్య వేరేదీ లేదు. ఇప్పటికే, ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాలలో వరద బీభత్సం విదితమే. దేశమంతటా వర్షాలు సకాలంలో పడలేదు. వ్యవసాయ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నది. పంటల విస్తీర్ణం, దిగుబడి మీద వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (యూఎన్ఎఫ్సీసీసీ) లోని అన్ని సభ్యత్వ పక్షాలు దుబాయ్లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు సమావేశం కానున్నాయి. 2015 పారిస్ ఒప్పందం ప్రకారం తొలి ‘గ్లోబల్ స్టాక్ టేక్’ (జీఎస్టీ) పూర్తి చేయడం ఈ సమావేశంలో మొదటి ప్రధాన అంశం. పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించే దిశగా సమష్టి పురోగతిని అంచనా వేయడం, ముఖ్యంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు, అడాప్టేషన్ ప్రయత్నాల పురోగతి, నిధుల ప్రవాహం అంచనా వేయడం ఈ జీఎస్టీ లక్ష్యం. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మదింపు తదుపరి పర్యావరణ, వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసుకునే చర్యలకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడింది. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గేనా? 2023 సెప్టెంబర్లో విడుదలైన మొదటి జీఎస్టీ అధ్యయన ఫలితం, స్పష్టంగా ఉన్నది: ప్రపంచం మొత్తం అనుకున్న లక్ష్యం నుంచి దారి తప్పింది. ఈ నేపథ్యంలో దుబాయ్లో జరగనున్న ‘కాప్ 28’(కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్– భాగస్వామ్య పక్షాల 28వ సమావేశం)లో దీని దిద్దుబాటు మీద చర్చ జరుగుతుందని ఆశిస్తున్నారు. అనేక చర్యల మీద ఏకాభిప్రాయం లేదు. ఈ నివేదిక వల్ల కొన్ని చర్యల పైన విశాల ఒప్పందాలు జరుగుతాయని అంచనా. ప్రధానంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు చేయాలనే లక్ష్యం ఒకటి కాగా, శిలాజ ఇంధనాల వినియోగం దశల వారీగా తగ్గించే లక్ష్యం పైన చర్చలు వివాదాస్పదంగా ఉన్నాయి. దుబాయ్ సమావేశం అధ్యక్షుడు ఒక చమురు కంపెనీ అధిపతి అయిన నేపథ్యంలో చమురు ఉపయోగం తగ్గించడానికి చర్చలు జరుగుతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. రెండవ పెద్ద అంశం, ‘నష్టం మరియు హాని’. పేద దేశాలు, వెనుకబడిన దేశాల మీద వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ ఉండడంతో భూగోళ కాలుష్యానికి కారక దేశాలు నష్ట పరిహారం అందించాలని చర్చలు జరుగుతున్నాయి. గత కాప్ 27 సమావేశంలో ఆఫ్రికన్ దేశాలు పట్టుబట్టి నష్టం మరియు హాని పరిహార నిధి ఏర్పాటును తీర్మానం చేశాయి. అటువంటి నిధిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఆ సమావేశ పురోగతిగా వర్ణించారు. ఈ కీలక నిర్ణయం తీసుకున్నా, దాని ఏర్పాటు విషయం దశలలో తేలాల్సి ఉంది. ఇప్పటికే గత ఏడాది నుంచి ఈ విషయం మీద సమావేశాలు జరుగు తున్నాయి. పురోగతి ఆశాజనకంగానే ఉన్నది. కర్బన ఉద్గారాల వల్ల భౌగోళిక కాలుష్యం పెరిగి, సగటు ఉష్ణోగ్రత పెరిగి, వాతావరణ మార్పులు జరిగి నష్టపోతున్న దేశాలు, ప్రాంతాలు వాటిని ఎదుర్కొనే ప్రతి చర్యల మీద నిధులు సొంతంగా పెట్టుకునే సామర్థ్యం లేక ఈ ప్రపంచ నిధి గురించి ఆలోచించాయి. భారత దేశంలో ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో విపరీత వర్షాల వల్ల నదీ ప్రవాహం పెరిగి కొన్ని ఆనకట్టలు కొట్టుకుపోయి జరిగిన ఆస్తి నష్టం అంచనా లక్ష కోట్ల రూపాయలు. ఇటువంటి నష్ట భర్తీకి, పునర్నిర్మాణానికి సొమ్ములు ప్రపంచ నిధి నుంచి ఇవ్వాలని ఆశిస్తున్నారు. కానీ ఆ నిధికి డబ్బులు ఎవరు, ఎంత ఇవ్వాలి అనే విషయం నుంచి ఎవరికి, ఏ విధంగా,ఎంత ఇవ్వాలి అనే వరకు చర్చలు జరుగుతున్నాయి. అన్ని ప్రాథమిక దశలోనే ఉన్నాయి. నష్ట పరిహార నిధి పూర్తి స్థాయి ఏర్పాటుకు కనీసం 5 ఏళ్లు పడుతుందని అంచనా. వేగంగా నిర్ణయించాలని పేద దేశాల ఆకాంక్ష. ధనిక దేశాలకు ఈ నిధి ఏర్పాటు ఇష్టం లేదు. అది తమ ఆర్థిక రంగం మీద భారం అవుతుంది అని వారి భావన. ఆహార, ఆరోగ్యాలపై ప్రభావం 2023 అంతటా వివిధ రూపాల్లో (రెండవ గ్లాస్గో సంభాషణ, ప్రత్యేక వర్క్ షాప్లు, మంత్రుల సంప్రదింపులతో సహా) దీనిపై చర్చలు జరిగాయి. కాల పరిమితులతో కూడిన లక్ష్యసాధన, అర్హత ప్రమాణాలు, ఆర్థిక వనరులు వంటి విషయాలపైన ఆలోచనలను రూపొందించడానికి ఒక పరివర్తన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పని చిన్నదేమీ కాదు. గ్రీన్ క్లైమేట్ ఫండ్ పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఐదేళ్లు పట్టింది. పరివర్తన కమిటీ పని తీరును పరిశీలిస్తే, పరిష్కరించ వలసిన సాంకేతిక అంశాలు మాత్రమే కాకుండా, విభేదాలను పరిష్క రించడానికి రాజకీయ మార్గదర్శకత్వం అవసరమని తెలుస్తుంది. యూఎన్ఎఫ్సీసీసీ కన్వెన్షన్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం, ఎస్బీఐ, ఎస్బీఎస్టీఏలకు సంబంధించిన ఐదు భారీ అంశాలతో పాటు అనేక ఇతర సమస్యలను కాప్ 28 ప్రస్తావించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాప్ 28 సమావేశ అధ్యక్ష (యూఏఈ) పాత్ర కీలకం అని భావిస్తున్నారు. ప్రత్యేకంగా శిలాజ ఇంధనాల ఉత్పత్తిని ఎలా పరిష్కరిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. వాతావరణ మార్పులకు, ఆహారం, ఆరోగ్యానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అర్థం చేసుకుని, తగిన చర్యల మీద దృష్టి పెంచడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. స్థూలంగా, వాతావరణ మార్పుల సదస్సు అంటే కేవలం చెట్లు, అడవులు, కాలుష్యం గురించే కాదు. ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ అభివృద్ధి విధానాలు, ఆర్థిక విధానాలు, ఉత్పత్తి పద్ధతులు, జీవన శైలి మార్పులతో సహా సమస్త మానవాళి చర్యల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇందులో సామాజిక న్యాయం, సమానత్వం, సహకారం, గౌరవం, మానవ హక్కులు వంటి సూత్రాలు విధిగా ఉంటాయి. భారతదేశం పాత్ర భారతదేశం వహించే పాత్ర కూడా అనేక అంతర్జాతీయ సమావేశాల మాదిరిగానే కాప్ 28 సదస్సులో కూడా ముఖ్యమైన అంశంగా మారుతున్నది. నిర్ణయాలు తీసుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు, అంతర్గతంగా ఎదురు అవుతున్న ప్రకృతిపరమైన నష్టాలకు భారత ప్రతినిధి వర్గం పని తీరును కూడా నిశితంగా గమనించాల్సి ఉన్నది. ఈ ప్రతినిధి వర్గంలో ఎవరు ఉంటారు, వారికి ప్రభుత్వం ఇచ్చిన సందేశం లేదా ఆదేశాలు ఏమిటి అని మీడియా ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా, ధనిక దేశాలు, పేద దేశాల మధ్య వారధిగా, అమెరికా దేశాల కూటమికీ, రష్యా, చైనా దేశాల కూటమికీ మధ్య కీలకంగా పరిణమించిన భారత్ ఈ సదస్సులో వ్యవహరించే తీరు మీద ఆసక్తి ఉన్నది. ‘అభివృద్ధి’ మార్గం వివాదస్పదం అవుతున్న సందర్భంలో, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, పేదరికం, అనారోగ్యం,ఆకలి వంటి అంశాలను పరిష్కరించే వివిధ మార్గాలు, చర్యలు కూడా అంతర్జాతీయ పరిణామాల ప్రభావానికి లోను అవుతున్నాయి. కాబట్టి అక్కడ జరిగేది వేరు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి వీలు లేదు. మన రాజకీయ వ్యవస్థ, ప్రధానంగా రాజకీయ నాయకులు ఈ అంశాల మీద తమ పరిజ్ఞానం పెంచుకుంటేబాగుంటుంది. దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు -
మనుషులకు తోకలు ఎలా మాయమైపోయాయి?
కోతి నుంచి రూపాంతరం చెంది మనిషిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల ఏళ్ల మార్పు తర్వాత.. నేటి ఆధునిక మనిషిగా మార్పు చెందాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్యాప్లో చాలా మార్పులు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైనది.. మనిషికి ఉన్న తోక మాయమైపోవడం! అవును.. తొలినాళ్లలో మనుషులకు తోకలు కూడా ఉండేవని.. పరిణామ క్రమంలో కొద్ది కొద్దిగా తోక మాయమైపోయింది. మరి ఆ తోక ఎప్పుడు మాయమైపోయిందో సరిగ్గా ఎవరికి తెలీదు.. ఈ విషయమే ఇప్పుడు తెలుసుకుందాం!. దాదాపుగా ప్రతీ జంతువుకూ, పక్షికీ తోక ఉంటుంది. వాటి శరీర నిర్మాణాన్ని బట్టి.. అవి పలు రకాలుగా ఉంటాయి. మనలో చాలా మందికి.. ఆ తోక గురించి తెలుసు తప్ప, అది ఎంతగా ఉపయోగ పడుతుందో తెలియదు. ఒక పక్షి ఆకాశంలో అలుపు లేకుండా ఎంతదూరమైనా ప్రయాణించడానికి కేవలం రెక్కలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. ఖచ్చితంగా తోక కూడా ఉండాల్సిందే. లేదంటే.. వేగమే కాదు సరిగా ఎగరలేవు కూడా. నీటిలోని చేప సంగతి చూస్తే.. వాయువేగంతో ప్రయాణించే మీనాలకు తోకే ప్రధాన ఆధారం. ఉన్నట్టుండి ఏ టర్న్ తీసుకోవాలన్నా కూడా తోకే కీలకం.ఇక నాలుగు కాళ్ల జంతువులన్నీ.. పరిగెత్తాలన్నా.. నడవాలన్నా.. వాటి గమనాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి తోక ఎంతో సాయం చేస్తోంది. ఇక కొన్ని తేళ్లు, పాము వంటి విషపూరిత జీవులకు ఆ తోకే రక్షణ ఆయుధంలా పనిచేస్తుంది. అలాంటి తోకలు తొలుత మానవులకు కూడా ఉండేది. కానీ కాలక్రమేణ అది అదృశ్యమైపోయింది. ఇది ఎలా జరిగింద? ఎందువల్ల అనేది శాస్త్రవేత్తల మదిని తొలిచే ప్రశ్న. అందుకోసం ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 25 మిలియన్ల ఏళ్లక్రితం మానవులకు తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీని గురించి అప్పట్లో చార్లెస్డార్విన్ ఇచ్చిన వివరణ పెద్ద విప్లవంగా మారింది. ఒక్కసారిగా అందరీ దృష్టి ఈ దిశగా అడుగులు వేసేలా చేసి, పరిశోధనలు చేసేందుకు నాంది పలికింది. కానీ తోక ఎలా కనుమరుగైందనేది చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు జియా అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధన వివరణాత్మక సమాధానం ఇచ్చింది. మానవ పిండం తొలి దశలో తోకలా ఉండి ఆ తర్వాత అది నెమ్మదిగా చీల్చుకుంటూ వెన్నుపూస, కండారాలుగా ఏర్పడతాయని అన్నారు. ఆ క్రమంలో వచ్చే జన్యు మార్పులను గమనించారు. అలాగే తోకలు అభివృద్ధి చేసే జంతువుల జన్యవులో, తోకలేని మనిషి జన్యవులోనూ టీబీఎక్స్టీ అనే కామన్ జన్యు క్రమాన్ని గుర్తించారు. దీనిలో వచ్చే మార్పులు కారణంగానే తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీన్ని జన్యుమ్యుటేషన్గా పేర్కొన్నారు. ఈ టీబీఎక్స్టీని జన్యుమ్యుటేషన్ని ఎలుకల్లో ప్రవేశ పెట్టగా వాటికి పుట్టిన సంతానంలో చాలా వరకు ఎలుకలు తోకను అభివృద్ధి చేయలేకపోయాయి. కొన్నింటికి చిన్నగానే ఉండిపోయింది తోక. ఈ జన్యు ఉత్పరివర్తనాల మ్యుటేషన్ను దాని తరువాత తరానికి పంపుతూ ఉంటుంది ఆ క్రమంలోనే తోకలు పూర్తిగా అదృశ్యమవుతాయని సవివరంగా వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?) -
130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి !అందుకు ఆ గుహ..
ఆదిమానవులు ఉనికి ఉందని ఎప్పటి నుంచే చెబుతూనే ఉన్నారు చరిత్రకారులు. అందుకు చారిత్రక ఆధారాలు ఏమిటి అనేదాని గురించి పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రాచీన యుగంలో క్రీస్తూ పూరం 1300 ఏళ్ల క్రితం అని అంచనాలు వేసి చెప్పేరే గానీ అందుకు కచ్చితమైన ఆధారాలు లేకపోయాయి. తవ్వకాల్లో వారి ఉనికి ఉందని చెప్పే పనిమూట్లు, వారికి సంబంధించిన మానవ ఎముకల ఆధారంగా చెప్పడం జరిగింది. దీని గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న శాస్రతవేత్తల కృషి ఇప్పటికీ ఫలించింది. మానువులు ఎప్పటి నుంచి ఉన్నారు. ఆ తర్వాత నిష్క్రమించి ఎటు వెళ్లారనే వాటి గురించి వెలుగులోకి వచ్చిన ఆధారాలను చూసి పరిశోధకులే కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే..గ్రీస్లోని థెస్సాలీలోని మధ్య గ్రీకు ప్రాంతంలో థియోపెట్రా అనే గుహ వద్ద పురావస్తు శాఖ ఎన్నో ఏళ్లుగా తవ్వకాల్లో జరిపింది. ఆ తవ్వకాల్లో ఆ గుహ మానవజాతి మూలాలను గూర్చి వెల్లడించింది. ఆ తవ్వకాల్లో అనేక మనుషుల ఎముకలు, వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, జంతువుల ఎముకలు, పూరాత మానవ నిర్మిత నిర్మాణాలను కనుగొన్నారు. 13 వేల ఏళ్ల క్రితం నుంచే మానువులు ఉన్నారని రేడియో కార్బన్ ఆధారాలు చెబతున్నాయి. వారిలో నియాండర్తల్లు అనే మానవ జాతి ఉనికిలో ఉన్న నాటి మానవ జాతుల్లో ఒకటని చెప్పారు. వారు బలిష్టంగా కండలు తిరిగి ఉండేవారని, విచిత్రంమైన కనుబొమ్మలు, పొడుచుకుని వచ్చినట్లు ముక్కులు కలిగి ఉండేవారని తెలిపారు. ఈ నియాండర్తల్లు మానవులు జీవించే విధానం కంటే భిన్నంగా జీవితాన్ని గడిపేవారని అన్నారు. కొన్ని రకాల అడవి జంతువులను వేటాడేవారని, తమను తాము రక్షించుకునేందుకు కఠినమైన గుహ వాతావరణంలో జీవించేవారని అన్నారు. ఐరోపా అంతటా ఉన్న గుహల్లో ఉండేవారని పరిశోధనలో వెల్లడించారు. అంతేగాదు థియో పెట్రా గుహ మానవ నిర్మిత ప్రదేశంలో ఇదే ఒకటిగా పేర్కొన్నారు. ఇక్కడ నుంచి మానవులు సుమారు 50 వేల ఏళ్ల క్రితం నుంచి నిష్క్రమించారని తెలిపారు. 1987 నుంచి తప్పకాలు.. ఈ గుహ ఒక లోయ పైన సుమారు వంద మీటర్లు(330 అడుగులు) వరకు విస్తరించి ఉందని చెప్పారు. దీన్ని థియోపెట్రా రాక్ అని పిలేచే వారని, ఇక్కడ సున్నపురాయి కొండ ఈశాన్యవాలు చూడవచ్చని చెప్పారు. ఈ గుహకు సమీపంలో పినయోస్ నదికి చెందిన లెథాయోస్ నది ప్రవహిస్తుంది. ఇక పురావస్తు శాఖ అధికారులు 1987 నుంచి ఈ గుహ వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించారు. అలా 2007వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో అనేక విశేషమైన ఆవిష్కరణలు జరిగాయి. పురావస్తు పరిశోధన మొదట ప్రారంభించినప్పుడూ థియోపెట్రా గుహా స్థానిక గొర్రెల కాపరులు తమ జంతువులును ఉంచడానికి తాత్కాలిక ఆశ్రయంగా ఉపయోగించేవారని భావించారు. కానీ ఈ గుహ తవ్వేకొద్ది ఆధ్యాంతం కొంగొత్త విషయాలను వెల్లడించింది. ఇందులో బయటపడ్డ అవక్షేపాలన్నీ ఆసక్తికలిగించే సరికొత్త విషయాలను తెలియజేశాయి. ( చదవండి: అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..) -
9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి మాయమైందట!
దాదాపు 9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి ఉన్నపళాన తుడిచిపెట్టుకుపోయిందట. చివరి మంచు యుగం తుదినాళ్లలో చోటు చేసుకున్న విపరీతమైన వాతావరణ మార్పులే ఇందుకు కారణంగా నిలిచాయని అంతర్జాతీయ అధ్యయనం ఒకటే తాజాగా తేలి్చంది. అయితే నేటి ఆధునిక మానవుని పూరీ్వకులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి కూడా ఈ మహా ఉత్పాతం పరోక్షంగా కారణమైందని చెబుతోంది. చాన్నాళ్ల క్రితం. అంటే దాదాపు 9.3 లక్షల నుంచి 8.13 లక్షల ఏళ్ల క్రితం. పర్యావరణ పరంగా భూమ్మీద కనీ వినీ ఎరుగని ఉత్పాతం సంభవించింది. ఈ మహోత్పాతం వల్ల అప్పటి జనాభాలో ఏకంగా 98.9 శాతం తుడిచిపెట్టుకుపోయిందట. దాని బారినుంచి కేవలం 1,300 మంది మాత్రమే బతికి బట్టకట్టారట. మన పూరీ్వకులైన హోమోసెపియన్లు వీరినుంచే పుట్టుకొచ్చారట. చివరి మంచు యుగపు తుది నాళ్లలో ఈ పెను ఉత్పాతం జరిగింది. అధ్యయనం ఇలా... ► రోమ్లోని సపియెంజా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారెన్స్ నిపుణులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ► ఆ యుగంలో జరిగిన తీవ్ర వాతావరణ మార్పులు మానవ జాతి వినాశనానికి కారణంగా మారినట్టు వారు తేల్చారు. ► అధ్యయనం కోసం 50కు పైగా విభిన్న దేశాలకు చెందిన 3,154 మంది సంపూర్ణ జన్యుక్రమాలను లోతుగా విశ్లేíÙంచారు. ► ఇందుకోసం ఫిట్ కోల్ అనే సరికొత్త బయో ఇన్ఫర్మాటిక్స్ పద్ధతిని అనుసరించారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంత ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► జెనెటిక్ బాటిల్ నెక్గా పిలుస్తున్న ఈ మహోత్పాతానికి నాటి మంచు యుగ సంధి సందర్భంగా చోటు చేసుకున్న తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తేలింది. ► ఆ దెబ్బకు నేటి ఆఫ్రికా ఖండమంతా ఎండిపోయి మరు భూమిగా మారిందట. ► మానవులతో పాటు ఏనుగుల వంటి భారీ క్షీరదాలన్నీ దాదాపుగా అంతరించాయట. ► ఆ దెబ్బకు దాదాపు 3 లక్షల ఏళ్ల పాటు మానవ ఉనికి ఉందా లేదా అన్నంత తక్కువ స్థాయికి పడిపోయిందట. ► ఆ సమయం నాటి శిలాజాల్లో మానవ అవశేషాలు అసలే దొరక్కపోవడం కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది. ► ఈ అధ్యయన వివరాలు జర్నల్ సైన్స్లో పబ్లిష్ అయ్యాయి. ‘నాటి మంచు యుగపు మహోత్పాతం మానవ వికాసంలో ఒక రకంగా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. తదనంతరం పుట్టుకొచ్చిన ఆదిమ మానవ సంతతే ఆఫ్రికా నుంచి యురేషియాకేసి విస్తరించింది. ఈ విస్తరణ ఆఫ్రికాలో హోమోసెపియన్లు, యూరప్లో నియాండర్తల్, ఆసియాలో దేనిసోవన్ల ఆవిర్భావానికి కారణమైంది‘ – ఫాబియో డీ విన్సెంజో – నేషనల్ డెస్క్, సాక్షి -
అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..
అంగారక గ్రహంపై మానవుని ఆవాసానికి యోగ్యమైనదా? కాదా అనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ నీటి జాడలు ఉన్నాయా లేదా ఒక వేళ ఉండాల్సి వచ్చినా అనువుగా ఉంటుందా లేదా అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనులు చేశారు. ఆ క్రమంలో శాస్త్రవేత్తలు తాజగా ఆ గ్రహంపై ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ వెల్లడించారు. జార్జ్ మాసన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మార్స్పై కాలనీని 22 మంది వ్యోమగాములతో నిర్మించొచ్చు అని పేర్కొన్నారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకునేలా ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ కూడా చెప్పారు. తాము ఎన్నో యేళ్లుగా చేస్తున్న అధ్యయనాల్లో.. మానవ స్థావరాన్ని నిర్మించడం చాలా క్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్య అని తేలిందన్నారు. వనరులు పరిమితంగా ఉన్నందునన ఈ గ్రహంపై ఆవాసం నిర్మించడం అనేది సవాలుతో కూడినది. అయితే అక్కడ ఎంతమంది వ్యోమోగాములు ఆవాసాలను నిర్మించగలరు, ఎంతమంది ఉండొచ్చు అనేదానిపై పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనాల్లో దాదాపు 22 మంది వ్యోమగాములతో కాలనీ నిర్మించొచ్చని, అలాగే సుమారు 100 నుంచి 500 మంది దాక ఉండొచ్చని గుర్తించారు. దీనివల్ల భవిష్యత్తులో వలసవాద సమస్య గానీ, మానవ వికృతి ప్రవర్తనకు సంబంధించిన సవాళ్లు గానీ ఎదరయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గట్టిగా హెచ్చరించారు. అంగారక గ్రహంపై ఏ ప్రాంతంలో కాలనీలు నిర్మించాలనే దాని గురించి కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రహంపై మానవ మనుగడను అంచనా వేసేందుకు ఏజెంట్-బేస్డ్ మోడలింగ్ అనే కంప్యూటర్ అనుకరణను ఉపయోగించారు. అక్కడ ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని తట్టుకుని జీవించగలిగే మానవుల మనసతత్వాలను గూర్చి కూడా ఈ కంప్యూటర్ వెల్లడించింది. "న్యూరోటిక్" మనస్తత్వం కలవారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉండగా, "పరిస్థితులను అంగీకరించదగిన" వ్యక్తిత్వ గల వ్యక్తులు అక్కడ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తమ పరిశోధనల్లో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ! వీడియో వైరల్) -
Heavy Rains : చెత్తనంతా తిరిగిచ్చి.. లెక్క సరిచేసి"నది"..
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో కురిసిన వర్షాలకు ఆయా ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి వరద ఉధృతమైంది. దీంతో ఒక నదిలోని ప్లాస్టిక్ మొత్తం అక్కడున్న బ్రిడ్జి మీద పేరుకుపోవడంతో ఆ చెత్తనంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఐ.ఎఫ్.ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే బాగా వైరల్ అయ్యి లక్షల మందికి చేరింది. కొద్దిరోజులుగా వర్షాలతోనూ, వరదలతోనూ ఉత్తరాది మొత్తం అతలాకుతలమైంది. కొన్ని ప్రాంతాల్లో గతమెన్నడూ లేనంత భారీగా వర్షాలు పడగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉధృతంగా వరదలు కూడా వచ్చాయి. ఈ వరదల్లో మనుషులు నదుల్లో పారేసిన చెత్త మొత్తం తిరిగి భూమి మీదకు చేరింది. అలా ప్లాస్టిక్ చెత్త చేరిన ఒక బ్రిడ్జిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అక్కడి ఫారెస్టు అధికారి. దీనికి అందరినీ ఆలోచింపజేసే వ్యాఖ్యను జోడించి "ప్రకృతి -1, మనిషి-0.. మనం ఏదైతే ఇచ్చామో అది మొత్తం తిరిగి వచ్చేసింది.." అని రాశారు. నడవటానికి కూడా వీలు లేకుండా ఉన్న ఈ బ్రిడ్జి వీడియోకి నెటిజనుల నుంచి విశేష స్పందన తోపాటు వ్యంగ్యమైన కామెంట్లు కూడా వచ్చాయి. ప్రకృతి ఎప్పుడూ మనుషుల ఋణం ఉంచుకోదని, ఎప్పుడు లెక్క అప్పుడే సరిచేస్తుందని.. ఎప్పటికైనా మనిషిపై ప్రకృతిదే పైచేయని రాశారు. Nature - 1, Humans - 0. River has thrown all the trash back at us. Received as forward. pic.twitter.com/wHgIhuPTCL — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 11, 2023 ఇది కూడా చదవండి: మహిళని ఎత్తి అవతలకు విసిరేసిన బౌన్సర్లు.. -
సహృదయం.. సామరస్యం.. ద్వేష రాహిత్యం
ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ కాలంలో అయినా మానవుల్లో ఉండాల్సినవి ఏవి? సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం ఇవి ప్రపంచ మానవుల్లో ఉండాల్సినవి. మానవులు క్షేమంగా ఉండాలంటే ఉండి తీరాల్సినవి ఇవే. అదేంటో మానవ చరిత్ర మొదలు అయినప్పటి నుంచీ ఇవి ఉండాల్సినంతగా, ఉండాల్సినట్టుగా ఉండడం లేదు. అందువల్లే మానవులకు శాంతి, భద్రతలు కరువైపోయాయి. ఈ దుస్థితి ఇకనైనా మారాలి; ఇకపైనైనా మనిషి వల్ల మనిషికి కలుగుతున్న ముప్పుకు ముగింపు రావాలి; మనకు సుస్థితి సమకూడాలి. అథర్వ వేదపాఠం అయిన సాంమనస్య సూక్తం ఎప్పటి నుంచో ‘సహృదయం సాంమనస్యం అవిద్వేషం కృణోమి వః’ అనీ, ‘అన్యో అన్యమభి హర్యత వత్సం జాతమివాఘ్న్యా’ అనీ ఘోషిస్తూనే లేదా చాటిస్తూనే ఉంది. అంటే సహృదయులుగానూ, సామరస్యంతోనూ లేదా ఏకమనస్కులుగానూ, ద్వేషరహితులుగానూ మిమ్మల్ని రూపొందిస్తాను అనీ, అపుడే పుట్టిన దూడను తల్లి ఆవు ప్రేమించేట్టుగా పరస్పరం ప్రేమించుకోవాలి అనీ అర్థం. ఈ మాటల్ని మనం అర్థం చేసుకోనేలేదు. అందుకే మనలో అపాయం అతిగా వ్యాపిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని మనం వెనువెంటనే పరిష్కరించుకోవాలి. ప్రపంచం, దేశం, సమాజం వీటికి తొలిదశ ఇల్లు. ఒక ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సంమనాః‘ అనీ, ‘జాయా పత్యే మధుమతీమ్ వాచమ్ వదతు శాన్తివామ్‘ అనీ చెబుతోంది. అంటే ఒక కొడుకు తన తండ్రిని అనుసరించే వాడుగానూ, తన తల్లితో సామరస్యంతోనూ ఉండాలి, భార్య భర్తతో మధురమైనదై ప్రశాంతతను ఇచ్చే మాటల్ని చెప్పనీ అని అర్థం. ఒకరిని ఒకరు వెన్నంటి ఉండడం, ప్రశాంతత, హితవచనం ఇవి ఇంటి నుంచే మొదలు అవ్వాలి. ద్వేషరాహిత్యం అన్నది కూడా ఇంటి నుంచే రావాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘మా భ్రాతా భ్రాతరం దదిక్షన్మా స్వసారముత స్వసా’ అనీ, సమ్యఞ్చః సవ్రతా భూత్వా వాచం వదత భద్రయా’ అనీ చెబుతోంది. అంటే సోదరీ సోదరులు ద్వేషించుకోకూడదు, కలిసికట్టుగా పనిచెయ్యండి, అందరూ శుభం కలిగించే మాటల్ని పలకండి అని అర్థం. అభిప్రాయ భేదాలతో ఒక ఇంట్లోని సభ్యులు పరస్పరం ద్వేషించుకుంటూ విడిపోవడం కాదు ఉమ్మడిగా ఉండడానికి వాళ్ల మధ్య అవగాహన ఉండాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘యేన దేవా న వియన్తి నో చ విద్విషతే మిథః’ అనీ,‘తత్ కృణ్మో బ్రహ్మ వో గృహే సంజ్ఞానం పురుషేభ్యః’ అనీ చెబుతోంది. అంటే దేనివల్ల దేవతలు విడిపోరో, ద్వేషించుకోరో అవగాహన అన్న ఆ ఉన్నతమైన భావన ఇంట్లోని సభ్యుల్లో ఉండాలి అని అర్థం. సంజ్ఞానం లేదా అవగాహన మనకు ఉండి తీరాలి. చిన్నవాళ్లు పెద్దలను వెన్నంటి వెళుతున్నట్టుగా ఒకరికి ఒకరై ఏకమనస్కులుగా, సామూహిక ఆరాధన చేసేవాళ్లుగా, పరస్పరం ప్రీతితో మాట్లాడుకునేవాళ్లుగా కలిసి మెలిసి బతకండి అని సూచిస్తూ ‘జాయస్వన్తశ్చిత్తినో మా వి యౌష్ట సమారాధయన్తః సధురాశ్చరన్తః’ అని సాంమనస్య సూక్తం మనకు చెబుతోంది. అంతేకాదు ప్రేమ అనే తాడుతో అందరూ కట్టబడాలి అన్న సూచ్య అర్థం వచ్చేట్టుగా ‘సమానే యోక్త్రే సహ వో యునజ్మి’ అనీ, ‘దేవా ఇవామృతమ్ రక్షమాణాః సాయం ప్రాతః సౌమనసో వో అస్తు‘ అంటూ దేవతలు అమృతాన్ని రక్షిస్తున్నట్టుగా ఉదయ, సాయం కాలాల్లో సద్భావనల్ని రక్షించండి అనీ చెబుతోంది సాంమనస్య సూక్తం. సాంమనస్య సూక్తం చేసిన ఈ సూచనను అందుకుని సద్భావనల్ని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలి; ఆపై మనం రాణించాలి. ‘భారతీయ వైదిక సాహిత్యం సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం వీటితో మానవులు మెలగాలని ప్రగాఢంగా ప్రవచించింది. దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అది జరగకపోతే మన జీవితాలు అనర్థ దాయకమూ, అల్లకల్లోలమూ అయిపోతాయి‘. – రోచిష్మాన్ -
రాక్షస బల్లులతో మానవులకు స్వల్పకాలిక పరిచయం
లండన్: భూమిపై మనుషులతో సహా పలు రకాల క్షీరదాలు ఒకప్పుడు రాక్షస బల్లులతో(డైనోసార్లు) కలిసి జీవించినట్లు ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడయ్యింది. క్షీరదాల శిలాజాల పరీక్ష ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. దాదాపు 6.60 కోట్ల ఏళ్ల క్రితం బలమైన గ్రహ శకలం భూమిని ఢీకొట్టడంతో రాక్షస బల్లులు అంతమైనట్లు పరిశోధకులు ఇప్పటికే నిర్ధారించారు. అంతకంటే కొంత కాలం ముందే మనుషులతోపాటు కుందేళ్లు, శునకాలు, పిల్లులు, గబ్బిలాల వంటి క్షీరదాలు పరిణామ క్రమంలో భూమిపై ఆవిర్భవించాయి. అవి రాక్షస బల్లులతోపాటే మనుగడ సాగించాయని బ్రిస్టల్ సైంటిస్టులు తేల్చారు. ఈ అధ్యయనం వివరాలను కరెంట్ బయాలజీ జర్నల్లో ప్రచురించారు. డైనోసార్లతో ప్రాచీన మానవుల పరిచయం ఎక్కువ కాలం కొనసాగలేదని వెల్లడయ్యింది. మానవులు ఆవిర్భవించిన కొంతకాలానికే డైనోసార్లు అంతం కావడమే ఇందుకు కారణం. భూమిపై జీవనం సాగించే విషయంలో డైనోసార్ల నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో క్షీరదాలు విస్తృతంగా ఆవిర్భవించాయని, కాలానుగుణంగా వాటిలో వైవిధ్యం సైతం చోటుచేసుకుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. -
ఆధునిక మానవుని పుట్టుకపై అధ్యయనం..మనది ఒకే మూలం కాదట
ఆధునిక మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆఫ్రికా అన్నది అందరూ చెప్పే సమాధానం. తొలి మానవులు అక్కడే పుట్టి, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించారని దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం కూడా. అంతవరకూ నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామన్న సిద్ధాంతం మాత్రం తప్పంటోంది ఓ తాజా అధ్యయనం. మన మూలాలు ఆఫ్రికాలోని కనీసం రెండు విభిన్న జాతుల్లో ఉన్నాయని చెబుతోంది. కనుక ఆధునిక మానవుని జన్మస్థలం ఫలానా అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమన్నది దాని సారాంశం.. మన ఆవిర్భావానికి ఒకే మూలమంటూ లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికావ్యాప్తంగా ఉనికిలో ఉన్న పలు ఆదిమ మానవ జాతులు హోమోసెపియన్గా పిలిచే ఆధునిక మానవుని పుట్టుకకు కారణమని అంటోంది. ‘‘ఆ కాలంలో ఆఫ్రికాలో నివసించి, క్రమంగా ఆ ఖండమంతటా వ్యాపించి పరస్పరం కలిసిపోయిన కనీసం రెండు ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూలం. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జన్యు డేటాను లోతుగా పరిశోధించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వివరాలను జర్నల్ నేచర్లో ప్రచురించారు. ‘‘మన ఆవిర్భావానికి కారకుడైన ఆదిమ మానవులు ఒకే జాతికి చెందిన వారని మానవ వికాసంపై దశాబ్దాలుగా జరిగిన పరిశోధనల్లో చాలావరకు చెప్పుకొచ్చాయి. వారు ఆఫ్రికాలో తొలుత చెట్లపై నివసించి, అనంతరం క్రమంగా నేల మీదికి దిగారన్నది వాటి సారాంశం. కానీ ఆఫ్రికావ్యాప్తంగా మానవ ఆవాసాలకు సంబంధించిన శిలాజ, పురాతత్వ రికార్డులు ఈ వాదనతో సరిపోలడం లేదు. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో సంచరించిన ఒకటికి మించిన ఆదిమ జాతులు వేలాది ఏళ్లపాటు పరస్పర వలసలు తదితరాల ద్వారా కలగలిసిపోయి క్రమంగా ఆధునిక మానవుని ఆవిర్భావానికి దారితీశాయన్నది మా పరిశోధనలో తేలింది. హేతుబద్ధంగా ఆలోచించినా ‘ఒకే మూలం’ సిద్ధాంతం కంటే ఇదే సమంజసంగా తోస్తోంది కూడా’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జెనెటిసిస్ట్ డాక్టర్ బ్రెన్నా హెన్ వివరించారు. ఆ ఆధారాలే ఉంటేనా...! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి మూలాలూ కచ్చితంగా 10 లక్షల ఏళ్ల నాటి ఈ రెండు ఆదిమ జాతుల్లోనే ఉన్నట్టు కచ్చితంగా చెప్పగలమని బృందం సభ్యుడైన విస్కాన్సిన్–మాడిసన్ వర్సిటీ పాపులేషన్ జెనెటిసిస్ట్ ఆరన్ రాగ్స్డేల్ అంటున్నారు. ఎలా చూసినా మనందరి జన్మస్థానం ఆఫ్రికా లోని ఒకే ప్రాంతమన్న వాదనకు కాలం చెల్లినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాకపోతే 10 లక్షల ఏళ్ల నాటి మానవ శిలాజ తదితర జన్యు ఆధారాలేవీ ఇప్పటిదాకా మనకు దొరకలేదు. లేదంటే ఆధునిక మానవుని (హోమోసెపియన్) ఆవిర్భావం, విస్తరణ తదితరాలపై ఈ పాటికే మరింత స్పష్టత వచ్చేది’’ అన్నారాయన. ఇలా చేశారు... డాక్టర్ హెన్ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశల్లోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు చెందిన 290 మంది జన్యు అమరికను వారు లోతుగా విశ్లేషించారు. దాంతోపాటు ఆఫ్రికాలో ఉన్న భిన్న జాతుల వారి డీఎన్ఏను ఇందుకు ఎంచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో సియెరా లియోన్లో నివసించే మెండే రైతు జాతి, ఇథియోపియాలో ఆదిమ వేటగాళ్ల నుంచి రూపాంతరం చెందిన గుముజ్ జాతి, అమ్హరాగా పిలిచే అక్కడి రైతులతో పాటు నమా అనే దక్షిణాఫ్రికాలోని వేటగాళ్ల సంతతి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటిలోని వైవిధ్యాన్ని బట్టి లక్షల ఏళ్ల క్రితం ఆ డీఎన్ఏలు ఎలా ఉండేవో, ఇన్నేళ్ల పరిణామక్రమంలో ఏ విధంగా మారుతూ వచ్చాయో అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా సిమ్యులేషన్ విధానంలో ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా లభించిన అతి పురాతన మానవ శిలాజం (3 లక్షల ఏళ్ల నాటిది) ఆఫ్రికాకు చెందినదే. అంతేగాక అతి పురాతన రాతి పనిముట్లు కూడా అక్కడే దొరికాయి. ప్రధానంగా ఈ రెండింటి ఆధారంగానే ఆఫ్రికానే మన జన్మస్థానమని గత అధ్యయనాల్లో చాలావరకు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికావాసుల డీఎన్ఏను బ్రిటిష్ వారి డీఎన్ఏతోనూ, క్రొయేషియాలో దొరికిన దాదాపు 50 వేల ఏళ్ల నాటి మన పూర్వీకుడైన నియాండర్తల్ మానవుని డీఎన్ఏతోనూ పోల్చి చూశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఒకటికి మించిన ఆదిమ జాతులు వేల ఏళ్ల క్రమంలో తమలో తాము కలిసిపోయిన ఫలితంగానే మనం పుట్టుకొచ్చామని తేల్చారు. కనీసం రెండు ప్రధాన ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూల కారకులని డాక్టర్ హెన్ సూత్రీకరించారు. వాటికి స్టెమ్1, స్టెమ్2గా పేరు పెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్రను మార్చడం ఏమార్చడమే!
చరిత్రను సృష్టించకపోయినా ఫరవాలేదు. కాని, దానికి మసిపూసి మారేడుకాయ చేయడం, లేదా అసలు పాఠ్యగ్రంథాల నుంచీ, చరిత్రపుస్తకాల నుంచీ తీసివేయడం కూడదు కదా! ఇవ్వాళ కేంద్ర పాలకులు ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ వంటి నినాదాలతో రాజకీయాలు చేస్తున్న పెద్దల మాటలు నీటి మూటలని కొన్ని చారిత్రక అంశాలు తేల్చి చెబుతున్నాయి. అందుకే వీరు తమ సిద్ధాంతాల డొల్లతనాన్ని బయటపెట్టే చారిత్రక అంశాలకు తిలోదకాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. మానవ పరిణామ క్రమం, మొగలాయీ చక్రవర్తుల పాలనా కాలంలోని ఘట్టాలు వంటి అనేక అంశాలు ఆ విధంగా వీరి కత్తిరింపునకు బలయ్యాయి. భారతదేశంలో పాలకులు చరిత్రను వక్రీకరించాలనే దుర్వ్యూహాలు పన్నుతున్నారు. హిందు మతవాద భావజాలం ఆధారంగా చరిత్రను బోధించాలను కోవడం ఒక అసంబద్ధ చర్యే అవుతుంది. క్రీస్తు పూర్వం 7000 నుంచి 1500 మధ్యలో ఆవిర్భవించిన వైదిక సాహిత్యం... క్రీస్తు పూర్వం 50 వేల ఏళ్ల చరిత్రను కుదించి... భారతీయ మూలాలను దెబ్బతీసింది. రాతియుగాల నుంచీ మానవుడు నేటి ఆధునిక యుగాల వరకూ ఎలా పరిణామం చెందాడనేది మానవ మహాచరిత్రలో అందరూ తెలుసు కోవలసిన ముఖ్యమైన అంశం. ప్రస్తుతం మానవుడు ఉన్న స్థితికి... వందలు, వేల తరాల మానవులు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విజ్ఞానం, దాని ఆధారంగా చేసిన ఆవిష్కరణలు ఎలా కారణమయ్యా యనేది మానవ భవిష్యత్ గమనానికి అద్భుతమైన పాఠం. కానీ ఇవ్వాళ ఇంతటి ప్రాముఖ్యం ఉన్న మానవ పరిణామ క్రమాన్నీ, ఇతర చారిత్రక అంశాలనూ ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సంస్కృత భాషా గ్రంథాల్లో చేసిన కృత్రిమ కల్పనలు, వ్యుత్ప త్తులు, నీచార్థాల ద్వారా భారతీయ మూలవాసుల సాంస్కృతిక మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగాయి. సామర్థ్యమూ, శాంతి, సమన్వయము ప్రేమతో కూడిన మూలవాసుల భావనలను ధ్వంసం చేసే క్రమంలో బీభత్స, భయానక రసాలకు ఎక్కువ ప్రాధా న్యత ఇస్తూ చాలా చరిత్ర వక్రీకరణకు గురయ్యింది. భారతదేశానికి ఆర్యుల రాక ముందటి చరిత్ర భారతీయ మూలవాసులదీ, దళితులదీ అని హిందూవాద రచయితలకు తెలుసు. అయినా దాని ప్రస్తావన చరిత్ర రచనలో రానివ్వడం లేదు. చరిత్ర నిర్మాణానికి అవసరమైన పరికరాలనూ, ఆధారాలనూ పరిగణనలోకి తీసుకోకపోవడం సరి కాదు. చరిత్రతో మానవ పరిణామానికి, పురాతత్త్వ శాస్త్రానికి, శాసనా లకు, నాణేలకు ఉన్న అనుబంధాన్ని నిరాకరించి నెట్టివేయడం చారి త్రక ద్రోహమే. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అంశాలను తొలగించడాన్ని ఈ కోణంలోనే చూడాలి. భారతదేశ చరిత్ర, సంస్కృతులను నిర్మించడంలో పురావస్తు శాస్త్రానిది తిరుగులేని పాత్ర. 19వ శతాబ్దపు చతుర్ధ పాదంలో దేశంలో ఈ శాస్త్రం అడుగిడింది. ఎందరో ప్రముఖులైన బ్రిటిష్, పురాతత్వ వేత్తలు ఈ విజ్ఞానం అభివృద్ధి పొందటానికి ఎంతో తోడ్పడ్డారు. పురావస్తు శాస్త్రం వెలుగులో బయటపడ్డ కొత్త కొత్త మానవ అవశేషాలు, వాడిన పనిముట్లను ఆధారం చేసుకుని నాటి మనిషి ఆర్థిక, సామాజిక, విశ్వాస వ్యవస్థలను నిర్మిస్తూ వస్తున్నారు. అటువంటి చరిత్ర... మతాలు చెప్పే విషయాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే మత తత్త్వవాదులు తమకు ఇబ్బంది అనుకున్న అంశాలను పాఠాల నుండి, చరిత్ర గంథాల నుండి మాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాల నుంచి మానవ పరిణామ క్రమాన్ని తొలగించడం ఇందుకు మంచి ఉదాహరణ. ప్రసిద్ధ చరిత్రకారులు డీడీ కోశాంబి హిందూ పునరుద్ధరణ వాదం వల్ల వచ్చిన అనేక పరిణామాలను మన ముందుకు పరిశోధనాత్మకంగా తెచ్చారు. మూఢాచారాలు మానవ పరిణామాన్ని అడ్డుకుంటాయి అని చెప్పారు. వైదికవాదులు వ్యవసాయ సంస్కృతిని నిరసి స్తారు. కానీ వ్యవసాయం మీద వచ్చే అన్ని ఫలితాలు అనుభవిస్తారు. వాటిని దానం రూపంలో పొందుతారు. అయితే వ్యవసాయదారులను శూద్రులుగాను, వ్యవసాయ కూలీలగానూ, అతిశూద్రులు గానూ చూస్తారు. వీరు ఎంతో బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేశారు. బౌద్ధంలో దాగివున్న సమానతావాదం వీరికి వ్యతిరేకం. గుప్తుల కాలంలో అశ్వమేధ యాగాలతో క్రూరమైన హింస భారతదేశంలో కొనసాగింది. శూద్రులు, అతిశూద్రులు తీవ్ర వధకు గురయ్యారని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని నిర్మించిన అశోకుని మానవతావాద పాలనాముద్రను చెరిపివేయాలని గుప్త వంశంలో ప్రసిద్ధుడైన సముద్ర గుప్తుడు ఎలా ప్రయత్నించాడో రొమిల్లా థాపర్ తన ‘భారతదేశ చరిత్ర’లో విశ్లేషణాత్మకంగా వివరించారు. ‘ఈ శాసనం అశోకుని ఇతర శాసనాలతో విభేదిస్తుంది. మౌర్యపాలకుడు, గుప్తులకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినా అతడు తన అధికారాన్ని అమలు పరచటంలో చాలా సాత్వికంగా ప్రవర్తించాడు.అశోకుడు దిగ్విజయ యాత్రను వదులుకుంటే, సముద్ర గుప్తుడు దిగ్విజయాలలో తేలియాడాడు. అతడు ఉత్తర రాజస్థాన్లోని చిన్న చిన్న రాజ్యాల అధికారాన్ని కూలద్రోశాడు. ఫలితంగా వాయవ్య భారతంపై హూణుల దండయాత్ర, చివరి గుప్త రాజులకు దురదృష్టకరంగా పరిణమించింది’. చరిత్రను వక్రీకరించాలనే ప్రయత్నం వలన భారతదేశ వ్యక్తి త్వానికి దెబ్బ తగులుతుందని తెలుసుకోలేక పోతున్నారు పాలకులు. ఇలా చేస్తే ఉత్పత్తి పరికరాలు కనిపెట్టిన దేశీయుల చరిత్ర మసక బారుతుంది. నదీ నదాలూ, కొండ కోనలూ, దట్టమైన అరణ్యాలూ, సారవంతమైన మైదానాలూ, చిట్టడవులూ... ఇలా విభిన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుకూలమైన జీవన పోరాట పద్ధతులు (స్ట్రాటజీస్)ను రూపొందించుకుని విభిన్న సాంస్కృతిక సమూహాలుగా జనం మనుగడ సాగించే క్రమంలో... అటువంటి సమూహాలను జయించి ఒకే రాజ్యంగానో, సామ్రాజ్యంగానో చేయాలని చేసిన ప్రయత్నాలు చరిత్రలో ఉన్నాయి. ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించినా... అదను చూసుకుని దేశీ సమూహాలు ఎక్కడి కక్కడ తిరుగుబాట్లు చేసి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. మొగలాయీల కాలం కావచ్చు, బ్రిటిష్ వాళ్ల కాలం కావచ్చు... మూలవాసులైన ఆదివాసుల తిరుగుబాట్లు ఎన్నో మనకు ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఈ చరిత్రను మరచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అనే నినాదాన్ని భుజానికి ఎత్తుకొని చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను మాయం చేసే ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశ మూలవాసులు ఏ మతాధిపత్యానికి, కులాధి పత్యానికి లొంగలేదు. స్వతంత్ర ప్రతిపత్తితో జీవించారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసంగానే మానవ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... అత్యధిక కాలం మనుగడ సాగించింది. చరిత్రకారుడు తారాచంద్ చెప్పినట్లు చరిత్ర అనేది అనేక వైవిధ్యాలను సమన్వయం చేస్తుంది. అంతేకాదు అనేక జాతులను, అనేక సంస్కృతులను, అనేక ధర్మాలను, అనేక వ్యక్తిత్వాలను, అనేక ప్రాంతాలను సమన్వయం చేస్తూ గమిస్తుంది. మొగల్ చక్రవర్తి అక్బర్ ఒక గొప్ప చక్రవర్తి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల నుండి తొలగించినందువల్ల ఎంతో విలువైన చారిత్రక జ్ఞానాన్ని కోల్పోతాం. ఆయన కాలంలో భారతదేశంలో అనేకమైన మార్పులు జరిగాయి. అక్బరు పాలించిన సుదీర్ఘకాలంలో ఆయన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మారుతూ వచ్చాడు. మొదట హిందూ రాజ్యాలపై కత్తి దూసిన అక్బర్... ఆ తరువాత హిందూ రాజ్యాలతో సమన్వయానికి ఎక్కువ పనిచేశాడు. ఇటువంటి రాజనీతిజ్ఞుడి పాఠం సిలబస్ నుంచి తీసివేస్తే విద్యార్థులకు భారత చరిత్రపై సరైన అవగాహన కలుగదు. నిజానికి అంబేద్కర్, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, ఝల్కారీ బాయి... ఇలా అనేక మంది సామాజిక విప్లవకారుల ప్రభావం దేశం మీద ఎంతో ఉంది. వారి జీవన చిత్రాలను కూడా మన చరిత్రలో ప్రజ్వలింపచేయాలి. అప్పుడే దేశానికి మేలు. ప్రతీ విద్యార్థికి చరిత్ర అనే వెలుగు దిక్సూచి అవుతుంది. చరిత్రను వాస్తవంగా అర్థం చేసుకున్నప్పుడే, భారతదేశాన్ని గానీ, ప్రపంచాన్ని గానీ, పునఃనిర్మించే పనిలో విద్యార్థులు, ప్రజలు విజేతలు అవుతారు. అందుకే చరిత్రను రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695 -
అమృత బిందువులు
♦ బాధల్ని మిగిల్చే బంధుత్వాల కంటే... ప్రశాంతతను ఇచ్చే ఒంటరితనం గొప్పది. అవసరాలకు పలకరించే పలకరింపుల కంటే... బాధల్ని తగ్గించే కన్నీళ్లే గొప్పవి. అవసరాల్ని తీర్చని ఆస్తుల కంటే... ఆకల్ని తీర్చే అన్నం గొప్పది. ♦ వయస్సు పెరిగే కొద్దీ సమాజంలో, మనిషి జీవితం ఆప్యాయతకి, మంచితనానికి చిరునామా, అలంకరణ కావాలి. కానీ, అహంకారానికి, ద్వేషానికి, గొడవలకు మూలం కాకూడదు. ♦ ఆశ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. అత్యాశ అధఃపాతాళానికి దారితీస్తుంది. నిరాశ బతుకు మీద విరక్తిని పెంచుతుంది. ♦ సేవచేయడం, శ్రద్ధగా వినడం, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, ఊహించడం, ΄పాటును సరిదిద్దడం, ప్రయోజనం కలిగించడం, తత్త్వజ్ఞానం అనే బుద్ధికున్న ఎనిమిది లక్షణాలు మానవుణ్ని మహోన్నతుడిగా కీర్తి శిఖరాలమీద కూర్చోబెడతాయి. ఇవే మహోన్నత మార్గాన మనిషిని నడిపిస్తాయి. ♦ నిన్నటి కన్నా నేడు మిన్నగా... నేటికన్నా మిన్నగా రేపు జీవించాలి. ♦ జీవితంలో వాస్తవం ఉండాలి. ఏం జరిగినా స్వీకరించే ధైర్యం ఉండాలి. ♦ మన జీవితాన్ని మనమే రూపు దిద్దుకోవాలి. -
గురువాణి: ఒక్క చెట్టు పెట్టు... పుణ్యం మూటకట్టు
చెట్టు అనేది ఎంత గొప్పది... ఒక మొక్క నాటడం, దానికి నీళ్ళు పోయడం, చెట్టయ్యేదాకా దానిని సంరక్షించడం... అది చెట్టుగా మారిననాడు అది నాటినవాడికి, పెంచినవాడికి, సంరక్షించినవాడికి ఎంత ఫలితం లభిస్తుందనే దానికి మన శాస్త్రాలు ఏమని చెబుతున్నాయంటే... లోకంలో శరీరం కలిగిన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. మనుష్యులే కానక్కరలేదు. శరీరం ఉన్న ప్రతి ప్రాణికీ దాని పోషణకు ఆహారం కావాలి. అది సమయానికి పడకపోతే ఆకలికి విలవిల్లాడిపోతాయి. ఆకలి గొప్ప బాధ.. క్షుత్ అగ్ని.. అది అగ్నిహోత్రం, మంట. ఆ మంట తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆకలేస్తే మొదట ఏది పోతుంది... ధర్మం. ఆకలేసిన వాడికి ధర్మ విచక్షణ ఉండదు. అయ్యా! నా ప్రాణం పోయినా సరే ధర్మాన్ని కాపాడతాను, ఏదీ దొంగిలించను అనడు కదా ! చివరకు తెగించి దొంగతనానికి పాల్పడి అయినా ఆ బాధ తీర్చుకుంటాడు. ఆ మంట అటువంటిది. దహించి వేస్తుంది. అందుకే ఆకలి అన్నది ఎక్కడా ఉండడానికి వీల్లేదు. మనుష్యులకే కాదు, సమస్త ప్రాణులకూ ఆహారం కావాలి. పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులు... ఆకలితో ఉన్న మనుష్యులకు వారి ఆర్తిని చూసి జాలిపడి ఎవరయినా ఆహారమిస్తారు.. వీటి ఆకలి ఎవరు తీరుస్తారు? చెట్టు. దానికి కాండం ఉంటుంది, ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, కాయలు, పళ్ళను కూడా ఇస్తుంది. దానిని ఆశ్రయించి మనుష్యులే కాదు, క్రిమికీటకాదులు, జంతువులు, పక్షులు తమ ఆకలిని తీర్చుకుంటాయి. దాని బెరడులో చేరిన వందలాది క్రిములు వాటి ఆకలిని అక్కడ తీర్చుకొంటాయి. జంతువులు ఆకులు తింటాయి. పక్షులు గూళ్ళు కట్టుకోవడమే కాక కాయలు, పండ్లు తింటాయి. కొన్ని చిగుళ్ళను తింటాయి. ఎన్నో రెక్కల పురుగులు దాని పూలమీద వాలి ఆకలి తీర్చుకుంటాయి. రాలిన కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు భూమిలో కలిసి అక్కడున్న ఎన్నో పురుగులకు ఆహారమవుతాయి. ఒక చెట్టు... ఒక్క చెట్టే ఇన్నింటికి జీవాధారమవుతున్నది. మొక్కనాటిన వాడు, చెట్టుగా చేసినవాడు తరువాత కాలంలో శరీరాన్ని వదిలివేయవచ్చు గాక. కానీ అసంఖ్యాకమైన జీవులకు కేవలం ఆకలి తీర్చడమే కాక, వాటి ప్రాణాలను కూడా నిలబెట్టాడు, ఎన్నో జీవులు సేదదీరడానికి కారణమయ్యాడు. చెట్టు ప్రాణవాయువు వదులుతుంది. ప్రకృతి సమతౌల్యతను కాపాడుతుంది. అది మనుష్యులతోపాటూ అనేక జీవులకు ప్రాణాధారంగా నిలబడుతుంది. అటువంటి మంచి పనికి కారణమయ్యాడు కనుక వాడికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. వారి శరీరం పతనమయిన తరువాత దేవతలు స్వాగతం పలికి వారిని ఉన్నత లోకాలకు తీసుకువెడతారట. అంతేకాదు ఎన్నో ప్రాణులకు కొన్ని సంవత్సరాల పాటు ఆకలిబాధ తీర్చాడు కనుక వారిని మేం సేవిస్తాం అని దేవతలు అంటారట. చెట్లను పెంచే పనిని ప్రోత్సహించడానికి, మనుషులు తమకే కాకుండా సమస్త జీవకోటిపట్ల బాధ్యతాయుతంగా మెలగడానికి, ప్రకృతి సమతుల్యత కాపాడేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన పూర్వీకులు‘‘యావంతి ఖాసంతి ఫలాని వృక్షాత్ క్షుద్వహ్ని దగ్ధా ...’’ అంటూ ఒక శ్లోకం ద్వారా చేసిన ధర్మబోధ ఇది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కీలక విషయాలు వెల్లడి.. 7,80,000 ఏళ్ల క్రితమే..
ఆది మానవుడు ఆహారాన్ని వండుకుని కాకుండా పచ్చిగానే తినేవాడని పుస్తకాల్లో చదువుకున్నాం. పచ్చిమాంసం, ఆకులు అలములు తిన్నట్లు కూడా చదువుకున్నాం. మానవుడు క్రమక్రమంగా పచ్చి ఆహారాన్ని కాకుండా వండుకుని తినడం నేర్చుకున్నాడు. అయితే, మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా?! దాదాపు 7,80,000 ఏళ్ల క్రితం మానవుడు తొలిసారి ఆహారాన్ని వండుకున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయెల్లోని గెషర్ బెనోట్ యాకోవ్ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం తెలిసింది. ఇప్పటివరకు మానవుడు తొలిసారి వండిన ఆహారం ఎప్పుడు తిన్నాడన్న దానిపై పలు అధ్యయనాలు జరిగాయి. అయితే, ఇప్పటిదాకా దొరికిన ఆధారాలను బట్టి 1,70,000 సంవత్సరాల క్రితం తొలిసారి వండిన ఆహారం తిన్నట్లు వెల్లడైంది. తాజాగా, టెల్ అవివ్ యూనివర్సిటీ, హెబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం, బార్–ఇలాన్ యూనివర్సిటీలు స్టీన్హార్డ్ మ్యూజియం ఆఫ్ నేచురల్హిస్టరీ, ఒరేనిమ్ అకడమిక్ కాలేజ్, ఇజ్రాయెల్ ఓషినోగ్రఫిక్ అండ్ లిమ్నోలాజికల్, లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం, మైన్జ్లోని జొహాన్నెస్ గుటెన్బర్గ్ యూనివర్సిటీలతో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో దీనికి సంబంధించి తిరుగులేని విషయాలు వెల్లడయ్యాయి. 7,80,000 క్రితమే మానవులు మంటను నియంత్రిస్తూ ఆహారం వండినట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ఇప్పటిదాకా వెల్లడైన అధ్యయనాల ఫలితాలకు తాజా అధ్యయనం తెరదించినట్లయింది. ఈ అధ్యయనానికి టెల్ అవివ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇరిట్ జొహర్ అనే పరిశోధకుడి నేతృత్వం వహించారు. ‘అన్ని రకాల పరికరాలున్న ఇప్పటికాలంలో మంటను నియంత్రిస్తూ వంట చేయడం చాలా సులభమే అనుకోవచ్చు. అయితే ఎలాంటి పరికరాలు లేని ఆరోజుల్లోనే మంటను నియంత్రిస్తూ వంట చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆది మానవులు తమ ఆహారం కోసం చేపలకు చాలా ప్రాధాన్యమిచ్చేవారని ఈ అధ్యయనం చాటుతోంది. గెషర్ బెనోట్ యాకోవ్ ప్రాంతంలో మాకు దొరికిన చేప అవశేషాలను ఒకచోట చేర్చి పరిశీలించగా, పురాతన హులా సరస్సులో ఈ రకం చేపలున్నట్లు తెలిసింది. ఎప్పుడో అంతరించిపోయిన ఈ చేపలు దాదాపు రెండు మీటర్ల వరకు పొడవుంటాయి. గెషర్ బొనోట్ యాకోవ్లో పెద్ద ఎత్తున దొరికిన చేపల అవశేషాలను బట్టి చూస్తే ఆది మానవులు తరచుగా వీటిని తిన్నట్లు తెలుస్తోంది. వారే వంట చేసే పద్ధతులను అభివృద్ధి చేసినట్లు అవగతమవుతోంది. అలాగే, చేపను వండి తినడం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా ఆనాడే వారు గుర్తించినట్లు తెలుస్తోంది’ అని జొహర్ చెప్పారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అన్నీ బాగుండాలి.. అందులో మనముండాలి!
మలేరియా, చికెన్ గున్యా, డెంగీ వ్యాధుల వ్యాప్తికి దోమలు కారణం! ఇది అందరికీ తెలిసిన విషయమే.. మరి వీధి కుక్కల వెంట్రుకల్లో ఉండే పేనుతో మనకు ప్రమాదం లేదా? పాడి పశువులకు వచ్చే రోగాలు మనకు అంటవా? పోనీ మనల్ని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియా, వైరస్లతో జంతువులకు జబ్బులు రావా? అంతెందుకు నిన్న మొన్నటివరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా మూలాలు జంతువులే! ఒక్కమాటలో చెప్పాలంటే మనకొచ్చే వ్యాధుల వ్యాప్తికి సగం కారణం జంతువులే! ఈ విషయాన్ని గుర్తించడంలో ఆలస్యమైతే జరిగిందిగానీ.. పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘వన్ హెల్త్’ కార్యక్రమం మాత్రం వేగంగా అడుగులేస్తోంది (కంచర్ల యాదగిరిరెడ్డి) ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే కాలం గడుస్తున్న కొద్దీ మనుషులకు కొత్త కొత్త రోగాలు, ఆరోగ్య సమస్యలు పరిచయమవుతున్నాయి. దశాబ్దం క్రితం మనకు చికెన్ గున్యా అంటే ఏమిటో తెలియదు. డెంగీ మాట కూడా చాలా మంది విని ఉండరు. హెచ్1ఎన్1, హెచ్1ఎన్5 వంటివి కనీవినీ ఎరుగం. కానీ ఇప్పుడివన్నీ ఏటా పలకరించే చుట్టాల్లా మారిపోయాయి. ఎందుకిలా అంటే కారణాలు బోలెడు. ముఖ్యమైనది మాత్రం పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడమే. అందుకే ఐదేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి (యూఎన్) ‘వన్ హెల్త్’ కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తోంది. ‘సర్వే సంతు నిరామయ’ వేదాల్లోని శాంతి మంత్రంలో ఓ చిన్న భాగమిది. భూమ్మీద ఉన్న వారెవరికీ వ్యాధుల బాధ లేకుండా ఉండు గాక అని అర్థం. అంటే మనుషులతోపాటు జీవజాలం మొత్తం కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటం. యూఎన్ ‘వన్ హెల్త్’ లక్ష్యం కూడా ఇదే. మానవుల ఆరోగ్యం బాగుండేందుకు.. కరోనా, ఎబోలా, వెస్ట్ నైల్ వంటి భయంకర వ్యాధులు ప్రబలకుండా, కొత్త కొత్త వ్యాధులు అంటకుండా చూసుకునేందుకు.. మన చుట్టూ ఉన్న జంతువులు, ప్రకృతిని కూడా కాపాడుకోవాలని చెబుతుంది ‘వన్ హెల్త్’. నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదు. కాకపోతే ఇటీవలికాలంలో పెచ్చుమీరుతున్న జంతు వ్యాధుల నేపథ్యంలో మరింత ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. విస్తరిస్తూ పోతున్న కొద్దీ.. భూమ్మీద జనాభా పెరుగుతోంది. మనిషి కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాడు. ఈ క్రమంలో మనుషులకు, అడవి జంతువులకు మధ్య ఉన్న దూరం తగ్గిపోతోంది. ఇలా ఆ జంతువులకు దగ్గరవుతున్న కొద్దీ వాటిలో ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న వ్యాధికారక సూక్ష్మజీవులు మనలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నాయి. అడవుల నరికివేత, వ్యవసాయ పద్ధతులు మారిపోవడం, పర్యావరణం దెబ్బతినడం దానికి ఊతమిస్తోంది. వ్యాపార, వాణిజాల్లో వృద్ధి కారణంగా వ్యాధులు ఒకచోటి నుంచి ఇంకో చోటకు ప్రయాణించడం సులువైపోయింది. అందుకే ఇటీవలికాలంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎక్కువైందన్నమాట. కుక్కల నుంచి వచ్చే రేబిస్ మొదలుకొని సాల్మోనెల్లా, వెస్ట్నైల్ ఇన్ఫెక్షన్లు, క్యూ ఫీవర్, ఆంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, లైమ్, రింగ్వర్మ్, ఎబోలా వంటివి మనం ఎదుర్కొంటున్న జునోటిక్ (జంతువుల నుంచి సోకేవి) వ్యాధుల్లో కొన్ని మాత్రమే. మారిన పరిస్థితులు జంతువులకూ మరిన్ని వ్యాధులు సోకేలా చేస్తూండటం ఆసక్తికరమైన అంశం. ఏయే అంశాలపై ‘వన్ హెల్త్’ దృష్టి ‘వన్ హెల్త్’ కార్యక్రమం కేవలం జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధులపై మాత్రమే దృష్టిపెట్టడం లేదు. ఈ వ్యాధులకు కారణమైన ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటోంది. యాంటీ బయాటిక్లకు లొంగని సూక్ష్మజీవులు వీటిలో ఒకటి. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించని పక్షంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఆస్పత్రులు, ఆహారం, మట్టి, నీరు వంటి పలు మార్గాల ద్వారా మందులకు లొంగని వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి. అలాగే వ్యాధికారక సూక్ష్మజీవులను మోసుకెళ్లే క్రిమికీటకాలు (దోమలు, పశువులు, జంతువులపై ఆధారపడి బతికే పేన్లు, ఇతర కీటకాలు)లను నియంత్రించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహారంగా ఉపయోగించుకునే జంతువుల (కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల్లాంటివి) సంరక్షణ, ఆరోగ్యం కూడా ‘వన్హెల్త్’ కార్యక్రమంలో భాగమే. వన్ హెల్త్ కింద ఏం చేస్తున్నారు? వన్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నడుస్తున్నాయి. మానవ, జంతు వ్యాధుల నిపుణులు, పర్యావరణవేత్తలు కలిసికట్టుగా రకరకాల వ్యాధుల వ్యాప్తి ఎలా జరుగుతోందో తెలుసుకుంటున్నారు. పశువులతోపాటు మనుషుల్లోనూ యాంటీ బయాటిక్ల విచ్చలవిడి వాడకానికి చెక్ పెట్టేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెంపుడు జంతువుల యజమానులు, రైతుల్లోనూ వన్హెల్త్ కార్యక్రమం ఉద్దేశాలు, లక్ష్యాలు, జరుగుతున్న నష్టాలను వివరిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో తగిన చర్యలు చేపడుతున్నారు. కంబోడియాలో రేబిస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజాల నివారణ కోసం వ్యవసాయ, మత్స్య, అటవీ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. అమెరికాలోని అట్లాంటా అక్వేరియంలోని జలచరాలు కొన్నింటికి కరోనా సోకింది. వాటికెలా సోకిందో తెలుసుకునేందుకు వన్హెల్త్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఇది ఇతర జంతువులకు మనుషులకు మళ్లీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నవంబర్ మూడు.. వన్హెల్త్ డే! 1964లో కాల్విన్ ష్వాబ్ అనే పశువైద్యుడు తొలిసారి ‘వన్ మెడిసిన్’ పేరుతో రాసిన ఒక పరిశోధన వ్యాసంలో జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధుల్లోని సారూప్యతలను ప్రస్తావించారు. పశు, మానవ వైద్యులు కలిసికట్టుగా పనిచేస్తే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ష్వాబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈ అంశంపై కృషి చేయడం మొదలుపెట్టింది. 2004లో వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ, రాక్ఫెల్లర్ యూనివర్సిటీలు ‘వన్ వరల్డ్.. వన్హెల్త్’ పేరుతో కార్యక్రమం చేపట్టాలని సూచించాయి. సాంక్రమిక వ్యాధులను అరికట్టేందుకు జంతువులు, పర్యావరణం రెండింటిపైనా దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించాలని ప్రతిపాదించాయి. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ 2007లో మానవ, జంతు వైద్య పరిశోధన సంస్థల మధ్య సహకారానికి తీర్మానం చేయగా.. తర్వాతి కాలంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్), ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలు ‘వన్ హెల్త్’ కార్యక్రమం కోసం ఓ ప్రణాళికను రూపొందించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత కూడా పలు అంతర్జాతీయ స్థాయి సదస్సులు, చర్చలు, విధానాల రూపకల్పనతో 2016లో ‘వన్ హెల్త్ కమిషన్, వన్ హెల్త్ ప్లాట్ఫామ్, వన్ హెల్త్ ఇనిషియేటివ్’ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. నవంబరు మూడో తేదీని ‘వన్ హెల్త్ డే’గా ప్రకటించాయి. నైజీరియాలో సీసంతో.. 2010లో నైజీరియాలో అకస్మాత్తుగా డజన్ల కొద్దీ బాతులు చచ్చిపోయాయి. కారణాలేవీ తెలియలేదు. బాతులే కదా అని ప్రజలూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత అదే ప్రాంతంలో వందలాది మంది పిల్లలు జబ్బు పడటం మొదలైంది. సమస్య ఎక్కడుందో వెతికేందుకు జరిగిన ప్రయత్నంలో.. ఆ ప్రాంతంలోని వారు ఎక్కువమంది ముతక పద్ధతుల్లో బంగారాన్ని అన్వేషిస్తున్నారని.. ఈ క్రమంలో విడుదలైన సీసం నీళ్లలో చేరి పిల్లల అనారోగ్యానికి కారణమైందని తేలింది. నమీబియా చీతాలతో లాభం నమీబియా చీతాలు ఇటీవలే ఇండియాకు వచ్చాయి. దశాబ్దాలపాటు భారత్లో కనుమరుగైపోయిన చీతాలు మళ్లీ కనిపించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు కూడా. అయితే దీనివల్ల ఇంకో ప్రయోజనమూ ఉంది. వేటాడి బతికే చీతాలు క్షీణించిపోతున్న గడ్డి మైదానాలను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. వేటాడే జంతువులు లేకపోవడం వల్ల గడ్డి తిని బతికే జంతువులు ఎక్కువై మైదానాలు లేకుండా చేస్తున్నాయని, చీతాల ప్రవేశంతో సమతౌల్యత ఏర్పడి గడ్డి మైదానాలు మళ్లీ పుంజుకుంటాయని అంటున్నారు. కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ 2007లో కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ చోటు చేసుకుంది. మోంటెరీబే ప్రాంతంలో సీఒట్టర్స్ (సీల్ల తరహాలో ఉంటాయి) అని పిలిచే జలచరాలు కొన్ని జబ్బుపడ్డాయి. మరికొన్ని ప్రాణాలు కోల్పోయాయి. వాటి చిగుళ్లు పసుపుపచ్చ రంగులోకి మారిపోయాయి. కాలేయం ఉబ్బి ఉంది. మామూలు జబ్బులేవీ ఈ లక్షణాలకు కారణం కాదు. వన్హెల్త్ కార్యక్రమం కింద సముద్ర, మత్స్య శాఖల అధికారులు పరిశోధన మొదలుపెడితే.. పజారో నది నుంచి పింటో సరస్సుకు అక్కడి నుంచి సముద్రంలోకి కలుస్తున్న నీళ్లలో కొట్టుకొస్తున్న నాచులోని ఓ రసాయనం సీఒట్టర్స్ల మరణానికి కారణమని తెలిసింది. పింటో సరస్సులో విపరీతంగా పెరిగిన నాచులోని నత్తగుల్లలు తినడం సీఒట్టర్స్ ప్రాణాలమీదకు తెచ్చిందని స్పష్టమైంది. -
జంతువుల మాదిరిగానే.. మనుషులకు తోక!
ఆధునిక మానవుల పూర్వజీవులు లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో తోకలు కోల్పోవడం జరిగింది. మనుషులకు తోకలు ఉంటే, వయసు మళ్లినా జంతువుల మాదిరిగానే నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటారు కదా అని ఆలోచించారు జపానీస్ పరిశోధకులు. ఆ ఆలోచనతోనే కీయో యూనివర్సిటీ పరిశోధకులు ఒక మీటరు పొడవు ఉండే రోబోటిక్ తోకను రూపొందించారు. వెనుకవైపు వేలాడేలా దీన్ని తొడుక్కుంటే, ఇది అచ్చం జంతువుల తోకల మాదిరిగానే పనిచేస్తుంది. ఈ తోక గడియారంలోని పెండ్యూలంలా కదులుతూ, నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా చేస్తుందని కీయో వర్సిటీ పరిశోధకుడు జునిచి నబెషిమా తెలిపారు. -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెర్సిడెజ్ బెంజ్: విధుల నుంచి రోబోట్ల తొలగింపు, ఉద్యోగుల నియామకం!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్ల తయారీలో రోబోట్ల కంటే మనుషులే మేలని నమ్ముతుంది. అందుకే ప్రస్తుతం కార్ల మ్యానిఫ్యాక్చరింగ్లో ఉన్న రోబోట్లను తొలగించింది. వాటి స్థానంలో మనుషుల్ని నియమించనుంది. జర్మన్ ఆటోమేకర్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్-క్లాస్ లిమోసిన్, ఎలక్ట్రిక్ అవతార్ మెర్సిడెస్ ఈక్యూఎస్, మేబాక్, ఏఎంజీ వెహికల్స్ తయారు చేసిన ఫ్యాక్టరీ 56లో, అలాగే ఓల్డ్ ఫ్యాక్టరీ 46లో గతంలో ఉన్న 25-30శాతం రోబోట్లలో 10 కంటే తక్కువకు తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారణంగా, లగ్జరీ కార్ల తయారీదారు ఇప్పుడు కంబస్టివ్-ఇంజిన్, అలాగే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను అదే స్థాయిలో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎందుకంటే రోబోట్లు కార్ల తయారీని ఒక్కో పని మాత్రమే చేస్తాయి. అదే మనుషులైతే ఒకే సారి పలు మోడళ్లను తయారు చేసే సామర్ధ్యం ఉందని నమ్ముతుంది. ఈ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్ సైట్ మేనేజర్ మైఖేల్ బాయర్ మాట్లాడుతూ..రోబోట్లను మనుషులు భర్తీ చేయడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. కానీ సామర్ధ్యం పెంచుతుందని బౌయర్ వివరించాడు. వినియోగదారుల డిమాండ్ పెరిగే కొద్ది కార్ల తయారీలో ఉపయోగించే టెక్నాలజీల్లో మార్పులు చోటు చేసుకోవడం సర్వసాధారణమని అన్నారు. -
మనుషులంతా కలిస్తే.. కిలోమీటర్ మాంసం ముద్ద!
భూమ్మీద జనాభా కొంచెం అటూ ఇటూగా 780 కోట్లు. మరి అంత మందినీ కలిపి గట్టి ముద్ద చేస్తే.. మహా అయితే ఓ కిలోమీటర్ వెడల్పుండే ఓ పెద్ద మాంసం ముద్ద తయారవుతుందట. అమెరికాకు చెందిన గణిత శాస్త్రవేత్తలు సరదాగా ఈ లెక్కలేశారు. మనుషుల శరీర సాంద్రత ఘనపు (క్యూబిక్) మీటర్కు 985 కిలోలుగా, సగటున ఒక్కొక్కరి బరువును 62 కిలోలుగా లెక్కించి.. అందరినీ కలిపితే ఎంత పెద్ద మాంసం ముద్ద అవుతుందో తేల్చారు. ఆ మాంసం ముద్ద.. ఈఫిల్ టవర్కు మూడింతలు, లేదా న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ వెడల్పు అంత ఉంటుందని అంచనా వేశారు. ఇది మొత్తం భూమితో పోలిస్తే.. పెద్ద కొండ ముందు ఆవ గింజంత అన్నమాట. మరి సరదాగా లెక్కలేసినా.. దీనిపై వాళ్లు చేసిన కామెంట్ మాత్రం చెంప చెళ్లుమనేలా ఉంది. అదేంటో తెలుసా.. ♦‘మనుషులు ఇంత చిన్న మాంసం ముద్దను మేపడానికి అంత పెద్ద భూమిని నాశనం చేస్తున్నారు’..అని. భూమ్మీద ఉన్న మనుషులందరినీ.. అమెరికాలోని గ్రాండ్ కాన్యన్(లోయ)లో కుప్పపోస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆ దేశ శాస్త్రవేత్త ఒకరు రూపొందించిన చిత్రమిది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
జీవనయానం వలస ప్రయాణం
చరిత్ర గురించి చాలా నిర్వచనాలే ఉండొచ్చు. స్థూలంగా మానవుల వలస పరిణామాన్ని నమోదు చేసే కథనమే చరిత్ర. వలసలు లేకుండా మానవాళికి మనుగడ లేదు. చరిత్ర అంతా వలసల మయమే! ప్రకృతి సానుకూలత లేని ప్రదేశాలను విడిచిపెట్టి, సురక్షిత ప్రదేశాలకు వలస వచ్చిన మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు నాగరికతలు ఏర్పడ్డాయి. నాగరికతల పరిణామ క్రమంలో స్థిర నివాసాల సంస్కృతి వ్యాప్తిలోకి వచ్చినంత మాత్రాన మనుషుల వలసలు ఆగిపోలేదు. ప్రకృతి బీభత్సాల నుంచి, యుద్ధాల నుంచి, నియంతృత్వ పీడనల నుంచి, కరవు కాటకాల నుంచి వీలైనంత దూరంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవడానికే మనుషులు ప్రయత్నిస్తారు. పుట్టిపెరిగిన చోట చాలీచాలని బతుకులను బలవంతంగా నెట్టుకొచ్చే కంటే, ఎంత దూరమైనా వెళ్లి బతుకులను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో మెరుగైన జీవితాల కోసం మనుషులు తాము పుట్టి పెరిగిన ప్రదేశాలను విడిచిపెట్టి, దేశాలను దాటి వలసలు వెళుతూనే ఉన్నారు. వలసలు మనుషులకు మాత్రమే పరిమితం కాదు. భూమ్మీద మనుషులే కాకుండా, జలచర ఖేచరాదులు కూడా సానుకూల పరిసరాలను వెదుక్కుంటూ సుదూర ప్రదేశాలకు వలస వెళతాయి. ఇప్పుడు మన దేశంలో వలసపక్షుల కాలం మొదలైంది. ఖండాంతరాలను దాటి శరదృతువులో ఇక్కడకు చేరుకునే నానాజాతుల పక్షులు వసంత రుతువు వరకు ఉంటాయి. మనుషుల వలసలకు, పక్షుల వలసలకు తేడాలున్నాయి. మనుషులకు తాము పుట్టి పెరిగిన ప్రదేశం కంటే వలస వచ్చిన ప్రదేశమే సురక్షితంగా, తమ అభివృద్ధికి భేషుగ్గా ఉన్నట్లయితే, అక్కడే స్థిరపడిపోయి, తరతరాలుగా పాతుకుపోతారు. పాపం, పక్షులు అలా కాదు. వాటి వలసలన్నీ కేవలం రుతుధర్మాన్ని అనుసరించే సాగుతాయి. వలసల్లో పక్షుల క్రమశిక్షణ తిరుగులేనిది. కచ్చితంగా నిర్ణీత కాలానికి వస్తాయి.æఅంతే కచ్చితంగా నిర్ణీత కాలానికి తమ తమ నెలవులకు తిరిగి వెళ్లిపోతాయి. మనుషుల మాదిరిగా ఆస్తులు కూడబెట్టుకుని, శాశ్వతంగా ఉండిపోవాలనుకోవు. శరదృతువు ఆగమనంతోనే మన దేశంలోని ప్రధానమైన సరస్సుల వద్ద వలసపక్షుల సందడి మొదలవుతుంది. ఒడిశాలోని చిలికా, ఆంధ్రప్రదేశ్లోని పులికాట్, కొల్లేరు, గుజరాత్లోని నలసరోవర్, కేరళలోని కుమరకోమ్ వంటి సరస్సుల వద్దకు, పశ్చిమబెంగాల్లోని సుందర్బన్, అరుణాచల్లోని ఈగల్నెస్ట్ వంటి అభయారణ్యాలకు వందలాది జాతులకు చెందిన లక్షలాది వలస పక్షులు వస్తాయి. ధ్రువప్రాంతంలోని శీతల వాతావరణానికి దూరంగా, కాస్త వెచ్చగా ఉండే ప్రదేశాలకు ఈ పక్షులు వలస వస్తాయి. గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలు చేస్తాయి. పిల్లలకు రెక్కలు రాగానే, వాటితో కలసి వేసవి మొదలవుతుండగా తిరిగి వెళ్లిపోతాయి. వలసల్లో మనుషుల పద్ధతి కాస్త భిన్నం. తరతరాల కిందట మన దేశం నుంచి వలసవెళ్లిన మనవారు వివిధ దేశాల్లో పూర్తిగా స్థిరపడిపోయారు. కొన్ని దేశాల్లో అధికార పదవులనూ దక్కించుకున్నారు. అలాగని వలసలన్నీ సుఖప్రదమైన ప్రయాణాలు కావు. పక్షులకైనా, మనుషులకైనా వలసల్లో ఆటుపోట్లు, అడుగడుగునా ప్రమాదాలూ తప్పవు. ప్రకృతి వైపరీత్యాల నుంచి వలసపక్షులకు మార్గమధ్యంలో ఆపదలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ అధిగమించి సానుకూల వాతావరణంలోకి వలస వచ్చి, గూళ్లు ఏర్పాటు చేసుకున్నా, వాటి మనుగడకు పూర్తి భద్రత ఉండదు. వేటగాళ్ల వలలకు, ఉచ్చులకు చిక్కి బలైపోతుంటాయి. ఇన్ని కష్టనష్టాల తర్వాత ప్రాణాలతో మిగిలినవి మాత్రమే తిరిగి తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకోగలుగుతాయి. బతుకుతెరువు కోసం వలస వెళ్లే మనుషుల పరిస్థితీ అంతే! ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులు దళారుల చేతిలో మోసపోయి, వెట్టి చాకిరి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితులు ఉన్నాయి. అనుకోని దుర్ఘటనల్లో అయినవారికి దూరంగా ప్రాణాలు పోగొట్టుకునే ఉదంతాలూ ఉన్నాయి. మంచు గడ్డకట్టే శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు ఏకకణ జీవి అమీబా మొదలుకొని, క్షీరదమైన మంచు ఎలుగుబంటి వంటి జీవులు శీతాకాలమంతా ఉన్న చోటనే కదలకుండా పడిఉండి సుప్తావస్థలో గడుపుతాయి. నిత్యచైతన్యశీలత కలిగిన పక్షులు ఇలా సుప్తావస్థలోకి జారుకోలేవు. అందుకే తమ స్వేచ్ఛా విహారానికి తగిన మెరుగైన పరిసరాలను అన్వేషిస్తూ వలసలు ప్రారంభిస్తాయి. వాతావరణం ఎంత ప్రతికూలంగా మారినా, ఎక్కడికక్కడే ఉండిపోయి సుప్తావస్థలోకి జారుకోవడం స్తబ్ధతకు పరాకాష్ఠ! ఇలాంటి స్తబ్ధత కొందరు మనుషుల్లోనూ ఉంటుంది. పరిస్థితుల్లోని మార్పులకు స్పందించకుండా, ఎలాంటి కదలికా లేకుండా శీతలనిద్రలోకి జారుకునే మనుషులు చరిత్ర ప్రవాహంలో ఆనవాళ్లే లేకుండా కొట్టుకుపోతారు. బలమైన ఆకాంక్షలతో వలసల బాట పట్టిన సమూహాలు, వ్యక్తులు చరిత్రగతిని మార్చేసిన ఉదంతాలు మనకు తెలుసు. ఎక్కడెక్కడి నుంచో ఈ దేశానికి వలస వచ్చిన సమూహాలు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుని, శతాబ్దాల తరబడి పాలన సాగించాయి. స్థానికులపై నిర్దాక్షిణ్యంగా అణచివేత సాగించాయి. ఉన్నత విద్య కోసం బ్రిటన్కు, ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లిన గాంధీజీ, తన వలస ప్రస్థానాన్ని స్వాతంత్య్రోద్యమానికి పునాదిగా మలచుకున్నారు. శ్వేతజాతీయుల వలస ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేస్తే, గాంధీజీ వంటి జాతీయ నాయకుల వలస ఈ దేశ స్వాతంత్య్రానికి ఊపిరిపోసింది. అన్ని ప్రయాణాల్లో మాదిరిగానే వలసల్లోనూ ప్రమాదాలు అనివార్యం. అంతమాత్రాన వలసలు ఆగిపోవు, చరిత్రా ఆగిపోదు! -
మనుషులతో లైంగిక సంబంధాల వల్లనే.. ఈ జాతి అంతరించిందా..?
ఓ విషయం తెలియనంత వరకు ప్రతిదీ ఓ మిస్టరీనే.. అసలు మనుషులు ఎలా వచ్చారు? ఎక్కడ నుంచి వచ్చారు? ఏ విధంగా పరిణామం చెందారు? అనే విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే నలభై వేల ఏళ్ల కిందట మనుగడలో ఉన్న నియాండర్తల్స్ జాతి ఎలా అంతరించిపోయిందన్నది ఇప్పటికీ ఓ రహస్యమే. సాక్షి, న్యూఢిల్లీ: 6,00,000 ఏళ్ల కిందట మానవ జాతి రెండు బృందాలుగా చీలిపోయింది. ఒక బృందం ఆఫ్రికాలో ఉండిపోయింది. ఆ బృందం నుంచే మనుషులు పరిణామం చెందినట్లు పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే మనుషులతో లైంగిక సంబంధాల వల్ల నియాండర్తల్స్ జాతి అంతరంచిపోయినట్లు తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. పీఎన్ఓఎస్ వన్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నియాండర్తల్ రక్త నమూనాలు వారి రక్తం నిర్దిష్ట జన్యు వైవిధ్యాలను కలిగి ఉన్నట్లు చూపిస్తుంది. ఇది ‘‘హెమోలిటిక్ డిసీజ్ ఆఫ్ ది ఫీటెస్ అండ్ న్యూబార్న్’’కి గురయ్యే అవకాశం ఉందని, ఈ హెచ్డీఎఫ్ఎన్ రక్తహీనతకు కారణమవుతుందని, సాధారణంగా రెండవ, మూడవ, తదుపరి గర్భధారణతో మరింత తీవ్రమవుతుందని పరిశోధకులు నమ్ముతున్నారు. మానవులు, నియాండర్తల్ల మధ్య లైంగిక సంబంధాల ఫలితంగా.. అరుదైన రక్త రుగ్మత నియాండర్తల్ సంతానంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ వ్యాధి నియాండర్తల్ పిల్లల సంఖ్య తగ్గడానికి దారితీసిందని వారు విశ్వసిస్తున్నారు. కాగా మానవ పూర్వీకులు, నియాండర్తల్ల మధ్య లైంగిక సంబంధాల వల్ల హెచ్డీఎన్ఎఫ్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఈ రుగ్మత ఇప్పుడు మానవ జాతులలో చాలా అరుదుగా పరిగణిస్తున్నప్పటికీ.. జాతుల జన్యు పూల్ చాలా పరిమితంగా ఉన్నందున ఇది నియాండర్తల్లో సర్వసాధారణంగా పరిగణిస్తారు. అసలు నియాండర్తల్స్ ఎవరు? నియాండర్తల్స్ గురించి తెలుసుకుంటే ఆధునిక మనుషుల గురించి తెలుస్తుంది. మానవులకు, నియాండర్తల్స్కు చాలా పోలికలున్నాయి. పుర్రె, శరీర నిర్మాణం ఒకలాగే ఉంటాయి. మనుషులకు, వాళ్లకూ డీఎన్ఏలో 99.7% దగ్గరగా ఉంది. ప్రవర్తనలో కూడా నియాండర్తల్స్కూ, మనుషులకు చాలా పోలికలున్నాయి. వాళ్లు కూడా మానవుల్లాగే నిప్పు పుట్టించారు. చనిపోయినవారిని ఖననం చేశారు. సముద్రపు చిప్పలు, గవ్వలు, జంతువుల దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారుచేసి ధరించేవారు. మనుషుల్లాగే రాతిమీద చిత్రాలను చెక్కారు. మందిరాలు నిర్మించారని పలు పరిశోధనల్లో పేర్కొన్నారు. మంచి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు..! ఇక నియాండర్తల్స్ మంచి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు. జింకలు, కొండ గొర్రెలు, కణుజులని పిలిచే పెద్ద పెద్ద దుప్పిలు, అడవి దున్నలు, ఖడ్గ మృగాలు, మామత్ ఏనుగులను వేటాడడానికి పదునైన ఈటెలను ఉపయోగించేవారు. వారి కుటుంబాల మీద, నివసించే ప్రాంతాల మీద ఎవరైనా దాడికి దిగితే వారు తయారు చేసుకున్న పదునైన ఆయుధాలను ఉపయోగించేరని, ఇలాంటి సంఘర్షణలు ఆ కాలంలో తరచుగా జరుగుతుండేవని పురావస్తు శాస్త్రం చెబుతోంది. సుమారు 1,00,000 సంవత్సరాలు ఆధునిక మానవుల విస్తరణను ప్రతిఘటిస్తూ వచ్చారు. ఆదిమ మానవులు (హోమో సేపియన్స్) 2,00,000 సంవత్సరాలకు పూర్వమే ఆఫ్రికా నుంచి బయటకు వచ్చినా, నియాండర్తల్స్ నివసించిన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి 1,50,000 సంవత్సరాలకి పైనే పట్టిందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. -
కొమురం భీం జిల్లాపై కరోనా పంజా
-
బర్డ్ఫ్లూ: పక్షులనుంచి మనుషులకు వస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ : గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ఫ్లూ) వైరస్ పక్షులనుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకే అవాకాశం చాలా అరుదని ప్రముఖ ఢిల్లీ వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉడికీ ఉడకని చికెన్ తినటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. బర్డ్ఫ్లూ సోకిన పక్షుల లాలాజలం, వ్యర్ధాల ద్వారా మనషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. కలుషిత ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. గాల్లో ఉన్న వైరస్ను పీల్చటం ద్వారా, వైరస్తో కలుషితమైన ప్రదేశాలను తాకి ఆ వెంటనే ముక్కు, కళ్లను ముట్టుకోవటం ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ( అది బర్డ్ఫ్లూ కాదు..) జ్వరం, దగ్గు, గొంతునొప్పి, కారే ముక్కు, ఒంటి నొప్పులు, తల నొప్పి, కళ్లు ఎర్రగా అవ్వటం వంటివి వైరస్ లక్షణాలుగా పేర్కొంది. ఇది మామూలు జలుబు లాంటిదేనని, కానీ, కొంతమందికి ఎక్కువ ప్రమాదకారిగా మారుతుందని తెలిపింది. గర్భిణులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, 65 సంవత్సరాల వయసు పైబడ్డవారికి ఎక్కువ నష్టం కలుగుతుందని వెల్లడించింది. ఈ వైరస్పై డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ యాట్ పోర్టిస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జేసీ సూరి మాట్లాడుతూ.. ‘‘ కోళ్ల ఫారాలలో పనిచేసేవారు పీపీఈ కిట్లు ధరించాలి. గ్లోజులు కూడా ధరించాలి. ఎప్పటికప్పుడు కలుషిత ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేసుకోవాలి’’ అని తెలిపారు. -
మానవ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకం
వాషింగ్టన్ : ‘స్పేస్ ఎక్స్’ అంతరిక్ష సంస్థ మరోసారి మానవసహిత రాకేట్ను దిగ్విజయంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఆదివారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు ప్రయాణమైంది. స్పేస్ ఎక్స్, నాసాలు సంయుక్తంగా చేపట్టిన తొలి మానవసహిత ఆపరేషనల్ మిషన్ ఇదే. అమెరికాకు చెందిన వ్యోమగాములు మైకెల్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్, శనాన్ వాకర్, జపాన్కు చెందిన సోచి నగూచీలు ఈ మిషన్లో భాగమయ్యారు. ఆదివారం రాత్రి 7:27 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి రాకేట్ ఐఎస్ఎస్కి బయలుదేరింది. అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ ఈ ప్రయోగాన్ని కొనియాడారు. ( త్వరలో ఫైజర్ కరోనా టీకా సరఫరా ) సోమవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ మన తెలివి, సంకల్ప బలం ద్వారా సాధించిన విజ్ఞాన శక్తికి ఇది నిదర్శనం.. ఎంతో గొప్పది’’ అని పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా దీనిపై స్పందించారు ‘‘అమెరికా మానవ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకం’’ అని అన్నారు. కాగా, గత మే నెలలో స్పేస్ ఎక్స్కు చెందిన ఓ రాకేట్ ఇద్దరు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాంటి నష్టం లేకుండా ఆగస్టు నెలలో క్షేమంగా భూమిపైకి చేరింది. -
మనిషి స్వార్థంతో మసకబారిన దేవుని ప్రేమ!!
పస్కా పండుగనాచరించడానికి యూదులంతా యెరూషలేము పట్టణానికి రావాలన్నది ధర్మశాస్త్ర నిబంధన (నిర్గమ 23:7). అందువల్ల యేసుప్రభువు కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే పస్కాపండుగ కోసం యెరూషలేము పట్టణానికి వచ్చాడు. యెరూషలేము ప్రజలను, పండగనాచరించడానికి అక్కడికి వచ్చిన యూదులనుఉద్దేశించి ‘నేను ఆకలితో ఉన్నపుడు నాకు మీరు భోజనం పెట్టారు, నాకు దాహమైనపుడు నీళ్లిచ్చారు, పరదేశిగా ఉన్నపుడు ఆశ్రయమిచ్చారు, వస్త్రాలు లేనపుడు వస్త్రాలిచ్చారు, రోగినై వుంటే, చెరసాలలో ఖైదీగా ఉంటే నన్ను మీరు పరామర్శించారంటూ యేసు చేసిన బోధ యెరూషలేములో పెద్ద సంచలనమే రేపింది (మత్తయి 25;35,36), ఈ బోధ విన్న వాళ్లంతా, ‘ప్రభువా, మీకోసం మేము ఇవన్నీ ఎప్పుడు చేశాము?’ అంటూ అమాయకంగా ప్రశ్నించారు. ‘‘నాకు ప్రత్యక్షంగా చెయ్యలేదేమో, కానీ మీ చుట్టూ ఉన్న పేదలు, నిరాశ్రయులైన వారికి మీరు చేసిన ప్రతి మేలూ, సహాయమూ నాకు చేసినట్టే’’ అని వివరించి, ఇలా పేదలను ఆదుకున్న ‘మీరంతా నా పరలోకపు తండ్రిచేత ఆశీర్వదించబడినవారు’ అని ప్రకటించాడు. దేవుని దర్శనం కోసం ఎక్కడెక్కడినుండో వచ్చిన నాటి యూదులందరికీ, ‘దేవుని చూసేందుకు ఇంత దూరం రానఖ్ఖర్లేదు, మీరుండే ప్రాంతాల్లోనే మీ చుట్టూ ఆపదల్లో, అవసరతల్లో ఉన్న పేదలు, బలహీనులకు అండగా నిలిస్తే చాలు, దేవుని చూసినట్టే, ఆయన్ను సేవించినట్టే’ అంటూ యేసు చేసిన నాటి బోధతో పండుగ తర్వాత సొంత ఊళ్లకు వెళ్లిన యూదు ప్రజలు, ప్రభావితులై వచ్చే ఏడాది యెరూషలేముకు రాకపోతే, వారి కానుకలు లేక ఆలయ ఖజానా వెల వెలబోతే, యాజకులు, ఆలయ నిర్వాహకులైన లేవీయులు బతికేదెలా? ఆలయ ప్రాంగణంలో అనుబంధంగా సాగుతున్న వ్యాపారాలు మూతపడితే ఎంత నష్టం? వెంటనే యాజకులు, యూదు ప్రముఖులు సమావేశమై ‘ఇక యేసును చంపాల్సిందే. కాకపోతే పండుగలో చంపితే ప్రజలు తిరుగబడతారు గనుక నిదానంగా ఆ పని చేద్దాం’ అని తీర్మానించుకున్నారు (మత్త 26:3,4). దేవుని మానవరూపమూ, తానే దేవుడైన యేసును చంపేందుకు, ఆయనకు ఆరాధనలు నిర్వహించే వారే కుట్ర చెయ్యడం కన్నా మరో విషాదం ఉంటుందా? దేవాలయ యాజక వ్యవస్థ స్వార్ధపూరితమైన ప్రతిసారీ, చరిత్రలో ఇలాంటి అనర్థాలే జరిగాయి. దేవుని ఉదాత్తమైన సంకల్పాలను మరుగు పర్చగల ‘నాశనకరమైన శక్తి’ మనిషి స్వార్థానిదని మరోసారి రుజువైంది. దీనికన్నా విషాదకరమైన పరిణామం మరోటి జరిగింది. పస్కా పండుగ మరునాడే అంటే అర్ధరాత్రి దాటగానే, ప్రజలంతా గాఢనిద్రలో ఉండగానే యేసును తాను అప్పగిస్తానని, ఆయన్ను అర్ధరాత్రే బంధించి, ప్రజలు నిద్ర లేచేలోగా విచారణ చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని యేసు శిష్యుల్లోనే ఒకడైన యూదా ఇస్కరియోతు ఆలయ యాజకులకు సూచించి అందుకు ముప్పై వెండినాణేలకు వారితో ఒప్పందం చేసుకున్నాడు. చివరికి అదే జరిగి మరునాడే యేసును సిలువ వేశారు. యేసు బోధల్ని ఉన్నవి ఉన్నట్టుగా లోకానికి చేరవేయవలసిన చర్చి, పరిచారకుల వ్యవస్థ తమ స్వార్థం కోసం వాటిని కలుషితం చేస్తున్నందువల్లే, దేవుని రాజ్య నిర్మాణం ఆగిపోయింది, ఎంతోశక్తితో సమాజాన్ని ప్రభావితం చేసి లోక కల్యాణానికి కారణం కావలసిన క్రైస్తవం’ పేలవమైంది. – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
చీకట్లను చీల్చిన దివ్యజ్యోతి
మానవజాతి సంస్కరణ కోసం ప్రపంచంలో అనేకమంది సమాజోద్ధారకులు ప్రభవించారు. వారిలో చివరిగా వచ్చినవారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం. మనందరి ప్రవక్త ఒక్కరే, మనందరి గ్రంథం ఒక్కటే. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే.. అనిఎలుగెత్తి చాటేరోజు మిలాదున్నబీ. ప్రవక్త జననానికి ముందు నాటి సమాజంలో ‘కర్రగలవాడిదే బర్రె’ అన్నట్లుగా బలవంతుడు బలహీనుణ్ణి పీక్కు తినేవాడు. స్త్రీల హక్కుల విషయం కాదుగదా అసలు వారికంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న విషయాన్నే వారు అంగీకరించేవారు కాదు. స్త్రీని విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు. అలాంటి జాతిని అన్ని విధాలా సంస్కరించి, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ముహమ్మద్ ప్రవక్తదే. నాటిసమాజంలో లేని దుర్మార్గమంటూ లేదు. అలాంటి ఆటవిక సమాజాన్ని నిరక్షరాస్యులైన ముహమ్మద్ ప్రవక్త సమూలంగా సంస్కరించి, ఒక సత్సమాజంగా ఆవిష్కరించారు. దురదృష్టవశాత్తూ ఈనాటి మన నాగరిక, విజ్ఞాన సమాజ స్థితిగతుల్ని విశ్లేషిస్తే మనకు నిరాశే మిగులుతుంది. నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా మనం పతనం అంచుల్లో ఉన్నాం. సమాజంలో నైతిక విలువలు అడుగంటి, పాశ్చాత్య పోకడలు, పబ్ క్లబ్ సంస్కృతి వెర్రితలలు వేస్తున్నది. తత్ఫలితంగా అశ్లీలత, అనైతికత, అమానవీయత, ప్రబలి సాంస్కృతిక విధ్వంసానికి దారితీస్తున్నాయి. చివరికి ఆధ్యాత్మిక రంగంలోనూ అతివాదం ముదిరి మతోన్మాదంగా రూపాంతరం చెందింది. మతం మనిషిని మంచివైపుకు మార్గదర్శకం చేసే బదులు అసహనం, హింసవైపు తీసుకుపోతోంది. సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు కొంతమందిని తీవ్రవాదం, ఉగ్రవాదం వైపుకు తీసుకువెళుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నేటి మన సమాజానికి కూడా ముహమ్మద్ ప్రవక్తవారి బోధనల అవసరం ఉంది. ఆయన బోధనల ప్రకారం... మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. తోటిమానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలి. స్త్రీలను గౌరవించాలి. ఎలాంటి స్థితిలోనూ నీతినీ, న్యాయాన్ని విస్మరించకూడదు. అనాథలను, వృద్ధులను ఆదరించాలి. తల్లిదండ్రులను సేవించాలి. వారిపట్ల విధేయత కలిగి ఉండాలి. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయుల పట్ల తారసిల్లే బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సంఘంలో ఒక మనిషికి మరో మనిషిపై పడే విధ్యుక్త ధర్మాల పట్ల ఉపేక్ష వహించకూడదు. అన్యాయం, అధర్మ సంపాదనకు ఒడికట్టవద్దు. ధనాన్ని దుబారా చేయవద్దు. వ్యభిచారం దరిదాపులకు కాదుగదా.. దానికై పురిగొలిపే అన్నిరకాల ప్రసార ప్రచార సాధనాలను రూపుమాపాలి. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపవద్దు. ప్రజల ధన, మాన, ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిని సాధించలేదు. సదా సత్యమే మాట్లాడాలి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. వాగ్దాన భంగానికి పాల్పడకూడదు. పలికే ప్రతి మాటకూ, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. వ్యాపార లావాదేవీల్లో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో లెక్కా పత్రాలు, కొలతలు, తూనికలు ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలి. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలి. తోటివారిని తమకన్నా తక్కువగా చూడకూడదు. స్త్రీ జాతిని గౌరవించాలి. వితంతువుల్ని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలి. ప్రతి తల్లీదండ్రి తమ సంతానానికి విద్య నేర్పాలి. భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరం. అధికార దుర్వినియోగం చేయకూడదు. పరిపాలన అంటే కేవలం ప్రజాసేవ మాత్రమే.. పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని భావించాలి. ప్రతినిత్యం ప్రజలకు జవాబుదారుగా దైవానికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ మనం పలికే ప్రతి మాటకు, చేసే ప్రతి పనికీ రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలన్న భావన కలిగి ఉండాలి. ఇలాంటి భావనలే మానవులను మంచివారుగా, నిజాయితీ పరులుగా, సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. . మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ మనందరి విశ్వాసం కూడా ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాలి. ఈ పర్వదినం మన కిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచు కోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనంద మైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా సమాజంతో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది ప్రవక్త పుట్టినరోజైన మిలాదున్నబీ. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ అజ్ఞానాంధకార విషవలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న మానవ జాతిని మహోన్నతంగా తీర్చిదిద్దారాయన. దాదాపు 1450 సంవత్సరాల క్రితం అరేబియాదేశంలోని మక్కానగరంలో ఆయన జన్మించారు. ఆమినా, అబ్దుల్లా తల్లిదండ్రులు. పుట్టకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. తాతయ్య ఆయన్ని పెంచి పెద్దచేశారు. చిన్నతనం నుంచే అనేక సుగుణాలను పుణికిపుచ్చుకున్న ముహమ్మద్ ప్రవక్త, ‘అమీన్’ గా, షసాదిఖ్’గా వినుతికెక్కారు. ఆయన గొప్ప మానవతావాది. సంస్కరణాశీలి.ఉద్యమనేత. అతి సాధారణ జీవితం గడిపిన సామ్రాజ్యాధినేత. జ్ఞానకిరణాలు ప్రసరింపజేసిన విప్లవజ్యోతి. ప్రాణశత్రువును సైతం క్షమించిన కారుణ్య కెరటం. ఇటువంటి బాధ్యతాభావాన్ని, జవాబుదారీతనాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రజల మనసుల్లో నూరిపోసి, మానవీయ విలువలతో తులతూగే ఓ చక్కని సత్సమాజాన్ని ఆవిష్కరించారు. అందుకే ఆయన మానవాళికి ఆదర్శమయ్యారు. -
పరలోకాన్ని దూరం చేసిన ‘అనుమానం’!!
ఇంత అందమైన తోటలోని మధురాతిమధురమైన ఫలాల్లో కొన్నింటిని దేవుడు తినొద్దన్నాడా? దేవుడు నిజంగా అలా అన్నాడా?’ అన్న సాతాను ప్రశ్న, తొలి మానవులైన ఆదాం, హవ్వలను సందిగ్ధంలో, ఆ తర్వాత ఆత్మీయమైన అగాథంలో పడేసింది. యుక్తిపరులు అబద్ధాల ప్రచారం కోసం ఇలాంటి తెలివైన ప్రశ్నలు వేస్తుంటారు. అప్పుడప్పుడే తొలి మానవులతో ఆరంభమైన ఈ లోక సందడి, చరిత్ర, సంస్కృతిలో, సాతాను ఇక నుండీ తాను నాటబోయే అబద్దాలకోసం ’ఇది నిజమా?’ అన్న తన ప్రశ్నతో మనిషి హృదయంలోనే ఒక వేదికను నిర్మించుకున్నాడు. దేవుడు తన నివాస స్థానమైన పరలోకానికి, తన సొంతమైన శాశ్వతత్వానికి ముంగుర్తుగా తానే స్వయంగా తొలి మానవుల కోసం నిర్మించిన ఏదెను తోటను ధ్వంసం చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగా సాతాను ముందుగా మనిషి హృదయంలో ఇలా పాగా వేశాడు. సత్యాన్ని దేవుడు తన మాటలు, చేతలతో ప్రతిష్ఠిస్తే, దానికి పోటీగా అనుమానాలే పునాదిగా సాతాను అబద్ధాలను నిర్మిస్తాడు. తాను ప్రకటించిన ‘సత్యాన్ని’ మనిషి సంపూర్ణ విధేయతతో జీవితంలో ఆచరించాలన్నదే దేవుని అభీష్టం కాగా, ‘మీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి’ అన్న పద్ధతిలో సాతానేమో తొలిమానవులకు ‘జ్ఞానాన్ని’ నూరిపోసేందుకు ప్రయత్నించడంతో అసలు సమస్యంతా ఆరంభమయ్యింది. దేవుడు ప్రతిష్టించిన ‘సత్యం’ కన్నా సాతాను నూరిపోసిన జ్ఞానమే ఆదాము, హవ్వలను ఆకట్టుకోవడంతో, అంత కాలం వాళ్లు చూసేందుకు కూడా భయపడిన ‘నిషిద్ధ వృక్షఫ లం’ ఇపుడు సాతాను తెరిచిన లోకజ్ఞానమనే నేత్రాలతో చూస్తుంటే ‘ఆహారానికి మంచిదిగా, చూసేందుకు అందమైనదిగా, వివేకాన్నిచ్చే రమ్యమైనదిగా’ ఆ ఇద్దరికీ కనిపిస్తోంది (ఆది 3:6). మానవాళి సంక్షేమం కోసం దేవుడు సరిహద్దులనేర్పరచి వారిని విశ్వాసులను చేయాలనుకుంటే, సరిహద్దుల్ని తామే చెరిపేసుకొని భ్రష్టత్వాన్ని సంపాదించుకొనే జ్ఞానబోధతో నింపబడి, ఆదాము, హవ్వలు అపరమేధావులయ్యారు. దేవుని సత్యాన్ని ఆచరించడం కన్నా, ‘కొత్త విషయాలు తెలుసుకోవడం’ అనే మేధావితనమే, మానవాళికి అప్పటి నుండి ప్రధానమయ్యింది. దేవుని ఆజ్ఞ కన్నా, తాము పొందిన కొత్త బోధనే నమ్ముకొని వాళ్ళు నిషిద్ధఫలాన్ని తిని, పరలోకాన్ని, ఏదెను తోటను, దేవుని నిత్యసహవాసాన్ని కూడా పోగొట్టుకొని నిజంగానే దిగంబరులయ్యారు. అందువల్ల దేవుడు మానవాళికివ్వాలనుకునే పరలోకం పూర్తిగా విశ్వాసి విధేయతకు సంబంధించిన అంశమే అని తెలుసుకోవాలి. సూక్తులు, బోధలు, సలహాలు, జ్ఞానాంశాలున్న పుస్తకం కాదు బైబిల్!! విశ్వాసులంతా తూచా తప్పకుండా ఆచరించి జీవనసాఫల్యాన్ని పొందేందుకు గాను దేవుడు నిర్దేశించిన ఖచ్చితమైన ఆజ్ఞలు అందులో ఉన్నాయి. అందువల్ల వాటిపై చర్చలకు, వాటిలో మార్పులు చేర్పులకు ఏ మాత్రం తావు లేదు. ‘నిన్నువలె నీ పొరుగు వాణ్ని ప్రేమించు’ అన్నది ఆజ్ఞే, ‘నీ శత్రువును ప్రేమించు’ అన్నది కూడా ఆజ్ఞే!! అవి పాటించక పోతే దేవుణ్ణి ధిక్కరించినట్టే...ఈ విధేయతలోని రహస్యం తెలిసిన వాళ్ళే నిజమైన విశ్వాసులు, ఈ లోకాన్ని దేవుని రాజ్యంగా మార్చగల దేవుని పిల్లలు, దైవిక సాధనాలు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకులు – ఆకాశధాన్యం -
లక్షదీవుల్లోని మానవులు దక్షిణాసియాకు చెందిన వారే
సాక్షి, హైదరాబాద్: కేరళ రాష్టానికి పశ్చిమ దిశగా ఉన్న లక్షదీవుల్లోని మానవులు దక్షిణాసియా ప్రాంతానికి చెందిన వారేనని హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీతో (సీసీఎంబీ) పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ, మంగళూరు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆధునిక మానవులు ఆఫ్రికా నుంచి విస్తరించే క్రమంలో భారత పశ్చిమ తీరం వెంబడి ప్రయాణించినట్లు ఇప్పటికే తెలిసినప్పటికీ ఈ మార్గంలో లక్షదీవులు ఉన్నాయా లేదా అన్నది అస్పష్టం. అంతేకాకుండా ఈ 36 ద్వీప సముదాయంలో మానవ ఆవాసం ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త తంగరాజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ దీవుల్లోని ప్రజలపై కొన్ని జన్యు పరిశోధనలు చేపట్టారు. 8 దీవుల్లోని 557 మంది మైటోకాండ్రియల్ డీఎన్ఏ, 166 మంది క్రోమోజోమ్లను పరిశీలించారు. ఈ వివరాలను విశ్లేషణ చేసినప్పుడు జన్యు వైవిధ్యత తక్కువని స్పష్టమైంది. కాలక్రమంలో ఈ ప్రాంతాలను పలువురు రాజులు పాలించినా తక్కువ జన్యు వైవిధ్యత ఉండటం తమను ఆశ్చర్య పరిచిందని బెనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. -
అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి
అమెరికాను ఒక కొత్త వ్యాధి గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే జంతువుల నుంచి వ్యాప్తి చెందే అనేక అంటురోగాలతో అవస్థలు పడుతున్న అమెరికా ఇపుడు జింకలను చూస్తేనే భయపడిపోతోంది. వన్య మృగాలైన జింకలు, దుప్పిల్లో ఇటీవల విస్తృతంగా వ్యాప్తిస్తూ.. వాటి ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తున్న ‘జొంబీ డీర్’ వ్యాధిపై షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు అక్కడి వైద్య నిపుణులు. ‘జొంబీ డీర్’ (క్రానిక్ వాస్టింగ్ డిసీజ్, సీడబ్యుడీ) అని పిలిచే భయంకరమైన వ్యాధి (డెడ్లీ డిసీజ్) ఆనవాళ్లు ఇప్పటివరకూ జింక, దుప్పి జాతుల్లో మాత్రమే కనిపించాయి. కానీ ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందన్నది నిపుణుల తాజా హెచ్చరిక. ఇదే అగ్రరాజ్య ఆరోగ్య శాఖను పరుగులు పెట్టిస్తోంది. సీడబ్యుడీ వైరస్ సోకగానే..దాని లక్షణాలు వెంటనే బహిర్గతం కావు. శరీరం మొత్తంలో విస్తరించిన తర్వాత గానీ ఈ వ్యాధి సోకినట్లు అర్థంకాదు. దీంతో ఈ వ్యాధి తీవ్రత గురించి ఆందోళన పడాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని ఇలినాయిస్ సహా 24 రాష్ట్రాలతొపాటు, రెండుకెనడియన్ ప్రావిన్స్లో జొంబీ డీర్ వ్యాపించినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెబుతున్నారు. 1960లో కొలరాడోలో, అడవి జింకలో 1981లో మరోసారి గుర్తించామన్నారు. ప్రస్తుతానికి ఈ వ్యాధి మనుషులకు సోకిన కేసులను గుర్తించనప్పటికీ, మానవులకు సోకే ప్రమాదం లేకపోలేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. జొంబీ వైరస్ సోకగానే బరువుతగ్గిపోవడం, బాగా దప్పిక వేయడం, నోటినుంచి చొంగకారడం లాంటి సంకేతాలు కనిపిస్తాయట. ఇప్పటికే వేలకొద్దీ జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి.అలాగే వీటి శారీరక ద్రవాలు మలం, లాలాజలం, రక్తం లేదా మూత్రంలో ఉన్న సీడబ్యూడీ వైరస్ ఎక్కువకాలం పర్యావరణంలో చురుకుగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇవి క్రమంగా మనుషులకు కూడా సోకుతాయని తేల్చారు. మరోవైపు దీని నివారణకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళనకు దారితీస్తోంది. -
యమప్రేమ
ఏదో పాపం... ప్రాణాలు తీయాలన్న డ్యూటీ యముడికి వేయబట్టిగానీ... నిజానికి ఆ క్యారెక్టరుకు మనుషులంటే చాలా ఇష్టం. వారి వినోదం కోసం యముడనే ఆ క్యారెక్టరు చాలా చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. ‘‘చతుర్ముఖ ప్రసాదిత సమస్త పర్యతలోక సామ్రాజ్యాధినాథుండయిన నేను’’ అంటూ ఆయన... ‘‘అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాశాంకుశధారి’’ అనే తన ఫేమస్ డైలాగులతో యమాగా హూంకరించి నప్పటికీ... యముడు తన పాశాంకుశం ఉచ్చుముడిని వదులు చేసి ఎనీఆర్ ప్రాణాలను వదిలేయాల్సి వచ్చింది ‘యమగోల’లో! ఆ తర్వాత కూడా సందర్భంలో ప్రాణాల చిట్టా పుస్తకం కనపడక కమెడియన్ హీరో అలీ తల్లి ప్రాణాలను విడిచిపుచ్చి ‘యమలీల’ చూపాల్సి వచ్చింది పాపం!! అంతెందుకు... యముడికి మొగుడైన చిరంజీవి ప్రాణాలను డ్యూయల్రోల్కి పంపుతూ ఇంకోసారి, యమదొంగ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలను స్పేర్ చేస్తూ మరోసారి వారి వారి ప్రాణాలను మాటిమాటికీ వాపస్ ఇచ్చేయాల్సొచ్చింది!!! మరో సందర్భంలో కొత్త యముడికి మొగుడు సినిమాలో తన తండ్రి చంద్రమోహన్ ప్రాణాలను అల్లరినరేశ్కు భద్రంగా అప్పజెప్పడంతో పాటు తన కూతురు యమజనూ అతడికి ఇచ్చి కన్యాదానమూ చేయాల్సి వచ్చింది. ఇలా పాపం... సదరు యముడి క్యారెక్టరు తెలుగుతెర మీద తన డ్యూటీ తాను చేయకుండా అనేక మార్లు మనుషుల ప్రాణాలు కాపాడుతూ ఉండిపోవాల్సి వచ్చింది. పదే పదే వెండితెర మీద తారల ప్రాణాలే కాపాడి కాపాడి బోరుకొట్టిందేమో. ‘ఇలా ఎంతసేపని మాటిమాటికీ సెలబ్రిటీలనే కాపాడతాం. కాస్త మనం అలా బెంగళూరు సిటీలో సామాన్యుల ప్రాణాలను రక్షిద్దాం’’ అనిపించిందా యముడి పాత్రకు. అందుకే యమరాజు భూమికను మళ్లీ ధరించి, రోడ్డు మీదికి వచ్చి మోటారుసైకిళ్లను నడిపేవారిని హెచ్చరిస్తోందా పాత్ర. ‘‘హెల్మెట్ లేకుండా బండి నడిపితే... త్వరలోనే నువ్వు నాకు హెల్ మేట్ అవుతావం’’టూ హెచ్చరిస్తోందా యమపాత్రధారి. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ హెచ్చరికలు చేస్త ట్రాఫిక్ నిబంధలపై అవగాహన కల్పిస్తోందా పాత్ర. ఆ యముడి భూమిక దేశవ్యాప్తంగా పలువురిని ఆకర్షించింది (పై ఫొటో చూడండి). దీన్ని బట్టి మళ్లీ మరోసారి నిరూపితమవుతున్న అంశం ఏమిటంటే... ప్రాణాలు తీసే డ్యూటీ తనకు వేయబట్టిగానీ... లేదంటే... అటు తెర మీద... ఇటు రోడ్ల మీద మనుషుల ప్రాణాలను రక్షించడం అంటే ఆయనకు యమా ఇష్టం. సారీ... ‘యమ’ ‘యమ’ ఇష్టం!!! – యాసీన్ -
పందుల నుంచి పెనుప్రమాదం
వాషింగ్టన్ : పందుల నుంచి సరికొత్త వైరస్ మానవాళికి సోకే పెనుప్రమాదం పొంచి ఉంది. పొర్సిన్ డెల్టాకొరోనా అనే భయంకర వైరస్ కారణంగా పందులకు విరేచనాలు, వాంతులు ఎక్కువగా అయి మరణిస్తాయి. సార్స్ వ్యాధి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉన్న పొర్సిన్ వైరస్ మనషులకు సోకే అవకాశం ఉన్నట్లు జర్నల్ ఆఫ్ ప్రొసీడింగ్స్లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. పొర్సిన్ వైరస్ను తొలిసారిగా 2012లో చైనాలో కనుగొన్నారు. 2014లో అమెరికాలో కూడా ఈ వ్యాధి కనిపించడంతో భయాందోళనలు మొదలయ్యాయి. తాజాగా పరిశోధకుల అధ్యాయనంలో పొర్సిన్ వ్యాధి కోళ్లు, పిల్లులు, మనుషుల కూడా సోకుతుందని, ఈ వ్యాధి బారిన పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సివస్తుందని తేలింది. -
జీవితం.. టెక్మయం
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో టెక్నాలజీ లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేం. ప్రపంచంలో ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటున్న టెక్నాలజీ.. మానవ జీవితాన్ని ఓ వైపు అత్యంత శోభాయమానంగా, సుఖవంతంగా తీర్చిదిద్దుతూనే మరో వైపు దుర్భర సమస్యల సుడిగుండలోకి నెడుతోంది. దీన్ని సమన్వయం చేసుకుని నైతికత పాటిస్తే.. వ్యక్తి, సమాజం, దేశం అభివృద్ధికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్ : రోజురోజుకూ వాయువేగంతో అభివృద్ధి చెందున్న టెక్నాలజీ వాడకంలో విచక్షణ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సమస్యలను మరింత సౌకర్యవంతంగా వేగంగా పరిష్కరించుకునే వీలుంటుందని చెబుతున్నారు. విద్యావిధానంలోనూ ఆధునిక టెక్నాలజీ.. టెక్నాలజీ విద్యావిధానంలోనూ పెను మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు నల్లబోర్డుపై తెల్లటి రాతలు. బట్టీ పట్టే విద్య. నేడు తెల్ల బోర్డుపై డిజిటల్ విద్య. ఆన్లైన్, ఆఫ్లైన్లో డిజిటల్ తరగతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. బట్టీకి స్వస్తి పలుకుతూ ప్రాక్టికల్గా విద్యనభ్యసించేలా అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ అవసరాన్ని గుర్తిస్తూ ప్రభుత్వాలు సైతం విద్యావిధానంలో విప్లవాత్మక సాంకేతిక మార్పులు తీసుకొస్తూ నూతన విద్యావిధానానికి శ్రీకారం చుడుతోంది. సెల్ఫోన్లు వినియోగంతో.. డెస్క్టాప్(కంప్యూటర్), ల్యాప్టాప్లానే మనం నిత్యం ఇతరులతో సంభాషించడానికి వినియోగించే సెల్ఫోన్లూ(స్మార్ట్ఫోన్) విజ్ఞాన కేంద్రాలయ్యాయి. సెల్ఫోన్లు వచ్చిన తరువాత అరచేతిలో ప్రపంచాన్ని బంధించి అంతులేని విజ్ఞానాన్ని అందిస్తోంది. ప్రస్తుత ప్రాక్టికల్ విద్యావిధానంలో ఇదొక మంచి సాధనం. విద్యాపరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త యాప్లు వస్తున్నాయి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి, పాఠ్యాంశాల్లోని అంశాలను తరవుగా నేర్చుకుని మేథస్సును పదును పెట్టడానికి దోహదపడుతున్నాయి. అయితే సక్రమ మార్గంలో వినియోగించుకోకుంటే సమయాన్ని తినేసే కిల్లర్గా సెల్ఫోన్ మారిపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సరైన పద్ధతిలో వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సృష్టించడమే కాకుండా విద్యాపరమైన అభివృద్ధి సాధించొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. విపరీత పరిణామాలు అతిగా సాంకేతికతపై ఆధారపడడం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానిసిక రుగ్మతలు, శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. సాంకేతికతకు బానిస అవ్వడం, అనారోగ్యకరమైన, అసాంఘిక సైట్లను వీక్షించే దురలవాట్లకు లోనై సమయాన్ని వృథా చేసుకోవడం జరుగుతుంది. తగిన విచక్షణ, విజ్ఞతతో వ్యవహరించి, అవసరం మేరకు కావాల్సిన విజ్ఞానాన్ని సమకూర్చుకోవడం వరకే సాంకేతికతను వినియోగించుకోవాలి. ప్రస్తుతం పిల్లలు సెల్ఫోన్లు, కంప్యూటర్లతో అధిక సమయం వెచ్చిస్తున్నారు. చెడుదోవ పట్టకుండా సక్రమ మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండడం ఉత్తమం. – ఓంప్రకాష్ కోటపాటి, స్టేట్ రిసోర్స్ పర్సన్, విద్యారంగ విశ్లేషకులు తల్లిదండ్రులు గుర్తించాలి.. తమ పిల్లాడు కంప్యూటర్లో గేమ్లు, సెల్ఫోన్ను పొద్దస్తమానం ఆపరేట్ చేస్తుంటాడని ఆవేదనతో చెబుతున్న తల్లిదండ్రులు కొందరైతే.. ‘మా పిల్లాడు చాలా గ్రేటండి... కంప్యూటర్, సెల్ఫోన్లో తెలియని అంశాలే లేవు’ అని గర్వంగా చెప్పే తల్లిదండ్రులు మరి కొందరు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తదనం పిల్లలకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. సృజనాత్మకత కలిగిన విద్యార్థులు కొత్తదనం శోధించాలనే తపనతో నిరంతరం కుస్తీ పడుతుంటారు. అవధులు దాటనంత వరకు ఇది మంచి విషయమే. విచ్చలవిడి అయితేనే ప్రమాదం. తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని చెబుతున్నారు. -
త్వరలోనే ఏలియన్స్ను కలుస్తామట.!
న్యూయార్క్: గ్రహాంతరవాసులు ఉన్నారనే వాదనను మరింత బలపర్చేలా మరో శాస్త్రవేత్త కీలక ప్రకటన చేశారు. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మిచియో కాకు.. త్వరలోనే మనం ఏలియన్స్ను కలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అది కూడా ఈ శతాబ్దంలోనే జరగొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే ఏలియన్స్తో మన ముఖాముఖి ఎలా ఉంటుందన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. వాళ్లు మనతో స్నేహంగా మాత్రం ఉండబోరని కాకు అంచనా వేశారు. త్వరలోనే ఏలియన్స్ సంభాషణను రేడియో టెక్నాలజీ సాయంతో వినగలుగుతామని, అయితే వాళ్ల మాటలు విన్నంత మాత్రాన వాటిని అర్థం చేసుకోలేమన్నారు. వాళ్లతో మాట్లాడటం చాలా కష్టమని, ఎందుకంటే వాళ్లు కొన్ని పదుల కాంతి సంవత్సరాల దూరంలో ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వాళ్ల టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ముందు వాళ్ల భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని కాకు సూచించారు. ఏలియన్స్ వస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, వాళ్లు మనల్ని అడవి జంతువుల్లాగా చూసే ప్రమాదం ఉందని ఈ సైద్ధాంతికి భౌతిక శాస్త్రవేత్త ఆందోళన వ్యక్తంచేశారు. -
తేనీటి విందుకు పిలవండి
మెయిజీ చక్రవర్తి జపాన్ను పరిపాలిస్తున్నప్పుడు (1868–1912) నాన్–ఇన్ అనే జెన్ సాధకుడు ఉండేవాడు. బౌద్ధంలోని ఒక తత్వం జెన్. ఆ తత్వం గురించి తెలుసుకోడానికి ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు ముందుగా అనుమతి తీసుకుని నాన్–ఇన్ని కలిశాడు. అయితే నాన్–ఇన్ ఏం చెప్పినా, దానిని ఆచార్యులవారు ఖండిస్తూ ఉన్నారు. పూర్తిగా వినకుండానే, వివరణలోకి పోనివ్వకుండానే నాన్–ఇన్ను అడ్డుకుంటూ ఉన్నాడు. నాన్–ఇన్ చిరునవ్వుతో ఆలకిస్తున్నాడు. ఆచార్యుడు చికాకు తెప్పిస్తున్నాడు.‘‘ఆచార్యా.. కాస్త తేనీరు సేవించి, తిరిగి చర్చను కొనసాగిద్దాం’’ అని, ఆచార్యుని ముందున్న కప్పులో తేనీరు ఒంపాడు నాన్–ఇన్. కప్పు నిండిపోయింది. అయినప్పటికీ ఒంపుతూనే ఉన్నాడు. తేనీరు కప్పు అంచుల నుంచి పొంగి పొర్లిపోతున్నా ఆపడం లేదు.‘‘ఇంకెక్కడ పోస్తారు మహానుభావా.. నింyì , పొర్లుతోంది చూడండి’’ అన్నాడు ఆచార్యుడు.నాన్–ఇన్ నవ్వి, ‘‘ఈ కప్పులాగే మీ బుర్ర కూడా మీరు నా దగ్గరికి వచ్చేటప్పటికే మీ అభిప్రాయాలతో పొంగిపొర్లుతోంది. ముందు దానిని ఖాళీ అవనివ్వండి. అప్పుడు నేను చెప్పేది ఎక్కుతుంది’’ అన్నారు. ఆచార్యులవారికి తత్వం బోధపడింది. ఎలాగూ తేనీటి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడే చిన్న మాట. తేనీటి విరామం మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని శాస్త్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. అన్నట్లు.. ఇవాళ ‘వరల్డ్ టీ డే’ కూడా. -
గొర్రెలు మనుషులను గుర్తుపట్టగలవట
-
గొర్రెలకు కూడా తెలివితేటలు ఉన్నాయట
సాక్షి, న్యూఢిల్లీ : తెలివితేటలులేని వారిని, మంద బుద్ధిగల వారిని మనం సాధారణంగా గొర్రెలని విమర్శిస్తుంటాం. కానీ తెలివితేటలు గొర్రెలకు కూడా ఉంటాయట అవి మనుషులను గుర్తుపట్టగలవట. ముఖ్యంగా జీవితంలో ఎప్పుడూ చూడని సెలబ్రిటీలను మరింత చక్కగా గుర్తుపట్టగలవట. అదెలాగంటే ఫొటోలను చూడడం ద్వారట. మనుషులవి, సెలబ్రిటీల ఫొటోలను చూపించడం ద్వారా కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు గొర్రెల తెలివితేటలపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని నిరూపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, సినీతారలు ఎమ్మా వాట్సన్, జేక్ గెల్లెన్హాల్, బ్రిటన్ న్యూస్ రీడర్ పిలోనా బ్రూస్ ఫొటోలను ఉపయోగించి యూనివర్శిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మరింత మెరుగ్గా జంతుసంరక్షణ చేయడం కోసం ఇలాంటి అధ్యయనాలు ఉపయోగపడడమే కాకుండా మనుషులకు వచ్చే హంటింగ్డాన్, పార్కిన్సన్స్ రోగాలతోపాటు స్కిజోఫ్రేనియా, ఆటిజమ్ లాంటి మానసిక రుగ్మలతలను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. మనుషులకు, గొర్రెలకున్న తేడాలను గుర్తుపడతాయా అన్న అంశానికి సంబంధించి 2001లోనే గొర్రెలపై పరిశోధనలు జరిగాయని, మనుషుల ఫొటోల నుంచి గొర్రెలను వేరుచేసి అవి గుర్తుపట్టడమే కాకుండా ఫొటోలో వ్యక్తమవుతున్న ఉద్విగ్న భావాలకు కూడా అవి స్పందిస్తాయని అప్పుడు పరిశోధకులు గుర్తించారన్నారు. అవి కేవలం ఫొటోలను మాత్రమే గుర్తించుకుంటాయా లేదా నిజంగా మనుషులను గుర్తిస్తాయా ? అన్న అంశాన్ని మరింత లోతుగా తెలుసుకోవడం కోసం తాజా అధ్యయనం జరిపినట్లు వారు చెప్పారు. అంతకుముందు చూపిన ఫొటోలు, ఎప్పుడు వాటికి చూపని ఫొటోలను వేలాడదీసి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఫొటోల కింద వాటికి కొద్దిగా ఆహారాన్ని ఏర్పాటు చేశారు. గొర్రెలు తెల్సిన ఫొటోలవైపే వెళ్లి అక్కడ ఏర్పాటుచేసిన గ్రాసాన్ని తిన్నాయి. ఎన్నిసార్లు పంపించినా తెలియని ఫొటోలవైపు అవి వెళ్లలేదు. మొదట నేరుగా చూపించిన ఫొటోలను రెండోసారి చూపించినప్పుడు అవి 80 శాతం టైమ్లోనే గుర్తించాయని, అదే వేర్వేరు భంగిమల్లో తీసిన ఫొటోలను చూపించినప్పుడు వాటిని గుర్తించడానికి మొదటిసారి ఎక్కువ సమయం తీసుకోగా, రెండోసారి అందులో 90 శాతం సమయాన్ని తీసుకున్నాయని పరిశోధకులు వివరించారు. మానసిక రుగ్మలతో బాధపడుతున్న వారికి చికిత్స చేయడంలో గొర్రెలపై తాము నిర్వహించిన అధ్యయనాలు ఉపయోగపడతాయని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. -
విద్యుదా"ఘాతుకం"
► పంట చేలల్లో యమపాశాలు..కరెంట్ తీగలకు బలవుతున్న రైతన్నలు ► రాష్ట్రంలో ఏటా 300 మందికిపైగా మృత్యువాత ► తెగిపడే తీగలు, విరిగిపోయే కండక్టర్లు, నాసిరకం పరికరాలు ► క్షేత్రస్థాయిలో పట్టించుకోని కరెంటు సిబ్బంది ► దిద్దుబాటు చర్యలు చేపట్టని విద్యుత్ పంపిణీ సంస్థలు ► కుటుంబ పెద్దను కోల్పోవడంతో రోడ్డున పడుతున్న కుటుంబాలు సాక్షి, హైదరాబాద్: గొల్ల రమేశ్.. 23 ఏళ్లు.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోపులారం.. తండ్రి పదేళ్ల కిందటే పాముకాటుతో చనిపోవడంతో కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్నాడు.. రెక్కలుముక్కలు చేసుకుంటూ చెల్లి, తమ్ముడ్ని చదివిస్తున్నాడు.. జూలై 25న పత్తి చేనులో మందు పిచికారీ చేసేందుకు కూలీగా వెళ్లాడు.. చేనులో విద్యుత్ స్తంభం విరిగిపడటంతో తీగలు నేలకు అత్యంత సమీపంలో ఉన్నాయి.. అది గమనించని రమేశ్ అటుగా వెళ్లి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మరణించాడు! విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైంది!! ...ఇలా రమేశ్ ఒక్కడే కాదు.. ఏటా వందల మంది అన్నదాతలు చనిపోతున్నారు. పొలాల్లో తెగిపడుతున్న విద్యుత్ తీగలు యమపాశాలై రైతన్నలను కాటేస్తున్నాయి. స్తంభాలపై నాణ్యత లేని విద్యుత్ నిరోధకాలు(కండక్టర్లు) ఉన్నట్లుండి విరిగిపోతుండటం.. తక్కువ ఎత్తులో లోటెన్షన్ లైన్లు వేలాడుతుండటం.. రక్షణ ప్రమాణాలను పాటించకపోవడం.. విద్యుత్ కనెక్షన్ కోసం నాసిరకం పరికరాలను వినియోగించడం.. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో దిక్కులేక రైతులే ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ఎక్కి మరమ్మతు పనులు జరుపుతుండటం.. ఇలా అనేక కారణాలతో రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏటేటా 300 మందికి పైగా రైతులు కరెంట్ షాక్కు గురై మృత్యువాత పడుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఎన్నాళ్లీ మృత్యుగోస? డిస్కంల క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది.. ‘వ్యవసాయానికి ఉచితంగానే విద్యుత్ ఇస్తున్నాం కదా..’అన్న చులకన భావంతో వ్యవహరిస్తున్నారు. ఏటా వర్షాకాలానికి ముందే వ్యవసాయ విద్యుత్ సరఫరాలో లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో పంట పొలాల్లో విద్యుదాఘాతాలతో రైతన్నలు బలికావడం నిత్యకృత్యంగా మారింది. వ్యవసాయ విద్యుత్ సరఫరాను ప్రభుత్వం 7 గంటల నుంచి 9 గంటలకు పెంచింది. అది కూడా పగటి పూటే అందిస్తోంది. వచ్చే రబీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రాత్రి వేళల్లో వ్యవసాయ విద్యుత్ సరఫరా ఉండటంతో కారుచీకట్లో పంటలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ ప్రమాదాలకు గురై రైతులు మృతి చెందేవారు. ఏడాదిగా పగటిపూటే కరెంట్ సరఫరా జరుగుతున్నా.. ప్రమాదాలు ఆగడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని నాలుగు జిల్లాల పరిధిలో గడిచిన ఐదేళ్లలో 650 మందికి పైగా రైతులు విద్యుదాఘాతాలకు బలయ్యారు. ప్రభుత్వం గుర్తించని మరణాలు కలిపితే ఈ సంఖ్య వెయ్యికి మించి ఉంటుంది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) పరిధిలోని 5 జిల్లాల్లో ఐదేళ్ల కాలంలో వెయ్యి మంది రైతులు కరెంట్ షాక్తో మరణించినట్టు రైతు సంఘాలు చెబుతున్నాయి. మరమ్మతులు చేసేవారేరీ? గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించడం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది విద్యుత్ స్తంభాలు ఎక్కి మరమ్మతు పనులు చేయడం దాదాపు మానేశారు. గ్రామాల్లో మరమ్మతు పనుల కోసం లైన్మెన్లు అనధికారికంగా ఓ ప్రైవేటు సహాయకుడిని నియమించుకుని బాధ్యతలను అతడికి అప్పగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ నిర్లక్ష్యం వల్ల ప్రమాదాల తీవ్రత పెరిగిపోతోంది. విద్యుత్ సిబ్బంది ముఖం చాటేయడంతో రైతులు, గ్రామస్తులు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కి మరమ్మతు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో షాక్కు గురై ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలపై శవాలై వేలాడుతున్నారు. మరణాలకు కారణాలివీ.. సబ్స్టేషన్ల నుంచి ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా చేసే లైన్లలో ఫేజ్తోపాటు న్యూట్రియల్ లైన్ తప్పనిసరిగా ఉండాలి. ఈ మేరకు ఈఆర్సీ ఆదేశాలు కూడా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు డిస్కంలు ‘న్యూట్రియల్ లైన్’లాగడం మానేశాయి. ప్రత్యామ్నాయంగా ట్రాన్స్ఫార్మర్ల వద్దే ‘ఎర్తింగ్’ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే రాష్ట్రంలో అత్యధిక విద్యుదాఘాతాలకు కారణమవుతోంది. ఎర్తింగ్ లోపాలు, నిర్వహణ సరిగా లేకపోవడంతో ‘ఊరంతటికీ షాక్’ కొడు తున్న ఘటనలు కూడా పదేపదే పునరావృతమవుతున్నాయి. పొలాలకు సమీపంలో లైన్లు లేకపోవడంతో రైతులు సొంత డబ్బులతో కట్టె స్తంభాలపై లైన్లు వేసుకుని కనెక్షన్లు తీసుకుంటున్నారు. గాలివానకు ఈ కట్టెలు విరిగి తీగలు నేలపై పడిపోతున్నాయి. రాత్రిపూట రైతులు వాటిని తొక్కడంతో కూడా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. పరిహారానికి కొర్రీలు ఎన్నో..! విద్యుత్ శాఖేతర వ్యక్తులు, కాంట్రాక్టు కార్మికులు కరెంట్ షాక్తో మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని రెండేళ్ల కింద విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) డిస్కంలను ఆదేశించింది. దక్షిణ డిస్కం పరిధిలోని ఉమ్మడి నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఐదేళ్లలో 550 మంది రైతులు మృత్యువాత పడితే కేవలం 120 కుటుంబాలకే పరిహారం అందింది. దరఖాస్తుతో పాటు పంచనామా, పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇతర త్రా పత్రాలు జత చేయాలనే నిబంధన వల్లే మృతుల కుటుంబాలు పరిహారానికి నోచుకోవడం లేదు. ఈ పత్రాలు జారీ చేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులూ సహకరించడం లేదు. -
2050 నాటికి 15 కోట్ల మందికి అకాల మరణం
న్యూఢిల్లీ: పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా ప్రకతి విలయాలు, విపత్తులు సంభవిస్తాయని విన్నాం. వీటి కారణంగా మానవ జాతి నశిస్తుందని కూడా చదివాం. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం వింటుంటూ అమితాశ్చర్యంతో కూడా ఆందోళన కలుగుతుంది. వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల భూతాపోన్నది పెరగడమే కాకుండా వరి, గోధుమ లాంటి పంటల్లో ప్రోటీన్లాంటి పౌష్టిక పదార్థాలు లుప్తమవుతాయట. పర్యవసానంగా 2050 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది ప్రజలు పౌష్టికాహారలోపానికి గురై అకాల మత్యువాత పడతారని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో 76 శాతం మంది ప్రజలు మొక్కల ద్వారా వచ్చే పంటల్లో ఉండే పౌష్టికాహారంపైనే ఆధారపడి బతుకుతున్నారు. వాటిలో పేద దేశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ప్రపంచంలో సబ్ సహారా ఆఫ్రికా దేశాలే ఎక్కువగా భూతాపోన్నతి వల్ల నష్టపోతాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు తెలియజేస్తున్నారు. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగడవ వల్ల మొక్కల్లో ఉండే పిండిపదార్థాలు నాశనమై వాటి ఉత్పత్తుల్లో ఐరన్, జింక్ లాంటి పోషక విలువలు గణనీయంగా పడిపోతాయని వారు చెబుతున్నారు. భారత్ లాంటి దేశంలో వరిలో 7.6 శాతం, గోధుమలో 7.8 శాతం, ఆలుగడ్డలో 6.4 శాతం పోషక విలువలు 2050 సంవత్సరం నాటికి తగ్గిపోతాయని పరిశోధకులు అంచనా వేశారు. వరి, గోధుమలను ఎక్కువగా ఆహారంగా తీసుకునే దక్షిణాసియా దేశాలన్నీ కూడా ఈ కారణంగా దెబ్బతింటాయి. భారత్లో ప్రజలు రోజు తీసుకునే ప్రమాణికమైన ఆహారంలో పౌష్టిక విలువలు 5.3 శాతం తగ్గిపోతుందని, ఫలితంగా 5.3 కోట్ల మంది ప్రజలు పౌష్టికాహార లోపం బారిన పడతారని హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహార లోపం కారణంగా ప్రజలో రోగనిరోధక శక్తి గణనీయంగా పడిపోవడం వల్ల అకాల మరణాలు సంభవిస్తాయి. వీటిని అరికట్టాలంటే వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదలను గణనీయంగా తగ్గించాలని, అధిక పోషక విలువలుండే ప్రత్యామ్నాయ ఆహార ంవైపు మొగ్గు చూపాలని, ప్రస్తుత పంటల్లో అధిక పోషక విలువల కోసం కషి చేయాలని వారు సూచిస్తున్నారు. ‘ఎన్నిరాన్మెంటల్ రీసర్చ్ లెటర్స్’ పుస్తకంలో ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. -
రైళ్లలో ఆహారం పనికిరాదు
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రజలకు అందిస్తున్న ఆహారం మనుషులు తినడానికి పనికిరాదని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వ్యాఖ్యానించింది. పాడైపోయిన ఆహారం, రీ-సైక్లిడ్ ఫుడ్, ప్యాక్లెట్లలో ఉంచిన ఆహారం, గుర్తింపు లేని కంపెనీల వాటర్ బాటిల్స్ తదితరాలు ప్రయాణీకలకు రైల్వే అందిస్తోందని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది. ఈ రిపోర్టును శుక్రవారం పార్లమెంటులో కాగ్ సమర్పించనుంది. రైల్వే ఆహారపు పాలసీని తరచూ మారుస్తూ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. కాగ్, భారతీయ రైల్వేకు చెందిన అధికారులు సంయుక్తంగా 74 స్టేషన్లు, 80 రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. తాము నిర్వహించిన తనిఖీల్లో ఆహారం తయారుచేసే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించడం లేదని తెలిసిందని కాగ్ చెప్పింది. ఆహారం కొనుగోలు చేసిన ప్రయాణీకులు బిల్లులు కూడా ఇవ్వడం లేదని పేర్కొంది. ట్యాప్ల నుంచి నీటిని పట్టి అమ్మేస్తున్నారని రిపోర్టులో పేర్కొంది. బెవరేజెస్, చెత్త కుండీలకు మూతలు ఉండటం లేదని చెప్పింది. -
సూర్యుడు ఉన్నంతకాలం!
లండన్: మనుషులు, కీటకాలు, ఇతర జీవజాతుల ఆయుషు ఎంతో మనకు తెలిసిందే. అయితే సూర్యుడు ఉన్నంతకాలం జీవించే అరుదైన సూక్ష్మ జంతువు ఒకటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎనిమిది కాళ్లు ఉండే టార్డిగ్రేడ్ అనే జంతువు సూర్యుడు మరణించే వరకు జీవించి ఉండగలదని, ప్రపంచంలోనే నాశనం కాని జీవుల్లో ఇది ఒకటని పరిశోధకులు తెలిపారు. ఖగోళ విపత్తులను సైతం ఎదుర్కొని సుమారు పది బిలియన్ సంవత్సరాలు బతుకుతుందని బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా 30 ఏళ్ల పాటు నీరు, ఆహారం లేకుండా, 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది జీవించగలదని, అలాగే ఇతర గ్రహాలపై కూడా జీవించే అవకాశం ఉందని తెలిపారు. నీటి ఎలుగుబంటిగా పిలిచే ఈ జంతువు పరిమాణం కేవలం 0.5 మిల్లిమీటర్ మాత్రమేనని, మైక్రోస్కోప్లో దీన్ని స్పష్టంగా చూడవచ్చని వివరించారు.అతిపెద్ద ఉల్కాపాతం, సూపర్ నోవా రూపంలో జరిగే నక్షత్రాల పేలుళ్లు, గామా కిరణాల పేలుళ్లు వంటి ఖగోళంలో జరిగే ఈ మూడు ఘటనలను పరిశోధకులు అధ్యయనం చేశారు. భూమిపై మానవుడు నిష్క్రమించిన అనంతరం కూడా అనేక జంతుజాతులు జీవిస్తాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పోస్ట్ డాక్టరోల్ రీసెర్చ్ అసోసియేట్ రాఫెల్ ఆల్వ్ బటిస్టా వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
మానవుడి వల్లే ఎడారిగా సహారా!
సియోల్: ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన సహారా ప్రాంతం.. ఎడారిగా మారడానికి కారణం మానవుడి చర్యలేనని పరిశోధకులు తెలిపారు. సహారా ఎడారిగా రూపాంత రం చెందడానికి కారణాలను తెలుసు కునేం దుకు గతంలో అనేక పరిశోధనలు జరిగాయి. భూమి కక్ష్యలో మార్పు వల్ల సహారా ఎడారిగా మారి ఉండవచ్చని గతంలో అనేక అధ్యయనాల్లో పేర్కొన్నారు. కానీ అవన్నీ అవాస్తవాలు అని దక్షిణ కొరియాలోని సియోల్ యూనివర్సి టీకి చెందిన పురాతత్వవేత్త డేవిడ్ రైట్ పేర్కొన్నారు. దాదాపు 8 వేల సంవత్స రాల క్రితం నవీన శిలా యుగం సమయంలో ఆదిమ మానవుడు తీసుకొచ్చిన వ్యవసాయ ఆవిష్కరణలు అక్కడి వాతావరణంపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. అక్కడి భూభాగంపై ఉన్న గడ్డి జాతులను పశుగణాల ఆహారం కోసం, తన ఆహారం కోసం అప్పటి ఆదిమ మానవుడు వినియోగించుకున్నా డని తెలిపారు. తద్వారా అక్కడ పచ్చదనం తగ్గిపోయి, వాతావరణం వేడిగా మారి, రుతుపవనాలు లేకపోవడంతో వర్షపాతం తగ్గిపోయిందని తెలిపారు. రుతుపవనాలు బలహీనపడటంతో క్రమక్రమంగా సహారాలో పచ్చదనం అంతరించి, ఎడారిగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. -
ఊహించిన దానికన్నా 10వేల ఏళ్ల ముందుగానే!
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని అడిలైడ్కు 550 కిలోమీటర్ల ఉత్తరదిశలోని ఫ్లిండర్స్ పర్వతాల్లో ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో.. అక్కడ ఇంతకుముందు ఊహించినదానికన్నా 10 వేల సంవత్సరాల ముందే మానవుల ఉనికి ఉందని గుర్తించారు. ఆదిమ మానవులకు సంబంధించిన వందలాది రాళ్లతో తయారుచేసిన కళాఖండాలు, ఎముకలకు సంబంధించిన ఆనవాళ్లు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంతకుముందు ఆస్ట్రేలియా తూర్పుతీరంలోని న్యూ సౌత్వేల్స్కు 50,000 సంవత్సరాల క్రితం మానవులు చేరుకున్నారని, వారు అక్కడనుంచి మధ్య ఆస్ట్రేలియా ప్రాంతానికి చేరుకోవడానికి 11,000 సంవత్సరాలు పట్టిందని పరిశోధకులు భావించేవారు. అయితే.. తాజాగా దొరికిన పురాతన అవశేషాలు.. మధ్య ఆస్ట్రేలియాలో ముందుగానే మానవుడి ఉనికిని తెలుపుతున్నాయని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. -
మనుషులు నాలుగు రకాలు!
లండన్: ప్రవర్తన ఆధారంగా మనుషులు నాలుగు రకాలని ఓ తాజా పరిశోధనలో వెల్లడైంది. వివిధ రకాల వ్యక్తులను విడిగా, గ్రూపులుగా అధ్యయనం చేసిన చార్లెస్ 3 యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్ (స్పెయిన్) శాస్త్రవేత్తలు మనుషులు ఆశావాదులు, నిరాశావాదులు, నమ్మకం గల వారు, అసూయపరులని నాలుగు వర్గాలుగా విభజించారు. 90 శాతం ప్రజలను నాలుగు వర్గాలుగా విభజించిన పరిశోధకులు వీరిలో అసూయపరులు ఎక్కువ అని తేల్చారు. 30 శాతం ప్రజలు అసూయ వర్గానికి చెందిన వారని, వీరు ఏం చేస్తున్నామన్నది పట్టించుకోరని, ఆశావాదులు (20 శాతం) తమ భాగస్వామి ఇద్దరికీ మంచి చేస్తారని నమ్ముతారని, నిరాశావాదులు (20 శాతం) తమకు కనబడింది ఎంచుకుంటారని, నమ్మకం వర్గానికి చెందినవారు ఫలితం గురించి పట్టించుకోకుండా సహాయం చేయడానికి వెనుకాడరని చెబుతున్నారు. మరో 10 శాతం ప్రజలను వర్గీకరించలేకపోయామని వెల్లడించారు. -
మొదటి అడుగు
కథ ‘‘ఈ ప్రపంచంలోని మనుషుల్లో నూటికి తొంభై మంది స్వార్థ్ధపరులే. అసలు మనుషులే కనిపించని ప్రపంచానికి వెళ్లిపోదామనిపిస్తోంది’’ అవంతిక తరచుగా అనే మాటలివి. ‘‘మనుషులు కనపడని ప్రపంచం అంటూ ఉంటుందా?’’ అని నవ్వేవాడిని నేను ఆమె మాటలకి. కానీ ఇప్పుడు చూస్తున్నాను. రోజుల తరబడి వెదికినా ఒక్క మనిషి కూడా కనబడని ప్రపంచాన్ని కళ్ల ఎదుట చూస్తున్నాను. మేము ప్రయాణం చేస్తున్న అంతరిక్ష నౌక భూమిని దాటి దాదాపు రెండు వందల ఎనభై మిలియన్ కిలోమీటర్లకి పైగా అంతరిక్షంలో ప్రయాణం చేసి వచ్చి అప్పుడే అంగారక గ్రహాన్ని చేరుకుంది. ఏ దేశమూ ఊహించని విధంగా మొట్టమొదటిసారిగా అంగారక గ్రహమ్మీదకి భారతదేశం తన వ్యోమగాములని పంపించింది. అంతరిక్ష పరిశోధనలో ఎంతో ముందుండే అమెరికా సైతం అప్పటిదాకా అంగారక గ్రహమ్మీదకి పరిశోధనా శాటిలైట్లని మాత్రమే పంపగలిగింది కానీ వ్యోమగాములని పంపి అంగారక గ్రహమ్మీద మనిషి చేత మొదటి అడుగు వేయించలేకపోయింది. అలాంటిది భారతదేశం మొట్టమొదటిసారిగా అంగారక గ్రహమ్మీదకి మనుషులని పంపడంతో ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇటే ఉంది. మానవజాతి మనుగడనే మలుపు తిప్పగల పరిశోధన ఇది అని అందరికీ తెలుసు. మా నలుగురిలోకీ ఎక్కువ ఉద్వేగంగా కనిపిస్తున్నది ప్రణీత్. ఎందుకంటే, మరికొద్దిక్షణాల్లో మా అంతరిక్ష నౌక అంగారక గ్రహమ్మీదకి అడుగుపెట్టగానే, ఆ గ్రహమ్మీద మొట్టమొదటిసారిగా కాలు మోపబోయేది అతడే! మానవజాతి చరిత్రలోనే తన పేరు సుస్థిరంగా నిలిచిపోయే సంఘటన కొద్ది క్షణాల్లో జరగబోతోందని తెలిసిన ఏ మనిషికైనా అలాంటి ఉద్వేగం కలుగడం సహజమే. మిగిలిన ఇద్దరినీ వదిలేసి నేను ప్రత్యేకంగా ప్రణీత్ హావభావాలని గమనించడానికి కారణం ఉంది. అదేమిటంటే, కొన్ని పరిస్థితుల వల్ల, ఈ ప్రయోగంలో అతడు కెప్టెన్ స్థానంలో ఉన్నాడు కానీ, నిజానికి ఆ స్థానంలో ఉండాల్సిన వ్యక్తిని నేను! వయసులోనూ, హోదాలోనూ నాకంటే చిన్నవాడైన అతడు చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల అతడు ఆ అవకాశాన్ని దక్కించుకోగలిగాడు కానీ, నిజానికి ఆ స్థానానికి అన్ని విధాలుగా అర్హుడినైన వ్యక్తిని నేను. పై అధికారుల ముందు ధైర్యం చేసి నా బాధని వెళ్లగక్కినా, ఎన్నో విషయాలని పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా రూపొందించిన ఎంపిక ప్రక్రియ ఇది. అయినా ఇందులో నువ్వు బాధపడే విషయం ఏముంది? ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో నువ్వు కూడా ఉన్నావు కదా? మీ నౌక అంగారక గ్రహం మీద దాదాపు ఆరు గంటలు ఉంటుంది. అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటే, మీరు కూడా ఆ గ్రహమ్మీద కాలు పెడతారు. ఒకరు ముందూ ఒకరు వెనుకా అంతే అన్న సమాధానమే వచ్చింది. ఒకరు ముందూ, ఒకరు వెనుకా అని ఎంత తేలికగా అనగలిగారు?! రోవర్ను ఈ గ్రహమ్మీదకి పంపి ఇక్కడి వాతావరణాన్ని పరిశీలించడం దగ్గర నుంచీ ఈరోజు వరకూ అంగారక గ్రహమ్మీద పరిశోధనలో కీలక పాత్ర వహిస్తూ మొదటినుంచీ ఈ ప్రయోగం మీద ఎంతో శ్రద్ధతో, ప్రేమతో పని చేసిన నాకు దక్కాల్సిన అపురూపమైన అవకాశాన్ని మరొకరు దక్కించుకుంటే, ఆ బాధ ఎలాంటిదో అనుభవించే నాకు తెలుస్తుంది కానీ వాళ్లకేం అర్థమౌతుంది? నీల్ ఆర్మ్ స్ట్రాంగ్తోపాటు ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ కూడా అపోలో-11 నౌకలో ప్రయాణించారు. కానీ చంద్రుడిపై అడుగిడిన తొలివ్యక్తిగా నీల్ ఆర్మ్ స్ట్రాంగే ప్రపంచానికి గుర్తుంటాడు కానీ మిగిలినవాళ్ల పేర్లు ఎవరికి తెలుసు? కొలంబియా అంతరిక్ష నౌకలో కల్పనా చావ్లాతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములు కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల పేర్లు ఎంతమందికి తెలుసు? నేను ఆలోచనల్లో ఉండగానే మా అంతరిక్ష నౌక అంగారక గ్రహమ్మీద ల్యాండ్ అవడం, బయటి వాతావరణం వ్యోమగామి దిగడానికి అనువుగా ఉందన్న సంకేతాన్ని నౌకలో ఉన్న సూపర్ కంప్యూటర్లు నిర్ధారణ చేయడం జరిగిపోయాయి.తను వేసుకున్న స్పేస్ సూట్ని మరోసారి సవరించుకుని, ఆక్సిజన్ సిలిండర్ని సరి చూసుకుని, మావైపు విజయ సూచకంగా బొటన వేలు ఎత్తి చూపించాడు ప్రణీత్. నేను అప్రయత్నంగా అతడి కళ్లలోకి చూసాను. సరిగ్గా అదే సమయానికి ప్రణీత్ కూడా నావైపు చూసాడు. బయటి వాతావరణం ముఖానికి తాకకుండా రక్షణ కవచంలా వున్న స్పేస్ సూట్లోని హెల్మెట్ వంటి అమరిక తాలూకు దళసరి అద్దాల వెనుకనుంచి నుంచి కూడా అతడి కళ్లల్లోని భావం స్పష్టంగా కనిపించింది నాకు. ఆ కళ్లలో స్నేహ భావం కానీ, కృతజ్ఞత కానీ లేదు. విజయం సాధించే ముందు యుద్ధంలో ప్రత్యర్ధి వైపు చూసే చూపులా కసిగా, గర్వంగా ఉంది. ఒక్క క్షణం నా మనస్సు కలుక్కుమంది. ఎవరికి తెలియకపోయినా, ఈ ప్రయోగంలో కెప్టెన్ స్థానాన్ని దక్కించుకోవడానికి మా ఇద్దరి మధ్య ఉన్న పోటీ మాకు తెలుసు! ఆ క్షణంలో అతడి చూపులని తట్టుకోలేక గిలగిలలాడిపోయాను. మన మౌనాన్ని అవతలివారు చేతకానితనం అనుకుంటే అంతకన్నా పరాజయం మరొకటుండదు. భరింపశక్యం కానటువంటి ఒకానొక భావోద్వేగంలో అనాలోచితంగానే చేసేశాను ఆ పనిని. అంతరిక్ష నౌకలో నాకున్న అనుభవాన్నంతా ఉపయోగించి మెరుపు వేగంతో మేము ఉన్న ప్రదేశానికి వెనుక వైపుకు కదిలాను. మొదటి నుంచీ ఈ ప్రయోగంలో మమేకమైపోయి పనిచేయడం వల్ల ఆ నౌకలో ఉన్న అంగుళం అంగుళం, అందులోని సాంకేతిక విషయాలతో సహా నాకు పరిచయమే. ఎక్కడ ఏ మీట నొక్కితే ఏం జరుగుతుందో, దాన్ని ఎలా సరిచేయవచ్చో అన్న విషయాల మీద నాకున్న అవగాహన మా నలుగురిలో మరెవ్వరికీ లేదు. క్షణాల్లోనే నౌకా స్వరూపమంతా కంప్యూటర్ గ్రాఫిక్స్తో సహా నా మెదడులో కదలాడింది. క్షణంలో వెయ్యో వంతు కాలంలో నేను చెయ్యదలుచుకున్న పనికి మెదడులో ఒక క్రమరూపం ఏర్పడిపోయింది. నా చేతులు వేగంగా కదిలి అక్కడి మీటలని నొక్కాయి. నేను చేసిన ఆ పని వల్ల ఎవ్వరూ ఊహించని విధంగా నాకోసం అంతరిక్ష నౌక వెనుక భాగంలో సన్నని ద్వారం తెరుచుకుంది ! ముందు భాగంలో అంగారక గ్రహమ్మీద అడుగుపెట్టడానికి ప్రణీత్ ఇంకా కౌంట్ డౌన్ చేస్తుండగానే వెనుకవైపు తెరుచుకున్న ద్వారం గుండా నేను బయటకి దూకేసాను. నేను దూకిన మరుక్షణంలోనే తెరుచుకున్న ఆ సన్నని ద్వారం మరలా యధావిధిగా మూసుకుపోయింది. మేము తిరిగి వెళ్లాక ఈ విషయం ఒక చర్చనీయాంశం అవుతుందని నాకు తెలుసు. వెనుక వైపు ద్వారం సాంకేతిక లోపం వల్ల తెరుచుకుందనీ, దానిని మూసే ప్రయత్నంలో నేను అనుకోకుండా బయటికి అడుగు పెట్టాల్సి వచ్చిందని చెప్పచ్చు. నేను చేసిన ఆ పని వల్ల ఆ క్షణంలో నా శరీరంతో పాటు మనసు కూడా గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది. అంగారక గ్రహమ్మీద కాలుపెట్టబోతున్న మొట్టమొదటి మానవుడ్ని నే...నే!! సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు దూకడం వల్ల ఒక్కసారిగా నా కాలు నేల (ఈ ప్రయోగం సరైనది కాదేమో, అంగారగ గ్రహ ఉపరితలం అనాలనుకుంటా) మీద ఆనలేదు. కాలు ఒక్కసారి గ్రహ ఉపరితలాన్ని తాకడం వల్ల, నేను రెండు మూడు పల్టీలు కొట్టినట్టుగా గాల్లోకి ఎగిరాను. భూమికీ అంగారక గ్రహానికీ ఉన్న అతి ముఖ్యమైన తేడాల్లో గ్రావిటీ ఒకటి. భూమి మీద ఉండే గ్రావిటీలో సగానికన్నా తక్కువ అంగారక గ్రహమ్మీద ఉంటుంది. భూమి మీద వంద కేజీల బరువుండే మనిషి అంగారక గ్రహమ్మీద కేవలం ముప్ఫై ఎనిమిది కేజీలు మాత్రమే ఉంటాడు. భూమి మీద అడుగు వేసేంత ఒత్తిడితో అంగారకుడి మీద అడుగు వెయ్యాల్సిన అవసరం ఉండదు. బహుశా నేను పల్టీలు కొట్టడానికి అదే కారణం అయి ఉంటుందనుకుంటూ, నా శరీరం అంగారకుడి మీద దొర్లుతుంటే, ఆ స్పర్శని ఆస్వాదిస్తున్నట్టుగా ఉండిపోయాను కొద్దిసేపు. భూమికీ అంగారక గ్రహానికీ ఉష్ణోగ్రతలోనూ, వాతావరణ ఒత్తిడిలోనూ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. నేను వేసుకున్న స్పేస్ సూట్, దానిలో అమర్చి ఉన్న ఆక్సిజన్ మాస్కు నాకు ఆ తేడాని పెద్దగా తెలియనివ్వడం లేదు. నా శరీరం ఆగకుండా మరిన్ని పల్టీలు కొడుతుంటే, నేను ఆ గ్రహమ్మీద నిలదొక్కుకోలేకపోవడానికి కారణం గ్రావిటీలో ఉన్న తేడా కాదేమోనని, బహుశా నేను దిగిన వెనక వైపు భాగంలో ఏదో చిన్నపాటి లోయ వంటిది ఉందేమో, నేను ఆ లోయలో పడిపోతున్నానేమోనన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం రాగానే నా గుండె దడదడలాడింది. భయంగా చుట్టూ ఉన్న పరిసరాలని గమనించాను. మొదలేదో చివరేదో తెలియనట్టుగా ఎటు చూసినా నారింజ రంగుతో మెరిసిపోతున్న పరిసరాలు... అప్పటి వరకూ కొన్ని వందలసార్లు సాటిలైటు తీసిన ఛాయాచిత్రాలలో చూసిన వాటిని ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తున్నాను. మనసులో ఆ అనుమానమే లేకపోతే దానినంతా ఎంతో బాగా ఆస్వాదించేవాడిని. పల్టీలు కొట్టిన తరువాత చాలాసేపటికి నేను తిన్నగా నిలబడగలిగాను. శరీరం నా స్వాధీనంలోకి వచ్చిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని మా అంతరిక్ష నౌక ఎక్కడ ఉందా అని వెతకడం! కనుచూపు మేరలో ఎక్కడా మా నౌక వున్న జాడలు కనిపించలేదు. నేను ఊహించినది నిజమే. నేను ఏదో లోయలోకి జారి చాలా దూరం వచ్చేసాను. నా గుండెలు దడదడలాడాయి. హెల్ప్... అని గట్టిగా అరవాలనిపించింది. నేను అరిచినా అక్కడ ఎవరికీ వినిపించదని తెలుసు. అసలు నేను వేసుకున్న స్పేస్ సూట్లోంచి ఆ శబ్దం బయటికే రాదు. పరిశోధన చేస్తున్న సమయంలో అంగారక గ్రహమ్మీద కాలు పెట్టగానే ఏవేవో చెయ్యాలనుకున్నాను. అక్కడి శిలాజాలని సేకరించాలనీ, వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలనీ, అంగారకుడి మీద గడిపిన కొద్ది సమయంలో ఒక థీసిస్కి సరిపడినంత పరిజ్ఞానాన్ని బుర్రలో నింపుకోవాలనీ, ప్రపంచానికి అంగారకుడ్ని కొత్తగా పరిచయం చెయ్యాలనీ ఎన్నెన్నో అనుకున్నాను. కానీ ప్రస్తుతం నా మనసులో భయం తప్ప మరో ఆలోచన రావడం లేదు. వచ్చిన దిక్కుకే వేగంగా వెనక్కి పరిగెత్తాలనుకున్నాను. ఉద్రిక్తతతో గట్టిగట్టిగా అడుగులు వేస్తే గ్రావిటీ తేడా వల్ల మళ్లీ శరీరం గాలిలోకి ఎగరవచ్చేమోనన్న అనుమానం వచ్చి నెమ్మదిగానే అడుగులు వేస్తూ వెనుదిరిగాను. వెనుదిరిగాక అప్పుడు మెదిలింది అసలైన ప్రశ్న నా మెదడులో... ఇప్పుడు నేను ఎటు వైపుకు వెళ్లాలి?! గాల్లో పల్టీలు కొడుతూ రావడం వల్ల అసలు నేను ఎటు వైపు నుంచి వచ్చానో అన్న విషయం కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఏ వైపుకు వెళ్లి మా అంతరిక్ష నౌకని వెదకాలి?! నా స్థానంలో ప్రణీత్ని మా పరిశోధనకి కెప్టెన్గా నియమిస్తున్నామన్న ప్రకటన విన్నప్పుడు కూడా రాని ఏడుపు అప్పుడు నాకు తన్నుకుని వచ్చింది. నన్ను నేను సంభాళించుకున్నాను. గాలిలో పల్టీలు కొట్టినా గ్రావిటీ తక్కువగా ఉన్న ఆ గ్రహమ్మీద నేను మా నౌకకి ఎక్కువ దూరం వచ్చి ఉండనని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. కళ్లు మూసుకుని ముందుగా ఏదో ఒక వైపు ప్రయాణం సాగించాలి. ఆ వైపు కొద్ది దూరం వెళ్లాక నౌక కనిపించకపోతే మళ్లీ వెనక్కి వచ్చి మరో దిక్కుకి ప్రయాణం సాగించాలి. అటు కూడా అలాగే చెయ్యాలి. ఏదో ఒక వైపుకే గుడ్డిగా నడుచుకుంటూ వెళ్లడం కన్నా, ఇలా అన్ని వైపులకీ కొద్ది కొద్ది దూరం వెళ్లి ప్రయత్నించడం వల్ల మా వాళ్లని వెదికి పట్టుకోవడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అనుకుని మనసులోనే లెక్కలు వేసుకుని నడక ప్రారంభించాను. నేను దొర్లుతూ వచ్చిన సమయాన్ని లెక్కకట్టి, ఆ వేగాన్ని అంచనా వేసి ఒక్కో దిక్కుకీ ఎంత దూరం నడవాలో లెక్కలు కట్టుకుని ఒక్కో దిక్కులో దిక్కులేనివాడిలా ఇనుప ఖనిజాలతో ఎర్రబారిన అంగారక గ్రహం ఉపరితలమ్మీద నడక సాగించాను. ఎంత దూరం నడిచినా మా నౌక జాడ తెలియడం లేదు. సమయం గడుస్తున్న కొద్దీ నా ప్రాణాలర్పించైనా మావాళ్లని చూడాలన్న తహతహ మొదలైంది నాలో. మా అంతరిక్ష నౌక కేవలం ఆరు గంటలపాటే అంగారక గ్రహమ్మీద గడపగలదు. ఆరుగంటల లోపు అక్కడి నుంచి బయలుదేరకపోతే అది తిరుగు ప్రయాణం చెయ్యడానికి పనికి రాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే, నేను వెళ్లినా వెళ్లకపోయినా సరిగ్గా ఆరు గంటలయ్యే సరికి వాళ్లు ముగ్గురూ తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏమిటి?! అవంతిక అన్న అసలు మనుషులే లేని ప్రపంచంలో నిజంగా గడపాల్సి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అర్ధమౌతున్న కొద్దీ నేను చేసిన పనికి నాలో పశ్చాత్తాపం కలుగసాగింది. అంగారక గ్రహం మీద రోజు యొక్క పరిమాణానికీ, భూమికీ పెద్దగా తేడా ఉండదు. దూరంగా అంగారక గ్రహమ్మీద సూర్యాస్తమయం కనిపిస్తోంది. ఆకాశంలో సూర్యుడి గమనాన్ని బట్టి మేము అక్కడ అడుగుపెట్టి ఎంత సమయం అయ్యిందో అంచనా వెయ్యగలిగాను. మా అంతరిక్ష నౌక బయలుదేరడానికి ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే సమయం ఉందన్న విషయం అర్థమైంది నాకు. అప్పటివరకూ నౌక కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. ఇంకా ఎన్ని లోయలు దాటాలో, ఎన్ని పర్వతాలని ఎక్కాలో... అదంతా ఈ కొద్ది నిమిషాల్లో సాధ్యమయ్యే పనేనా? నిస్సత్తువ ఆవరించడంతో కుప్పకూలిపోయాను. ఆ నౌక వెళ్లిపోయిందంటే, ఇంక భూమితో నా సంబంధాలు శాశ్వతంగా తెగతెంపులైపోతాయి. నేను ఈ గ్రహమ్మీద తప్పిపోయానన్న విషయం తెలిసినా నాకోసం, నన్ను వెదకడం కోసం ఇన్ని కోట్లు ఖర్చుచేసి ప్రభుత్వం మళ్లీ మరొక వ్యోమ నౌకని ఇక్కడికి ఎట్టి పరిస్థితులలోనూ పంపదు. అసలు నేను అప్పటిదాకా జీవించి ఉండగలనన్న నమ్మకం కూడా భూమ్మీద ఎవరికీ ఉండదు. సైంటిస్టుగా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఎన్నో కలలు కన్న నా జీవితం ఇలా అనామకంగా ఈ అన్య గ్రహమ్మీద అంతమౌతుందన్న విషయం నేనెన్నడూ ఊహించలేదు. నా స్థితికి సంతాపం తెలియ చేస్తున్నట్టుగా నేను కిందపడ్డ చోట ఎర్రగా పైకి లేచింది ఒక ధూళి మేఘం. నీరసంతో సోలిపోతున్న నా కళ్లకి ఆ ధూళిలోంచి మసగ్గా కనిపించింది దూరంగా ఒక చిన్న కదలిక. కళ్లు చిట్లించుకుని మళ్లీ చూసాను. అది భ్రమ కాదు... నిజమే. దూరంగా ఒక కదలిక కనిపిస్తూ క్షణాల్లోనే ఆ దృశ్యం క్రమంగా నా కళ్లకి స్పష్టమౌసాగింది. నా కళ్లు మెరిసాయి. దూరం నుంచి నావైపే నడుచుకుంటూ వస్తున్నది... స్పేస్ సూట్లో ఉన్న ప్రణీత్!! అతడ్ని గుర్తుపట్టగానే, ఏదో శక్తి నాలోంచి తన్నుకు వస్తున్నట్టుగా నన్ను లేపింది. గ్రావిటీ గురించి కూడా ఆలోచించకుండా శక్తి కొలదీ అడుగులు వేస్తూ పరుగుపెడుతూ వెళ్లి ప్రణీత్ని గాఢంగా కౌగిలించుకున్నాను! ప్రణీత్ కూడా నన్ను ఆలింగనం చేసుకుంటూ నా కళ్లలోకి కళ్లుపెట్టి చూసాడు... అతడి కళ్లలో ప్రేమ... స్నేహం!! నేను తేరుకునే లోగానే అతడు నా చేతిని పట్టుకుని నన్ను దాదాపుగా లాక్కుని వెడుతున్నట్టుగా పరిగెట్టసాగాడు. ఏమీ ఆలోచించే స్థితిలో లేని నేను ఏదో అపురూపమైన పెన్నిధిని పట్టుకున్నట్టుగా ప్రణీత్ చెయ్యి పట్టుకుని అతడు లాక్కుని వెడుతున్న వైపు కదిలిపోతున్నాను. దాదాపు పది నిమిషాలకి మేము మా అంతరిక్ష నౌక ముందు ఉన్నాము. అలాగే నన్ను లాక్కు వెడుతున్నట్టుగా నౌకలోకి ఎక్కించేసాడు ప్రణీత్. మేము ఎక్కిన వెంటనే, క్షణాల్లోనే నౌక తలుపులు మూసుకోవడం, నౌక గాలిలోకి లేవడం జరిగిపోయాయి. ‘‘అసలు ఏం జరిగింది?’’ మిగిలిన వ్యోమగాములు అన్నారు. ‘‘సాంకేతిక లోపం వల్ల వెనుక తలుపు తెరుచుకుంది. దాన్ని సరిచేసే ప్రయత్నంలో నేను బయటకి జారిపోయాను. అటువైపు లోయ ఉన్నట్టుంది’’ గొంతులోని అపరాధ భావం నాకే తెలిసిపోతోంది. ‘‘ఏది ఏమైనా ప్రణీత్ కన్నా ముందర నువ్వే అంగారక గ్రహమ్మీద అడుగు పెట్టావు. అంగారక గ్రహమ్మీద మొదటి అడుగు పెట్టిన మానవుడిగా నీ పేరు చరిత్రలో స్థిరంగా ఉండిపోతుంది’’ నవ్వుతూ అన్నారు వాళ్లు. ఒకప్పుడైతే వాళ్ల మాటలకి నాకు గర్వంగా అనిపించేది. కానీ అప్పుడు అలా అనిపించలేదు. ప్రణీత్ వైపు చూసాను. అతడు నా వైపు చూడడం లేదు. ఏదో పనిలో ఉన్నాడు. నా మనసులో ఒకే ప్రశ్న... ఎన్నడూ లేనిది అంగారక గ్రహమ్మీద నన్ను వెదుక్కుంటూ వచ్చినప్పుడు ప్రణీత్ కళ్లలో నాకు ప్రేమ, స్నేహం ఎందుకు కనపడ్డాయి?! బాగా ఆలోచిస్తే నాకొక విషయం అర్థమైంది. ఆ క్షణంలో ప్రేమ, స్నేహం అన్న భావనలు నిజానికి అతడివి కావు... నావి! అతడి చూపులు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. తేడా అల్లా నేను ఊహించుకోవడంలోనే. అంటే, అంతకుముందు శిక్షణలో నేను అతడి కళ్లలో చూసిన స్వార్ధం, అంగారక గ్రహం మీద దిగబోయే ముందు అతడి కళ్లలో చూసిన కసి, శత్రుత్వం... అవి కూడా నావేనా?! అసూయ బానిసజాతి సహజ లక్షణం. ఈ అసూయే మన జాతీయ శీలానికి దాపురించిన వినాశకారి. సర్వశక్తిమంతుడైన ఆ పరమేశ్వరుడు సైతం మనలోని ఈ అసూయ కారణంగానే, మనకేమీ చెయ్యలేకున్నాడు’ స్వామి వివేకానంద మాటలు గుర్తుకు వచ్చాయి. మరో ఎనిమిది నెలలు ప్రయాణం చేసి తిరిగి భూమ్మీదకి చేరుకుంది అంతరిక్షనౌక. ఈ ఎనిమిది నెలల కాలం నా ఆలోచనల్లో చాలా మార్పుని తీసుకువచ్చింది. అంగారక గ్రహమ్మీద మొదటి అడుగుపెట్టిన మానవుడిగా అప్పటికే ప్రపంచం మొత్త్తమ్మీద నా పేరు మార్మోగిపోతోంది. భూమి మీద విజయవంతంగా ల్యాండ్ అయిన మా అంతరిక్ష నౌకలోంచి మొదటగా ప్రణీత్ దిగాడు. తరువాత మిగిలిన ఇద్దరూ దిగారు. అందరికన్నా చివరగా నేను కిందకి దిగి భూమ్మీద కాలుపెట్టాను. అంగారక గ్రహమ్మిద పెట్టినది కాదు - మారిన మనిషిగా తిరిగి వచ్చి భూమ్మీద పెట్టినదే నేను గర్వించగలిగే నా ‘మొదటి అడుగు’ అనిపించింది నాకు. - ఆకునూరి మురళీకృష్ణ -
మన మాటలు కుక్కలకి అర్థమవుతాయట!
లండన్: మనుషులు మాటలను కుక్కలు అర్థం చేసుకుంటాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయంలో ఇటీవల ఒక అధ్యయనంలో తేలినట్లు హంగేరిలోని ఒట్వాస్ లోరాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అటిల్లా అండిక్స్ వెల్లడించారు. కుక్కలను పెంచుకునే యజమానులు తరచూ వాడే పదాలను శునకాలు గుర్తుపెట్టుకుంటాయని, మనిషి మాట్లాడే మాటల ఉచ్ఛారణ, వారి హావాభావాల ఆధారంగా కుక్కలు ఆ పదాల అర్థాలను పసిగడతాయని తమ అధ్యయనంలో స్పష్టమైనట్లు తెలిపారు. -
మానవుల్లోనూ అవయవాల పునరుత్పత్తి!
జీబ్రా ఫిష్, అక్సోలాట్, రే ఫిన్డ్!... మూడూ చేపరకాలే. ఒకటి భారత్లో, రెండోది మెక్సికోలో, మూడోది ఆఫ్రికాలో కనిపించే వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..? ఎప్పుడు అవసరమైతే అప్పుడు తమ శరీర అవయవాలను తయారు చేసుకోగలవు. తోకలను పెంచుకునే బల్లుల మాదిరి అన్నమాట. ఇదే నైపుణ్యాన్ని వినియోగించుకుని మానవులు కూడా తమ అవయవాలు తయారు చేసుకోవడం భవిష్యత్తులో సాధ్యమేనంటున్నారు ఇంగ్లండ్లోని మెయినీకి చెందిన ఎండీఐ బయోలాజికల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు. దీంతో జబ్బుల బారిన పడ్డ గుండె, కాలేయం వంటి అవయవాలను మళ్లీ పెంచుకోవచ్చు. అవయవాలను తయారు చేసుకునే లక్షణం ఉండేందుకు కొన్ని జన్యు నియంత్రణ వ్యవస్థలు కారణమని, వాటిని తాము గుర్తించామని పరిశోధకులు వివరించారు. పై మూడు రకాల చేపల్లోనూ ఒకేరకమైన నియంత్రణ వ్యవస్థ ఉండటాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. మానవుల్లో కూడా ఇలాంటి వ్యవస్థ ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు బెంజమిన్ ఎల్ కింగ్ అనే పరిశోధకుడు తెలిపారు. ఈ వ్యవస్థను గుర్తించి మందుల ద్వారా వాటిని చైతన్యం చేయడం, నియంత్రించడం సాధ్యమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో అవయవాల పునర్సృష్టి సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు ‘ప్లాస్ వన్’ సంచికలో ప్రచురితమయ్యాయి. -
చేపలు మనుషులను గుర్తుపడతాయి..
లండన్: చేపలు మనుషుల ముఖాన్ని కచ్చితత్వంతో గుర్తు పట్టగలవని తేలింది. మనుషుల ముఖాలన్నీ ప్రాథమికంగా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయనీ, అయినా ఆశ్చర్యకరంగా చేపలు వివిధ వ్యక్తుల ముఖాల మధ్య తేడాలను గుర్తించాయని అధ్యయనం జరిపిన క్వీన్స్లాండ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీల శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ మెదడులో మనుషులను గుర్తించే ప్రాంతం చిన్న జంతువుల్లో కూడా ఉంటుందో లేదో తాము పరీక్షించామన్నారు. చేపలు 44 వరకు ముఖాల మధ్య తేడాలను గుర్తించాయన్నారు. -
అక్కడ ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం!
సముద్ర గర్భంలో ఎన్నో వింతలు విశేషాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం సహాయంతో పరిశోధకులు సాగర గర్భంలోని రహస్యాలను ఛేదించడం ప్రారంభించారు. లక్షల ఏళ్ళ క్రితమే చివరి మంచు యుగం ప్రకారం సముద్ర మట్టానికి అడుగున ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్విరామంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఫ్లోరిడా ఆసిల్లా నదీ గర్భంలో జరిపిన పరిశోధనల్లో అమెరికా ప్రజల ఉనికిని తెలిపే మరిన్ని సాక్ష్యాలు ఆవిష్కరించాయి. ప్రాచీన చరితకు ఆనవాళ్ళు లభించాయి. ఆరు దశాబ్దాల ముందే ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం ఉందన్నపరిశోధకుల అనుమానాలను నిజం చేస్తూ ఫ్లోరిడా ఆసిల్లా నది ఆడుగు భాగంలో ఆధారాలు దొరికాయి. మంచుయుగానికి ముగింపు సమయంలోనే అమెరికా ప్రజల ఉనికిని తెలిపే అనేక రాతి పనిముట్లు సహా పురాతన రుజువులను.. సైంటిస్టులు కనుగొన్నారు. సుమారు పదివేల ఏళ్ళ క్రితం హిమఖండాలు కరగటం ప్రారంభించి సముద్రంలో ఆపారమైన జలరాసి కలిసిపోయింది. తీర ప్రాంతాలు సహా అనేక నాగరికతలూ సమాధి అయిపోయాయి. అయితే సముద్రగర్భంలోని చరిత్రను వెలికి తీసేందుకు ఇటీవల ఆర్కియాలజిస్టులు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అవశేషాలను బయటకు తీయడంలో ప్రత్యేక శ్రద్ధ వహింస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఫ్లోరిడాలోని ఆసిల్లా నది గర్భంలో నిర్వహించిన నిర్వహించిన పరిశోధనల్లో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. నదిలోని గోధుమరంగు ముర్కీ జాలాల్లో మానవుల ఉనికిని గుర్తించే వేటగాళ్ళు వినియోగించిన ప్రాచీన రాతియుగంనాటి పనిముట్లు, అతి పెద్ద ఏనుగును తలపించే జంతువు మాస్టోడాన్ సహా ఒంటెలు, అడవిదున్నలు, గుర్రాలు, అతి పెద్ద క్షీరదాల ఎముకలు సాక్షాత్కరించాయి. సముద్ర గర్భానికి అడుగున రాతి పనిముట్టతోపాటు, జంతువుల ఎముకలు, మాస్టోడాన్ దంతాలను కనుగొన్నామని, వీటిని బట్టి ఆగ్నేయ అమెరికాలో 14,550 సంవత్సరాలకు పూర్వమే అంటే... ఇంత క్రితం తెలుసుకున్నదానికి 1500 సంవత్సరాలకు ముందే మానవ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లోవిస్ ప్రజల విలక్షణ నాయకత్వానికి గుర్తుగా సుమారు 13000 సంత్సరాల పురాతత్వ ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు. ఫ్లోరిడా రాజధాని తల్లహశ్సీ సమీపంలోని పేజ్ లాడ్సన్ సైట్లో 2012 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 890 సార్లు నీటిలో మునిగి, నదీ గర్భంలో పరిశోధనలు నిర్వహించిన సైంటిస్టులు.. 35 అడుగుల లోతులోని భూభాగంలో ఉన్న సున్నపురాయిని 11 మీటర్లమేర తవ్వకాలు జరిపామని, ఈ నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు దొరికినట్లు తెలిపారు. ఇప్పటికీ క్లోవిస్ ముందు అక్కడ అద్భుత మానవ చరిత్ర ఉన్నట్లు నమ్ముతున్న పురాతత్వ వేత్తలు తమ పరిశోధనలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో నివేదించారు. -
భగవంతుని విరాట్రూపమే పద్నాలుగు లోకాలు
మామిడిపూడి ‘గీత’ పంచభూతాలతో ఏర్పడినది జగత్తు. 1. భూమి 2. ఉదకం. 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశం. ఇవి పంచభూతాలు. భూమిపై మానవులను, జంతువులను, ఇతర చరాచరాలను చూస్తున్నాము. నీటిలో చరాచరాలు ఉన్నాయి. అగ్ని, వాయువు తమ తమ ప్రవృత్తులతో ఇంద్రియ గోచరాలవుతున్నాయి. ఆకాశాన సూర్యచంద్రులు, ఇతర గ్రహాలు, నక్షత్రాలు, తేజోగోళాలు కనిపిస్తున్నాయి. ఖగోళ శాస్త్రజ్ఞుల పరిశోధనలు జరిపి నూతనంగా కనిపెట్టిన గోళాలను గురించి మనకు అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. వెలుగు ఒక సెకండుకు రమారమి 1,86,000 మైళ్లకు మించిప్రయాణం చేస్తుంది. భూమండలానికి ఎంతో దూరాన ఉన్న నక్షత్రాలనుండి ఏనాడో బయల్దేరిన కాంతికిరణాలు భూమిని చేరడానికి ఇంకా కొన్ని వేలసంవత్సరాలు పడుతుందట. విశ్వం అనంతమని, దాని ఆయతనం ఊహించరానిదనీ నిరూపించటానికి ఇంతకన్నా మనకేం కావాలి? మన శాస్త్ర సంప్రదాయాలను అనుసరించి ఈ జగత్తులో పద్నాలుగు లోకాలు ఇమిడి ఉన్నాయి. భగవంతుని విరాట్రూపంలోనివే ఇవన్నీ. 1.అతలం (పాదాలు) 2. వితలం (మడమలు) 3. సుతలం (జంఘాలు) 4.రసాతలం (జానువులు) 5. మహాతలం (ఊరువులు) 6. తలాతలం (కటి) 7.పాతాళం (నాభి పైభాగం) 8.భూలోకం (నాభి) 9. భువర్లోకం (జఠరం) 10.స్వర్లోకం (వక్షం) 11.మహర్లోకం (కంఠం) 12. జనోలోకం (ముఖం) 13.తపోలోకం (భ్రూమధ్యం) 14. సత్యలోకం (శిరస్సు) వచ్చేవారం శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శన వర్ణనం) కూర్పు: బాలు- శ్రీని -
మనిషి గతి ఇంతే!
హ్యూమర్ ప్లస్ మనుషులు లక్షా తొంభై రకాలు. మనకు గట్టిగా తొంభై రకాలే పరిచయమవుతారు. మిగిలిన లక్ష గురించి తెలుసుకోవడం ఇతరుల బాధ్యత. మనం చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం కానీ మన డిఫెక్ట్స్ ఎదుటివాళ్లు కనిపెడతారు. ఇతరుల పిచ్చిని తెలుసుకోవడమే పనిగా పెట్టుకున్నవాళ్లు కొందరుంటారు. వాళ్లే పిచ్చాసుపత్రి డాక్టర్లు. జీతం తీసుకుని మరీ పిచ్చివాళ్లతో కలిసి జీవిస్తుంటారు. నాకు తెలిసిన డాక్టర్ ఒకాయన ఉన్నాడు. నైజీరియా ప్రభుత్వం డాక్టరేట్ ఇచ్చి సన్మానం చేస్తుందని ఈ-మెయిల్ వస్తే ఖర్చుల కోసం 50 వేలు బ్యాంక్లో కట్టాడు. ఆ తరువాత నైజీరియా నుంచి సమాధానం నై. అసలు నైజీరియా వాళ్లకి కొట్టుకు చావడానికే టైం లేదు, మధ్యలో ఈయన్ని పిలిచి సన్మానం ఎందుకు చేస్తారు. వాళ్లకేమైనా పిచ్చా? అందరి పిచ్చిని తెలుసుకునే ఈయన ఇది తెలుసుకోలేక డబ్బు పోగొట్టుకున్నాడు. మన గురించి ఎవడైనా గొప్పగా అనుకుంటే చాలు ఒళ్లు మరిచిపోతాం. మనకు అంత సీన్ ఉందా లేదా అనేది అవసరం. ఎవడి పెళ్లికి వాడే హీరో అయినట్టు మన జీవితానికి మనమే కథానాయకులం. మనంతటి వారు లేరనేది మన ఫిలాసఫీ. తాగినప్పుడు ఇది చాలామందికి తలకెక్కుతుంది. మీరు తాగుబోతులైనా కాకపోయినా పర్లేదు. అయితే మరీ మంచిది. కల్లు కాంపౌండ్లో గానీ వైన్షాప్లో గానీ కాసేపు కూర్చుని చూడండి. బోలెడంత వేదాంత చర్చ జరుగుతూ ఉంటుంది. ‘‘నేనెవర్ని? ఎలాంటివాన్ని? ఈ లోకాన్ని అడగండి అదే చెబుతుంది. డబ్బుదేముంది. మనుషులు ముఖ్యం. అన్నీ చూడ్డానికి దేవుడున్నాడు. కొంచెం సోడా పొయ్. ఆ బాయిల్డ్ పల్లీ తీసుకో.’’ ఇది ఫస్ట్ రౌండ్ చర్చ. థర్డ్కి వెళితే భాష బాషా సినిమాలో రజనీకాంత్లా విజృంభిస్తుంది. ‘‘నన్షు అందర్షు మోసమ్ష్ చేసినా నేనెవర్షి షేయలేద్షు...’’ నిషా కదా ష అక్షరం అంతటా తానై నర్తిస్తుంది. ‘ష’ ఒక వూతకర్రతో నడిచినట్టు తాగుబోతుల అడుగులు కూడా బడతడుతాయి. ఎంత తడబడినా మనం మనింటికే వెళితే సేఫ్, లేదంటే వీపు సాప్. మనుషులందరికీ వాస్తవం కంటే భ్రాంతి ఎక్కువ ఇష్టం. రియాల్టీలో క్రూయాల్టీ ఉంటుంది. దాన్ని తట్టుకోవడం కష్టం. అందుకే సినిమాలకెళ్లి రంగుల్లో కలల్ని కొనుక్కుంటాం. కొంతమంది దర్శకులు తెలివి మీరి తెరపైన కూడా జీవితాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. అంతకంత అనుభవిస్తారు. ఉన్న జీవితంతోనే చస్తుంటే డబ్బిచ్చి కూడా జీవితాన్నే చూడమంటే ఎవరు చూస్తారు? లైఫ్ నుంచి, వైఫ్ నుంచి పారిపోవడానికి తాగడం మొదలుపెడతారు. ఎక్కింది దిగగానే ఎదురుగా నైఫ్లే వైఫ్. ఒకాయన ఉన్నాడు. ఆయనెప్పుడూ నోరే తెరవడు. ఒకటి మాట్లాడితే భార్య తంతుంది. రెండు మాట్లాడితే ఉతుకుతుంది. అందుకే ఆ మౌనదీక్ష. కాని మందు పడితే మౌనం పారిపోతుంది. అరుపులు, పెడబొబ్బలు, సవాళ్లు... బండి డౌన్ కాగానే గాలి తీసిన బెలూన్, మూగవాడి పిల్లనగ్రోవి. మనదేశం గొప్పతనం ఏమంటే ఇక్కడ కల్తీ కల్లు తాగి చచ్చిపోతారు. కల్తీ కల్లు దొరక్కపోతే కూడా చచ్చిపోతారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా పోయేది బరియల్ గ్రౌండ్కే! - జి.ఆర్.మహర్షి -
క్రౌర్యాసురులు
సోల్ / క్రౌర్యం మనుషుల్లో మెజారిటీ జనాలు క్రూరంగా, పరమఘోరంగా ఉంటారు. లోకంలో కొందరిపై అయాచితంగానే ‘శాంతిదూత’లుగా ముద్రపడి పోతుంది. అలాంటి వాళ్లలోనూ ఎంతో కొంత క్రౌర్యం ఉంటుంది. చరిత్రను తరచి చూస్తే అలాంటి శాంతిదూతల క్రౌర్యానికి చాలా ఆధారాలే లభిస్తాయి. మనుషులు శాంతియుతంగా ఉండాలేనేది ఈ ప్రపంచంలో అనాది ఆదర్శం. ప్రాంత, కాలాలకు అతీతంగా మానవ సమాజాల్లో ఇలాంటి ఆదర్శాలు చాలానే ఉన్నాయి గానీ, సహజ లక్షణాలెప్పుడూ ఆదర్శాలకు భిన్నంగానే ఉంటాయి. క్రౌర్యం కూడా అలాంటి సహజ లక్షణమే. భౌతికంగా హింసించడం మాత్రమే క్రౌర్యం కాదు. పరమ ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ కూడా క్రూర కర్మలకు తెగబడే కర్మసిద్ధాంతులు ప్రపంచం నలుమూలలా ఉంటారు. అహింసా సిద్ధాంతాన్ని అక్షరాలా ఆచరిస్తున్నామంటూనే, ఎదుటివారిని దారుణంగా హింసించే ‘పరమహింస’లు ఉంటారు. ఎంతైనా క్రౌర్యం మానవ సహజ లక్షణం. పెద్దలు దీనిని అవలక్షణంగా పరిగణిస్తారు. ఎవరైనా బాహాటంగానే క్రౌర్యాన్ని ప్రదర్శిస్తే, వాళ్లను దుర్మార్గులుగా ఈసడిస్తారు. క్రౌర్యాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు, వాటి శాసనాలు శాయశక్తులా క్రూరమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అందువల్ల లోకమంతటా నిండి ఉన్న మానవ సహజ లక్షణమేదనే ప్రశ్న ఎదురైతే, ‘క్రౌర్యం’ అని ఠక్కున బదులివ్వవచ్చు. అణచివేతే ఆదర్శం ‘క్రూర కర్మములు నేరక చేసితి... నేరములెంచకు రామా’ అంటూ భక్త రామదాసు పశ్చాత్తప్త హృదయంతో వగచి వాపోయాడు. అయితే, క్రూరమైన చేష్టలకు పాల్పడిన చాలామందిలో ఇలాంటి ఆత్మవిమర్శ తక్కువ. ఇలాంటి చేష్టలు తప్పు అని ఎవరైనా సుద్దులు చెప్పే ప్రయత్నాలు చేస్తే, వాళ్ల పట్ల మరింత క్రౌర్యాన్ని ప్రదర్శిస్తారు. కొందరు తమ క్రౌర్యాన్ని బాహాటంగానే ప్రదర్శిస్తారు. క్రౌర్య ప్రదర్శనలో వీళ్లకు ఎలాంటి శషభిషలు, మొహమాటాలూ ఉండవు. అణచివేతే వాళ్లు నమ్మిన సిద్ధాంతం. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టాలనేది కూడా లోకం మెచ్చిన ఆదర్శం. అయితే, బాహ్య క్రౌర్యప్రదర్శన సాగించే వాళ్లు నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని ప్రాణాలనైనా బలి తీసుకునేందుకు వెనుకాడరు. ఇలాంటి వాళ్లు క్రమంగా ముదిరి నియంతలుగా ఎదుగుతారు. తమ ప్రాభవం కొనసాగినంత కాలం హింసరచన కొనసాగిస్తారు. హిట్లర్, ముసోలినీ, ఇడీ అమీన్ వంటి పేరుమోసిన నియంతలే కాదు, పోలీసులు, వీధిరౌడీలు కూడా తమ తమ అవకాశాల మేరకు, అధికారాల మేరకు నిస్సిగ్గుగా తమ క్రౌర్యాన్ని బాహాటంగానే ప్రదర్శిస్తారు. ఇలాంటి వాళ్ల క్రౌర్యంలో భౌతిక హింస ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వాళ్ల హింసాకాండకు నెత్తుటి ఆనవాళ్లు చరిత్ర నిండా దొరుకుతాయి. పురాణాల్లో క్రౌర్యం కొద్ది మినహాయింపులను వదిలేస్తే, పురాణాల్లోని రాక్షసులందరూ క్రూరులే. వాళ్లు తమ క్రౌర్యాన్ని ఏనాడూ దాచుకోలేదు. చరిత్రకెక్కిన నియంతల తరహాలోనే బాహాటంగానే ప్రదర్శించారు. నరకాసురుడనే వాడు జనాలకు ప్రత్యక్ష నరకాన్నే చవిచూపాడు. బకాసురుడు మనుషులనే భోంచేసేవాడు. ఇలాంటి రాక్షసులు మనకు చాలామందే తెలుసు. అలాగని దేవతలందరూ అహింసావాదులు కాదు. హింసాకాండను సాగించిన రాక్షసులను వాళ్లు హింసాత్మకంగానే వధించారు తప్ప శాంతివచనాలను వల్లించలేదు. అయితే, వేద పురాణాలు, మతగ్రంథాలు క్రౌర్యాన్ని మహాపాపంగా పరిగణించాయి. ఎవరైనా సాటి మనుషుల పట్లే కాదు, మూగజీవులపై క్రౌర్యాన్ని ప్రదర్శించినా అలాంటి వాళ్లు నరకానికే పోతారని ఫలశ్రుతి చెప్పాయి. ఏ రకమైన క్రౌర్యానికి పాల్పడితే, అందుకు నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో భయానక, బీభత్సరసాలు ఉట్టిపడేలా వర్ణించాయి. ఇహలోకంలో క్రూరమైన చర్యలకు పాల్పడేవాళ్లు పరలోకంలో అంతకు మించిన క్రూరమైన శిక్షలే అనుభవించాల్సి వస్తుందనేది పురాణాల సారాంశం. ఇలాంటి పురాణాలన్నింటినీ కూలంకషంగా చదువుకున్న వారేమైనా తమ క్రౌర్యాన్ని విడనాడారా అంటే, లోకంలో అలాంటి దాఖలాలేవీ లేవు. పిరికితనమే కారణం క్రూరస్వభావాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ, ఎదుటి వాళ్లను హింసించేవాళ్లకు సామాన్యులు భయపడతారు. అధికార, ధనబలాలతో ఇలాంటి ఆగడాలను సాగించేవాళ్లకు ఎదురు చెప్పేందుకు సాహసించరు. ఎవరూ ఎదురుచెప్పలేరనే ధీమా వచ్చాక హింసరాజులు మరింత చెలరేగిపోతారు. ఇలాంటి హింసరాజులను జనం గొప్ప ధైర్యవంతులుగా భావిస్తారు గానీ, అది నిజం కాదు. పిరికిపందలే క్రూరులుగా మారుతారు. తమ లోలోపలి భయాలను అణచిపెట్టుకోవడానికి ఎదుటివారిపై నిష్కారణంగా హింసకు తెగబడతారు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లకు డబ్బు, అధికారం తోడైతే మరింతగా పెట్రేగిపోతారు. ఎదుటివారు హింసను అనుభవిస్తుంటే చూస్తూ ఆనందిస్తుంటారు. ఇంకొందరు మరీ పిరికిపందలు ఉంటారు. తమ క్రౌర్యాన్ని బాహాటంగా ప్రదర్శించే ధైర్యం కూడా వీళ్లకు ఉండదు. ఇలాంటి వాళ్లు లోకంలో జరిగే హింసను మాటలతో ఖండిస్తూ ఉంటారు. నీతిచంద్రికలు వల్లిస్తూ, లోకంలో శాంతికాములుగా చలామణీ అవుతుంటారు. ఇలాంటి వాళ్లకు నేరుగా భౌతికహింసకు పాల్పడే ధైర్యం ఉండదు గానీ, తమను అంటిపెట్టుకుని ఉండే వెర్రిగొర్రెల్లాంటి వాళ్ల భావోద్వేగాలను ‘శాంతియుతం’గా రెచ్చగొడతారు. రెచ్చిపోయిన వెర్రిగొర్రెలు ఊరుకోరు కదా! వాళ్లు హింసాకాండకు పాల్పడతారు. అలాంటి సందర్భాల్లో ఆ పాపం తమది కాదన్నట్లు మిన్నకుంటారు ఇలాంటి ‘శాంతికాముక’ క్రూరులు. వీళ్లెలాంటి వాళ్లంటే, తాబేలు వంటి సాధుజీవిని చంపడం పాపం అని చెబుతూనే, డిప్ప మీద కొడితే అది చావదు గానీ, తిరగేసి కొడితే చచ్చి ఊరుకుంటుందని చెప్పే రకం. ఎందెందు వెదకి చూసిన... క్రౌర్యం సర్వంతర్యామి. ‘ఎందెందు వెదకి చూసిన...’ అన్న రీతిలో ఎక్కడ చూసినా లోకంలో క్రౌర్యం లేని చోటే కనిపించదు. సామాన్యుల ఇళ్లల్లో సైతం భార్యలను భౌతికంగానో మానసికంగానో హింసించే భర్తలు, భర్తలను వేధించే భార్యలు, పిల్లలను వేధించే తల్లిదండ్రులు, తల్లిదండ్రులను హింసించే పిల్లలు తారసపడుతూనే ఉంటారు. చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన బడుల్లో విద్యార్థులను హింసించే చండామార్కులు కనిపిస్తుంటారు. న్యాయస్థానాల్లో కక్షిదారులను పీడించుకు తినే న్యాయవాదులు, ఆస్పత్రుల్లో రోగులను జలగల్లా పీల్చేసే వైద్యులు, ప్రతిపనికీ ప్రజల నుంచి లంచాలు పీక్కుతినే లంచావతారులు, సామాన్యులపై బలప్రయోగంతో తప్ప శాంతిభద్రతలను కాపాడలేని పోలీసులు, ఆఫీసుల్లో చిరుద్యోగులపై జులుం చలాయించే బాసులు, కాలేజీల్లో జూనియర్లను ర్యాగింగ్ చేసే సీనియర్లు, అమ్మాయిలపై యాసిడ్దాడులు సాగించే ప్రేమోన్మాదులు... చెప్పుకుంటూ పోతే ఇదంతా కొండవీటి చాంతాడంత జాబితా. నెత్తుటితో, కన్నీళ్లతో తడవని చోటు భూప్రపంచంలో ఎక్కడా కనిపించదు. క్రౌర్యం సర్వంతర్యామి అనేందుకు ఇంతకు మించిన రుజువేముంటుంది? - పన్యాల జగనాథదాసు -
మన జాతీయాలు
లొట్టాభట్టీయం మనుషుల్లో చేతల మనుషులు, మాటల మనుషులు అని రెండు రకాలు. చేతల మనుషులు... తాము చేయదలిచిన పనిని ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా చేసేస్తారు. మాట మీద నిలబడతారు. అతిగా మాట్లాడరు. గొప్పలకు పోరు. అసాధ్యమైన పనిని సైతం ‘నేను చేస్తాను చూడు’ అని డంబాలు పలుకరు. ఇక మాటల మనుషుల తీరు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఈ కోవకు చెందినవాళ్లు మాటలకు తప్ప చేతలకు ప్రాధాన్యత ఇవ్వరు. పని విషయంలో సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషించడం కూడా కనిపించదు. ఏ పని అయినా సరే- ‘‘అదొక లెక్కా... నేను చేసేస్తాను’’ అంటారు. తీరా పనిచేయాల్సి వచ్చేసరికి సాకులు వెదుక్కొని తప్పించుకుంటారు. ఇలాంటి వాళ్లు ఎంతోమంది మనకు నిత్యజీవితంలోనూ తారస పడుతుంటారు. ఈ కోవకు చెందిన వాడే లొట్టాభట్టు. ఈ భట్టుగారు నోరి విప్పితే చాలు... కోతలే కోతలు. ‘ఆకాశంలో చుక్కలు కావాలి’ అని అడిగితే - ‘అదెంత పని’ అనేవాడట వినేవాళ్లు నమ్మేలా. దేనినీ చాతకాదు అనడం ఈయనకు చాత కాదు. ఏదైనా చేసేస్తాను అనడమే ఈయనగారికి వచ్చు. నిజంగా వచ్చా అంటే సమాధానం శూన్యం. అందుకే కోతలు కోయడం, గొప్పలు చెప్పుకోడం లాంటి వాటికి లొట్టాభట్టు పేరు పర్యాయపదం అయిపోయింది. అందుకే ఎవరైనా సాధ్యం కాని పనులను సాధ్యం చేస్తామని చెప్పినా, కోతలు కోసినా - ‘‘ఆయన చెప్పింది నమ్మేవు సుమీ... అదొక లొట్టాభట్టీయం’ అంటుంటారు. దింపుడు కళ్లం ఆశ మనిషిని బతికించేది ఆశ అంటారు. చనిపోయిన మనిషి మళ్లీ బతుకుతాడు అనుకోవడం కూడా ఆశే. కాకపోతే అది తీరే ఆశ కాదు. అయినా కూడా తీరుతుందేమో నని ఆచరించేదే దింపుడు కళ్లం. చనిపోయిన వ్యక్తిని శ్మశానం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్తూ, మధ్యలో ఒకచోట శవాన్ని కిందికి దింపి, చెవిలో మూడుసార్లు పేరు పెట్టి పిలుస్తారు. ప్రాణం మిగిలుంటే లేస్తారని ఆ ప్రయత్నం. దీన్ని దింపుడు కళ్లం ఆశ అంటారు. కళ్లం అంటే ప్రదేశం అని అర్థం. గతంలో ఎప్పుడో, చనిపోయాడని నిర్ధారించుకున్న ఓ వ్యక్తి, నిప్పు పెట్టే ముందు చితిమీది నుంచి లేచి కూర్చు న్నాడట. అదెంతవరకూ నిజమో తెలి యదు కానీ, ఆచార వ్యవహారాల ప్రకారం దింపుడు కళ్లం ఆశకు ఎలాంటి అర్థం ఉన్నా, ఒక చిట్టచివరి ఆశ అన్న భావన వచ్చింది. ఒక పని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగ దని తెలిసినా, మనసులో ఏదో మూల చిన్న ఆశ ఉంటుంది. ఆ ఆశ గురించి చెప్పేటప్పుడు ఈ మాటను వాడతారు. చుట్టమై వచ్చి దెయ్యమై పట్టి! పనులు చక్కబెట్టుకోవడానికి లేదా తమ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది ఆత్మీయత, స్నేహం, బంధుత్వం అనే ఆయుధాలను వాడుతుంటారు. ఒక పని నెరవేర్చుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది, ఎవరి ద్వారా ఎలాంటి లాభాలు పొందవచ్చు అని కనుక్కొని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. వారితో వ్యూహాత్మకంగా స్నేహమో, బంధుత్వమో కొని తెచ్చుకుంటారు. వీరి నట ఆత్మీయతను చూసి అవతలి వాళ్లు సులభంగా బుట్టలో పడి పోతారు. కాల క్రమంలో ఈ ఆత్మీయులు కాస్తా గుదిబండల్లా తయారవుతారు. దాంతో వీరిని వదిలించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటి వారి విషయంలో వాడే జాతీయం ఇది. ‘‘అలాంటివాడిని ఎందుకు నమ్మావు?’’ అని అడిగితే- ‘‘ఏం చేస్తాం మరి... చుట్టమై వచ్చి దెయ్యమై పట్టాడు’’ అంటారు. ఈగెంతా పేగెంతా! కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. వియ్యం సంగతి సరే, కయ్యంలో మాత్రం తరచుగా వినిపించే మాట ఇది. సంపద, జ్ఞానం, వయసు మొదలైన విషయాల్లో పోల్చి చూసే సందర్భాల్లో వాడే జాతీయం ఇది. ‘‘నువ్వెంత, నీ స్థాయి ఎంత? నీ మాటలను నేను లెక్కలోకి తీసుకోను. ఈగెంతా పేగెంతా’ అంటుంటారు. ఈగ అంటేనే చిన్న జీవి. ఇక దాని పేగు ఎంత ఉంటుంది! మరీ చిన్నగా ఉండదూ! తక్కువలో తక్కువ, అల్పంలో అల్పం అని చెప్పడానికి ‘ఈగ’ను ప్రతీకగా వాడుకొని ఇలా చెబుతుంటారన్నమాట. -
పంది అవయవాలు మనుషులకు!
వాషింగ్టన్: పంది అవయవాలను మనుషులకు అమర్చడం భవిష్యత్తులో సాధ్యం కావొచ్చు. ఈ దిశగా ఉన్న అతిపెద్ద అడ్డంకిని శాస్త్రవేత్తలు అధిగమించారు. వరాహ జన్యువులోని రిట్రోవైరస్లను క్రియారహితంగా మార్చడం ద్వారా వీటి అవయవాలు మనుషులకు సరిపడేలా చేయగలిగారు. ఈ రిట్రోవైరస్లు పందిలోని ప్రతి కణంలో ఉంటాయి... అయితే దానికి హాని చేయవు. మరో జీవి శరీరంలో ప్రవేశపెడితే మాత్రం రోగకారకాలవుతాయి. గతంలో అత్యధికంగా ఆరుచోట్ల మాత్రమే పంది జన్యువుల్లో మార్పులు జరగ్గా... హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు... అత్యంత శక్తిమంతమైన జన్యు మార్పు ప్రకియ ద్వారా ఏకంగా 62 చోట్ల పంది జన్యువులో మార్పు చేయగలిగారు. ప్రమాదకరమైన రిట్రోవైరస్లను తొలగించడంలో సఫలమయ్యారు. తద్వారా పంది అవయవాలను మనిషికి అమర్చే దిశగా పెద్ద ముందడుగు పడింది. -
గోట్స్ థియరీ
హ్యూమర్ ప్లస్ నిజానికి మనుషులకి, గొర్రెలకీ పెద్దగా తేడా లేదు. ఈ విషయం అందరి కంటే టీవీ చానెల్స్ వారికి బాగా తెలుసు. ఒక రోజు మనుషులెవరూ దొరక్క ఒక గొర్రెని స్టూడియోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. ‘‘గతంలో కూడా మేము చాలా గొర్రెలతో ఇంటర్వ్యూ చేశాం. అయితే అవి మనుషుల్లా మేకప్ చేసుకుని రావడం వల్ల మీరు గుర్తు పట్టలేకపోయారు. ఈసారి ఒరిజినల్ గొర్రెనే పిలిపించాం. ఇది మనుషులకంటే తెలివైన సమాధానాలే ఇస్తుందని నమ్ముతున్నాం’’ అని ప్రారంభించింది యాంకర్. ప్ర. ‘‘మేకలు మేమే అంటాయి. మీరెందుకు అలా అరవరు?’’ జ. ‘‘మే నెల అంటే మాకిష్టం లేదు. ఒకటే ఎండ’’ ప్ర. ‘‘మనుషులపై మీ అభిప్రాయం ఏమిటి?’’ జ. ‘‘గొర్రెలుగా మారాలంటే ఇంకాస్త ఎదగాలి’’ ప్ర. ‘‘ప్రజాస్వామ్యంపై మీ ఒపీనియన్?’’ జ. ‘‘అది హనుమంతుడి తోకలా ఉంటుందని నాయకులు చెబుతుంటారు కానీ అది వాస్తవానికి మా తోకంత ఉంటుంది. అధికారమనేది దుడ్డుకర్రలాంటిది. అది చేతిలో ఉంటే ఎవరో ఒకర్ని మోదాలనిపిస్తూ ఉంటుంది. ఇక మనుషులే ఏ ఒపీనియన్స్ లేకుండా జీవిస్తున్నప్పుడు గొర్రెల ఒపీనియన్స్ని గౌరవించడం మీ చానెళ్ల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ‘‘గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందని ఎందుకంటారు?’’ ‘‘నమ్మినా నమ్మకపోయినా వాడెలాగూ చంపలేడు. అవిశ్వాసంతో మరణించడం కంటే, విశ్వాసంతో మరణించడం శ్రేయస్కరం. ఓటేసినా, వేయకపోయినా ఎవరో ఒకరు గెలవడం తప్పనిసరి అయినట్టు, చచ్చేవాడి నమ్మకాలతో ఒరిగేదేమీ లేదు.’’ ‘‘మీరు ఫిలాసఫరా?’’ ‘‘కాదు ఫిలాసఫరర్’’ ‘‘మీకేమైనా థియరీస్ ఉన్నాయా?’’ ‘‘తోక ఉన్నప్పటికీ విప్పలేను, చెప్పలేను, దీన్ని టెయిల్స్ థియరీ అంటారు’’ ‘‘టెయిల్ ఉన్నప్పుడు హెడ్ కూడా ఉండాలిగా. ఆ థియరీ చెప్పండి’’ ‘‘ఆఫీసుల్లో అనేకమంది హెడ్స్ ఉన్నట్టు. ఈ హెడ్స్లా రకరకాల థియరీలు ఉంటాయి. హెడ్ మూవ్మెంట్ అంటే ఎదుటివాడు చెప్పేది అక్షరం అర్థం కాకపోయినా అన్నింటికి తల ఊపే థియరీ ఇది. వీళ్లకు నాలుగు కాలాల పాటు హెడ్ పదిలంగా ఉంటుంది. హెడ్ వెయిట్ థియరీ అంటే ప్రపంచమంతా మన తలలో నుంచే నడుస్తుందని నమ్మే థియరీ. లోకం బరువు మోసి మోసి వీళ్ల తలకాయ చైనా చార్జర్లా పేలిపోతుందని అనుకుంటూ ఉంటారు. అందరి తలరాత రాస్తున్నామని అనుకుంటారు కానీ తలకి నూనె తప్ప ఇంకేమీ రాయలేరు. హెడ్లెస్ థియరీ అని ఇంకొకటుంది. బయటికెళ్లాక తల ఉంటుందో లేదో తెలియని నాలాంటి వాళ్లు చెప్పే థియరీ ఇది’’ ‘‘థియరీస్ బావున్నాయి. ప్రాక్టికల్స్కి కూడా ఉన్నాయి?’’ ‘‘థియరీస్ మేం చెబుతాం. నాలాంటి వాళ్లని బిరియాని వండుకుని ప్రాక్టికల్స్ మీరు చేసుకుంటారు’’ ‘‘మనుషులకి గొర్రెలకి తేడా లేదని మా అభిప్రాయం’’ ‘‘గొర్రెలకి మనుషులకి తేడా లేదని నా అభిప్రాయం’’ ‘‘రెండు ఒకటేగా?’’ ‘‘ఒకలా కనిపించేవన్నీ ఒకటి కావు. ఉప్పు కప్పురంబు పద్యం తెలుసుగా. మీరు ప్రతీది మనుషులతో పోలుస్తారు. మేం గొర్రెలతో పోలుస్తాం. మనుషులు మారాలి అని మీరంటే, గొర్రెలు మారాలి అని మేమంటాం’’ ‘‘ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం’’ ‘‘పైసా ఖర్చు లేకుండా వాట్సప్లో ఎవరికి వాళ్లు లక్షల సందేశాలు ఇచ్చుకుంటుంటే గొర్రెలిచ్చే సందేశం ఎవడికి కావాలి? అయినా అడిగారు కాబట్టి ఇస్తున్నా. మీరు మనుషులైనా, గొర్రెలైనా కత్తికి దొరక్కుండా జీవించండి’’ ‘‘పొయెటిక్గా చెప్పారు’’ ‘‘కత్తి కంటే కవిత్వం డేంజర్’’ ‘‘మీ విలువైన అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి’’ ‘‘ఆ గుంజకి కట్టిన వాడు తాడు విప్పితే నా దారిన నేను పోతాను’’ - జి.ఆర్. మహర్షి -
'ఇక మొక్కలకు ఐడెంటీ కార్డులు'
కోల్కతా: ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే ఐడెంట్లీ కార్డులు ఉండగా.. ఇక నుంచి మొక్కలకు కూడా గుర్తింపు కార్డులు రానున్నాయి. వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుని గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి దాపురించిన నేపథ్యంలో కోల్కతాలోని కోన్నాగర్ మున్సిపాలిటీ సంస్థ మొక్కల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు వాటికి ప్రత్యేక గుర్తింపు కార్డులు కేటాయించింది. 28 రకాల మొక్కలకు ఇప్పటికే మూడువేల ఐడెంటీ కార్డులను జారీ చేసింది. ఈ ఐడెంటీ కార్డులో మొక్కలకు ఉండే స్థానిక పేరుతోపాటు శాస్త్రీయ నామం, అది ఉన్న ప్రాంతం, ఓ ఛాయా చిత్రం, దాని ప్రస్తుత బరువు, కాండం విస్తృతి వివరాలు చేర్చారు. ప్రముఖ పర్యావరణ వేత్త అభిజిత్ మిత్రా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఐడెంటీ కార్డును ఆ మొక్కలకు అమర్చినట్లు చెప్పారు. -
దెయ్యాల గ్రామం
మిస్టరీ * ఊరు ఉంది * మనుషులు మాత్రం లేరు * వాళ్లంతా ఏమయ్యారు?! గుజరాత్లోని కుల్ధారా గ్రామ శివారు ప్రాంతం... ఓ స్కార్పియో వేగంగా వచ్చి ఆగింది. ఆ వేగానికి రోడ్డుమీది ఎర్రటి మట్టి అంతె త్తున ఎగసి మబ్బులా కమ్ముకుంది. ‘‘ఓ గాడ్... ఏంటిది సందీప్. కాస్త మెల్లగా ఆపొచ్చు కదా?’’... దడదడా కొట్టుకుంటోన్న గుండె మీద చేయి వేసుకుని అంది రూప. ‘‘నువ్వు మరీను రూపా... నేనేమైనా కావాలని బ్రేక్ వేశాననుకున్నావా? అదే ఆగింది’’ అన్నాడు సందీప్ కాస్త విసుగ్గా. ‘‘ఆగిందా? అలా ఎలా ఆగుద్ది?’’ అంది రూప అయోమయంగా. ఈసారి మరింత విసుగు వచ్చింది సందీప్కి. ‘‘ఉండు... దాన్నే అడిగి చెప్తాను’’ అంటూ కిందికి దిగాడు. టైర్లు చెక్ చేశాడు. బాగానే ఉన్నాయి. బానెట్ తెరిచి అన్నీ పరిశీలించాడు. ఎక్కడా ఏ లోపమూ లేదు. డీజిలు కూడా ఉంది. మరి ఏమయినట్టు? ఉన్నట్టుండి కారు ఎందుకు ఆగిపోయినట్టు?! మళ్లీ కారు స్టార్ట్ చేయాలని ప్రయ త్నించాడు. స్టార్ట్ కాలేదు. ట్రై చేసి ట్రై చేసి విసిగిపోయి వదిలేశాడు. ‘‘ఏంటి దీపూ... ఏం జరిగింది?’’... అడిగింది రూప. ‘‘ఏమో తెలియడం లేదు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ కారు మాత్రం స్టార్ట్ కావట్లేదు.’’ ‘‘పోనీ ఇక్కడెక్కడైనా మెకానిక్ షెడ్ ఉందేమో చూడు’’ అంది కారు దిగుతూ. ఇక అదే చేయాలి అనుకుంటూ తనూ దిగాడు సందీప్. ఇద్దరూ ఐదు నిమిషాలు నడిచాక ‘కుల్ధారా’ అన్న బోర్డు కనిపించింది. ప్రవేశద్వారమూ ఉంది. ‘‘హమ్మయ్య... ఏదో ఊరు ఉందిక్కడ. కచ్చితంగా మెకానిక్ ఉండే ఉంటాడు’’ అంటూ హుషారుగా అటువైపు నడిచాడు సందీప్. రూప అతణ్ని అనుస రించింది. నాలుగడుగులు వేయగానే ఓ పాతికేళ్ల అమ్మాయి ఎదురొచ్చింది. వీళ్లని చూసినా చూడనట్టుగా వెళ్లిపోసాగింది. ‘‘హలో ఆగండి’’ అంటూ ఆమె దగ్గరకు పరుగెత్తారు ఇద్దరూ. ఏమిటన్నట్టు చూసిందామె. ‘‘మా కారు ఆగిపోయింది. ఈ ఊళ్లో ఎవరైనా మెకానిక్ ఉన్నారా?’’ ఆమె మాట్లాడలేదు. వాళ్లవైపు రెండు క్షణాలు తీక్షణంగా చూసింది. ఊళ్లోకి వెళ్లమన్నట్టు చేతితో చూపించింది. ‘‘థాంక్ గాడ్... ఉన్నట్టున్నారు. పద దీపూ వెళ్దాం’’ అంది రూప ఊపిరి పీల్చు కుంటూ. ఇద్దరూ మళ్లీ నడకందుకున్నారు. ఊళ్లోకి నడుస్తుంటే విచిత్రంగా అని పించసాగింది. ఎక్కడా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అన్ని ఇళ్ల తలుపులూ వేసి ఉన్నాయి. వెళ్లి కొడితే ఎవ్వరూ తీయడం లేదు. ఎవరైనా ఉన్నారా అని అడిగితే బదులు రావట్లేదు. సమయం గడిచిపోతోంది. వెలుగు దూరమవుతోంది. చీకటి కమ్ముకుంటోంది. అయినా వాళ్లు వెతుకుతూనే ఉన్నారు. ఎవరో ఒకరు కనిపించకపోతారా అని ఆశగా వీధి వీధీ తిరుగుతూనే ఉన్నారు. వారి ప్రయత్నమైతే ఫలించలేదు. కానీ ఉన్నట్టుండి ఒక మహిళ స్వరం మాత్రం వినిపించింది. ‘‘దీపూ.. ఒక్కసారి విను’’ అంది రూప చెవులు రిక్కిస్తూ. సందీప్ నడక ఆపేశాడు. శ్రద్ధగా వింటున్నాడు. ఎవరిదో ఏడుపు. చిన్నగా మొదలైంది. ఉండేకొద్దీ పెద్దదవుతోంది. కాసేపటికి చెవులు చిల్లులు పడేంతగా వినిపించసాగింది. గుండెలు జారిపోయాయి ఇద్దరికీ. ఆ ఏడుపు మామూలుగా లేదు. బాధా కరంగా, భయానకంగా... అసలు మనిషి ఏడుపులానే లేదది. ఇక ఆలస్యం చేయలేదు సందీప్. రూప చేయి పట్టుకున్నాడు. వెనక్కి తిరిగి పరుగందుకున్నాడు. ఇద్దరూ ఆగకుండా పరిగెడుతున్నారు. అంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. ఉన్నట్టుండి నవ్వు మొదలైంది. ఆమె పగలబడి నవ్వుతోంది. తెరలు తెరలుగా నవ్వుతోంది. గుండెను చిక్కబట్టుకుని పరిగెడు తూనే ఉన్నారు ఇద్దరూ. అలసిన కాళ్లు సలుపుతున్నాయి. కానీ అవేమీ పట్టించు కునే స్థితిలో లేరు. ఎలాగైనా అక్కడ్నుంచి బయటపడాలి... అంతే. ఎట్టకేలకు కారు దగ్గరకు చేరుకున్నారు. కానీ ఏం లాభం? కారు పనిచేయడం లేదుగా! ఆ విషయం గుర్తు రాగానే గుండె జారిపోయింది. మళ్లీ పరుగందుకున్నారు. ఎలాగో హైవే మీదికి చేరుకున్నారు. అటుగా వెళ్తోన్న ఓ కారును ఆపారు. లిఫ్ట్ అడిగి ఎక్కేశారు. చెమటతో ముద్దయిపోయి, ఆయాసంతో రొప్పుతోన్న ఆ ఇద్దరినీ చూసి కారులోని వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ‘‘ఏమైంది సర్? యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా?’’ అన్నాడు ఆదుర్దాగా. లేదన్నట్టు తలూపింది రూప. జరి గింది చెప్పాడు సందీప్. అంతే... హడలి పోయి కారు ఆపేశాడా వ్యక్తి. ‘‘ఏ ఊరు?’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో. ‘‘కుల్ధారా’’... చెప్పాడు సందీప్. ‘‘కుల్ధారా వెళ్లారా? అసలు మీకా ఊరి గురించి తెలుసా? అక్కడ మూడు వందల యేళ్లుగా ఎవరూ ఉండడం లేదు. ఉండాలన్నా ఉండలేరు. ఎందుకంటే అది ఊరు కాదు. దెయ్యాల స్థావరం.’’ తుళ్లిపడ్డారు సందీప్, రూపలు. మూడు వందల యేళ్లుగా ఎవరూ ఉండటం లేదా? మరి ఊళ్లోకి వెళ్లమని తమకు దారి చెప్పిన స్త్రీ ఎవరు? అదే సందేహాన్ని వెలిబుచ్చారు. ‘‘మీకు ఇంకా అర్థం కాలేదా... మీకు దారి చూపింది, ఏడ్చింది, నవ్వింది ఎవరో! అసలు అక్కడ ఇళ్లే ఉండవు. మొండిగోడలు మాత్రమే ఉంటాయి. మనుషులు ఉండరు. దెయ్యాలు మాత్రమే తిరుగుతుంటాయి. మరి మీరు ఎవరిని చూశారు? ఏ ఇంటి తలుపులు కొట్టారు?’’ పై ప్రాణాలు పైనే పోయాయి సందీప్, రూపలకు. ఆ ఊరిలో ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ భయం వేయ సాగింది. ఇలాంటివి సినిమాల్లో మాత్రమే చూశారు. నిజ జీవితంలో కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయారు. నిజమే. ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది ముమ్మాటికీ వాస్తవం. రాజస్థాన్ లోని కుల్ధారా గ్రామానికి వెళ్తే ఇలాంటి అనుభవాలు బోలెడు ఎదురౌతాయి. ఎందుకంటే అది ఒక హాంటెడ్ విలేజ్! రాజస్థాన్ రాష్ట్రంలో, జైసల్మేర్కి పది హేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్ధారా. ఒకప్పుడు నిండా జనంతో, అందమైన గృహాలతో కళక ళలాడేది. పండుగలు పబ్బాలతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇళ్లు లేవు. అంతుపట్టని నీడలు, వికృతమైన అరుపులు, ఎవరివో తెలియని అడుగుల జాడలు తప్ప మనుషుల ఉనికి లేదు. ఎందుకని? అసలా ఊరికి ఏమయ్యింది? మూడు వందల యేళ్ల క్రితం కుల్ ధారాలో పలివాల్ బ్రాహ్మణ కులస్థులు మాత్రమే ఉండేవారు. అందరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. కానీ రాత్రికి రాత్రే ఊరిలోని జనమంతా మాయమై పోయారు. దానికి కారణం... ఒకరోజు ఆ గ్రామానికి దురదృష్టం నడచుకుంటూ వచ్చింది... ప్రధాని సలీమ్ సింగ్ రూపంలో (అప్పట్లో గ్రామ ప్రధానులని ఉండేవారు. వారిదే ఆధిపత్యం)! కుల్ధారా గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను సలీమ్ ఇష్టపడ్డాడు. కానీ ఆమె అతణ్ని ఇష్టపడలేదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీమ్. అది తట్టుకోలేక ఊరివాళ్లు తిరగ బడ్డారు. తమ కులం కానివాడికి అమ్మా యిని ఇవ్వలేమని, దూరంగా ఉండమని హెచ్చరించారు. రగిలిపోయాడు సలీమ్. ఊరివాళ్ల మీద పగబట్టాడు. అధిక పన్నులు విధించి హింసించాడు. అయినా ఎవరూ లొంగకపోవడంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు. అతనికి ఎదురు తిరిగి పోరాడటం మాటలు కాదు. అందుకే అందరూ కలిసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లేముందు... ఆ ఊరు ఇక నివాసయోగం కాని విధంగా నాశనమైపోతుందని శపించారట. అందుకే కుల్ధారా అలా అయిపోయిందని అంటూ ఉంటారు. అయితే ఈ కథలో కొంతే నిజం ఉందని, గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోలేదని, రాత్రికి రాత్రే సలీమ్ సింగ్ అందరినీ చంపి పాతి పెట్టేశాడని, వాళ్లంతా దెయ్యాలై ఊరిని పట్టి పీడిం చడం మొదలు పెట్టారనీ మరో వాదన. ఏది నిజమో తెలుసుకోవాలని, రాత్రికి రాత్రే జనమంతా ఏమైపోయారో కని పెట్టాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఎవరి జాడా తెలియక మిన్నకుండిపోయారు. తర్వాత కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో నివసించడానికి వచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. అర్ధరాత్రిళ్లు ఎవరో తలుపులు బాధేవారు. తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఎవరో గట్టిగట్టిగా అరిచేవారు. ఏడ్చేవారు, నవ్వేవారు. ఏవేవో నీడలు వెంట తిరుగుతూండేవి. ఏవేవో రూపాలు కనిపించి భయపెట్టేవి. దాంతో అందరూ ఊరు వదిలి పారి పోయారు. క్రమంగా ఈ గ్రామంలో జరుగుతున్నవన్నీ బయటకు తెలియ డంతో ఎవ్వరూ అక్కడకు వెళ్లే సాహసం చేయలేపోయారు. ఒక్కోసారి ఆ ఊరి పక్క నుంచి వెళ్లేవాళ్ల వాహనాలు హఠాత్తుగా ఆగిపోయేవి. తర్వాత వారికి అక్కడ భయానక అనుభవాలు ఎదురయ్యేవి. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారంతా కలిసి కుల్ధారా ఒక ఘోస్ట్ విలేజ్ అని తేల్చి చెప్పేశారు. ఆ ముద్ర నేటికీ అలానే ఉంది. దాన్ని చెరిపే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. ఎందుకంటే... తమ ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం గానీ... అక్కడికి వెళ్లి తమ జీవితాలను రిస్క్లో పెట్టుకునే ధైర్యం గానీ ఎవరికీ లేవు కాబట్టి! కుల్ధారా ముఖద్వారం ఢిల్లీలోని పారాపార్మల్ సొసైటీకి చెందిన పన్నెండు మంది సభ్యులు కుల్ధారా గ్రామానికి వెళ్లారు. వాళ్లు అక్కడ ఉన్న ఆ రాత్రి వారికి కాళరాత్రి అయ్యింది. ఏవేవో నీడలు కనిపించాయి. ఏవేవో స్వరాలు వినిపించి భయపెట్టాయి. వారి వాహనాల మీద చిన్నపిల్లల చేతి ముద్రలు ప్రత్యక్షమయ్యాయి. ఉన్నట్టుండి టెంపరేచర్ పడిపోయేది. ఉన్నట్టుండి పెరిగిపోయేది. దాంతో వాళ్లు కూడా కుల్ధారా గురించి అంతవరకూ ఉన్నవన్నీ వదంతులు కావని, వాస్తవాలేనని నమ్మే పరిస్థితి వచ్చింది. నాటి నుంచీ కుల్ధారా అంటే అందరికీ మరీ భయం పట్టుకుంది. ప్రభుత్వం కుల్ధారాని సందర్శనా స్థలంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. సందర్శకులు కూడా బాగానే వస్తున్నారు. కానీ చీకటి పడే సరికల్లా పరారైపోతురు. -
చింపాంజీలకు తప్పొప్పులు తెలుసు
న్యూయార్క్: మనుషులు తాము చేసే పని సరైనదే అయినప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనుషుల్లాగే చింపాంజీలు కూడా తాము చేసే పని సరైనదైనప్పుడు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. చింపాంజీలను మనుషులకు పూర్వ జీవులుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలో, తెలుసుకొని అర్థం చేసుకోవడంలో అవి మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. అలాగే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే గుణం కూడా చింపాజీలకు ఉంది. ఏదైనా పరిస్థితుల్లో మనకు ఆ విషయం గురించి అవగాహన ఉంటే ఒకలా, లేకుంటే మరోలా ప్రవర్తిస్తాం. మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో స్పందిస్తాం. మనకు ఎంత తెలుసు అనేదాన్ని బట్టే మన ఆత్మవిశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మానసిక స్థితే జంతువుల్లో కూడా ఉంటుందా అనే అంశంపై జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం సాగించారు. చింపాంజీలపై వీరు సాగించిన అధ్యయనంలో అవి కూడా మనుషుల్లాగే స్పందిస్తాయని రుజువైంది. ఈ అధ్యయనంలో చింపాంజీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో సమాధానం ఇవ్వగానే వాటికి ఆహారాన్ని వేరే చోట ఏర్పాటు చేసినట్లు కంప్యూటర్లో తెలిపేవారు. కానీ సరైన సమాధానం చెప్పినప్పుడు మాత్రమే వాటికి అక్కడ ఆహారాన్ని అందించేవారు. సమాధానం చెప్పిన వెంటనే చింపాంజీలు ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్లేవి. కానీ సరైన సమాధానం చెప్పినప్పుడు ఆహారాన్ని తీసుకునేందుకు త్వరగా వెళ్లగా, సమాధానం తప్పుగా చెప్పినప్పుడు మెల్లగా వెళ్లేవి. సమాధానం సరైనదని అనిపించినప్పుడు అవి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించాయి. దీన్ని బట్టి అవి కూడా మనుషుల్లాగే తాము చేసేది సరైనదైతే ఆత్మవిశ్వాసంతో ఉంటాయని రుజువైంది. -
‘ఎబోలా’పై అప్రమత్తం
సాక్షి, ముంబై : ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ డిసీజ్ (ఈవీడీ)పై బీఎంసీ అప్రమత్తమైంది. అసాధారణమైన ఈ వ్యాధి ఆఫ్రికాలోప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఇటీవల ప్రకటించడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందుకు అవసరమైన చర్యలు తీసుకొంటోంది. వైరస్ను ఎదుర్కోవడానికి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఒక వేళ ఈ వైరస్ను నగరంలో గుర్తిస్తే తీసుకోవాల్సిన చర్యలపై బీఎంసీ కసరత్తు చేస్తోంది. ఎయిర్పోర్టు అధికారులకు అవగాహన అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రయాణికులు ఎవరైనా ఈ వైరస్ను మోసుకొస్తున్నారా అనే అంశంపై కూడా బీకేసీ ఆరోగ్య విభాగం ఆరా తీస్తోంది. ఎయిర్ పోర్టులోని అతి ముఖ్యమైన విభాగాలకుఈవైరస్పై సంబంధిత అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఈ వైరస్ సోకిన వారిని సున్నితంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని వివరిస్తారు. వెస్ట్ ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల కాలంలో ఎంత మంది ప్రయాణికులు వచ్చారో, వారి వివరాలను అందజేయాలని బీఎంసీ ఎయిర్ పోర్ట్ అధికారులకు లేఖ రాసింది. 20 రోజులల్లోపు ఇక్కడికి వచ్చిన ప్రయాణికుల వివరాలను అందజేయాలని కోరింది. ఈ ప్రయాణికులకు వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అని పరీక్షించనున్నారు. వ్యాధి సోకితే వీరికి చికిత్స కూడా నిర్వహించనున్నారు. గుర్తించిన ఆస్పత్రులు కేం, సైన్, బీవైఎల్ నైర్ ఆస్పత్రి వైద్య సిబ్బందికి... ఈ వైరస్ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వ్యాధి బాధితులకు చికిత్స అందజేయడానికి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కొత్త జోగేశ్వరి ట్రామా ఆస్పత్రి, చించ్పోక్లీలోని కస్తూర్బా ఆస్పత్రులను కార్పొరేషన్ గుర్తించింది. ఈ వ్యాధి అనుమానితులను జోగేశ్వరి ఆస్పత్రికి తరలిస్తారు, వ్యాధి నిర్ధాణ అయిన కేసులను కస్తూర్బా ఆస్పత్రికి తరలించనున్నట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఏవీడీ కోసం 10 బెడ్లను రిజర్వ్ చేసి ఉంచామన్నారు. ఆందోళన అవసరం లేదు: డాక్టర్ పద్మజ ఎబోలా వైరస్ పట్ల నగరానికి ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని కార్పొరేషన్ ప్రకటించింది. నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఎంసీ ఎగ్జిక్యూటివ్ వైద్యాధికారి డాక్టర్ పద్మజ కేత్కర్ పేర్కొన్నారు. ఈ వైరస్ను ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా తగు చర్యలు తీసుకొంటున్నారన్నారు. ముంబైలో కూడా మందస్తు చర్యలు తీసుకొంటున్నామని వెల్లడించారు. సమీప రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు నమోదుకాలేదన్నారు. -
ఇమ్మని దేవుణ్ణి అడగొచ్చా?
దైవికం ప్రార్థించడం అంటే ‘అడగడం’ కాదంటారు మహాత్మాగాంధీ. దైవ సన్నిధి కోసం ఆత్మ తపించాలట. మన బలహీనతల్ని ఎప్పటికప్పుడు అంగీకరించాలట. హృదయానికి తప్ప మాటలకు తావు ఉండకూడదట. అదే అసలైనపార్థన అంటారు బాపూజీ. ప్రపంచంలో నిత్యం కోట్ల మంది దేనికో ఒకదాని కోసం భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు. ‘విన్నపాలు వినవలె వింత వింతలూ’ అని అన్నమయ్య పాడారు కదా, అలా ఆ వేడుకోళ్లలో కొన్ని ప్రార్థనలు ఉంటాయి. కొన్ని బెదిరింపులు ఉంటాయి. కొన్ని బ్లాక్మెయిల్స్ ఉంటాయి. కొన్ని అలకలు ఉంటాయి! ఇలా ఒక మనిషి ఇంకో మనిషితో ఎన్ని రకాలైన భావోద్వేగాలతో ఉండగలరో అన్ని రకాల భావోద్వేగాలనూ దేవుడి ముందు ప్రదర్శిస్తుంటారు మానవులు. కొందరు కేవలం ధన్యవాదాలు అర్పిస్తుంటారు. కొందరు కృతజ్ఞతలు చెల్లించి ఊరుకుంటారు... దేవుణ్ని అసలేమీ అడక్కుండా. అలాంటి వాళ్లు తక్కువ. శివలాల్ యాదవ్ అనే ఆయన ఈమధ్య దేవుణ్ణి ప్రార్థించాడు. ఎక్కడా? తన పూజగదిలో కాదు. బి.సి.సి.ఐ. (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తనని సన్మానిస్తుంటే... ఆ సభలో ప్రార్థించాడు. ఏమని? తన నుంచి ఈ పదవి మళ్లీ పూర్వపు అధ్యక్షుడైన ఎన్.శ్రీనివాసన్కి వెళ్లిపోవాలని! క్రికెటర్లకు శ్రీనివాసన్ చేసినన్ని మేళ్లు మరే ఇతర అధ్యక్షుడూ చేయలేదు కాబట్టి తిరిగి ఆయనకే ఈ పదవి వచ్చేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు శివలాల్ యాదవ్ ప్రకటించారు! ఇంకొకాయన ప్రహ్లాద్ శర్మ. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంటాడు. సామూహిక ప్రార్థనలు జరిపి, యజ్ఞాలు నిర్వహించి, రెండు జర్మన్ షెప్పర్డ్ శునకాలకు పెళ్లి చేసినప్పటికీ, చుక్క వర్షమైనా పడకపోవడంతో ఆయనకు వరుణ దేవుడి మీద కోపం వచ్చింది. దేవుడికి అంత్యసందేశం (అల్టిమేటమ్) ఇచ్చేశాడు. వారంలోపు వర్షం కురిసిందా సరి, లేదంటే నిరాహార దీక్ష చేస్తానని పోస్టర్లు వేయించి మరీ గోడలకు అంటించాడు! ‘‘భూమ్మీది జీవుల్ని కాపాడడం దేవుడి బాధ్యత. ప్రాణాధారమైన నీటిని లేకుండా చేస్తే ఎలా? రైతులు అల్లాడిపోతున్నారు. ఆ మాత్రం తెలియదా? దేవుడే తలచుకుంటే ఈ క్షణంలో కుంభవృష్టి కురియదా?’’ అని శర్మగారి వాదన. ప్రార్థన స్థాయిని కూడా దాటిపోయి, దేవుడి తరఫున దైవదూతగా మాట్లాడే మామూలు మానవులు కూడా కొందరు ఉన్నారు! బెన్నీ పున్నతర నే తీసుకోండి. కేరళలోని కోళికోడ్ నుంచి వెలువడే ‘సండే షాలొమ్’ పత్రికకు ఆయన సంపాదకులు. ‘మోడీ ప్రధానిగా గెలవడం అన్నది దైవనిర్ణయం’ అని బెన్నీ తన తాజా సంపాదకీయంలో రాశారు! రాసి, అక్కడితో ఊరుకోలేదు. ‘‘ఈ ప్రపంచంలో జరిగేవేవీ దేవుడికి తెలియకుండా జరగవు. దేవుడే మోడీని తన సేవకునిగా ఎన్నుకున్నాడు కాబట్టి భక్తిపరులైన ప్రతి ఒక్కరూ మోడీని సమర్థించాలి. అలా చేయకపోతే దైవ సంకల్పాన్ని ధిక్కరించినట్లవుతుంది. ఎన్నికలకు ముందు బహుశా భారతీయులంతా మోడీని ప్రధానిని చేయమని దేవుణ్ని ప్రార్థించినట్లున్నారు. ఆ ప్రార్థన ఫలించి, దేవుడు ప్రజలను కనికరించి, కాంగ్రెస్ను ఓడించి, మోడీని అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టాడు’’ అని విశ్లేషించారు. నువ్వే దేవుడివైతే ఎన్.శ్రీనివాసన్ని మళ్లీ బి.సి.సి.ఐ. అధ్యక్షుడిని చెయ్యమని దేవుణ్ని అడగడం, నువ్వు దేవుడివి కాకపోబట్టే కదా ఇండోర్లోని పొలాలన్నీ ఎండిపోతున్నాయని దేవుణ్ని అనడం, నువ్వు దేవుడివి కాబట్టే మోడీని గెలిపించావని అనుకోవడం... ఇవన్నీ దేవుణ్ని ప్రార్థించడం కాదు. దేవుణ్ని క్రికెట్లోకి, రుతుపవనాల్లోకి, రాజకీయాల్లోకి లాగడం. అంటే దేవుణ్ని మానవమాత్రులలోకి లాగేయడం! ప్రార్థించడం అంటే ‘అడగడం’ కాదంటారు మహాత్మాగాంధీ. దైవ సన్నిధి కోసం ఆత్మ తపించాలట. మన బలహీనతల్ని ఎప్పటికప్పుడు అంగీకరించాలట. హృదయానికి తప్ప మాటలకు తావు ఉండకూడదట. అదే అసలైన ప్రార్థన అంటారు బాపూజీ. మరి దేవుణ్ని అడక్కుంటే కష్టాలు తీరేదెలా? అడుగుదాం. కానీ కష్టాలు తీర్చమని కాదు. కష్టాలను ఓర్చుకునే శక్తిని ఇమ్మని అడుగుదాం. - మాధవ్ శింగరాజు -
ఎడతెగని నిరీక్షణ..
బియాస్ దుర్ఘటన జరిగి నేటికి నెల ఇంకా తీరని వేదన.. ఆగని రోదన గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు మరణించిన విద్యార్థుల ఇళ్ల వద్ద తొలగని విషాద ఛాయలు సాక్షి, సిటీబ్యూరో/నల్లకుంట/జగద్గిరిగుట్ట: బియాస్ ఘటన జరిగిన నేటికి సరిగ్గా నెల.. అయినా ఇంకా తీరని వేదన.. ఆగని రోదన.. ఈ ఘటనలో నగరానికి చెందిన 16 మంది విద్యార్థులు మరణించారు. గల్లంతైన వారిలో మరో ముగ్గురి ఆచూకీ లేకుండా పోయింది. గల్లంతైన విద్యార్థులు శ్రీనిధి (కరీంనగర్), రిషితారెడ్డి (బాచుపల్లి), కల్లూరి శ్రీహర్ష (నల్లకుంట) కోసం కన్నవారు కళ్లలో వేయి వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. నిద్రాహారాలు మాని తమ వారి కోసం ఎడతెగని నిరీక్షణతో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇక దుర్ఘటనలో మృత్యువాత పడిన 16 మంది నగర విద్యార్థుల ఇళ్ల వద్ద కూడా ఇంకా విషాదఛాయలు తొలిగిపోలేదు. బంధుమిత్రుల పరామర్శలతో, ఆత్మీయుల పలకరింపులతో నేటికీ ఉద్విగ్నవాతావరణం నెలకొంది. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలలో సెలవుల అనంతరం సోమవారం తరగతులు పునఃప్రారంభమయ్యాయి. తోటి విద్యార్థులను కోల్పోయి షాక్కు గురైన పలువురు విద్యార్థులు భారంగా కాలేజీకి వచ్చారు. మొన్నటివరకు తమ మిత్రులతో కళాశాల ఆవరణలో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో కళాశాల వాతావరణం ఉద్విగ్నంగా మారింది. కళాశాల వద్ద విషాద ఛాయలు దుర్ఘటన జరిగి నెలైనా వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ విద్యార్థులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభమైన బాచుపల్లిలోని కళాశాల ప్రాంగణంలో ఉద్విగ్నత నెలకొంది. నదీ ప్రవాహంలో 24 మంది విద్యార్థులు గల్లంతు కాగా వారిలో 21 మంది మృత్యువాతపడడం, మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో తోటి విద్యార్థులు తీవ్రంగా కలత చెందారు. తమ తోటి వారితో గడిపిన స్మృతులను, కళాశాల ప్రాంగణంలో వారితో కలిసి మెలిసి గడిపిన సంఘటనలను గుర్తుచేసుకొని తల్లడిల్లారు. ప్రతి విద్యార్థి ముఖంలోనూ విషాద ఛాయలే కనిపించాయి. కళాశాల ఆవరణలో విద్యార్థులతోపాటు, సిబ్బంది, ఫ్యాకల్టీలు మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కాలేజీకి సెలవు ప్రకటించడంతో విద్యార్థులు బరువెక్కిన హృదయాలతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. పరిహారంపై సర్కార్ల నిర్లక్ష్యం.. దుర్ఘటనలో మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలకు హిమాచల్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి. కానీ ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ఏ ఒక్క ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదని బాధితుడు సంజయ్కుమార్ (మిట్టపల్లి అఖిల్ తండ్రి) ‘సాక్షి’కి తెలిపారు. విద్యారుణాలను మాఫీ చేస్తామని, కళాశాలకు చెల్లించిన ఫీజులను తిరిగి తల్లిదండ్రులకు ఇస్తామన్న వాగ్దానాలు సైతం మాటలకే పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన నగర విద్యార్థులు వీరే.. బియాస్ నదిలో గల్లంతైన వారిలో 16 మంది నగర విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వీరిలో విజేత, లక్ష్మీగాయత్రి, ఐశ్వర్య, రాంబాబు, దేవాశీష్బోస్, సాబేర్ హుస్సేన్, అరవింద్, పరమేశ్వర్, పి.వెంకటదుర్గ తరుణ్, అశీష్మంతా, మాచర్ల అఖిల్, శివప్రకాశ్వర్మ, సాయిరాజ్, బైరినేని రిత్విక్, కిరణ్కుమార్, మిట్టపల్లి అఖిల్ ఉన్నారు. రిషితా ఎక్కడున్నావమ్మా... కూతురు రిషితారెడ్డి జాడ తెలియక తల్లి మంచం దిగడంలేదు. చెల్లెలి కోసం చెమ్మగిల్లిన కళ్లతో అన్న.. ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో నేను కొట్టుమిట్టాడుతున్నాం. కూతురి జాడ కోసం నెల రోజులుగా ఎదురు చూస్తున్నాం. హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హెల్ప్లైన్ నంబర్లకు నిత్యం ఫోన్చేసి సమాచారం తెలుసుకుంటున్నాం. ప్రాణాలతో వస్తుందనే ఆశతోనే బతుకుతున్నాం. దుర్ఘటనకుకాలేజీ యాజమాన్యమే కారణం. విద్యార్థులను స్టడీ టూర్కి తీసుకెళ్లిన కళాశాల యాజమాన్యంతోపాటు ఫ్యాకల్టీలు అడుగడుగునానిర్లక్ష్యంగా వ్యవహరించారు. - కృష్ణారెడ్డి (గల్లంతైన రిషితారెడ్డి తండ్రి) శ్రీహర్ష కోసం వేయికళ్లతో.. బియాస్ నదిలో గల్లంతైన కల్లూరి శ్రీహర్ష (19) కోసం తల్లిదండ్రులు కేఆర్కేబీ ప్రసాద్, స్వర్ణలతలు కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఎప్పటికైనా తమవాడు తిరిగివస్తాడన్న ఆశతో జీవిస్తున్నారు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మకుంట సబ్స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో (ఇంటి నంబర్ 2-2-1118/ఏ) వారు నివాసముంటున్నారు. కేఆర్కేబీ ప్రసాద్ వృత్తిరీత్యా అడ్వకేట్. జూన్ 3న వీఎన్ఆర్ కళాశాల నుంచి హిమాచల్ప్రదేశ్ స్టడీ టూర్కు వెళ్లిన వారిలో ప్రసాద్ కుమారుడు శ్రీహర్ష కూడా ఉన్నాడు. అదే నెల 8న స్నేహితులతో కలిసి ఫొటోలు దిగుతూ బియాస్ నదిలో గల్లంతైన విషయం విదితమే. నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఆచూకీ లభించలేదు. తమ కుమారుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని, ఏదో ఒక రోజు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని శ్రీహర్ష తల్లిదండ్రులు ఆశతో కుమారుని కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తుండడం అందరినీ కలచివేస్తోంది. కుటుంబ సభ్యులతోపాటు బందువులు, స్నేహితులు శ్రీహర్ష జాడకోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. చాలా బాధగా ఉంది... బియాస్ ఘటన దురదృష్టకరం. ఇంత మంది మృతి చెందడం ఎంతో బాధకలిగించింది. కాలేజీలోని ప్రతి విద్యార్థి ఇప్పటికి ఈ షాక్ నుంచి తేరుకోలేక పోతున్నారు. - రాజేశ్, ఎంటెక్, ఫస్ట్ ఇయర్ ఎక్కడ చూసినా అదే చర్చ.. ఈ రోజు కాలేజీకి రాగానే బియాస్ ఘటననే గుర్తుచేసుకున్నాం. మరణించిన విద్యార్థులను తలచుకుంటేనే ఎంతో ఆవేదన కలుగుతోంది. వారి తల్లిదండ్రులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలి. - రామ్, ఎంటెక్, ఫస్ట్ ఇయర్ తలచుకుంటేనే భయంగా ఉంది.. మా తోటి విద్యార్థులు నది ప్రవాహంలో కొట్టుకుపోవడం.. ఆపై మరణించడం తలచుకుంటేనే భయంగా ఉంది. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. - రఘువీర్, బిటెక్, తృతీయ సంవత్సరం మరువలేని చేదు జ్ఞాపకం... బియాస్ నదిలో మా స్నేహితులను కోల్పోవడం జీవితంలో ఓ చేదు జ్ఞాపకం. ఈ దురదృష్టకర సంఘటన నిజం కాకుంటే బాగుండు అనిపించింది. - చైతన్య, బిటెక్, తృతీయ సంవత్సరం -
కుక్కలూ మనలాగే ఆలోచిస్తాయి!
లండన్: కుక్కలు మనిషికి విశ్వాసపాత్రమైన నేస్తాల్లా ఎందుకుంటాయి? అవి మనుషుల మాటలను అర్థంచేసుకుంటూ వారి భావోద్వేగాలకు అనుగుణంగా ఎలా మసలుకుంటాయి? మనలాగే ఆలోచిస్తాయి కాబట్టి.. అంటున్నారు హంగేరియన్ శాస్త్రవేత్తలు. అవును.. కుక్కల మెదడులో ధ్వనులు, మాటలను విశ్లేషించే భాగం మనిషి మెదడులోని భాగం మాదిరిగానే ఉంటుందని వారు వెల్లడించారు. మనిషితోపాటు ఇతర ప్రైమేట్స్ (కోతిజాతి)లలో మెదడు దాదాపు ఒకేలా ఉంటుంది. అయితే కుక్కల్లో కూడా ధ్వనిని విశ్లేషించే భాగం మనిషిని పోలి ఉందని, అందుకే అవి 30 వేల ఏళ్లుగా మనిషిని అర్థం చేసుకుంటూ బెస్ట్ఫ్రెండ్స్గా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిశోధనలో భాగంగా.. 11 కుక్కలకు మనుషులు, కుక్కలు చేసే 200 రకాల శబ్దాలను వినిపిస్తూ ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఇందులో సంతోషం, బాధ, అరుపు, ఏడుపు, ఇతర ధ్వనులూ వినిపించారు. దీంతో వాటి మెదడులో ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్ భాగం మనుషుల్లో మాదిరిగానే స్పందిస్తోందని తేలింది. మనుషులు ఇతర మనుషుల శబ్దాలకు, కుక్కలు ఇతర కుక్కల శబ్దాల కే.. ముఖ్యంగా సంతోషకరమైన శబ్దాలకే ఎక్కువగా స్పందించడం విశేషం. అన్న ట్టూ.. ఆహారం ఇచ్చినందుకే కాకుండా.. ఇతర అంశాలను బట్టి కూడా యజమానులను కుక్కలు ప్రేమిస్తాయని, అనురాగంతో బంధాలు ఏర్పర్చుకుంటాయని ఇటీవల జార్జియా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. కుక్కల మెదడులో సానుకూల భావోద్వేగాలకు సంబంధించిన భాగం మనుషుల మాదిరిగానే స్పందిస్తోందని వారు తేల్చారు కూడా.