Indian women cricket team
-
ఐసీసీ మహిళల వన్డే జట్టులో స్మృతి, దీప్తి
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’ జట్టులో ఇద్దరు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన, స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఈ టీమ్లో స్థానం సంపాదించారు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గాకాగా స్మృతి మంధాన 2024లో 13 వన్డేలు ఆడి 747 పరుగులు చేసింది. తద్వారా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో వరుసగా రెండు శతకాలు బాదిన ఆమె న్యూజిలాండ్పై కూడా ఒక సెంచరీ చేసింది.24 వికెట్లు పడగొట్టిఇక 2024లో 13 వన్డేలాడిన దీప్తి శర్మ 186 పరుగులు చేయడంతో పాటు... 24 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ జట్టుకు దక్షిణాఫ్రికా స్టార్ లౌరా వాల్వర్ట్ సారథిగా ఎంపికైంది.మరోవైపు.. ఇంగ్లండ్ నుంచి అమీ జోన్స్, సోఫీ ఎకెల్స్టోన్, కేట్ క్రాస్ రూపంలో ముగ్గురు ప్లేయర్లు, ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్నర్, అనాబెల్ సథర్లాండ్ చోటు దక్కించుకున్నారు. సఫారీ ప్లేయర్ మరీనే కాప్తో పాటు శ్రీలంక నుంచి చమరి ఆటపట్టు, వెస్టిండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ కూడా ఈ టీమ్కు ఎంపికయ్యారు.ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024స్మృతి మంధాన, లారా వాల్వర్ట్(కెప్టెన్), చమరి ఆటపట్టు, హేలీ మాథ్యూస్, మరీనే కాప్, ఆష్లే గార్డ్నర్, అనాబెల్ సథర్లాండ్, అమీ జోన్స్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లిస్టోన్, కేట్ క్రాస్. మరిన్ని క్రీడా వార్తలుఫైనల్లో సూర్మా క్లబ్ రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్ తొలి టోర్నమెంట్లో జేఎస్డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సూర్మా క్లబ్ జట్టు 4–2 గోల్స్ తేడాతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టును ఓడించింది. సూర్మా క్లబ్ తరఫున ఎంగెల్బెర్ట్ (1, 17వ, 47వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేయగా... హినా బానో (9వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది.బెంగాల్ టైగర్స్ తరఫున కెప్టెన్ వందన కటారియా (48వ నిమిషంలో), శిల్పి దబాస్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నాలుగు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక సూర్మా క్లబ్ 13 పాయింట్లతో... ఒడిశా వారియర్స్ జట్టు 11 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్కు చేరుకున్నాయి. ఈనెల 26న జరిగే ఫైనల్లో సూర్మా క్లబ్, ఒడిశా వారియర్స్ టైటిల్ కోసం తలపడతాయి. శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు నాలుగో ఓటమిసాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టుకు నాలుగో ఓటమి ఎదురైంది. బెంగళూరులో శుక్రవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి జట్టు 0–1 గోల్ తేడాతో స్పోర్టింగ్ క్లబ్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిపోయింది.ఆట 34వ నిమిషంలో ఆసిఫ్ గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన స్పోర్టింగ్ జట్టు ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో శ్రీనిధి జట్టు 9 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. 3 మ్యాచ్ల్లో గెలిచి, 2 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, 4 మ్యాచ్ల్లో ఓడిన శ్రీనిధి జట్టు 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 28న హైదరాబాద్లో జరిగే తదుపరి మ్యాచ్ లో నాంధారి జట్టుతో శ్రీనిధి జట్టు ఆడుతుంది. -
స్మృతి సారథ్యంలో...
న్యూఢిల్లీ: ఐర్లాండ్తో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్కు స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరిస్తుంది. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. వెస్టిండీస్తో ఇటీవల జరిగిన టి20 సిరీస్లో చివరి రెండు మ్యాచ్లకు స్మృతినే కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించింది. విండీస్తో వన్డే పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పేస్ బౌలర్ రేణుకా సింగ్కు కూడా విరామం ఇచ్చారు. విండీస్తో సిరీస్లో అరంగేట్రం చేసిన ప్రతీక, తనూజ తమ స్థానాలను నిలబెట్టుకోగా... రాఘ్వీ బిస్త్కు తొలిసారి వన్డే టీమ్ పిలుపు దక్కింది. భారత వన్డే టీమ్లోకి ఎంపికైనా మ్యాచ్ ఆడని సయాలీ సత్ఘరేకు మరో అవకాశం దక్కింది. మరోవైపు ఇప్పటికే స్థానం కోల్పోయిన షఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్లపై మాత్రం సెలక్టర్లు ఇంకా విశ్వాసం ఉంచలేదు. రాజ్కోట్లో ఈ నెల 10, 12, 15 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇప్పటి వరకు భారత్, ఐర్లాండ్ మధ్య 12 వన్డేలు జరగ్గా...అన్నీ భారత్ గెలిచింది. జట్టు వివరాలు: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రి, రిచా ఘోష్, తేజల్ హసబ్నిస్, రాఘ్వీ బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజ కన్వర్, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, సయాలీ సత్ఘరే. -
వడోదరలో జరిగిన పోరులో అదరగొట్టిన భారత మహిళల జట్టు
-
విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం
భారత క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. తద్వారా ప్రపంచ రికార్డును రిచా సమం చేసింది. కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్లు ఆడేందుకు వెస్టిండీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.నవీ ముంబైలోఈ క్రమంలో నవీ ముంబై వేదికగా టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆదివారం నాటి తొలి మ్యాచ్లో భారత్, రెండో టీ20లో విండీస్ జట్లు గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. గురువారం నాటి మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక కీలక మ్యాచ్లో భారత మహిళా జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.స్మృతి ధనాధన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రికార్డు స్థాయిలో 217 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్ధ శతకంతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31*) ఫర్వాలేదనిపించారు.రిచా ర్యాంపేజ్.. వరల్డ్ రికార్డు సమంఅయితే, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ రాగానే.. ఒక్కసారిగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న రిచా.. మహిళల టీ20 క్రికెట్లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును సమం చేసింది. అంతకు ముందు సోఫీ డివైన్, లిచ్ఫీల్డ్ ఈ ఘనత సాధించగా.. రిచా వారి వరల్డ్ రికార్డును సమం చేసింది. అయితే, అలియా అలెన్ బౌలింగ్లో చినెల్లె హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు)కు తెరపడింది.రాధా యాదవ్ దూకుడుఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్కు భారత బౌలర్లుకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.వీరంతా కలిసి తమ అద్భుత బౌలింగ్తో వెస్టిండీస్ను 157 పరుగులకే కట్టడి చేయడంతో.. భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. రిచా ఘోష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ A 60-run victory in the Third and Final T20I! 🥳#TeamIndia win the decider in style and complete a 2⃣-1⃣ series victory 👏👏Scorecard ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/SOPTWMPB3E— BCCI Women (@BCCIWomen) December 19, 2024 -
Ind vs WI: సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు.. రెండో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టీ20లో గెలిస్తే ఈ సిరీస్ హర్మన్ప్రీత్ కౌర్ బృందం ఖాతాలో చేరుతుంది. మరోవైపు గత మ్యాచ్లో ఓటమి నుంచి కోలుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని విండీస్ మహిళలు భావిస్తున్నారు.ఇక ముంబై వేదికగా తొలి టీ20లో భారత బ్యాటర్లంతా రాణించడం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. ఓపెనర్ స్మృతి మంధాన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత స్వదేశంలో దక్కిన ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఫీల్డింగ్లో టీమ్ కాస్త పేలవ ప్రదర్శన కనబర్చింది.తొలి మ్యాచ్లో భారత ఫీల్డర్లు మూడు సునాయాస క్యాచ్లు వదిలేశారు. బౌలింగ్లో దీప్తి శర్మ చక్కటి బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... టిటాస్ సాధు వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ కూడా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లోపాలు ఉన్నా... బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టి ప్రదర్శనతో చెలరేగితే మరో విజయం కష్టం కాబోదు.మరోవైపు వెస్టిండీస్ కూడా బ్యాటింగ్లో బలంగానే ఉంది. ముఖ్యంగా డియాండ్రా డాటిన్ గత మ్యాచ్ తరహాలోనే ధాటిగా ఆడగల సమర్థురాలు. ఖియానా జోసెఫ్ కూడా తొలి టీ20లో రాణించింది. వీరితో పాటు కెప్టెన్, ఓపెనర్ హేలీ మాథ్యూస్ కూడా తన స్థాయికి తగినట్లు ఆడితే విండీస్ బలం పెరుగుతుంది. -
Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్ పేసర్పై వేటు
వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఎంపికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ పేసర్ అరుంధతీ రెడ్డిపై సెలక్షన్ కమిటీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.అరుంధతీ రెడ్డిపై వేటు.. కారణం?కాగా సొంతగడ్డపై భారత్ వెస్టిండీస్ మహిళల జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన అరుంధతీ రెడ్డిని తప్పించారు. రెండు ఫార్మాట్లలోనూ ఆమెకు ఉద్వాసన పలకడం గమనార్హం. నిజానికి జట్టులో చోటు కోల్పోయేంత పేలవంగా ఆమె ప్రదర్శన అయితే లేదు. కుదురుగా బౌలింగ్ చేస్తున్న ఆమె వికెట్లు లేదంటే పరుగుల కట్టడితో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ వేటు వేయడం గమనార్హం.వారిద్దరికి తొలిసారి చోటుఇక విండీస్ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటిచ్చారు. ప్రతిక రావల్, తనూజ కన్వర్లను తొలిసారి వన్డే జట్టులోకి తీసుకోగా... నందిని కశ్యప్, రాఘవి బిస్త్లను తొలిసారి టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఈ రెండు జట్లకు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌరే సారథ్యం వహించనుంది.టీ20 సిరీస్తో ఆరంభంముందుగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ నెల 15, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్లు నిర్వహిస్తారు. అనంతరం వడోదరలో ఈ నెల 22, 24, 27 తేదీల్లో మూడే వన్డేల సిరీస్ జరుగుతుంది.ఇక ఈ రెండు సిరీస్లకు షఫాలీ వర్మను కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్కు ఫామ్లో లేని షఫాలీకి ఉద్వాసన పలికారు. గాయాల కారణంగా యస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పూనియాలను సెలక్షన్కు పరిగణించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. వెస్టిండీస్తో టీ20 సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, సజన సజీవన్, రాఘవి బిస్త్, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్.వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, తేజల్ హసబ్నిస్, ప్రతిక రావల్, తనూజ కన్వర్. చదవండి: భారత్తో టీ20, వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్రౌండర్ మిస్ -
ఆసీస్తో వన్డే సిరీస్.. భారత క్రికెట్ జట్టుకు మరో షాక్
భారత మహిళల క్రికెట్ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో వైట్వాష్కు గురైన హర్మన్ సేనకు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గట్టి షాకిచ్చింది. ఆసీస్తో బ్రిస్బేన్లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్లో ఓవర్రేట్కు పాల్పడటంతో ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో కోత పడింది. నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేయడంతో ఓవర్కు 5 చొప్పున... భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు రెఫరీ డేవిడ్ గిల్బర్ట్ వెల్లడించాడు.విచారణ లేకుండా నేరుగాఐసీసీ నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం జరిమానా విధించినట్లు పేర్కొన్నాడు. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తప్పు అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా నేరుగా కోత విధించినట్లు తెలిపాడు. కాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ 3-0తో క్వీన్స్వీప్నకు గురైన విషయం తెలిసిందే.మూడో వన్డేలో స్మృతి ‘శత’క్కొట్టినా...పెర్త్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్ ప్లేయర్లలో అనాబెల్ సదర్లాండ్ (95 బంతుల్లో 110; 9 ఫోర్లు, 4 సిక్స్లు) శతకంతో చెలరేగగా... కెప్టెన్ తాలియా మెక్గ్రాత్ (56 నాటౌట్; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (50; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు.ఒకదశలో 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ను అనాబెల్ తన అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకుంది. మొదట గార్డ్నర్తో ఐదో వికెట్కు 96 పరుగులు జోడించిన అనాబెల్... ఆ తర్వాత తాలియాతో ఆరో వికెట్కు 95 బంతుల్లో 122 పరుగులు జతచేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీయగా... దీప్తి శర్మ ఒక వికెట్ దక్కించుకుంది.ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (109 బంతుల్లో 105; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు నుంచి ఆమెకు ఎటువంటి సరైన సహకారం లభించలేదు. ఒక్క హర్లీన్ డియోల్ (39; 4 ఫోర్లు) మినహా మిగతా వాళ్లు విఫలమయ్యారు.అండగా హర్లీన్ డియోల్స్మృతి–హర్లీన్ రెండో వికెట్కు 118 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేసినా... తర్వాత వచ్చిన వాళ్లు అదే జోరును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ (12), రిచా ఘోష్ (2), జెమీమా రోడ్రిగ్స్ (16), దీప్తి శర్మ (0), మిన్ను మణి (8) విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ కాగా.. కంగారూ జట్టు 83 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 5 వికెట్లు తీయగా... మేగన్ షుట్, అలానా కింగ్ రెండేసి వికెట్లు తీశారు. ఇక ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన అనాబెల్ సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్..
న్యూజిలాండ్ మహిళలతో మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో 59 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అమ్మాయిలు 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటయ్యారు.టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. అరంగేట్ర బౌలర్ సైమా ఠాకూర్ రెండు, దీప్తీ శర్మ, అరుంధతి రెడ్డి తలా వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో బ్రూక్ హాలీడే(39) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది.ఆఖరిలో అమీలియా కేర్(25) పోరాడినప్పటకి, సహచర ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో ఆమె ఆజేయంగా ఉండిపోయింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా బ్యాటర్లలో అరంగేట్ర ప్లేయర్ తేజల్ హసబ్నిస్(42) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. దీప్తీ శర్మ(41), యస్తికా భాటియా(37), షఫాలీ వర్మ(33) రాణించారు. ఇక కివీస్ బౌలర్లలో అమీలియా కేర్ 4 వికెట్లు సత్తాచాటగా.. జేస్ కేర్ 3 వికెట్లు సాధించింది. కాగా ఈ మ్యాచ్కు భారత రెగ్యూలర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దూరం కావడంతో నాయకత్వ బాధ్యతలను స్మృతి మంధాన చేపట్టింది.చదవండి: IND vs NZ: వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
పాకిస్తాన్తో మ్యాచ్.. భారత జట్టులో కీలక మార్పు!?
మహిళల టీ20 వరల్డ్ కప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది. దాయాదుల పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కాగా తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాభావం పొందిన భారత జట్టు.. పాక్పై గెలిచి తిరిగి కమ్బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. అదేవిధంగా హర్మాన్ సేన తమ సేవలను సజీవంగా ఉంచుకోవాలంటే పాక్పై కచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో పాక్తో మ్యాచ్లో భారత తుది జట్టులో ఓ కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తోందిరాధా యాదవ్ ఎంట్రీ..న్యూజిలాండ్తో మ్యాచ్కు బెంచ్కే పరిమితమైన స్పిన్న్ రాధా యాదవ్.. పాక్తో మ్యాచ్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ పిచ్ స్పిన్ అనుకూలించే ఛాన్స్ ఉన్నందున అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ అరుంధతి రెడ్డి స్ధానంలో రాధా తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ శ్రీలంకపై ఆడిన జట్టునే కొనసాగించే ఛాన్స్ ఉంది.పాక్తో మ్యాచ్కు భారత తుది జట్టుషఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రేణుకా ఠాకూర్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, ఆశా శోబన. -
ఏకైక టెస్టు.. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
భారత మహిళల ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా పర్యటను ఓటమితో ముగించింది. గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్లో 45 పరుగుల తేడాతో ఆసీస్తో చేతిలో భారత్ ఓటమి పాలైంది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 243 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బ్యాటర్లలో ఉమన్ ఛెత్రి 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియా పునియా(36), శుభా సతీష్(45) పరుగులతో తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫ్లింటాఫ్, నాట్ తలా మూడు వికెట్టు పడగొట్టారు. అంతకుముందు ఆ్రస్టేలియా ‘ఎ’ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 92 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌటైంది. మ్యాడీ డార్క్ (197 బంతుల్లో 105 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. డి బ్రోగే(58) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో మిన్నుమణి 6 వికెట్లు తీయగా, సయాలీ, ప్రియా మిశ్రా చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 28 పరుగులు కలుపుకొని భారత్ ముందు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమైంది. -
చరిత్ర సృష్టించిన 'లేడీ ధోని'.. ఆల్టైమ్ రికార్డు బద్దలు
భారత మహిళ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల ఆసియాకప్లో అత్యధిక స్టంపౌట్లు చేసిన భారత వికెట్ కీపర్గా రిచా ఘోష్ రికార్డులకెక్కింది. మహిళల ఆసియాకప్-2024లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్లో రీతూ మూనీని స్టంపౌట్ చేసిన రిచా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది.రిచా ఆసియాకప్లో ఇప్పటివరకు ఏడు స్టంప్లు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ తానియా భాటియా(6) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బాటియా ఆల్టైమ్ రికార్డును రిచా బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేధించింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన(55 పరుగులు), షఫాలీ వర్మ 26 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో శ్రీలంక లేదా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. pic.twitter.com/zkbz9CR5ub— hiri_azam (@HiriAzam) July 26, 2024 -
దక్షిణాఫ్రికా ఓపెనర్ విధ్వంసం.. భారత్ టార్గెట్ ఎంతంటే?
చెపాక్ స్టేడియం వేదికగా భారత మహిళలతో జరుగుతున్న తొలి టీ20లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. మొదట ఆచితూచి ఆడిన బ్రిట్స్.. మిడిల్ ఓవర్లలో తన విశ్వరూపం చూపించింది. 56 బంతులు ఎదుర్కొన్న బ్రిట్స్ 10 ఫోర్లు, 3 సిక్స్లతో 81 పరుగులు చేసింది.ఆమెతో పాటు మారిజన్నే కాప్(57) హాఫ్ సెంచరీతో మెరిసింది. ఇక భారత బౌలర్లలో పుజావస్త్రాకర్, రాధా యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. మిగితా భారత బౌలర్లంతా విఫలమయ్యారు. కాగా ఇంతకముందు జరిగిన వన్డే, టెస్టు సిరీస్లను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్లో టీమిండియా బోణీ కొట్టింది. బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ వెళ్లింది. 266 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్లు దాటికి 37.4 ఓవర్లలో కేవలం 122 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్లలో ఆశా శోభన 4 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా.. దీప్తీ శర్మ రెండు, పూజా, రేణుకా సింగ్, తలా వికెట్ పడగొట్టారు. ప్రోటీస్ బ్యాటర్లలో సునీ లూస్(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్ సాధించింది.టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది.ఈ మ్యాచ్లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 117 పరుగులు చేసింది. స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్(31 నాటౌట్) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్ రెండు, డెకరసన్, మల్బా, షాంగసే తలా వికెట్ సాధించారు. -
సెంచరీతో చెలరేగిన మంధాన.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్
చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ను మంధాన తన విరోచిత సెంచరీతో ఆదుకుంది. ఈ మ్యాచ్లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 117 పరుగులు చేసింది. స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్(31 నాటౌట్) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్ రెండు, డెకరసన్, మల్బా, షాంగసే తలా వికెట్ సాధించారు.మంధాన అరుదైన రికార్డుఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన మంధాన ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా స్మృతి(6 సెంచరీలు) రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో హర్మన్ ప్రీత్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(7) ఉంది. -
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఐదో టీ20లో 21 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 5-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో హేమలత(37) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మంధాన(33),హర్ప్రీత్ కౌర్(30) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుల్తానా ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ఱీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రాధా యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా రెండు వికట్లు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో రితూ మోనీ(37) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది.చదవండి: టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..? -
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్.. 44 పరుగుల తేడాతో విజయం
బంగ్లాదేశ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సెల్హాట్ వేదికగా వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 1-0 అధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో యస్తికా భాటియా(36) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హర్మన్ ప్రీత్ కౌర్(30), షెఫాలీ వర్మ(31) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రబియా ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తర్ రెండు, త్రిష్నా, ఫాతిమా ఖాటూన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులకే పరిమితమైంది.బంగ్లా బ్యాటర్లలో కెప్లెన్ సుల్తానా(51) ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో రేణుక సింగ్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. పూజా రెండు, శ్రేయంకా, దీప్తి శర్మ, రాధా యాదవ్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఏప్రిల్ 30న జరగనుంది. -
242 పరుగులతో విధ్వంసం.. 31 ఫోర్లు, 7 సిక్స్లు! ఎవరీ సెహ్రావత్?
బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఢిల్లీ యువ సంచలనం శ్వేతా సెహ్రావత్ విధ్వంసం సృష్టించింది. శనివారం నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో శ్వేతా సెహ్రావత్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచ్లో ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు శ్వేతా చుక్కలు చూపించింది. బౌండరీల వర్షం కురిపించింది. ఈ మ్యాచ్లో 150 బంతులు ఎదుర్కొన్న సెహ్రవత్ 31 ఫోర్లు, 7 సిక్స్లతో ఏకంగా 242 పరుగులు చేసింది. తద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో ద్విశతకం సాధించిన తొలి మహిళ క్రికెటర్గా శ్వేతా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా దేశీవాళీ క్రికెట్(మూడు ఫార్మాట్లు)లో అత్యధిక స్కోర్ సాధించిన మహిళ క్రికెటర్గా నిలిచింది. ఎవరీ శ్వేతా సెహ్రావత్ .. 20 ఏళ్ల శ్వేతా సెహ్రావత్ దేశీవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. గతేడాది జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్ ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించింది. ఆ టోర్నీలో టాప్ రన్ స్కోరర్గా శ్వేతా సెహ్రావత్ నిలిచింది. కాగా శ్వేత మహిళల ప్రీమియర్లో లీగ్లో కూడా భాగమైంది. ఈ యువ సంచలనం యూపీ వారియర్జ్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. 2023 డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.40 లక్షలకు శ్వేతాను యూపీ సొంతం చేసుకుంది. కానీ ఈ క్యాష్ రిచ్ లీగ్లో మాత్రం ఆమె నిరాశపరిచింది. తొలి సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన సెహ్రావత్ కేవలం 34 పరుగులు మాత్రమే చేసింది. Super Sehrawat 👏 2️⃣4️⃣2️⃣ runs 1️⃣5️⃣0️⃣ balls 3️⃣1️⃣ fours 7️⃣ sixes Shweta Sehrawat sparkled in Delhi's 400-run win over Nagaland with a splendid marathon 242-run knock at the MECON Stadium, Ranchi in the @IDFCFIRSTBank #SWOneday Trophy Scorecard ▶️ https://t.co/3QV6VBY42y pic.twitter.com/WPfgDKeL0a — BCCI Women (@BCCIWomen) January 6, 2024 -
ఆసీస్తో వన్డే, టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! యువ క్రికెటర్కు ఛాన్స్
స్వదేశంలో ఆస్ట్రేలియాపై చారిత్రత్మక విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే, టీ20 తలపడేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే వైట్ బాల్ సిరీస్లకు భారత జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ రెండు సిరీస్లలోనూ భారత జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ నడిపించనుంది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బౌలర్ శ్రేయాంక పాటిల్కు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో అదరగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సైకా ఇషాక్కు కూడా ఆసీస్తో వన్డే, టీ20 జట్లలో సెలక్టర్లు అవకాశం కల్పించారు. మరోవైపు 20 ఏళ్ల మన్నత్ కశ్యకు వన్డే, టీ20 జట్టుల్లో అవకాశం దక్కింది. డిసెంబర్ 28న వాంఖడే వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్తో మూడు వన్డేలు, మూడు టీ20లు టీమిండియా ఆడనుంది. వన్డే సిరీస్ వాంఖడే వేదికగా జరగనుండగా.. టీ20 సిరీస్ డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత మహిళల వన్డే జట్టు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, హర్లీన్ డియోల్ భారత మహిళల టీ20 జట్టు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా! -
ఓడినా మనసులు గెలుచుకుంది.. హీలీ క్రీడా స్పూర్తి! వీడియో వైరల్
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టుపై భారత మహిళా జట్టుకు మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 219 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 406 చేసింది. దీంతో భారత్ 187 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 261 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. భారత్ ముందు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ మాత్రం తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకుంది. ఏమి జరిగిందంటే? ఈ చారిత్రత్మక విజయం అనంతరం ట్రోఫీని అందుకున్న భారత జట్టు ఛాంపియన్స్ హోర్డింగ్ వెనక ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో అలిస్సా హీలీ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తింది. భారత జట్టు విన్నింగ్ మూమెంట్స్ను కెమెరాలో బంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓడిపోయినప్పటికీ అలిస్సా హీలీ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అయిపోయారు. హీలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 World Cup 2024: ఇంగ్లండ్ జట్టు అసిస్టెంట్ కోచ్గా కీరన్ పొలార్డ్.. Alyssa Healy 🫶 🎥: Jio Cinema@ahealy77 | @AusWomenCricket | #INDvAUS | #CricketTwitter pic.twitter.com/QVQpaagsGl — Women's CricInsight (@WCI_Official) December 24, 2023 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారీ విజయం నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఈ వరల్డ్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ అరుదైన రికార్డు శ్రీలంక మహిళల జట్టు పేరిట ఉండేది. 1997లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ను 309 పరుగుల తేడాతో ఓడించింది. తాజా మ్యాచ్తో 26 ఏళ్ల శ్రీలంక రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్ మూడు , గైక్వాడ్ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీథర్ నైట్(21) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో కూడా దీప్తి శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్ రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు పడగొట్టంది. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన 9⃣.3⃣ - Sophia Dunkley 9⃣.4⃣ - Nat Sciver-Brunt Relive how Pooja Vastrakar 2⃣ wickets in an over 🎥 🔽 Follow the Match ▶️ https://t.co/UB89NFaqaJ #TeamIndia | #INDvENG | @Vastrakarp25 | @IDFCFIRSTBank pic.twitter.com/EAUF8WPwMF — BCCI Women (@BCCIWomen) December 16, 2023 -
అరంగేట్ర మ్యాచ్లోనే అదుర్స్.. ఆర్సీబీ జట్టుతో! ఎవరీ శుభా సతీష్?
శుభా సతీష్.. భారత మహిళల క్రికెట్లో ప్రస్తుతం మార్మోగుతున్న పేరు. ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైకతో భారత్ తరపున అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన శుభా.. తన అద్భుత ప్రదర్శనతో అందరిని అకట్టుకుంది. తన తొలి మ్యాచ్తోనే భారత మహిళల క్రికెట్లో చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్గా శుభా రికార్డులకెక్కింది. కేవలం 49 బంతుల్లోనే శుభా సతీష్ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకుంది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 76 బంతులు ఎదుర్కొన్న శుభా 13 ఫోర్లతో 69 పరుగులు చేసింది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుందన్న భయం ఎక్కడ కూడా శుభా ఇన్నింగ్స్లో కన్పించలేదు. అంతేకాకుండా ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టు బౌలర్లకు ఆమె చుక్కలు చూపించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట శుభా.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ 428 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇక అరంగేట్రంలోనే అదరగొట్టిన శుభా సతీష్ను భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం ప్రశంసించింది. ఈ క్రమంలో ఎవరీ శుభా సతీష్ అని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఎవరీ శుభా సతీష్? 24 ఏళ్ల శుభా సతీష్ మైసూర్లోని ఓ మిడిల్క్లాస్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుభాకు తన చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో ఆమె తండ్రి కూడా తనకు సపోర్ట్గా నిలిచి భారత జట్టు జెర్సీ ధరించడంలో కీలక పాత్ర పోషించాడు. 2014 చివరిసారిగా భారత మహిళ జట్టు స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఆడేటప్పుడు శుభా సతీష్ అప్పుడప్పుడే క్రికెట్ మెళుకులు నేర్చుకుంటుంది. అప్పటికి శుభా సతీష్ వయస్సు కేవలం 15 ఏళ్ల మాత్రమే. అయితే యాదృచ్చికంగా మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత భారత్ తమ తదుపరి స్వదేశీ టెస్టు మ్యాచ్తో శుభా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. కాగా ఆమె అంతర్జాతీయ క్రికెటర్గా ఎదగడంలో కోచ్ రజత్ది కూడా ముఖ్య పాత్ర. మైసూరులోని బౌలౌట్ క్రికెట్ అకాడమీలోనే క్రికెటర్గా సతీష్ ఓనమాలు నేర్చుకుంది. ఈ అకాడమీలో కోచ్ రజత్ ఆమెను ఒక మంచి క్రికెటర్గా తీర్చిదిద్దాడు. కాగా దేశీవాళీ క్రికెట్లో కూడా శుభా సతీష్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ 2021-22 సీజన్లో కర్ణాటక తరపున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా శుభా నిలిచింది. ఏడు మ్యాచ్ల్లో 43.83 సగటుతో 263 చేసింది. దేశీవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆమెకు తొలిసారి మహిళల ప్రీమియర్ లీగ్ కాంట్రాక్ట్ దక్కింది. డబ్ల్యూపీఎల్-2024 సీజన్కు సంబంధించిన వేలంలో సతీష్ను రూ.10 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. చదవండి: వరల్డ్కప్లో కుదరలేదు.. ఈసారి సిరాజ్ సాధించేశాడు! పాపం రింకూ.. -
BCCI: టీమిండియా హెడ్కోచ్గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్
BCCI- Women Cricket Team Head Coach: దేశవాళీ దిగ్గజం, ముంబై జట్టు మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ను భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్గా నియమించారు. కొన్ని నెలల క్రితం సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ పదవి కోసం పలువురిని ఇంటర్వ్యూ చేసింది. తుదకు 48 ఏళ్ల అమోల్ మజుందార్కు ఈ బాధ్యతలు అప్పగించింది. కాగా అమోల్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 171 మ్యాచ్లు ఆడి 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా ప్రాతినిధ్యం ఇక రంజీ జట్టు టైటిల్ నెగ్గిన ముంబై జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించిన అమోల్ తదనంతరం దేశవాళీ క్రికెట్లో అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించి 2014లో ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్వైపు వచ్చాడు. ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్కు మూడు సీజన్ల పాటు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించాడు. చదవండి: WC 2023: క్రేజీ ఇన్నింగ్స్.. అతడు అద్భుతం.. ఆ ‘వంద’లో నాదీ సమాన పాత్ర: కమిన్స్ -
టీమిండియాపై అద్భుత ప్రదర్శన.. బంగ్లాదేశ్ జట్టుకు భారీ నజరానా! ఎంతంటే?
స్వదేశంలో భారత మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్ను 1-1తో బంగ్లాదేశ్ డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఢాకా వేదికగా జరిగిన ఆఖరి వన్డే టై కావడంతో ట్రోఫీని ఇరు జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వంటి పటిష్ట జట్టుపై అద్బుత ప్రదర్శరన కనబరిచిన తమ జట్టుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. తమ మహిళల జట్టుకు 35 లక్షల టాకాలు(భారత కరెన్సీలో సూమారు రూ.27 లక్షలు) ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వన్డేల్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు తరపున తొలి సెంచరీ సాధించిన ఫర్గానా హోక్పై బీసీబీ ఛీప్ నజ్ముల్ హసన్ పాపోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫర్గానా అద్బుతమైన బ్యాటర్ అని, బంగ్లా క్రికెట్ను మరో స్ధాయికి తీసుకువెళ్తుందని అతడు కొనియాడాడు. "సాధారణంగా మేము సిరీస్ గెలిస్తే మా జట్లకు బోనస్ ఇస్తాం. కానీ భారత్తో సిరీస్ డ్రా అయినప్పటికీ మా జట్టుకు రివార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ సిరీస్లో సిరీస్లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్పై మేము తొలి వన్డే విజయం సాధించాము. అదే విధంగా సెంచూరియన్ ఫర్గానా హోక్ వంటి వ్యక్తిగత ప్రదర్శనలు కూడా ఉన్నాయి. అందుకే మా ప్లేయర్స్కు 25 లక్షల టాకాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. అదేవిధంగా సెంచరీతో చెలరేగిన ఫర్గానా 2 లక్షల టాకాలు, వ్యక్తిగత ప్రదర్శన మిగితా ప్లేయర్స్కు రివార్డు ఇవ్వనున్నాం. మరోవైపు కోచింగ్ స్టాప్ను కూడా ఇందులో భాగం చేయాలి అనకుంటున్నాం. మొత్తంగా 35 లక్షల టాకాలు రివార్డు రూపంలో ఇవ్వనున్నాం" అని నజ్ముల్ హసన్ పాపోన్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. -
జట్టులో నో ఛాన్స్.. ఏడ్చేసిన టీమిండియా స్టార్ క్రికెటర్! వీడియో వైరల్
బంగ్లాదేశ్ పర్యటనకు భారత మహిళల జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ అతిథ్య బంగ్లాదేశ్తో తలపడనుంది. హర్మాన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు జూలై5న బంగ్లాదేశ్కు పయనమైంది. అయితే ఈ మల్టీఫార్మాట్ సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో స్టార్ బౌలర్ శిఖా పాండేకు చోటుదక్కలేదు. ఈ సిరీస్కు తనను ఎంపిక చేయకపోవడంపై శిఖా పాండే అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ తో స్పోర్ట్స్స్టార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖా ఏడ్చేసింది. "నేను నిరుత్సాహంగా, కోపంగా లేనని చెబితే నేను అస్సలు మనిషినే కాదు. మనం కష్టపడినదానికి తగిన ఫలితం దక్కకపోతే చాలా బాధగా ఉంటుంది. నన్ను తప్పించడం వెనుక ఎదో పెద్ద కారణం ఉంది. అది ఎంటో నాకు కూడా చెబితో బాగున్ను. కానీ నేను నా హార్డ్వర్క్నే నమ్ముతా అంటూ శిఖా పాండే కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా శిఖా పాండే ఇప్పటివరకు 55 వన్డేలు, 56 టీ20ల్లో భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అదే విధంగా తొలి మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన శిఖా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అయినప్పటికీ పాండేకు జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. ఆమెతో పాటు బంగ్లాటూర్కు రిచా ఘోష్, రేణుకా సింగ్కు కూడా చోటు దక్కలేదు. చదవండి: IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్రాజ్ 🗣️ Shikha Pandey gets teary-eyed talking about the disappointment of not finding a place in the Indian team. Watch the full interview with @wvraman here ➡️ https://t.co/9H20WnkoZG#WednesdaysWithWV | #WomensCricket pic.twitter.com/d5tJmro6SC — Sportstar (@sportstarweb) July 6, 2023 -
2005 వరల్డ్కప్ టైమ్లో పుట్టినోళ్లు! కుల్దీప్ యాదవ్ కోచ్ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి..
దాదాపు 18 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్కప్ ఫైనల్ చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి రన్నరప్గా నిలవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్థాయిలో, ఏ ఫార్మాట్లో కూడా మన టీమ్ వరల్డ్కప్ గెలవలేకపోయింది. నాటి జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆఫ్ స్పిన్నర్ నూషీన్ అల్ ఖదీర్ ఇప్పుడు యువ మహిళల టీమ్కు కోచ్. ఇప్పుడు అదే దక్షిణాఫ్రికా గడ్డపై మరో ఫైనల్ ఆడిన భారత బృందం ఈసారి విజేతగా నిలిచింది. దాదాపు 2005 వరల్డ్కప్ జరిగిన సమయంలోనే పుట్టిన అమ్మాయిలంతా ఇప్పుడు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. సీనియర్ టీమ్ మంచి ఫలితాలు సాధిస్తున్న సమయంలో అండర్–19 జట్టు కూడా తమ స్థాయిని ప్రదర్శించడం శుభపరిణామం. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న వర్ధమాన ప్లేయర్లలో బీసీసీఐ తొలి వరల్డ్కప్ కోసం టీమ్ను ఎంపిక చేసింది. అయితే ఎలాగైనా వరల్డ్కప్ గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటికే సీనియర్ టీమ్లో ఆడిన షఫాలీ వర్మ, రిచా ఘోష్లను జట్టులోకి తీసుకుంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అమ్మాయిలందరూ తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించడం విశేషం. శ్వేత సెహ్రావత్ 139.43 స్ట్రయిక్రేట్తో 297 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా, షఫాలీ (172 పరుగులు), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (116 పరుగులు) అండగా నిలిచారు. బౌలింగ్లో పార్శవి చోప్రా (11 వికెట్లు), మన్నత్ కశ్యప్ (9 వికెట్లు) కీలకపాత్ర పోషించారు. సీనియర్ టీమ్లో జూనియర్గా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టిన షఫాలీ ఈ టోర్నీ ద్వారా తన నాయకత్వ ప్రతిభను కూడా ప్రదర్శించడం విశేషం- సాక్షి క్రీడావిభాగం వరల్డ్కప్ సాధించిన బృందం గురించి సంక్షిప్తంగా... షఫాలీ వర్మ (కెప్టెన్): హరియాణాలోని రోహ్తక్కు చెందిన షఫాలీ భారత్ సీనియర్ జట్టు సభ్యురాలిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత్ తరఫున 74 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. రిచా ఘోష్: బెంగాల్కు చెందిన కీపర్ రిచా కూడా సీనియర్ టీమ్ సభ్యురాలిగా 47 మ్యాచ్లు ఆడింది. పార్శవి చోప్రా: యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన లెగ్స్పిన్నర్. తండ్రి ఫ్లడ్ లైట్ సౌకర్యాలతో సొంత గ్రౌండ్ ఏర్పాటు చేసి మరీ కూతురును ఆటలో ప్రోత్సహించాడు. ఎండీ షబ్నమ్: విశాఖపట్నానికి చెందిన షబ్నమ్ తల్లిదండ్రులు నేవీలో పని చేస్తారు. శివశివాని స్కూల్లో పదో తరగతి చదువుతోంది. 15 ఏళ్ల వయసులోనే 110 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. సౌమ్య తివారి: స్వస్థలం భోపాల్. టాప్ ఆర్డర్ బ్యాటర్... కోహ్లిని ఇష్టపడే సౌమ్య అతనిలాగే కవర్డ్రైవ్ అద్భుతంగా ఆడుతుంది. టిటాస్ సాధు: బెంగాల్కు చెందిన టిటాస్ తండ్రి ఒక క్రికెట్ అకాడమీ నడపిస్తాడు. బెంగాల్ సీనియర్ టీమ్కు ఇప్పటికే ఆడింది. గొంగడి త్రిష: భద్రాచలంకు చెందిన త్రిష హైదరాబాద్లో స్థిర పడింది. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టి 8 ఏళ్ల వయసులోనే అండర్–16లో ప్రాతినిధ్యం వహించింది. మన్నత్ కశ్యప్: పటియాలాకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇటీవల వరుసగా ‘మన్కడింగ్’లు చేసి గుర్తింపు తెచ్చుకుంది. శ్వేత సెహ్రావత్: ఢిల్లీకి చెందిన బిగ్ హిట్టర్. ఆర్థికంగా మెరుగైన నేపథ్యం ఉన్న కుటుంబం. సొప్పదండి యశశ్రీ: హైదరాబాద్కు చెందిన మీడియం పేసర్. టోర్నీ లో ఒక మ్యాచ్ ఆడింది. గాయంతో తప్పుకున్న హర్లీ గలా స్థానంలో జట్టులోకి వచ్చింది. అర్చనా దేవి: ఆఫ్స్పిన్నర్. యూపీలోని ఉన్నావ్ స్వస్థలం. కడు పేదరికం. తండ్రి ఎప్పుడో చనిపోయాడు. కుల్దీప్ యాదవ్ కోచ్ కపిల్ పాండే దత్తత తీసుకొని ముందుకు నడిపించాడు. సోనమ్ యాదవ్: యూపీ లెఫ్టార్మ్ స్పిన్నర్. తండ్రి ఫిరోజాబాద్లో చేతి గాజులు తయారు చేసే పరిశ్రమలో కార్మికుడు ఫలక్ నాజ్: స్వస్థలం యూపీలోని ప్రయాగ్రాజ్. ఈ బౌలింగ్ ఆల్రౌండర్ తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్లో ప్యూన్. రిషిత బసు: వికెట్ కీపర్, బెంగాల్లోని హౌరా స్వస్థలం. అద్భుతమైన మెరుపు షాట్లు ఆడుతుంది. మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లా తన అకాడమీలో ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. చదవండి: Novak Djokovic: తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్మనీ ఎంతంటే! Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ From #TeamIndia to #TeamIndia🇮🇳 Well done!!! We are so proud of you! 🤝 pic.twitter.com/YzLsZtmNZr — BCCI Women (@BCCIWomen) January 29, 2023 -
ICC T20 WC: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా!
ICC U19 Inaugural T20 World Cup- Shafali Verma: ఐసీసీ అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభినందించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కలిపి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు ఫైనల్లో ఇంగ్లండ్ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ సాధించిన మహిళల టీమ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ యువ జట్టు భవిష్యత్తులోనూ మరిన్ని టోర్నీలో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అదే విధంగా భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, హార్దిక్ పాండ్యా సేన.. మహిళా టీమ్కు వీడియో సందేశం ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా ‘‘అమ్మాయిలంతా చాలా బాగా ఆడారు. వారి ప్రదర్శన, తమపై తమకు ఉన్న నమ్మకం గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక పాత్ర పోషించిన సహాయక బృందానికి కూడా కృతజ్ఞతలు’’ అంటూ భారత కెప్టెన్ షఫాలీ వర్మ హర్షం వ్యక్తం చేసింది. చారిత్రక విజయంలో జట్టు సమిష్టి ఉందని పేర్కొంది. అదే విధంగా... వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ (సీనియర్ మహిళల టి20 ప్రపంచకప్)ని కూడా అందుకోవాలని ఉందంటూ షఫాలీ తన ఆకాంక్షను తెలియజేసింది. అండర్–19 టి20 ప్రపంచకప్- ఎవరెవరిపై గెలిచామంటే.. ►లీగ్ దశలో: దక్షిణాఫ్రికాపై 7 వికెట్లతో గెలుపు ►యూఏఈపై 122 పరుగులతో విజయం ►స్కాట్లాండ్పై 83 పరుగులతో గెలుపు ►సూపర్ సిక్స్ దశలో: ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్లతో ఓటమి. ►శ్రీలంకపై 7 వికెట్లతో విజయం ►సెమీస్లో: న్యూజిలాండ్పై 8 వికెట్లతో విజయం ►ఫైనల్లో: ఇంగ్లండ్పై 7 వికెట్లతో గెలుపు చదవండి: IND Vs NZ T20: కివీస్పై టీమిండియా గెలుపు U19 Womens WC 2023: వారెవ్వా అర్చన.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్! A special message from Lucknow for India's ICC Under-19 Women's T20 World Cup-winning team 🙌 🙌#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/g804UTh3WB — BCCI (@BCCI) January 29, 2023 -
సిరీస్లో నిలవాలంటే.. గెలవాల్సిందే! భారత్ తుది జట్టు ఇదే?
ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్కు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడ నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే భారత్కు సిరీస్ గెలిచే అవకాశముంటుంది. ఈ మ్యాచ్లో గనక ఓడితే ఇక్కడే సిరీస్ను సమర్పించుకుంటుంది. ఈ నేపథ్యంలో చావోరేవో తేల్చుకోవాల్సిన భారత అమ్మాయిలపైనే ఒత్తిడి నెలకొంది. పైగా ఆసీస్లాంటి మేటి జట్టును ఎదుర్కోవాలంటే హర్మన్ప్రీత్ సేన సర్వశక్తులు ఒడ్డాల్సిందే! ముఖ్యంగా బ్యాటింగ్ ఫర్వాలేదనిపిస్తున్నా... బౌలింగే జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. గత మ్యాచ్లో ఆరంభంలోనే ఆసీస్ వికెట్లను పడగొట్టినప్పటికీ తర్వాత పట్టు సడలించడంతో ఆస్ట్రేలియా స్కోరు మళ్లీ 170 పరుగులు దాటింది. ఆంధ్ర పేసర్ అంజలి శర్వాణి వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు మాత్రం ధారాళంగా ఇస్తోంది. సీనియర్లు రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మలు సైతం భారీగా పరుగులు ఇవ్వడం ప్రతికూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కోచింగ్ బృందం బౌలింగ్ విభాగంపైనే ప్రధానంగా దృష్టి సారించాలి. లోపాలను సరిదిద్దుకొని బౌలింగ్ పదును పెంచాలి. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే జెమిమా రోడ్రిగ్స్ పేలవ ఫామ్ వల్ల పటిష్ట భాగస్వామ్యాలకు అవకాశం లేకుండాపోతోంది. మూడు మ్యాచ్ల్లో ఆమె వరుసగా 0, 4, 16 పరుగులతో నిరాశపరిచింది. కీలకమైన నేటి మ్యాచ్లో ఆమె మంచి స్కోరు చేస్తే జట్టు భారీస్కోరుకు బాటపడుతుంది. మరోవైపు 2–1తో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న ఆసీస్ అమ్మాయిలు ఇక్కడే సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో మనకన్నా మెరుగ్గా ఉండటంతో ఆస్ట్రేలియాకు వరుస విజయం ఏమంత కష్టం కాదు. భారత తుది జట్టు(అంచనా): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, దేవికా వైద్య, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి సర్వాణి, రేణుకా ఠాకూర్, రాజేశ్వరి గయక్వాడ్ చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ గడ్డపై కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర.. తొలి భారత స్పిన్నర్గా -
చేతులెత్తేసిన బ్యాటర్లు.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ముంబై: బ్యాటింగ్ వైఫల్యంతో భారత మహిళల జట్టు మూడో టి20లో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (47 బంతుల్లో 75; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రేస్ హారిస్ (18 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, రేణుక సింగ్, దీప్తి శర్మ, దేవిక తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిసింది. హర్మన్ప్రీత్ (27 బంతుల్లో 37; 6 ఫోర్లు), దీప్తి శర్మ (17 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డెనర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 17న ఇదే వేదికపై నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. చదవండి: Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం.. ఇకపై -
మహిళల ఆసియా కప్ విజేత భారత్ (ఫొటోలు)
-
ఛాంపియన్ భారత్కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం షెల్లాట్ జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి 7వ ఆసియాకప్ టైటిల్ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక ఆసియాకప్ ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టుకు ఫ్రైజ్మనీ ఎంత లభించింది?.. ఆసియాకప్ టాప్ రన్ స్కోరర్ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. విజేతకు ఎంతంటే? ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్కు ఫ్రైజ్మనీ రూపంలో ఇరవై వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 16లక్షల నాలభై ఎనిమిది వేల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్ను టోర్నీ నిర్వహకులు భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కు అందజేశారు. అదే విధంగా రన్నరప్గా నిలిచిన శ్రీలంకకు 12,500 డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం సుమారు పది లక్షల ముఫ్పై వేలు)ఫ్రైజ్మనీ దక్కింది. ఆసియాకప్-2022లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే జెమిమా రోడ్రిగ్స్(భారత్)- 8 మ్యాచ్ల్లో 217 పరుగులు హర్షిత మాధవి(శ్రీలంక)- 8 మ్యాచ్ల్లో 202 పరుగులు షఫాలీ వర్మ(భారత్)- 6 మ్యాచ్ల్లో-166 పరుగులు సిద్రా అమీన్(పాకిస్తాన్)- 7 మ్యాచ్ల్లో 158 పరుగులు నిదా దార్(పాకిస్తాన్) - 7 మ్యాచ్ల్లో 145 పరుగులు ఆసియాకప్ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు దీప్తి శర్మ(భారత్)- 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు ఇనోక రణావీరా(శ్రీలంక)- 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు రుమనా ఆహ్మద్(బంగ్లాదేశ్)-5 మ్యాచ్ల్లో 10 వికెట్లు ఓమైమా సోహెల్(పాకిస్తాన్)-7 మ్యాచ్ల్లో 10 వికెట్లు ఇక ఈ మెగా ఈవెంట్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. దీప్తికి అవార్డు రూపంలో 2000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు లక్షా ఆరవై నాలుగు వేల రూపాయలు) లభించింది. చదవండి: T20 World Cup 2022:టీమిండియాతో మ్యాచ్.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు దూరం -
ఆసియా కప్ గెలిచిన భారత మహిళా జట్టుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: మహిళల ఆసియా కప్-2022 గెలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కాగా మహిళ ఆసియా కప్ విజేతగా భారత్ అవతరించిన విషయం తెలిసిందే. ఏడోసారి ఆసియా కప్ గెలిచిన జట్టుగా భారత్ రికార్డ్ సృష్టించింది. శనివారం జరిగిన కీలకమైన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. 66 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్కు దిగిన భారత్ 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజేతగా నిలిచింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో(25 బంతుల్లో 51 పరుగులు) రాణించింది. నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చిన రేణుకా సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. -
ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్
మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచింది. షెల్లాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 7వ ఆసియాకప్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్ను పూర్తి చేసింది. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో భారత పేసర్ రేణుకా సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 3⃣ Overs 1⃣ Maiden 5⃣ Runs 3⃣ Wickets Renuka Thakur put on a stunning show with the ball & bagged the Player of the Match award as #TeamIndia beat Sri Lanka in the #AsiaCup2022 Final. 👏 👏 #INDvSL Scorecard ▶️ https://t.co/r5q0NTVLQC pic.twitter.com/APPBolypjE — BCCI Women (@BCCIWomen) October 15, 2022 రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చదవండి: Rohit Sharma Press Meet: వరల్డ్కప్ కంటే అతడి కెరీర్ ముఖ్యం! మాకు ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరంటే.. -
'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన గోస్వామి..
లార్డ్స్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలో ఇంగ్లండ్ మహిళలతో భారత జట్టు తలపడుతోంది. కాగా భారత మహిళా జట్టు వెటరన్ పేసర్ జులాన్ గోస్వామి తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెటర్ల నుంచి జులాన్ గోస్వామి 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరిచింది. భారత ఇన్నింగ్స్లో గోస్వామి బ్యాటింగ్ సమయంలో ఇంగ్లండ్ క్రికెటర్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు. కాగా ఈ మ్యాచ్లో గోస్వామి తొలి బంతికే డకౌట్గా వెనుదిరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. "20 ఏళ్లుగా ఝులన్ గోస్వామి తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆమె వన్డే క్రికెట్లో దాదాపు 10,000 బంతులు వేసింది. ఎంతో మంది యువ క్రికెటర్లు అత్యుత్తమంగా తాయారు చేయడంలో జులాన్ కీలక పాత్ర పోషించింది. జులాన్ ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శం" అని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. కాగా 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన 40 ఏళ్ల జులన్ 201 వన్డేల్లో 253 వికెట్లు, 68 టి20ల్లో 56 వికెట్లు తీసింది. 12 టెస్టుల్లో 44 వికెట్లు కూడా పడగొట్టింది. చదవండి: Womens T20 World Cup 2023: అర్హత సాధించిన ఐర్లాండ్, బంగ్లాదేశ్ -
చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్గా!
ఇంగ్లండ్ మహిళలలతో వన్డే సిరీస్ను భారత్ విజయంతో ఆరంభించింది. హోవ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా తన కెరీర్లో చివరి సిరీస్ ఆడుతున్న భారత భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్లో గోస్వామి తన 10 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టింది. తద్వారా ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లీస్ జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా గోస్వామి రికార్డులకెక్కింది. అంతుకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్ కేథరిన్ ఫిట్జ్ప్యాట్రిక్(23 వికెట్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఝులన్(24 వికెట్లు) కేథరిన్ రికార్డురు బ్రేక్ చేసింది. అదే విధంగా భారత్ తరపున వన్డేల్లో ఆడిన అతి పెద్ద వయష్కరాలుగా కూడా గోస్వామి నిలిచింది. 39 ఏళ్ల 297 రోజుల వయస్సులో ఆమె ఈ మ్యాచ్ ఆడింది. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 39 ఏళ్ల 114 రోజుల వయసులో తన చివరి వన్డే మ్యాచ్ ఆడింది. ఇక ఈ సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు గోస్వామి గుడ్బై చెప్పనుంది. లార్డ్స్ వేదికగా జరగనున్న అఖరి వన్డేలో గోస్వామికి ఘనంగా విడ్కోలు పలకాలని భారత జట్టు భావిస్తోంది. చదవండి: IND-W vs ENG-W: శభాష్ మంధాన.. తనకు దక్కిన అవార్డును! -
IND-W vs ENG-W: శభాష్ మంధాన.. తనకు దక్కిన అవార్డును!
హోవ్ వేదికగా ఇంగ్లండ్ మహిళలలతో జరిగిన తొలి వన్డేలో భారత్ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 95 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోసింది. దీంతో మంధాన అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే మంధాన మరో సారి తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో తన దక్కిన ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డును భారత వెటరన్ ఝులన్ గోస్వామికి అంకితం చేసింది. కాగా గోస్వామి తన కెరీర్లో చివరి అంతర్జాతీయ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరగనున్న అఖరి వన్డేలో గోస్వామికి ఘనంగా విడ్కోలు పలకాలని భారత జట్టు భావిస్తోంది. ఇక పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో మంధాన మాట్లాడూతూ.. "ఈ మ్యాచ్లో నా ఇన్నింగ్స్ పట్ల సంతృప్తిగా ఉన్నాను. అయితే అఖరి వరకు క్రీజులో నిలిచి ఉండి మ్యాచ్ను ఫినిష్ చేయాలని అనుకున్నాను. ముఖ్యంగా మ్యాచ్ను వీక్షించచడానికి వచ్చిన భారత అభిమానులకు ప్రత్యేక దన్యావాదాలు. అదే విధంగా టీ20 క్రికెట్ కంటే వన్డే క్రికెట్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఇక ఈ మ్యాచ్లో నాకు దక్కిన ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డును ఝులన్ గోస్వామికి అంకితం చేయాలనుకుంటున్నాను. అదే విధంగా ఈ సిరీస్ను గెలిచి మేము గోస్వామికి అంకితం ఇస్తాము" అని పేర్కొంది. చదవండి: T20 WC 2022: తుది జట్టులో డీకే లేదంటే పంత్? నేనైతే ఏం చేస్తానంటే: టీమిండియా దిగ్గజం -
మూడు సంవత్సరాల్లో 301 అంతర్జాతీయ మ్యాచ్లు.. ఎవరితో ఎవరు?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తొలిసారి మహిళల క్రికెట్కు సంబంధించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)ను మంగళవారం విడుదల చేసింది. మే 2022 నుంచి ఏప్రిల్ 2025 కాలానికి గానూ మహిళా క్రికెట్ జట్లు ఆడబోయే సిరీస్లు, మెగాటోర్నీ వివరాలను ఎఫ్టీపీలో పేర్కొంది. ఇందులో 2023 వన్డే వరల్డ్ కప్తో పాటు మొత్తంగా 301 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనున్నాయి. ఇందులో ఏడు టెస్టులు, 135 వన్డేలు, 159 టి20లు ఉన్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే టెస్టులు ఆడనున్నాయి. ఇతర జట్లు ఎక్కువగా టి20లవైపే మొగ్గుచూపాయి. ఇక మహిళా క్రికెట్లో ఎఫ్టీపీ షెడ్యూల్ రూపొందించడం ఒక అద్భుతం ఘట్టం. ఎఫ్టీపీ అనేది కేవలం భవిష్యత్తు పర్యటనల కోసమే గాక మహిళల క్రికెట్ను మరోస్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నాం. గతంలో కివీస్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్లో పలుమార్లు హోరాహోరీ మ్యాచ్లు జరిగాయి. అందుకే ఎఫ్టీపీలో మరిన్ని మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించాం అని ఐసీసీ జనరల్ మేనేజర్ వసీమ్ ఖాన్ పేర్కొన్నారు. ఇక ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్కప్కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ మహిళా చాంపియన్షిప్(IWC)లో భాగంగా 10 జట్లు వన్డే సిరీస్లు ఆడనున్నాయి. దీంతో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించే అవకాశం అన్ని జట్లకు ఉండనుంది. పాకిస్తాన్ మినహా మిగతా 9 దేశాలతో మ్యాచ్లు.. 2022-25 కాలానికి గాను ప్రకటించిన ఎఫ్టీపీలో టీమిండియా మహిళల జట్టు ఒక్క పాకిస్తాన్ మినహా మిగతా తొమ్మిది దేశాలతో మ్యాచ్లు ఆడనుంది. ఇందులో కొన్ని ద్వైపాక్షిక, ట్రై సిరీస్లు ఉన్నాయి. అలాగే 2023 డిసెంబర్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు ఒక్కో టెస్టు మ్యాచ్ ఆడనుంది. 2022-25 కాలంలో టీమిండియా మహిళలు ఆడనున్న ద్వైపాక్షిక సిరీస్లు.. ►ఈ ఏడాది సెప్టెంబర్లో ఇంగ్లండ్తో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. ►డిసెంబర్ 2022లో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ►వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రకా, న్యూజిలాండ్తో ట్రై సిరీస్లో ఆడనున్న టీమిండియా నాలుగు టి20లు ఆడనున్నాయి ►2023 జూన్లో బంగ్లాదేశ్తో మూడు వన్డేలు, మూడు టి20లు ►స్వదేశంలో సెప్టెంబర్-అక్టోబర్ 2023లో దక్షిణాఫ్రికాతో మూడు టి20లు, మూడు వన్డేలు ►న్యూజిలాండ్తో మూడు టి20లు, మూడు వన్డేలు ►డిసెంబర్ 2023లో ఇంగ్లండ్తో ఒక టెస్టు, మూడు టి20లు ►డిసెంబర్ 2023లోనే ఆస్ట్రేలియాతో ఒక టెస్టు, మూడు టి20లు, మూడు వన్డేలు ►నవంబర్ 2024లో ఆసీస్తో ఆస్ట్రేలియా వేదికగా మూడు వన్డేలు ►డిసెంబర్ 2024లో విండీస్తో మూడు వన్డేలు, మూడు టి20లు ►జనవరి 2025లో ఐర్లాండ్తో మూడు వన్డేలు, మూడు టి20లు 2022-25లో జరగనున్న ఐసీసీ మెగాటోర్నీలు ►ఫిబ్రవరి 2023 - దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ ►సెప్టెంబర్ / అక్టోబర్ 2024 - బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ ►సెప్టెంబర్ / అక్టోబర్ 2025 - భారత్ వేదికగా మహిళల క్రికెట్ ప్రపంచకప్ UNVEILING 👀 The first-ever Women’s Future Tours Program ⬇️ — ICC (@ICC) August 16, 2022 చదవండి: IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు -
భారత్తో సెమీఫైనల్.. ఇంగ్లండ్కు భారీ షాక్! కెప్టెన్ దూరం!
భారత మహిళలతో సెమీ ఫైనల్కు ముందు ఇంగ్లండ్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్-2022 నుంచి వైదొలిగింది. అదే విధంగా త్వరలో జరగనున్న ది హండ్రెడ్ లీగ్కు కూడా ఆమె దూరమైంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. "ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్, ది హండ్రెడ్ లీగ్కు దూరం కానుంది. దక్షిణాఫ్రికా సిరీస్లో గాయపడ్డ నైట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆమె ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అదే విధంగా మిగితా మ్యాచ్లకు కూడా నాట్ స్కివర్ కెప్టెన్గా కొనసాగనుంది" అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో పేర్కొంది. కాగా కామన్వెల్త్ గేమ్స్కు ప్రకటించిన ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్గా నైట్ ఎంపికైనప్పటికీ.. ఇప్పటి వరకు బెంచ్కే పరిమితమైంది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి సెమీఫైనల్ ఎడ్జ్బాస్టన్ వేదికగా శనివారం(ఆగస్టు 6) జరగనుంది. తుది జట్లు(అంచనా) ఇంగ్లండ్ మహిళల జట్టు: డేనియల్ వ్యాట్, సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, నటాలీ స్కివర్ (కెప్టెన్), అమీ జోన్స్ (వికెట్ కీపర్), మైయా బౌచియర్, కేథరీన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఫ్రెయా కెంప్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్ భారత మహిళల జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్ England Women’s captain Heather Knight has been ruled out of the Commonwealth Games and The Hundred. The hip injury she sustained in the first Vitality IT20 against South Africa has failed to settle down as expected and Knight will continue to receive treatment. pic.twitter.com/iTJA17nXkU — England Cricket (@englandcricket) August 3, 2022 చదవండి: Chris Gayle: క్రిస్ గేల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ యునివర్స్ బాస్ మెరుపులు! -
బార్బడోస్తో భారత్ కీలక పోరు.. ఓడితే ఇంటికే!తుది జట్లు!
కామన్వెల్త్ గేమ్స్-2022లో బుధవారం బార్బడోస్ మహిళల జట్టుతో కీలక పోరులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడిన భారత్ ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో ఓటమి పాలైన భారత్.. రెండో మ్యాచ్లో పాకిస్తాన్పై విజయం సాధించి తిరిగి గాడిలో పడింది. గ్రూపు-ఎలో నాలుగు పాయింట్లతో తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఇక ఇప్పటి వరకు చెరో విజయం సాధించిన భారత్, బార్బడోస్ రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే బార్బడోస్ కంటే భారత్(+1.165)కు మెరుగైన రన్రేట్ ఉండటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో బార్బడోస్ ఉండగా.. అఖరి స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక సెమీస్లో అడుగు పెట్టాలంటే బార్బడోస్పై హర్మన్ ప్రీత్ సేన ఖచ్చితంగా విజయం సాధించాలి. ఒక వేళ ఓడితే భారత్ ఇంటిముఖం పట్టక తప్పదు. ఇక కీలకపోరులో తలపడనున్న భారత్, బార్బడోస్ జట్ల బలా బలాలపై ఓ లుక్కేద్దాం. భారత జట్టు బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఆనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో బ్యాటర్లు అద్భుతంగా రాణించనప్పటికీ.. బౌలర్లు అఖరిలో చేతులెత్తేశారు. అనంతరం పాక్పై మాత్రం టీమిండియా మహిళలు ఆల్రౌండ్ షోతో అదరగొట్టారు. తొలుత బౌలింగ్లో పాక్ను కేవలం 99 పరుగులకే కుప్పకూల్చిన భారత మహిళలు.. అనంతరం బ్యాటింగ్లో కూడా ఇరగదీశారు. ఓపెనర్ స్మృతి మంధాన 63 పరుగులతో ఆజేయంగా నిలిచి భారత్కు విజయ తీరాలకు చేర్చింది. ఇక స్మృతి మంధానతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మలు కూడా అద్భుతమైన ఫామ్లో ఉండడం భారత్కు సానుకూలాంశం. ఇక బౌలింగ్ పరంగా భారత్ కాస్త తడబడుతోంది. ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లో పేసర్ రేణుక సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ.. మిగితా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అయితే రెండో మ్యాచ్లో పాక్పై మాత్రం బౌలర్లు విజృంభించారు. ఇక మరోసారి భారత బౌలర్లు చెలరేగితే బార్బడోస్కు మాత్రం ఓటమి తప్పదు. ఇక బార్బడోస్ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్లో పాక్పై అద్భుతమైన విజయం సాధించిన బార్బడోస్, రెండో మ్యాచ్లో ఆసీస్ చేతిలో భంగపాటు పడింది. అయితే బార్బడోస్ను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. జట్టులో కెప్టెన్ హేలీ మాథ్యూస్, ఓపెనర్ డాటిన్ వంటి అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. బౌలింగ్లో కూడా షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్ వంటి సీనియర్ బౌలర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. తుది జట్లు (అంచనా) బార్బడోస్ మహిళల జట్టు: డియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), కైసియా నైట్ (వికెట్ కీపర్), కైషోనా నైట్, ఆలియా అలీన్, త్రిషన్ హోల్డర్, అలీసా స్కాంటిల్బరీ, షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్, కైలా ఇలియట్, షానికా బ్రూస్ భారత మహిళల జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! తల్లితో దిగిన ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్! -
CWG 2022: రెప్పపాటులో తలకిందులు.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్!
కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో భారత జట్టును ఆదిలోనే ఓటమి పలకరించింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన పరాజయం పాలైంది. మూడు వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి మూటగట్టుకుంది. గెలుపు కోసం భారత మహిళా జట్టు ఆఖరి వరకు పోరాడినా.. ఆష్లే గార్డ్నర్ 52 పరుగులతో అజేయంగా నిలిచి హర్మన్ప్రీత్ బృందం ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో తొలి మ్యాచ్లోనే గెలిచి అరుదైన ఘనత సాధించాలనుకున్న భారత్కు నిరాశే ఎదురైంది. కాగా ఈ మ్యాచ్లో భారత్ ఓడినా.. బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆమె కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చింది. రేణుక ధాటికి ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. మ్యాచ్ రెండో బంతికే ఓపెనర్ అలిసా హేలీను అవుట్ చేసి భారత్కు శుభారంభం అందించిన రేణుక.. వరుసగా బెత్ మూనీతో పాటు.. కెప్టెన్ మెగ్ లానింగ్, తాహిలా మెగ్రాత్ వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా ఐదో ఓవర్ మొదటి బంతికి మెగ్రాత్ను రేణుక అవుట్ చేసిన తీరు హైలెట్గా నిలిచింది. అద్భుతమైన ఇన్స్వింగర్తో మెగ్రాత్ను రేణుక బౌల్డ్ చేసింది. రేణుక సంధించిన బంతిని షాట్ ఆడేందుకు మెగ్రాత్ సమాయత్తమైంది. కానీ.. నమ్మశక్యం కాని రీతిలో బంతి మెగ్రాత్ ప్యాడ్, బ్యాట్ మధ్య నుంచి దూసుకెళ్లి స్టంప్ను ఎగురగొట్టింది. దీంతో బిత్తరపోయిన మెగ్రాత్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిరాశగా క్రీజును వీడింది. అయితే, గార్డ్నర్కు తోడు గ్రేస్ హ్యారిస్ 37 పరుగులతో రాణించడంతో విజయం ఆసీస్ సొంతమైంది. 𝗨𝗻𝘀𝘁𝗼𝗽𝗽𝗮𝗯𝗹𝗲! 🔥 Renuka Singh Thakur, everyone. 👏#INDvAUS | #B2022 pic.twitter.com/zfo50r1QLj — Olympic Khel (@OlympicKhel) July 29, 2022 కామన్వెల్త్ క్రీడలు 2022- మహిళా క్రికెట్(టీ20 ఫార్మాట్) ►భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ►వేదిక: ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ ►టాస్: భారత్- బ్యాటింగ్ ►భారత్ స్కోరు: 154/8 (20) ►ఆస్ట్రేలియా స్కోరు: 157/7 (19) ►విజేత: ఆస్ట్రేలియా... 3 వికెట్ల తేడాతో గెలుపు చదవండి: Ind Vs WI T20 Series: మొన్న పంత్.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు! అయినా.. Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
అఖరి వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
శ్రీలంక మహిళలతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన అఖరి వన్డేలో భారత్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 216 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రాజేశ్వరి గయక్వాడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. మేఘనా సింగ్ పూజా వస్త్రాకర్ తలా రెండు వికెట్లు, దీప్తీ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్, డియోల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో నీలాక్షి డి సిల్వా 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. కాగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హర్మన్ప్రీత్ కౌర్ (75), పూజా వస్త్రాకర్(56) పరగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో రణవీర,రష్మీ డి సిల్వా, ఆటపత్తు చెరో రెండు వికెట్లు సాధించగా, కాంచనా,రణసింఘే, కవిషా దిల్హరి తలా వికెట్ సాధించారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు హర్మన్ప్రీత్ కౌర్కే వరించాయి. చదవండి: కోహ్లికి మూడు నెలల విశ్రాంతి అవసరం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
శ్రీలంకతో భారత్ తొలి పోరు..
ప్రపంచ కప్ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి దిగబోతోంది. హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ నేడు జరిగే తొలి మ్యాచ్లో శ్రీలంకతో తలపడుతుంది. మిథాలీరాజ్ రిటైర్మెంట్ తర్వాత టీమ్కు ఇదే తొలి వన్డే కావడం విశేషం. లంకతో జరిగిన టి20 సిరీస్ను 2–1తో భారత్ గెలుచుకుంది. గతంలో 5 వన్డేల్లో భారత్కు సారథిగా వ్యవహరించిన హర్మన్కు పూర్తి స్థాయి కెప్టెన్గా ఇదే తొలి సిరీస్. శ్రీలంకతో ఇప్పటి వరకు తలపడిన 29 వన్డేల్లో భారత్ 26 గెలిచి 2 మాత్రమే ఓడింది. చదవండి: SL VS AUS 1st Test Day 2: వర్ష బీభత్సానికి అతలాకుతలమైన స్టేడియం -
శ్రీలంకతో రెండో టీ20.. సిరీస్పై కన్నేసిన భారత్
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో టీ20కు సిద్దమైంది. దంబుల్లా వేదికగా శనివారం జరగునున్న ఈ మ్యాచ్లో తొలి టీ20 జోరును కనబరిచి సిరీస్ కైవసం చేసుకోవాలని హర్మన్ ప్రీత్ సేన భావిస్తోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 అధిక్యంలో ఉంది. ఇక బౌలింగ్, బ్యాటింగ్ పరంగా భారత్ పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్లో షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ రాణిస్తుండగా.. బౌలింగ్లో రాధా యాదవ్,దీప్తీ శర్మ, పుజా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. భారత తుది జట్టు(అంచనా): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, రాధా యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్ చదవండి: India Vs Ireland T20: రాహుల్ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు! -
శ్రీలంకతో సిరీస్.. భారత జట్టుతో సమావేశమైన లక్ష్మణ్
భారత మహిళల జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధిచిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు,మూడు టీ20లు ఆడనుంది. తొలి టీ20 దంబుల్లా వేదికగా జూన్23న జరగనుంది. కాగా న్యూజిలాండ్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ తర్వాత భారత్కు ఇదే తొలి సిరీస్. ఇక భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత వన్డే కెప్టెన్గా హార్మన్ ప్రీత్ కౌర్ ఎంపికైంది. అదే విధంగా శ్రీలంకతో సిరీస్కు భారత వెటరన్ పేసర్ జూలన్ గోస్వామి వ్యక్తిగత కారణాలతో దూరమైంది. శ్రీలంకతో వన్డే సిరీస్కి భారత మహిళా జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా, హర్లీన్ డియోల్ టి20 సిరీస్కి భారత మహిళా జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్ చదవండి: T20 World Cup2022: 'భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి' 📸 📸: Mr @VVSLaxman281 - Head Cricket, NCA - interacts with the Sri Lanka-bound #TeamIndia, led by @ImHarmanpreet. 👍 👍 pic.twitter.com/yVQNGjHaD8 — BCCI Women (@BCCIWomen) June 18, 2022 -
World Cup 2022: వర్షం పడితేనే.. కానీ అలా జరుగలేదు..
Update: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 నుంచి మిథాలీ సేన సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. మహిళల వన్డే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాప్రికా జట్లు సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకోగా.. భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు మరో రెండు స్ధానాల కోసం పోటీ పడుతున్నాయి. సోమవారం(మార్చి 28) క్రైస్ట్చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ జట్టు చావోరేవో తేల్చుకోనుంది. మరోవైపు ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్లో ఆదివారం(మార్చి 27) బంగ్లాదేశ్తో తలపడనుంది. అయితే బంగ్లాదేశ్పై ఇంగ్లండ్ విజయం లాంఛనమే అని చెప్పుకోవాలి. ఇంగ్లండ్ వంటి మేటి జట్టును బంగ్లాదేశ్ వంటి పసి కూన ఓడించడం అంత సులభం కాదు. కాబట్టి దక్షిణాఫ్రికాపై భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్కు చేరుతుంది. ఒకవేళ ఓటమి చెందితే భారత్ ఇంటిముఖం పట్టక తప్పదు. ఎందుకంటే 7 పాయింట్లతో వెస్టిండీస్ సెమీఫైనల్లో అడుగు పెడుతుంది. మరోవైపు రానున్న మూడు రోజులు పాటు క్రైస్ట్చర్చ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవారణ శాఖ తెలిపింది. ఒక వేళ దక్షిణాఫ్రికా-భారత్ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లుకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో భారత్ జట్టు 7 పాయింట్లతో విండీస్తో సమంగా నిలుస్తుంది. అయితే వెస్టిండీస్(-0.890) రన్రేట్ కంటే భారత్(+0.768) మెరుగ్గా ఉంది. దీంతో భారత్ సెమీస్కు చేరుకుంటుంది. ఇక గురువారం జరగాల్సిన దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో 7 పాయింట్లతో వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరుకుంది. భారత్ 6 పాయింట్లతో ఐదో స్ధానంలో ఉంది. మరోవైపు శుక్రవారం(మార్చి 25)న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి అజేయ రికార్డును కొనసాగించి అగ్ర స్థానాన్ని పదిలం చేసుకుంది. చదవండి: World Cup 2022: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన ఆసీస్.. ఏడింటికి ఏడు గెలిచి.. అజేయ రికార్డుతో -
ODI World Cup 2022: న్యూజిలాండ్ పర్యటనకు భారత మహిళా జట్టు
Indian Women Cricket Team To Tour New Zealand T20 5 ODI Ahead WC 2022: వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. న్యూజిలాండ్ వేదికగా వరల్డ్కప్ జరగనుండటంతో దానికి నెల రోజుల ముందుగా న్యూజిలాండ్తో సన్నాహక సిరీస్ను ఆడనుంది. భారత జట్టు సభ్యులు అక్కడి పిచ్లకు అలవాటు పడేందుకు బీసీసీఐ ఈ సన్నాహక సిరీస్ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను న్యూజిలాండ్ క్రికెట్ శుక్రవారం విడుదల చేసింది. భారత్, న్యూజిలాండ్లు ఒక టి20తో పాటు ఐదు వన్డేలు ఆడతాయి. న్యూజిలాండ్తో ఫిబ్రవరి 9న జరిగే ఏకైక టి20 మ్యాచ్తో పర్యటన ఆరంభం కానుంది. అనంతరం ఫిబ్రవరి 11, 14, 16, 22, 24వ తేదీల్లో ఐదు వన్డేలు జరుగుతాయి. అనంతరం మార్చి–ఏప్రిల్ మధ్య మహిళల వన్డే ప్రపంచ కప్ ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ట్వీట్తో.. కానీ.. Ind Vs Nz Test Series: న్యూజిలాండ్తో సిరీస్కు ఎంపికైన శ్రీకర్ భరత్ గురించి ఈ విషయాలు తెలుసా? -
టీ20 వరల్డ్కప్లో ఆసీస్ చేతిలో ఓటమి తర్వాత.. మెరుగ్గానే
Smriti Mandhana Comments On Team: 2020 మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి తర్వాత భారత్ ఎంతో మెరుగుపడిందని టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్లు ఆడేందుకు బ్రిస్బేన్లో ఉన్న టీమిండియా... 14 రోజుల కఠిన క్వారంటైన్ను ముగించింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంధాన ‘టి20 ప్రపంచ కప్ తర్వాత కోవిడ్–19 రూపంలో జట్టుకు సుదీర్ఘ విరామం దొరికింది. దాంతో ప్లేయర్లందరికీ తమ ఆటతీరును అర్థం చేసుకునేందుకు అవకాశం దొరికింది. ఆ సమయంలో ఎక్కడ బలంగా ఉన్నాం... ఎక్కడ మెరుగవ్వాలనే అంశాలపై ఒక అవగాహనకు వచ్చాం. అంతేకాకుండా ఫిట్నెస్పై దృష్టి సారించాం. ఆసీస్తో ఆడేందుకు ఎదురు చూస్తున్నా’ అని స్మృతి పేర్కొంది. ఆసీస్తో ఈ నెల 21తో జరిగే తొలి వన్డేతో భారత పర్యటన మొదలవుతుంది. అనంతరం 24, 26వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలను ఆడుతుంది. సెపె్టంబర్ 30–అక్టోబర్ 3 మధ్య ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు (డే–నైట్) జరుగుతుంది. అక్టోబర్ 7, 9, 11వ తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. చదవండి: Suryakumar Yadav: నాడు కవ్వించిన కోహ్లి, బ్యాట్తో జవాబిచ్చి.. టాప్-5 ఇన్నింగ్స్! -
సెప్టెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్నాక భారత మహిళల క్రికెట్ జట్టు మరో విదేశీ పర్యటనకు సిద్ధం కానుంది. సెప్టెంబర్లో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడేందుకు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించకపోయినా... ఆస్ట్రేలియా మహిళల జట్టు పేస్ బౌలర్ మేగన్ షూట్ ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో వెల్లడించింది. ‘సెప్టెంబర్ రెండో వారంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్కు ముందు ఆసీస్ జట్టుకు డార్విన్లో శిక్షణ శిబిరం ఉంది. భారత్తో సిరీస్ తర్వాత బిగ్బాస్ లీగ్, మహిళల నేషనల్ క్రికెట్ లీగ్, యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్కప్, కామన్వెల్త్ గేమ్స్లతో ఆస్ట్రేలియా క్రికెటర్లు బిజీబిజీగా ఉండనున్నారు’ అని మేగన్ షూట్ తెలిపింది. 28 ఏళ్ల మేగన్ ఆస్ట్రేలియా తరఫున 65 వన్డేలు ఆడి 99 వికెట్లు... 73 టి20 మ్యాచ్లు ఆడి 96 వికెట్లు తీసింది. వాస్తవానికి భారత మహిళల జట్టు వన్డే వరల్డ్కప్ టోర్నీకి సన్నాహకంగా ఈ ఏడాది జనవరిలోనే ఆస్ట్రేలియాలో పర్యటించాల్సింది. అయితే కరోనా కారణంగా భారత పర్యటన వాయిదా పడింది. -
పొవార్ మళ్లీ వచ్చాడు...
దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత మహిళల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ రమేశ్ పొవార్. ఆ తర్వాత డబ్ల్యూవీ రామన్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు రామన్కు కొనసాగింపు ఇవ్వని బీసీసీఐ, ఇంటర్వ్యూ ద్వారా పొవార్కే మరో అవకాశం కల్పించింది. నాడు మిథాలీ రాజ్తో వివాదం తర్వాత పొవార్ తన పదవి పోగొట్టుకోగా... టి20 ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్ చేరిన తర్వాత కూడా రామన్కు మరో అవకాశం దక్కకపోవడం విశేషం. ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా రమేశ్ పొవార్ నియమితుడయ్యాడు. మదన్లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్ సభ్యులుగా ఉన్న బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ ద్వారా పొవార్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ పదవి కోసం 35 మంది పోటీ పడటం విశేషం. ఇందులో ఇప్పటి వరకు కోచ్గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్తోపాటు హృషికేశ్ కనిత్కర్, అజయ్ రాత్రా, మమతా మాబెన్, దేవిక పల్షికర్, హేమలత కలా, సుమన్ శర్మ తదితరులు ఉన్నారు. ‘పొవార్ చాలా కాలంగా కోచింగ్లో ఉన్నాడు. జట్టు కోసం అతను రూపొందించిన విజన్ మాకు చాలా నచ్చింది. టీమ్ను అత్యున్నత స్థాయికి చేర్చేందుకు అతని వద్ద చక్కటి ప్రణాళికలు ఉన్నాయి. ఆటపై అన్ని రకాలుగా స్పష్టత ఉన్న పొవార్ ఇకపై ఫలితాలు చూపించాల్సి ఉంది’ అని ïసీఏసీ సభ్యుడు మదన్లాల్ వెల్లడించారు. 42 ఏళ్ల పొవార్ను ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కోచ్గా నియమించారు. మహిళల సీనియర్ టీమ్తో పాటు ‘ఎ’ టీమ్, అండర్–19 టీమ్లను కూడా అతనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. మిథాలీ రాజ్తో వివాదం తర్వాత... రమేశ్ పొవార్ కోచ్గా ఉన్న సమయంలోనే భారత మహిళల జట్టు వరుసగా 14 టి20 మ్యాచ్లు గెలిచింది. అతడిని మొదటిసారి జూలై 2018లో జట్టుకు హెడ్ కోచ్గా తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్లో వెస్టిండీస్లో జరిగిన టి20 ప్రపంచకప్ వరకు కాంట్రాక్ట్ పొడిగించారు. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్లతో భారత్ చిత్తుగా ఓడిన ఈ మ్యాచ్లో సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్కు తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే టోర్నీ ముగిశాక పొవార్పై మిథాలీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్పై మిథాలీ నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్ను కోచ్ పదవి నుంచి బోర్డు తప్పించింది. టి20 కెప్టెన్ హర్మన్ప్రీత్, స్మృతి మంధాన కలిసి పొవార్నే కొనసాగించమంటూ బీసీసీఐకి ప్రత్యేకంగా లేఖ రాసినా బోర్డు పట్టించుకోలేదు. రమేశ్ పొవార్ కెరీర్... ఆఫ్స్పిన్నర్గా భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్ పొవార్ 40 వికెట్లు పడగొట్టాడు. ముంబైకి చెందిన పొవార్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 470 వికెట్లు, 4,245 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్లో అతను పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కొచ్చి టస్కర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కోచ్గా ఈసీబీ లెవల్–2 సర్టిఫికెట్ అతనికి ఉంది. మహిళల జట్టు కోచ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఎన్సీఏలో కోచ్గా పని చేసిన పొవార్ శిక్షణలోనే ముంబై ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది. రామన్కు అవకాశం దక్కేనా? డబ్ల్యూవీ రామన్ 2018 డిసెంబర్లో మహిళల జట్టు కోచ్గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరిన భారత్... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 1–4తో... టి20 సిరీస్ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్లో ఓటమికి కోచ్ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం. నిజానికి కోచ్గా రామన్కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు. జట్టు సభ్యులందరికీ రామన్పై గౌరవ మర్యాదలు ఉన్నాయి. జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత పురుషుల ద్వితీయ శ్రేణి జట్టుకు రామన్ కోచ్గా వెళ్లవచ్చని, అందుకే తప్పించారని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓకే కానీ లేదంటే సరైన కారణం లేకుండా కొనసాగింపు ఇవ్వకపోవడం మాత్రం బోర్డు నిర్ణయంపై సందేహాలు రేకెత్తించేదే. మిథాలీతో పొసగేనా... త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటన కోచ్గా పొవార్కు తొలి బాధ్యత. ఈ సిరీస్లో పాల్గొనే జట్టు ఎంపిక కోసం నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పొవార్ సమావేశం కానున్నాడు. ఇప్పటికే టి20ల నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్ వన్డేల్లో ఇప్పటికీ కీలక బ్యాటర్ కావడంతోపాటు కెప్టెన్గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్కప్ వరకు ఆడతానని కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ కోసం ఆమె కెప్టెన్సీ నిలబెట్టుకోగలదా అనేది మొదటి సందేహం. భవిష్యత్తు పేరు చెప్పి ఆమెను తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇక వరల్డ్కప్కు ముందు ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది. అంటే దాదాపు ఏడాది పాటు మిథాలీ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోపాటు కోచ్తో కూడా సరైన సంబంధాలు కొనసాగించడం పెద్ద సవాల్. నాటి ఘటన తర్వాత ఇద్దరూ కలిసి పని చేయడం అంత సులువు కాదు. గతానుభవాన్ని బట్టి చూస్తే పొవార్ అనూహ్యంగా ఏదో ఒక రోజు జట్టు ప్రయోజనాల కోసం అంటూ మిథాలీని పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంటర్వ్యూ సందర్భంగా మిథాలీతో వివాదం గురించి కూడా పొవార్తో మాట్లాడినట్లు మదన్లాల్ చెప్పారు. ‘ఆ ఘటనలో తన తప్పేమీ లేదని, అందరు ప్లేయర్లతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని పొవార్ స్పష్టం చేశాడు’ అని మదన్లాల్ వివరణ ఇచ్చారు. -
దుమ్మురేపిన షఫాలీ వర్మ..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో భారత టీనేజర్ షఫాలీ వర్మ మళ్లీ ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో షఫాలీ 750 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టి20ల్లో షఫాలీ 23, 47 పరుగులతో రాణించింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి నంబర్వన్ ర్యాంక్లో ఉన్న బెత్మూనీ (ఆస్ట్రేలియా) 748 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. చదవండి: సవాల్ ఛేదించలేక చాంపియన్ చతికిలపడింది -
హ్యాట్రిక్పై భారత్ గురి
మెల్బోర్న్: టోర్నీ మొదలైన రోజే నాలుగుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను కంగుతినిపించిన భారత మహిళలు... అదే జోరుతో బంగ్లాదేశ్నూ చిత్తు చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్పై కన్నేసిన హర్మన్ప్రీత్ సేన అందరికంటే ముందుగా సెమీస్ చేరాలని తహతహలాడుతోంది. మహిళల టి20 ప్రపంచకప్లో గ్రూప్ ‘ఎ’లో ఇప్పటిదాకా ఎదురులేని భారత జట్టు గురువారం జరిగే పోరులో న్యూజిలాండ్తో తలపడనుంది. గత రెండు మ్యాచ్ల్లో మన అమ్మాయిలు ఇటు బ్యాటింగ్లోనూ, అటు బౌలింగ్లోనూ అదరగొట్టారు. 16 ఏళ్ల టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ మెరుపుదాడి... టాపార్డర్ బ్యాట్స్మన్ జెమీమా రోడ్రిగ్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ భారత ఇన్నింగ్స్కు బలంకాగా... బౌలింగ్లో పూనమ్ యాదవ్ తన స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే కెప్టెన్ హర్మన్ప్రీత్ నుంచే ఇంకా అవసరమైన మెరుపులు రాలేదు. బహుశా కివీస్తో నేడు జరిగే మ్యాచ్లో ఆ లోటు తీర్చుకునే అవకాశముందేమో చూడాలి. జ్వరంతో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్కు దూరమైన డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన జట్టులోకి రావడం భారత బ్యాటింగ్ ఆర్డర్ను మరింత పటిష్టం చేసింది. మిడిలార్డర్లో దీప్తి శర్మతో పాటు వేద కృష్ణమూర్తి మెరుపులు మెరిపించగలరు. స్పిన్నర్ పూనమ్తో పాటు పేసర్ శిఖా పాండే వెటరన్ స్టార్ జులన్ గోస్వామి లేని లోటును సమర్థంగా భర్తీ చేస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో భారత విజయానికి బౌలింగ్ దళం ఎంతగానో దోహదపడింది. ఇక కివీస్ విషయానికొస్తే... భారత్పై ఆ జట్టుకు మంచి రికార్డు ఉంది. గత మూడు ముఖాముఖి పోటీల్లో న్యూజిలాండే గెలిచింది. కెప్టెన్, ఆల్రౌండర్ సోఫీ డివైన్, సుజీ బేట్స్... బౌలింగ్లో లియా తహుహు, అమెలియా కెర్ జట్టుకు ప్రధాన బలం కాగా... ఫామ్లో ఉన్న భారత్ను కివీస్ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. -
చేజేతులా...
మెల్బోర్న్: కీలకదశలో ఒత్తిడికి లోనైన భారత మహిళల క్రికెట్ జట్టు మూల్యం చెల్లించుకుంది. విజేతగా నిలవాల్సిన చోట పరాజయాన్ని పలకరించింది. ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 11 పరుగుల తేడాతో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒకదశలో 15 ఓవర్లలో 3 వికెట్లకు 115 పరుగులు చేసి విజయందిశగా సాగుతోంది. భారత్ విజయానికి 30 బంతుల్లో 41 పరుగులు అవసరమైన దశలో... ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ జెస్సికా జొనాస్సెన్ మాయాజాలం చేసింది. జెస్సికా స్పిన్ వలలో చిక్కుకున్న భారత మహిళల జట్టు చివరి 7 వికెట్లను 29 పరుగుల తేడాలో కోల్పోయి సరిగ్గా 20 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. జోరు మీదున్న స్మృతి మంధాన (37 బంతుల్లో 66; 12 ఫోర్లు)ను మేగన్ షుట్ అవుట్ చేయగా... ఆ తర్వాత జెస్సికా స్పిన్కు హర్మన్ప్రీత్ (14; 2 ఫోర్లు)... దీప్తి శర్మ (10), అరుంధతి రెడ్డి (0), రాధా యాదవ్ (2), తానియా భాటియా (11; 2 ఫోర్లు) పెవిలియన్ చేరుకున్నారు. శిఖా పాండే (4)ను ఎలీస్ పెర్రీ అవుట్ చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. బెథానీ మూనీ (54 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. యాష్లే గార్డెనర్ (26; 5 ఫోర్లు), మేగన్ లానింగ్ (26; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. భారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆస్ట్రేలియా ఏకంగా 19 పరుగులు సాధించి భారత్ ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. -
చివరి ఓవర్లో సిక్సర్తో గెలిచారు
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ముక్కోణపు టి20 సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఇంగ్లండ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని బోణి కొట్టింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వీరోచిత ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించింది. 148 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు మిలిగివుండగానే చేరుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీషు టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. కెప్టెన్ నైట్(67), బీమౌంట్(37) మాత్రమే రాణించారు. రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పగొట్టారు. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు సాధించింది. హర్మన్ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్తో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. చివరి ఓవర్లో సిక్సర్తో జట్టుకు విజయాన్ని అందించింది. షఫాలి వర్మ 30, రొడ్రిగ్స్ 26, స్మృతి మంధన 15, భాటియా 11, దీప్తి శర్మ 12 పరుగులు చేశారు. స్మృతి మంధన వివాదాస్పద క్యాచ్తో జౌట్ కావడంతో తక్కువ స్కోరు వెనుదిరగాల్సి వచ్చింది. (చదవండి: టీమిండియా ‘డబుల్ సూపర్’) -
మహిళల క్రికెట్ జట్టు కోచ్ ఎవరో తెలుసా?
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కోచ్గా డబ్ల్యూవీ రామన్ ఎంపికయ్యారు. గ్యారీ కిర్స్టెన్, హెర్షల్ గిబ్స్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్ వంటి హేమాహేమీలను అధిగమించి కోచ్ పదవిని దక్కించుకున్నారు. ఆయనను మాజీ క్రికెటర్లు కపిల్దేవ్ అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన కమిటీ గురువారం ఇంటర్వ్యూ చేసి.. ఎంపిక చేసింది. తాత్కాలిక ప్రాతిపదికపై ఇటీవలి ప్రపంచ కప్ వరకు కోచ్ బాధ్యతలు నిర్వహించిన రమేశ్ పొవార్ పదవీకాలం గత నెల 30తో ముగియడంతో కొత్త కోచ్ను ఎంపిక చేయాల్సి వచ్చింది. (ఆ ఒక్కరు ఎవరో?) డబ్ల్యూవీ రామన్ ప్రస్తుతం బెంగాల్ రంజీ టీమ్ కోచ్గా ఉన్నారు. క్రికెట్పై విశేష పరిజ్ఞానం ఉన్న 53 ఏళ్ల రామన్.. భారత అండర్–19తో పాటు బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు, ఐపీఎల్లో కోల్కతా, పంజాబ్ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించారు. టీమిండియా మాజీ ఓపెనర్ అయిన ఆయన ఆటగాడిగా కంటే కోచ్గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. టీమిండియా తరపున 11 టెస్టులు ఆడి 448 పరుగులు చేశారు. 27 వన్డేల్లో 617 పరుగులు సాధించారు. ఈ రెండు ఫార్మాట్లలో రెండేసి వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. -
కొమ్ముల్ని కనిపెట్టలేకపోవడం.. నాట్ ఎ గుడ్ లీడర్షిప్
ఉమన్ లీడర్స్ స్ట్రాంగ్గా ఉంటారు కానీ స్ట్రాంగ్గా కనిపించాలని అనుకోరు. పరిచయాలు ఉంటాయి కానీ ప్రయోజనాలకు ఉపయోగించుకోరు. నేనెంత ఇస్తున్నాను అనే కానీ నాకెంత వస్తోందన్నది చూసుకోరు. అయితే ఈ ధోరణిని కాస్తయినా మార్చుకోవాలని యూరోపియన్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు సలహా ఇస్తున్నారు! టీమ్వర్క్లో ‘నడిపించడం’ మెయిన్ వర్క్. నెట్వర్క్లో ‘కలుపుకుంటూ నడిపించడం’ మేజర్ వర్క్. నడిపించడానికైనా, కలుపుకుంటూ నడిపించడానికైనా ఒక హెడ్డు ఉండాలి. ఆ హెడ్డుకు రెండు కొమ్ములు ఉండాలి. అవొచ్చేం కుమ్మేయవు. కుమ్మేయకపోయినా, కుమ్మేస్తాయేమోనన్న భయం టీమ్ మెంబర్స్ కడుపులో ఉండాలి. అందుకోసమైనా ఆ హెడ్డు తలపై కొమ్ములుండాలి.చిన్నపాటి టీమ్నైనా మేనేజ్ చెయ్యడం పెద్ద పని. నలుగురు సభ్యులున్న టీమ్లో కూడా ఒక డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు. ఒక కిమ్జోంగ్ ఉన్ ఉంటాడు. ఒక లష్కరే తోయిబన్ ఉంటాడు. పైకి కనిపించని ఒక ముష్కరుడు ఉంటాడు. వీళ్లతో పని చేయించాలి. వీళ్ల వల్ల çపని చెడకుండానూ చూసుకోవాలి. కొమ్ములుంటేనే ఇది సాధ్యం. మరి కొమ్ముల్లేని మనిషైతే? లేకపోవడం ఉండదు. కొమ్ములున్న మనిషే దేవుడి ఆఫీస్లోనైనా టీమ్ లీడర్ అవుతాడు. ఒకవేళ కొమ్ముల్తో పనేముందని ఎవరైనా చిరునవ్వుతో వచ్చి చైర్లో కూర్చుంటే, వెంటనే టీమ్లోని వాళ్లకు కొమ్ములొచ్చి, చైర్లో ఉన్న చిరునవ్వును పొడవడానికి వస్తాయి. కనుక కొమ్ములున్న హెడ్డునే కంపెనీలు ప్రిఫర్ చేస్తుంటాయి. టీమ్నంతటినీ పూటకోసారైనా గుంపుగా నిలబెట్టి పెద్దగా అరిచేయడం, ఫైర్ చేసి పడేస్తానని ఫైల్స్, వాటర్ బాటిల్స్ విసిరిగొట్టడం, గాజుబల్ల మీద దబీదబీమని పిడిగుద్దులు గుద్దడం, పైవాళ్ల నిఘా నీడలో ఉన్నారని బెదరించడం, టీమ్లోనే ఒకరి మీద ఒకర్ని నిఘాకు పెట్టడం.. ఇంత ఉంటుంది ఒక టాస్క్ పూర్తవడానికి! టాస్క్ సక్సెస్ఫుల్గా పూర్తి అయ్యాక హెడ్డుకు పేరొస్తుంది. టీమ్వర్క్ నుంచి.. టీమ్లను నడిపించే నెట్వర్క్ హెడ్డుగా కొమ్ముల కీర్తి కిరీటం లభిస్తుంది. టీమ్ చేత తిన్నగా ఒక చిన్న పనినైనా చేయించడం వెనుక ఇంత కృషి, క్రుంగుబాటు ఉంటాయి కనుకే ఈ కొమ్ముల ఫీల్డులో కీర్తి కిరీటధారణ వరకు ఎదుగుతూ వెళ్లే మహిళా టీమ్ లీడర్స్ చాలా తక్కువమంది కనిపిస్తుంటారు. ఏ? అంటే.. కొమ్ములు పెట్టుకునొచ్చి క్యాబిన్లో కూర్చోవడం వాళ్లకు ఇష్టం ఉండదు. ఏ? అంటే.. కొమ్ములు మనుషులక్కాదు కదా ఉండేది అని వారి సందేహం. ‘మరి ఎప్పుడు ఎదుగుతావ్ మహిళా?’ అంటే.. వర్క్ కదా ఎదగాల్సింది. ఉమన్గా నేను కాదు కదా’ అని ఆమె సమాధానం! ‘ఓకే దెన్. వర్క్ ఎదగాలన్నా, రెండు పెట్టుడు కొమ్ములైనా ఉండాలి కదా’.. అంటే.. ‘నేనూ వారితో కలిసి పనిచేస్తాను. కలిసి పనిచేసేటప్పుడు కొమ్ములు అడ్డుపడకూడదు కదా’ అని ఆమె స్కూల్ ఆఫ్ థాట్. జర్మనీలోని ‘యూరోపియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఈఎస్బీ) ఇటీవల 37 మంది హై–ప్రొఫైల్ ఉమన్ లీడర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలాగే.. ‘కొమ్ములెందుకు?’ అని ఆ లీడర్స్ క్వశ్చన్ చేశారు. వాళ్లంతా జర్మనీలోని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నవారు. పెద్ద పొజిషనే కానీ, పెద్ద సంఖ్యేం కాదు. మగ సీఈవోలు, సీఎఫ్వోలతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువ.. ఎంత పెద్ద దేశంలోనైనా. ఉన్న ఈ కొద్దిమందికైనా కొమ్ములెందుకు లేవని ఈఎస్బీ ఎనలైజ్ చేసింది. ఆ ముప్పై ఏడు మంది ఇచ్చిన సమాధానాలను బట్టి జరిగిన ఎనాలిసిస్ అది. ఉమన్ లీడర్స్ స్ట్రాంగ్గా ఉంటారు కానీ స్ట్రాంగ్గా కనిపించాలని అనుకోరు. పరిచయాలు ఉంటాయి కానీ ప్రయోజనాలకు ఉపయోగించుకోరు. ముందున్న పని మీదే ధ్యాస ఉంటుంది తప్ప, వెనకేం జరుగుతోందన్నది పట్టించుకోరు. ప్రొఫెషనల్గా గొప్ప టాలెంట్ ఉంటుంది కానీ, ఉందని చెప్పుకోరు. ఎబౌ ఆల్.. నేనెంత ఇస్తున్నాను అనే కానీ, నాకెంత వస్తోందన్నది చూసుకోరు. ఇదీ ఈఎస్బీ రిపోర్ట్. అందుకే వాళ్లు పెద్దగా అరిచి ఫైల్స్ విసిరికొట్టడం లేదు. వాటర్ బాటిల్స్ని ఎత్తిపడేయడం లేదు. బల్లలపై పిడికిళ్లు బిగించడం లేదు. ట్రంప్లు, కిమ్లు, లష్కరేలు, ముష్కరేలు.. టీమ్లో ఎవరున్నా.. పనిని సాఫ్ట్గా నడిపించేస్తున్నారు. ‘అయినప్పటికీ మహిళలు కొంచెం మారాలి’ అని ఈఎస్బీ రిపోర్ట్ సజెస్ట్ చేస్తోంది. మారడం అంటే.. టీమ్ని నడిపిస్తున్నప్పుడు.. ముందే కాదు, కాస్త వెనుకా చూసుకుంటూ ఉండటం. లేకుంటే ఏ కొమ్మో వచ్చి పొడిచేస్తే ఎలా అని. ఇండియ ఉమన్ క్రికెట్ టీమ్లో ఇప్పుడు జరిగిందదే! రెండు మ్యాచుల్లో టీమ్లోంచి స్టార్ ప్లేయర్ మిథాలీరాజ్ని డ్రాప్ చేసిన తర్వాత ఆ మహిళా టీమ్లో ఎవరూ ప్రశాంతంగా లేరు. టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్. ఆమెకేం గొడవ లేదు మిథాలీతో. సెలక్టర్ సుధా షా. ఆమెకేం గొడవలేదు మిథాలీతో. టీమ్ మేనేజర్ తృప్తి భట్టాచార్య. ఆమెకేం గొడవలేదు మిథాలీతో. బి.సి.సి.ఐ. సభ్యురాలు డయానా ఎడుల్జీ. ఆమెకేం గొడవ లేదు మిథాలీతో. మరి మిడిల్ ఆఫ్ ది రోడ్.. మిథాలీ ఎందుకు డ్రాప్ కావలసి వచ్చింది? ఎందుకంటే వెనుక నుంచి రెండు కొమ్ములొచ్చి పొడిచాయి. ఆ కొమ్ములు కోచ్ రమేశ్ పొవార్వి! పొడిచింది కోచ్ అయినా, డీఫేమ్ అయింది టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్. అందుకే ఉమన్ టీమ్ లీడర్స్ క్రికెట్లోనే కాదు, కార్పొరేట్ వరల్డ్లోనూ కొమ్ముల్ని కనిపెట్టి ఉండాలి. లీడర్కి కొమ్ములు లేకపోవడం మంచి విషయమే. కొమ్ముల్ని కనిపెట్టలేకపోవడం మాత్రం.. నాట్ ఎ గుడ్ లీడర్షిప్. - మాధవ్ శింగరాజు -
‘నా చివరి టీ20 వరల్డ్కప్ ఇదే కావచ్చు’
గయానా: మహిళల క్రికెట్లో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న టీమిండియా ఓపెనర్, స్టార్ బ్యాట్స్వుమెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం ప్రకటించారు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తన చివరిది అవుతుండొచ్చని తెలియజేశారు. టీ20 అంటేనే ధనాధన్ ఆట అని, అందుకే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘జట్టులో చాలా మార్పులు వచ్చాయి, కొత్త ప్లేయర్లను ప్రోత్సాహించాల్సిన అవసరం ఏర్పడింది. దేశం తరపున ఎంతకాలం ఆడామన్న దానికంటే.. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే గొప్ప విషయం. నా బ్యాటింగ్ కంటే ఎక్కువగా జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచించాను. యువ ప్లేయర్లు కుదురుకుని జట్టు సమతూకంగా ఉండడంతో ఇదే తనకు చివరి టీ20 వరల్డ్కప్ అయ్యే అవకాశం ఉంది’. అంటూ మిథాలీ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఆ ఫార్మట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మిడిలార్డర్లో రావటంపై.. న్యూజిలాండ్ బలమైన జట్టు కావడంతో అనుభవం కలిగిన బ్యాటర్ మిడిల్ ఆర్డర్లో ఉంటే జట్టుకు ఉపయోగమని భావించామని అందకే ఆ మ్యాచ్లో ఓపెనింగ్కు రాలేదని వివరించారు. రెండో మ్యాచ్లో పాకిస్థాన్ స్పిన్నర్లతో బరిలోకి దిగడంతో ఓపెనర్గా వస్తేనే బెటర్ అనుకున్నామని పేర్కొన్నారు. ఇక తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, ప్లాన్కు ప్రకారమే ఆడితే కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది గనుక పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా ఆడాలో, నెమ్మదిగా ఆడాలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో మిథాలీరాజ్ 56 పరుగులు (47 బంతుల్లో) చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. -
శ్రీలంక మహిళలతో భారత్ పోరు
గాలే: భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనలో తలపడేందుకు సిద్ధమైంది. ఐసీసీ మహిళల చాంపియన్షిప్ మూడో రౌండ్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 11, 13, 16 తేదీల్లో జరుగనుంది. 2021 ప్రపంచకప్ కోసం ఈ టోర్నీలను నిర్వహిస్తున్నారు. గత ప్రపంచకప్ రన్నరప్ భారత్ ఈ రేసులో నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. కానీ పాక్, విండీస్లతో జరిగిన సిరీస్ల్లో ఓడిపోవడంతో శ్రీలంక ఖాతానే తెరవలేదు. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టుకు భారత్తో ఈ సిరీస్ కీలకంగా మారింది. ‘మేం బాగా సన్నద్ధమయ్యాం. విండీస్లో జరగబోయే ప్రపంచ టి20 ఈవెంట్లో రాణించేందుకు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడుతుంది’ అని కెప్టెన్ మిథాలీ చెప్పింది. -
హ్యాట్రిక్ ఓటములు.. టీమిండియా ఔట్
సాక్షి, ముంబై : హ్యాట్రిక్ ఓటములతో టీమిండియా మహిళల జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి నిష్క్రమించింది. పేటీఎం కప్లో భాగంగా సోమవారం ముంబైలోని బ్రాబౌర్నే స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ తలబడ్డాయి. 187 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా జట్టు ఆస్టేలియాను బ్యాటింగ్ను ఆహ్వానించింది. ఎలిసే విలని 61 పరుగుల స్కోర్ సాధించటంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్లు నష్టపోయి 186 పరుగులు సాధించింది. ఇక 187 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా ఆది నుంచే తడబడింది. ఆసీస్ బౌలర్ మెగాన్ స్కట్ బౌలింగ్ ధాటికి రెండో ఓవర్లోనే ఓపెనర్ స్మృతి మంధాన(3), మిథాలీ రాజ్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత దీప్తి శర్మ వికెట్ను కూడా దక్కించుకోవటంతో హ్యాట్రిక్ సాధించి.. టీ20లో తొలి హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్రేలియన్ బౌలర్గా(ఓవరాల్గా ఏడో బౌలర్) మెగాన్ స్కట్ నిలిచారు. చివరకు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసిన టీమిండియా జట్టు 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనుజా పాటిల్ 38 పరుగులు, పూజా 19 పరుగులు సాధించారు. ఇక వరుసగా మూడు ఓటములతో ఈ ట్రై సిరీస్ ఫైనల్ బెర్త్కు దూరమైంది. అయితే ఇంగ్లాండ్తో మరో నామ మాత్రపు మ్యాచ్ను భారత్ ఆడనుండగా.. కప్ కోసం ఫైనల్లో ఇంగ్లాండ్-ఆసీస్లు తలపడనున్నాయి. -
టీ20ల్లో రెండో అత్యధిక స్కోర్ నమోదు
-
భారత మహిళల ప్రపంచ రికార్డు!
సాక్షి, ముంబై : అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళా జట్టు రికార్డు స్కోర్ నమోదు చేసింది. ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో 4 వికెట్లు కోల్పోయి198 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యధిక స్కోర్గా రికార్డుకెక్కింది. 2010లో నెదర్లాండ్స్పై దక్షిణాఫ్రికా 205/1 పరుగులతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా(191/3), న్యూజిలాండ్ (188/3), ఇంగ్లండ్ (187/5) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి . ఈ ఏడాదే గత దక్షిణాఫ్రికా పర్యటనలో 168/3 పరుగుల స్కోరు చేసిన హర్మన్ ప్రీత్ సేన తాజా స్కోర్తో అధిగమించింది. ఇక భారత మహిళల బ్యాటింగ్లో స్మృతి మంధాన 76( 40 బంతులు, 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగవంతమైన హాఫ్సెంచరీకి తోడు మిథాలీ రాజ్ 53(43 బంతుల్లో 7 ఫోర్లు) రాణించడంతో భారీ స్కోరు నమోదైంది. -
భారత జట్టుకు ఆసీస్ షాక్
వడోదరా : దక్షిణాఫ్రికాపై విజయాలతో ఉత్సాహంగా కనిపించిన భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ను చేజార్చుకుంది. మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో ఆసీస్కు కోల్పోయింది. తొలి వన్డేలో ఓటమి చవిచూసిన మహిళా జట్టు తాజాగా గురువారం జరిగిన రెండో వన్డేలో 60పరుగుల తేడాతో ఓడిపోయింది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత మహిళా జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. స్మృతి మంధాన( 67; 53 బంతుల్లో 12ఫోర్లు, 1సిక్సర్) జోరుతో తొలి వికెట్కు 88పరుగుల భాగస్వామ్యం నమోదయింది. ఆ తరువాత మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు పరుగులు చేయడంలో విఫలమవడంతో ఓటమి తప్పలేదు. 227 పరుగులకు ఆలౌటై పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోనస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా, వెల్లింగ్టన్, పెర్రీ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నికోల్ బోల్టన్ (84; 88 బంతుల్లో 12 ఫోర్లు), ఎలైస్ పెర్రీ (70; 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బెత్ మూనీ (56; 40 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్కు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు సాధించగా, పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. ఏక్తా బిస్త్, హర్మన్ ప్రీత్ కౌర్లకు తలో వికెట్ వికెట్ దక్కింది. -
టీ20 సిరీస్కు భారత జట్టు ఎంపిక
సాక్షి, స్పోర్ట్స్: త్వరలో జరగనున్న పేటీఎం ముక్కోణపు టీ20 సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మహిళల జట్ల మధ్య ఈ ట్రైసిరీస్ నిర్వహించనున్నారు. గాయం కారణంగా దూరమైన కీలక బౌలర్ జులన్ గోస్వామి ఈ సిరీస్కు అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, వైఎస్ కెప్టెన్గా స్మృతీ మంధాన వ్యవహరించనున్నారు. ముంబై వేదికగా మార్చి 22 నుంచి 31 వరకూ ఈ సిరీస్ జరగనుంది. భారత జట్టు వివరాలు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, వేదా కృష్ణమూర్తి, జెమియా రోడ్రిగస్, అనుజా పాటిల్, దీప్తి శర్మ, తనియా భట్ (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, రుమేలీ ధార్, మోనా మెష్రమ్. -
తప్పులో కాలేసిన అమితాబ్
ముంబై: ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల వన్డే సిరీస్, టీ 20 సిరీస్లను భారత మహిళలు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలుత వన్డే సిరీస్ను 2-1తో గెలిచిన భారత మహిళలు.. టీ 20 సిరీస్ను 3-1తో కైవసం చేసుకున్నారు. ఫలితంగా దక్షిణాఫ్రికాలో రెండు సిరీస్లను తొలిసారి భారత్ తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. గత నెల్లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ల్లో భారత మహిళలు అమోఘంగా రాణించి సఫారీలకు షాకిచ్చారు. ఇదిలా ఉంచితే, సోమవారం(మార్చి 12వ తేదీ) నుంచి ఆస్ట్రేలియా-భారత మహిళా క్రికెట్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లతో భారత్ జట్టు ముక్కోణపు టీ 20 సిరీస్లో పాల్గొనుంది. భారత్ వేదికగా జరిగే ఈ రెండు సిరీస్లు జరుగనున్న తరుణంలో బాలీవుడ్ ప్రముఖ హీరో అమితాబ్ బచ్చన్ ఒక ట్వీట్ చేశారు. భారత మహిళల విజయాన్ని ఆకాంక్షిస్తూ చేసిన ట్వీట్ను తప్పుగా పోస్ట్ చేశారు. ‘ఆస్ట్రేలియాపై వన్డే, టీ20 సిరీస్లు గెలిచిన భారత జట్టుకు అభినందనలు..బ్యాటింగ్,ఫీల్డింగ్ల్లో అదరగొట్టి మరీ సిరీస్లు సాధించారు’ అని ట్వీట్ చేశారు. భారత క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ బౌండరీ లైన్పై పట్టిన క్యాచ్ను కూడా ఇక్కడ అమితాబ్ ఉదహరించారు. అయితే ఇదంతా జరిగింది దక్షిణాఫ్రికాతో సిరీస్లో అనే సంగతి మరచిన అమితాబ్.. ఆస్ట్రేలియాపై అంటూ ట్వీట్ చేయడం అభిమానుల్ని ఆలోచనలో పడేసింది. మరి ఈ ట్వీట్ను అమితాబ్ సరిచేసుకుంటారో లేదో చూడాలి. ఇప్పటికే అమితాబ్ ట్వీట్పై నెటిజన్లు జోక్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా ఆసీస్తో సిరీస్తో ఆరంభం కాకుండానే అమితాబ్ భవిష్యత్తును ఊహించి ట్వీట్ చేస్తున్నారని ఒక అభిమాని ఫన్నీ రిప్లై ఇవ్వగా, మీరు లెజెండ్ సర్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. -
మహిళలకూ మహదవకాశం
సెంచూరియన్: భారత మహిళల క్రికెట్ జట్టు ముంగిట అరుదైన ఘనత. దీనిని అందుకోవాలంటే మాత్రం బుధవారం దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగే నాలుగో టి20లో విజయం సాధించాలి. తద్వారా సఫారీ గడ్డపై వన్డే, టి20 సిరీస్లు చేజిక్కించుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30కు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అనంతరం ఇదే మైదానంలో పురుషుల జట్ల పోరాటం ఉంటుంది. యాదృచ్ఛికమే అయినా... గెలిస్తే రెండు భారత జట్లూ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్లను సొంతం చేసుకుంటాయి. ఐదు మ్యాచ్ల మహిళల సిరీస్లో ప్రస్తుతం హర్మన్ప్రీత్ సేన 2–1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు అలవోకగా గెలిచినా... మూడో మ్యాచ్లో అనవసర షాట్లతో మన జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో ప్రత్యర్థికి పుంజుకొనే అవకాశం చిక్కింది. ఈసారి అలాంటి ఉదాసీనతకు తావివ్వకుండా సామర్థ్యం మేరకు ఆడితే తిరుగుండదు. -
భారత మహిళల జట్టుకు చుక్కెదురు
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టి20 సిరీస్ దక్కించుకోవాలనుకున్న భారత మహిళల జట్టు జోరుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు టి20ల్లో గెలుపొందిన హర్మన్ప్రీత్ బృందం మూడో మ్యాచ్లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో మిడిలార్డర్ వైఫల్యంతో టీమిండియా 5 వికెట్లతో ఓడింది. తొలుత టీమిండియా 17.5 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. మిథాలీ రాజ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరినా... మరో ఓపెనర్ స్మృతి మంధాన (37; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (48; 6 ఫోర్లు, 2 సిక్స్లు), వేద కృష్ణమూర్తి (23; 4 ఫోర్లు) ధాటిగా ఆడారు. ఒకదశలో 91/2తో పటిష్టంగా కనిపించిన భారత్ను సఫారీ పేసర్ షబ్నమ్ 5 వికెట్లతో దెబ్బతీసింది. అనంతరం సఫారీలు ల్యూస్ ( 41; 5 ఫోర్లు), కెప్టెన్ నికెర్క్ (20 బంతుల్లో 26; 5 ఫోర్లు), ట్రియాన్ (34; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించడంతో మరో ఓవర్ మిగిలుండగానే విజయం సాధించారు. నాలుగో మ్యాచ్ బుధవారం సెంచూరియన్లో జరుగనుంది. -
ఆ విషయంలో విరాట్ నాకు స్పూర్తి.!
న్యూఢిల్లీ: పురుషుల క్రికెటర్ల గురించి ప్రస్తావిస్తేనే చిర్రుబుర్రులాడే భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ తొలి సారి కెప్టెన్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఫిట్నెస్ విషయంలో కోహ్లి తనకు స్పూర్తిని కలిగిస్తున్నాడని ఓ జాతీయ చానెల్ ఇంటర్వ్యూలో తెలిపారు. తన కెరీర్ తొలిరోజుల్లో మహిళల క్రికెట్కు అంతగా ఆదరణ లేదని, కానీ ఇప్పడు మహిళా క్రికెటర్లను గుర్తించి గౌరవించడం సంతోషంగా ఉందని మిథాలీ పేర్కొన్నారు. క్రికెట్ శకం మొదలైన సమయంలోనే అరంగేట్రం చేసినప్పటికి అంతగా గుర్తింపు దక్కలేదన్నారు. ఇక తనపై చేసే విమర్శలపై స్పందిస్తూ కాలాన్ని వృథా చేసుకోదలుచులేనని స్పష్టం చేశారు. ప్రతి రోజు ఎంతో మంది నాకు స్తూర్తిని కలిగిస్తారు. వారిలో ఒకరి గురించి చెప్పాలంటే అది విరాట్ కోహ్లినే అని, తన ఫిట్గా ఉంటూ.. ఫిట్నెస్పై దృష్టి సారించేలా ఆసక్తి కలిగించాడని మిథాలీ తెలిపారు. క్రికెట్లో పురుషులకైనా, మహిళలకైనా ఫిట్నెస్ చాలా ముఖ్యమని మిథాలీ చెప్పుకొచ్చారు. ఇక 2017 మహిళల ప్రపంచకప్లో భారత మహిళల జట్టు ఫైనల్కు చేరి ఇంగ్లండ్ చేతిలో ఓడినప్పటికి అందరి మన్ననలు పొందిన విషయం తెలిసిందే. ఇక బీబీసీ శక్తివంతమైన మహిళల జాబితాలో కూడా మిథాలీ స్థానం సంపాదించుకున్నారు. -
టి20 సిరీస్ నూ క్లీన్ స్వీప్ చేశారు
రాంచీ: శ్రీలంక మహిళలతో జరిగిన టి20 క్రికెట్ సిరీస్ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్ లో లంకను మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కౌశల్య(25), జయాంగిని(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బిష్త్ 3, పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు. 90 పరుగుల టార్గెట్ ను 37 బంతులు మిగిలుండగానే వికెట్ నష్టపోయి భారత్ చేరుకుంది. 13.5 ఓవర్లలో 91 పరుగులు చేసింది. మంధన 43, వనిత 34, వేద కృష్ణమూర్తి 13 పరుగులు చేశారు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను మిథాలీ సేన క్లీన్ స్వీప్ చేసింది. -
మిథాలీ రాజ్ మరో ఘనత
బెంగళూరు: కెప్టెన్ మిథాలీ రాజ్ విజృంభణతో న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డేలో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2-2తో సిరీస్ ను సమం చేసింది. కివీస్ నిర్దేశించిన 221 పరుగుల టార్గెట్ ను ఇండియా టీమ్ 44.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. మిథాలీ రాజ్ అజేయ అర్ధసెంచరీతో కదం తొక్కింది. 88 బంతుల్లో 10 ఫోర్లతో 81 పరుగులు చేసింది. ఈ క్రమంలో వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకుంది. స్మృతి మంధన(66) అర్ధసెంచరీతో రాణించింది. కామిని 31, కౌర్ 32 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. నిరంజన 3, గైక్వాడ్ 3, కౌర్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు వన్డేల సిరీస్ లో రెండు టీములు రెండేసి మ్యాచ్ లు గెలిచాయి. చివరి మ్యాచ్ బుధవారం జరుగుతుంది. -
ఆట కోసం పెళ్లి వద్దంది!
సాధారణంగా పెళ్లి కోసం కెరీర్ను త్యాగం చేస్తుంటారు యువతులు. అయితే భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్ మాత్రం క్రికెట్ కోసం కళ్యాణాన్ని కాదనుకుంది. ఆలుమగల బంధం కంటే ఆటకే ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. క్రికెట్ కోసం తనను కావాలనుకున్న వాడిని కూడా వదులుకుంది. ప్రేమనూ త్యాగం చేశారు. క్రికెట్ కావాలా, ప్రేమ కావాలా అంటే ఆమె ఆటకే ఓటు వేసింది. ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్కచేయకుండా తనకెంతో ఇష్టమైన క్రీడలోనే కొనసాగుతోంది 30 ఏళ్ల ఈ హైదరాబాదీ క్రికెటర్. 25 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని మిథాలి తెలిపింది. నిజంగా పెళ్లాంటు చేసుకుంటే అతడినే చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించింది. పెళ్లైన తర్వాత క్రికెట్కు గుడ్ బై చెప్పాలని అతడు కోరాడని, అందుకు తాను అంగీకరించకపోవడంతో తమ ప్రేమ పెళ్లిపీటలు ఎక్కకుండానే ఆగిపోయిందని వివరించింది. క్రికెట్ను వదిలిపెట్టేందుకు తన మనసు అంగీకరించలేదని స్పష్టం చేసింది. జరిగినపోయిన దాని గురించి చితించడం లేదని అంటోంది ఈ సీనియర్ క్రికెటర్. మరికొన్నేళ్ల పాటు ఆటను ఆస్వాదించాలన్నదే తన ముందున్న లక్ష్యమని చెప్పింది. వయసు మీద పడుతుందన్న భయం తనకు లేదని దీమా చెబుతోంది మిథాలి. అయితే తనకు పెళ్లెప్పుడవుతుందని తల్లిదండ్రులు, బంధువులు ఎదురు చూస్తున్నారని చెందుతున్నారని చెప్పింది. తనకు సంబంధాలు కూడా చూస్తున్నారని వెల్లడించింది. తనకు పెద్దలు చూసిన సంబంధాలు తనకు నచ్చవని కుండబద్దలు కొట్టింది. అయితే పెళ్లికి తొందర పడడం లేదని తెలిపింది. మళ్లీ ప్రేమలో పడేందుకు తన టైమ్ లేదని అంది. తన భావాలకు విలువిచ్చే వ్యక్తినే పెళ్లాడతానని పేర్కొంది. ప్రస్తుతం తన మనసులో ఎవరూ లేరని, ఆటపైనే దృష్టి పెట్టానని తెలిపింది. టి20 ప్రపంచకప్లో పాల్గొనే భారత మహిళల జట్టుకు మిథాలీరాజ్ సారథిగా ఎంపికైన సంగతి తెలిసిందే. -
రెండో టీ20లో భారత్ గెలుపు
విజయనగరం: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు 9 పరుగులతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. గోస్వామి 23, శర్మ 23, సోనియా డాబిర్ 23, కృష్ణమూర్తి 16, మిథాలి రాజ్ 12 పరుగులు చేశారు. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. జయాంగిణి 40, సిరివర్థనే 21 పరుగులు చేశారు. మిగతా క్రీడాకారిణులు విఫలమవడంతో లంక ఓటమి పాలయింది. గోస్వామి, శర్మ, సోనియా డాబిర్, గ్వైక్వాడ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమయింది. మొదటి టీ20లో లంక గెలుపొందింది.