intellectuals
-
మన రాజ్యాంగం బలమైనదేనా?
మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాల సగటు ఆయుష్షు 19 ఏళ్లు మాత్రమేనని! భారతదేశం మాత్రం 75 ఏళ్ల పాటు తన రాజ్యాంగాన్ని కాపాడుకుంది. దీనికి సంతోషపడదాం. గర్వంగా ఫీల్ అవుదాం. దేశ చరిత్రలోనే కీలకమైన ఈ ఘట్టాన్ని గత వారమే చూశాం. అయితే, సమీక్షకు తగిన సమయం కూడా ఇదే! డెబ్ఫై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాళ్లు, ప్రశ్నలేమిటన్నది చూద్దాం.మన రాజ్యాంగం వలసవాదులదని చాలామంది మేధావులు విమర్శిస్తూంటారు. భారతీయ మూలాలు ఉన్నది కాదని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానిస్తూ ఉండేది. అలాంటప్పుడు ఇది ఏ విధంగా మనకు మంచిది?ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించిందనేది ఒక సమాధానం. అలాగే ఏకకాలంలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగం కూడా మనదే. కానీ దీనివల్ల అందరూ సమానంగా లాభ పడ్డారా? లేక... ముస్లింలు, ఆదివాసీలు, దళిత మహిళలు లాభ పడలేదా? డెబ్భై ఏళ్ల ప్రయాణంలో మన రాజ్యాంగం ఇప్పటివరకూ 106 సార్లు మార్పులకు గురైంది. ఇది మన శక్తికి ప్రతీకా? ఎందుకంటే, అవసరమైనప్పుడు తగు విధంగా మార్పులు, చేర్పులు చేసుకునే వీలుతో రాజ్యాంగం ఉంది. లేదా ఇది బలహీనతా? అగ్రరాజ్యం అమెరికాలో 1789 నుంచి జరిగిన సవరణలు కేవలం 27 మాత్రమే.శాసనాలు చేసే ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వర్గాన్ని రాజ్యాంగం ఎక్కువ బలోపేతం చేసిందని చెబుతారు. అసెంబ్లీ స్పీకర్ల పనితీరు, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ పరి స్థితిని మరింత దిగజార్చాయి. ఫలితంగా ఎంపీలు పార్టీ నాయకత్వా నికి సబార్డినేట్లుగా మారిపోయారు. స్పీకర్లకు హౌస్ ఆఫ్ కామన్ ్స (యూకే) మాదిరిగా వారిపై అధికారం ఏదీ ఉండదు. ఈ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ సవాలు చేయలేదు కూడా! అయితే దీని వెనుక ఏముందన్నది నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ‘‘భారతీయ రాజ్యాంగం అడ్డుగోడలు నిర్మించకుండా... కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వర్గం తన అధికారాన్ని పూర్తిస్థాయిలో చలాయిస్తుందని విశ్వసించింది’’ అంటారు గౌతమ్ భాటియా. పాలకులందరూ మంచివారనీ, రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారా? ఊహూ, అలా అనుకోలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక ఉదాహరణ – ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని సుప్తచేతనావస్థలో పెట్టడం వల్లనో, రాజ్యాంగా నికి అతీతంగా పోవడం వల్లనో అమలు కాలేదు. దాంట్లో భాగమైన వ్యవస్థలతోనే జరిగింది. ఇది మన రాజ్యాంగం బలహీనత లేదా లోపాన్ని ఎత్తిచూపింది. రాజ్యాంగ పరమైన నైతికత లేని విషయాన్ని ఎమర్జెన్సీ పరిస్థితి ఎత్తి చూపిందని చెప్పవచ్చు. ఈ నైతికత అనేది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు పనిచేస్తాయా, లేదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు తరచూ ఈ రాజ్యాంగ నైతికతను తప్పుతుంటారని మనకు తెలుసు. కానీ వాటిపై వ్యాఖ్యా నించడం కంటే ఎక్కువేమీ చేయలేము – ఈ అంశాలపై మనఆందోళన, విమర్శ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ! రాజ్యాంగంలో ఉన్న మరో లోటు ఇదేనా?రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి ఏర్పాటు చేసింది. కానీ ఆర్థికాంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలపై పెత్తనం చలాయించే అధికారం కేంద్రానికి కట్టబెట్టింది. సమాఖ్య స్వరూపాన్ని మార్చే అధికారం, శక్తి కూడా కేంద్రానిదే. స్వాతంత్య్రం లభించిన సమయంలో దేశం బలహీనంగా, ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి... ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారని అనుకున్నా మూడు సిల్వర్ జూబ్లీల కాలం గడచిన ఈ తరుణంలోనైనా మార్పులు చేయడం అనవసరమా? భారతీయ పౌరులకు రాజ్యాంగం బోలెడన్ని ప్రాథమిక హక్కు లను కల్పించింది. అయితే భావ ప్రకటన, వ్యక్తీకరణపై పూర్తిస్థాయి స్వాతంత్య్రం మాత్రం లేకుండా పోయింది. నిజానికి ఈ ‘ఫ్రీ స్పీచ్’ను నైతికత, పరువునష్టం వంటి రెండు సందర్భాల్లో మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది. మహా అయితే... విదేశాలతో మన సంబంధాలు దెబ్బతినే పరిస్థితులకూ పొడిగించవచ్చు. కానీ... మనకున్న నియంత్రణలు చాలా ఎక్కువగా లేవూ?1973లో రాజ్యాంగంపు మౌలిక స్వరూపాన్ని కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను సిద్ధం చేసింది. ఇదో చారిత్రక నిర్ణయం. అయితే దాదాపుగా అదే సమయంలో జబల్పూర్ అడిష నల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎమర్జెన్సీ విషయంలో శాసనకర్తల ఒత్తిడికి లొంగిపోయారు. అయోధ్య విషయంలోనూ ఇదే జరిగిందన్నది చాలామంది అభిప్రాయం. అలాగే జమ్మూ–కశ్మీర్కు ఉన్న రాష్ట్ర హోదాను కూడా రాజ్యాంగం కాపాడలేకపోయింది. కాబట్టి... రాజ్యాంగ సంరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు తమ నిర్ణయాల్లో అసందిగ్ధతతో వ్యవహరిస్తున్నాయి. లేదంటే అవసరమైనంత చేయడం లేదు. రాజ్యాంగం మనకు ఎన్నికల కమిషన్ , కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), ఇన్ఫర్మేషన్ కమిషన్ వంటి ఎన్నో వ్యవస్థలను కల్పించింది. కానీ... ఇవి పాలకవర్గానికి అతీతంగా స్వతంత్రంగా పని చేసేలా మాత్రం చేయలేకపోయింది. ఆ యా సంస్థల ఉన్నతాధి కారుల నియామకాల విషయంలో ఇది మరింత సత్యమని చాలా మంది చెబుతారు. చివరగా... రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రాజకీయ నేతలు, సంస్థల అధినేతలు ఆ పని ఎంత వరకూ సక్రమంగా నిర్వర్తించారు? అలాగే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతను న్యాయమూర్తులు ఎంత సమర్థంగా నిర్వహించారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ను ఇదే ప్రశ్న అడిగితే... ‘‘భారత్కు మంచి రాజ్యాంగం ఉంది. కీలక సందర్భాల్లో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు దీని ప్రతిష్ఠను దిగజార్చారు. పాలకవర్గం మాత్రమే కాదు... పార్లమెంటు కూడా ఇందులో భాగస్వామే’’ అన్నారు. ఇందులో అంగీకరించక పోయేందుకు ఏమీ లేదన్నది నా అభిప్రాయం!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వట్టి మేధావులు కాదు... మట్టి మేధావులు కావాలి!
2024 జూలై 24న కొల్లూరి సత్తయ్య అనే బీహెచ్ఈఎల్ కార్మిక నాయకుడు రిటైర్ అయ్యాడు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఆయన ఆత్మకథ ప్రచురిత మైంది. దాన్ని సత్తయ్య సొంత మాటల్లో పసునూరి రవీందర్ రాశాడు. ఈ ఆత్మకథను ప్రచురించే ముందు దానికి ముందు మాట రాయాలని పూర్తి పుస్తకాన్ని రవీందర్ నాకు ఆన్లైన్లో పంపించాడు. దాన్ని పూర్తిగా చదివాక బాల్య దశ నుండి సత్తయ్య జీవితం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అటు వంటి ఒక దళిత కార్మికుని జీవిత కథను నేను ఎప్పుడూ చదవలేదు. ఆ పుస్తకానికి టైటిల్ కూడా మీరే సూచించండి అని సత్తయ్య, రవీందర్ అడిగి నప్పుడు ఈయనను ‘మట్టి మేధావి’ అనొచ్చని సూచించాను. ఆ పుస్తకం ఇప్పుడు ‘మట్టి మేధావి – కొల్లూరి సత్తయ్య – ఆటోబయోగ్రఫీ’ అనే టైటిల్తో బయటికి వచ్చింది.ముందుమాటలో నేను, ఇలా రాశాను: ‘‘కొల్లూరి సత్తయ్య జీవితకథ... ఒక మట్టి మేధావి చరిత్రలా కనిపిస్తుంది. ఆయన జీవితం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక చిన్న పల్లెటూరిలో (హైదరాబాద్ శివారు తెల్లాపూర్లో) ఒక మాదిగ కుటుంబంలో పుట్టి ఈ విధంగా ఎట్లా ఎదిగాడు అనిపిస్తుంది.’’సత్తయ్య మొదట్లో అసలు చదువురాని పది రూపాయల కూలీ మనిషి. బీహెచ్ఈఎల్లో పాకీ దొడ్లు కడుగుడు, క్యాంటీన్ ప్లేట్లు కడుగుడు పని చేసేవాడు. ఇంట్ల రైల్ వే గాంగ్మన్ తండ్రికి ఇద్దరు భార్యలు, 14 మంది పిల్లలు. సత్తయ్య అందరికంటే చిన్నవాడు. తండ్రి తప్ప మిగతా కుటుంబీకులు కూలీపని చేసేవారే. సత్తయ్య తల్లి మాత్రం మంత్ర సాని. ఆమె కులం మాదిగైనా డెలివరీలు చాలా బాగా చేసేది గనుక ఊళ్ళో పుట్టిన ప్రతి పిల్లకు క్షేమంగా కాన్పు చేయించే మంత్రసాని ఆమె.అందువల్ల ఆమెకు ఊళ్ళో బువ్వ దొరకని రోజుండేది కాదట. ఎక్కువ దొరికిన రోజు ఇంట్లో అందరి తోపాటు చుట్టు ఉన్న బిచ్చగాళ్లకు ఆమె బువ్వ పెట్టేది. అవ్వ (తల్లి) నుండి నేర్చుకున్న కొడుకు 10 రూపాయల్లో ఒక్క రూపాయి పక్కకు పెట్టి తమ గ్రామ శివార్లలో ఒంటికి చినిగిన బట్ట పేగులతో బతికే స్త్రీలకు చీర కొనిచ్చే పని మొదలుపెట్టాడు. క్రమంగా బీహెచ్ఈఎల్లో కార్మిక నాయకుడ య్యాడు. తనతో పాటు అతి చిన్న ఉద్యోగులను పర్మనెంటు చెయ్యాలని పోరాటాలు మొదలుపెట్టి కార్మికుల హక్కు కోసం అలుపెరుగని పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో తెలుగులో చదవడం నేర్చు కున్నాడు.గ్రామ స్థాయిలో దళితుల భూములను (ముఖ్యంగా ఇనామ్ భూములు) భూదందా దారులు ఆక్రమించకుండా కాపాడే పోరాటాలు చేశాడు. క్రమంగా ఆర్థికంగా పుంజుకుంటూ కంప్యూటర్ సమస్య బీద విద్యార్థులు ఎదుర్కోగానే చిన్న కంప్యూటర్ సెంటర్ ప్రారంభించి బీద విద్యా ర్థులకు నేర్పించే ఏర్పాటు చేశాడు. కరోనా రాక ముందే అనాథ పిల్లలను తెచ్చి తన తాతకు ఇనాముగా వచ్చిన భూమిలో గదులు కట్టి తన పిల్లలు చదువుకున్న ఇంగ్లిష్ మీడియం బడుల్లో చేర్పించాడు. కరోనాతో ఆ సేవ ఆపాల్సి వచ్చింది. అప్పుడు ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు బువ్వ బండి ప్రారంభించాడు. తన సొంత ఆదాయం నుండి ఖర్చుపెట్టి రోజుకు 400 మందికి మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ రోజూ పెట్టేవాడు. ఆ బువ్వ బండి ఇప్పటికీ నడుస్తోంది. ఆ క్రమంలోనే నా సలహాతో ‘ఫూలే–అంబేడ్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్’ ప్రారంభించాడు. దీన్ని చట్టపరంగా నడిపేందుకు ‘అమృత–సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపించాడు. 2022 జనవరి 26న ప్రారంభమైన ఈ ఫిలాసఫీ–ఇంగ్లిష్ ట్రైనింగ్ దాదాపు 500 మందిని 23 రాష్ట్రాల నుండి సెలెక్ట్ చేసి ప్రతి 40 మందితో బ్యాచ్కి నెలరోజులు ఉచిత వసతి, ఉచిత తిండితో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సత్తయ్యే 2024 జనవరి 30న తెల్లాపూర్లో గద్దర్ విగ్రహాన్ని స్థాపించాడు. దానికి ప్రభుత్వం 10 కుంటల భూమి ఇచ్చింది.సత్తయ్యను మట్టిమేధావి (ఇంగ్లిష్లో ఇటువంటి వారినే ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్) అని ఎందుకన్నారని నన్ను కొంతమంది అడిగారు. ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ దళితుల, ఆది వాసుల, శూద్ర, బీసీలలో బీద పిల్లల చదువుల గురించి చాలా కృషి చేస్తున్నాడు. మట్టి అన్ని ఉత్ప త్తులకు మూలం. ఉత్పత్తులకు మతం మూలం లేదు. మట్టికి–గింజకు, మట్టికి–జంతు వుకు ఉన్న సంబంధాన్ని మట్టిలో పనిచేసే మనుషులే మేధా వులై కనిపెట్టారు. ఇక్కడే మొట్టమొదట మానవ తత్వశాస్త్రం పుట్టింది. స్త్రీ కడుపులో పుట్టిన మను షులు తిరిగి మట్టి బొందలోకి పోయేవరకు మట్టిని ప్రేమిస్తారు. మట్టితో పోరాడుతారు. అన్ని ఉత్పత్తి సంబంధాలు, మానవ సంబంధాలను మట్టిలో పని చేసే మనుషులు... పుస్తకాలు, మతాలు లేక ముందే ఏర్పర్చుకున్నారు. మట్టి మేధావులు... పుస్తకాలు, మతాలు సమాజంలోకి రాకముందే సమాజాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయితే భారత దేశంలో మతాలు, వేదాలు వచ్చాక శూద్రుల్లో, దళితుల్లో, ఆదివాసుల్లో ఇటువంటి మట్టి మేధా వులు ఉన్నారు. కాబట్టి వారిని చదువుకు, రాతకు, మతాలను నడపడానికి దూరంగా ఉంచారు. కాల్ప నిక, ఊహాజనిత అంశాలపై పుస్తకాలు రాసేవారు మేధావులనీ; రైతులు, కార్మికులు సత్తయ్యలా మానవత్వంతో సమాజాన్ని మార్చుకుంటూ వచ్చిన వారిని అసలు గుర్తించని సాహిత్యం తయారు చేశారు. ఇటువంటి ఉత్పత్తి సంబంధ రహిత రచయితలను ‘వట్టి మేధావులు’ అనాలి.ఈ దేశంలో కాళిదాసు నుండి కాళోజీ వరకు ఊహాజనిత కవిత్వాన్ని కావ్యాల రూపంలో రాసినవాళ్లే. కాళిదాసు ‘మేఘ సందేశం’లో భూమి మీదికి తొయ్యబడ్డ యక్షుడు మేఘం ద్వారా కైలాసంలో ఉన్న భార్యకు పంపిన ప్రేమ సందేశంలో ఈ దేశ వర్ణన అంతా ఊహాజనితమైందే. ఇక్కడి వ్యవసాయ భూములు, వాటిలో పంటలు పండిస్తున్న రైతుల గురించి ఒక పద్యం కూడా అందులో లేదు. మహాకాళి ఆలయ వర్ణన ఉంది గానీ, మహా ఉత్పత్తి రంగమైన పంటపైగానీ, శ్రమచేసి పండించే రైతు బతుకుపై కానీ ఒక పద్యం కూడా లేదు.ఆనాటి సంస్కృత సాహిత్య ఉత్పత్తి వ్యతిరేక వారసత్వం ప్రాంతీయ భాషల్లోకి కూడా పాకి శ్రమను గౌరవించని, లేదా శ్రమను పట్టించుకోని రచయితలు పుట్టుకొచ్చారు. అందుకే ఈ సాహి త్యానికి ప్రపంచ గుర్తింపు లభించలేదు. ప్రకృతి వర్ణన స్త్రీ పురుషుల ప్రేమ కోసమో, యుద్ధ నిర్మా ణాల అవసరాల కోసమో కాదు చెయ్యాల్సింది. ప్రకృతిని ప్రజల శ్రమ జీవనంతో ముడేసిన రచనలు దేశంలో వచ్చినప్పుడు సాహిత్యం సార్వ జనీనత్వం సంతరించుకుంటుంది.గద్దర్ పాటల సాహిత్యంలో పుట్టుకొచ్చిన మట్టి చేతులకు గౌరవం గానీ, సత్తయ్య మాన వత్వపు మట్టిమేధావితత్వం గానీ సమాజాన్ని రోజువారీగా అభివృద్ధి వైపు పయనింపజేస్తుంది. మట్టి మేధావులకు వట్టి మేధావులకు ఉండే తేడా... భూమిపైన మానవ సమానత్వ స్వర్గాన్ని సృష్టించడానికీ, మనుషులు చనిపోయాక స్వర్గం చూపెట్టే తత్వానికీ ఉండే తేడా! మొదటి ఆలోచనలో దేవుడు శ్రమ గౌరవ వాది. రెండవ ఆలోచనలో దేవుడు శ్రమ వ్యతిరేకవాది. ఉత్పత్తి కులాలను ప్రేమించ లేని కుల సమీకరణలు సాహిత్య రంగాన్ని యుద్ధ మయం, ప్రేమమయం చేశాయి. అందుకే సత్తయ్య లాంటి వారి ఆత్మకథలను పిల్లలు చదివినప్పుడు ఉత్పత్తి, శ్రమ, సర్వజంతు ఆదరణవాదులౌతారు. జంతువుల్లో ఒక దాన్ని ఎన్నుకొని పూజించడం జంతుజాతిని కాపాడదు. అన్ని జంతువులనూ ప్రేమించి మేపాలి.భూములు పంచిన భూస్వాములున్నారు. ఆస్తులొదిలి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అగ్ర కులస్థులున్నారు. కానీ వాళ్ళు మానవ సమా నత్వాన్ని కోరుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా విద్యా సమానత్వం రూపొందించాలనే ఆలోచనకు వాళ్ళ కులం అడ్డొచ్చింది. సత్తయ్య మాత్రం తాను బడిలో, కాలేజీలో, యూనివర్సి టీలో చదువుకోక పోయినా అంబేడ్కర్ లాగా, మహాత్మా ఫూలే లాగా ఈ దేశ బీద పిల్లలు ఇంగ్లి ష్లో చదువుకొని వాళ్ళ సిద్ధాంతాలను నేర్చుకొని దేశ మార్పునకు కృషి చెయ్యాలని పనిచేస్తున్నాడు.అందుకే సత్తయ్యను మట్టి మేధావి అనాలి. వట్టి మేధావులు కూడా ఆయన జీవిత చరిత్ర చదివి నేర్చుకుంటే దేశానికి మేలు చెయ్యగలరు.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత,సామాజిక కార్యకర్త -
చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నన్నాళ్లూ ప్రభుత్వ ఉద్యోగులను ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబును మరోసారి నమ్మవద్దని పలువురు విశ్రాంత ఉద్యోగులు, మేధావులు, విద్యావేత్తలు కోరారు. సమస్యలపై ప్రశ్నిస్తే ఉద్యోగుల తోకలు కత్తిరించాలంటూ వారి ఆత్మాభిమానంపై దెబ్బకొట్టారని గుర్తు చేశారు. ‘ప్రజలు–ప్రభుత్వం–ఉద్యోగులు’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలో మంగళవారం జరిగింది. ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగుల మద్దతు వారికి మేలు చేసిన వైఎస్సార్సీపీకే ఉంటుందని తేల్చిచెప్పారు. ఉద్యోగులు, సీఎం వైఎస్ జగన్ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉందని వెల్లడించారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల డిమాండ్లు ఉంటే బాగుంటుందన్నారు. వారు కూడా ప్రభుత్వంలో అంతర్భాగం కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే 15వ తేదీకి కూడా జీతాలు అందవని హెచ్చరించారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులనే వ్యవస్థే కనుమరుగయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. కార్యక్రమంలో మెజర్ కిరణ్ కుమార్, లెక్చరర్ కళ్యాణి, సమాజిక కార్యకర్త శాంతమూర్తి, సాఫ్ట్వేర్ ప్రొఫెçషనల్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే..3రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది చంద్రబాబే..రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని చంద్రబాబు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక దానికి కాయకల్ప చికిత్స చేయడం మొదలుపెట్టారు. కానీ కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ దెబ్బతింది. రూ.60 వేల కోట్లను ప్రభుత్వం నష్టపోయింది. రాష్ట్ర బడ్జెట్లో సగం ఉద్యోగుల జీతభత్యాలకే పోతోంది. మిగిలిన సగం నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు ఖర్చు చేయాల్సి ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టారు. కొత్త ఉద్యోగాలివ్వలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నియామకాల విప్లవం తెచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం 1వ తేదీనే నేరుగా జీతాలందేలా చేశారు. దశాబ్దాలుగా పదోన్నతులు లేని వారికి పదోన్నతులిచ్చారు. చైల్డ్ కేర్ సెలవులను 180 రోజులకి పెంచారు. సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. తాజా మేనిఫెస్టోలో మరికొన్ని హామీలిచ్చి నెరవేరుస్తాననే నమ్మకమిచ్చారు. అదే చంద్రబాబు హామీలు నెరవేర్చాలంటే పీఆర్సీ, జీతాలు ఎగ్గొట్టాలి. లేదంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. –డాక్టర్ ఎన్.రాజశేఖర్రెడ్డి, అధ్యక్షుడు, ఓపెన్ మైండ్స్చంద్రబాబు వస్తే జీతాలు కష్టమే..అడగకుండానే సీఎం జగన్ క్లాస్ 4 ఉద్యోగుల జీతాలను పెంచారు. అదే చంద్రబాబు ‘ఉద్యోగుల తోకలు కత్తిరించాలి’ అన్నమాటను నేటికీ ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు రూ.లక్ష కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అంటున్నారు. అంటే అప్పుడు 15వ తేదీకి కూడా జీతాలు రావు. పోనీ ఉద్యోగులకు ఏదైనా చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారా అంటే లేదు. గతంలో ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు దెబ్బతీశారు. ప్రభుత్వ ఉద్యోగులు అనే వ్యవస్థనే లేకుండా చేయాలనుకున్నారు. –పి.విజయబాబు, అధ్యక్షుడు, ఏపీ ఇంటలెక్చువల్ ఫోరంచంద్రబాబు ఉద్యోగులకు డీఏ అవసరం లేదన్నారు..ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి సహకరించాలి. ఎందుకంటే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా సీఎం జగన్ తీసుకువచ్చారు. విద్యకు ఆయన అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్దారులకు డీఏ అవసరం లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎంత దారుణంగా మాట్లాడారో చూశాం. –ప్రొఫెసర్ జి. రామచంద్రారెడ్డి, విద్యావేత్తఆర్టీసీని ఆదుకుంది జగన్ ప్రభుత్వమే..అప్పుల్లో ఉన్న ఆర్టీసీని సీఎం వైఎస్ జగన్ తమ ప్రభుత్వంలో విలీనం చేశారు. గతంలో జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుచేసి జీతాలిచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి నెలా రూ.300 కోట్లు ఇస్తోంది. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ప్రభుత్వ సహకారంతో అప్పులు రూ.6 వేల కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు ఆర్టీసీ తగ్గించగలిగింది. –కోటేశ్వరరావు, విశ్రాంత ఆర్టీసీ అధికారిమంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలివైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. వేతన సవరణ అడగకుండానే ఇచ్చింది. మళ్లీ అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామంటోంది. ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని అందరం కాపాడుకోవాలి. –ప్రొ.వి.నారాయణరెడ్డి, మాజీ రిజిస్ట్రార్ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ఇవ్వాలిప్రభుత్వాన్ని ఉద్యోగులు విమర్శించడం సరికాదు. అన్నదమ్ముల్లా ఉద్యోగులు, ప్రభుత్వం కలిసుండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో అవన్నీ చేస్తోంది. సంక్షేమ పథకాలను ఇంటి వద్దే అందిస్తోంది. ఉద్యోగులు కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వానికే మద్దతివ్వాలి. –పి.సుశీలరెడ్డి, సామాజిక కార్యకర్త -
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అన్నీ అపోహలే
సాక్షి, అమరావతి: ల్యాండ్టైట్లింగ్ చట్టంపై అవగాహన లేకుండా కొందరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం మండిపడింది. రెవెన్యూ, న్యాయపరమైన అంశాలు తెలియనివారు దీనిపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. ప్రభుత్వం భూములు లాక్కుంటుందనేది శుద్ధ అబద్ధమని తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజేయ కల్లం, భూచట్టాల నిపుణుడు సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అజేయ కల్లం మాట్లాడుతూ ఈ చట్టంపై హైకోర్టు స్టే ఇచ్చిందని, ఇక ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భూముల రీ సర్వే పూర్తయ్యాక టైట్లింగ్ మొదలవుతుందని, అప్పుడే డిక్లరేషన్ జరుగుతుందన్నారు. తీసుకువచ్చే మార్పులు చేర్పుల గురించి కోర్టుకు తెలిపాక, అందరితో సంప్రదించాక ఈ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. టైట్లింగ్ యాక్ట్, రీ సర్వే, ఇ–స్టాంపింగ్ విధానాలు అద్భుతమైన సంస్కరణలని కొనియాడారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి తప్ప రెవెన్యూ శాఖకు ఏం పని అంటున్నారని, దీనిపై నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. ఆర్ఓఆర్ లేక ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేసే అధికారం కేవలం కార్వనిర్వాహక వ్యవస్థకే ఉంటుందన్నారు. కోర్టుల్లో కేవలం వివాదాల పరిష్కారానికి, వాటిపై అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ రికార్డుల వ్యవస్థను భ్రష్టు పట్టించినవారే ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు తీసుకువస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1983 నుంచే భూ రికార్డుల వ్యవస్థ భ్రష్టు పట్టడం మొదలైందన్నారు. ప్రతి సంవత్సరం జమాబందీ, అజమాయిషీ సర్వేలు చేస్తూ కచ్చితమైన రికార్డుల వ్యవస్థగా ఉన్న కరణం వ్యవస్థను ప్రత్యామ్నాయం లేకుండా ఒక్కసారిగా రద్దు చేశారని విమర్శించారు. దీంతో పదేళ్లపాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకుండాపోయారన్నారు. దీనివల్లే వివాదాలు పెరిగాయని, నకిలీలు, రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థను తీసుకువçస్తుంటే దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.12కి పైగా రాష్ట్రాల్లో ఇ–స్టాంపింగ్ వ్యవస్థ తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాత కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అజేయ కల్లం గుర్తు చేశారు. ఇప్పుడున్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఆ సంస్థ ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తెచ్చిందన్నారు. మహారాష్ట్రలో 2015లో ఈ విధానాన్ని తొలిసారి అమలు చేశారని, అది విజయవంతమయ్యాక ఇప్పుడు 12కిపైగా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. 2016లో మన రాష్ట్రంలోనూ తాను రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్ను ఆహ్వానించి పైలెట్ ప్రాజెక్టు చేయమన్నానని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. దాని ట్రయల్స్ కోసం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 135 డాక్యుమెంట్లు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ మెమో ఇస్తే.. దానికి, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి లింకు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇ–స్టాంపులు జిరాక్స్ పేపర్లు కావన్నారు. అందులో నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయని తెలిపారు.నల్లచట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరం: భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సునీల్కుమార్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని నల్ల చట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టం ద్వారా భూములు లాగేసుకుంటారని, కోర్టులకు అధికారాలు ఉండవని, అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారని, ఆయన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారనే ప్రచారాలు పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలు జరగకపోతే రాష్ట్రం మళ్లీ 50 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. ఉన్న భూములకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి హక్కులను కాపాడుతుందే తప్ప భూములను లాక్కునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఒక రిజిస్టర్ తయారు చేస్తుందని, దాన్ని ప్రజలందరికీ అందుబాటులో పెడతారన్నారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. రీ సర్వే ద్వారా తయారయ్యే రికార్డును టైటిల్ రిజిస్టరింగ్ చట్టం కింద ప్రకటిస్తారని, అది ఆన్లైన్లో అందరికీ అందబాటులో ఉంటుందని వివరించారు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనేది తప్పని, ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్న కేసులు అలాగే నడుస్తాయన్నారు. అలాగే భూములు అమ్మాలన్నా, దానం చేయాలన్నా టైటిల్ రిజిస్ట్రార్ అనుమతి కావాలనేది అపోహేనని తేల్చిచెప్పారు. కొత్త చట్టం తహశీల్దార్కి, సబ్ రిజిస్ట్రార్కి ఉన్న అధికారాలను ఒక చోటకు చేరుస్తుందన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ జరిగి రికార్డులోనూ మార్పు కూడా జరిగిపోతోందన్నారు. భూముల రీ సర్వే పూర్తయితే భూములకు సంబంధించి 80 రకాల సమస్యల్లో చాలావరకు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చారిత్రక మూలాల్లో జ్ఞాన కాంతులు
ఏ దేశానికైనా, ఏ జాతికైనా చారిత్రక తాత్విక జ్ఞానం అవసరం. నిజానికి తొలి నుంచీ ఉన్నది భౌతికవాదమే. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. అయితే అనేక సందర్భాలలో ప్రజలు వెలుగు నుండి చీకట్లోకి, జ్ఞానం నుండి అజ్ఞానంలోకి, వాస్తవం నుండి భ్రమలలోకి తిరోగమిస్తూ ఉంటారు. అప్పుడే అభ్యుదయవాదులు వారిలో జ్ఞానతృష్ణను కలిగించాలి. భారతదేశ తాత్విక మూలాలపై ఈనాడు లోతైన చర్చ జరుగుతోంది. నిజానికి భారతీయ తత్వశాస్త్రాన్ని సృష్టించినవారు మూలవాసులు. వీరు మెసపటో మియా, సింధూ నాగరికతల కాలం నాటివారు. వీరి మౌఖిక జ్ఞాన సంపదకు ప్రత్యామ్నాయంగానే వైదిక సాహిత్యం వచ్చింది. వైదిక సాహిత్యం కూడా మొదట్లో మౌఖిక రూపంలోనే ఉంది. తర్వాత లిఖిత రూపం ధరించింది. భారతీయ తత్వశాస్త్రం ప్రధానంగా భౌతికవాద తత్వశాస్త్రం. భారతదేశంలో తత్వశాస్త్రమంటే ఆధ్యాత్మిక వాదంగా ప్రచారం చేశారు. తత్వశాస్త్రమనగానే అది ఆత్మ గురించో, పరలోకం గురించో చెప్పేదనే భావన ఏర్పడింది. నిజానికి భౌతిక అంశాల నుండి రూపొందినదే తత్వశాస్త్రం. భారతదేశంలో అతి ప్రాచీన జాతులు తాత్వికాంశాల మీద సుదీర్ఘమైన చర్చ చేశాయి. శరీరానికీ, చైతన్యానికీ ఉన్న సంబంధాన్నీ; మానవునికీ, ప్రకృతికీ ఉన్న సంబంధాన్నీ, విశ్వ పరిణామాన్నీ, మానవ పరిణామాన్నీ వీరు అర్థం చేసు కోవడానికి ప్రయత్నించారు. ప్రకృతి; సమాజం పట్ల ఉదయించిన అనేక ప్రశ్నలకు భౌతిక దృక్పథంతో సమాధానం వెదికారు. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. నిప్పు మానవ సామాజిక పరిణామంలో కీలక పాత్ర వహించింది. నిప్పును ఆరాధించిన జాతుల కంటే, నిప్పును భౌతిక శక్తిగా గుర్తించిన జాతులు శక్తిమంతంగా ముందుకు నడిచాయి. నిప్పు మానవ జీవితాన్ని ఒక భౌతిక శక్తిగా ప్రభావితం చేసింది. నిప్పును ఆరాధించే జాతులకూ, నిప్పును అధీనం చేసుకొన్న జాతులకూ సమరం జరిగింది. తన చుట్టూ వున్న భౌతిక ప్రపంచాన్ని సమన్వయించుకోవడంలో విఫలమై నవారు భావవాదులుగా రూపొందారు. వీరు భౌతిక సామాజిక వాస్తవికతకు భిన్నమైన భావవాదంతో భౌతికవాదులకు ఎదురు నిలుస్తూ వచ్చారు. అంతేగాక వానరుడి నుండి నరుడిగా పరిణామం చెందిన ప్రతి కీలక దశలోనూ మానవుని భౌతిక దృక్పథమే అతనికి నిర్ణయాత్మక మెట్టుగా ఉపకరించింది. లక్షలాది సంవత్సరాలకు పూర్వం ఉష్ణమండలంలో ఎక్కడో ఒక చోట నరవానరుడిగా ఉన్న మానవుడు మానవుడిగా రూపొందిన పరిణామంలో చేతుల్ని ఉపయోగించుకున్న తీరును ఎంగెల్స్ వర్ణించాడు. రోమ శరీరులైన మన పూర్వీకులు మొదట ఒక నియమంగానూ, తరువాత అవసరంగానూ నిలబడ టానికి కారణం ఆనాటికి చేతులకు వివిధ రకాలైన ఇతర పనులు ఏర్పడి ఉంటాయని అనుకోవాలి. వానరాలు ఆహారాన్ని స్వీకరించడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి చేతులను ఉపయోగిస్తాయి. కొన్ని రకాల క్రింది తరగతి స్తన్య జంతువులలో కూడా ముందు పంజాలను ఉపయోగించడం మనం చూస్తాం. చాలా రకాల కోతులు తాము చెట్ల మీద నివసించడానికై గూళ్ళను నిర్మించడానికి చేతులను ఉప యోగిస్తాయి. చింపాంజీలు తమ చేతులతో చెట్ల కొమ్మల మధ్య కప్పులు చేసుకొని ఎండ వానల నుండి కాపాడుకుంటాయి. శత్రువుల నుండి ఆత్మ రక్షణకై ఇవి చేతులతో కర్రలను, కొమ్మలను పట్టుకొని కొట్టడానికి పూనుకొంటాయి. బోనుల్లో ఉంచిన కోతులు మానవులను చూచి నేర్చుకున్న అనేక చిన్న చిన్న పనులను తమ చేతులతో చేయగలవు. కానీ మానవునికెంతో సన్నిహితమైన దశకు చేరుకున్న వానరుని చేతినీ, అనేక లక్షల సంవత్సరాల కర్మల వల్ల అభివృద్ధి నొందిన మానవుడి చేతిని చూస్తే ఎంతో భేదం కనబడుతుంది. కండ రాల సంఖ్య ఒక్కటే, నిర్మాణం కూడా ఒక్కటే. అయినా ఎంతటి నికృష్టస్థితిలోని ఆటవికుడైన మానవుని హస్తం కూడా ఎంతో అభివృద్ధి చెందిన వానర హస్తం చేయలేని వందలాది పనులను అలవోకగా చేస్తుంది. వానర హస్తం ఏ చిన్న రాతి పనిముట్టును ఎంత బండగా నైన చేసి ఎరుగదు. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవ జాతి ప్రతి అడుగులో తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ ముందుకు నడిచింది. ఈ భౌతిక దృక్పథంతో కూడిన మానవ ప్రయాణానికి భావవాదం ఒక పెద్ద అవరోధంగా నిలిచింది. మానవ ప్రగతిలో అసమానతలు సృష్టించింది. చరిత్ర పరిణామ క్రమంలో మానవ సమాజాన్ని సమన్వయించడాన్ని మార్క్స్ గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథం అన్నాడు. ఈ క్రమంలో భారత సమాజాన్ని పరిశీలిస్తే చార్వాకులు భారత ఉత్తరఖండంలో భౌతిక సిద్ధాంత కర్తలుగా మన ముందు నిలుస్తారు. వారికి ఎదురు నిలిచిన వైదికులు భావ వాదానికి కొమ్ము కాసిన ప్రతినిధులు అయ్యారు. వేద వాఙ్మయానికి ప్రత్యామ్నాయంగా భారతీయ భౌతికవాదంగా చార్వాకవాదం ముందుకొచ్చింది. భారతీయ భౌతికవాదాన్ని సాంఖ్యదర్శనం ముందుకు తీసుకువెళ్ళింది. ఈ సాంఖ్య శాస్త్రానికి మూల పురుషులు కపిలుడు, అసురీ, పంచశిఖుడు, ఈశ్వర కృష్ణుడు. ఈశ్వర కృష్ణుని 26 మంది గురుతరాల నుండి ఈ సాంఖ్యం బోధింపబడినట్లు చెప్పబడింది. ఒక్కొక్క గురువు నుండి మరొక గురువు తరానికి 30 సంవత్సరాల అంతరం ఉందని అనుకుంటే, 780 సంవ త్సరాల అంతరం కపిలుడికీ, ఈశ్వర కృష్ణుడికీ ఉంది. దీనిని బట్టి కపిలుడు క్రీ.పూ.7, 8 శతాబ్దాల వాడై ఉండవచ్చునని చరిత్రకారుల అంచానా. బుద్ధుడి మీద కూడా సాంఖ్య ప్రభావం ఉందనేది స్పష్టం. బుద్ధుడు క్రీ.పూ. 6వ శతాబ్దం వాడనుకుంటే సాంఖ్య సిద్ధాంతం అప్పటికే ప్రాచుర్యం పొంది ఉంది. దీనినిబట్టి కూడా కపిలుని సాంఖ్య శాస్త్రం క్రీ.పూ. 8 శతాబ్దిదని అనుకోవచ్చు. ఇకపోతే సమాజ నిర్మాణానికి సంబంధించిన మూలాలను అధ్య యనం చేయకుండా, సమాజ వ్యవస్థను ఉన్నదున్నట్లుగా అంగీకరించడం యధాతథవాదం. అది మార్పును అంగీకరించని వాదం. మార్పునకు భావజాలం ఒక చోదకశక్తి. దళితుల చరిత్ర నిర్మాణంలో హేతువాదమే కీలకం అవుతుంది. బి.ఆర్. అంబేడ్కర్ హేతువాద దృక్పథంతోనే సామాజిక చరిత్ర నిర్మాణంలోని చిక్కుముడులను విప్పారు. కానీ లిఖిత పరమైన ఆధారాలు లేవని వీరి చరిత్రను మనువాదులు నిరాకరిస్తారు. భారతదేశంలో మనువాదం ఉత్పత్తికి భిన్నమైనది. జీవిక కోసం సృష్టించిన ఆ«ధ్యాత్మిక కల్పన వాదం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి చివరికి దేశ చరిత్రను గజిబిజి చేసింది. అనేక వైరుద్ధ్యాలు, ప్రక్షిప్తాలతో కూడిన సాహిత్యంలో తాత్విక అంశాలు, చారిత్రక అంశాలు మృగ్యమైనాయి. ప్రజలు ఎల్లప్పుడు రాజకీయాల్లో వంచనకు, ఆత్మ వంచనకు తెలివి తక్కువగా బలి అవుతూనే ఉన్నారు. అన్ని నైతిక, మత, రాజ కీయ, సాంఘిక పదజాలాల ప్రకటనల వెనుక ఏదో ఒక వర్గపు ప్రయోజనాలు దాగివున్నాయనే విషయాన్ని గ్రహించేంత వరకు వారలా బలి అవుతూనే ఉంటారు. ప్రతి పురాతన సంస్థ అది ఎంత అనాగరికమైనదిగా, కుళ్ళిపోయినదిగా కనబడినప్పటికీ పాలక వర్గాలకు చెందిన కొన్ని శక్తులచే అది నిలబెట్టబడుతోంది. ఈ విషయాన్ని గ్రహించనంతవరకూ సంస్కరణ వాదులు, అభివృద్ధి కాముకులు పాత వ్యవస్థను సమర్థించే వారి చేత మోసగించబడుతూనే వుంటారు. ఆ వర్గాల ప్రతిఘటనను పటాపంచలు చేయడానికి ఒకే ఒక మార్గం వుంది. అదేమిటంటే మన చుట్టూ ఉన్న సమాజంలోనే పాతను తుడిచి వేసి కొత్తను సృష్టించే సామర్థ్యం కలిగివున్న శక్తులను విజ్ఞానవంతులను చేసి సంఘటిత పర్చడం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
బుద్ధి కుశలత
కుశలత అంటే నేర్పరితనం. ఏ పని చేయటానికైనా ఒక నేర్పరితనం అవసరం. ఏదో ఒక తీరులో తోచిన విధంగా చేయటం కాక, సులువైన పద్ధతిలో సునాయాసంగా చేయగలగటం నేర్పరితనం. బుద్ధిని దాని సామర్థ్యాన్ని తగిన విధంగా ఉపయోగించటమే బుద్ధి కుశలత. సాధారణంగా మనస్సుని, బుద్ధిని సమానార్థకాలుగా వాడుతూ ఉంటాం. కాని రెండింటికీ తేడా ఉంది. ఆలోచన చేసేది, పంచేంద్రియాలని ప్రేరేపించేది, వాటిపై పెత్తనం చేసేది, తనకి నచ్చినట్టు, కావలసినట్టు ఊహ చేసేది, కలలు కనేది, ఆశపడేది, రాగద్వేషాలకి నిలయమైనది మనస్సు. బుద్ధిలో కూడా మనోవ్యాపారం ఉన్నా, దానిలో విచక్షణా, సహేతుకతా ఉంటాయి. ఒక మంచిపని, తనకి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేది చేద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు పని చేసింది బుద్ధి. తీరా ఆ పని మొదలుపెట్టిన తరువాత ఏవేవో పనికిరాని కారణాలతో సమర్థించుకుని వాయిదా వేసుకుంటూ వచ్చినప్పుడు పని చేసింది మనస్సు. మనస్సు శారీరిక, మానసిక సుఖాన్ని అపేక్షిస్తుంది. మంచి చెడులను వేర్పరచి విచక్షణతో నిర్ణయం తీసుకునేది బుద్ధి. అయితే ఎన్నో సందర్భాలలో మనసు బుద్ధి వేషం వేసుకుని వస్తుంది. పని వాయిదా వేయటానికి కారణాలు వెదకినట్టుగా మనోవ్యాపారమైన ఆలోచనల సహకారంతో ఏది మంచి ఏది చెడు ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏది తనకి, సమాజానికి ఉపయోగ పడుతుంది, ఏది ఉపయోగ పడదు అనే అంశాలను విడదీసి, విమర్శించి, వేర్పరచి సరైన నిర్ణయం తీసుకునేందుకు సహకరించే శక్తి బుద్ధి. ఒకప్పుడు గురుకులాల్లో గురువులు శిష్యులకి విద్యాబుద్ధులు నేర్పేవారు. విద్యావంతులు బుద్ధిమంతులుగా ఉండేవారు. విద్య అంటే విషయ సేకరణ మాత్రమే కాదు. సేకరించిన విషయాలను, సముపార్జించిన జ్ఞానాన్ని జీవితానికి అన్వయం చేసి, ఆచరణలో పెట్టగలగటం, ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎంత అవసరమో నిర్ణయించగల మెలకువ కలిగి ఉండటం. అదే బుద్ధికుశలత. ఒక పండితుడికి, శాస్త్రవేత్తకి తమ తమ రంగాలకి సంబంధించిన జ్ఞానం చాలా ఉండవచ్చు. దానిని సందర్భానుసారంగా ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియక నలుగురిలోనూ నవ్వులపాలు కావటం చూస్తూ ఉంటాం. మెదడు బాగా ఎదిగింది కాని, విచక్షణ లేదు అని అర్థం. గొప్ప మేథావులు కూడా జీవితంలో సరయిన నిర్ణయం తీసుకోక నష్టపోవటానికి ఎంతోమంది శాస్త్రవేత్తల జీవితాలని ఉదాహరణలుగా గమనించవచ్చు. కారణం విద్యతో పాటు బుద్ధి గరపిన వారు లేకపోవటమే. ప్రస్తుత విద్యావిధానంలో చదువులు నేర్పి అక్షరాస్యులని తయారు చేయటం మాత్రమే కనిపిస్తోంది. కాని, బుద్ధివికాసం ఎంతవరకు జరుగుతోంది? అన్నది ప్రశ్నార్థకమే. ఈ కారణంగానే పెద్ద పెద్ద విద్యార్హతలు ఉన్న వారు కూడా సంఘవిద్రోహకశక్తులుగా మారటం, దేశద్రోహులుగా మారటం కుటుంబ దేశ పరువు ప్రతిష్ఠలను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించటం చివరికి తమకే హాని చేసుకోవటం గమనించవచ్చు. ఆకలి దహించుతోంది, నిద్ర ముంచుకు వస్తోంది. తినటం, పడుకోటం లలో ఏది ముందు చేయాలి? అని నిర్ణయించుకుని మేలు పొందటానికి కావలసినది విచక్షణ మాత్రమే కాని చదువులు కాదు. కార్యసాధకుల లక్షణాలలో ప్రధానమైనది బుద్ధికుశలత. జీవితంలో గొప్ప విజయాలు సాధించి అత్యున్నత స్థానానికి చేరుకున్నవారందరు బుద్ధికుశలురే. చదువులు సహాయం చేసి ఉండవచ్చు. కుశలత... విచక్షణ ప్రతి మనిషికి మనసు ఉన్నట్టే బుద్ధి కూడా ఉంటుంది. కాని, అందరూ బుద్ధిని సరిగా ఉపయోగించరు. దానిని ఉపయోగించటంలోని మెలకువలు తెలియటమే బుద్ధి కుశలత. ఏ పని ఎట్లా చేయాలో తెలిసి ఉండటమన్న మాట. దీనినే ఒడుపు అని కూడా అనవచ్చు. ఏ పనినైనా గుడ్డెద్దు చేలో పడ్డట్టు అడ్డదిడ్డంగాను చేయవచ్చు. ఎక్కువమంది చేసేది ఆ విధంగానే. లేదా క్రమపద్ధతిలోనూ చేయవచ్చు. ఇది నేర్పరులు చేసే పద్ధతి. బుద్ధిని ఉపయోగించటంలో ఇటువంటి నేర్పరితనం ఉంటే దాన్నే బుద్ధి కుశలత అనవచ్చు. అంటే చురుకుగా పనిచేసే విచక్షణాజ్ఞానం అన్నమాట. – డా.ఎన్.అనంతలక్ష్మి -
నాలుగున్నరేళ్లుగా ప్రజారంజక పాలన
‘పేదవాళ్లు పింఛన్ కావాలన్నా.. రేషన్ కార్డును అడగాలన్నా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయినా వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ సంక్షేమ పథకాలు అర్హుల ఇంటి గుమ్మంలోకే వస్తున్నాయి. గ్రాఫిక్స్లోనే కనిపించిన అభివృద్ధిని గ్రామ స్థాయిలో చేసి చూపించారు సీఎం వైఎస జగన్. అసత్య హామీలతో ప్రజలను చంద్రబాబు వంచించారు. అన్నం పెట్టే జగన్ను కాదని.. సున్నం రాసే బాబుకు జనం ఓటేయరు.’ అంటూ మేథావి వర్గం స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ సంయుక్తంగా ‘జగన్ పాలన–ప్రజా తీర్పు’ అనే అంశంపై బుధవారం విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రజా సదస్సు నిర్వహించాయి. ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – సాక్షి, అమరావతి విద్యా రంగంలో మరో నార్వేలా ఆంధ్రప్రదేశ్ – ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు సీఎం జగన్ రాష్ట్రంలో విద్యా రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. విద్యా రంగంలో ఏపీ మరో నార్వేగా మారుతోంది. తొలిసారిగా విద్యార్థులకు సీఎం జగన్ 6 లక్షల ట్యాబ్లు ఇచ్చారు. రూ. 8 వేల కోట్ల విలువైన కంటెంట్ను ఉచితంగా ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టే స్థాయికి తెచ్చారు. దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారు. ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందించారు. ప్రతి రంగంలోనూ ఏపీ అభివృద్ధిలో ఉంది. కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా సీఎం జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ నెల 4న ఈనాడులో 53, జ్యోతిలో 50 నెగెటివ్ వార్తలు వచ్చాయి. సాక్షి పత్రికలో ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబిస్తూ కథనాలు వస్తున్నాయి. ఏ పార్టీ లక్షణాలు ఏమిటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరంలేదు. వై నాట్ 175 జరిగి తీరుతుంది సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల వైనాట్ వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుంది. సీఎం జగన్ చెప్పిన వై నాట్ 175 జరిగితీరుతుంది. సీఎం జగన్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పాలన చేస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టిని తీసుకువస్తున్నారు. ఎల్లో మీడియా విషపు రాతలు, ప్రతిపక్షాల కుట్రలు పటాపంచలయ్యేలా ప్రజలు మరోసారి సీఎం జగన్కు పట్టం కడతారు. సీఎం జగన్ పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే చంద్రబాబు స్టేలు తెచ్చి వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారు. – సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం సీఎం జగన్ సంస్కరణలు మంచి ఫలితాలనిస్తాయి సంక్షేమం అంటే మంచి జరగడం. సీఎం జగన్ పాలనలో ఇదే జరుగుతోంది. అన్ని వర్గాలకూ పథకాలు అందుతున్నాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా సీఎం పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆరి్థక సూచీలు వృద్ధిలో ఉన్నాయని కేంద్రమే ప్రశంసిస్తోంది. జగన్ చేస్తున్న సంస్కరణలు భవిష్యతులో మంచి ఫలితాలనిస్తాయి. – గీతావిజన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పొక్కులూరి సుబ్బారావు అది దుష్ప్రచారమే బలిసినొడికీ బక్కోడికీ జరుగుతున్న పోరాటం ఇది. బలిసినోళ్ల వైపు చంద్రబాబు ఉంటే.., బక్కోళ్లకు అండగా సీఎం జగన్ ఉన్నారు. బాబు పాలనలో ఆటోడ్రైవర్లపై వేధింపులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాహన మిత్రతో జగన్ మమ్మల్ని ఆదుకుంటున్నారు. పేదలకు సంక్షేమ ప«థకాలిచ్చి సోమరిపోతులను చేస్తున్నారనేది దు్రష్పచారమే. – ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి వినోద్ బెస్ట్ సీఎం వైఎస్ జగన్ సంక్షేమం, అభివృద్ధి, అనేక సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు నభూతో నభవిష్యతి. రెండేళ్లు కోవిడ్లో పోయాయి. ఆ తర్వాత రెండేళ్ల నుంచే అసలు పాలన మొదలైంది. ఈ రెండేళ్లలోనే విద్యా రంగంలో రాష్ట్రం కేరళను అధిగమించేలా చేశారు. మరో ఇరవై ఏళ్లు సీఎంగా జగన్కు అవకాశం ఇస్తే అమెరికా, సింగపూర్లా ఏపీ ఎందుకు అవదు? పాత ముఖ్యమంత్రిలా గ్రాఫిక్స్ చూపించడం లేదు. పోర్టులు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. ఇంటింటికీ డాక్టర్ వస్తున్నారు. ఇది జరుగుతుందని ఎప్పుడైనా ఊహించామా? రేషన్ ఇంటికే వస్తోంది. ఇలాంటి పాలన, ఇలాంటి సీఎం లేకపోతే రాష్ట్రం మరో 75 ఏళ్లు వెనక్కి పోతుంది. – ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ అశోక్ కుమార్ అందరికీ మంచి జరుగుతోంది గత ప్రభుత్వంలో సబ్సిడీ లోన్ అని మూడో వంతు లంచాల రూపంలో తినేశారు. సీఎం జగన్ మమ్మల్ని ప్రతి దేవాలయంలో బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తున్నారు. జగనన్న చేదోడు ద్వారా సాయం చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటిచ్చారు. నాయీ బ్రాహ్మణులకు గతంలో కనీస వేతనాలు కోరినా ఇవ్వలేదు. సీఎం జగన్ గుడిబయట ఉండే నాయీ బ్రాహ్మణులను గుడిలోపలికి తీసుకువచ్చారు. క్షౌరశాలల్లో రూ.20 వేల జీతం ఇస్తున్నారు. – నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గణపతిరావు, మల్కాపురం కనకారావు సీఎం జగన్ పాలన కోల్పోతే రాక్షస పాలన వస్తుంది సీఎం జగన్ పేదల సంక్షేమం, రాష్టర సమగ్రాభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్నారు. ఆయన క్రిస్టియన్ అయితే అనేక దేవాలయాలను అభివృద్ధి చేస్తారా? సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలనను కోల్పోతే రాక్షస పాలన వస్తుంది. – ప్రొఫెసర్ రాచకొండ ముత్యాలరాజు అభివృద్ధికి ఇదే నిదర్శనం రాష్ట్రంలోని బ్యాంకుల్లో డిపాజిట్లు గతంలోకంటే ఇప్పుడు రూ.85 వేల కోట్లు పెరిగాయి. అభివృద్ధికి ఇదే నిదర్శనం. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. పరిశ్రమలు పారిపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ ఏటా ప్రథమ స్థానంలో ఉంటుందా? అన్నం పెట్టే జగన్కే ప్రజలంతా ఓటేస్తారు. అబద్ధాలు, మోసాలతో సున్నం రాసే చంద్రబాబుకు జనం ఓటేయరు. – బెటర్ ఆంధ్రప్రదేశ్ సంస్థ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎల్లో మీడియాదంతా అసత్య ప్రచారమే చంద్రబాబుని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ఎల్లో మీడియా మొత్తం అసత్య ప్రచారం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. పెత్తందారుల పాలనను రానివ్వకూడదు. సీఎం జగన్ రూపాయి అవినీతి లేకుండా రూ. 2.50 లక్షల కోట్లు ప్రజలకు అందించారు. వాటి ద్వారా మన రాష్ట్ర ఆరి్థక వ్యవస్థ బాగుపడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలొచ్చాయి. రాష్ట్రానికి ఆస్తుల కల్పన జరిగింది. – ఎన్నారై వెంకట్ మేడపాటి ఇప్పుడున్నది ఆరోగ్యవంతమైన సమాజం సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా ముందుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఆరోగ్యవంతమైన సమాజం. సీఎం జగన్ నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి భరోసా కల్పిస్తున్నారు. హెల్త్ క్లినిక్లు, ఆర్బీకేలతో గ్రామీణులకు మేలు చేస్తున్నారు. – సోషల్ వర్కర్ వెంకటరెడ్డి పేద పిల్లలు విదేశాల్లో చదవడం చిన్న విషయం కాదు సీఎం జగన్ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకొనే పేద పిల్లల కలలను సాకారం చేస్తున్నారు. వారికి అయ్యే ఖర్చంతా చెల్లిస్తున్నారు. పేద పిల్లలు విదేశాల్లో చదవడం చిన్న విషయం కాదు. – విశ్రాంత అధ్యాపకులు రెహమాన్ సాయెబ్ ఏపీ తలెత్తుకొనేలా జగన్ పాలన ఏపీ తలెత్తుకొనేలా సీఎం జగన్ పాలన సాగుతోంది. చంద్రబాబు హయాంలో ఒక్క పోర్టు, ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. సీఎం జగన్ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నారు.17 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు. 2.94 లక్షల ఉద్యోగాలిచ్చారు. కేంద్ర ఈపీఎఫ్ లెక్కల ప్రకారం 16 లక్షల ఉద్యోగాలొచ్చాయి. – సామాజిక కార్యకర్త గూడపురెడ్డి శేఖరరెడ్డి సుపరిపాలనంటే ఇదీ సుపరిపాలన అంటే సీఎం జగన్ అందిస్తున్న పాలన. ప్రతి పేదవాడికీ ఇల్లు ఇస్తున్నారు. కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముంగిటకే తెచ్చారు. గతంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించారు. – హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి ముక్కు వెంకటేశ్వరరెడ్డి మదర్ థెరిసా ఆదర్శంగా జగన్ పాలన మదర్ థెరిస్సాను సీఎం జగన్ ఆదర్శంగా తీసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు నవరత్న పథకాలు అందిస్తున్నారు. పని చేయని వారు పని చేస్తున్న వారిని విమర్శించడం సహజం. – గుంటూరు ఏసీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ పోలే ముత్యం బ్రాహ్మణులకు మేలు చేస్తున్న సీఎం జగన్ రాష్ట్రంలో బ్రాహ్మణులకు సీఎం వైఎస్ జగన్ చాలా మేలు చేస్తున్నారు. వంశ పారంపర్య వ్యవస్థను పునరుద్ధరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కామన్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు. ధూప దీప నైవేద్యాలకు, అర్చకుల వేతనాలను కూడా భారీగా ఇస్తున్నారు. – అర్చకులు ప్రసన్నాంజనేయ కుమారశర్మ -
కేసీఆర్.. మీ పార్టీ సిద్ధాంతం ఏంటో?: అమిత్షా
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని.. తాము అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నామన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో మేధావుల సదస్సులో మాట్లాడిన అమిత్షా.. కేసీఆర్ తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పాలన్నారు. ఆయన లక్ష్యం కూతురును జైల్కు వెళ్లకుండా కాపాడుకోవడం, కొడుకును ముఖ్యమంత్రి చేయడం. బీజేపీ సిద్ధాంత పార్టీ. విదేశాల్లో భారత్ గౌరవం పెరిగింది. 2014కు ముందు దేశంలో అశాంతి ఉండేది’’ అని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్న ఆయన.. వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. బీఆర్ఎస్ను కుటుంబ పార్టీగా అభివర్ణించిన అమిత్షా.. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవన్నారు. కేటీఆర్ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం.. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది’’ అంటూ అమిత్షా ఎద్దేవా చేశారు. ‘‘వచ్చే ఐదేళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 2014 ముందు దేశం లో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు.. యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేది.. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. మోదీపైన అవినీతి ఆరోపణలు లేవు. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారయ్యింది’’ అని అమిత్షా పేర్కొన్నారు. ‘‘కరోనా టైమ్లో దీపాలు వెలిగించాలి అంటే కేటీఆర్ వెటకారం చేశారు. కరోనా వ్యాక్సిన్ను మోదీ వ్యాక్సిన్ అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీళ్లు నిధుల నియామకాలు కోసం ఉద్యమం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో సంపాదించుకున్నాడు. నీళ్లు ఇవ్వలేదు.. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్కు లేదు. దేశాన్ని మహోన్నత స్థానానికి తీసుకెళ్లే మోదీతో తెలంగాణ ఉంటుందా.. కొడుకును సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్తో ఉంటుందా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. కేసీఆర్తో ఎప్పుడు కలిసేది లేదు.. కలిసి వెళ్లేది లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేస్తే అవినీతి ప్రభుత్వం వస్తుంది. అభివృద్ది తెలంగాణ బీజేపీతోనే సాధ్యం’’ అని అమిత్షా పేర్కొన్నారు. అంతకు ముందు ఆదిలాబాద్ జనగర్జన సభలో ప్రసంగించిన అమిత్షా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్లో నినాదిస్తే.. హైదరాబాద్లో కేసీఆర్కు వినిపించాలన్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాల్లో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. చదవండి: కేసీఆర్ను గద్దె దించండి: అమిత్షా -
ఏపీ సంక్షేమ పథకాలు ఆదర్శనీయం
ఏఎన్యూ: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అవి లేకపోతే ఆ వర్గాల అభివృద్ధే లేదని పలువురు విద్యావేత్తలు, ఆర్థి కవేత్తలు అన్నారు. ఓపెన్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘సంక్షేమం–అభివృద్ధి’ అనే అంశంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. అణగారిన వర్గాల సాధికారితకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని రాజ్యాంగం చెబుతోందని.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పలు ఉచిత పథకాలను వృథా అని కొందరు విమర్శించడం అర్థరహితమని చెప్పారు. అభివృద్ధి చెందిన ఫ్రాన్స్లో 31 శాతం, అమెరికాలో 30 శాతం, స్కాండినేవియాలో 29 శాతం నిధులు సంక్షేమానికి ఖర్చుచేస్తున్నారని.. మన దేశంలో 20 శాతం సంక్షేమానికి ఖర్చుచేస్తుండగా మన రాష్ట్రంలో 22 శాతం ఖర్చుచేస్తున్నారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే.. సంక్షేమం లక్ష్యమే అభివృద్ధి.. ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమం ధ్యేయమే అభివృద్ధి.. అభివృద్ధి లక్ష్యమే సంక్షేమం. ఈ రెండింటినీ వేర్వేరుగా చూడటం సరికాదు. సంక్షేమంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో అభివృద్ధి, మానవ వనరుల వృద్ధి దాగి ఉన్నాయని గుర్తించాలి. విద్య, వైద్యం, ఇల్లు, మంచి ఆహారం, నీరు వంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజలకు కల్పించే పలురకాల ఉచిత పథకాలు వృథా, అనవసర ఖర్చు అనడం అర్థరహితం. ఏపీలో 2016లో 11.7 శాతం పేదరికం ఉంటే 2021–22కి అది 6 శాతానికి తగ్గింది. – డాక్టర్ ఎన్ రాజశేఖర్రెడ్డి, ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు,మాజీ మెంబర్ సెక్రటరీ అండ్ సీఈఓ ఏపీహెచ్ఈఆర్ఎంసీ రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు.. గడచిన నాలుగున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం అనేక ఆదర్శవంతమైన పథకాలు అమలుచేసింది. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు అమలుచేసేందుకు సీఎం నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాదిలో 8–10 తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంతర్జాతీయ సాంకేతిక విద్యను అందించనున్నారు. నిజమైన అభివృద్ధిని కాంక్షించే వారు సంక్షేమాన్ని స్వాగతించాల్సిందే. – ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి, అకడమిక్ డీన్, ఏఎన్యూ విద్యపై ఖర్చు భావితరాలపై పెట్టుబడే.. ప్రభుత్వం విద్యపై ఖర్చుచేస్తున్న నిధులు భావితరాలపై, దేశంపై పెడుతున్న పెట్టుబడే. దీనిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా స్పష్టంచేశారు. విలువైన మానవ వనరులను తయరుచేసేందుకు, సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, జాతీయ ఆర్థికాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, సామాజిక, సాంకేతిక అభివృద్ధికి విద్య దోహదం చేస్తుంది. ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్న విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న ద్విభాషా పుస్తకాల విధానాన్ని ప్రధాని మోదీ స్వయంగా అభినందించారు. ప్రపంచంలో చాలా ఫ్యూడల్ దేశాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే దార్శనికతతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని విమర్శించడం అర్థరహితం. పాఠశాల విద్యకు సంబంధించిన చాలా సంస్కరణల్లో జాతీయ గణాంకాల కంటే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం ఆదర్శవంతమైన సంస్కరణ. అంతర్జాతీయ విద్య, బోధనా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యమివ్వడం హర్షణీయం. – ఆచార్య జంధ్యాల బిజి తిలక్, మాజీ వైస్ చాన్సలర్ ఎన్యూఈపీఏ, న్యూఢిల్లీ రాజనీతిజు్ఞలు మంచి మార్పు కోసం పాటుపడతారు.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పథకాలు అమలుచేస్తే రాజనీతిజు్ఞలు మంచి మార్పుకోసం పాటుపడతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మార్పుకోసం పాటుపడుతున్న రాజనీతిజు్ఞడు. అణగారిన వర్గాల సాధికారిత, ప్రపంచ స్థాయి అవకాశాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, పేదరికం నిర్మూలనకు దోహదం చేసే అన్ని సంస్కరణలు, పథకాలు ఏపీలో చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచస్థాయి అద్భుతాలు సృష్టిస్తారనే వాస్తవాన్ని ఏపీ ప్రభుత్వం చాటిచెప్పింది. రానున్న రోజుల్లో మన దేశంలో యువ సంపద తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో అన్ని రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. – బి.జి. తిలక్, ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఏపీలో నిజమైన అభివృద్ధి ప్రపంచంలో పురాతన కాలం నుంచి సాగిన ఆదర్శ పాలనలన్నీ సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చాయి. ఇప్పటివరకు అనేక అభివృద్ధి అంశాల్లో దేశానికి కేరళ ఆదర్శంగా నిలిస్తే కేరళకు ఆదర్శవంతమైన సంస్కరణలు కూడా ప్రస్తుతం ఏపీలో అమలవుతున్నాయి. ఏపీలో జరుగుతున్న నిజమైన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో యూనివర్సిటీలు అధ్యయనం చేసి సమాజానికి తెలియజేయాలి. – ఆచార్య పి. రాజశేఖర్, వీసీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పథకాలే కాదు వాటి అమలూ ఆదర్శనీయం.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాదు వాటి అమలునూ ఆదర్శవంతంగా చేస్తోంది. నిరక్షరాస్యత నిర్మూలన ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. పేదలను శాశ్వత అభివృద్ధి వైపు నడిపించే గొప్ప మార్గం విద్య మాత్రమే. దానిని సీఎం జగన్ చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు వెళ్లాలంటేనే చాలామంది ఇష్టపడే వారు కాదు. కానీ, నేడు ఏపీలో పాఠశాలల ముందు నిలబడి ఫొటోలు దిగుతున్నారు. నాడు–నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో దార్శనికమైన సమగ్రాభివృద్ధి దాగి ఉంది. – ఆచార్య ఎన్. వెంకట్రావు, వీసీ, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం సంక్షేమ పథకాలు కనీస బాధ్యత.. ఏపీలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కొందరు విలాసాలని అంటున్నారు. అది సరికాదు. ప్రభుత్వం తన కనీస బాధ్యతను నెరవేరుస్తోంది. ఆహారం, వసతి, మంచి దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అనేది అందరూ గుర్తించాలి. విద్యపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అభివృద్ధిలో భాగమే. విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం ఎంతో దార్శనికమైన నిర్ణయం. – ఆచార్య బి. కరుణ, రిజిస్ట్రార్ , ఏఎన్యూ -
భారత్ మేథోశక్తిని అమెరికా గుర్తించింది
న్యూఢిల్లీ: భారత్కు ఉన్న అపారమైన మేధో మూలధనాన్ని అమెరికా గుర్తిచిందని ఇండస్ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఐఆర్ఎఫ్) వ్యవస్థాపకుడు గురుప్రసాద్ సౌలే తెలిపారు. సెమీ కండక్టర్ తదితర కీలక రంగాల్లో భారత్తో అనుసంధానం కోసం ముందుకు రావడం కీలక పరిణామమన్నారు. భారత్ను కేవలం సేవల కేంద్రంగా అమెరికా ఇంక ఎంతమాత్రం చూడడం లేదన్నారు. ఈ విషయమై అగ్రరాజ్య ధోరణలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జూన్లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో గురుప్రసాద్ సమావేశం కావడం గమనార్హం. ‘‘అమెరికా నుంచి సాంకేతిక పరిజ్ఞానం భారత్కు బదిలీ అవ్వడం నిదానంగా జరుగుతుంది. కొన్ని టెక్నాలజీలను భారత్తో పంచుకునేందుకు అమెరికా నిజంగా సిద్ధంగా లేదు. కానీ ప్రధాని మోదీ పర్యటన తర్వాత భారత్లో తయారీ విషయమై చెప్పుకోతగ్గ మార్పు అమెరికాలో వచ్చింది’’అని గరుప్రసాద్ వివరించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్, హెల్త్కేర్, ఏఐ రంగాల్లో భారత్ మరింత పురోగమిస్తుందని అమెరికా భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో భారత స్టార్టప్లకు అపార అవకాశాలున్నాయంటూ.. చాలా స్టార్టప్లకు నాస్డాక్లో లిస్ట్ అయ్యేందుకు ఆదాయం అవసరం లేదన్న విషయం తెలియదన్నారు. -
బాబును రాష్ట్రం నుంచి బహిష్కరించాలి
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు ప్రమాదకరం. ప్రతిపక్షాలు విధానపరమైన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అధికారం కోసం అమాయకులను రెచ్చగొట్టడం సమంజసం కాదు. అసమర్థుల ఆఖరి అస్త్రమే హింస. పుంగనూరు, అంగళ్లు ఘటనలను నివారించాల్సిన చంద్రబాబు.. ఆయనే కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయించడం హేయమైన చర్య. రాజ్యాధికారాన్ని ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో దారుణాలకు తెగబడుతున్న చంద్రబాబును రాష్ట్రం నుంచి, రాజకీయాల నుంచి బహిష్కరించాలి. తనపై పోలీసులు కేసు నమోదు చేస్తే స్పందించిన చంద్రబాబు.. దాడుల్లో గాయపడిన పోలీసులకు సంఘీభావం తెలియజేయకపోవడం ఆయన నీచత్వానికి పరాకాష్ట. అదేవిధంగా కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ ఏకపక్షంగా వార్తలు రాస్తూ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాయి. అల్లరిమూకల దాడిలో కన్ను పోగొట్టుకున్న కానిస్టేబుల్, గాయపడిన 30 మంది పోలీసుల గురించి ఒక్కమాట కూడా రాయకపోవడం సిగ్గుచేటు. ఇదేమి జర్నలిజం..’ అని వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్లో హింసా రాజకీయాలు–కట్టడి–మీడియా పాత్ర’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు హింసా రాజకీయాలపై ప్రజలకు వాస్తవాలను తెలిపేలా ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. అనిశ్చితిని పెంచే కుట్ర ఎన్నికలు సమీపిస్తుండటంతో హింసా ధోరణిని పెంచి ప్రజల్లో అనిశ్చితిని సృష్టిస్తున్నారు. దానిని తిరిగి పాలకపక్షంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హింసను ప్రభుత్వం అరికట్టలేకపోతోందని ఒక వర్గం మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో కార్యకర్తలు చావులకు సిద్ధపడి రావాలని పిలుపునివ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. లోకేశ్ సైతం ఎక్కువ కేసులు ఉన్నవారికి పదవులు కట్టబెడతామని చెప్పడం హింసా రాజకీయానికి నిదర్శనం కాదా!. ప్రజలు ఇవన్నీ గుర్తించాలి. హింసను ప్రోత్సహించేవారికి బుద్ధి చెప్పాలి. – మేడపాటి వెంకట్, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు రూట్ మ్యాప్ను ఎందుకు మార్చారు? చంద్రబాబు ప్లాన్ ప్రకారమే తన పర్యటన రూట్ మ్యాప్ను పుంగనూరు ఊరిలోకి మార్పు చేసినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే పోలీసులు కాల్పులు జరుపుతారని, అప్పుడు తమ కార్యకర్తలు చనిపోతే సానుభూతి పొందవచ్చని పథకం రచించారు. సభకు వచ్చేటప్పుడు వ్యాన్లలో రాడ్లు, తుపాకులు తీసుకురావడమే ఇందుకు నిదర్శనం. కానీ పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. – చెన్నంశెట్టి చక్రపాణి, మాజీ పోలీసుల అధికారి దిగజారిన ప్రతిపక్షాలు నాలుగేళ్లుగా ప్రభుత్వంపై దాడి జరుగుతూనే ఉంది. ప్రతిపక్షాలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. బాధితులను పట్టించుకోకుండా దాడులకు పురిగొల్పిన వారిని కొన్ని పత్రికలు, చానళ్లు వెనకేసుకురావడం క్రూరమైన చర్య. మేనిఫెస్టోను అమలు చేయని ప్రభుత్వాలను రీకాల్ చేయాలి. అప్పుడు చంద్రబాబు లాంటి నాయకులు నిలవలేరు. – చలాది పూర్ణచంద్రరావు, ఏపీ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు పవన్.. బలిదానాలు ఎందుకు? ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇది నచ్చకనే చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేశ్.. దత్తపుత్రుడు పవన్కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆత్మబలిదానాలకు సిద్ధం కావాలని జనసేన కార్యకర్తలకు చెబుతున్నారు. ఎవరి ఆత్మను ఎవరు బలి తీసుకుంటారు. ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకులుగా ప్రజల మేలుకోరే సూచనలను చేశారా?. – సునీత, మూరుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు చంద్రబాబుపై సివిల్ వార్ తప్పదు హింసను ప్రేరేపిస్తున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబుపై పోలీసులే తిరగబడే రోజు వస్తుంది. ఇకపై సివిల్ వార్ ప్రారంభమవుతుంది. అప్పుడు బయటకు రావాలంటేనే బాబు భయపడక తప్పదు. చంద్రబాబు తనను ప్రశ్నించిన వ్యక్తి రక్తం చూస్తాడు. ఈ విషయం అనేకసార్లు రుజువైంది. – మాదిగాని గురునాథం, ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిపక్షాల తీవ్రవాద రాజకీయం ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి అరాచక పరిస్థితులు కనిపించలేదు. అధికారం కోసం అర్రులు చాస్తూ.. హింసాత్మక ధోరణిని అవలంబిస్తున్నారు. ప్రతిపక్షాలు తీవ్రవాద రాజకీయాలు చేస్తున్నాయి. పుంగనూరులో పోలీసులపై దాడి గురించి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఇందులో ఆరు సెక్షన్ల ప్రకారం చంద్రబాబు నేరాలకు పాల్పడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అరాచక తీవ్రవాద రాజకీయాలను మొగ్గలోనే తుంచాలి. –వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు, పవన్ చీడపురుగులు చంద్రబాబు, పవన్కళ్యాణ్ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు పెంచాలని సీఎం జగన్ చూస్తుంటే... ప్రతిపక్షాలు మాత్రం జనం చావులను కోరుకుంటున్నాయి. చంద్రబాబు చేసే ప్రతి పనిలోనూ హింస దాగుంటుంది. కార్యకర్తలు చనిపోతే వారి శవాలపై నుంచి వచ్చి అధికారం పొందాలని ప్లాన్ వేశారు. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ గుంటూరు కన్వినర్ రక్తపాతాన్ని కోరుకుంటున్న బాబు చంద్రబాబు ఓ ఘోరీ, ఓ గజినీ మహ్మద్ మాదిరిగా రక్తపాతాన్ని కోరుకుంటున్నారు. అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తున్నారు. విధి నిర్వహణలో మహిళా సీఐ ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొడితే వీరంగం చేసిన వికృత రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్.. ఇంతమంది పోలీసులకు గాయాలైతే ఎందుకు నోరు మెదపడంలేదు. అధికారాన్ని ప్రజల మనసుల ద్వారా గెలుచుకోవాలి. – విజయబాబు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు కన్నుపోయిన కానిస్టేబుల్పైసానుభూతి చూపరా..? రాష్ట్రంలో హింసా రాజకీయం పేట్రేగుతోంది. దీనిపై మేధావులు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు ప్రజలను అప్రమత్తం చేయాలి. అసలు హింసకు పాల్పడినవారెవరో, బాధితులెవరో అందరికీ తెలిసినా కొన్ని పత్రికలు, చానళ్లు పోలీసులదే తప్పని వక్రీకరించి వార్తలు రాయడం, ప్రసారం చేయడం సిగ్గుచేటు. కన్ను కోల్పోయిన కానిస్టేబుల్పై కనీస సానుభూతి చూపని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. పుంగనూరు, అంగళ్లులో పోలీసులు దెబ్బలు తిని ప్రజల ప్రాణాలు కాపాడారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ -
సంక్షేమాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ఏపీ
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మేధావులు, ప్రజా సంఘాల నాయకులు చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని కేంద్ర నివేదికలు చెబుతుంటే.. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు మాత్రం అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలను పౌరసమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు మరింత కష్టాల్లోకి నెట్టాయని చెప్పారు. బిల్డింగులు, పరిశ్రమలు, వంతెనలు కడితేనే అభివృద్ధి కాదని, సామాన్యుడి జీవనం బాగుపడాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయం దిశగా పయనిస్తోందన్నారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెటర్ ఫర్ ఏపీ సొసైటీ పేరుతో పౌరులకు వాస్తవాలను తెలియజేసేందుకు రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ ప్రగతి నాడు–నేడు’ సమగ్ర నివేదికను శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరీజు వేసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, దేశానికి ఆర్థిక శక్తిని అందించడంలో ఏపీ కీలకంగా మారింది. ఆర్బీఐ, నీతి ఆయోగ్, సోషియో ఎకనామిక్ రిపోర్టు.. ఇలా అన్ని నివేదికల్లో నాలుగేళ్లుగా ఏపీ సాధిస్తున్న వృద్ధి కనపడుతోంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా నాలుగేళ్లలో 3.26 లక్షల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించడం చరిత్రలోనే ప్రథమం. ఫలితంగా పేదలు ఆర్థి క పరిపుష్టి సాధించారు. వారిలో కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా 16.22 శాతం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులతో సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఏపీలోనే లభిస్తోంది. పరిశ్రమల నెట్ అసెట్ విలువలో దక్షిణాదిన టాప్లో, ఫ్యాక్టరీల సంఖ్యలో దేశంలో నాలుగో స్థానం, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లలో రెండో స్థానం, ఎగుమతుల్లో 9 నుంచి 4వ స్థానానికి వచ్చింది. ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టే.. 2018–19లో తలసరి ఆదాయం రూ.1.50 లక్షలు ఉంటే ఇప్పుడు 2.30 లక్షలకు పెరిగింది. పేదరికం 6.6 శాతానికి దిగివచ్చింది. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించిన తీరు సీఎం జగన్ దార్శనికతకు అద్దం పట్టింది. సంక్షేమ పథకాలు లేకుంటే కోవిడ్ సమయంలో ప్రజా జీవనం తల్లకిందులయ్యేది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో పరిశ్రమలకంటే వ్యవసాయంపైనే ఎక్కువ దృష్టి సారిస్తే మంచిది’ అని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో నేత్ర వైద్యులు బి.సుబ్బారావు, వాకర్స్ ఇంటర్నేషనల్ డి్రస్టిక్ట్ గవర్నర్ రామలింగరాజు, లోక్సత్తా ఉద్యమ సంస్థ నగర అధ్యక్షుడు అశోక్ కుమార్, రిటైర్డు ప్రొఫెసర్ రెహా్మన్, సీనియర్ జర్నలిస్టు పీజీకే మూర్తి, సామాజికవేత్త అనంత హృదయరాజ్, గీతా విజన్ ట్రస్టు చైర్మన్ గీతా సుబ్బారావు, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ కో–కన్వినర్ ఎస్.కోటేశ్వరరావు, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సిల్వెస్టర్, సామాజిక కార్యకర్త బి.జయప్రకాశ్ తదితరులు ప్రసగించారు. అంతకు ముందు కళాశాల విద్యార్థులకు ‘రాష్ట్రంలో నాడు–నేడు అభివృద్ధి’పై క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అసత్యాలే వారికి ఆయుధాలు సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య ఫేక్ న్యూస్. ఏపీలో బాధ్యతాయుత మీడియా సైతం అభివృద్ధి లేదని ప్రచారం చేయడం సిగ్గుచేటు. నిత్యం పత్రికల్లో వచ్చే వార్తలను చూసి ఏపీ అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకునేందుకు అధ్యయనం చేశాం. మా పరిశీలనలో ఏపీ ఏ రంగంలోనూ వెనుకబడలేదు. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ నాలుగు రెట్ల పారిశ్రామిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనిస్తుంటే తప్పుడు ప్రచారం చేసే మీడియాను అందరూ ఎండగట్టాలి. రాష్ట్రంలో గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతోంది. పారిశ్రామిక రంగం వృద్ధి గతంలో 3.2 శాతం ఉంటే ఇప్పుడు 12 శాతానికి పెరిగింది. ఒకప్పుడు 60 వేల ఎంఎస్ఎంఈలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1.10 లక్షలకు చేరింది. 10 లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరిగింది. 600 పెద్ద పరిశ్రమల్లో 6 లక్షలకు పైగా ఉపాధి వచ్చింది. – మేడపాటి వెంకట్, అధ్యక్షుడు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సామాజిక మార్పుతోనే అభివృద్ధి సాధ్యం సామాజిక మార్పు ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యం. జీడీపీ పెరిగిందంటే ప్రజా జీవనం బాగుపడినట్టే. రాష్ట్రంలో పేదరికం తగ్గింది. అంటే సామాజిక న్యాయం కచ్చితంగా జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది ఏకంగా రూ.44 వేల కోట్లు సామాజిక న్యాయానికి ఖర్చు చేసింది. – ఏఆర్ సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు,నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం నిత్యం అప్పులంటూ విష ప్రచారం రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేస్తే.. సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. చంద్రబాబు రూ. 2.64 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.77లక్షల కోట్లు మాత్రమే అప్పు తెచ్చింది. కానీ, ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు రూ.10 లక్షల కోట్లు అప్పు అంటూ దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు. ఇప్పుడిస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎన్నడూ లేవు. అప్పట్లో తెచ్చిన డబ్బంతా ఎటు పోయిందని ఎవరూ అడగట్లేదు. టీడీపీ హయాంలో సంపద పంపిణీ కొంత మంది చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వెళ్లింది. – పి.విజయ్బాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం సమానత్వం కోసం కృషి జరుగుతోంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు ఏపీలో సమానత్వం కోసం కృషి జరుగుతోంది. చంద్రబాబు 14 ఏళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. సీఎం జగన్ రూ.21 వేల కోట్లతో 30 లక్షలకు పైగా ఇళ్లు కట్టిస్తున్నారు. అసైన్డ్ భూములకు హక్కులు ఇచ్చారు. అమరావతిలో ఇప్పుడు 50 వేల ఇళ్ల పట్టాలతో రూ.3 లక్షల కోట్ల ఆస్తి రాబోతోంది. – మాదిగాని గుర్నాథం, అధ్యక్షుడు, సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పేదల అభివృద్ధే నిజమైన సూచీ మనిషి జీవన ప్రమాణం పెరుగుదలే నిజమైన అభివృద్ధికి సూచీ. ఏపీపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోంది. ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. సీఎం జగన్ మాత్రం పేదల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం సాగుతోంది. కొత్తగా 17 వైద్య కళాశాలలు వస్తున్నాయి. – గౌతమ్రెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు చంద్రబాబు హయాంలో దళితులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలంలే సబ్సిడీ వచ్చేది కాదు. కానీ, సీఎం జగన్ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేశారు. ఒక్క కరోనాలోనే రూ. 2 వేల కోట్లు ఎంఎస్ఎంఈల కోసం ఖర్చు చేశారు. జగనన్న బడుగు వికాసం, ఇతర కార్యక్రమాల ద్వారా ఊపిరిపోశారు. దళితులను ఉద్యోగం చేసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు. – కాలే వెంకటరమణారావు, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు -
వలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఒప్పుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు మేధావులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం ‘మానవ అక్రమ రవాణా–గ్రామ వలంటరీ వ్యవస్థ’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ఏ వారాహిపై నుంచి పవన్ నిందలు వేశారో అదే వారాహిపై నుంచి క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అతనిపై ప్రైవేటు కేసులు పెట్టాలని, అలాగే పరువునష్టం దావా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పడినపుడు.. సంచులు మోసే ఉద్యోగం అని, ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడతారా అని అప్పట్లో చంద్రబాబు విమర్శించారని గుర్తు చేశారు. చంద్రబాబు మాటలను జనం పట్టించుకోకపోవడంతో పవన్ను రంగంలోకి దించారన్నారు. నిఘా సంస్థల పేరును వాడుకుని చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను పవన్ యథాతథంగా చదువుతున్నారని అన్నారు. అసలు ఏపీ కంటే తెలంగాణలోనే అధికంగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని, అక్కడ కేసీఆర్ను పవన్ ప్రశ్నించగలరా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో మేధావులు వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. బిల్లును పాస్ చేయమని కేంద్రాన్ని కోరు.. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవస్థలను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. మానవ అక్రమ రవాణాకు పేదరికం ఒక కారణమని గుర్తించి, దానిని నిర్మూలించడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు చేపడుతోంది. కేంద్రంలో గతంలో మేనకా గాంధీ మంత్రిగా ఉన్నప్పుడు మానవ అక్రమ రవాణాపై ఒక బిల్లు తయారు చేశారు. దానిని ఇప్పటి వరకూ పాస్ చేయలేదు. దీనిపై పవన్ నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని గానీ రాష్ట్రాన్ని కాదు. ప్రతి వ్యవస్థలోనూ తప్పులు చేసేవారున్నారు.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను లోబరుచుకుని పిల్లలు పుట్టాక వదిలేసే వారున్నారు. అలాగని హీరోలందరూ అలానే ఉన్నారని అంటామా? –పి.విజయ్బాబు, ఏపీ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు. పవన్ మాటలు సమంజసం కాదు రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండటానికి జగన్ నిర్ణయాలు కారణం. గత ప్రభుత్వంలో పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒకటో తేదీనే కోడి కూయకముందే ఇంటికొచ్చి ఇస్తున్నారు. దీంతో పల్లెల్లో బిక్షాటన పూర్తిగా పోయింది. వలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడటం పవన్కు సమంజసం కాదు. –డాక్టర్ రామచంద్రారెడ్డి, విద్యావేత్త నిఘా వర్గాలు మీకెందుకు చెప్పాయి? ఏ రాజ్యాంగ పదవిలో ఉన్నారని పవన్కు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం చెప్పాయి. నిఘా వర్గాల పేరును అడ్డుపెట్టుకుని కుట్ర పూరితంగా మాట్లాడుతున్నారు. వలంటీర్ల వ్వవస్థను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. – పిల్లా రవి, న్యాయవాది. డేటా, పేర్లు బయటపెట్టండి భవిష్యత్ తరాల భవితకు పునాదులు వేస్తున్న ప్రభుత్వం ఇది. పవన్కు ఉన్న భావదారిద్య్రం మరొకరికి ఉండదు. రెండు లక్షల పుస్తకాలు చదివాడంట. కేంద్ర నిఘా సంస్థలు ఎలా పనిచేస్తాయో కూడా తెలియదా. పవన్ దగ్గర ఉన్న డేటా, అది చెప్పిన సంస్థల పేరు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నా –శిష్ల్ట ధనలక్ష్మి, న్యాయవాది. చంద్రబాబు ఉచ్చులో పవన్ ఏ వలంటీర్ ఎంత మందిని అక్రమ రవాణా చేశారో ఆధారాలుంటే పవన్ బయటపెట్టాలి. ప్రజల్లో జనసేన చులకనై.. ఆ పార్టీ తన చెప్పు చేతల్లో ఉండాలని చంద్రబాబు పన్నిన ఉచ్చులో కుట్రలో పవన్ ఇరుక్కుంటున్నారు –ఎన్వీ రావ్, అంతర్జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు. పవన్ చేసింది నేరం సెంట్రల్ ఇంటిలిజెన్స్ బ్యూరోని పవన్ బజారున పెట్టారు. మానవ అక్రమ రవాణా గురించి మాత్రమే ఇంటిలిజెన్స్ బ్యూరో చెవిలో చెప్పిందా లేక దేశ భద్రత రహస్యాలు కూడా చెప్పిందా? ఏపీ ప్రజలకు తెలియజేయమని తనకు నిఘా వర్గాలు చెప్పాయని పవన్ అనడం చాలా పెద్ద నేరం. –ఎ.ఎస్.ఎన్. రెడ్డి, విశ్రాంత పోలీస్ అధికారి. అప్పుడు నోరు లేవలేదేం చదువురాని ఎంతో మందికి వలంటీర్లు సేవలందిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అభియోగం వచ్చినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు. ఆధార్ డేటాను టీడీపీ హయాంలో సాఫ్ట్వేర్ సంస్థకు ఇచ్చినప్పుడు నోరెందుకు మూగబోయింది. 60 శాతం పైగా ఉన్న మహిళా వలంటీర్లు మానసికంగా బాధపడేలా చేశారు. – చంగవల్లి సాయిరాం, న్యాయవాది. జగన్ ఓ స్టేట్స్ మేన్ సీఎం వైఎస్ జగన్ను ఏకవచనంతో పిలిస్తే ఏమవుతుంది. దాని వల్ల జగన్కు ఏమీ నష్టం లేదు. ఆయన సమర్థవంతమైన పాలనతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నో జాతీయ అవార్డులను తెచ్చుకుంటున్న స్టేట్స్ మేన్(గొప్ప రాజనీతిజ్ఞుడు) సీఎం జగన్. పవన్ బహిరంగ క్షమాపణ చెబితే ఆయనకే మంచిది. కాదంటే ఇకపై సహించేది లేదు. – నరహరిశెట్టి నరసింహారావు, న్యాయవాది. -
ఎప్పటికీ ‘మేధావులు’ అవసరమే!
ఫ్రెంచ్ సమాజంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ‘మేధావులు’ ఆవిర్భవించారు. అయితే ఈ మేధావులు అనే మాటను వామపక్షీయులను ఉద్దేశించి వాడింది సంప్రదాయవాదులు (రైట్వింగ్), కాకపోతే నిందాపూర్వకంగా! వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్లో కూడా అదే పరి స్థితి ఉండటం గమనార్హం. అయితే మేధావులు ఈ దాడులను మొదటినుంచీ తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. సమాజంలో జరిగే వ్యవహారాలకు మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకుని ఉండలేరు. కానీ మునుపటిలా శక్తిమంతంగా వారు పోరాడుతున్నారా అన్నది సందేహం. 1993లో ‘బీబీసీ రీత్ ప్రసంగం’ చేస్తూ పాలస్తీనియన్ –అమెరికన్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ సెడ్ ఇలా ప్రశ్నించారు: ‘‘సృజనాత్మకతకూ, దౌర్బల్యుల పట్ల నిబద్ధ తకూ మధ్య సమతౌల్యత సాధించడం ఎలా?’’ ఇంకా ఆయన ఇలా కొనసాగించారు: ‘‘అదిభౌతికమైన ఉద్వేగాలు, ఆసక్తి ఉండని న్యాయం, సత్యం వంటి సూత్రాలు కదిలించినప్పుడల్లా అసలైన మేధావులు ఎన్నడూ లేనంత తాముగా ఉన్నారు. వారు అక్రమాలను నిరసించారు, బలహీనుల పక్షాన నిలిచారు, అధికారాన్ని ప్రశ్నించారు.’’ ప్రజా మేధావి అన్న భావన మొట్టమొదట 1894 డిసెంబరులో ఫ్రాన్ ్సలో పుట్టుకొచ్చింది. ఆర్మీ కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రేఫస్పై దేశద్రోహం ఆరోపణలు వచ్చాయి. జర్మన్లకు మిలటరీ రహస్యాలు అమ్మేశాడన్నది ఆయనపై ఆరోపణ. ఇదే అదనుగా యూదు వ్యతిరేక సంస్థలు చెల రేగాయి. ఉదాహరణకు ఎడువార్డ్ డ్రూమాంట్ సంపాదకత్వంలో నడిచిన ‘లా లిబ్రే’ ఫ్రెంచ్ యూదులు విశ్వాస ఘాతకులన్నట్టుగా కథనాలు ప్రచురించింది. కొంతమంది డ్రేఫస్కు మద్దతుగా నిలిచారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం బలహీనంగా ఉంది. ఫెర్డినాండ్ వాల్సిన్ ఈస్టర్హేజీ అనే మరో అధికారిపై ఇలానే దేశద్రోహ ఆరోప ణలు వస్తే మిలటరీ కోర్టు వాటిని కొట్టివేసింది. జరిగిన అన్యాయం గురించి అందరికీ స్పష్టంగా అర్థమైంది. జాతి వివక్ష కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ నేపథ్యంలో మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకు ఉండలేని పరిస్థితి. విఖ్యాత నవలా రచయిత ఎమిలీ జోలా ‘జా అక్యూస్’ పేరుతో రాసిన బహి రంగ లేఖ ‘లా అరోర్’ పత్రికలో ప్రచురితమైంది. డ్రేఫస్ను అక్రమంగా దోషిగా నిర్ధారించి ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఎమిలీ ఆ లేఖలో సైన్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది మరో వివాదానికి దారితీసింది. జోలా మద్దతుదారులు సైన్యాన్ని కించ పరచడం ద్వారా దేశాన్ని బలహీన పరిచారని సంప్రదాయవాదులు (రైట్ వింగ్) విరుచుకుపడ్డారు. మండించే స్వభావం గల అలంకార ప్రాయమైన దేశభక్తి కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ఉదారవాద వామ పక్షీయులు మద్దతిచ్చారు. సంప్రదాయవాదులు వారిని ‘మేధావులు’ అని నిందాపూర్వకంగా పిలిచారు. వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్లో కూడా అదే జరుగుతోంది. అయితే మేధావులు ఎప్పుడూ ఈ దాడులను తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. తత్వవేత్త, రచయిత జా పాల్ సార్త్ర్ 1980లో మరణించినప్పుడు సుమారు యాభై వేల మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. వివాదానికి దూరంగా ఉండే హక్కు మేధావికి లేదనే వారు సార్త్ర్. అన్నింటికీ అతీతంగా ఉంటామనే సౌలభ్యం కూడా వారికి నాస్తి అంటారాయన. సమాజాన్ని మార్చేందుకు ప్రజా మేధావి అనేవాడు తన సొంత విషయాలను పక్కనబెట్టాలనీ, వ్యక్తిగత జీవితం వంటివి అతడు లేదా ఆమెకు ఉండవనీ అంటారు. 1935లో ఫ్రెంచ్ మేధావులు అంతర్జాతీయ రచయితల సంఘం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ప్యారిస్ సంస్కృతి పరిరక్షణ దీని ఉద్దేశం. ఈ సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో ఫాసిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఏకమయ్యారు. జూన్ నెలలో జరిగిన ఈ సదస్సుకు సజ్జాద్ జహీర్, ముల్క్రాజ్ ఆనంద్ వంటివారూ హాజరయ్యారు. తరువాతి కాలంలో వీరిద్దరూ భారతీయ సాహిత్యం, ఉర్దూ కవిత్వంలో మార్పునకు కృషి చేశారు. ఆల్డస్ హక్స్లీ, ఈఎం ఫార్స్టర్, బోరిస్ ప్యాస్టర్నాక్, బెర్తోల్ట్ బ్రెష్ట్, ఇంకా ఇతర దిగ్గజ రచయితలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో తలెత్తిన వివాదాలు కాస్తా ప్యారిస్ వీధుల వరకూ విస్తరించాయి. సోవియట్ యూనియన్ చరిత్రకారుడు ఇల్యా ఎహ్రెన్ బర్గ్ ‘దోపిడిదారులను దునుమాడేందుకు ఆయుధంగా మారని ఏ కళ అయినా నిష్ప్రయోజనమైంది!’ అన్నారు ఇల్యా మీద ఆండ్రే బ్రెటన్ లాంటివారు బహిరంగంగానే విమర్శించారు. చివరకు ఆ సదస్సు ఫాసిస్టులకు వ్యతిరేకంగా ఒక సమాఖ్యనైతే ఏర్పాటు చేయలేకపోయింది. సదస్సుకు హాజరైన వారందరూ ఫాసిజాన్ని ద్వేషించారు. కానీ సోవియట్ యూనియన్ తరహా పరి ష్కారం ఉండాలన్న ఆకాంక్షపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. అధివాస్తవికులు, కమ్యూనిస్టుల మధ్య సయోధ్య కోసం రెనె క్రేవెల్ (అధివాస్తవికుడు) విఫలయత్నం చేశారు. ఆ నిస్పృహలో రెనె తన ఇంటికొచ్చేసి గ్యాస్ కనెక్షన్ ఆన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ఏవగింపు’ అని రాసి ఉన్న నోట్ అతడి కోటు జేబుకు అతికించి ఉండింది! ప్రగతిశీల రచయితల బాధ్యత రచయితలు, కవుల సామాజిక బాధ్యతలపై అదే కాలంలో భారత్లో కూడా ఎన్నో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కవులు, రచయితలు సామాన్యులతో కలిసిపోవాలంటే వారు తమ వ్యక్తిగత ఆనందాలు, కోరికలు, ఉద్వేగాలు, నిస్పృహలకు అతీతంగా తమ రచనలు, కవితలను తీసుకెళ్లాలన్న నమ్మకంతో 1936లో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (అఖిల భారతీయ ప్రగతిశీల రచయితల సంఘం) ఏర్పడింది. మతం, జాతీయత రాజకీయాల నుంచి పేద రికం, వివక్ష, వర్గం వైపు కవులను మళ్లించిన ఘనత దీనిదే. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటలీ కాలమిస్ట్ ఆంటోనియో గ్రాంసీ రచనలను అప్పటికి చదివి ఉండేందుకు అవకాశం లేదు. ఆయన ‘ప్రిజన్ నోట్బుక్’ 1970లలో ఆంగ్లంలో ప్రచురితమైంది. కానీ ముస్సోలిని అపఖ్యాతి జైలు వ్యవస్థలో మగ్గిన గ్రాంసీ రాసినదానిలో ఈ ప్రగతిశీల రచయితలు నమ్మకం ఉన్నవారే. అదేమిటంటే... మేధావి అనేవాడు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు అవసర మైన వాతావరణాన్ని సృష్టించాలి. ఉదారవాదులు రాజకీయ జీవితంలోకి ప్రవేశించాలి! ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యుడు, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ సభ్యుడైన కె.ఏ. అబ్బాస్ తన ఆత్మకథలో ‘నేనేమీ ఓ ద్వీపాన్ని కాదు’ అన్న వాక్యం ఉంటుంది. 1946 నాటి బాంబే గురించి ఈ వ్యాఖ్య. అప్పట్లో హిందూ, ముస్లింల మధ్య బాంబే రెండుగా విడిపోయి ఉండేది. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ , ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఓ శాంతి ప్రదర్శన ఏర్పాటు చేశాయి. పృథ్వీరాజ్ కపూర్కు చెందిన పృథ్వీ థియేటర్స్తో పాటు సుమారు 52 సాంస్కృతిక సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గొ న్నాయి. కపూర్లు(పృథ్వీరాజ్, రాజ్, షమ్మీ), దేవానంద్, బల్రాజ్ సహానీ, అభ్యుదయ ఉర్దూ కవులు, రచయితలు సజ్జాద్ జహీర్, మజ్రూహ్ సుల్తాన్ పూరి, అలీ సర్దార్ జాఫ్రీ, కైఫీ అజ్మీ, సాహిర్ లూధి యాన్వీతో పాటు మరాఠీ, గుజరాతీ రచయితలు కూడా బోరిబందర్ నుంచి బాంద్రా వరకూ సాగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. శాంతి, సామరస్యాలు, సౌభ్రాతృత్వాలను సూచించే పాటలు పాడుతూ సాగిందా ఊరేగింపు. తద్వారా మత ఘర్షణల గాయాలకు మందు పూసే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతానికి వస్తే... మన నటులను అధికార పక్షంపై ప్రశంసలు కురిపించేలా బలవంతం చేస్తున్నారు. జైలుకెళ్లాల్సి వస్తుందని రచ యితలు భయపడుతున్నారు. విప్లవాత్మక ఆలోచనలున్న నాటక రంగం కనుమరుగైంది. కవులు రాస్తున్నారు కానీ వారి వారి ఏకాంతాల్లో! విద్యావేత్తలు తమ ఉపకులపతుల ఆగ్రహానికి గురి కాకుడ దన్న రంధిలో ఉన్నారు. ఏతావాతా... సమాజపు చేతన కాస్తా నిశ్శబ్దంలో అంగలారుస్తోంది. ఇది ఉపమాలంకారమే కావొచ్చుగానీ, మేధావుల చుట్టూ సంకెళ్ల శృంఖలాలు చుట్టుకుపోయి ఉన్నాయి. దశాబ్దాలపాటు ఫాసిస్టు వ్యతిరేక కూటమి కట్టిన శక్తులు మమ్మల్ని మళ్లీ ఆవహిస్తే బాగుండు. సామాజిక మేధావులు లేని సమాజం నశించిపోతుందనీ, అది కూడా చాలా నెమ్మదిగా కానీ కచ్చితంగా జరుగు తుందనీ ఆ శక్తులు గుర్తుచేస్తున్నాయి. నీరా చంఢోక్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వెంటాడు... వేటాడు...
పరిశోధన, ప్రజా విధానాలకు సూచన, సలహాల్లో యాభై ఏళ్ళుగా కృషి చేస్తూ, స్వర్ణోత్సవం జరుపుకోవడమనేది ఉత్సాహంగా ముందుకు అడుగేయాల్సిన సందర్భం. కానీ, అందుకు విరుద్ధంగా అడుగులు ముందుకు పడకుండా పాలకులే అడ్డం పడితే? పౌర విధానానికి సంబంధించి దేశంలోకెల్లా అత్యంత గౌరవనీయమైన ఢిల్లీకి చెందిన మేధావుల బృందమైన ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’ (సీపీఆర్) విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అలానే ఉంది. ఆ సంస్థకు విదేశీ విరాళాలు, ఆర్థిక సహాయం అందే వీలు లేకుండా ‘విదేశీ సహాయ (నియంత్రణ) చట్టం’ (ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్ట్రేషన్ను ఆరు నెలల పాటు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 27న ఉత్తర్వులివ్వడం జాతీయ, అంతర్జాతీయ మేధావులను ఉలిక్కిపడేలా చేసింది. విద్యావిషయిక కార్యక్రమాలకే లైసెన్స్ ఇచ్చామనీ, కానీ సీపీఆర్ మాత్రం విదేశీ విరాళాలను పుస్తక ప్రచురణ లాంటి వాటికీ వినియోగిస్తోందనీ ఆ ఉత్తర్వుల ఆరోపణ. అయిదు నెలల క్రితం గత సెప్టెంబర్లో ఢిల్లీలోని సీపీఆర్ కార్యాలయం, అలాగే ఆక్స్ఫామ్ ఇండియా, పలు డిజిటల్ మీడియా సంస్థలకు నిధులిచ్చే బెంగళూరుకు చెందిన ‘ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండే షన్’ (ఐపీఎస్ఎంఎఫ్)లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విరుచుకుపడింది. సర్వేలు నిర్వహించింది. ఆ వెంటనే సిబ్బందికి సమన్లు వెళ్ళాయి. దానికి కొనసాగింపుగా పన్ను మినహాయింపును రద్దు చేస్తామని హెచ్చరిస్తూ, షోకాజ్ నోటీసు వెళ్ళాయి. ఒక రకంగా దాని కొనసాగింపే – ఇప్పుడీ లైసెన్స్ రద్దు. నిజానికి, లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థగా 1976 నుంచి సీపీఆర్కు పన్ను మినహాయింపు లభిస్తోంది. వచ్చే 2027 దాకా మినహాయింపు ఉన్నా, ఇప్పుడీ బెదిరింపులు గమనార్హం. ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాలుంటే విచారించడం తప్పు కాదు. చట్టం ముందు అందరూ సమానులే గనక ఏమన్నా తప్పు చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకోవడమూ తప్పనిసరే. కానీ, మనసులో ఏదో పెట్టుకొని, ఏ చిన్న లోపం కనిపించినా, వెంటాడి వేధించాలని అనుకుంటేనే అది హర్షించలేని విషయం. ఆ సంస్థ బాధ్యుల్లోని పరిశోధకులు కొందరు ప్రభుత్వ విధానాల్ని తప్పుబడుతూ ఇటీవల రాసిన వ్యాసాలే దీనికి హేతువని ఓ బలమైన విమర్శ. ఎక్కడా, ఏ తప్పూ చేయలేదని తేలినప్పటికీ, సాంకేతిక కారణాలే సాకుగా సీపీఆర్ లాంటి స్వతంత్ర మేధాసంస్థను వేధిస్తున్నారన్నది స్పష్టం. కొండను తవ్వి ఎలుకను పట్టే ఈ దీర్ఘకాల ప్రక్రియతో మానసికంగా వేధించడమే పాలక వర్గాల పరమార్థంగా కనిపిస్తోంది. నిజానికి, సీపీఆర్ అనేది దేశంలోని అగ్రేసర స్వతంత్ర పరిశోధనా సంస్థల్లో ఒకటి. విభిన్నరంగాలకు చెందిన పరిశోధకులు, వృత్తినిపుణులు, విధాన నిర్ణేతలతో కూడిన మేధావుల బృందం ఇది. ఈ లాభాపేక్ష రహిత సంస్థ 50 ఏళ్ళ క్రితం 1973లో ఏర్పాటైంది. ప్రభుత్వ విధానాల్లోని వివిధ అంశాలపై ఈ సంస్థలోని బుద్ధిజీవులు దృష్టి సారిస్తుంటారు. ఆర్థికవేత్త – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్ సహా పలువురు మేధావులు ఈ సంస్థ కార్యవర్గంలో మాజీ సభ్యులు. అనేక కేంద్ర శాఖలతో, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలతోనూ కలసి పనిచేసిన ఈ సంస్థను భారత ప్రభుత్వం గుర్తించింది. దశాబ్దాలుగా పన్ను మినహాయింపూ ఇస్తోంది. గత ఏడాదీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల నుంచి సీపీఆర్కు నిధులు వచ్చాయి. మరి, ఉన్నట్టుండి సీపీఆర్ జీవితం మీద పాలకులకు ఎందుకు విరక్తి కలిగినట్టు? దీనికి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్న ‘జన అభివ్యక్తి సామాజిక్ వికాస్ సంస్థ’ (జస్వాస్) సహా దాదాపు 30 సంస్థలకు డేటా సేకరణ, పర్యావరణ చట్టం సహా పలు అంశాల్లో పరిశోధనకు సీపీఆర్ నిధులిచ్చింది. ఛత్తీస్గఢ్లో ఏనుగులు తిరిగే జీవవైవిధ్య ప్రాంతం హస్దేవ్లో బొగ్గు గనుల అక్రమ తవ్వకంపై ఆదివాసీ ఉద్యమంలో జస్వాస్ ట్రస్టీ అయిన ఒక పరిశోధకుడి భాగం కూడా ఉంది. ఆ గనులు పాలకుల ఆశీస్సులున్న వ్యాపార సంస్థవనీ, ఆ ఉద్యమానికీ – సీపీఆర్తో జస్వాస్ భాగస్వామ్యానికీ సంబంధం లేకున్నా పాలకులకు అది కోప కారణమైందనీ విశ్లేషకుల మాట. కారణాలు ఏమైనా, ఏలినవారికి కోపమొస్తే బండి నడవడం కష్టమనే విషయం తాజా సీపీఆర్ లైసెన్స్ రద్దుతో మరోసారి రుజువు చేస్తోంది. గమనిస్తే – ఐటీ విభాగం తన నోటీసుల్లో పేర్కొన్న పరిశీలనలు, చేసిన ఆరోపణలు దాని పరిధిని దాటి ఉన్నాయి. ఇది పాలకులపై అనుమానాలకు ఊతమిస్తోంది. సీపీఆర్ మాత్రం తమ కార్యకలాపాలన్నీ చట్టబద్ధమైనవేననీ, ప్రభుత్వ సంస్థలు తమ ఆదాయ వ్యవహారాలను ఎప్పటి కప్పుడు ఆడిట్ చేస్తూనే ఉన్నాయనీ స్పందించింది. రాజ్యాంగ విలువల స్ఫూర్తితో ఈ వివాదం వీలైనంత త్వరలో సమసిపోతుందని అభిలషించింది. ఆ అభిలాష వాస్తవరూపం ధరిస్తే సంతో షమే. అయితే, పాలకులు తమ చేతుల్లోని దర్యాప్తు సంస్థలనూ, విభాగాలనూ దుర్వినియోగం చేయ డానికి ఏ మాత్రం వెనుకాడని గతం, వర్తమానమే భయపెడుతున్నాయి. నిబంధనల్లోని సాంకేతిక అంశాలను ఆయుధంగా చేసుకొని, భావప్రకటన స్వేచ్ఛకున్న అవకాశాల్ని అడ్డుకోవాలని పాలకులు చూడడం ఆందోళన రేపుతోంది. ఐటీనైనా, విదేశీ స్వార్థ ప్రయోజనాలు మన దేశ రాజకీయాలను ప్రభావితం చేయరాదని పెట్టుకున్న ఎఫ్సీఆర్ఎ లాంటి నియంత్రణ వ్యవస్థనైనా ప్రభుత్వేతర సంస్థల పీక నులమడానికి వాడితే అది అప్రజాస్వామికమే కాదు... అచ్చమైన ప్రతీకారమే! -
అప్పర్భద్రతో రాయలసీమకు నీటి గండం
సాక్షి,అమరావతి/తిరుచానూరు(తిరుపతి జిల్లా): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ పట్ల చూపుతున్న వివక్షతతో రాయలసీమకు తీవ్ర నీటిగండం ఎదురయ్యే ప్రమాదం ఉందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మంగళవారం ఫోరం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి, ప్రయాగతో కలిసి పురుషోత్తంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటన చేస్తూ నిధులు మంజూరు చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చట్టబద్ధత లేని ఎగువ భద్రను నిలువరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా జాతీయ హోదాను ప్రకటించడం ద్వారా ఫెడరల్ స్ఫూర్తిని తంగలో తొక్కిందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై సమష్టి పోరాటం సాగించాలన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏపీకి చెందిన సభ్యులు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కాగా, ఎగువన ఉన్న కర్ణాటక తుంగభద్రపై అదనంగా మరో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దిగువనున్న రాయలసీమలోని తుంగభద్రపై నికర జలాలు కలిగి ఉన్న ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ, కేసీ కెనాల్, గుండ్రేవుల ప్రమాదంలో పడతాయి. కృష్ణా నదిలో ప్రవాహం తగ్గి తుంగభద్ర నీరే ప్రధానం అవుతున్న నేపథ్యంలో కర్ణాటక నిర్మించే ఎగువ భద్రతో గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీలకు సైతం ప్రమాదం ఏర్పడుతుంది. -
అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారే: మేధావుల ఫోరం
తిరుపతి: రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతిలో సమావేశమయ్యింది. తుంగభద్ర నదిపై అప్పర్ భద్ర ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని సమావేశంలో తీర్మానించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారి అవుతుందని మేధావుల ఫోరం పేర్కొంది. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు తాగునీటి కష్టాలు తప్పవని చెప్పారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను స్వాగతిస్తున్నామని రాయలసీమ మేధావుల ఫోరం తెలిపింది. -
జీవో నంబర్ 1లో నిషేధమనే పదమే లేదు
ఏఎన్యూ: ప్రజల ప్రాణాలు, జీవితాలను కాపాడేందుకు రోడ్లపై బహిరంగ సభల విషయంలో నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేధావుల ఐక్యవేదిక కొనియాడింది. జీవో నంబర్ 1లో బహిరంగ సమావేశాలు నిషేధమనే పదమే లేదని వక్తలు గుర్తు చేశారు. నియంత్రణకు, నిషేధానికి చాలా వ్యత్యాసం ఉందనేది గుర్తించాలని సూచించారు. తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుందని నిలదీశారు. ప్రజా సంరక్షణ చర్యలు చేపట్టడం పాలకుల కనీస బాధ్యతనే విషయం మరిచిపోకూడదన్నారు. ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం అమల్లోకి తెస్తే దానిపై అవగాహన కల్పించడం మీడియా బాధ్యత అని తెలిపారు. ఇలా కాకుండా ప్రభుత్వ నిర్ణయాలను భూతద్దంలో చూపుతూ.. ఇవి ప్రజలకు నష్టమన్నట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని.. ఇతరుల హక్కులు, స్వేచ్ఛ, ప్రాణాలను హరించకూడదని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ఆవశ్యకత, ఇందులోని అంశాలపై విద్యావేత్తలు, మేధావులు సమాజానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా స్పందించాలని కోరారు. మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ)లో బుధవారం జీవో నంబర్ 1పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే.. రాజకీయ కోణంలో చూడకూడదు.. సామాన్యుల ప్రాణాలు పరిరక్షించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను రాజకీయకోణంలో చూడటం సరికాదు. తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుంది? కందుకూరు, గుంటూరు ఘటనలపై పౌరహక్కులు, దళిత సంఘాలు కూడా స్పందించకపోవడం విచారకరం. ఇదే ఘటన అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో జరిగితే అక్కడ సమాజమంతా గొంతెత్తేది. మరణించిన వారికి కనీసం సంతాప సభ కూడా నిర్వహించకపోవడం హర్షణీయమా? కనీసం భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగనీయబోమని ప్రకటించకుండా యధావిధిగా సభలు, సమావేశాలు నిర్వహించడం సరైన పనేనా? ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంపై మేధావులు సమాజానికి అవగాహన కల్పించాలి. –ఆచార్య పి.రాజశేఖర్, వీసీ, ఏఎన్యూ మరిన్ని సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం.. సమాజానికి ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ ఉత్తర్వులపై సమాజానికి అవగాహన కల్పించడం విద్యావేత్తలు, మేధావుల బాధ్యత. ప్రభుత్వ ఉత్తర్వులపై మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరిన్ని సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం. –ఆచార్య శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్, ఆర్కిటెక్చర్ కళాశాల, ఏఎన్యూ ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయని గుర్తించాలి.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆసక్తి ఉన్నవారు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. కానీ ఆ నిర్ణయమే తప్పంటే ఎలా? ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయనేది గుర్తించాలి. –ఆచార్య బి.కరుణ, రిజిస్ట్రార్, ఏఎన్యూ ప్రభుత్వ చర్యను అందరూ హర్షించాలి.. సమాజంలోని పౌరులందరి హక్కులు, స్వేచ్ఛ కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను అందరూ హర్షించాలి. – ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రెక్టార్, ఏఎన్యూ ఎవరికీ ఇబ్బంది లేనిచోట నిర్వహించుకోవాలి.. ఎవరికీ ఇబ్బంది లేనిచోట బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలి. అసలు సమావేశాలే నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేస్తే ఇబ్బంది కానీ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా జరుపుకోండంటే తప్పెలా అవుతుంది? – ఆచార్య కె.సునీత, ఓఎస్డీ, ఏఎన్యూ ఈ జీవోతో ఇబ్బందులేమీ లేవు.. జీవో నంబర్ 1తో ఇబ్బందులేమీ లేవు. దీనిలోని వాస్తవాలను అందరూ గ్రహించాలి. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడే చర్యలను ఎవరు చేపట్టినా హర్షించాలి. –ఆచార్య కె.మధుబాబు, డీన్, సీడీసీ, ఏఎన్యూ -
జీవోను రాజకీయ కోణంలో చూడకండి
ఏయూ క్యాంపస్: ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 1 నిలుస్తుందని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. జీవోను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఎవరి స్వేచ్ఛను ప్రభుత్వం హరించలేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏయూ, విశాఖ నగర మేధావుల వేదిక సంయుక్తంగా బుధవారం ‘ప్రజల ప్రాణాలకు రక్ష జీవో నంబర్ 1’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను రక్షించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకువచ్చిన జీవో ఇదని వక్తలు స్పష్టం చేశారు. దీన్ని తామంతా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది చిన్నారావు, డాక్టర్ ఎ.కె.ఎం.పవార్, ఆచార్య ఎన్.సత్యనారాయణ, డాక్టర్ రాజమాణిక్యం, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, డాక్టర్ బాలకోటయ్య, డాక్టర్ అంబేడ్కర్ రాజు, డాక్టర్ ఎ.సీతారత్నం, డాక్టర్ రాజ్కుమార్, తదితరులు ప్రసంగించారు. జీవో నంబర్ 1 మన బాధ్యతను గుర్తు చేసింది. ఈ జీవోతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగదు. – ఆచార్య జేమ్స్ స్టీఫెన్, అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్, ఏయూ ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా సమావేశాలు పెట్టుకోవచ్చని జీవో స్పష్టం చేస్తోంది. దీన్ని వక్రీకరిస్తూ ఎమర్జెన్సీని తలపిస్తోందని ప్రచారం చేయడం సరికాదు. – ఆచార్య కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్ కళాశాల ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని జీవో స్పష్టం చేస్తోంది. – ఆచార్య ఎన్.ఎ.డి.పాల్, బీసీడీఈ సమన్వయకర్త విమర్శించే వ్యక్తులు ముందుగా జీవోను చదివి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. – ఆచార్య పి.విశ్వనాథం, గౌరవ ఆచార్యులు, డీసీఎంఎస్ విభాగం ఏయూ మహిళా ఉద్యోగుల సంఘం తరఫున జీవో నంబర్ 1ని తాము స్వాగతిస్తున్నాం. ఇటువంటి జీవోలు ప్రజల రక్షణకు, భద్రతకు ఉపయుక్తంగా నిలుస్తాయి. – ఆచార్య టి.శోభశ్రీ, ప్రిన్సిపాల్, ఐఏఎస్ఈ జీవో నంబర్ 1 అప్రజాస్వామికం అనడం సరికాదు. కందుకూరు, గుంటూరు ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఈ జీవో తీసుకువచ్చారు. – ఆచార్య పి.అర్జున్, గౌరవ ఆచార్యులు, సోషల్ వర్క్ విభాగం నిషేధం, ఆంక్షలకు వ్యత్యాసం ఉందనే విషయాన్ని గమనించకుండా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఈ జీవోపై వాస్తవాలు తెలిపే విధంగా విస్తృత చర్చలు జరపాలి. – పాకా సత్యనారాయణ, న్యాయవాది ప్రజల ప్రాణాలు ఎంతో ప్రధానం. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం అర్థరహితం. – ఆచార్య విజయ్మోహన్, డీన్, విద్యార్థి వ్యవహారాలు కొంత మంది ఏకపక్షంగా ఈ జీవోను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. ఇది సరికాదు. – ఆచార్య ఎస్.పుల్లారావు, అర్థశాస్త్ర విభాగాధిపతి అన్ని పార్టీలకు ఈ జీవో వర్తిస్తుంది, ఎక్కడా నిషేధం లేదు.. కేవలం నిబంధనలు మాత్రమే ఉన్నాయి. వీటిని అనుసరిస్తూ సమావేశాలు, ర్యాలీలు జరుపుకోవడానికి ఇబ్బంది ఏముంది? – ఆచార్య ఎ.పల్లవి, క్రీడా విభాగాధిపతి, ఏయూ -
దేశ చరిత్రలోనే ‘గృహ’త్తర అధ్యాయం
పాత గుంటూరు: గతంలో ఇంటి స్థలం కావాలంటే రోజుల తరబడి పోరాడాల్సి వచ్చేదని, సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మేధావులు, ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ‘పేదల ఇళ్లు – రాజకీయ సవాళ్లు’ అంశంపై మేధావులు, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం గుంటూరులోని ఎన్జీవో హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు జి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేదల ఇళ్లపై రాజకీయం చేస్తున్న పలు పార్టీల వైఖరిని ఎండగట్టారు. విపక్షాల రాద్ధాంతం తగదు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తుండటం గొప్ప విషయం. విపక్షాలు విజ్ఞత కోల్పోయి విమర్శలు చేయడం తగదు. – ఆచార్య డీఏఆర్ సుబ్రహ్మణ్యం, మహాత్మా గాంధీ కళాశాల వ్యవస్థాపకుడు బాబు, పవన్ రాజకీయాలకు తగరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారు. నా దృష్టిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయ నేతలే కారు. ప్రజల బాధలు పట్టనోళ్లు రాజకీయాలకు తగరు. – ఆచార్య గురవయ్య, ఏసీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఇది స్వర్ణయుగం గుప్తుల స్వర్ణ యుగం గురించి మనం పుస్తకాలలో చదువుకున్నాం. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పాలనలో దానిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందరికీ ఇళ్లు ఇవ్వడం అనేది అతిపెద్ద యజ్ఞం. – చక్రపాణి, విశ్రాంత ఎస్పీ పేదల ఇళ్లు – పవర్స్టార్ కన్నీళ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్లను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం మహిళా సాధికారతకు నిదర్శనం. పేదల ఇళ్లు–పవర్ స్టార్ కన్నీళ్లు అనే నినాదంతో మహిళలంతా ఉద్యమిస్తే కానీ వాళ్లకు బుద్ధి రాదు. – మంజుల, సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త సీఎం నిజమైన ప్రజా పాలకుడు ఏకంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టడం గొప్ప విషయం. జగనే నిజమైన ప్రజా పరిపాలకుడు. – గోళ్లమూడి రాజసుందరబాబు, ఐద్వా వ్యవస్థాపకులు రాజకీయాలకు అతీతంగా హర్షిద్దాం గతంలో ఇళ్ల స్థలాలు కావాలంటే రోజుల తరబడి ఆందోళన చేయాల్సి వచ్చేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇది అందరూ హర్షించదగ్గ అంశం. – జి.శ్రీనివాస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు గొప్ప విషయం ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమి సేకరించింది. నిరుపేదల ఇళ్ల కోసం మొత్తం 25 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇది వాస్తవం. – పరిశపోగు శ్రీనివాసరావు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పవన్ ఆందోళన హాస్యాస్పదం జగనన్న ఇళ్లపై పవన్ కళ్యాణ్ ఆందోళన హాస్యాస్పదం. జగనన్న ఇళ్లు – జనసేనాని కన్నీళ్లు అని కార్యక్రమం పేరు మార్చితే బాగుంటుంది. – భగవాన్ దాస్, రాష్ట్ర విద్యార్థి ఉద్యమ నేత గూడు చెదరగొట్టే కుట్ర అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు ముఖ్యమంత్రి జగన్ కల్పిస్తున్న గూడు చెదర గొట్టేందుకు రాష్ట్రంలో ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. – తిప్పాబత్తుని గోవింద్, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇది సరికొత్త చరిత్ర తాడి తన్నేవాడి తల తన్నేవాడే జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని ఎత్తులు వేసినా.. వాటికి పైఎత్తు వేసి చిత్తు చేయగల సమర్థుడు. ఇళ్ల నిర్మాణం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు. – వేముల భారతి, అస్మిత మహిళా మండలి అధ్యక్షురాలు పవన్కొచ్చిన నొప్పేంటి? సొంత ఇంటి కోసం ఎన్నో ఇక్కట్లు పడ్డాం. సీఎం జగన్ పుణ్యాన ఇప్పుడు సొంతింటిలో దర్జాగా ఉంటున్నాం. మాలాంటోళ్లకు జగనన్న ఇళ్లు ఇస్తే మీకొచ్చిన నొప్పేమిటి? – రత్నకుమారి, ఇంటి లబ్ధిదారురాలు -
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మేధావులు లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మేధావులు లేఖ రాశారు. 8 డిమాండ్లలతో తమ సంతకాలతో 64 మంది ప్రొఫెసర్లు, విద్యావేత్తలు.. మోదీకి లేఖ రాశారు. ‘‘విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి.ఐటిఐఆర్ను పునరుద్ధరించాలి. రాష్ట్రానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కేటాయించాలి. మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాసంస్థలు, ఐఐఎం లాంటి ఉన్నత విద్యాసంస్థలను కేటాయించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ‘‘వివక్ష లేకుండా తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. రాష్ట్రం పట్ల కక్షపూరిత, వివక్షపూరిత ధోరణి విడనాడాలి. మతతత్వ ధోరణి విడనాడి దేశ ఐక్యతను, బహుళత్వాన్ని కాపాడుకునే పాలన కొనసాగించాలి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలను తీసుకోవాలి’’ అని లేఖలో డిమాండ్ చేశారు. చదవండి: గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. లేఖపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు -
వికేంద్రీకరణపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): పరిపాలన వికేంద్రీకరణపై కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మేధావులు పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి అసలు పనికి రాదని స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానులతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని తేల్చి చెప్పారు. శుక్రవారం పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏయూ హిందీ విభాగంలో మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలువురు మేధావులు, పలు సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగల్సిందేనని చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ.. రాజధాని, కోర్టులు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రి పాలనకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అమరావతి కాకుండా వేరే ప్రాంతంలో రాజధాని పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధానులు ఎన్ని పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది పాలకుడి నిర్ణయమేనని అన్నారు. ఒక ప్రాంతం మీద అభిమానంతో కాకుండా రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ స్వాగతించాల్సిన అంశమన్నారు. చంద్రబాబు రక్తం మరిగిన పులి పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మనిషి రక్తం రుచి మరిగిన పులి మాదిరిగానే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రవర్తన కూడా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి అంశాన్నీ వ్యతిరేకించడమే బాబు ధ్యేయమని అన్నారు. ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసి లాభం పొందాలని ఆశిస్తున్నారన్నారు. అమరావతి రాజధాని కాదని, అది ఒక కమ్మ సామాజికవర్గం వ్యాపార సామ్రాజ్యమని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటివరకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని, అందుకు సచివాలయ వ్యవస్థ, జిల్లాల విభజన నిదర్శనమని తెలిపారు. కరోనా సమయంలో సచివాలయ వ్యవస్థ ద్వారా వందలాది మంది ప్రాణాలను కాపాడారని అన్నారు. మారుమూల గ్రామాల ప్రజలు వారి సమస్యలు చెప్పుకొనేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే రెండు రోజులు పట్టేదని, ఇప్పుడు జిల్లాల విభజనతో వారి చెంతకే కలెక్టరేట్ వచ్చిందన్నారు. అమరావతి రైతులంతా బడా బాబులే: ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఆంధ్రను విభజించినప్పుడు రాజధానికి మొదట విశాఖపట్నమే అనుకున్నా.. కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కర్నూలుకు మార్చారన్నారు. ఆ తరువాత హైదరాబా«ద్కు మార్చి రాష్ట్ర ప్రజల సంపద అంతా అక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేయడం వల్ల ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు విద్య, వైద్య, ఉద్యోగావకాశాలు సమానంగా అందుతాయని తెలిపారు. అమరావతి రైతులు అసలు రైతులే కాదని, అంతా బడాబాబులేనని విమర్శించారు. అసలు సిసలైన రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారన్నారు. వరదలొస్తే అమరావతి కొట్టుకుపోతుంది : ప్రొఫెసర్ ముత్తయ్య ప్రొఫెసర్ ముత్తయ్య మాట్లాడుతూ అమరావతి రాజధానిగా అస్సులు పనికి రాదన్నారు. వరదలు వస్తే అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. లక్షల కోట్లు వృథా తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు. వాయు, జల, రోడ్డు మార్గాలు ఉన్న విశాఖ నగరాన్ని రాజధానిగా చేస్తే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పారు. తద్వారా ఆదాయం పెరిగి సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని తెలిపారు. విద్యార్థుల పోరాటాలు విజయవంతం అవుతాయి : ప్రొఫెసర్ పుల్లారావు ప్రొఫెసర్ పుల్లారావు మాట్లాడుతూ అన్ని ప్రాంతీల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని, ప్రాంతీయ అభిమానంతో కాదని చెప్పారు. విద్యార్థులు చేసిన ఏ పోరాటమైనా విజయవంతం అవుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ కోసం విద్యార్థులను భాగస్వామ్యం చేయటం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు సూర్యనారాయణ, శోభ శ్రీ , నల్ల సత్యనారాయణ, ప్రేమానందం, కృష్ణ, రాజామాణిక్యం, బార్ కౌన్సిల్ సభ్యులు అరుణ్ కుమార్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి
సాక్షి, అమరావతి: అధికారం దూరమైందనే అక్కసుతో టీడీపీ నాయకులు ప్రజలపై కక్ష పెంచుకుని అడుగడుగునా అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఏపీ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం మండిపడింది. విజయవాడలో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ‘పాలనా వికేంద్రీకరణ: ప్రచారాలు, వాస్తవాలు’ అనే అంశంపై పలువురు న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చంద్రబాబు బృందం మూడేళ్లుగా అభివృద్ధిని అడ్డుకుంటోందని ధ్వజ మెత్తారు. చారిత్రక తప్పిదాలను పునరావృతం చేసేందుకు మీడియాను, న్యాయవ్యవస్థను సైతం ఉపయోగించుకుంటోందన్నారు. అమరావతి పేరు తో దోపిడీ చేయడమే కాకుండా ఇతర ప్రాంతాలు ఎదగకుండా నీచ రాజకీయాలు చేయడం క్షమించరానిదన్నారు. ప్రభుత్వం దృష్టిలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి చిత్తూరు జిల్లాలోని చివరి గ్రామం వరకు ఒక్కటేనని, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలన్నారు. చంద్రబాబు బృందం ఆయన వర్గ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ రెండు జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందాలని చెబుతోందన్నారు. మరో 30ఏళ్లకు కూడా పూర్తికాని అమరావతి కోసం రూ.లక్ష కోట్ల కు పైగా వెచ్చిస్తే మిగతా ప్రాంతాలు ఏం కావాలని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయాక బాబుకు ప్రజలు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలపై పగబట్టిన బాబు చంద్రబాబు బృందం తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు అమరావతి రైతులను పావులుగా మార్చేసింది. రైతులను పురిగొల్పి చంద్రబాబు తెరవెనుక ఆనందిస్తున్నారు. అమరావతి ప్రపంచ రాజధాని ఎలా అవుతుంది? భారీ నిర్మాణాలకు ఈ ప్రాంతం అనువుకాదని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. నిర్మాణాల భారం లేకుండా రాజధాని కోసం నాగార్జున వర్సిటీ భవనాలు ఇస్తామన్నా తీసుకోకుండా గడ్డి తినేందుకు అమరావతిని ఎంచుకున్నారు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఇలాంటి తప్పులకు విదేశాల్లో అయితే మరణ శిక్ష విధించేవారు. అధికారం ఊడగొట్టి 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేకపోగా ప్రజలపై పగబట్టారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కోర్టులను వాడుకుంటున్నారు. అమరావతి భూములు వ్యవసాయయోగ్యమైనవి, ఇక్కడ ఆ తరహా పరిశ్రమలకే అనుకూలం. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలి. – పి.విజయబాబు, రాష్ట్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మిగతా ప్రాంతాలు ఏం కావాలి? చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని బలిపెడుతున్నారు. ఆయనకు వంతపాడుతూ కొన్ని పత్రికలు, మీడియా అమరావతి రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రాంతీయ అసమానతల వల్లనే తెలంగాణ విడిపోయింది, అదే తప్పు చంద్రబాబు అమరావతి పేరుతో చేశారు. వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణ కమిటీ చెప్పినా పట్టించుకోకుండా అమరావతి పేరుతో రూ.వేల కోట్లు వెచ్చించి అన్నీ తాత్కాలిక భవనాలే నిర్మించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వెళ్లారు. రూ.లక్షల కోట్లను అమరావతిలోనే వెచ్చిస్తే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలి? మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. – పిళ్లా రవి, న్యాయవాది కొత్త రాజధాని నిర్మాణం అసాధ్యం ఏ దేశంలోనైనా అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరాన్నే రాజధానిగా ఎంచుకుంటారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అన్నిచోట్లా పెద్ద నగరాలను రాజధానిగా ఎంచుకున్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని కలలు కంటూ చంద్రబాబు అమరావతిని ఎంచుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఇలాంటి తప్పు ఏ నాయకుడూ చేయరు. రాష్ట్రంలోని మూడు పెద్ద నగరాల్లో అధికార వికేంద్రీకరణ చేయాలి. కొత్త రాజధాని నగరం నిర్మించడం మాటలు కాదు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ ఇప్పటికీ ప్రగతి సాధించలేకపోయింది. – కొణిజేటి రమేష్, పారిశ్రామికవేత్త రెండు జిల్లాలే ముఖ్యమా? అభివృద్ధి అంటే భవనాలు, పార్కులు కాదు. సామాన్యుడు తలెత్తుకు తిరిగేలా ఉండాలి. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు ఇవ్వరట. వారికి స్థానం లేని ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది? చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిరుపేదలు, సామాన్యుల హక్కులను దోచుకున్నారు. కేవలం రెండు జిల్లాలు అభివృద్ధి చెందితే చాలా? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఏమైపోవాలి? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. – నామాల కోటేశ్వర్రావు, న్యాయవాది వికేంద్రీకరణ తప్పనిసరి అవసరం ఎవరైనా ఒకసారి తప్పు జరిగితే దాన్నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. పాలకులైతే మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మళ్లీమళ్లీ తప్పులు చేసేవారిని ఏమనాలి? చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రతిపక్ష టీడీపీ అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ రాష్ట్రంలో అంతర్భాగం కాదా? ఆ ప్రాంతాల అభివృద్ధి టీడీపీకి అవసరం లేదా? ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని అడ్డుకుంటూ మరో తప్పు చేస్తున్నారు. – డాక్టర్ చన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్ ఎస్పీ సమగ్రాభివృద్థికి వెన్నుపోటు పాలకులు విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రానికీ లేనన్ని ఆటంకాలను చంద్రబాబు సృష్టిస్తున్నారు. కేంద్రీకృత అభివృద్ధితో తెలుగు ప్రజలు ఏం కోల్పోయారో చరిత్ర చూస్తే అర్థమవుతుంది. చారిత్రక తప్పిదాలను చంద్రబాబు పునరావృతం చేశారు. వాస్తవానికి అమరావతి ప్రజలు ఇక్కడ రాజధాని కావాలని అడగలేదు. చంద్రబాబు తన వర్గం వారితో రైతుల భూములు బలవంతంగా తీసుకున్నారు. సైబర్ టవర్స్ నిర్మాణం సమయంలోనూ బ్లూప్రింట్ తయారీకి ముందే తనవారితో భూములు కొనిపించారు. అదే సూత్రాన్ని ఇక్కడా అమలు చేశారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు, ఈనాడు అధినేత రామోజీరావు దీనికి సూత్రధారులు. అమరావతి అంతా అవినీతిమయం. – కృష్ణంరాజు, రాజకీయ విశ్లేషకులు -
సంక్షేమం వద్దనడం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, అమరావతి: ఆది నుంచి భారతదేశం సంక్షేమ రాజ్యమని, ఆధునిక ప్రజాస్వామ్యంలో సైతం అదే భావన అనుసరిస్తున్నామని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ పీఠికలోనూ సంక్షేమ భావన స్పష్టంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, కోవిడ్ కష్టకాలంలో ఈ పథకాలే ప్రజలను ఆదుకున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఇంటలెక్చువల్స్– సిటిజన్స్ ఫోరం (ఎపిక్) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘సంక్షేమ పథకాలు అభివృద్ధి సోపానాలా? నిరోధకాలా?’ అంశంపై జరిగిన ఈ చర్చలో పలువురు మేధావులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో రిటైర్డ్ ప్రొఫెసర్లు, హైకోర్టు న్యాయవాదులు, పాత్రికేయులు, పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావని.. భారత రాజ్యాంగం సూచించిన సంక్షేమ రాజ్యంలో సగం కూడా చేరుకోలేదని, అయినా కొందరు రాజకీయ లబ్ధి కోసం సంక్షేమ పథకాలు ఉచితాలని, వీటిని రద్దు చేయాలని కోర్టుకెక్కడం విచారకరమన్నారు. నాయకుల చిత్రపటాలకు వేలకొద్దీ లీటర్ల పాలతో అభిషేకం చేసే దేశంలో.. గుక్కెడు పాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు కూడా ఉన్నారనే విషయం గమనించాలని కోరారు. పాలకులు ప్రజల సంక్షేమం చూడాల్సిందేనని, అది వారి బాధ్యత అని పేర్కొన్నారు. కూడు, గూడు ప్రజల ప్రాథమిక హక్కు పాలకులు ప్రజలకు కూడు, గూడు ఇచ్చి సంక్షేమం చూడాల్సిందే. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు కూడా అదే చెబుతున్నాయి. విమానాల్లో తిరిగినంత మాత్రాన అభివృద్ధి చెందామని, అందువల్ల సంక్షేమ పథకాలు వద్దనడం భావ్యం కాదు. టీవీ, ఫ్రిడ్జ్ వంటివి ఉచితాలు. – విజయబాబు, ఎపిక్ అధ్యక్షుడు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ అధికారం కోసం పేదలను బలిచేయొద్దు కేంద్ర ప్రభుత్వం దేశంలో 80 కోట్ల మందికి రేషన్ సరుకులు అందిస్తోంది. అంటే ఆ స్థాయిలో నిరుపేదలు ఇంకా ఉన్నట్టే కదా! అభివృద్ధి చెందిన స్కాండినేవియన్ దేశాల్లో ఇప్పటికీ జాతీయాదాయంలో 70 శాతం విద్య, వైద్యంతో పాటు ప్రజల అభివృద్ధి పథకాలకు ఖర్చు చేస్తున్నారు. – కృష్ణంరాజు, సీనియర్ జర్నలిస్ట్ ఏపీ ప్రగతిలో సంక్షేమ పథకాలు భాగం కోవిడ్ లాంటి గడ్డు కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం అందించి ఆదుకుంది. ఇలాంటి వాటిని ఉచితంగా ఇవ్వడం అంటూ కోర్టులు తప్పు పట్టడం సబబుకాదు. విద్యా దీవెన, నేతన్న నేస్తం, చేయూత, ఆసరా, పేదలందరికీ ఇళ్లు.. తదితర పథకాలు ఏ లెక్కనా ఉచితాలు కావు. ఏపీ ప్రగతిలో సంక్షేమ పథకాలు భాగం అని గుర్తించాలి. – పిళ్లా రవి, హైకోర్టు న్యాయవాది ప్రజా సంక్షేమంపై కుట్ర! జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కోర్టుల ద్వారా కుట్ర జరుగుతోందనిపిస్తోంది. కొన్ని మీడియా వర్గాలు సంక్షేమ పథకాలను ఉచిత పథకాలని ప్రచారం చేయడం బాధాకరం. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తోంది. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఎవరైనా అడగ్గలరా? – అశోక్, లోక్సత్తా నేత -
‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’గానే కొనసాగించాలి
ఏయూ క్యాంపస్: కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు, మేధావులు కోరారు. విదేశాల్లో సైతం అంబేడ్కర్ విగ్రహాలు, సెంటర్లు పెడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం అడ్డుకోవడం దారుణమన్నారు. శనివారం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన మేధావుల చర్చాగోష్టిలో ప్రొఫెసర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకున్నవారు ఇలా విధ్వంసాలకు పాల్పడరన్నారు. సీఎం జగన్ దావోస్ పర్యటిస్తూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్న సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం విచారకరమన్నారు. మహిళా విద్య కోసం అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఏయూ లా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. కొలంబియా యూనివర్సిటీలో సైతం అంబేడ్కర్ కార్నర్ ఉందన్నారు. అంబేడ్కర్ను గౌరవించడమంటే.. మనల్ని మనం గౌరవించుకోవడమేనన్నారు. ఉత్తరాంధ్ర కాపు సంఘం అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ఠాగూర్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం స్వాగతించాల్సిన అంశమన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు ఆచార్య జేమ్స్ స్టీఫెన్, ఆచార్యులు డి.వి.ఆర్ మూర్తి, కె.పల్లవి, కె.విశ్వేశ్వరరావు, చల్లా రామకృష్ణ, ఎన్.విజయమోహన్, డాక్టర్ జి.రవికుమార్, రెక్టార్ కె.సమత, ప్రిన్సిపాల్స్ పి.రాజేంద్ర కర్మార్కర్, టి.శోభశ్రీ, డీన్లు ఆచార్య ఎన్.సత్యనారాయణ, టి.షారోన్ రాజు, పాల్ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీల్ చేయాలి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాజధాని నిర్మాణంపై హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును యథావిధిగా అమలు చేయడం వల్ల రాయలసీమకు రాజధాని, హైకోర్టు, కీలక కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న న్యాయమైన ఆకాంక్ష తీరకుండా పోతుందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి అన్నారు. ఎస్వీయూలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఎంపిక సమయంలో మాజీ సీఎం చంద్రబాబు ఏకపక్షంగా.. ఒక వర్గానికి మేలు జరిగేలా వ్యవహరించారన్నారు. 1872 కాంట్రాక్టు యాక్టు, విభజన చట్టం ప్రకారం రాజధాని ఎంపిక జరగలేదన్నారు. విభజన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిందని, రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను రాజధాని ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తాను ముందు అనుకున్న నిర్ణయం మేరకు రాజధానిని ఎంపిక చేశారన్నారు. ఇది విభజన చట్టానికి వ్యతిరేకం కాదా? చట్టం ప్రకారం కేంద్రం ఏ సలహా ఇచ్చింది? శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదని ప్రశ్నించారు. ఒప్పంద ప్రయోజనాలు సహజ న్యాయసూత్రాలకు లోబడి ఉండాలన్నారు. మహానగర నిర్మాణం పేరుతో రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల రైతులతో ఎలా అవగాహన చేసుకుంటారన్నారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల నివేదికలను దృష్టిలో పెట్టుకుని రాజధానిలో న్యాయమైన భాగస్వామ్యం రాయలసీమకు ఉండేలా తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, మస్తానమ్మ, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: 'త్రి'కేంద్రీకరణే కావాలి
మూడు రాజధానులకు మద్దతుగా గురువారం తిరుపతిలో ప్రజలు, విద్యార్థులు కదం తొక్కారు. ‘పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాయలసీమను అభివృద్ధి చేయాలి’, ‘అమరావతి ఒక్కటే వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. రాయలసీమ ప్రజల మనోభావాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు పరిశ్రమకు భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమంటూ గొంతెత్తారు. గతంలో రాజధానిని వదులుకున్న కర్నూలు ప్రజలదే గొప్ప త్యాగమని నినాదాలు చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటూ మండిపడ్డారు. యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): పరిపాలన వికేంద్రీకరణ – మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డిగ్రీ, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి, ఎస్డీహెచ్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి, అంబేడ్కర్ న్యాయ కళాశాల చైర్మన్ ఆర్.తిప్పారెడ్డిలతో పాటు విద్యార్థి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. కృష్ణాపురం ఠాణా నుంచి ప్రారంభమైన ర్యాలీ.. నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ సాగింది. అమరావతి వద్దు.. 3 రాజధానులు ముద్దు.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాయలసీమను అభివృద్ధి చేయాలి.. అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా ఈ నెల 18న నిర్వహించే రాయలసీమ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు. అమరావతి ఒక వర్గానికే చెందిన రాజధాని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదు.. 13 జిల్లాలని చెప్పారు. రాయలసీమ ప్రాంతం తీవ్రంగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, అవసరాలను గుర్తించాలని కోరారు. సీమలో ఉన్న కొందరు నాయకులు అమరావతిని సమర్థించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చామని చెపుతున్న అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని.. అది వ్యాపారమని, శ్రీశైలం ప్రాజెక్ట్, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ను ప్రోత్సహిస్తున్నారని పురుషోత్తంరెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్వీయూ ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి, ఎస్డీహెచ్ఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ డి.రామసునీల్రెడ్డి, సీకాం విద్యాసంస్థల చైర్మన్ సురేంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్.రాజశేఖర్రెడ్డి, రచయిత్రి మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణతోనే సమన్యాయం
అనంతపురం కల్చరల్: పాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు సమన్యాయం దక్కుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్తులో మేధావుల చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ‘అధికార వికేంద్రీకరణ’పై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణతోనే సాధ్యమన్నారు. ఏటా మూడు పంటలు పండే అమరావతి ప్రాంత భూములను నాశనంచేసి రాజధాని నిర్మించాలనుకోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి.. అభివృద్ధిని ఒక ప్రాంతానికే పరిమితం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. జేఎన్టీయూ (ఏ) రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శశిధర్ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి అమరావతి సరైన ప్రాంతం కాదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్కేయూ ప్రొఫెసర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ.. శ్రీబాగ్ ఒడంబడిక అమలు కానందునే రాయసీమ వెనుకబాటుతనం వచ్చిందని, దాన్ని సరిజేయాలనుకుంటున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అందరూ మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. సీనియర్ అడ్వకేట్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా ఉద్యమం సాగాలన్నారు. రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చి మళ్లీ అమరావతి గురించి మాట్లాడితే బీజేపీకి ప్రజల విశ్వాసం ఉండదన్నారు. పలువురు విద్యార్థులు కూడా అధికార వికేంద్రీకరణవల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మూడు రాజధానులకు మద్దతుగా అనంతపురంలో మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. -
భావి తరాలకు వరం
దొండపర్తి (విశాఖ దక్షిణ): మూడు రాజధానులకు మద్దతుగా శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన చర్చా వేదికలో మేధావుల ఫోరం తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం ప్రతిని పంపనున్నట్లు తెలిపింది. పరిపాలనా వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం భావితరాలకు వరం లాంటిదని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీరామమూర్తి పేర్కొన్నారు. ‘పరిపాలనా వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఆవశ్యకత–ఆంధ్రప్రదేశ్ సమతౌల్య అభివృద్ధి’పై విశాఖ ఏయూలోని టీఎల్ఎన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు అన్ని ప్రాంతాల అభివృద్ధిని విస్మరించడం రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని, రూ.లక్ష కోట్లతో ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం అవివేకమన్నారు. నీటి వనరులు, వ్యవసాయ భూములు పుష్కలంగా ఉన్న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను నాశనం చేస్తూ గత సర్కారు తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టితో తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అభినందనీయమన్నారు. ఉద్యమించక ముందే మద్దతివ్వండి.. విభజనతో ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఆంధ్రప్రదేశ్కు మిగిలాయని ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి, భవిష్యత్ తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలన్న సంకల్పంతో సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్మోహన్ తెలిపారు. పటిష్ట నాయకత్వం, పాలకులకు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతూ వస్తోందని న్యాయ కళాశాల ప్రొఫెసర్ సూర్యప్రకాష్ చెప్పారు. అమరావతి ప్రాంతం హైదరాబాద్లా అభివృద్ధి చెందాలంటే వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత ఉద్యమబాట పట్టకముందే ప్రతిపక్షాలు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని ప్రొఫెసర్ షరాన్ రాజ్ డిమాండ్ చేశారు. మరోసారి ప్రాంతీయ విద్వేషాలు తలెత్తకుండా ఉండాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏయూ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రవి పేర్కొన్నారు. ఎయిడెడ్ కళాశాలల తరఫున ప్రొఫెసర్ మధుసూదనరావు మాట్లాడుతూ తాము గుంటూరు నుంచి వచ్చినప్పటికీ పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో నాన్ టీచింగ్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు. -
సీమ ద్రోహుల్లారా.. సిగ్గుందా?
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్న సీమ నాయకులు సిగ్గుపడాలని రాయలసీమ మేధావుల ఫోరం మండిపడింది. అమరావతి రైతుల పేరుతో 50 నుంచి 100 మంది నిర్వహిస్తున్న పాదయాత్రకు కొందరు నాయకులు హారతులిచ్చి స్వాగతం పలకడం సీమకు ద్రోహం తలపెట్టడమేనని స్పష్టం చేసింది. పాదయాత్రకు మద్దతివ్వడమంటే మన గొంతు మనమే కోసుకున్నట్లని పేర్కొంది. ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో తరతరాలుగా రాయలసీమకు జరుగుతున్న నష్టాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే రెండు సార్లు రాజధానిని కోల్పోయిన సీమ ప్రజలు ఇప్పుడు పోరాడకపోతే పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. 19 గ్రామాల ప్రయోజనం కోసం... కమిటీల నివేదికలను చంద్రబాబు తుంగలో తొక్కి ఏకపక్షంగా రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి విమర్శించారు. కేవలం 19 గ్రామాల ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారని దుయ్యబట్టారు. రాయలసీమ అభివృద్ధి నినాదంతో తిరుపతిలో 17న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. త్యాగం.. ఎవరిది? శ్రీశైలం ప్రాజెక్టు కోసం 80 వేల ఎకరాలను ఇచ్చిన రాయలసీమ రైతులది త్యాగమా? లేక తమ స్వార్థం కోసం భూములిచ్చి కౌలు, రుణమాఫీ, ఇతర ప్రయోజనాలు పొందుతున్న అమరావతి వాసులది త్యాగమా? అని మాకిరెడ్డి ప్రశ్నించారు. సొంతగడ్డకు నష్టం జరగాలని కోరుకుంటున్న వారికి కొందరు రాయల సీమ నేతలు మద్దతు పలకడం బాధాకరమన్నారు. విద్యార్థులదే కీలకపాత్ర.. పాదయాత్రపై ఓ వర్గం మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్వీయూ పాలకమండలి సభ్యుడు సీ.ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమలోనే హైకోర్టు, రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు. వికేంద్రీకరణ, ప్రాజెక్ట్ల నిర్మాణం చేపట్టాలని సీనియర్ జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ కోరారు. ఈ పోరాటంలో విద్యార్థులదే కీలక పాత్రని రచయిత్రి మస్తానమ్మ చెప్పారు. సీమ అభివృద్ధిని అడ్డుకుంటూ పాదయాత్రలా? రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్న అమరావతి పెయిడ్ ఉద్యమకారులకు తిరుపతిలో అడుగుపెట్టే అర్హత లేదని, వారి యాత్రను అడ్డుకుంటామని వైఎస్సార్ విద్యార్థి విభాగం హెచ్చరించింది. అమరావతి రైతుల పేరుతో సాగుతున్న పాదయాత్రను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అమరావతి పెయిడ్ ఆరిస్టులు గో బ్యాక్ అంటూ నినదించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయాలని, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్నారని విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్.రాజశేఖర్రెడ్డి మండిపడ్డారు. ఇటీవల కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు ఛీ కొట్టినా ఆయన వైఖరి మారలేదని, చంద్రబాబు కనుసన్నల్లోనే పాదయాత్ర జరుగుతోందని దుయ్యబట్టారు. -
హైకోర్టు, నీటిప్రాజెక్టులు రాయలసీమకు అవసరం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే రెండుసార్లు రాజధానిని కోల్పోయామని, మరోసారి ఇందుకు సిద్ధంగా లేమని రాయలసీమ మేధావుల ఫోరం పేర్కొంది. రాయలసీమకు హైకోర్టు రావాలని, నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో రాయలసీమ మేధావుల ఫోరం ‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాయలసీమ ప్రయోజనాలు’ అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించింది. ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకుని, నూతనంగా సమగ్ర అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని చెప్పారు. రాయలసీమకు ప్రయోజనాలు కలిగేలా బిల్లులో ఎలాంటి అంశాలు ఉండాలన్న అంశంపై చర్చ జరగాలని అన్నారు. అమరావతి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కూలంకష చర్చ జరగాలని తెలిపారు. అమరావతి రైతులు భూములిచ్చింది వారి ప్రయోజనాల కోసమేనని చెప్పారు. దానిని త్యాగం అంటూ, రాష్ట్రం కోసం అంటూ విచిత్ర వాదనలు తెస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం కోసం, రైతులకు ఇవ్వాల్సిన భూమి పోను మిగిలిన భూమి 10 నుంచి 15 వేల ఎకరాల దాకా ఉంటుందన్నారు. అందులో గత ప్రభుత్వం ప్రైవేటు, విదేశీ సంస్థలకు ఇచ్చినప్పుడు అభ్యంతరం తెలపలేదని, ఇప్పుడు 5 వేల ఎకరాల్లో విజయవాడ, గుంటూరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. అక్కడ పేదల ఇళ్లు ఉంటే వారి ప్లాట్లకు మంచి మార్కెట్ ఉండదనే బెంగే కారణమన్నారు. తీవ్ర కరువు, నీటి సమస్యతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు నేడు కావాల్సింది మరో కొత్త నగరంతో కూడిన రాజధాని నిర్మాణం కాదన్నారు. ఉన్న పరిమిత వనరులతో నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అవసరమని చెప్పారు. తిరుపతి, హిందూపురం నగరాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పాలన సాగిస్తోందని, అలాంటి సమయంలో అన్ని వ్యవస్థలు ఒకేచోట ఉండాలని కోరుకోవడం సరికాదని అన్నారు. అమరావతి కేంద్రంగా కేంద్రీకృత అభివృద్ది జరిగితే మరో విభజన తప్పదని హెచ్చరించారు. అధ్యాపకులు సుబ్రమణ్యం ఆచారి, హిమబిందు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అది వంద మందిదే.. అందరిదీ కాదు.. ఢిల్లీ ఎక్కడుంది
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): అన్ని వర్గాల భాగస్వామ్యం లేని అమరావతి రాజధాని ఎలా అవుతుందని రాయలసీమ మేధావుల ఫోరం ప్రశ్నించింది. రాజధాని ఏర్పాటు సమయంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను గత సర్కారు విస్మరించిందని పేర్కొంది. అమరావతిలో 50 నుంచి వంద మంది వ్యక్తం చేసే అభిప్రాయం రాçష్టం మొత్తానికి వర్తిస్తుందా? అని నిలదీసింది. అమరావతి రైతుల పేరుతో చేపట్టిన ఉద్యమంలో నిజాయితీ లేదని, కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే ఉందని ఫోరం స్పష్టం చేసింది. అది ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన నాయకులు, ప్రజాభిమానాన్ని కోల్పోయిన పార్టీలు నడిపిస్తున్న పెయిడ్ ఉద్యమమని విమర్శించింది. అమరావతి రైతుల పేరిట రాయలసీమ వాసులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించింది. రాయలసీమకు హైకోర్టు వద్దని అడ్డుపడుతున్న వారు ఎస్వీయూలో బహిరంగ సభ నిర్వహిస్తామంటే ఎలా అనుమతిస్తామని సూటిగా ప్రశ్నించింది. తిరుపతిలో సభ నిర్వహించేందుకు వీలు లేదని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఫోరం ప్రకటించింది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అందరూ స్పందించాలని, ఈ అంశంపై బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్తామని ఫోరం ప్రకటించింది. శ్రీకాళహస్తి, పుత్తూరు, ఎస్వీ యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను జాగృతం చేస్తామని స్పష్టం చేసింది. ‘ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచన – రాయలసీమ ప్రజల మనోగతం’ అనే అంశంపై రాయలసీమ మేధావుల ఫోరం మంగళవారం ఎస్వీయూలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీ ఎక్కడుంది? ‘రాజధాని నడిబొడ్డున ఉండాలన్న నిబంధన ఎక్కడుంది? దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉందా?’ అని ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఆధారంగా ఏమూల నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. తమిళనాడు నుంచి రాయలసీమకు వస్తున్న పెట్టుబడులను గత ప్రభుత్వం అడ్డుకుని అమరావతిలోనే పెట్టాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసని చెప్పారు. డబ్బులు వెదజల్లి రెచ్చగొట్టే యత్నాలు.. అమరావతి ఒక వర్గానికి సంబంధించిన రాజధాని అని ప్రొఫెసర్ ఎ.సుధాకరయ్య పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఉంటే అమరావతి రైతులకు వచ్చే నష్టం ఏమిటని ప్రొఫెసర్ నాగోలు కృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం పేరిట డబ్బులు వెచ్చించి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు జరుగుతున్న కుట్రని చెప్పారు. రాయలసీమలో ఎక్కడ సభ తలపెట్టినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటును ఏనాడు ప్రశ్నించలేదని ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. కోస్తా ప్రజలకు రాజధాని అడిగే హక్కు న్యాయపరంగా, నైతికంగా లేదన్నారు. తాము ఉత్తరాంధ్రతో కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామన్నారు. సీమవాసుల మద్దతు దుష్ప్రచారమే.. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ వాసులు అమరావతికి మద్దతిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సీమ ప్రజలు తమ ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నట్లు నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తిరస్కరించిన ఒకరిద్దరు నాయకులు మినహా ఎవరూ అమరావతి ఉద్యమాన్ని అంగీకరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే మోసానికి గురై మద్రాస్, కర్నూలు నుంచి రాజధాని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే దక్కాలని స్పష్టం చేశారు. ఇక్కడ గ్రామీణ వాతావరణం గల పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. అమరావతి రైతులు రాజధానికి భూములు త్యాగం చేశారని కొందరు నాయకులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని, వ్యాపారమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావాలని గతంలో బీజేపీ, వామపక్షాలు ఒప్పుకున్నాయని, రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గత సర్కారు పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలోసీమకు మెడికల్ సీట్లు రాకుండా నష్టం కలిగించిందని, దీనిపై ఉద్యమిస్తే అడ్డుకుందని గుర్తు చేశారు. -
బాలల దినోత్సవం 2021: బొమ్మలతో ఆటలాడుకునే వయసులో.. ఎన్నెన్ని ఘనతలో..!
Nation Wide Famous Child Prodigies: పసితనం వీడని చిన్నారులు వివిధ రంగాల్లో సాధిస్తున్న ఘనతకు ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే! ఏళ్లతరబడి సాధన చేసిన పెద్దలు సైతం సాధించలేని ఘనకార్యాలను కొందరు చిచ్చరపిడుగులు అలవోకగా ఇట్టే సాధిస్తూ, ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేస్తున్నారు. వివిధ రంగాల్లో విశేషప్రతిభతో రాణిస్తున్న కొందరు చిచ్చరపిడుగుల గురించి బాలల దినోత్సవం సందర్భంగా... మిలియన్ డాలర్ల ‘స్వర’ స్వరఘనత: లిడియన్ నాదస్వరం అత్యంత పిన్నవయసులోనే సంగీతంలో అంతర్జాతీయ స్థాయి ఘనత సాధించాడు లిడియన్ నాదస్వరం. తమిళ సంగీత దర్శకుడు వర్షన్ సతీష్ రెండో కొడుకైన లిడియన్ నాదస్వరం మాటలు వచ్చీరాని వయసులోనే సరిగమలతో చెలిమి ప్రారంభించాడు. రెండేళ్ల వయసులో లయ తప్పకుండా డ్రమ్స్ మోగించడం మొదలుపెట్టాడు. ఎనిమిదో ఏట తనంతట తానే పియానో వాయించడం నేర్చుకున్నాడు. లిడియన్ ఆసక్తి గమనించిన తండ్రి, అతడిని శిక్షణ కోసం మద్రాస్ మ్యూజికల్ అసోసియేషన్ డైరెక్టర్ అగస్టీన్ పాల్ వద్ద చేర్చాడు. అగస్టీన్ వద్ద శిక్షణ తర్వాత చెన్నైలో ఎ.ఆర్.రెహమాన్ నడుపుతున్న కె.ఎం.మ్యూజిక్ కన్జర్వేటరీలో చేరి, నాలుగేళ్లు సంగీత మర్మాలన్నింటినీ ఆపోశన పట్టాడు. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ 2019లో తాను తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రంలో లిడియన్కు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. అప్పటికి లిడియన్ వయసు పద్నాలుగేళ్లే! అతి పిన్నవయస్కుడైన సినీ సంగీత దర్శకుడిగా రికార్డులకెక్కిన లిడియన్ ఘనతను అంతర్జాతీయ మీడియా కూడా గుర్తించింది. అమెరికాకు చెందిన సీబీఎస్ చానల్ నిర్వహించిన పోటీలో లిడియన్ ఉత్తమ సంగీతకారుడిగా మిలియన్ డాలర్ల (రూ.7.44 కోట్లు) బహుమతిని గెలుచుకున్నాడు. సంగీత ప్రధానంగా గత ఏడాది నిర్మించిన బాలీవుడ్ చిత్రం ‘అట్కన్–చట్కన్’లో లిడియన్ ఒక కీలకపాత్రలో నటించడం విశేషం. చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! శాస్త్రీయ సంగీతంలో ప్రపంచస్థాయి ప్రదర్శనలు: రాహుల్ వెల్లాల్ నాలుగేళ్ల వయసులోనే సరిగమల సాధన మొదలుపెట్టిన రాహుల్ వెల్లాల్ ఘనత అంతర్జాతీయ వేదికల వరకు చేరుకుంది. ప్రధానంగా గాత్రకచేరీలే చేస్తున్నా, వాద్యసంగీత సాధన కూడా కొనసాగిస్తున్నాడు ఈ బెంగళూరు కుర్రాడు. తొలుత కళావతి అవధూత్ వద్ద కర్ణాటక సంగీతంలో స్వరాభ్యాసం చేసిన రాహుల్, తర్వాత కుల్లూర్ జయచంద్రరావు దగ్గర మృదంగం నేర్చుకున్నాడు. ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో పాశ్చాత్య సంగీతంలో పియానో వాద్యం నేర్చుకుంటున్నాడు. రాహుల్ వెల్లాల్ తన పదకొండేళ్ల వయసులోనే, 2018లో అబుదాబిలో తొలి అంతర్జాతీయ కచేరీ చేశాడు. అబుదాబితో పాటు ఇప్పటి వరకు సింగపూర్, నైజీరియా, మలేసియా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో పదుల సంఖ్యలో కచేరీలు చేశాడు. సంప్రదాయ సంగీతంలో రాహుల్ వెల్లాల్ సాగిస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2018లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఫెలోషిప్ అందుకున్నాడు. ‘టాప్–100 గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీస్’లో ఒకరిగా, గత ఏడాది ఢిల్లీలో జరిగిన వేడుకలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు అందుకున్నాడు. బాల నలభీముడు: నిహాల్ రాజ్ సాధారణంగా పది పన్నెండేళ్ల వయసులో ఉన్న పిల్లలేం చేస్తారు? తల్లులు ఓపికగా వండిపెడితే, చక్కగా తినిపెడతారు. కేరళలోని కొచ్చికి చెందిన నిహాల్రాజ్కు తినడమే కాదు, రుచులొలికే వంటలు వండటమన్నా భలే ఇష్టం. నిహాల్ వయసు ఇప్పుడు పదకొండేళ్లు. ఐదేళ్ల వయసులోనే గరిటె తిప్పడం మొదలుపెట్టాడు. తన పాక ప్రావీణ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు యూట్యూబ్ చానల్ పెట్టి, పెద్దసంఖ్యలో సబ్స్క్రైబర్ల ఆదరణను సంపాదించుకున్నాడు. ‘యూట్యూబ్’లో ‘లిటిల్ షెఫ్ కిచ్చా’గా గుర్తింపు పొందిన ఈ బాల నలభీముడు అనతికాలంలోనే ప్రముఖ జాతీయ టీవీచానళ్ల దృష్టినీ ఆకర్షించాడు. పలు చానళ్లలో వంటల కార్యక్రమాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. సంప్రదాయ వంటకాలను తయారు చేయడమే కాదు, ఈ చిచ్చరపిడుగు ఎప్పటికప్పుడు కొత్తకొత్త వంటకాలనూ తయారు చేస్తుంటాడు. ఇతడు సృష్టించిన ‘మ్యాంగో మౌస్ ఐస్క్రీమ్’ బాగా పాపులరైంది. తన పాకప్రావీణ్యానికి గుర్తింపుగా గత ఏడాది ఢిల్లీలో జరిగిన వేడుకలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు కూడా అందుకున్నాడు. గూగుల్ బాయ్: కౌటిల్య పండిట్ సివిల్స్లాంటి పోటీ పరీక్షలను సాధించిన వారిని సైతం నివ్వెరపరచే పరిజ్ఞానం కౌటిల్య పండిట్ సొంతం. ఏ విషయానికి సంబంధించిన ప్రశ్నలు అడిగినా టకటకా సమాధానాలు చెప్పేస్తూ, ఐదేళ్ల వయసులోనే ‘గూగుల్ బాయ్’గా గుర్తింపు పొందాడు ఈ హర్యానా చిచ్చరపిడుగు. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ కార్యక్రమంలో అమితాబ్బచ్చన్ను సైతం అబ్బురపరచాడు. కేవలం తన తెలివితేటల ప్రదర్శనతోనే అంతర్జాతీయ టీవీ చానెళ్లనూ ఆకట్టుకున్నాడు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాల నుంచి ప్రత్యేక సత్కారాలు, బహుమతులు అందుకున్నాడు. హర్యానా అసెంబ్లీ ద్వారా ప్రత్యేక సత్కారం పొందిన ఏకైక బాలుడిగా రికార్డు సృష్టించాడు. కౌటిల్య పండిట్ పాండిత్యానికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన కాశీ విద్వత్ పరిషద్ ‘బాల మనీషి’ బిరుదుతో సత్కరించింది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండగా, ఈ చిచ్చరపిడుగును ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్కు పిలిపించుకుని, దాదాపు గంటసేపు రకరకాల శాస్త్ర అంశాలపై ఇతడితో మచ్చటించారు. ‘ఫోకస్ టీవీ’ ఎంపిక చేసిన ‘ఎలెవెన్ ఫోకస్ స్టార్స్’లో ఒకరిగా కౌటిల్య పండిట్ను ఎంపిక చేసింది. ఎందరో మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తల చేతుల మీదుగా లెక్కలేనన్ని అవార్డులు పొందిన ఈ పద్నాలుగేళ్ల బాలమేధావి గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్‘చైల్డ్ ప్రాడిజీ అవార్డును కూడా అందుకున్నాడు. రంగుల కళతో అంతర్జాతీయ గుర్తింపు: అద్వైత్ కోలార్కర్ ఏడాది నిండక ముందే కుంచెపట్టుకున్నాడు. ఊహ తెలిసీ తెలియని వయసుతో రంగులతోను, కుంచెతోను మొదలుపెట్టిన చెలిమి అద్వైత్ కోలార్కర్ను కళారంగంలో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. రంగులపై అద్వైత్ మమకారాన్ని గమనించిన తల్లిదండ్రులు అతడికి ఆటబొమ్మల బదులు రంగులు, కుంచెలు, కాన్వాస్లు కొనిచ్చారు. అప్పటి నుంచి రంగుల ప్రపంచమే అతడి లోకమైంది. ఆడుతూ పాడుతూ అలవోకగా కాన్వాస్లపై నైరూప్యచిత్రాలను చిత్రించేస్తాడు ఈ బాలకళాకారుడు. మిత్రుల సలహాతో అద్వైత్ తండ్రి అతడి కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను ప్రారంభించి, ఆన్లైన్లో అతడి చిత్రాలను అమ్మడం ప్రారంభించాడు. ఆన్లైన్లో అతడి చిత్రాలు అనతి కాలంలోనే దేశదేశాలకు చేరడంతో, వివిధ దేశాల్లో జరిగే చిత్రకళా ప్రదర్శనలకు ఆహ్వానాలు రావడం మొదలైంది. అలా చిన్న వయసులోనే దేశదేశాలు తిరిగి చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్న అద్వైత్, అంతర్జాతీయ మీడియాకెక్కాడు. రెండేళ్ల వయసులోనే కెనడాలోని సెయింట్ జాన్ ఆర్ట్స్ సెంటర్లో సోలో ప్రదర్శన చేసిన అతి పిన్నవయస్కునిగా రికార్డు సృష్టించాడు. ఎనిమిదేళ్ల అద్వైత్ గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డును అందుకున్నాడు. బీబీసీ ఇతడిపై ప్రత్యేకంగా ‘ఆర్ట్ ప్రాడిజీ’ కార్యక్రమాన్ని రూపొందించి, ప్రసారం చేయడం విశేషం. చదరంగంలో చిచ్చరపిడుగు: పరీ సిన్హా చదరంగంలో చిచ్చరపిడుగు ఈ చిన్నారి. బుడిబుడి నడకల వయసులోనే చదరంగంలో నిష్ణాతుల ఆట కట్టించి వార్తలకెక్కింది. బిహార్ చెస్ అసోసియేషన్ 2013లో నిర్వహించిన అండర్–7 పోటీల్లో పాల్గొని, విజేతగా నిలిచింది పరీ సిన్హా. పోటీలో పాల్గొనే నాటికి ఆమె ఇంకా బడిలో కూడా చేరలేదు. అప్పటికి ఆమె వయసు మూడేళ్లు మాత్రమే! ఆ తర్వాత బిహార్ రాష్ట్ర చెస్ ఓపెన్ చాంపియన్షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిచి, అతి పిన్నవయస్కురాలైన చదరంగ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. పరీ సిన్హా బాబాయి వీల్ప్రకాశ్ సిన్హా జాతీయస్థాయి చదరంగం ఆటగాడు. ఆయనే చిన్నారి పరీకి చదరంగాన్ని పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆమె చదరంగంలో మెలకువలను చకచకా నేర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో ఇప్పటికే తన సత్తా చాటుకుంది. చదరంగంలో ఆమె శుభేందు చక్రవర్తి వద్ద కోచింగ్ తీసుకుంటోంది. చదవండి: చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం! బాల వ్యాపారవేత్త: తిలక్ మెహతా దేశంలోనే అతి పిన్నవయస్కుడైన బాల వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు తిలక్ మెహతా. నాలుగేళ్ల కిందట– అంటే, తన పదేళ్ల వయసులో తిలక్ మెహతా సెలవుల్లో తన మేనమామ ఇంటికి వెళ్లాడు. సెలవుల్లో చదువుకోవడానికి పుస్తకాలు తీసుకురావడం మరచిపోయాడు. ‘మామా! స్కూలు పుస్తకాలు తెచ్చుకోవడం మరచిపోయాను. రేపటికల్లా ఇక్కడకు ఇంటి నుంచి కొరియర్లో తెప్పించుకోవడానికి వీలవుతుందా?’ అని అడిగాడు. ‘ఇవాళ్టికివాళే కొరియర్లో చేరుకోవడం సాధ్యం కాదు. రేపటికైతే చేరుతాయి గాని, కొరియర్ చార్జీ నీ పుస్తకాల ఖరీదు కంటే ఎక్కువే అవుతుంది’ అని బదులిచ్చాడు. మేనమామ సమాధానంతో తిలక్ ఆలోచనలో పడ్డాడు. ముంబై వాసులకు తక్కువ ఖర్చుతో కొరియర్ సేవలు ప్రారంభించగల అవకాశాలపై క్షుణ్ణంగా సమాచారాన్ని సేకరించాడు. చాలా లెక్కలు వేసుకున్నాడు. చివరకు ‘పేపర్ ఎన్ పార్సెల్’ యాప్ ప్రారంభించి, ముంబై డబ్బావాలాలతో కలసి కొరియర్ సర్వీస్ వ్యాపారం ప్రారంభించాడు. ఈ వ్యాపారానికి ముంబైవాసుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీనివల్ల డబ్బావాలాల ఆదాయం కూడా కొంత పెరిగింది. వ్యాపారరంగంలో రాణిస్తున్న తిలక్ మెహతా గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు అందుకున్నాడు. తబలా వాద్యంతో గిన్నిస్ రికార్డు: తృప్త్రాజ్ పాండ్యా బొమ్మలతో ఆటలాడుకునే వయసులో తబలాతో సావాసం మొదలుపెట్టాడు తృప్త్రాజ్ పాండ్యా. చిన్నప్పుడు అతడి తల్లి ఆటబొమ్మలతో పాటు ఒక చిన్న ఢోలక్ను కూడా తెచ్చిచ్చింది. చిన్నారి తృప్త్రాజ్ మిగిలిన బొమ్మలను వదిలేసి, ఢోలక్ను వాయించడం మొదలుపెట్టాడు. అతడి వాద్యంలోని లయను గమనించి, ఈసారి తబలానే కొనిచ్చారు తల్లిదండ్రులు. రెండేళ్ల వయసులోనే ముంబైలోని సోమయ్య కాలేజీలో తొలి తబలా కచేరీ చేశాడు. మూడేళ్ల వయసులో ముంబై ఆకాశవాణి కేంద్రం నుంచి లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చాడు. తర్వాత ముంబై దూరదర్శన్ కేంద్రంలోనూ తన తబలా వాద్య విన్యాసాన్ని ప్రదర్శించాడు. దీంతో అతి పిన్న వయస్కుడైన తబలా వాద్య కారుడిగా గిన్నిస్ రికార్డు సాధించాడు. తృప్త్రాజ్ వాద్యాన్ని ఆలకించిన తబలా దిగ్గజం జాకిర్ హుస్సేన్ సహా హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ ఇక్బాల్ అహ్మద్ఖాన్ వంటి విద్వాంసులు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. పదిహేనేళ్ల తృప్త్రాజ్, దేశ విదేశాల్లో ఇప్పటికే వందలాది కచేరీలు చేశాడు. చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
ప్రతిపక్షాలది దగాకోరు రాజకీయం
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ప్రతిపక్షాలు బూటకపు మేధోతనాన్ని, దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. దశాబ్దాల క్రితమే అనేక ప్రయోజనాలు పొందాల్సిన ప్రజలకు ఇంతవరకు ఎలాంటి ఫలాలు అందలేదని, అలాంటివారికి సరైన ఫలితాలు అందించాలంటే భారీ, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓపెన్ మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. నూతన సాగు చట్టాలు, జీఎస్టీ అమలు, ఆధార్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణం తదితర అనేక అంశాలపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన దుయ్యబట్టారు. ఈ అంశాలన్నింటిపై తొలుత ఏకీభవించిన తర్వాత రాజకీయ కారణాలతో విపక్షాలు యూటర్న్ తీసుకొని ద్వేషపూరిత ప్రచారం ఆరంభించాయని ఆరోపించారు. ప్రస్తుతం సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నవారిని చూస్తే ప్రజలకు బూటకపు మేధోతనం, దగాకోరుతనమంటే ఏమిటో తెలుస్తోందన్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక వాగ్దానమిచ్చి తర్వాత నెరవేర్చలేకపోవడం వేరని, కానీ సంస్కరణలపై ముందు ఏకీభవించి తర్వాత యూటర్న్ తీసుకొని దు్రష్పచారం చేయడం సహించరానిదని ఆరోపించారు. ఇప్పుడు తమ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారే వారివారి మేనిఫెస్టోల్లో ఇవే అంశాలను పొందుపరిచారని, అయితే ప్రజామోదం పొందిన తమ పార్టీ వీటిని అమలు చేయడంతో సహించలేక అనైతికంగా వ్యవహిస్తున్నారని విమర్శించారు. రైతులకు ఏది ప్రయోజనం అని ఆలోచించకుండా తమ రాజకీయాలకు ఏది ప్రయోజనమని విపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. కరోనా కట్టడిలో భేష్ అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా కరోనాను కట్టడి చేయడంలో భారత్ ఎంతో మెరుగ్గా వ్యవహరించిందని మోదీ చెప్పారు. కోవిడ్ విషయంలో తమ ప్రభుత్వ చర్యలను విమర్శించిన వారిపై ఆయన విరుచుకుపడ్డారు. వీరి లక్ష్యం అంతర్జాతీయంగా భారత్ పేరును నాశనం చేయడమేనని నిప్పులు చెరిగారు. కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడ్డాయని, మనం మాత్రం నెగిటివ్ ప్రచారాలను తట్టుకొని కరోనా కట్టడిలో మెరుగ్గా వ్యవహరించామని చెప్పారు. అవసరం వచి్చనప్పుడు ఇండియా ఐక్యంగా నిలబడుతుందనే పాఠాన్ని కోవిడ్ తెలియజేసిందన్నారు. ‘‘భారత్ టీకాను రూపొందించకపోతే ఏమయ్యేదో ఆలోచించండి. పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పటికీ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కోవిడ్ టీకా లభించడం లేదు. కానీ మనం వ్యాక్సినేషన్లో విజయవంతం అయ్యాము.’’అని చెప్పారు. స్వాలంబంన(ఆత్మనిర్భరత) ఇందుకు కారణమన్నారు. విమర్శలను తాను స్వాగతిస్తానని, ఆరోగ్యవంతమైన పురోగతికి ఇవి అవసరమని ఆయన చెప్పారు. కానీ అలాంటి నిజమైన విమర్శలు చాలా స్వల్పమని, అసంబద్ధ ఆరోపణలే అధికమని విచారం వ్యక్తం చేశారు. మిమ్మల్ని మీరే అవహేళన చేసుకుంటున్నారు నూతన పార్లమెంటు ఆవశ్యకతపై గొంతెత్తిన పారీ్టలే నేడు తాము నిర్మిస్తున్న నూతన భవన సముదాయాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఇది వారిని వారు అవహేళన చేసుకోవడమేనని మోదీ ఎద్దేవా చేశారు. గతంలో ఈ పార్టీల నేతలు కొత్త భవనం కావాలని కోరలేదా? అని ప్రశ్నించారు. దాన్ని సాకారం చేయాలని యతి్నస్తుంటే ఏవో కుంటిసాకులతో వ్యతిరేకించడం ఎంతవరకు సబబన్నారు. నిజానికి దేశ ప్రజలకు అనేక ప్రయోజనాలు దశాబ్దాల క్రితమే అందాల్సిఉందని, కానీ ఇంతవరకు వీరికి సరైన ఫలాలు అందలేదని వివరించారు. అలాంటివారికి సత్ఫలితాలివ్వడానికి పనిచేస్తున్నామని, ఇందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తే తీసుకుంటామని చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో చర్చలకు సిద్ధమని తమ ప్రభుత్వం తొలినుంచి చెబుతోందని గుర్తు చేశారు. ఇప్పటికి అనేక మార్లు వారితో చర్చలు జరిపామని, కానీ నిజానికి చట్టాల్లో ఏం మార్చాలో వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలన్నీ కాం గ్రెస్ గోత్రీకుల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యేవని ఎద్దేవా చేశారు. అందుకే గత ప్రభుత్వాలన్నీ ఒకేవిధమైన రాజకీయ, ఆర్థిక ఆలోచనతో వ్యవహరించాయని, కానీ తొలిసారి వాజ్పేయికి ప్రజలు ప్రత్యామ్నాయ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తన హయాంలో తొలిసారి కాంగ్రెస్తో సంబంధం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారన్నారు. ప్రజలు సంపూర్ణ మార్పు కోరారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. -
దళిత సాధికారత: మేధావులకు సీఎం కేసీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పును తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఈ లక్ష్య సాధనలో దళిత మేధావి వర్గం కలిసి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రూ.1,200 కోట్లతో ప్రారంభించి, భవిష్యత్తులో రూ.40 వేల కోట్లతో అమలు చేయబోతున్న ‘సీఎం దళిత సాధికారత పథకం’కోసం పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని, అందుకు తగు సూచనలు, సలహాలు అందించాలని వారిని కోరారు. దళిత సామాజికవర్గ మేధావులు, ప్రొఫెసర్లు సోమవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రిని కలిసి దళిత సాధి కారత పథకం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. దేశానికి ఆదర్శంగా నిలుద్దాం.. ‘దళిత సాధికారత పథకానికి రూ.40 వేల కోట్ల నిధులకు తోడు భవిష్యత్తులో కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయబోతున్నం. ఇంకా ఏమి చేయాలి ? ఎట్ల చేస్తే అట్టడుగున ఉన్న కడు పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అన్న విషయాల్లో మీ సలహాలు, సూచనలను అందించండి. ప్రత్యేకంగా ఓ రోజంతా సదస్సు నిర్వహించుకుందాం. దళిత సాధికారతను సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం’ అని సీఎం వారికి విజ్ఞప్తి చేశారు. ఏ ప్రాంతంలోని సమస్యలకు ఏ విధమైన విధానాన్ని అనుసరించడం ద్వారా శాశ్వత పరిష్కారాలను చూపగలమన్న అంశంపై ఆలోచన చేయాల్సిన అవసరముందన్నారు. విప్లవాత్మక మార్పులకు నాంది ‘సీఎం దళిత సాధికారత పథకం’దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనుందని దళిత సామాజికవర్గ మేధావులు ధీమా వ్యక్తం చేశారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ తీసుకున్న చర్యలను సైతం వారు ప్రశంసించారు. దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగిందని వారు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎస్సీ ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు ఆరేపల్లి రాజేందర్, ప్రొఫెసర్ మురళీదర్శన్, ఓయూ ప్రొఫెసర్ మల్లేశం, మాదిగ విద్యావంతుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఉస్మానియా యూనిర్శిటీ ఎస్సీ, ఎస్టీ బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.కుమార్, బంధు సొసైటీ అధ్యక్షుడు పుల్లెల వీరస్వామి, మాదిగ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు జాన్ తదితరులు ఉన్నారు. చదవండి: కాకతీయ వర్సిటీలో పీవీ విద్యాపీఠం ఏర్పాటు చేస్తున్నాం: సీఎం కేసీఆర్ -
ఉదాశీనయ్యలు–శీను బాబు
ఉదాశీన శీలురు యుగయుగాలుగా ఉన్నారు. వారి ఉదాశీనతవల్లే బోలెడు ఘోరాలు రాజ్యమేలాయి. నిండుసభలో ఇంటికోడల్ని అవమానించినపుడు పెద్దలు మేధావులు.. చెప్పతగినవారు, చెప్పాల్సిన వారు నోరు చేసుకుని ఉంటే కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగి ఉండేది కాదు. త్రేతా యుగంలో కైక వరాలకు దశరథుడు శిరసా వహించినపుడు అయోధ్యలో ఉన్న శిష్టులో వశిష్టులో రంగంలోకి దిగి ఉంటే రామాయణం మరోలా ఉండేది. రాచమర్యాదలకు పోయి ఎవరూ పర్ణశాలల నించి బయటికి రాలేదు. రాజునైనా చక్రవర్తినైనా సమయం వచ్చినప్పుడు దండించే ఖలేజా మేధావి వర్గానికి ఉండి తీరాలి. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే రోజుల్లోనే పెద్దలు చూసీ చూడనట్టు, వినీ విననట్టుండే వారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక ధర్మం ఒంటికాలుమీద కుంటుతున్న కలియుగం మాట చెప్పాలా? ఇప్పుడు ఈ బుద్ధి పెద్దలకు నైజంగా మారింది. దీన్నే లౌక్యం అంటున్నారు. గోడమీది పిల్లలువలె ఎటైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటున్నారు. రెండువైపులకి సరిపోయే తర్కం అందు బాటులో పెట్టుకుంటున్నారు. సుఖంగా జీవితం వెళ్లిపోవడమే పర మార్థంగా భావిస్తున్నారు. నిజానికి అలాంటివారే మేధావులుగా చెలా మణీ అవుతున్నారు. సూటిగా ప్రశ్నించే దక్షతని వదులుకుంటున్నారు. అన్యాయాన్ని అధర్మాన్ని వేలెత్తి చూపడం నేరమా? కొన్ని వర్గాలకి ప్రత్యేక కవచాలుంటాయా? ఉంటే వారికెవరిచ్చారు? వీటిని నిగ్గు తేల్చాల్సిన మేలి మలుపు ఆధునిక కాలంలో వచ్చింది. ‘అందరూ సమానమే. కొందరు మరింత ఎక్కువ సమానం’ అనే పాత నానుడిని తిరగరాసుకోవాలి. ఒకనాటి మన పండితరాయలు ముంగండ అగ్రహారీకుడు. ఢిల్లీ షాజహాన్ కొలువులో ఉన్నత పదవులు నిర్వహించాడు. క్షుణ్ణంగా లోకం తెలిసినవాడు. లోకంలో నాలుకతో, కళ్లతో ఎంతటి విషయాన్నైనా చప్పరించే వాళ్లుంటారో చక్కగా వివరించి చెప్పాడు. పండిత రాయలు వీధి వెంట వెళ్తుంటే, ఓ చెట్టు నీడన ఎంగిలి విస్తళ్లు తింటూ ఓ గాడిద కనిపించింది. పనిమాలా దాన్ని పలకరించి, ఏం పాపం ఈ ఆకులు తింటున్నావని సానుభూతితో అడిగాడు. గాడిద, ‘చాల్చాలు నా బతుక్కి ఇదే గొప్ప’ అన్నది. ‘ఓసీ వెర్రిమొహమా! ఆ తెలివితక్కువ తనమే నిన్ను గాడిదని చేసింది’ అనగానే, గాడిద ప్రశ్నార్థకంగా చూసింది. ‘పో... వెళ్లు. వెళ్లి రాజుగారి అశ్వశాలలో చేరిపో.. రోజూ ముప్పూటలా ఉత్తమజాతి గుగ్గిళ్లు దాణాగా పెడతారు’ అని పండిత రాయలు సలహా ఇచ్చాడు. గాడిద ఆ సలహాకి ఉలిక్కి పడి, ‘ఆహా, ఎవరైనా చూస్తే నా నడుం విరగ్గొడతారు. నేను నీకేం అపకారం చేశాను స్వామీ’ అని బాధపడింది. పండితరాయలు చిరునవ్వు నవ్వి, ‘అందుకే నీ బతుకు ఇట్లా అఘోరించింది. నువ్ అశ్వశాలలో, గుర్రాల పంక్తిలో ఉంటే నువ్వు గుర్రానివే! గుగ్గిళ్లు వేసే సేవకులు అంతే ఆలోచిస్తారు’ అంటూ ధైర్యం ఇచ్చాడు రాయలు. ‘ఎప్పుడైనా రాజుగారి దండ నాయకుడు శాలకి వస్తేనో’ అంది గాడిద. ‘వస్తే రానీ, తోకల్ని లెక్కేసుకుపోతాడు. వాడికి శాల్తీలు సరిపోతే చాలు’ వివరించాడు రాయలు. గాడిదకి కొంచెం కొంచెం ధైర్యం వస్తోంది. ‘సరే, ఏ మంత్రిగారో వస్తే...?’ అన్నది గాడిద. ‘వస్తేరానీ, చూస్తారు.. వెళ్తారు’ అన్నాడాయన. ‘స్వయంగా రాజుగారే వచ్చి, చూసి వచ్చే పండుగకి నేను ఊరే గడానికి దీన్ని సిద్ధం చేయండని పురమాయించి వెళితే...’ అనడిగింది గాడిద. ‘పిచ్చి మొహమా.. ఎందుకు ప్రతిదానికీ అలా కంగారుపడతావ్. ఏమీ కాదు. రాజుగారు దూరం నించి వేలు చూపించి వెళ్తారు. ఇహ ఆ క్షణం నించీ నీ మాలీస్ వేరు. తిండి వేరు’. ‘తీరా ఆ రోజు వస్తే...’ అనడిగింది గాడిద. ‘వస్తే బ్రహ్మాండంగా నిన్ను అలంకరిస్తారు. వజ్రాల బొంతలు కప్పుతారు. రాజు ఎక్కే సమ యానికి అది నువ్వో, గుర్రమో అర్థం కాకుండా చేస్తారు’. ‘వీధిన వెళ్లేప్పుడు పెద్దలు, తమలాంటి పండితులు’ అని గొణి గింది గాడిద. ‘ఓసీ పిచ్చిదానా! మన ప్రజలు మరీ ముఖ్యంగా తెలివితేటలు ఉన్నవారు చాలా ఉదాశీనులు, ఓర్పువంతులు. వాళ్లంతా చూసి నిన్ను గుర్తుపట్టినా.. రాజుగారు సరదాపడ్డారు కాబోలు. మనకెందుకులే అని నోరు మెదపరు. రాజుగారు ఠీవీగా ఊరేగుతారు’ అంటూ దాని వెన్ను చరిచాడు రాయలు. మేధావుల ఉదాశీనత దేశానికి పట్టిన బూజు. పెద్దల మెదళ్లకి బొజ్జలొస్తే శీనయ్యలు ఉదాశీను బాబులు అవుతారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మేధావుల మౌనం అతి ప్రమాదకరం
మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యమ శక్తులు మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ గడ్డ పోరాటాలకు అడ్డా. ఇక్కడి మట్టి బిడ్డలకు ఆత్మ గౌరవం ఎక్కువ. ఇక్కడి మట్టికి, గాలికి, నీటికి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉంటుంది. దుర్మార్గంపై తిరుగుబాటు చేసే స్వభావం ఉంటుంది. సమ్మక్క సారక్కల దగ్గర నుండి రాణి రుద్రమ దాకా. నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా. సిరిసిల్ల జగిత్యాల ప్రజా ఉద్యమాల దగ్గర నుండి మలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా. ఇలా అనేక పోరాటాలను, ఉద్యమాలను నడిపిన చరిత్ర ఉంది తెలంగాణ గడ్డకు. తెలం గాణ రాష్ట్రం సాధించుకునే వరకు ఇక్కడి మేధావులు, కవులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు అందరూ సమాజంలో తమ తమ విద్యుక్తధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ బాధ్యతల నుండి చాలామంది వైదొలిగారు. ఎందుకు ఈ పరిణామం జరిగింది? దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనే చర్చ జరగాలి. పాలకులు చేసే తప్పులను ప్రశ్నించే దాశరథి, కాళోజి వారసులు ఇప్పుడు తెలంగాణలో లేరా! మాయమైపోయారా! రాజ్యం చేసే తప్పులపై గజ్జకట్టి డప్పుకొట్టి జన జాగృతికి నడుంబిగించిన ప్రజా కళాకారులు ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చారు? జనం గొంతు వినిపించే జయశంకర్ సార్ వారసులైన మేధావులు పదవులకు పెదవులు మూశారా. తెలంగాణ వస్తే హక్కులు వస్తాయి, సామాజిక న్యాయం జరుగుతుంది, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనుకుంటే ఉన్న హక్కులు పోతున్నాయి. ఉద్యమ వారసులు, మేధావులు, ప్రజాస్వామిక శక్తులు మౌన ముద్ర దాల్చారు. దీనికి కారణం ఏమిటి! కారకులు ఎవరు! తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు దగ్గరైన వీరు రాష్ట్రం ఏర్పడ్డాక పదవులకు ఆశపడ్డారా? పదవులు తీసుకుని సాధించుకున్న తెలంగాణను గాలికి వదిలేసి సొంత ప్రయోజనం చూసుకున్నారా? ప్రశ్నించేతత్వాన్ని, పోరాడే గుణాన్ని మొద్దుబార్చారా? తెలంగాణ సహజత్వాన్ని భ్రష్టుపట్టించారా? ఆత్మగౌరవాన్ని అటకెక్కించారా? ప్రజల వాయిస్ వినిపించే గొంతుకలను మూగనోము పట్టించారా? తెలంగాణ వస్తే ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇలా జరుగుతుంది అంటే ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడేవారు కాదేమో. యువకులు తమ నిండు ప్రాణాలను బలిదానం చేసేవారు కాదు. ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసేవారు కాదు. తెలంగాణ ఉద్యమ శక్తుల శక్తిని, మేధావులకున్న బలాన్ని, కవులు కళాకారుల ఆట, పాటలకున్న పవర్ను ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గుర్తించాడు. ఉద్యమ సమయంలో తనకు దగ్గరైన కవులను, కళాకారులను, మేధావులను ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత వారిని తన వెంటనే తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వీరి ప్రభావం సమాజంలో ఎలా ఉంటుందో తెలుసు కనుక, వీరిని దూరం చేసుకుంటే ఏమి జరగబోతుందో కూడా ఊహించుకున్నాడు. అందుకే అధికారంలోకి రాగానే వీరందరిని తన కబంధ హస్తాలలో బంధించాడు. కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాడు. వారు బయటికి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేదికలు ఎక్కి ఆటపాటలు పాడకుండా కట్టడి చేశాడు.. అలాగే మేధావి వర్గానికి పదవులు ఇచ్చి పెదవులు మూయించాడు. ఉద్యమ వారసులందరినీ తన అదుపులో ఉంచుకున్నాడు. అందుకే వీవీ, సాయిబాబాల మీద కుట్ర కేసులు పెట్టి జైలుకు పంపినా. ప్రజాస్వామికవాదులను అరెస్ట్ చేసినా, ధర్నాచౌక్ ఎత్తేసి సభలు, సమావేశాలు పెట్టుకునే అవకాశం లేకుండా చేసినా ప్రశ్నించేవాడు ఉండడానికి వీలు లేదు, ఉద్యమాలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తుంటే తెలం గాణ సమాజం మౌనంగా రోదిస్తోంది. మేధావులారా మేల్కొనండి. తెలంగాణకున్న పోరాటాల వారసత్వాన్ని కాపాడుకుందాం. మేధావి మౌనం సమాజానికి మంచిది కాదు. దేశ వ్యాపితంగా అప్రజాస్వామిక శక్తులు విజృంభిస్తున్నాయి. విభజన రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే కుట్రలకు తెర లేపారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమైన మన దేశాన్ని మధ్యయుగాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన పదవులకు ఆశపడి మీ పాత్రను విస్మరించకండి. రాజకీయాలకు అతీతంగా ఎటువంటి వివక్షత చూపించకుండా ప్రజల పక్షాన, సమాజ హితం కోరి మీరు చూపించే మార్గం పాలకులకు దశ, దిశ కావాలి. తెలంగాణ మట్టికి, గాలికి, నీటికి ఉన్న ప్రత్యేకతను కాపాడండి. పోరాటాల వారసత్వాన్ని కొనసాగించండి. డా. శ్రవణ్ దాసోజు వ్యాసకర్త జాతీయ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ -
మూడు రాజధానులతోనే మేలు
మూడు రాజధానులతోనే రాష్ట్రానికి మేలు కలుగుతుందని మేధావులు, విద్యావేత్తలు స్పష్టం చేశారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని న్యాయవాదులు, వైద్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు గళమెత్తారు. ఒకే రాజధాని వద్దు–మూడు రాజధానులే ముద్దు అని యువత నినదించింది. కొత్త రాష్ట్రంలో అభివృద్ధికి ఎవరూ అడ్డుపడొద్దని వివిధ రాజకీయ పార్టీల నేతలు సూచించారు. పాలన వికేంద్రీకరణను ఆకాంక్షిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చర్చా వేదికలు, సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. మరో వైపు మూడు రాజధానులకు మద్దతుగా రిలే దీక్షలు కొనసాగాయి. – సాక్షి నెట్వర్క్ నిపుణుల సూచనలు పాటించాలి నిపుణుల సూచనల మేరకు పాలన వికేంద్రీకరణ చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని వక్తలు పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ.. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల చర్చా వేదికలు జరిగాయి. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని విశాఖకు పరిపాలనా రాజధాని రావాల్సిందేనని ముక్తకంఠంతో కోరారు. రాజాంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో అన్ని ప్రాంతాలను ప్రగతి పథంలో నడిపించే వికేంద్రీకరణకు మద్దతు పలకాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ సెమినార్ హాల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కొరుపోలు రఘుబాబు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఎవరూ అడ్డుపడకూడదన్నారు. ప్రొఫెసర్లు గుంట తులసీరావు, పెద్దకోట చిరంజీవులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలిలో నిర్వహించిన సదస్సుల్లో న్యాయవాదులు, వైద్యులు, అధ్యాపకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సులో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ అసమానతల కారణంగానే రాష్ట్రం విడిపోయిందని, మళ్లీ అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదంటే వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఉన్నత విద్యామండలి పూర్వ చైర్మన్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి మాట్లాడుతూ వికేంద్రీకరణను రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల, రాష్ట్ర అభివృద్ధి కోణంలో చూడాలన్నారు. ద్రవిడ యూనివర్సిటీ పూర్వ ఉప కులపతి కేఎస్ చలం మాట్లాడుతూ 1953లోనే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని తీర్మానించారని గుర్తు చేశారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ వి.బాలమోహనదాస్ మాట్లాడుతూ పరిపాలన, అధికార, పాలన వికేంద్రీకరణతోనే సమాజం ప్రగతి సాధిస్తుందన్నారు. రాజనీతి శాస్త్రజ్ఞులు మొమర్రాజు రవి, పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. వెనుకబాటుతనం పోవాలంటే.. విజయనగరం జిల్లా బొబ్బిలి, విజయనగరం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల్లో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. వికేంద్రీకరణ వల్లే ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనాన్ని పోగొట్టుకోగలుగుతామని మేధావులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు పాల్గొన్నారు. గుంటూరు అరండల్పేటలోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్, దళిత ప్రజాపార్టీ, చాంబర్ ఆఫ్ కామర్స్, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, ఉపాధ్యాయ సంఘాలు, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు హాజరై వికేంద్రీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. భట్టిప్రోలు, బాపట్లలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, పానుగుంటి చైతన్య పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, మడకశిరలో చర్చావేదికలు నిర్వహించారు. విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. కడప అంబేడ్కర్ సర్కిల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. -
వికేంద్రీకరణతోనే రాష్ట్ర వికాసం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర వికాసం సాకారమవుతుందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం సమావేశ మందిరంలో ‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి’ అంశంపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి మేధావుల సదస్సును నిర్వహించింది. సమితి వ్యవస్థాపకుడు ఎన్.రాజారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ఏక కేంద్రంగా పరిపాలన, అభివృద్ధి జరుగుతోందని, ఇది రాష్ట్రానికి ఎంతమాత్రం మంచిది కాదని చెప్పారు. రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన వెయ్యి పడకల క్యాన్సర్ ఆస్పత్రిని అమరావతికి తరలించడం శోచనీయమన్నారు. ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడు జిల్లాలు వెనుకబడ్డాయని కేంద్రం గుర్తించిందని, వీటికి ఊతం ఇచ్చేలా మూడు రాజధానుల నిర్ణయం నిలుస్తుందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం అంతంత మాత్రంగానే నిధులు ఇస్తోందని, ఇలాంటి సమయంలో విశాఖను పాలనా రాజధానిగా ఎంపిక చేయడం మంచి నిర్ణయమన్నారు. పాలన వికేంద్రీకరణ జరగకపోతే చరిత్ర పునరావృతమై రాష్ట్ర విభజన దిశగా అడుగులు పడతాయని అంబేడ్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య లజపతిరాయ్ అభిప్రాయపడ్డారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. రాజధాని పేరుతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని, ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల వద్ద 7 వేల ఎకరాల భూములు ఉండటం వెనుక ఆంతర్యమేమిటో తెలియాలన్నారు. కార్యక్రమంలో ఆచార్య ఓఆర్ రెడ్డి, ఆచార్య టి.తిమ్మారెడ్డి, ఆచార్య నిమ్మ వెంకటరావు, ఆచార్య పేటేటి ప్రేమానందం, ఆచార్య కె.చంద్రమౌళి, తిరుపతి నుంచి కుసుమకుమారి, కర్నూలు నుంచి లక్ష్మీ నారాయణ, కడప నుంచి మునిరాజు, అనంతపురం నుంచి అవుల మనోహర్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఫలితంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ నెల 24న తిరుపతి వేదికగా ఉత్తరాంధ్ర, రాయలసీమ మేధావుల ఐక్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖ నుంచే ఎన్జీవోల కార్యకలాపాలు మహారాణిపేట (విశాఖ దక్షిణ): పరిపాలన వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులను ఉద్యోగులు స్వాగతిస్తున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. ఆదివారం విశాఖ ఎన్జీవో హోమ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే విశాఖలో రాష్ట్ర ఎన్జీవో కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తామని, ఇక్కడ నుంచే కార్యకలాపాలు జరుగుతాయని వివరించారు. 13 జిల్లాల అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. -
మూడు రాజధానులకు మా మద్దతు
సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక పేర్కొంది. మంగళవారం తిరుపతిలోని అగరాల ఈశ్వర్రెడ్డి డిగ్రీ కళాశాలలో వివిధ ప్రజా సంఘాలు సమావేశం నిర్వహించాయి. కార్యక్రమానికి బొజ్జా దశరథరామిరెడ్డి అధ్యక్షత వహించారు. శాసనసభ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, తిరుపతికి చెందిన మాంగాటి గోపాల్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ప్రొఫెసర్ రంగారెడ్డి, ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 10 తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల్లో ముఖ్యమైన అంశాలు ఇవీ.. ►జీఎన్ రావు కమిటీ శ్రీబాగ్ ఒప్పందాన్ని తన నివేదికలో ప్రస్తావించింది. ఈ ఒప్పందం ప్రకారం రాజధాని లేదా హైకోర్టును ఎంచుకునే స్వేచ్ఛను రాయలసీమ వాసులకివ్వాలి. హైకోర్టుతో పాటు శాసన, పాలనా వ్యవస్థకు సంబంధించిన విభాగాలు రాయలసీమలో ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి. ►విభజన చట్టంలో 11వ షెడ్యూల్ ప్రకారం నిర్మాణంలో ఉన్న గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తిచేయాలి. వెనుకబడిన ప్రాంతాలకు, సీమలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి. ►కృష్ణ, తుంగభద్ర జలాల్లో రాయలసీమ జిల్లాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ను పూర్తిగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలకు కేటాయించాలి.∙తుంగభద్ర ఎగువ దిగువ కాలువలు, కేసీ కెనాల్ కింద నీటిని సక్రమంగా కేటాయించాలి. ►కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి. ∙విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో ఉన్న ఎయిమ్స్, కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయాలి. ►కడపలో మైనింగ్ వర్సిటీ, తిరుపతిలో క్యాన్సర్ ఆస్పత్రి, శ్రీశైలంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. ►గుంతకల్ కేంద్రంగా రైల్వేజోన్, సెయిల్ ఆధ్వర్యంలో కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి. ►కర్నూలును సీడ్ హబ్గా అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ వ్యవసాయ కమిషనరేట్, విత్తన ధ్రువీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ►విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న 83 ప్రభుత్వ కార్పొరేషన్లను, 10వ షెడ్యూల్లో ఉన్న 107 రాష్ట్రస్థాయి శిక్షణ సంస్థలను రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. చదవండి: ముగ్గురి నోట అదే మాట! -
బాబుగారూ.. బదులివ్వండి
ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన పలువురు మేధావులు, ప్రొఫెసర్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి రాసిన బహిరంగ లేఖ ఇది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం సూటిగా సమాధానమివ్వాలని వారు కోరారు. లేఖలోని ప్రధానాంశాలు... గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులకు బాధ్యత గల దేశ పౌరులుగా, అయిదు సంవత్సరాలపాటు మీ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ఈ లేఖ రాస్తున్నాం. 1. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు గనుక దానికి సంబంధించిన సమస్త వ్యయమూ కేంద్రమే భరించవలసి ఉంది. కానీ బీజేపీతో మీకున్న స్నేహాన్ని ఆసరా చేసుకుని ‘దాన్ని మేమే కడతాం. అందుకయ్యే డబ్బు మాత్రం మంజూరు చేయండి’ అని కోరితే, కేంద్రం అంగీకరించి దాన్ని మీ చేతుల్లో పెట్టింది. ప్రాజెక్టు లావాదేవీలకు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఖాతా తెరవమని సూచించింది. కానీ అయి దేళ్లు కావస్తున్నా మీరు ఆ ఖాతా ఎందుకు తెరవలేదో చెప్పగలరా? 2. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘జాబ్ కావాలంటే బాబు రావాలి’ అని మీరు ప్రచారం చేశారు. మీరు సీఎంగా బాధ్యతలు స్వీకరించేనాటికి రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాధన్ కమిటీకి ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలో తెలియజేశారు. ఈరోజు వరకూ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మీరు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ను 9 ఏళ్లు పాలించారు. అప్పుడు మీరు ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేకపోయారు. మీ అనంతరం వచ్చిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన 5 ఏళ్ల 6 నెలల పదవీ కాలంలో అన్ని విశ్వవిద్యాలయా ల్లోనూ అవసరమైన ఉద్యోగాలన్నీ భర్తీ చేశారు. ఆ తర్వాత వచ్చిన సీఎంలు ఈ ఉద్యోగాల భర్తీ గురించి పట్టించుకోలేదు. మీ హయాంలో కూడా అదే పరిస్థితి. విశ్వవిద్యాలయాల్లో కనీసం ఒక్క ఉద్యోగమైనా కొత్తగా ఇవ్వలేదు. ఎందరో డాక్టరేట్లు చేసి నిరుద్యోగులుగా మిగిలి పోయారు. ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలేదో వివరణనిస్తారా? 3. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం కేంద్రం ఇచ్చిన రూ. 3,500 కోట్లకు మీరు ఎన్ని శాశ్వత భవనాలు నిర్మించారో చెప్పగలరా? మన రాష్ట్రంలో ఎందరో నిపుణులైన ఇంజనీర్లు, అపార అనుభవం గల కాంట్రాక్టర్లు ఉండగా రాజధాని నిర్మాణం కోసం జపాన్, సింగపూర్, బ్రిటన్ తదితర దేశాలవారి సలహాలు, సినీ దర్శకుడు రాజమౌళి వంటి వారి సలహాలు మీకు అవసరమా? 4. లక్షలమంది విద్యార్థినీవిద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రీయింబ ర్స్మెంట్ బకాయిలకు, స్కాలర్ షిప్లకు నిధులు మంజూరు చేయ కుండా వాటిని వేరే ప్రయోజనాలకు మళ్లించారు. ఇంతవరకూ కేవలం మూడు నెలలకు మాత్రమే మంజూరు చేశారు. ఈ బకాయిలు చెల్లించక పోవడం వల్ల హాల్ టికెట్స్ తీసుకుంటున్న సందర్భంలో, పరీక్షలు రాస్తున్న సందర్భంలో పేద విద్యార్థులు ఎన్ని బాధలనుభవించారో మీకు తెలుసా? నిధుల మళ్లింపునకు మీకున్న అధికారం ఏమిటి? 5. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించాక దాన్ని తీసుకు రావలసిన బాధ్యత మీది కాదా? ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని అసెంబ్లీలో ప్రకటించి, దానికి ధన్యవాదాల తీర్మానం చేయిం చింది మీరు కాదా? ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన విద్యార్థుల పైనా, యువతపైనా కేసులు పెట్టించలేదా? ఈ సమస్యపై సాగుతున్న ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారిని అరెస్టు చేయించలేదా? ఇప్పుడు ఏ మొహం పెట్టు కుని కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ కోట్ల రూపాయలు దుబారా చేసి ధర్మ పోరాట దీక్షలు చేశారు? 6. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రిజర్వ్బ్యాంక్, ఎల్ఐసీ వారికి ఎకరం రూ. 4 కోట్ల చొప్పున అమ్మారు. అదే చోట ప్రైవేటు విద్యా సంస్థలకు, ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఎకరం రూ. 50 లక్షలు చొప్పున మాత్రమే విక్రయించారు. మిగిలిన రూ. 3.5 కోట్లు ఎవరి జేబు ల్లోకి వెళ్లాయి? వివరిస్తారా? 7. వివిధ రంగాల్లోని పథకాలకు కేంద్రం విడుదల చేసే గ్రాంట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు యుటిలైజేషన్ సర్టిఫి కేట్(యూసీ)లు కేంద్రానికి పంపవలసి ఉంటుంది. ఆ విషయంలో జాప్యం చేయటం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన సుమారు రూ. 7,000 కోట్లు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని మన సచివాల యంలో ఒక పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నతాధికారుల సమక్షంలో ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ప్రకాష్ తెలియజేశారు. నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం గల మీరు సక్రమంగా యూసీలు ఎందుకు పంపలేకపోయారో వివరిస్తారా? 8. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో నిష్ణాతులైన అధికారులు న్నారు. దేశంలోనూ భిన్న రంగాల నిపుణులు ఉన్నారు. వీరిని విస్మరించి పైపై మెరుగుల కోసం, కన్సల్టెన్సీల కోసం ఈ అయిదేళ్లలో రూ. 500 కోట్లు ధారపోశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగు నిర్మాణా నికి రూ.10,000 చెల్లించారు. ఈ విషయంలో వివరణనివ్వగలరా? 9. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో రాజధాని భూముల్ని కారు చౌకగా సింగపూర్ కంపెనీలకు స్విస్ చాలెంజ్ ద్వారా కట్టబెట్టారు. దీని కింద 1,691 ఎకరాలను ఎకరం రూ. 12 లక్షల చొప్పున ఇచ్చారు. నిబం ధనల ప్రకారం రూ. 6,764 కోట్ల విలువైన ఈ భూమినంతటినీ ఈ విధంగా కేవలం రూ. 243 కోట్లకు అమ్మారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఎకరం రూ. 12 లక్షలకు వస్తుందా? ప్రభుత్వ సంస్థ లకు రూ. 4 కోట్లకు అమ్మిన మీరు ఇలా ఎందుకు చేశారు? 10. రాజధాని ప్రాంతం ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనబెట్టి మీకు, మీవారికి అనుకూలమైన ప్రాంతంలో రాజ ధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని, ఆ విషయాన్ని మీ అనుయా యులకు ముందుగా తెలిపి వాళ్లతో కారుచౌకగా భూములు కొనిపిం చారు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుంది. ఆ రకంగా ఇది భారీ కుంభ కోణం. రాజధాని చుట్టూ ఎవరెవరి భూములు రిజస్టర్ అయినాయో దర్యాప్తు చేయిస్తే దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడవుతాయి. ఒక ముఖ్య మంత్రి స్థాయి నాయకుడు చేయాల్సిన పనేనా ఇది? 11. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన సభలో ఓటుకు రూ. 5 వేలు ఇచ్చే స్థోమత ఉందని మీరు అన్నారు. ఇలా మాట్లాడటం ఒక సీఎంగా మీకు తగునో లేదో మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. కానీ మీరు దేశంలోకెల్లా అత్యంత ధనిక సీఎం అని తెహల్కా చెప్పిన మాట వాస్తవమేనని ధ్రువపడింది. 12. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు బోధనా సిబ్బంది మినిమం టైం స్కేల్ ప్రకటిస్తూ ఫిబ్రవరి నెలలో జీవో నం. 24 జారీచేశారు. దానికి ఇప్పటికీ అతీ గతీ లేకుండా పోయింది. ఈ తరహా ఉద్యోగులు 14 విశ్వ విద్యాలయాల్లో 1,860మంది ఎన్నో ఏళ్లుగా అరకొర జీతాలతో గడుపు తున్నారు. వీళ్ల దయనీయ స్థితి మీకు పట్టదా? 13. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు పంపిన జాబితాపై పక్క రాష్ట్ర సీఎం నెలరోజుల లోపులో నిర్ణయం తీసుకుని పంపిస్తే, మీరు 10 నెలలపాటు ఎందుకు జాప్యం చేశారు? ఆ జాబితాలో ఒక ఎస్సీ, ముగ్గురు బీసీలు, ఇద్దరు ఓసీ న్యాయవాదులు ఉన్నారని, మీ సామాజిక వర్గానికి చెందినవారు ఎవరూ లేరనే కదా ఇంతవరకూ ఆ జాబితాను పంపలేదు! 14. 2014లో మీ పార్టీ మేనిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి ఇచ్చిన ఏ హామీనీ మీరు అమలు చేయలేదని ఏపీ బీసీ అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లపు క్రిష్ణ ఆరోపించారు. జీపీ, ఏజీపీ, పీపీ, ఏపీపీ తదితర నియామకాల్లో చెప్పిన ప్రకారం రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయకుండా ప్రతిచోటా మీ సామాజిక వర్గానికి చెందినవారినే ఆ పోస్టుల్లో నింపారని కూడా అన్నారు. వివరించగలరా! 15. మీ గ్రామం నారావారి పల్లెకే చెందిన యువ పారిశ్రామికవేత్త నవీన్ నాయుడు మీ పాలనలో పారదర్శకత శూన్యం, అది ఉపన్యాసా లకే పరిమితమని ఆరోపించారు. ఉత్తరాదివారికే పనులు కట్టబెట్టి స్థాని కులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అది నిజమా కాదా? 16. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటివి కేంద్ర నిధులకు నోడల్ అధికారులను నియమించుకుని ప్రతి పైసా సద్వినియోగం చేసుకుం టుండగా మన ప్రభుత్వం ఆ నిధులను వెనక్కి పంపే స్థితి నెలకొంది. ఇలా రూ. 250 కోట్లు మీరు సరెండర్ చేయాల్సి రావడం నిజమేనా? 17. మీ అవినీతి బాగోతంపై 19 కేసులుంటే మీరు స్టేలు తెచ్చు కున్న సంగతి అందరికీ తెలుసు. అలాగే ఓటుకు కోట్లు కేసులో మీరు ఆడియో, వీడియో ఆధారాలతో దొరికారు. ఈ కేసులేవీ విచారణకు రాకుండా మేనేజ్ చేస్తున్నారు. అవునా కాదా? 18. అమరావతి డెవలప్మెంట్ పార్టనర్(ఏడీపీ) సమావేశాల నుంచి నన్ను తప్పించండి అని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎందుకు లేఖ రాయాల్సివచ్చింది? రాజధాని స్టార్టప్ ఏరియా పేరుతో సింగపూర్ కంపెనీలకు స్విస్ చాలెంజ్కింద 1,691 ఎకరాలు అప్పగించి, అందులో పాల్గొన్న సంస్థలకు కాక సింగపూర్, అమరావతి హోల్డింగ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి దానితో రాయితీల వాటాల ఒప్పందాలు చేసు కున్నారు. దీన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర తప్పుబట్టినా మీరు ఖాతరు చేయలేదు. ఈ విషయంలో ప్రజలకు ఏం చెబుతారు? 19. ఈమధ్య ఏపీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి అజేయ కల్లాం ఒక సభలో మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపనలు, శిలాఫలకాలకు రూ. 350 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. మీ అనుభవం అవినీతిని పెంచిపోషించ డానికి, వ్యవస్థల నిర్వీర్యానికి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడలేదని చెప్పారు. మీ వివరణ ఏమిటి? 20. ఐఐఎం, బెంగళూరులోని ఏడీఆర్లు కలిసి దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా ఏపీ ప్రజలను సర్వే చేసినప్పుడు అక్కడి ఓటర్లు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అంశాలు.. మెరుగైన ఉపాధి/ ఉద్యో గావకాశాలు, తాగునీరు, మెరుగైన అసుపత్రులు/ప్రాథమిక ఆరోగ్యకేం ద్రాలు అని చెప్పారు. ఈ 3 అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అధ్వా నంగా ఉన్నదని సర్వే పేర్కొంది. ఆ 3 అంశాల్లో కనీస సగటును కూడా ప్రభుత్వం అందుకోలేకపోయింది. ఎందుకో ప్రజలకు చెప్పగలరా?} 21. ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ మీరు కేంద్రానికి రాసిన లేఖను కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ బయటపెట్టారు. ఎన్డీఏ నుంచి విడి పోయిన అనంతరం కూడా ఈ విషయంలో మరో లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెబుతూనే ఇలా ఎందుకు చేశారో చెబుతారా? కేంద్ర మంత్రి రాష్ట్రానికి చేసిన సాయంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలూ చెప్పారు. వాటికి మీరు జవాబు ఎందుకివ్వలేకపోయారు? 22. బీసీలకు మీరు న్యాయం చేయలేదని, పైగా బీసీల ఆత్మగౌ రవం దెబ్బతినే విధంగా బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని కేంద్రా నికి లేఖ రాసిన సంగతిని జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య పలు సందర్భాల్లో చెప్పారు. మీరు మోదీని అనేకసార్లు కలిసినా చట్టసభల్లో బీసీల కోటా గురించి అడగలే దని, ఆ విషయంలో పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టించిన ఏకైక నాయకుడు జగన్ గారేనని కూడా అన్నారు. దీనిపై మీ స్పందనేమిటి? 23. రిటైర్డ్ ఉన్నతాధికారులు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లాం, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మారెడ్డి తదితరులు పలు అంశాల్లో గణాంకాలతోసహా అవినీతి గురించి వెల్లడించారు. వాటిపై వివరణనిచ్చే ధైర్యం, దమ్ము మీకుందా? 24. జీవో నం. 5కు భిన్నంగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్వారు జనరల్ కేటగిరీల్లో రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు అవకాశం లేకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో గోపాలకృష్ణ ద్వివేదీ ఈ విషయంలో ఒక సర్క్యులర్ పంపారు. దాని ప్రకారం రిజ ర్వుడు అభ్యర్థులు (ఎస్సీ, ఎస్టీ,బీసీ, దివ్యాంగులు) జనరల్ కేటగిరీలో పోటీపడే అవకాశం ఉంది. దీన్ని కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ పక్కన బెట్టారు. ఇందువల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో ఆ వర్గాలవారు సీట్లు, ఉద్యోగాలు సాధించే అవకాశాన్ని కోల్పోయారు. ఈ విషయంలో ఏం చెబుతారు? ఎంతో అనుభవం ఉన్నవారని, మీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని భావించి మిమ్మల్ని సీఎంగా చేస్తే మీ వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టం, అన్యాయం అంతా ఇంతా కాదు. మీపై వచ్చిన అభియోగాలపై వివరణనిచ్చి ఓట్లడిగితే న్యాయంగా, ధర్మంగా ఉంటుంది. మీరు సంజాయిషీ ఇవ్వనిపక్షంలో మీ పాలన అంతా మోసం, దగా, అక్రమం అని అనుకోవాల్సి వస్తుంది. ఇంటలెక్చ్యువల్స్ ఫోరం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం ప్రొ‘‘ ఎల్. వేణుగోపాలరెడ్డి, మాజీ వైస్ ఛాన్సలర్, ప్రొ‘‘ ఈ. విశ్వనాథరెడ్డి, ప్రొ‘‘ ఆర్. నాగభూషణరావు, ప్రొ‘‘ నల్లా బాబయ్య, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రొ‘‘ డి.బి.ఆర్.ఎన్.కె. బెనర్జీ, ప్రొ‘‘ డి. ప్రభాకరరావు, ప్రొ‘‘ డి. సువర్ణరాజు, ప్రొ‘‘ కె.తిమ్మారెడ్డి, ప్రొ‘‘ పి. తారాకుమారి -
సాంస్కృతిక సమ్మేళనం.. ప్రగతికి కీలకం
సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం తెలంగాణ ప్రగతికి కీలకమని, అభ్యుదయ రాష్ట్రంలో సాహితీ వేడుకలు ఓ భాగంగా మారాయని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సాహితీవేత్తలు, రచయితలు. మేధావులు హైదరాబాద్ వేదికగా అనేక అంశాలపైన మాట్లాడుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చర్చలు రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయన్నారు. హైదరాబాద్ సాహిత్యుత్సవం తొమ్మిదో ఎడిషన్ వేడుకలు శుక్రవారం బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది సాహితీప్రియులు, కవులు, రచయితలు, చిత్రకారులు, వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో ఇలాంటి వేడుకలు ఒక భాగమన్నారు. మరోవైపు శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని చెప్పారు. ఐదు లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకొనేవిధంగా భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేశామని చెప్పారు. పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, వివిధ భాషల సాహిత్యంపైన ఇలాంటి సదస్సులు నిర్వహించడం సంతోషకరమన్నారు. తాను నేర్చుకుంటున్న చైనీష్లోనూ, గుజరాతీ భాషలో కొద్దిసేపు మాట్లాడి ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. హెచ్ఎల్ఎఫ్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్కుమార్, అజయ్గాంధీ, కిన్నెరమూర్తి, తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం వివిధ అంశాలపైన సదస్సులు జరిగాయి. భారత్, చైనా బంధం బలోపేతమవ్వాలి భారత్, చైనా మధ్య సాంస్కృతిక, సాహిత్య సంబంధాలు కొనసాగాలని చైనా రచయిత ఎ.లాయ్ అన్నారు. ‘సమకాలీన చైనీస్ సాహిత్య ధోరణులు’ అంశంపై జరిగిన ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేవలం హిమాలయ పర్వతాలు మాత్రమే విడదీసే రెండు గొప్ప పొరుగు దేశాల మధ్య ఉండాల్సినంత సాహిత్య బంధం లేదనీ, రామాయణం, కొన్ని టాగూర్ పద్యాలు, భారతీయ నవలలు, పాత సినిమాల జ్ఞానంతో తాను ఇక్కడికి వచ్చాననీ తెలిపారు. సంస్కృతం నుంచి అనువాదమైన ఎన్నో బౌద్ధ రచనలు చదివిన జ్ఞానం భారతీయ స్నేహితులతో సంభాషించడానికి సరిపోతుందని చమత్కరించారు. చైనా ప్రభుత్వం రచయితలను నియంత్రించడం లేదనీ, స్వేచ్ఛగా రాయగలుగుతున్నామనీ చెప్పారు. నాజూకుదనం గురించి జరుగుతున్న విపరీత ప్రచారం, చైనా స్త్రీల జీవితంలో తెస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు నవలా రచయిత్రి జి షుయిపింగ్ చైనా రచయితలు గ్వాన్ రెన్షామ్, రంగ్ రంగ్, బెయ్ తా పాల్గొన్నారు. గుజరాతీ సాహిత్యంపై గాంధీ ముద్ర గుజరాతీ సాహిత్యం మహాత్మా గాంధీజీపైన ఎంతో ప్రభావం చూపిందని, అలానే ఆయన ప్రభావంతో అది మరింత సుసంపన్నమైందని ప్రముఖ గుజరాతీ రచయిత సితాన్షుయశస్చంద్ర అన్నారు. ‘గాంధీకి ముందు, గాంధీతోపాటు, గాంధీ తరువాత గుజరాతీ సాహిత్యం’అన్న అంశంపైన ఆయన మాట్లాడారు. గుజరాతీ సాహిత్యంలో నర్సిమెహతాను ప్రాచీన కవిగా పరిగణిస్తారని, అప్పటి సమాజాన్ని ఉన్నదున్నట్లుగా మాత్రమే ఆయన తన సాహిత్యంలో ప్రస్తావించారని చెప్పారు. భారతీయ సాహిత్యాన్ని దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో పరిచయం చేసిన ఘనత గాంధీకే దక్కుతుందన్నారు. అనంతరం ‘గాంధీ సమకాలీనత’అనే అంశంపై జరిగిన మరో చర్చలో డాక్టర్ శంభూప్రసాద్, సుధీర్చంద్ర తదితరులు మాట్లాడారు. జాతీయోద్యమ నిర్మాణంలో, గ్రామస్వరాజ్యంలో ఆయన ప్రతిపాదించిన వ్యూహాలు, ఎత్తుగడలు ఎప్పటికైనా ఆచరణయోగ్యమైనవేనన్నారు. నోట్ల రద్దు ఒక న్యూక్లియర్ బాంబ్ అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికితీత లక్ష్యంగా రాత్రికి రాత్రి ఒక న్యూక్లియర్ బాం బులా పేల్చిన పెద్ద నోట్ల రద్దు ఆ లక్ష్యాన్ని ఏ మాత్రం నెరవేర్చలేదని ప్రజలు అనేక రకాల బాధలను, ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చిందని ప్రముఖ ఆర్థికవేత్త రామ్మోహన్రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు చర్య అని పేర్కొన్నారు. ఆర్బీఐ సైతం నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పిందన్నారు. నగదు వల్ల అవినీతి ఉండదని, కేవలం హవాలా వల్లనే అవినీతి జరుగుతుందన్నారు. విజయ్మాల్యా, నీరవ్మోదీల ఉదంతాలే అం దుకు నిదర్శనమన్నారు. మరోవైపు ‘మీ టూ’ పైన జరిగిన చర్చలో చిన్మయి, సంధ్యామీనన్, సుతాపపాల్లు మాట్లాడారు. వైరి ముత్తు వేధింపుల అంశాన్ని బయటపెట్టిన తరువాత తనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాడి జరిగిందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. మగవారిపై వచ్చే ఫిర్యాదులను సమాజం వెం టనే మరిచిపోతుందని, చాలా విషయాల్లో మహిళలనే ఎత్తుచూపడం వ్యవస్థీకృతమైన లోపమని సంధ్యామీనన్ అన్నారు. వేడుకలలో ఏర్పాటు చేసిన చైనా, గుజరాతీ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరలేదు మిషన్ కాకతీయ చేపట్టినప్పుడు తెలంగాణ నీరున్న రాష్ట్రంగా మారుతుందని ఆశించానని, కానీ ఈ పథకం కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లడం వల్ల అవినీతిమయమైందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మిషన్ కాంట్రాక్టర్ల చేతికి వెళ్లకముందు దేశంలోకెల్లా అద్భుతమైన ప్రాజెక్టుగా భావించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికయినా కాంట్రాక్టర్లను పక్కన పెట్టి కమ్యూనిటీకి ఆ పనులు అప్పగిస్తే పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు. -
అల్ప సంతోషి
ఒకప్పుడు నీలగిరి కొండల్లో శతానందుడనే మహర్షి గురుకులం నడిపేవాడు. దూరప్రాంతాల నుంచి అక్కడ విద్యను అభ్యసించేందుకు చాలామంది విద్యార్థులు వచ్చేవారు. కొన్నాళ్లు ఆశ్రమంలోనే ఉండి విద్యాభ్యాసం పూర్తయ్యాక తమ తమ ఊర్లకు వెళ్లిపోయేవారు. అవంతిపురం రాజ్యానికి చెందిన అనంత శర్మ అనే యువకుడు కూడా ఆ ఆశ్రమంలో ఉండి చదువుకునేవాడు. అనంతశర్మ ఆశ్రమంలో ఉన్న విద్యార్థుల్లో కెల్లా తెలివైనవాడు. అయితే మహా గర్వి. తను తెలివైనవాడు గనుక అందరూ తనను గౌరవించాలనుకునేవాడు. ముఖ్యంగా గురువు తనను ప్రత్యేకంగా చూడాలనుకునేవాడు. కానీ శతానందుడు అతన్ని మిగతా విద్యార్థులతో సమానంగా చూసేవాడు. ఆయన ధోరణి అనంతశర్మకి నచ్చేది కాదు. ఓ రోజు శతానందుడు ఆశ్రమంలో తన విద్యార్థులకు సాత్విక జీవన విధానం గురించి బోధిస్తున్నాడు. ‘‘మనుషుల మధ్య ఎన్ని అంతరాలున్నా దేవుడి ముందు అందరూ సమానులే! ఉన్నత కులస్తులు, ధనవంతులు, మేధావులు తమని తాము గొప్పవారిగా భావించకూడదు. ఇతరుల కన్నా తమకు ఎక్కువ మర్యాదలు, సౌఖ్యాలు లభించాలని ఆశించకూడదు. దొరికినదానితో తృప్తి పడి జీవించడం అలవాటు చేసుకోవాలి. అలా అల్ప సంతోషిగా జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు’ అంటూ బోధించాడు. గురువుగారి మాటలు అనంత శర్మకు రుచించలేదు. ‘గురుదేవా..! మన సామర్థ్యానికి, తెలివితేటలకు తగ్గ ప్రతిఫలం పొందటం మన హక్కు కదా!? దాని కోసం ఆశించడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను’ అన్నాడు. ‘‘ఆశించడంలో తప్పులేదు కానీ ఆ ఆశ అత్యాశగా మారకూడదు. తెలివైన వారు పని చెయ్యటం కోసం తమ తెలివిని ఉపయోగించాలి గానీ ప్రతిఫలం పొందటం కోసం ఉపయోగించకూడదు. అలా చేస్తే కొన్నిసార్లు దొరికిన ప్రతిఫలం కూడా చేజారిపోవచ్చు’’ అంటూ అనంత శర్మకు బోధించాడు శతానందుడు. ఆశ్రమ నియమాల ప్రకారం అక్కడ చదువుకొనే విద్యార్థులు వ్యవసాయపనులు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో చుట్టుపక్కల గల పొలాలకు వెళ్లి అక్కడ రైతులకు సేద్యపు పనుల్లో సాయపడాలి. దీనివల్ల రైతుల కష్టాల గురించి విద్యార్థులకు తెలుస్తుంది. ఓ రోజు గురువు ఆదేశానుసారం విద్యార్థులంతా ఓ రైతు పొలంలో పని చేశారు. ఆ రైతు పొలంలో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ రైతు బాగా పండిన పళ్లను బుట్టనిండా కోసుకొచ్చి గురువుగారికి అందించాడు. శతానందుడు తానొక పండు తీసుకుని మిగతా పండ్లను ఒక్కొక్కరికీ ఒక్కటి చొప్పున పంచమని అనంతశర్మను ఆదేశించాడు. ఆ బుట్టలో ఒక పెద్ద పండు ఉండటం అనంత శర్మ గమనించాడు. మిగతా పండ్లు చిన్నగా ఉన్నాయి. అనంతశర్మ అందరికీ చిన్న పండ్లు పంచి తాను పెద్ద పండు తీసుకొన్నాడు. మిగతా పండ్లను రైతుకిచ్చేశాడు. తర్వాత అందరూ పండ్లు తిన్నారు. అందరి పండ్లు తియ్యగా ఉన్నాయి. కానీ అనంతశర్మ తీసుకున్న పెద్ద పండు మాత్రం పుల్లగా ఉంది. దాన్ని తినలేక అతను పండును పారవేశాడు. అది గమనించిన శతానందుడు ‘‘చూశావా శర్మా? మిగతా వారి కన్నా ఎక్కువ ప్రతిఫలం పొందాలని నువ్వు పెద్ద పండు తీసుకున్నావ్. కానీ అది తినటానికి పనికి రాకుండా పోయింది. కొన్ని సార్లు అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుందనటానికి ఇదే ఉదాహరణ. అందుకే దొరికిన దానితో తృప్తి పడాలని పెద్దలంటారు. అల్ప సంతోషిగా జీవించే వ్యక్తికి జీవితంలో అసంతృప్తి అనేదే ఉండదు’’ అంటూ హితబోధ చేసి ఆనక రైతుకి చెప్పి అనంతశర్మకు మరో పండు ఇప్పించాడు. అలా జ్ఞానోదయమైన అనంతశర్మ ఆ నాటి నుంచి గర్వాన్ని, అత్యాశను విడిచి అల్ప సంతోషిగా ఉంటూ తృప్తిగా జీవించసాగాడు. -
హత్యాయత్నం కుట్రతో చేసిందే
-
భారతీయ బాలల మేధస్సుకు లెడ్ ముప్పు
మెల్బోర్న్: లెడ్.. దీనినే మనం సీసం అంటాం. ఇది ఒక రసాయన మూలకమని మనందరికీ తెలుసు. లెడ్ మానవ శరీరంలోకి వెళ్తే అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన రసాయనం భారతీయ విద్యార్థులపై చెడు ప్రభావం చూపుతోందని తాజా అధ్యాయనల్లో వెల్లడైంది. రక్తంలో అధికంగా ఉన్న లెడ్ పరిమాణం భారతీయ చిన్నారుల మేధోసంపత్తిని, వారి ఐక్యూ స్థాయిలను హరిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మాక్యూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. భారతీయ చిన్నారుల రక్తంలోని లెడ్ స్థాయిలను తొలిసారి విశ్లేషించారు. అధ్యయన వివరాలు ప్రకారం... గత అధ్యయనాల్లో తేలిన దాని కంటే తాజా పరిశోధనలో లెడ్ పరిమాణం గణనీయంగా పెరిగింది. అది పిల్లల్లో మేధో వైకల్యానికి కారణమవుతోంది. ఈ విషయమై మాక్యూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బ్రెట్ ఎరిక్సన్ మాట్లాడుతూ... ‘చిన్నారుల 100 మిల్లీ లీటర్ల రక్తంలో 7 మైక్రోగ్రామ్ల పరిమాణంలో లెడ్ ఉంటే వారి ఐక్యూపై ప్రతికూల ప్రభావం పడుతోందని మా పరిశోధనలో తేలింది. బ్యాటరీలను కరిగించడం (బ్యాటరీ స్మెల్టింగ్) వల్ల భారత్లో అధిక స్థాయిలో లెడ్ విడుదలవుతోంది. దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. వాహనాలు వాడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం, వాటిలో ఉపయోగించే బ్యాటరీల జీవిత కాలం రెండేళ్లే కావడంతో... బ్యాటరీలను అధికంగా రీసైక్లింగ్ చేస్తున్నారు. దీని కారణంగా ముఖ్యంగా పట్టణ ప్రాంత్లాలో వాయుకాలుష్యం బాగా పెరుగుతోంది. దీంతో లెడ్ వాతావరణంలోకి అధిక స్థాయిలో చేరుతోంది. ఇది పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంద’న్నారు. కేవలం లెడ్ మాత్రమే కాకుండా కొన్ని అయుర్వేద ఔషధాలతోపాటు, నూడుల్స్, సుగంధద్రవ్యాల వల్ల కూడా రక్తంలో లెడ్ పరిమాణం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టి లెడ్ తాలూకు దుష్ఫలితాలను నియంత్రించాలని సూచిస్తున్నారు. -
మౌలిక లక్షణం మలినం కారాదు
ఇక మేధావులు ప్రవచించే సెక్యులరిజంతో వచ్చిన చిక్కేమిటంటే, అసలు అది ఆ సిద్ధాంతం మౌలిక లక్షణాలనే సర్వ నాశనం చేసింది. మేధావులనేవారు సాధారణ ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, భాష నుంచి సుదూరంగా జరిగిపోయారు. ఇలాంటి మేధావుల చర్చలు ప్రధానంగా ఇంగ్లిష్ చానల్స్లో ఉంటాయి. కాబట్టి సెక్యులర్ అన్న ఆంగ్ల పదానికి భారతీయ భాషలలో సరైన అర్థం కనిపించదు. అధికారికంగా ఇచ్చిన అనువాదం ‘ధర్మ నిరపేక్షత’. కానీ ఈ అనువాదం దుర్వా్యఖ్యానంలా కనిపిస్తుంది. మన దేశంలో జరిగే చాలా బహిరంగ చర్చలు ఎలా ఉంటాయంటే, అవి బధిరుల సంభాషణలను మరిపిస్తూ ఉంటాయి. ఈ చర్చలు ప్రతి నాయకుల మధ్య జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శత్రువుల మధ్య సాగుతూ ఉంటాయనవచ్చు. వాదనలోని ఏ ఒక్క విషయాన్ని అంగీకరించకూడదని భీష్మించుకుని కూర్చున్నట్టే వారు ఉంటారు. ద్వంద్వ యుద్ధంలో ప్రత్యర్థిని ఓడించి తీరాలన్న పట్టుదలతో చర్చకు దిగినట్టు ఉంటుంది. ఇక మిత్రులైతే ఒకరి వాదనను ఒకరు బహి రంగంగా నిరాకరించుకోరు. అందుకే మన టీవీ చర్చలన్నీ అలా చెవులు చిల్లులు పడేటట్టు ఉంటాయి. చాలా చర్చలు సమర నాదాల తోనే సాగుతాయి. ఇంకా, దశ దిశ లేకుండా ఉంటాయి. ఈ కారణం గానే ఈ మధ్య ‘మైనారిటీల స్థితిగతులు’ అన్న అంశం మీద జరిగిన ఒక చర్చను చూశాక ముచ్చటగా అనిపించింది. సెక్యులర్వాద కార్య కర్తలు, మేధావులు కొందరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఆ అంశం మీద తమ తమ విభేదాల గురించి వెల్లడించారు. ప్రముఖ సామాజిక, మానవ హక్కుల కార్యకర్త హర్షమందిర్ రాసిన వ్యాసంతో ఈ చర్చ ఆరంభమైంది. ఆరోగ్యకరమైన చర్చ అవశ్యం ముస్లింల పార్టీ అన్న ముద్ర పడడం వల్లనే మొన్నటి సాధారణ ఎన్ని కలలో కాంగ్రెస్ ఓటమి పాలైందంటూ ఆ మధ్య ఇండియాటుడే పత్రిక నిర్వహించిన గోష్టిలో ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ చేసిన ప్రకటన ఆధారంగా హర్ష ఆ వ్యాసం రాశారు. సోనియా అభిప్రాయానికి మరొక ఉదంతం కూడా జోడించారు. ఒక సందర్భంలో ముస్లింలను బురఖా, టోపీ లేకుండా రావాలంటూ చెప్పిన ఉదంతమది. ముస్లింలు ఈరోజు రాజకీయ అనాథలుగా మిగిలిపోయారని ఆయన వాదన. కానీ ప్రముఖ చరిత్రకారుడు, ఉదారవాద మేధావి రామచంద్ర గుహ దీనితో విభేదించారు. బురఖా ధరించడం ముస్లింల వెనుకబాటుతనానికి ప్రతీకగా కనిపిస్తుందనీ ఉదారవాదులైన మేధావులు ఎవరూ దానిని ఎట్టి పరిస్థితులలోను సమర్థిం చరాదనీ గుహ అభిప్రాయం. ఇంకా సుహాస్ పాల్షికార్, ఇరేన్ అక్బర్, ముకుల్ కేశవన్ వంటి మేధావులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అయితే, అసలే ముస్లింలు పెద్ద సవాలును ఎదుర్కొంటున్న తరుణంలో ఇలాంటి చర్చ జరగడం గురించి కొందరు మేధావులు కలత పడి ఉండవచ్చు. దీనిని నేను అంగీకరించను. ఎందుకంటే, తమని తాము ఆత్మశోధన చేసుకోవడానికి కష్ట కాలమే మంచి అవకాశం ఇస్తుంది. ఆచరణ ఎలా ఉందన్నదే ప్రశ్న సిద్ధాంతపరంగా, ఆచరణ స్థాయిలో సెక్యులరిజం ఎలా ఉన్నదీ అనే అంశం గురించి నిజాయితీగా చర్చించుకోవలసిన అవసరం ఉంది. ఇలాంటి చర్చ అనివార్యంగా జరగాలి కూడా. ఎందుకంటే మన గణతంత్ర రాజ్యం నిర్దే శించుకున్న పవిత్ర సిద్ధాంతం సెక్యులరిజం. 1975లో సెక్యులరిజం అన్న పదాన్ని మన రాజ్యాంగ పీఠికలో లాంఛనంగా చేర్చుకుని ఉండవచ్చు. కానీ మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కీలక భాగమది. సెక్యులర్ కాని భారతదేశాన్ని మనం ఎంచుకోలేదు. అయినప్పటికీ ఆచరణలో ఈ పవిత్ర సిద్ధాంతం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది. ఇందుకు కారణం సెక్యులరిజం ఆచరణాత్మకంగా, సిద్ధాంతపరంగా రెండు మౌలిక దోషాలతో ఉంది. వాటి గురించి నిజాయితీతో బహిరంగంగా చర్చిండానికి ఇదే అను కూల సమయం. ఆ రెండింటిని రాజకీయ సెక్యులరిజం సమస్య, మేధావుల సెక్యులరిజం సమస్య అనుకోవచ్చు. సెక్యులరిజాన్ని రాజకీయ రంగం పర స్పర విరుద్ధంగా, పక్షపాత దృష్టితో, ఒక సాధనం అన్న ధోరణి నుంచే ఆచ రిస్తుండడం మొదటి సమస్య. ఏదైతే మైనారిటీల హక్కుల పరిరక్షణే ఆశ యంగా మొదలైందో, కాలగమనంలో అదే ఇతరుల బలహీనతలను ఆధారం చేసుకుని మైనారిటీ మేధావులు ప్రయోగించడానికి ఉపకరించే సాధనంగా మారిపోయింది. వాస్తవాల వెల్లడిలో దాపరికమేల? మెజారిటీ మతోన్మాదం, మైనారిటీ మతోన్మాదం మధ్య వైరుధ్యాన్ని శాస్త్ర బద్ధంగా వివరించేందుకు ప్రారంభమైన ఆలోచనే, ఇప్పుడు ముస్లిం మైనా రిటీలను మతోన్మాద పంథాలో కదిలించడానికి జరుగుతున్న ప్రయత్నం నుంచి, వారిలో వ్యక్తమవుతున్న పురోగమన వ్యతిరేకతల నుంచి మన దృష్టిని మళ్లించేదిగా పరిణమించింది. హిందూ సామాజిక విధానంలోని రుగ్మతలను బాహాటంగా చర్చించడానికి చర్చలూ, అందులోని అవాంఛనీయ పరిణామా లను గురించి చెప్పడానికి ఒక విమర్శకుడు కనిపిస్తున్నారు. కానీ ఇతర మతా లలో కనిపించే అలాంటి రుగ్మతలను, అవాంఛనీయ పోకడలను చర్చించే విమర్శకులు తరచూ మౌన ప్రేక్షకులై పోతున్నారు. హిందువులు, వారి సంస్థలు చేస్తున్న దుర్మార్గాల మీద దాడి జరుగుతుంది. శల్యపరీక్షలు జరుగు తాయి. అదే విధంగా ఒక చర్చి, లేదా గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సంస్థలు చేసిన దుర్మార్గాల గురించి ఎలాంటి దాడి జరగదు. ఏ విధమైన∙శల్య పరీక్షలు ఉండవు. మైనారిటీలను లాలించడమనే ఆరోపణ తప్పయితే, ఒక సాధారణ ముస్లిం దుస్థితిని గురించి వస్త్వాశ్రయ దృష్టితో చేసిన సూచనలన్నీ కూడా కీడు చేసేవే అవుతాయి. ముస్లిం పురోహిత వర్గాన్ని లాలించడమనేది ఒక చేదునిజం. ఒకవేళ ఆరెస్సెస్, బీజేపీ ముస్లింలను ముస్లింతనానికే పరిమితం చేయాలని కోరుకుంటున్నాయని అనుకుంటే, సెక్యులర్ పార్టీలు చేస్తున్నది కూడా అదే. కొన్నేళ్లుగా సెక్యులర్ పార్టీలు ముస్లింలకు సంబంధించిన సమస్యలను మాత్రమే వెలుగులోకి తెచ్చి, వారి భద్రత గురించి మాత్రమే మాట్లాడి, వారి మత అస్తిత్వం గురించి మాత్రమే చెప్పి వారి ఓట్లను విజయవంతంగా తమ ఖాతాలో వేసుకోగలిగాయి. సాధారణ భారత పౌరులను చేసినట్టు సెక్యులర్ రాజకీయాలు ముస్లింలను ప్రజా సేవలకు, ప్రయోజనాలకు దగ్గర చేయలేదు. వెనుకబడిన ముస్లింలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో, కావలసిన సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో సెక్యులర్ పార్టీల ప్రభుత్వాలు అ«ధికారంలో ఉన్న రాష్ట్రాల చరిత్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల రికార్డు కంటే భిన్నంగా ఏమీ లేదు. ఓటు బ్యాంకు రాజ కీయాలంటూ ఇతరులను విమర్శించే స్థితిలో బీజేపీ లేకపోవచ్చు. కానీ సెక్యులర్ పార్టీలు మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను బందీ లుగా చేసుకుని, వారి ఓట్లను రాబట్టుకోవడానికి సంక్షేమ పథకాల అమలు చేయడం కాకుండా, వారిలో భయాందోళనలు కల్పిస్తున్నారు. సెక్యులర్ పార్టీల ఈ ఘనతను గమనించిన తరువాత సెక్యులరిజం అంటే మైనారిటీ అనుకూల విధానం తప్ప మరొకటి కాదంటూ సంఘ్ పరివార్ చేస్తున్న ప్రచారంలో సాధారణ హిందువులు పడి పోవడం పెద్ద వింతేమీ కాదు. మూలాలను నాశనం చేసిన మేధావులు ఇక మేధావులు ప్రవచించే సెక్యులరిజంతో వచ్చిన చిక్కేమిటంటే, అసలు అది ఆ సిద్ధాంతం మౌలిక లక్షణాలనే సర్వ నాశనం చేసింది. మేధావులనేవారు సాధారణ ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, భాష నుంచి సుదూరంగా జరిగిపోయారు. ఇలాంటి మేధావుల చర్చలు ప్రధానంగా ఇంగ్లిష్ చానల్స్లో ఉంటాయి. కాబట్టి సెక్యులర్ అన్న ఆంగ్ల పదానికి భారతీయ భాషలలో సరైన అర్థం కనిపించదు. అధికారికంగా ఇచ్చిన అనువాదం ‘ధర్మ నిరపేక్షత’. కానీ ఈ అనువాదం దుర్వా్యఖ్యానంలా కనిపిస్తుంది. ఇది ప్రతికూలార్థం ఇచ్చేటట్టుగా కనిపించ డమే కాదు, సాంస్కృతికంగా అస్పష్టంగా అనిపిస్తుంది. సెక్యులర్ మేధావుల మాటలలో ఎక్కువగా తిలక ధారణ, బురఖా వంటి మత, సాంస్కృతిక చిహ్నాల పట్ల నిరసన కనిపిస్తుంది. సెక్యులరిజం, ఆధునిక విద్య మన మత వారసత్వం పట్ల ఒక సామూహిక నిరక్షరాస్యతను పెంచేశాయి. దీనితో జరి గిందేమిటంటే, సెక్యులరిజం అంటే ఏవో విదేశాలకు సంబంధించిన విధానం, పాశ్చాత్య ధోరణులు ఉన్న హేతువాదులకు పరిమితం, మన సంస్కృతీ సంప్రదాయాలలో ఇమిడేది కాదు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తు న్నది. ఈ సిద్ధాంతాన్ని దారుణంగా ఖండిస్తున్నప్పటికీ ఎదురొడ్డి మాట్లాడు తున్నవారు గడచిన రెండేళ్ల నుంచి బాగా తక్కువగా కనిపిస్తున్నారు. ఒక విషయం స్పష్టం చేస్తాను. ఇది సెక్యులరిజంను వ్యతిరేకించడం కాదు. సెక్యులరిజం అనేది గణతంత్ర భారతం అవతరణకు ఆదిలోనే ఏర్ప రుచుకున్న సిద్ధాంతం. మనం ఇప్పుడు పిలుచుకుంటున్న సెక్యులరిజం అనే సిద్ధాంతం నిజంగా సెక్యులరిజంగా ఉండాలంటే, సిద్ధాంత పరంగానే కాకుండా, దాని ఆచరణ తీరును గురించి పునరాలోచించుకోవాలని నా విన్నపం. మనకు కావలసినది పొందికైన, నిబద్ధత కలిగిన రాజకీయ సెక్యు లరిజం. మనకు మేధో సెక్యులరిజం కూడా కావాలి. కానీ అది మన బహు ళత్వ, మత సంప్రదాయాల మూలాలు కలిగినదై ఉండాలి. ఇందుకు మనం గాంధీజీ నుంచి కొంత నేర్చుకోవలసి రావచ్చు. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్: 98688 88986 -
రాజకీయ వ్యంగ్యం.. ఆయుధం
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ట్వీటర్లో ప్రధాని మోదీని అనుసరించే వారి సంఖ్య 3.6 కోట్లకు పైమాటే. ఇంతలా మోదీ నెటిజన్లను ఆకర్షించడానికి గల కారణాలేమిటో తెలుసుకునేందుకు అమెరి కాకు చెందిన ఓ యూనివర్సిటీ పరిశోధన నిర్వహించి.. అసలు రహస్యాన్ని శోధించింది. మోదీ తన ట్వీట్లలో రాజకీయ వ్యంగ్యం, చతురత వంటి అంశాలను ఉపయోగించి నెటిజన్లను ఆకర్షిస్తూ.. తన రాజకీయ శైలిని పునరుద్ధరించుకున్నారని మిచిగాన్ వర్సిటీ వెల్లడించింది. దీనికోసం వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కు చెందిన పరిశోధకులు మోదీ గత ఆరేళ్ల కాలంలో చేసిన దాదాపు 9 వేల ట్వీట్లను విశ్లేషించారు. రాహుల్ గాంధీ, క్రికెట్, వినోదం, వ్యంగ్యం, అవినీతి, అభివృద్ధి, విదేశీ వ్యవహారాలు, హిందూ మతం, శాస్త్ర–సాంకేతికత వంటి 9 వైవిధ్య భరితమైన అంశాలు మోదీ ట్వీట్లలో ఉండేవని వారు వెల్లడించారు. -
ప్రభుత్వ తప్పులను మేధావులు ప్రశ్నించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, తప్పులను మేధావు లు ప్రశ్నించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారా ల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా పేర్కొన్నారు. ప్రశ్నించకుంటే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థక మవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రొఫెషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మేధోమథనం జరగాలని, చర్చ జరిగిన ప్పుడే అలాంటి విషయాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, జీడీపీ తదితర అం శాలపై మేధావులు ప్రత్యేక చర్చలు నిర్వహించా లన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ మేధావులు ప్రత్యక్ష రాజకీ యాల్లోకి రావాలని, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిం చకపోతే పాలకులు నియంతలుగా మారుతారని అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాల నపై మేధావులు బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. తర్వాత ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసో జు శ్రవణ్ను సన్మానించారు. సమావేశంలో గీతారెడ్డి, మల్లురవి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ను గద్దెదించాలి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి ప్రజల ఆకాంక్షలను నేరవేర్చకుండా నియంతలా పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి పిలుపునిచ్చారు. లంబాడా హక్కు ల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘మేమెంతమందిమో–మాకంత వాటా’పై ఉమ్మడి రాష్ట్ర సదస్సును ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో నిర్వహించగా వారు హాజరై మాట్లాడారు. గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లకు జీవో ఇచ్చి తక్షణమే అమలు చేయాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన దళితులు, గిరిజనులు, నిరుద్యోగుల ఆంకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్న సర్కార్ మెడలు వంచేందుకు పోరుబాట పట్టాలన్నారు. -
భవిష్యత్తును చక్కదిద్దుకునే బాటలు
ఆత్మీయం మన పూర్వీకులు ఎంతో మేధావులు. దూరదృష్టి కలిగిన వారు. వారు ఏర్పరచిన ఆచార సాంప్రదాయాలన్నీ మానవాళికి మార్గదర్శకాలు. పురాణాలు, ఇతిహాసాలను లోతుగా పరిశీలిస్తే ఒక మనిషి ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి, సమాజ పురోగతికి తోడ్పడే ఎన్నో అంశాలు ఉపాఖ్యానాల రూపంలో దర్శనమిస్తాయి. ఇందులో స్త్రీపాత్రలు ఉన్నత విలువలతో, సమాజాన్ని ముందుకు నడిపించడంతో పాటు చక్కని సందేశాలనిస్తాయి. ముఖ్యంగా పతివ్రతల కథలు స్త్రీల అభ్యుదయానికి మేలుకొలుపుల వంటివి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోనివారు మాత్రమే ఈ కథలు. స్త్రీ స్వేచ్ఛకు ప్రతిబంధకాలని అనుకుంటారు. అయితే ఆయా పురాణాలలోని పతివ్రతలందరూ ఎన్నో విధాలైన కష్టాలు పడినట్లు ఉన్నా, ఎవరూ కూడా అబలలమని కన్నీరు కారుస్తూ చతికిలపడలేదు. విధినే ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించారు. కన్నవారు, కట్టుకున్నవాడు, సమాజం, చివరకు ప్రార్థించే భగవంతుడు... ఇలా ఎవరివల్ల ఆపద వాటిల్లినా, తాము నమ్ముకున్న సత్యాన్ని ఆచరించడంలో వెనుకడుగు వేయని ఆ ధీరత్వం ముందు సర్వజగత్తు తలవంచి దాసోహమనేలా చేసుకున్న ఆ స్త్రీల ఆత్మస్థైర్యం ఆదర్శప్రాయం. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో ఆటంకాలు, ఒడుదుడుకులు ఎదురౌతాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని చిన్నతనంనుండే నూరిపోసే క్రమంలో భాగంగానే ఆనాటి పెద్దలు, పురాణాలలోని పతివ్రతల కథలు చెప్పడం వారిని స్మరిస్తూ నోములు–వ్రతాలు చేయించడం అనే ఆచారాలు ఏర్పరచారు. ఆలోచిస్తే...పెద్దల అడుగుజాడలలో ఎందుకు నడవాలో అవగతం అవుతుంది. వారు చెప్పినట్లు పురాణాలు, రామాయణ, భారత భాగవతాలు చదివితే భవిష్యత్తుకు కావలసిన పాఠాలు నేర్చుకుంటారనే తప్ప వారినేదో చదువులేని దద్దమ్మలుగా వంటింటి కుందేలుగా చేయడానికి కాదు. -
దళితులను చీల్చేందుకు కుట్ర
– మాల మేధావుల ఫోరం కర్నూలు(అర్బన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని మాల మేధావుల ఫోరం నాయకులు ఆరోపించారు. ఆదివారం రాత్రి స్థానిక సీక్యాంప్ సెంటర్లోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సీనియర్ దళిత నేత వై. జయరాజ్, అంబేద్కర్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు వి. త్యాగరాజు, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. నాగరాజు, డీఎస్పీ జయచంద్ర, మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు అశోకరత్నం, మాధవస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగాల్లో 1 శాతం మాత్రమే అభివృద్ధి చెందిన వారు ఉన్నారని, ఇంకా మిగిలిన 99 శాతం దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ఒక శాతంలో ఉన్న తేడాలతో 99 శాతంగా ఉన్న దళిత ప్రజలను విభజించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మనువాదులు కొందరు మంద కృష్ణమాదిగతో కుమ్మక్కై దళితులను విభజించాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దళితులను ఒక రాజకీయ శక్తిగా ఎదగనీయకుండా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాదిగల ధర్మయుద్ధ సభలో అధర్మ ప్రకటన చేశారని ఆరోపించారు. సమీక్షలో పలు సంఘాలకు చెందిన నాయకులు సలోమి, హెచ్ బాలస్వామి, మునిస్వామి, యాట ఓబులేసు, సుబ్బరాయుడు, జయరాములు తదితరులు పాల్గొన్నారు. -
బెటర్ తల
దేవుడు సృష్టించింది కొన్ని నాణ్యమైన తలలే! తక్కినవాటిని జుట్టుతో కప్పేశాడు! సినిమాలో ఒక జోక్: డాక్టర్: రెండు నెలల్లో నీకు బట్టతల గ్యారంటీ. ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నావ్? హీరో: స్ట్రెస్ వల్ల డాక్టర్. డాక్టర్: అవునా. స్ట్రెస్ ఎందుకు? హీరో: జుట్టు రాలిపోతోందని... ఆడవాళ్లు అనేక కారణాలకు స్పృహ తప్పుతారు. మగవాడు మాత్రం ఒకే ఒక కారణానికి కెవ్వుమంటాడు. అదేమిటో తెలుసా? అద్దంలో బట్టతల. దువ్వుకునేటప్పుడు వెంట్రుకలు రాలుతూ కనిపించినా నుదురు పైకి పాకుతూ కనిపించినా అందరికీ వెన్నులో చలి పుట్టొచ్చుగాని మగవాడికి మాత్రం మాడులో చలిపుడుతుంది. పుర్రె బయటపడుతుందేమోననే వెర్రి భయం పట్టుకుంటుంది. అసలు కేశంకు కొంచెం ‘ల’ వత్తు తగిలిస్తే క్లేశం వస్తుంది. అంటే దేవుడు కేశంలోనే క్లేశం పెట్టాడన్న మాట. శివుడికి బట్టతల ఇష్యూ లేదు. ఆయనది చిక్కుముడుల తల. పైగా గంగమ్మ ఏసి ఒకటి రన్ అవుతూ ఉంటుంది. విష్ణుమూర్తికి హెయిర్లాస్ ప్రాబ్లమ్ ఉన్నట్టు లేదు. కిరీటాన్ని హెల్మెట్లా పెట్టుకున్నాక కూడా మనకు జులపాల జుట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఇక బ్రహ్మదేవునికి నాలుగు తలలతోపాటు నాలుగు గడ్డాల నిండుగా కూడా కేశాలు కళకళలాడుతూ ఉంటాయి. మరి ఈ ముగ్గురు దేవుళ్లకు లేని బాధ సగటు మగవాడికి ఎందుకు? బ్రహ్మ సృష్టించిన మగ ప్రాణికి ఎందుకు? ఒకవేళ ఇచ్చెనుపో... స్త్రీ జాతికి మగవాడి శిరోజాల మీదే దృష్టి పెట్టడం ఏలా? తరాల నుంచి వారికి మగవాడి ముఖం మీద కంటే తల మీద ఉన్న జుట్టు మీదే ఆసక్తి ఎక్కువ. ‘దీర్ఘ కేశములవాడు’... అని వారు మురిసిపోతారు. ‘నల్లని కురులవాడు’ అని మనసు పారేసుకుంటారు. ‘నీలాల ముంగురులవాడు’ అంటూ మఖ్మల్ పత్రం పై నెమలి ఈకతో లవ్ లెటర్ రాస్తారు. ఏం జుట్టు లేనివాడు మనిషి కాడా? జుట్టున్న నాగార్జున మాత్రమేనా మన్మథుడు? ఇలా ఎవరు నిలదీయాలి? ఈ లోకం కళ్లు ఎవరు తెరిపించాలి? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్చ్. బట్టతల ఉంది. కేన్సిల్. ఎన్.ఆర్.ఐ... అమెరికాలో పెద్ద ఉద్యోగం. నో. పైన ఎకరం పోయింది. కేన్సిల్. బాగా వెనకేసుకున్నాడు.... బోనస్గా అత్తమామలు ఆడపడుచులు కూడా లేరు. నెవర్. ట్వంటీ ట్వంటీ మేచ్ ఆడటానికి సరిపడా గ్రౌండ్ ఉంది నెత్తి మీద కేన్సిల్. గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్. నోనో... ఆ ఓపెన్ టాప్వాడు సెల్ఫీకి పనికిరాడు... కేన్సిల్. ఇంతకీ ఏంటంటావ్. ఎవరినైనా తేండి... కాని నెత్తి మీద జుట్టున్నవాణ్ణి తేండి. ఇలా మాట్లాడేవాళ్ల మీద పరువు నష్టం దావా వేసే చట్టం ఎందుకు రాదు? దీని కోసం ఓపిక చేసుకుని అన్నా హజారే కాని ఓపిక లేకపోయినా అరవింద్ కేజ్రీవాల్గాని ఎందుకు పోరాటం చేయరు. బట్టతల ఉన్న సహోదరులారా... పోరాడండి... పోరాడితే పోయేదేమీ లేదు... మిగిలిన ఆ కాస్తంత జుట్టు తప్ప. మగవాడు పుట్టింది దేని మీదైనా సరే కాలు దువ్వడానికి కాని జుట్టు దువ్వడానికి కాదు. జుట్టు ఉన్నా పౌరుషమే. జుట్టు లేకపోయినా పౌరుషమే. అసలు బట్టతల వల్లే ఈ సమాజం నడుస్తోందని రూఢీగా చెప్పవచ్చును. సమాజం నడవాలంటే మేధావులు కావాలి. మేధావులుగా ఎవరైనా మారాలంటే వారికి బట్టతల రావాలి. అందుకే అన్నారు పెద్దలు ‘బట్టతలవాడు బ్రహ్మవిద్యలు నేర్చున్’ అని. బట్టతల వాళ్లకు ఉన్న అడ్వాంటేజెస్ ఎవరికి ఉన్నాయి. బార్బర్ ఖర్చు లేదు. తలస్నానానికి షాంపు ఖర్చు లేదు. జేబులో దువ్వెన ఖర్చు లేదు. పేల భయం లేదు. ఇన్నేలా? చాలామంది మగవాళ్లు తమ జుట్టును తీసుకెళ్లి భార్య చేతిలో పెడతారు. కాని బట్టతల ఉన్నవాళ్లు ఆత్మాభిమానం కలిగిన భర్తల్లా నిర్భీతితో మెలుగుతారు. బట్టతల కలిగినవారు నిస్వార్థపరులు. ఈ సంగతి ఉదాహరణతో సహా నిరూపించవచ్చు. చరిత్రలో ఎంతోమంది బట్టతల సైంటిస్ట్లు ఉన్నారు. వాళ్లంతా మానవ కల్యాణం కోసం ఆవిష్కరణలు చేశారే తప్పితే తమ బట్టతల మీద జుట్టు మొలిపించే ప్రయోగాలకు పోలేదు. థామస్ ఆల్వా ఎడిసన్కు సంపూర్ణ బట్టతల. కాని అతడు తన బుర్రలో వెలిగిన ఐడియాను బయట బల్బ్లా వెలిగించాడు కాని తలుచుకుంటే బట్టతల మీద బొచ్చు మొలిపించుకోలేక కాదు. ఆ సంగతి చేతకాకా కాదు. వద్దనుకున్నాడంతే. ఇక చాలు. బట్టతల ఉన్నందుకు సమాజం మగవాణ్ణి వెంటాడింది చాలు. యుగాలుగా మగవాడు సమాజానికి భయపడి తన బట్టతలను దాచుకున్నాడు. కిరీటాలు పెట్టాడు. తల పాగాలు చుట్టాడు. టోపీలు ధరించాడు. తల గుడ్డ కట్టాడు. స్కార్ఫ్ల్లో తలను దాచుకున్నాడు. కాని ఇక అక్కర్లేదు. నా బట్టతలే నా అందం. నా బట్టతలే నా సంస్కారం. నా బట్టతలే నా గౌరవం. నా బట్టతలే నా ఆభరణం అని ఇప్పుడు బట్టతలను ఓన్ చేసుకుంటున్నాడు. అసలు ఏకంగా బట్టతల చుట్టూ ఉన్న ఇతర వెంట్రుకలను కూడా తొలగించి బోడి గుండుతో తిరుగుతూ అదే ఫ్యాషన్గా నిరూపించుకోగలుగుతున్నాడు. 20 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లు బట్టతలతో లేదా బోడి గుండుతో కనిపించడం వారి శారీరక దృఢత్వానికి ఒక సంకేతంగా భావిస్తున్న రోజులు వచ్చాయి. స్త్రీలు, సమాజం మంచి వయసులో ఉండి బోడి గుండుతో తిరుగుతున్నవారిని దృఢమైనవారిగా గుర్తిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయిదు పదేళ్ల క్రితం అయితే ఇలా కనిపించేవారిని చూసి నవ్వడం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు నవ్వు స్థానంలో యాక్సెప్టెన్స్ వచ్చింది. సక్సెస్ను మించిన ఆకర్షణ లేదు. మగవాడు తాను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయితే అది అతడి నిజమైన బాహ్య ఆకర్షణ అయ్యే రోజులు వచ్చాయి. కనుక మగవాడు ఇప్పుడు బట్టతల బెంగను క్రమంగా వదిలించుకుంటున్నాడు. తనను ‘దానితో పాటు’గా అంగీకరించే స్థితికి సమాజాన్ని తీసుకువెళుతున్నాడు. తలంపు ముఖ్యం. తల కాదు. బట్టతల తలెత్తుకుని తిరుగుతున్న రోజులను స్వాగతిద్దాం. - శశి వెన్నిరాడై మహామహులు... తమ బట్టతలను లెక్క చేయకుండా మహామహులుగా మన్ననలు అందుకున్నవారు ఎందరో చరిత్రలో ఉన్నారు. గాంధీగారు తన బట్టతలను దాచుకునే వారు కాదు. నెహ్రూగారి బట్టతలకు తెల్లటి టోపీయే అందం. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాస్ చంద్రబోస్ వీరికంతా బట్టతలే. హీరోల్లో గొప్పవారు కూడా బట్టతలను లెక్క చేయలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళ సూపర్స్టార్ ఎం.జి.ఆర్, కన్నడ రాజకుమార్... వీరందరూ బట్టతల ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఒక వెలుగు వెలిగినవారే. నటుడు రజనీకాంత్ ఇంత పెద్ద స్టార్గా ఉన్నా బట్టతలను దాచుకోరు. ధీరూభాయ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం ఎంత అనేదే జాతి చూసిందిగాని ఆయన బట్టతలను ఎవరూ ఒక వంకగా చూడలేదు. క్రికెట్లో సయ్యద్ కిర్మాణి చేసే స్టంప్ ఔట్స్ చూశారే తప్పితే రౌండ్ క్యాప్ కింద ఉన్న అతడి బట్టతలను కాదు. అవును... నాకు బట్టతల ఉంది... ఆ నాలుగు వెంట్రుకలు కూడా పక్కకు పారేసి హాయిగా గుండుతో ఉంటాను ఇది నా ఫ్యాషన్ స్టేట్మెంట్ అని దేశంలో ధైర్యంగా ప్రకటించింది దక్షిణాదిన చో రామస్వామి అయితే ఉత్తరాదిన సినీ దర్శకుడు రాకేష్ రోషన్. ఆ తర్వాత పాప్ గాయకుడు బాబా సెహెగల్, జర్నలిస్ట్ ప్రీతిష్ నంది, అనుపమ్ ఖేర్ తదితరులు గుండుతో కనిపించసాగారు. తెలుగులో హాస్యనటుడు ఏవిఎస్ కూడా పూర్తి గుండునే తన మార్క్గా చేసుకున్నారు. సంగీత దర్శకుడు రమణ గోగుల దానిని కొనసాగిస్తున్నారు. కంప్యూటర్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ గాని నేటి ఆదర్శం సత్య నాదేళ్ల కాని తమ బట్టతలలను దాచుకోలేదు. వీరంతా జుట్టు లేనివారి జట్టు. బట్టతలకే జై కొట్టు. రహస్య బట్టతలలు.... అందరూ రజనీకాంత్లు కాలేరు. స్క్రీన్ మీద మేకప్ బయట అక్కర్లేదు అనుకోలేరు. అదేం తప్పు కాదు. ఎవరి ఇష్టాయిఇష్టాలు వారివి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చాక బాలీవుడ్లో చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారని అంటారు. అమితాబ్ ఈ విషయంలో తొలి వరుసలో ఉంటారు. సల్మాన్ఖాన్, గోవింద, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా, సన్ని డియోల్, హాస్య నటుడు జావేద్ జాఫ్రీ, సంగీత దర్శకుడు అనూమలిక్... ఇలా ఈ పట్టిక అనంతం. -
ఐఎస్ఏ చీఫ్గా భారత ప్రొఫెసర్
వాషింగ్టన్: అమెరికాలోని మేధావుల వర్గంగా భావించే ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేషన్ (ఐఎస్ఏ) 56వ అధ్యక్షుడిగా భారత ప్రొఫెసర్ టీవీ పాల్ నియమితులయ్యారు. మార్చి 16 నుంచి 19 వరకు జార్జియాలోని అట్లాంటాలో జరిగిన ఐఎస్ఏ వార్షిక సదస్సులో పాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశంలో పాల్ చేసిన ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది. మారుతున్న రాజకీయ పరిస్థితులు, చైనా, భారత్ వంటి దేశాలు కొత్త శక్తులుగా ఉద్భవిస్తున్న సమయంలో శాంతియుత మార్పుకోసం జరుగుతున్న వ్యూహాలు వంటి అంశాలపై పాల్ ప్రసంగం కట్టిపడేసింది. ప్రపంచవ్యాప్తంగా మేధావులు.. ఆయా దేశాల్లో రాజకీయ నాయకులు చేపడుతున్న పాలసీల ద్వారా పెరుగుతున్న ఘర్షణ, అనవసర హింస వంటి విషయాలపై సరైన సూచనలనిచ్చి పరిస్థితులు కుదుటపడేలా చొరవతీసుకోవాలని సూచించారు. -
ఇంద్రుడు చంద్రుడు అనకండి
అవతలివాళ్లు ఎంత మేధావులు, మంచివారూ అయినా, వారిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు కొంతమంది. అయితే అది నిజానికి వారి తప్పు కాదు. వారి తలిదండ్రుల పెంపక లోపం. కొన్ని అధ్యయనాల ప్రకారం అతి గారాబంతో, ప్రత్యేక శ్రద్ధతో పెరిగే పిల్లలు, వారు పెద్దయ్యాక స్వయం ప్రేమికులుగా... అంటే ఎంతసేపటికీ తమను తాము గొప్పవాళ్లం అనుకోవడం తప్ప ఇతరులను పట్టించుకోరని రుజువైంది. పిల్లల్లో స్వయంప్రేమ లేదా స్వీయానురక్తికి దారి తీసే కారణాలపై అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీలో జరిగిన పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది. తలిదండ్రులు తమ పిల్లలను సముదాయించడం కోసమో లేదా నిజంగానే వారిపట్ల తమకుండే మితిమీరిన ప్రేమ, గారాబం వల్లనో ‘ఫలానా వారికన్నా నువ్వు చాలా గొప్పవాడివి లేదా ఫలానా వారికీ, నీకూ అసలు పోలికే లేదు. తనకన్నా నువ్వు చాలా తెలివైనదానివి, నీ జ్ఞాపకశక్తి చాలా గొప్పది, నీ గొంతు చాలా బాగుంటుంది, నువ్వు చాలా అందగత్తెవి...’’ అంటూ చెప్పే మాటలు పెద్దయ్యాక వారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయట. ‘నువ్వు మా బంగారానివి, దేవుడు ఇచ్చిన అపూర్వమైన కానుక నువ్వు’ అంటూ కుటుంబ సభ్యులు ముఖ్యంగా తలిదండ్రులు పిల్లలతో తరచు చెబుతుంటారు. అయితే అటువంటి మాటలు వారి మనసులపై గాఢమైన ముద్రవేస్తాయి. నిజంగానే తామేదో ఆకాశం నుంచి ఊడిపడ్డవాళ్లం కాబోలు’ అనుకుని, అందుకు తగ్గట్టు ప్రవర్తిస్తుంటారు వారు. అందులో భాగంగా తామే అందరికన్నా గొప్పవాళ్లమని, తెలివితేటల్లో, అందచందాల్లో, ప్రతిభలో తమను మించిన వారే లేరని విర్రవీగుతారు. ఎదుటివారిని పూచికపుల్లల్లా తీసిపారేస్తారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే చిన్నారులను నువ్వు ఇంద్రుడు, చంద్రుడు అని పొగడకూడదు. దాని బదులు వారిలోని శక్తిసామర్థ్యాలను, మంచితనాన్ని వెలికి తీయాలి. వారిలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకునే అవకాశాన్నివ్వాలి’’ అంటారు సహ అధ్యయనవేత్త, కమ్యూనికేషన్ అండ్ సైకాలజీ ప్రొఫెసర్ బ్రాడ్ బుష్మాన్. అంటే పిల్లల్ని అతి ప్రేమగా, ప్రత్యేకంగా పెంచే తలిదండ్రులు ఇకపై ఆ పద్ధతిని మార్చుకోవాలేమో! -
నగరాన్ని శిథిలం కానివ్వను
టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారంతా ద్రోహులే ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు (విద్యుత్) : రోడ్ల విస్తరణ పేరుతో నెల్లూరు నగరాన్ని శిథిలం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక ఏసీ సెంటర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనం మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రజలు, మేధావులు, వ్యాపారులతో చర్చించకుండా రోడ్ల విస్తరణ పనులు ఎలా చేపడుతారని ప్రశ్నించారు. కార్పొరేషన్ అధికారులు కొలతలు చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఈ అప్రజాస్వామిక చర్యను అడ్డుకునేందుకు ఈ నెల 6న హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. విస్తరణకు ముందస్తు నోటీసులు, గృహస్తులు, వ్యాపారులకు వారు కోరిన మార్కెట్ విలువలను కచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత కార్పొరేషన్పై ఉందన్నారు. పరిహారం చెల్లించే విధానంలో వ్యాపార విభాగాలకు మూడు రెట్ల మార్కెట్ విలువను అందించాలని చట్టం సూచిస్తుందన్నారు. ‘ప్రజల్లో నుంచి వచ్చాం కాబట్టి మా కుటుంబానికి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. కోట్లు గడించే కార్పొరేట్ అధినేతలకు ప్రజా సమస్యలు ఏం అర్థమవుతాయి’ అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. నగర కార్పొరేటర్లకు, కార్పొరేషన్ అధికారులకు మధ్య తీరని అగాధం ఉందన్నారు. ముందు కింది స్థాయి నుంచి సమావేశాలు నిర్వహించి, కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పథంలో సాగాలే తప్ప మోనార్క్లాగా వ్యవహరించడం తగదని ఆయన కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్ బాబుకు చురకలంటించారు. నమ్మక ద్రోహులు పార్టీని అడ్డుపెట్టుకుని లబ్ధిపొందాక టీడీపీలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ద్రోహులేనంటూ ఆనం మండిపడ్డారు. కాంగ్రెస్ పునాదులపై ఈ స్థాయికి వచ్చి నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అంటే తల్లి పాలు తాగి, రొమ్ము గుద్దిన* చందంగా ఉందన్నారు. భవిష్యత్లో వీరంతా పరస్పరం ద్రోహం చేసుకుంటారనడంలో సందేహం లేదన్నారు. సమావేశంలో నగర ఇన్చార్జ్ ఏసీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ ఆనం రంగమయూర్రెడ్డి, కేతంరెడ్డి వినోద్రెడ్డి, బర్నా బాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని సాధన కోసం కదంతొక్కిన కర్నూలు వాసులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అడుగులన్నీ ఒక్కటయ్యాయి.. నినాదాలు మార్మోగాయి.. రాజధాని కోసం ఊరూవాడ ఏకమైంది. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు.. ఇలా అన్ని రంగాల వారు కదం తొక్కారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. సోమవారం కర్నూలు నగరంలో నిర్వహించిన పొలికేకను విజయవంతం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్లో కర్నూలుకు న్యాయం జరుగుతుందని ఆశించిన జిల్లా వాసులకు నిరాశే ఎదురవుతోంది. రాజధాని ఏర్పాటుపై మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారు. దీంతో రాజధాని సాధన కోసం కర్నూలులో ఉద్యమం ఊపందుకుంది. ఈనెల ఒకటిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణమండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌంటేబుల్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోసం ఉద్యమించాలని కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆ రోజే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటవగా కన్వీనర్గా కట్టమంచి జనార్దన్రెడ్డిని ఎన్నుకున్నారు. అందుకు టీడీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీ నేతలు, విద్య, ఉద్యోగ, రైతు, వివిధ వర్గాలు, సంఘాలు మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా గతంలో విద్యా సంస్థల బంద్చేసి విజయవంతం చేశారు. అయితే టీడీపీ నేతల ఒత్తిడితో కొందరు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. పొలికేక విజయవంతం.. రాయలసీమ పొలికేక పేరుతో రాజధాని ఉద్యమం ఊపందుకుంది. కర్నూలులో సోమవారం వివిధ వర్గాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. దీనిని విజయవంతం చేసేందుకు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, కట్టమంచి జనార్దన్ రెడ్డి, రవీంద్ర విద్యాసంస్థల యజమాని పుల్లయ్య, వివిధ విద్యా సంస్థలు, విద్యార్థులు కృషి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంధ్రనాథ్రెడ్డి, మణిగాంధీ, గౌరు చరితారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్బాబు, డీసీసీ అధ్యక్షుడు రామయ్య, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో నిర్వహించిన పొలికేక ర్యాలీలో ‘కర్నూలును రాజధానిని చేయాలి’ అనే డిమాండ్తో ముందుకు సాగారు. రాయలసీమ జిల్లా వ్యాప్తంగా.. రాజధాని ఉద్యమం ఒక్క కర్నూలుకే పరిమితం కాకుండా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలతో పాటు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆగస్టు 15 తరువాత ఆయా జిల్లాల రాజకీయ పార్టీ నాయకులు, వివిధ వర్గాల వారితో సమావేశం ఏర్పాటు చేయాలని రాజధాని సాధన కమిటీ భావిస్తోంది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం రాయలసీమ జిల్లాలో ఎంత విజయవంతమైందో అదే స్థాయిలో ఈ ఉద్యమం కూడా నిర్వహించాలని జేఏసీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడిని కూడా కలిసి కర్నూలుకు జరిగిన అన్యాయం గురించి వివరించేందుకు సిద్ధమయ్యారు. -
కంటితుడుపే..!
విభజనకు ముందే రాజధానిని ఎంపిక చేస్తే బాగుండేది రాజధానిని నిర్ణయించాక కమిటీ నివేదికకు విలువేముంటుంది? శివరామకృష్ణన్ కమిటీ పర్యటనపై మేధావుల పెదవి విరుపు! సాక్షి ప్రతినిధి, తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని ఎంపికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందే రాజధానిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానిపై ఓ నిర్ణయానికి వచ్చాక.. రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చే నివేదికకు విలువేముంటుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజధానిపై ప్రజల్లో ఆశలు రేకెత్తించడానికే శివరామకృష్ణ కమిటీ పర్యటన చేస్తోందని.. ఇది కంటితుడుపు చర్య అనే భావన బలపడుతోంది. ఇదీ.. శివరామకృష్ణన్ కమిటీ బుధవారం తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన భావన..! వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు ప్రొఫెసర్ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రం ఓ కమిటీని నియమించింది. శివరామకృష్ణన్ కమిటీ తొలివిడతగా కోస్తాం ధ్రలో పర్యటించింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబుకు.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు రాజధాని ఎంపికపై తాము సేకరించిన ప్రజాభిప్రాయాలను ప్రాథమికంగా వివరించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మలి విడత పర్యటన చేసి.. ప్రజాభిప్రాయాలను సేకరించి ఆగస్టు ఆఖరు నాటికి నివేదిక ఇస్తామని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఇవేవీ పట్టించుకోకుండా కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో రాజధానిని ఏర్పాటుచేస్తామని సూత్రప్రాయంగా ప్రకటించారు. ఇదే అదునుగా తీసుకున్న రియల్టర్లు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలను ఆపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే.. అదే ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటుచేస్తామనే భావనను ప్రభుత్వం పరోక్షంగా వ్యక్తం చేసింది. ఇదే అంశాన్ని బుధవారం శివరామకృష్ణన్ కమిటీ ముందు మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు లేవనెత్తారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజధాని ఎంపికపై లీకులు ఇస్తోన్న నేపథ్యంలో శివరామకృష్ణ కమిటీ నివేదికకు విలువ ఏముంటుందని నిల దీశారు. కేవలం రాయలసీమ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మాత్రమే కమిటీ పర్యటిస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్య, పారిశ్రామిక, వినోదం వంటి రంగాల్లో హైదరాబాద్ను అభివృద్ధి చేయడం వల్లే విభజనోద్యమం పుట్టుకొచ్చిందని.. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో అదే రీతిలో అభివృద్ధిని ఒక్కచోటే కేంద్రీకరిస్తే మళ్లీ విభజనవాదం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఓడంబడిక మేరకు రాయలసీమలోనే.. తిరుపతి కేం ద్రంగా రాజధానిని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. తిరుపతికి సమీపంలో విమానాశ్రయం ఉందని.. దేశం నలుమూలకు వెళ్లగలిగే రైల్వే మార్గాలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయని.. తెలుగుగంగ ద్వారా నీటిని తీసుకోవచ్చునని రాజధాని ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్న నేపథ్యంలో తిరుపతినే రాజధానిగా ఎంపిక చేయాలని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్లో 13 జిల్లాల కేంద్రాలను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. అధికారాన్ని, ప్రగతిని వికేంద్రీకరించి, అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తేనే నవ్యాంధ్రప్రదేశ్ సుస్థిరంగా మనుగడ సాధించగలుగుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. మేధావులు, విద్యావేత్తల అభిప్రాయాలతో ఏకీభవించిన శివరామకృష్ణ కమిటీ సభ్యులు ప్రజాభిప్రాయాలను ప్రతిబింబించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇస్తామని చెప్పడం గమనార్హం.