Israeli
-
ఆ మృతదేహం షిరి బిబాస్ది కాదు..
టెల్అవీవ్: హమాస్ గురువారం అప్పగించిన నాలుగు మృతదేహాల్లో మహిళ మృతదేహం.. 2023 అక్టోబర్ 7 దాడి సమయంలో పట్టుబడిన బందీలకు చెందినది కాదని ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది. మృతదేహాల్లో ఖఫీర్ బిబాస్, అతని నాలుగేళ్ల సోదరుడు ఏరియల్ అనే ఇద్దరు పిల్లలున్నారని, మూడో మృతదేహం వారి తల్లి షిరి బిబాస్ది కాదని వెల్లడించింది. మహిళ మృతదేహం అపహరణకు గురైన ఇతర వ్యక్తులతో సరిపోలడం లేదని సైనిక ప్రతినిధి తెలిపారు. అంతేకాదు.. కఫీర్ బిబాస్, ఏరియల్ బిబాస్లను హమాస్ చంపిందని ఆరోపించారు. బందీల విడుదల ఒప్పందంలో హమాస్ది తీవ్రమైన ఉల్లంఘనని ఇజ్రాయెల్ మండిపడింది. షిరితో పాటు మిగిలిన బందీలందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. అయితే, ఇజ్రాయెల్ ఆరోపణలపై హమాస్ ఇంకా స్పందించలేదు. కాగా, గురువారం మృతదేహాల అప్పగింత సమయంలో జరిగిన హడావుడిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. విడుదల సందర్భంగా వేలాది మంది జనం మధ్య.. సాయుధ హమాస్ ఫైటర్లు నాలుగు శవపేటికలను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా అంతర్జాతీయ నేతలు తీవ్రంగా ఖండించారు. -
మంచు జలపాతం కాదు.. మహా వినాశనానికి సంకేతం!
భారీ హిమానీనదం కరుగుతూ ఆ నీరు సముద్రంలోకి జలపాతంలా దూకుతున్న ఈ దృశ్యం.. మహా వినాశనానికి సంకేతమట. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమ్మీద అత్యంత వేగంగా మంచు కరిగిపోతున్న ప్రాంతమైన నార్వేలోని స్వాల్బార్డ్లో ఉన్న బ్రస్వెల్బ్రీన్ హిమానీనదం ఇది. ఇజ్రాయెలీ ఫొటోగ్రాఫర్ రో గలిట్జ్ తీసిన ఈ చిత్రం.. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్–2024 అవార్డుల్లో ‘ప్లానెట్ ఎర్త్– ల్యాండ్ స్కేప్, క్లైమేట్, వాటర్’ కేటగిరీ కింద ఎంపికైంది. -
గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 10 మంది మృతి
-
గాజాపై దాడులు... 22 మంది దుర్మరణం
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని పాలస్తీనియన్లు కనీసం తాగునీరు కూడా దొరకని దుర్భర పరిస్థితుల్లో అల్లాడుతున్నా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను యథేచ్ఛగా సాగిస్తోంది. శనివారం రాత్రి మొదలైన వైమానిక దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో ఐదుగురు చిన్నారులు సహా 22 మంది మృత్యువాతపడ్డారు. గాజా నగరంలోని శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాలపై జరిగిన దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది చనిపోయారు. అయితే, అక్కడ హమాస్ మిలిటెంట్లున్నారని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. డెయిర్ అల్–బలాహ్ నగరంలోని ఓ ఇంటిపై శనివారం రాత్రి జరిగిన మరో దాడిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిదిమంది మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మరో ఆరుగురు చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా, గాజాలో స్వల్ప సంఖ్యలో ఉన్న క్రైస్తవులు క్రిస్మస్ ముందస్తు వేడుకలు జరిపేందుకు ఆ ప్రాంతంలోకి ఆదివారం కార్డినల్ పియెర్బటిస్టా పిజ్జబల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ అనుమతించింది. వేడుకలు జరుగుతుండగా ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ డ్రోన్లతో పహారా కాసింది. ఇజ్రాయెల్ ఆంక్షల వల్ల బిషప్ గాజాలోకి వెళ్లలేకపోయినట్లు పోప్ ఫ్రాన్సిస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
-
ఇజ్రాయెల్పై హెజ్బొల్లా భీకర దాడి
బీరూట్: లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు మరోసారి భీకర దాడులకు దిగారు. ఆదివారం ఇజ్రాయెల్ భూభాగంపై 250 రాకెట్లు, ఇతర డ్రోన్లు ప్రయోగించారు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడుతుండడంతో ప్రతీకార చర్యగా మిలిటెంట్లు రాకెట్లతో దాడి దిగారు. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ఆర్మీ సెంటర్పై దాడికి పాల్పడింది. నైరుతి కోస్తా తీర రహదారిపై టైర్, నఖౌరా మధ్య ఈ దాడి జరిగినట్లు లెబనాన్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిలో ఒక సైనికుడు మృతిచెందాడని, 18 మంది గాయపడ్డారని తెలియజేసింది. -
‘ఇరాన్లో అడ్డగోలుగా అణుస్థావరాలు.. దాడులు చేయాల్సిందే!’
ఇరాన్లో గతంలో కంటే అధికంగా అణుస్థావరాలు బయటపడ్డాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా నియమించబడిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్లో గతంలో కంటే ఎక్కువ అణు స్థావరాలు వెలుగు చూశాయి. ఆ దేశంపై దాడులు చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ అస్థిత్వానికి కలిగే ముప్పును తొలగించడం, అడ్డుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నాం.ఇక.. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఏళ్లుగా ఆరోపణలు చేస్తోంది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండింస్తూ వస్తున్న విషయం తెలిసిందే.2018లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా.. ఇరాన్ అణుసామర్థ్య ఆశయాలను పరిమితం చేసేందుకు 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇక.. ప్రస్తుతం అమెరికా మళ్లీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక.. టెహ్రాన్ వద్ద యురేనియంను 60 శాతం వరకు ఉండగా.. 30 శాతం తక్కువ అణు ఆయుధాల గ్రేడ్ ఉంది.In my first meeting today with the @IDF General Staff Forum, I emphasized: Iran is more exposed than ever to strikes on its nuclear facilities. We have the opportunity to achieve our most important goal – to thwart and eliminate the existential threat to the State of Israel. pic.twitter.com/HX4Z6IO8iQ— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) November 11, 2024 ఇజ్రాయెల్, ఇరాన్ చెసుకుంటున్న క్షిపణి దాడుల కారణం మధ్యప్రాచ్యంలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఈ దాడిలో ఇరాన్ రెండుసార్లు ఇజ్రాయెల్ భూభాగంపై నేరుగా మిసైల్స్ దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్.. ఇరాన్పై ప్రతీకార దాడులు చేసింది. ఇటీవల అక్టోబర్ 26న ఇరాన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అదీ కాక.. గత నెలలో జరిగిన దాడికి ప్రతిస్పందించవద్దని ఇరాన్ను ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
ఇజ్రాయెల్ సైన్యం చెరలో గాజా ఆస్పత్రి సిబ్బంది
కైరో: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిరంతర దాడులకు తెగబడుతోంది. అయితే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర గాజాలోని ఆస్పత్రి సముదాయం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయి. అయితే ఈ ఆస్పత్రిని టార్గెట్ చేసి, దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ సైనికులు ఇక్కడి వైద్య సిబ్బందిని, కొంతమంది రోగులను తమ అదుపులోకి తీసుకున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో అనేక ఇళ్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా తెలిపింది. మరోవైపు గాజా స్ట్రిప్లోని బీట్ లాహియా ప్రాంతంలోని ఒక భవనంలో ఉన్న హమాస్ మిలిటెంట్లపై ఆయుధాలను ఉపయోగించి, దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసారం చేసిన ఫుటేజీలో ఇజ్రాయెల్ దళాలు అక్కడి నుంచి ఉపసంహరించుకున్న దృశ్యాలతో పాటు అనేక భవనాలు దెబ్బతిన్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. 70 మంది సభ్యుల ఆస్పత్రి బృందంలో 44 మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే ఆస్పత్రి డైరెక్టర్తో సహా 14 మందిని విడుదల చేసినట్లు సైన్యం తెలిపింది. కాగా ఆసుపత్రి నివేదికపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నిరాకరించారు. ఇది కూడా చదవండి: ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి -
కమాండర్లే చేతులెత్తేస్తే.. ట్రైనీ సైనికులు సిన్వార్ను మట్టుబెట్టారు
ఇజ్రాయెల్ దళాలు హమాస్ మాస్టర్మైండ్ యహ్యా సిన్వర్ను హతమార్చాయి. అయితే సిన్వర్ తర్వాత హమాస్కు ఎవరు సారథ్యం వహిస్తారు? అనే చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో సిన్వర్ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ గురించి ఆసక్తికర విషయంలో వెలుగులోకి వచ్చింది.గతేడాది పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1,200 మంది పౌరులు మరణించారు. 200 మందికి పైగా ప్రజలు కూడా బందీలుగా ఉన్నారు. ఈ దాడి ఇజ్రాయెల్ చరిత్రలో ఈ దాడి అత్యంత ఘోరమైనదని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్ కోసం అన్వేషిస్తుంది.సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ ఆర్మీ, ఇతర నిఘూ వర్గాలు సిన్వార్ జాడ కనిపెట్టలేకపోయాయి. అయితే గురువారం ఇజ్రాయెల్కు చెందిన ట్రైనీ సైనికులు దక్షిణ గాజాలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఓ భవంతిలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ట్రైనీ సైనిక సిబ్బంది డ్రోన్తో దాడులు జరిపారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో సిన్వార్ సైతం ఉన్నారు. ఏడాది కాలంలో ఆర్మీలో ఆరితేరిన సైనికులు సాధించలేని విజయాన్ని ట్రైనీ సైనికులు సాధించడంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. -
హమాస్ కు చావు దెబ్బ.. హమాస్ చీఫ్ సిన్వర్ హతం
-
ఇజ్రాయెల్ నగరంపై హెజ్బొల్లా వైమానిక దాడులు
గాజా యుద్ధానికి సోమవారంతో ఏడాది పూర్తవుతున్న వేళ.. ఇజ్రాయెల్ దాడుల్ని కొనసాగిస్తుంది. ప్రతీకారంతో హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలే లక్ష్యంగా వైమానిక దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. ఆదివారం ఇజ్రాయెల్ లెబనాన్లోని కమతియే పట్టణంపై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహామొత్తం ఆరుగురు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ప్రతీకారంగా, హెజ్బొల్లా సోమవారం ఉదయం ఇజ్రాయెల్లోని హైఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. ఫలితంగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. హెజ్బొల్లా హైఫా నగరంలో దక్షిణంగా ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఫాది 1 మిసైల్స్తో బీభత్సం సృష్టించింది.మిసైల్ దాడులతో స్థానికంగా ఉన్న భవనాలు, ఇతర సముదాయాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. గాయపడ్డ క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఇజ్రాయెల్ దాడిలో 105 మంది మృతి
బీరూట్ : లెబనాన్ తీవ్రవాద గ్రూప్ హెజ్బొల్లాను కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వడివడిగా అడుగులు వేస్తోంది భూతల,వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా, లెబనాన్ రాజధాని బీరూట్లో తొలిసారి జనావాసాల్లో హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆదివారం జరిపిన దాడుల్లో సుమారు 105 మంది మరణించారు. 359 మందికిపైగా గాయపడ్డారు.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో ఘోరమైన వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. తూర్పు, దక్షిణ, బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాలలో డజన్ల కొద్దీ మంది మరణించారని చెప్పారు. సోమవారం బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు.రెండు వారాల క్రితం ఇజ్రాయెల్..హెజ్బొల్లా సభ్యులపై దాడుల ముమ్మరం చేసిన నాటి నుండి 1,000 మందికి పైగా మరణించారని, 6,000 మంది గాయపడ్డారని లెబనాన్ పేర్కొంది.రాయిటర్స్ ప్రకారం, బీరుట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగిన ప్రాంతంలో హెజ్బొల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్.. 20 మంది హెజ్బొల్లా అగ్రనేతల్ని హత మార్చింది. వారిలో నస్రల్లా,నబిల్ కౌక్తో పాటు ఇతర నేతలు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్పై దాడిని కొనసాగించాలని ఆదేశించారు. హెజ్బొల్లాపై చేస్తున్న దాడుల కారణంగా సామాన్యులు నష్టపోకూడదని, వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. -
బంకర్ బాంబు దాడిలో... నస్రల్లా మృతి
బీరూట్: లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసింది. నస్రల్లాయే ప్రధాన లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ వైమానిక దళం శుక్రవారం భారీ బాంబు దాడులకు దిగి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేయడం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 80కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఆ క్రమంలో ఏకంగా 2,200 కిలోల బంకర్ బస్టర్ బాంబులను కూడా ప్రయోగించింది. దాడిలో నస్రల్లాతో పాటు ఆయన కూతురు జైనబ్, òహెజ్బొల్లా సదరన్ కమాండర్ అలీ కరీ్కతో పాటు పలువురు కమాండర్లు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. నస్రల్లాతో పాటు తమ సీనియర్ సైనిక కమాండర్ అబ్బాస్ నిల్ఫోరుషన్ (58) కూడా దాడుల్లో మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘నస్రల్లా కదలికలను కొన్నేళ్లుగా అత్యంత సన్నిహితంగా ట్రాక్ చేస్తూ వస్తున్నాం. అతనితో పాటు హెజ్బొల్లా అగ్ర నేతలంతా బంకర్లో సమావేశమైనట్టు అందిన కచి్చతమైన సమాచారం మేరకు లక్షిత దాడులకు దిగాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షొషానీ వివరించారు. ‘‘నస్రల్లాను మట్టుపెట్టాం. పలు రకాలైన నిఘా సమాచారం ఆధారంగా నిర్ధారణ కూడా చేసుకున్నాం’’ అని ప్రకటించారు. ‘‘అంతేకాదు, గత వారం రోజులుగా చేస్తున్న దాడుల్లో హెజ్బొల్లా్ల సాయుధ సంపత్తిని భారీగా నష్టపరిచాం. దాన్ని పూర్తిగా నాశనం చేసేదాకా దాడులు చేస్తాం’’ అని తెలిపారు. శుక్రవారం నాటి దాడిలో వాడిన బాంబులు తదితరాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘హెజ్బొల్లా ప్రతీకార దాడులకు దిగుతుందని తెలుసు. మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించారు.హెజ్బొల్లాకు ఇరాన్, ఇరాక్ దన్నుహెజ్బొల్లాకు పూర్తిగా అండగా నిలుస్తామంటూ ఇరాన్, ఇరాక్ ప్రకటించాయి. అత్యంత శక్తిమంతమైన ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. ఇజ్రాయెల్ దాడులకు గట్టిగా జవాబివ్వాల్సిందేనని ముక్త కంఠంతో తీర్మానించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ సైనిక కమాండర్ మృతికి ప్రతీకారం తీర్చుకునే హక్కుందని ఇరాన్ న్యాయవ్యవస్థ డిప్యూటీ చీఫ్రెజా పూర్ ఖగాన్ అన్నారు. ముస్లిం ప్రపంచమంతా పాలస్తీనా, హెజ్బొల్లాలకు దన్నుగా నిలవాలంటూ ఇరాక్ కూడా పిలుపునిచి్చంది. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇరాక్ ప్రధాని మొహహ్మద్ సియా అల్ సుడానీ ఇరాన్, హెజ్బొల్లాతోనే అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగడం ఖాయమంటున్నారు. మరోవైపు, నస్రల్లా మృతితో అంతా అయిపోయినట్టు కాదని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ అన్నారు. హెజ్బొల్లాపై దాడులు మరింత తీవ్రంగా కొనసాగుతాయని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే అదనపు బలగాలను సమీకరించుకుంటోంది! భూతల దాడులను ఎదుర్కొనేందుకు రెండు బ్రిగేడ్లను ఉత్తర ప్రాంతానికి పంపింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వు బెటాలియన్లను కూడా రంగంలోకి దిగాల్సిందిగా ఆదేశించింది. దాంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే తారస్థాయికి చేరిన ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా తమ ప్రజలు నిర్వాసితులయ్యారని ఇజ్రాయెల్ మండిపడుతోంది. దాడులకు పూర్తిగా స్వస్తి చెప్పేదాకా తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయెల్ తాజా దాడుల దెబ్బకు లెబనాన్లో గత వారం రోజుల్లోనే ఏకంగా 2 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని ఐరాస చెబుతోంది.కోలుకోలేని దెబ్బ!మూడు దశాబ్దాలకు పైగా హెజ్బొల్లాను నడిపిస్తున్న నస్రల్లా మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బే. హెజ్బొల్లాపై తలపెట్టిన తాజా దాడిలో ఇజ్రాయెల్కు ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నారు. హెజ్బొల్లా హెడ్డాఫీస్తో పాటు ఆరు అపార్ట్మెంట్లను నేలమట్టం చేసిన శుక్రవారం నాటి దాడుల్లో మృతులు ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 91కి పెరిగినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు వారాల క్రితమే లెబనాన్ అంతటా పేజర్లు పేలి పదుల సంఖ్యలో చనిపోగా వేలాది మంది తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దాన్నుంచి తేరుకోకముందే వాకీటాకీలు మొదలుకుని పలు ఎలక్ట్రానిక్ పరికరాలు పేలి మరింత నష్టం చేశాయి. ఇదంతా ఇజ్రాయెల్ పనేనని, మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు హెజ్బొల్లా మిలిటెంట్లేనని వార్తలొచ్చాయి. -
పాలస్తీనా మా సొంతం
న్యూయార్క్: గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక దాడులను పాలస్తీనా అథారిటీ చీఫ్ మహ్మూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా మా సొంతం. పాలస్తీనా నుంచి వెళ్లిపోవాల్సిన వారు ఎవరూ అంటే ఆక్రమణదారులు మాత్రమే’ అని ఆయన అన్నారు. గురువారం అబ్బాస్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన స్టేడియం వైపు వెళ్తుండగా కరతాళధ్వనులు, చప్పట్లు హాలంతా మారుమోగాయి. అర్థంకాని కేకలు వినిపించాయి. పోడియం వద్దకు చేరుకున్న అబ్బాస్..మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం..అంటూ ప్రసంగం మొదలుపెట్టారు.గాజాను, అక్కడి ప్రజలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న నరమేధాన్ని ఆపాలంటూ ప్రపంచ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గాజాను నివాసయోగ్యం కాకుండా చేస్తోంది. యుద్ధానంతరం ఏర్పడే గాజాను మేమే పాలిస్తాం. పాలస్తీనా మా మాతృ భూమి. మా తండ్రులు, తాతలది. అది ఎప్పటికీ మాదే. వెళ్లిపోవాల్సింది ఎవరైనా ఉంటే వారు ఆక్రమిత వడ్డీవ్యాపారులు మాత్రమే’అని వ్యాఖ్యానించారు. -
న్యూస్ చదువుతుండగా లెబనాన్ జర్నలిస్ట్పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి
బీరూట్ : లెబనాన్ దేశంలో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఈ దాడితో రెండ్రోజుల వ్యవధిలో సుమారు 550 మందికి పైగా మరణించారని, 1,800 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ తరుణంలో ఇజ్రాయెల్కు వ్యతిరేక కథనాల్ని ప్రసారం చేస్తున్నారనే నెపంతో లెబనాన్ టీవీ ఛానెల్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడి చేసింది.ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా దళాల మధ్య వైమానిక దాడులపై మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ టీవీ ఛానల్ న్యూస్ రూమ్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్పై అప్పటికే సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ.. న్యూస్ రూమ్లో న్యూస్ ప్రసారం చేస్తున్న మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ టీవీ ఛానల్ ఎడిటర్–ఇన్–చీఫ్ జర్నలిస్ట్ ఫాది బౌడియాపై రాకెట్ దాడి చేసింది. ఫాది బౌడియా ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన వెనుక నుంచి రాకెట్ దూసుకొచ్చింది. ఈ దాడిలో బౌడియాకు తీవ్ర గాయాలయ్యాయి. ఫుటేజీలో, బౌడియా పేలుడు తీవ్రతతో అరుస్తూ.. హాహాకారాలు వ్యక్తం చేస్తూ ప్రాణ భయంతో భీతిల్లిపోయారు. ఏమి జరుగుతుందో తెలియక భయాందోళన చెందారు. పేలుడు కారణంగా అతనికి గాయాలైనట్లు నివేదికలు ధృవీకరించాయి.A video shows journalist Fadi Boudiya being thrown off balance while he was live on air in Lebanon. Boudiya is the editor-in-chief of Miraya International Network and has reportedly been injured in the attack.Video Credit: @eye.on.palestine#thecurrent #lebanon pic.twitter.com/YdHQNoyxk9— The Current (@TheCurrentPK) September 24, 2024చదవండి : హిబ్జుల్లా కమాండర్ హతం -
లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు (ఫొటోలు)
-
హిజ్బుల్లాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడి
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే 300 లకుపైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో 182 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 700 మందికి గాయాలైనట్లు పేర్కొంది.ఈ రోజు ఉదయం నుండి దక్షిణ పట్టణాలు, గ్రామాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో 182 మంది మరణించారు. వారిలో పిల్లలు, మహిళలు,మెడికల్ సిబ్బంది ఎక్కువ మంది ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ ప్రతినిధులు ప్రకటించారు. ఈ దాడులపై ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి స్పందించారు. లెబనాన్లోని సామాన్య ప్రజలు హిజ్బుల్లాకు అనుసంధానంగా ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. అంతేకాదు తమ సైన్యం లెబనాన్ అంతటా విస్తరించిన హిజ్బుల్లా ఖచ్చితమైన స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని హగారి స్పష్టం చేశారు. లెబనాన్ పౌరులు భద్రత దృష్ట్యా వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. చదవండి : పడవలో కుళ్లిన 10 మృతదేహాలు -
వెస్ట్బ్యాంక్–జోర్డాన్ సరిహద్దుల్లో కాల్పులు ముగ్గురు ఇజ్రాయెలీలు మృతి
అల్లెన్బీ క్రాసింగ్: వెస్ట్బ్యాంక్–జోర్డాన్ సరిహద్దుల్లోని అల్లెన్ బీ క్రాసింగ్ వద్ద ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఇజ్రాయెలీలు చనిపోయారు. జోర్డాన్ వైపు నుంచి ట్రక్లో క్రాసింగ్ వద్దకు చేరుకున్న సాయుధులు భద్రతా బలగాల వైపు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బలగాల ఎదురుకాల్పుల్లో ఆగంతకుడు చనిపోయాడని ఆర్మీ తెలిపింది. ఘటనపై జోర్డాన్ దర్యాప్తు చేపట్టింది. జోర్డాన్ నదిపై ఈ మార్గాన్ని ఎక్కువగా పాలస్తీనియన్లు, విదేశీ టూరిస్టులు, సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. తాజా ఘటన నేపథ్యంలో ఈ క్రాసింగ్ను అధికారులు మూసివేశారు. అమెరికా, పశ్చిమదేశాలకు అనుకూలంగా పేరున్న జోర్డాన్ 1994లో ఇజ్రాయెల్లో శాంతి ఒప్పందం చేసుకుంది. -
నెతన్యాహుపై హమాస్ సంచలన ఆరోపణలు
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన వైమానిక దాడుల్లో 29 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. గాజాలో ఉద్రిక్తతలు తగ్గించటంతో పాటు, కాల్పుల విరమణ ఒప్పందం ప్రయత్నాల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్ ఇజ్రాయెల్కు వెళ్లారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం.. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో దోహాలో రెండు రోజుల చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణపై కొంత సానుకూలంగా వ్యవహరించినట్లు తెలిపారు. మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త షరతులు విధించారని గాజా నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణను తిరస్కరించారని హమాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మధ్యవర్తుల ప్రయత్నాలను, ఒప్పందాన్ని అడ్డుకోవాలని ప్రధాని నెతన్యాహు చూస్తున్నారు. గాజాలో బంధీల జీవితాలకు పూర్తి బాధ్యత ఆయనదే’ అని హమాస్ ఆరోపించింది.ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. 2.3 మిలియన్ ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. భీకరమైన ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహార ఇబ్బందులు, పోలీయో వంటి వ్యాధలు ప్రబలుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. -
Israel-Hamas war: రక్తమోడుతున్న గాజా
డెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ సైన్యం యథేచ్ఛగా జరుపుతున్న దాడులతో గాజా ప్రాంతం రక్తమోడుతోంది. శనివారం ఉదయం జవైదా పట్టణంలోని ఓ నివాసంతోపాటు పక్కనే ఉన్న శరణార్థులు తలదాచుకున్న భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో సమీ జవాద్ అల్ ఎజ్లా, అతడి కుటుంబంలోని 18 మంది మృత్యువాతపగా, మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులను సమీ ఇద్దరు భార్యలు, 2 నుంచి 22 ఏళ్ల వయస్సున్న 11 మంది సంతానం, వారి అమ్మమ్మ, మరో ముగ్గురు బంధువులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి చేపలు, మాంసం తరలించే ప్రక్రియకు సమీ సమన్వకర్తగా వ్యవహరించేవాడని, చాలా మంచి వ్యక్తని చెప్పారు. ఘటన సమయంలో రెండు భవనాల్లో కలిపి 40 మంది వరకు ఉన్నట్లు వివరించారు. ఇలా ఉండగా, సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం పాలస్తీనియన్లను హెచ్చరించింది. ఆ ప్రాంతం వైపు నుంచే తమ భూభాగం మీదికి మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తున్నారని పేర్కొంది. -
హమాస్కు ఎదురు దెబ్బ.. ఇజ్రాయెల్ మెరుపు దాడిలో
హమాస్కు ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్కు చీఫ్ ఇస్మాయిల్ హనియే సోదరితో సహా అతని 10 మంది కుటుంబ సభ్యులు మరణించారని గాజా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర గాజా స్ట్రిప్లోని అల్ షాతీ శరణార్థి శిబిరంలోని హనియే నివాసంపై దాడి జరిగిందని హమాస్ పాలిత ప్రాంతం పౌర రక్షణ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు. శిథిలాల కింద అనేక మృతదేహాలు ఇంకా ఉన్నాయని, అయితే వాటిని వెలికితీసేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవని ఆయన అన్నారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది మృతదేహాలను సమీపంలోని గాజా సిటీలోని అల్ అహ్లీ ఆసుపత్రికి తరలించారు.దాడిలో చాలామంది గాయపడినట్లు నివేదించారు.కాగా,గాజాలో ఈద్ వేడుకల నుండి తిరిగి వస్తున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే పిల్లలు, మనవళ్లతో సహా 14 మంది చనిపోయారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 25 మంది మృతి
ఇజ్రాయెల్ దళాలు గాజాలో నిరంతరం దాడులకు తెగబడుతూనే ఉన్నాయి తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్ల శరణార్థి శిబిరాలపై దాడికి దిగాయి. ఈ దాడిలో 25 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. 50 మంది గాయపడ్డారు.ఈ సందర్భంగా అల్-అహ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ నయీమ్ మాట్లాడుతూ 30 మృతదేహాలను ఇక్కడికి తీసుకువచ్చారని, గాజా నగరానికి ఇది క్రూరమైన రోజు అని వ్యాఖ్యానించారు. రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రద్వాన్ తెలిపిన వివరాల ప్రకారం తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాలల్లో బాంబు దాడుల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలు తెలియజేసింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. పాలస్తీనియన్లకు ఇక్కడ రక్షణ శిబిరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ బలగాలు రెండుసార్లు దాడులకు తెగబడ్డాయని బాధితులు తెలిపారు. మరోవైపు తమ దేశ పౌరుల మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఉగ్రవాదులు జనం మధ్య తిరుగాడుతున్నారని, అందుకే ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా సెంట్రల్ గాజాలో జరిగిన పోరులో ఇద్దరు సైనికులు కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదే సమయంలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. -
గాజాలో భారీ పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో యుద్ధం కొనసాగుతోంది. దక్షిణ గాజాలో చోటు చోసుకున్న పేలుడులో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దక్షిణ గాజాలోని రఫా నగరానికి సమీపంలో ఇజ్రాయెల్ సైనికులు ప్రయాణిస్తున్న నేమర్ వాహనం పేలటంతో ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.ఈ పేలుడు భారిగా సంభవించడంతో వాహనం పూర్తిగా దగ్ధం అయిదని, అదే విధంగా మృత దేహాలను గుర్తించటంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఎవరు జరిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే ఆ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు పేలుడు పరికరం అమర్చా? లేదా యాంటీ ట్యాంక్ మిసైల్ను నేరుగా ప్రయోగించారా? అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.❗🇵🇸⚔️🇮🇱 - An explosion in Rafah in southern Gaza killed eight Israeli soldiers in a Namer armored combat engineering vehicle, raising the Israel Defense Forces (IDF) death toll to 307 in the ground offensive against Hamas and operations throughout from the Gaza border. The… pic.twitter.com/5e1tiV6Hgb— 🔥🗞The Informant (@theinformant_x) June 15, 2024 శనివారం జరిగిన పేలుడులో 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందటం భారీ నష్టమని తెలిపారు. ఇక.. ఇప్పటివరకు 306 మంది ఇజాయెల్ సైనికులు మృతి చెందారని అన్నారు. మృతి చెందిన సైనికులకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాళులు అర్పించారు. సైనికుల భారీ నష్టంతో తన హృదయం ముక్కలైందని అన్నారు. అస్థిరమైన పరిస్థితులు నెలకొన్నా.. భారీ నష్టం జరిగినా యుద్ధ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. -
ఇజ్రాయెల్ హీరో? ఎవరీ అర్నాన్ జమోరా
హమాస్ చెరలో బంధీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ కఠినమైన ఆపరేషన్ను విజయవంతం చేసేందుకు ఐడీఎఫ్ కమాండర్ అర్నాన్ జమోరా ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. హమాస్ మెరుపు దాడుల నుంచి విరోచిత పోరాటం చేసి ప్రాణాలొదిన అర్నాన్ జమెరాను ఇజ్రాయెల్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ పౌరులు హీరోగా కీర్తిస్తున్నారు. శనివారం హమాస్ చెరలో బందీలుగా ఉన్న నావో అర్గమణి, అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్లను ఇజ్రాయెల్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ (యమమ్)కమాండర్, టాటికల్ ఆపరేటర్ అర్నాన్ జమోరా నుసిరత్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి వారిని రక్షించారు. ఈ తరుణంలో ప్రత్యర్ధుల దాడిలో కమాండర్ అర్నాన్ జమెరా ప్రాణాలొదారు. తాజాగా, ఆయన మరణంపై ఇజ్రాయెల్ మరణంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది.Behind every rescue mission, are Israeli men and women who risk their lives. We are devastated to share that Chief Inspector Arnon Zamora, commander and tactical operator in the Yamam (National Police Counter-Terrorism Unit), who was critically wounded in the operation to… pic.twitter.com/4P3qRre7Ia— Israel Foreign Ministry (@IsraelMFA) June 8, 2024బాధకలిగించిందిప్రతి రెస్క్యూ ఆపరేషన్లో ఇజ్రాయెల్ సైనికులు తమ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడిన యమమ్ (నేషనల్ పోలీస్ కౌంటర్-టెర్రరిజం యూనిట్)లో కమాండర్,టాక్టికల్ ఆపరేటర్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్నాన్ జమోరా ప్రాణాలొదలడం బాధకలిగించిందని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్లో పేర్కొంది.అర్నాన్ జమోరా ఎవరు?ఇజ్రాయెల్ మీడియా సంస్థ హారెట్జ్ ప్రకారం..ఇజ్రాయెల్ నగరం స్డెరోట్ సమీపంలో జమోరా స్డే డేవిడ్ గ్రామానికి చెందిన వారు. ఆయనకు భార్య మిచాల్ ఇద్దరు పిల్లలు, అతని తల్లిదండ్రులు రూవెన్ రూతీలతో కలిసి ఉంటున్నారు.ఇక జమెరా గతేడాది అక్టోబర్ 7 న యాద్ మొర్దెచాయ్ ప్రాంతంలో అనేక మంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ జామెరా ధైర్య సహాసాల్ని గుర్తు చేసుకున్నారు. గాజాలో హమాస్ చేతిలో ఉన్న 4 మంది బందీలను రక్షించడానికి సాహసోపేతమైన ఆపరేషన్కు నాయకత్వం వహించిన అర్నాన్ జమోరా మృతిపై విచారం వ్యక్తం చేశారు. -
Israel-Hamas war: వెళ్లిపోవాల్సిందే...రఫా ప్రజలకు మరోసారి ఇజ్రాయెల్ అల్టిమేటమ్
రఫా(గాజా స్ట్రిప్): గాజా దక్షిణాన ఉన్న చిట్టచివరి పెద్ద పట్టణం రఫాలో లక్షలాది మంది జనం ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. రఫాను ఖాళీచేసి వెళ్లాలని జనాలకు ఇజ్రాయెల్ సైనికబలగాలు మరోసారి ఆదేశించాయి. ఉత్తర దిశ నుంచి మొదలెట్టి దక్షిణం దిశగా భూతల దాడులతో ఆక్రమణలు, దాడులను ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తోంది. అమెరికా, ఇతర మిత్రదేశాలు దూకుడు తగ్గించాలని మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ తన దాడులను ఆపట్లేదు. హమాస్ సాయుధుల ప్రతిదాడులతో శనివారం రఫా శివారుప్రాంతాలు భీకర రణక్షేత్రాలుగా మారిపోయాయి. రఫా తూర్పున మూడింట ఒక వంతు భూభాగంలో జనాలను ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇప్పటికే ఖాళీచేయించింది. రఫా మొత్తాన్ని ఖాళీచేయించే దుస్సాహసానికి దిగితే మానవతా సాయం చాలా కష్టమవుతుందని, అమాయక పౌరుల మరణాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. -
21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళా(ఐడీఎఫ్)నికి తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే ఘటనలో 27 మంది సైనికులు మృతి చెందారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్పై యుద్ధం మొదలయ్యాక ఇంతమంది సైనికులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. యుద్ధం నిలిపేసి, బందీలను విడుదలయ్యేలా చూడాలంటూ నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. పూర్తి స్థాయి విజయం సిద్ధించే దాకా యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. -
సిరియా, ఇరాక్పై ఇరాన్ క్షిపణి దాడులు
టెహ్రరాన్: సిరియా, ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఇజ్రాయెల్ గూఢచార బృందాల సమావేశంపై దాడి జరిపినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ తెలిపింది. ఇందులో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాయి. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నాయి. మరణించిన పలువురు పౌరుల్లో ప్రముఖ వ్యాపారవేత్త పెష్రా డిజాయీ కూడా ఉన్నారని కుర్దిస్థాన్ డెమోక్రటిక్ పార్టీ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణులతో సిరియాలోని పలు ప్రాంతాలపై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ కమాండర్లకు చెందిన స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇరాన్లోని కెర్మాన్, రాస్క్లలో ఇటీవల ఉగ్రవాదులు దాడులు జరిపి పలువురు ఇరాన్ దేశస్థులను హతమార్చారు. ఆ దాడులకు ప్రతిస్పందనగా సిరియాపై ఇరాన్ క్షిపణులతో రెచ్చిపోయింది. సిరియాకు చెందిన అలెప్పో గ్రామీణ ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. మధ్యధరా సముద్రం వైపు నుంచి 4 క్షిపణులు వచ్చినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ గూఢచారి బృందాలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తున్న ఇరాన్ ఈ మేరకు దాడులు జరిపింది. ఇదీ చదవండి: పుతిన్, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్ చెప్పిన ప్రధాని -
అమెరికా నిందలో నిజమెంత?
ఖండాంతరాలు దాటి వెళ్లి శత్రువుగా భావించినవారిని చడీచప్పుడూ లేకుండా అంతం చేయటం అంతర్జాతీయంగా ఎప్పటినుంచో వినిపిస్తున్న కథే. ఈ విషయంలో తరచుగా ఇజ్రాయెల్, రష్యాల పేర్లు వస్తుంటాయి. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో ఎక్కువగా అమెరికా గూఢచార సంస్థ సీఐఏ పేరు వినబడేది. దాని లక్ష్యాలన్నీ దేశాధినేతలే. అది సాగించిన హత్యలపై ఆ సంస్థనుంచి రిటైరైనవారు ఎన్నో పుస్తకాలు రాశారు. సీఐఏ సాగించిన ఆపరేషన్లు ఇతివృత్తంగా 30కి పైగా చలనచిత్రాలొ చ్చాయి. టీవీ సీరియల్స్ కూడా తక్కువేం కాదు. చిత్రమేమంటే ఈమధ్య కొత్తగా వెలుగులోకొచ్చిన సీఐఏ ఫైళ్ల ఆధారంగా ‘ది లుముంబా ప్లాట్’ అనే పేరుతో అప్పటి కాంగో ప్రధాని పాట్రిస్ లుముంబాను 1961లో హతమార్చిన తీరుపై స్టువార్ట్ ఏ. రీడ్ అనే ఆయన ఒక పుస్తకాన్ని వెలువరించాడు. అలాంటి అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉద్యమకారుణ్ణి హతమార్చటానికి జరిగిన కుట్రలో భారత ప్రభుత్వ అధికారి ప్రమేయం వున్నదని అమెరికా ఆరోపిస్తోంది. మొన్న జూన్లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సందర్శించిన తర్వాత ఈ కుట్ర గురించి మన ప్రభుత్వాన్ని అమెరికా హెచ్చరించిందని నవంబర్ 22న బ్రిటన్కు చెందిన ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’ వెల్లడించింది. బుధవారం న్యూయార్క్ సిటీ కోర్టులో ప్రభుత్వ అటార్నీ విలియన్స్ 15 పేజీల అభియోగపత్రాన్ని కూడా దాఖలు చేశారు. అందులో ఈ కుట్ర లక్ష్యం ఎవరన్న పేరు ప్రస్తావించికపోయినా సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నాయకుడు పత్వంత్సింగ్ పన్నూన్ అని అక్కడి మీడియా అంటున్నది. ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఇటువంటి ఆరోపణే చేశారు. అక్కడ దుండగుల కాల్పుల్లో మరణించిన ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర వున్నదని ఆయన అభియోగం. ఇందుకు సంబంధించి మన దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. నిరాధారమైన ఆరోపణ చేయడాన్ని మన దేశం తప్పుబట్టి ప్రతీకారంగా ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దౌత్య సిబ్బందిని తగ్గించుకోమని కెనడాను కోరింది. ఆ అంకం ముగియకుండానే తాజాగా అమెరికా సైతం ఆ మాదిరి ఆరోపణే చేయటం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా మిత్ర దేశాలమధ్య ఈ తరహా పొరపొచ్చాలు రావు. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో మనం సోవియెట్ యూనియన్తో సన్నిహితంగా వుండటాన్ని జీర్ణించుకోలేక అమెరికా పాకిస్తాన్కు అండదండలందించేది. ప్రపంచీకరణ తర్వాత అంతా మారింది. ఇప్పుడు మనకు అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు బలంగా వున్నాయి.ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు భారత్ సహాయసహకారాలు అవసరమని అమెరికా విశ్వసిస్తోంది. తన ఆరోపణను నిర్ద్వంద్వంగా రుజువుచేసే సాక్ష్యాధారాలు అమెరికా దగ్గరున్నాయా? భారత ప్రభుత్వ అధికారి ఒకరు నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడి ద్వారా ఒక కిరాయి హంతకుణ్ణి వినియోగించి పన్నూన్ను హతమార్చటానికి కుట్ర చేశారని అటార్నీ దాఖలు చేసిన అభియోగపత్రం చెబుతోంది. అయితే నిఖిల్ గుప్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక సంస్థ తాలూకు ఏజెంట్ను కిరాయి హంతకుడిగా పొరబడి పన్నూన్ హత్యకు లక్షన్నర డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, అడ్వాన్స్గా 15,000 డాలర్లు అంద జేశాడని అటార్నీ ఆరోపణ. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అభియోగపత్రానికి జత చేశారు. ఈ హత్య చేయించగలిగితే అతనిపై గుజరాత్లో వున్న క్రిమినల్ కేసును రద్దు చేయిస్తానని భారత అధికారి వాగ్దానం చేశారని ఎఫ్బీఐ చెబుతోంది. మాదకద్రవ్యాలు, మారణాయుధాల విక్రయం కేసులో నిందితుడైన నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్కు వెళ్లిన సమయంలో అతన్ని అరెస్టు చేయాలంటూ ఎఫ్బీఐ కోరటంతో మొన్న జూన్ 30న అక్కడి పోలీసులు అదుపులోనికి తీసుకుని అమెరికాకు అప్పజెప్పారు. కెనడాలో జరిగిన నిజ్జార్ హత్యలో తమ హస్తమున్నదని గుప్తా ఎఫ్బీఐ ఏజెంట్ దగ్గర అంగీకరించాడంటున్నారు. ఖలిస్తాన్పై రిఫరెండమ్ జరగాలని పత్వంత్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు అమెరికా, కెనడా పౌరసత్వాలున్నాయి. ఖలిస్తాన్ వాదాన్ని మన ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదు. 80, 90 దశకాల్లో ఖలిస్తాన్ పేరిట పంజాబ్లో ఉగ్రవాదులు సాగించిన మారణకాండను కఠినంగా అణి చేసింది. 1985 జూన్ 23న 329మంది ప్రయాణికులతో కెనడానుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు బాంబులతో పేల్చివేశారు. ఆ విషయంలో కెనడా ప్రభుత్వం భారత్కు ఎలాంటి సహకారమూ అందించలేదు సరిగదా...కీలకమైన సాక్ష్యాధారాలను పోలీసులు ధ్వంసం చేశారని కూడా ఆరోపణలొచ్చాయి. ఈనాటికీ ఈ కేసు అతీగతీ లేకుండాపోయింది. అమెరికా చేసిన ఆరోపణలపై మన దేశం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. అది అందించే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిఖిల్ గుప్తాతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి నిజంగానే ప్రభుత్వాధికారా? అధికారే అయితే అత్యుత్సాహంతో అతను పరిధి దాటి ప్రవర్తించాడా? వేరే దేశాల్లో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవటం తమ విధానం కాదని నిజ్జార్ కేసు సందర్భంగా మన దేశం చెప్పింది. పైగా పకడ్బందీ వ్యవస్థలు అమల్లోవున్న అమెరికాలో అలాంటి పనికి ఎవరైనా సాహసిస్తారా అన్నది సందేహాస్పదం. పంజాబ్లో కనుమరుగైన ఖలిస్తాన్ ఉద్యమాన్ని మన దేశం ఇంత సీరియస్గా తీసుకుంటుందా అన్నది కూడా అనుమానమే. అమెరికా దగ్గరున్న సాక్ష్యాలు నిజంగా అంత బలంగా వున్నాయా, వుంటే దీన్ని తెగేదాకా లాగుతుందా అన్నది చూడాలి. ఈ కేసు సంగతెలావున్నా మన ప్రభుత్వం భవిష్యత్తులో ఈ మాదిరి ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది. -
బందీల విడుదలపై ఐర్లాండ్ ప్రధాని ట్వీట్.. ఇజ్రాయెల్ ఫైర్
టెల్ అవీవ్: హమాస్ రెండో విడత 17 మంది బందీలను ఆదివారం విడుదల చేసింది. వీరిలో ఐర్లాండ్కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక కూడా ఉంది. తమ దేశ బాలిక విడుదలపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ట్వీట్ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. తమ దేశ బాలిక ఎమిలి హ్యాండ్ విడుదల కావడంపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ హర్షం వ్యక్తం చేశారు. తప్పిపోయిందుకున్న బాలిక తిరిగిరావడం ఆనందాన్ని కలిగించిందని ట్వీట్ చేశారు. బాలిక కుటుంబంతో కలిసినందుకు ఇది ఎంతో సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. తమకు ఇది ఎంతో ఊరటను కలిగించిందని అన్నారు. అయితే.. ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ ట్వీట్ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. బాలిక తప్పిపోయిందని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దళాల ఒత్తిడితోనే బందీలను హమాస్ విడుదల చేసిందని స్పష్టం చేసింది. ఎమిలిని హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి బందీగా అపహరించుకుపోయారని తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో భాగంగా కాల్పులకు విరమణ ప్రకటించారు. 50 మంది బందీలను హమాస్ విడుదల చేయాలని ఒప్పందంలో అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం 24 మందిని హమాస్ విడుదల చేసింది. రెండో విడతగా 17 మందిని వదిలిపెట్టింది. ఇదీ చదవండి: Uttarakashi Tunnel Operation: ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్లో సైన్యం ఎంట్రీ -
యుద్ధంలో కీలక ఘట్టాన్ని చేరాం: ఇజ్రాయెల్
టెల్ అవీవ్: కాల్పుల విరమణ చేయాలని కోరుతున్న ప్రపంచ దేశాల విన్నపాన్ని ఇజ్రాయెల్ మరోసారి తోసిపుచ్చింది. ఆదివారం బాంబుల దాడులతో గాజా నగరంపై విరుచుకుపడింది. గాజాను రెండుగా విభజించి హమాస్తో జరుగుతున్న యుద్ధంలో కీలక ఘట్టానికి చేరుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి ప్రకటించారు. గాజాను మొత్తం చుట్టుముట్టి, ఉత్తర-దక్షిణ గాజాగా విభజించడంలో విజయం సాధించామని వెల్లడించారు. అటు.. గాజాలో సమాచార వ్యవస్థ నిలిచిపోవడం యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇది మూడోసారి. హమాస్ అంతమే ధ్యేయంగా విరుచుకుపడిన ఇజ్రాయెల్ సేనలు.. ఆదివారం గాజాలో రెండు శరణార్థి శిబిరాలపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 53 మంది మరణించారు. అటు.. హమాస్ను అంతం చేసేవరకు వెనక్కి తగ్గబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. తమకు ఇంకో దారి లేదని తెలిపారు. యుద్ధాన్ని ప్రారంభించింది హమాస్ అని గుర్తుచేశారు. మరోవైపు దక్షిణ గాజాలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తున్న క్రమంలో పశ్చిమాసియాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బ్లింకెన్ ఆదివారం వెస్ట్బ్యాంక్లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. ఇరాక్లోనూ పర్యటన చేపట్టారు. బాగ్దాద్లో ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేడు తుర్కియేలో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు ఇజ్రాయెల్లో 1400 మంది మరణించారు. 280 మంది నిర్బంధంలో ఉన్నారు. ఇదీ చదవండి: Vladimir Putin Body Doubles: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? -
బంధించారు.. కర్రలతో కొట్టారు.. నరకం కనిపించింది!
టెల్ అవీవ్: 17 రోజులుగా తమ చెరలో ఉన్న యోచెవ్డ్ లిఫ్షిట్జ్(85), నురిట్ కూపర్(79) అనే ఇద్దరు మహిళలను హమాస్ మిలిటెంట్లు సోమవారం విడుదల చేశారు. మానవతా దృక్పథంతోపాటు వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విడుదల చేసినట్లు తెలిపారు. స్నేహితులైన వారిద్దరూ ఇజ్రాయెల్–గాజా సరిహద్దు లోని కిబుట్జ్ నిర్ ఓజ్ నివాసితులు. మంగళవారం టెల్ అవీవ్కు చేరుకున్నారు. మిలిటెంట్ల అధీనంలో తనకు ఎదురైన అనుభవాలను యోచెవెడ్ లిఫ్షిట్జ్ మీడియాతో పంచుకున్నారు. ‘ఈ నెల 7న మిలిటెంట్లు నన్ను బంధించారు. మోటార్బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ప్రతిఘటించినందుకు కర్రలతో కొట్టారు. రోదించినా పట్టించుకోలేదు. గాజాకు బలవంతంగా తరలించారు. ఒక సొరంగంలోకి తీసుకెళ్లారు. భూగర్భంలో సాలెగూళ్లలాంటి సొరంగాలు ఉన్నాయి. మేము వెళ్లేసరికి డాక్టర్లు, వైద్య సిబ్బంది అక్కడున్నారు. తాము ఖురాన్ను విశ్వసిస్తామని, ఎలాంటి హాని కలిగించబోమంటూ మిలిటెంట్లు మాతో చెప్పారు. డాక్టర్లు మాకు వైద్య సేవలు అందించారు. కావాల్సిన ఔషధాలు ఇచ్చారు. సొరంగాలు తడిగా, తేమగా ఉన్నాయి. అక్కడ పారిశుధ్య సౌకర్యాలు ఫరవాలేదు. మాకు ఎలాంటి అస్వస్థత కలగలేదు. పరుపులపై నిద్రించాం. మిలిటెంట్లు మొదట్లో గాజాకు తీసుకెళ్లేటప్పుడు హింసించినా అక్కడికి వెళ్లిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇజ్రాయెల్–గాజా సరిహద్దులో నిర్మించిన రక్షణ కంచె గురించి చెప్పాలి. లక్షల డాలర్లు ఖర్చుచేసి ఇజ్రాయెల్ సైన్యం ఈ నిర్మించిన ఈ కంచెతో ఉపయోగం శూన్యం. దేశానికి అది ఏమాత్రం రక్షణ క ల్పించడం లేదు. అత్యంత ఖరీదైన ఈ ఫెన్సింగ్ను మిలిటెంట్లు సులభంగా ధ్వంసం చేసి వచ్చి, మమ్మల్ని అపహరించారు. హమాస్ నుంచి ఎదురవుతున్న ముప్పును ఇజ్రాయెల్ సీరియస్గా తీసుకోవడం లేదు’ అని లిఫ్షిట్జ్ఆక్షేపించారు. లిఫ్షిట్జ్, నురిట్ కూపర్ భర్తలు ఇంకా హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. -
ఇజ్రాయెల్-హమాస్ ముఖాముఖి పోరు
గాజా: ఇన్నాళ్లూ పరస్పరం వైమానిక దాడులకు, రాకెట్ దాడులకే పరిమితమైన ఇజ్రాయెల్ సైనికులు, హామస్ మిలిటెంట్లు తొలిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. గాజా భూభాగంలో ఇరుపక్షాల మధ్య ముఖాముఖి పోరు సాగిందని హమాస్ సైనిక విభాగం అల్–ఖసమ్ బ్రిగేడ్స్ ఆదివారం వెల్లడించింది. ఈ నెల 7న యుద్ధం మొదలైన తర్వాత భూభాగంపైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య ప్రత్యక్షంగా ఘర్షణ జరగడం ఇదే మొదటిసారి. తమ భూభాగంలోకి దూసుకొచి్చన ఇజ్రాయెల్ మిలటరీకి చెందిన రెండు బుల్డోజర్లను, ఒక యుద్ధ ట్యాంక్ను ధ్వంసం చేశామని హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. తమ ఎదురుదాడిని తట్టుకోలేక ఇజ్రాయెల్ సైన్యం వాహనాలు వదిలేసి కాలినడకన వారి సరిహద్దు వైపు పలాయనం చిత్తగించిందని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్–ఖసమ్ బ్రిగేడ్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఖాన్ యూనిస్ సిటీలో ఇజ్రాయెల్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నామని తెలియజేసింది. అల్–ఖసమ్ బ్రిగేడ్స్ ప్రకటనపై ఇజ్రాయెల్ సైన్యం ప్రతిస్పందించింది. దక్షిణ గాజాలో సెక్యూరిటీ ఫెన్స్ వద్ద విధి నిర్వహణలో ఉన్న తమ బలగాలపై స్వల్పంగా కాల్పులు జరిగాయని స్పష్టంచేసింది. కాల్పులు జరిపిన మిలిటెంట్లపై తమ యుద్ధ ట్యాంకు నుంచి ప్రతిదాడి చేశామని పేర్కొంది. దాంతో వారంతా చెల్లాచెదురు అయ్యారని వెల్లడించింది. గాజా భూభాగంలో తమ సేనలు మకాం వేసిన మాట వాస్తవమేనని ఇజ్రాయెల్ మరోసారి అంగీకరించింది. ఈ నెల 13న కూడా ఇదే మాట చెప్పింది. కానీ, హమాస్తో ముఖాముఖి ఘర్షణ జరిగినట్లు వెల్లడించడం మాత్రం ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ప్రముఖ నేత ముహమ్మద్ కటామాష్ హతమయ్యాడు. -
జరిగింది చాలు, మానవ హక్కులను కాపాడండి : యూఎన్లో మౌన నిరసన
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ముగింపు సమావేశం సందర్భంగా కొంతమంది మానవ హక్కుల ప్రతినిధులు మౌనంగా నిరసన తెలిపారు. జెనీవాలో జరిగిన రెండు రోజుల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమీక్ష ముగింపులో భాగంగా రాయబారి మిచెల్ టేలర్ ప్రసంగం సందర్భంగా సామాజిక, జాతి, న్యాయ ఉద్యమకారులు పలువురు ఈ నిరసన వ్యక్తం చేశారు. మిచెల్ మాట్లాడుతున్న సమయంలో గాజాలో ఇజ్రాయెల్ చర్యలను సమర్ధిస్తున్న ఆమెరికాకు వ్యతిరేకంగా మానవ హక్కులను, గౌరవాన్ని కాపాడండి అంటూ ప్రతినిధులు మౌనంగా లేచి నిలబడి, వెనక్కి తిరిగి నిల్చున్నారు. ముందుగా డిగ్నిటీ డెలిగేషన్ సభ్యులు ఈ మౌన నిరసనకు దిగారు. అమెరికా న్యాయ వ్యవస్థ, చట్టాలు, విధానాలపై, వైఖరికి పట్ల తాము చాలా నిరాశకు గురయ్యామని అలయన్స్ శాన్ డియాగో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రియా గెర్రెరో అన్నారు. గ్వామ్, ప్యూర్టో రికో, హవాయి తదితర ప్రాంతాల ప్రతినిధులుఇందులో ఉన్నారు. జెనీవాలోని యుఎన్లోని యుఎస్ రాయబారి మిచెల్ టేలర్ బుధవారం యుఎన్ మానవ హక్కుల కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, సిఫార్సులను వచ్చే నెల (నవంబర్ 3న) విడుదల చేయనుంది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే బైడెన్ సలహామేరకు రఫా సరిహద్దు గుండా గాజా ప్రజలకు ఆహార పదార్థాలు, మందులు అనుమతించడానికి ఎట్టకేలకు ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) కూడా ఇజ్రాయెల్ చేరుకున్నారు. కష్టాల్లో ఉన్న దేశానికి మద్దతుగా ఉంటాం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఎపుడూ నిలబడతామంటూ గురువారం ట్వీట్ చేశారు. రిషీ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో సమావేశంకానున్నారు. At the UN Human Rights Committee, many delegates turned their backs on US Ambassador Michelle Taylor in silent protest against the American backing of Israel's war-crimes in Gaza. Huge. The world is slowly waking up to their lies and deceit. #Gaza pic.twitter.com/YIEHKY114D — Advaid അദ്വൈത് (@Advaidism) October 19, 2023 I am in Israel, a nation in grief. I grieve with you and stand with you against the evil that is terrorism. Today, and always. סוֹלִידָרִיוּת pic.twitter.com/DTcvkkLqdT — Rishi Sunak (@RishiSunak) October 19, 2023 -
'గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ దళాల పనే'
జెరూసలేం: గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు చేసిందన్న పాలస్తీనా ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని స్పష్టం చేసింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా విడుదల చేసింది. ఆస్పత్రి దాడిపై తీవ్రంగా ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ మేరకు స్పందించింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ హమాస్తో కలిసి మిత్ర కూటమిగా పనిచేస్తోంది. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. హమాస్ దళాలకు చెందిన రాకెట్ దాడుల్లోనే ఆస్పత్రి కూలిపోయిందని స్పష్టం చేసింది. #IsraelHamasConflict | Al Ahli Hospital hit by the Islamic Jihad terror organization. @PoojaShali with more details. #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @GauravCSawant pic.twitter.com/DUOFYMRz9p — IndiaToday (@IndiaToday) October 18, 2023 అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్లో నోవా ఫెస్టివల్పై దాడులు ప్రారంభించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడుల నుంచి తేరుకుని ఇజ్రాయెల్ హమాస్ దళాలపై తిరగబడింది. హమాస్ అంతమే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో జ్రాయెల్లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. హమాస్ దళాల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు. A purported Islamic Jihad rocket hit hospital #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @PoojaShali pic.twitter.com/RgTJ8hldgm — IndiaToday (@IndiaToday) October 18, 2023 ఇదీ చదవండి: సంక్షోభం అంచున పాక్.. ఇంధన లేమితో 48 విమానాలు రద్దు -
నుక్భా ఫైటర్స్ ఎవరు? హమాస్తో సంబంధం ఏమిటి?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీనిలో చాలా మంది ఇజ్రాయిలీలు మృతి చెందారు. లెక్కకు మించిన యూదులు బందీలుగా మారారు. హమాస్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్ను శ్మశానవాటికగా మార్చివేసింది. అలాగే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో పడింది. ఈ యుద్ధం నేపధ్యంలో నుక్భా ఫైటర్స్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ వీరు ఎవరు? హమాస్తో వారికి సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హమాస్ ఒక పెద్ద విభాగం. దీనిలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఇజ్రాయెల్పై దాడి చేసిన గ్రూపు పేరు ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్. నుక్భా ఈ బ్రిగేడ్కు చెందిన అత్యంత క్రూరమైన పోరాట యోధులు. వారిలో మానవత్వం మచ్చుకైనా ఉండదు. ఎదురుగా ఏది అడ్డుపడినా, ధ్వంసం చేసుకుంటూ, ముందుకు వెళ్లడమే వారి లక్ష్యం. నుక్భా ఫైటర్స్ చాలా ప్రమాదకరమైనవారు. వారు పిల్లలను, వృద్ధులను కూడా విడిచిపెట్టరు. నుక్భా ఫైటర్స్ ఇజ్రాయెల్కు నిరంతరం సవాల్గా నిలుస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ చాలాకాలం నుంచి వారితో పోరాడుతూనే ఉంది. వారిని వెతికి పట్టుకుని మరీ మట్టుపెడుతూ వస్తోంది. నుక్భా ఫైటర్లు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో నిష్ణాతులు. వారు గెరిల్లా యుద్ధాన్ని అనుసరిస్తుంటారు. హమాస్ తన సైన్యాన్ని ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ద్వారా రిక్రూట్ చేస్తుంది. వీరి శిక్షణ సమయంలో బలంగా ఉండే కొంతమంది యువకులను గుర్తిస్తారు. వారిని నుక్భా ఫైటర్స్గా తీర్చిదిద్దుతారు. ఇది కూడా చదవండి: ఆదివాసీల ‘జలియన్వాలాబాగ్’ ఘటన ఏమిటి? ఖర్సవాన్లో ఏం జరిగింది? -
గాజా ఆస్పత్రిపై భీకర దాడి
ఖాన్ యూనిస్/వాషింగ్టన్: హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. దాడిలో ఆస్పత్రి పరిసరాలు భీతావహంగా మారాయి. ఆస్పత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దాడి ఘటనపై పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. దాడికి ముందు ఆ ఆస్పత్రిలో మూడువేల మంది శరణార్థులు ఆశ్రయంపొందుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తర గాజాను ఖాళీ చేయాలని, తక్షణమే దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని పాలస్తీనియన్లను ఆదేశించిన ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం అదే దక్షిణ గాజాపై భీకర స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. భారీగా రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో పదులు సంఖ్యలో జనం మరణించారు. దక్షిణ గాజాలోని రఫా, ఖాన్ యూనిస్ నగరాల్లో ఈ దాడులు జరిగాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. రఫాలో 27 మంది, ఖాన్ యూనిస్లో 30 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ మాజీ మంత్రి బసీమ్ నయీం చెప్పారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఉత్తర గాజాపై భూతల దాడులకు సన్నాహాలు చేస్తూ, మరోవైపు దక్షిణ గాజాపై హఠాత్తుగా వైమానిక దాడులు చేయడం గమనార్హం. హమాస్ స్థావరాలను, మిలిటెంట్ల మౌలిక సదుపాయాలను, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడానికే దక్షిణ గాజాపై రాకెట్లు దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. హమాస్ కదలికలు ఎక్కడ కనిపించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంకా శిథిలాల కిందే మృతదేహాలు ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. ఇరుపక్షాల నడుమ పరస్పర దాడుల్లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు. మృతుల్లో మూడింట రెండొంతుల మంది చిన్నపిల్లలేనని గాజా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్ తెలిపారు. గాజాలో మరో 1,200 మంది భవనాల శిథిలాల కింద చిక్కుకొని, మృతి చెందినట్లు భావిస్తున్నామని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ మరణాలు అధికారిక గణాంకాల్లో చేరలేదు. విద్యుత్, పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో శిథిలాలను తొలగించడం సాధ్యం కావడం లేదు. ఇజ్రాయెల్ దళాలు భీకర స్థాయిలో దాడులు చేస్తున్నా హమాస్ మిలిటెంట్లు వెనక్కి తగ్గడం లేదు. గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్లు ప్రయోగిస్తూనే ఉన్నారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ వెల్లడించారు. ఉన్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తమ పదాతి దళాలు అడుగు ముందుకేస్తాయని, తమ సైన్యం గాజా సరిహద్దుల్లో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఉత్తర గాజా సగం ఖాళీ! ఉత్తర గాజా నుంచి జనం తరలింపు కొనసాగుతోంది. దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. ఉత్తర గాజా సగానికి పైగా ఖాళీ అయినట్లు సమాచారం. ఆసుపత్రుల్లోని వేలాది మంది రోగులు, క్షతగాత్రులు ఇంకా అక్కడే ఉన్నారు. ఆహారం, నీరు, ఔషధాలు పూర్తిగా నిండుకున్నాయని, బాధితుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాలస్తీనియన్ల కోసం ఇతర దేశాలు పంపించిన ఆహారం, నిత్యావసరాలు వారికి అందడం లేదు. రఫా సరిహద్దును ఈజిప్టు మూసివేసింది. నిత్యావసరాలతో కూడిన వాహనాలు గాజాలో ప్రవేశించడానికి ప్రస్తుతం ఈ సరిహద్దు వద్ద వేచి ఉన్నాయి. ఈజిప్టు అనుమతిస్తేనే గాజా ప్రజలకు ఆహారం అందుతుంది. రఫా సరిహద్దును తెరిపించేందుకు కొందరు మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇజ్రాయెల్ మంగళవారం మూడు గంటలపాటు గాజాకు నీరు సరఫరా చేసింది. ఈ నీరు గాజాలో కేవలం 14 శాతం మందికి సరిపోతుంది. గాజాపై దాడులు ఆపండి: ఖమేనీ గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఖండించారు. దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ తీరు మార్చుకోకపోతే హింసాత్మక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ వైఖరి పట్ల ఇస్లామిక్ దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని స్పష్టం చేశారు. రెచ్చిపోయిన లెబనాన్ హెజ్బొల్లా మిలిటెంట్లు లెబనాన్–ఇజ్రాయెల్ సరిహద్దులో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం హెజ్బొల్లా మిలిటెంట్లు లెబనాన్ భూభాగం నుంచి ఉత్తర ఇజ్రాయెల్పైకి యాంటీ–ట్యాంక్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో ఇజ్రాయెల్లో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దు నుంచి పౌరులను ఖాళీ చేయించాలని ఆదేశించింది. తమ భూభాగంపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా దక్షిణ లెబనాన్పై వైట్ ఫాస్పరస్ బాంబులను ప్రయోగించింది. యుద్ధ ట్యాంకులతో బాంబుల వర్షం కురిపించింది. ఇంతలో లెబనాన్ వైపు నుంచి ఇజ్రాయెల్పై మరో రెండు యాంటీ–ట్యాంక్ క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడులు నిర్వహించింది. నలుగురు మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గతవారం లెబనాన్లోని ఇస్లామిక్ జిహాద్ సభ్యులు ఇజ్రాయెల్పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా మిలిటెంట్లు, ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్తో ఘర్షణకు దిగుతున్నారు. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఘర్షణలు మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హెజ్బొల్లాకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం ఇతర దేశాలకు విస్తరించకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తుర్కియే విదేశాంగ మంత్రి హక్కన్ ఫిదాన్ చెప్పారు. నేడు ఇజ్రాయెల్లో జో బైడెన్ పర్యటన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. హమాస్ దాడులను ఖండించిన ఆయన ఇప్పటికే ఇజ్రాయెల్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యూదులకు సంఘీభావం తెలియజేస్తూ ఇజ్రాయెల్లో పర్యటించబోతున్నానని బైడెన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జోర్డాన్లోనూ పర్యటిస్తానని, ఇస్లామిక్ దేశాల అధినేతలతో భేటీ అవుతానని, గాజాలో తాజా పరిణామాలు, పాలస్తీనియన్లకు అందించాల్సిన మానవతా సాయంపై చర్చిస్తానని వెల్లడించారు. పాలస్తీనియన్లకు హమాస్ ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. గాజా ప్రజలకు మానవతా సాయం అందించడానికి వీలుగా ఒక ప్రణాళిక రూపొందించాలని అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయించాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం చెప్పారు. హమాస్ టాప్ కమాండర్ హతం సెంట్రల్ గాజాలోని బురీజ్ శరణార్థుల శిబిరంపై జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అగ్రశ్రేణి కమాండర్ అయమాన్ నొఫాల్ హతమయ్యాడు. ఈ విషయాన్ని హమాస్ మిలటరీ విభాగం స్వయంగా వెల్లడించింది. నొఫాల్ సెంట్రల్ గాజా స్ట్రిప్లో హమాస్ మిలిటెంట్ వ్యవహారాల ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. ఇతర ఇస్లామిక్ దేశాల్లోని మిలిటెంట్ గ్రూప్లతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. -
'ఇక్కడి నుంచి తీసుకెళ్లండి..' హమాస్ బందీలో యువతి ఆవేదన
గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తోంది. పండగవేళ ఇజ్రాయెల్పై విరుచుకుపడిన హమాస్ దళాలు 199 మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకున్నారు. అకస్మాత్తుగా హమాస్ దళాలు జరిపిన తీరుకు విస్తుపోయిన ఇజ్రాయెల్.. తేరుకుని ధీటుగా బదులిచ్చింది. హమాస్ను తుదముట్టించేంతవరకు విశ్రమించబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే దాడుల్లో గాయపడి తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెలీ యువతికి సంబంధించిన ఓ వీడియోను హమాస్ విడుదల చేసింది. భుజం గాయంతో బాధపడుతున్న ఆ యువతి శస్త్రచికిత్స తీసుకుంటున్న వీడియోను హమాస్ టెలిగ్రామ్లో బహిర్గతం చేసింది. బందీగా ఉన్న షోహమ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల మియా షెమ్ వీడియోలో మాట్లాడుతోంది. ఆమె హమాస్ సంరక్షణలోనే ఉన్నట్లు హామీ ఇచ్చింది. దాడుల్లో విరిగిన చేతికి గాజాలో శస్త్రచికిత్స చేయించుకున్నానని వెల్లడించిన మియా.. వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. 'హాయ్, నేను మియా షేమ్. నాకు 21 ఏళ్ల వయస్సు. ప్రస్తుతం నేను గాజాలో ఉన్నాను. దాడి జరిగే క్రమంలో నేను పార్టీలో ఉన్నాను. నా చేతికి తీవ్ర గాయమైంది. గాజాలోని ఓ ఆసుపత్రిలో నా చేతికి 3 గంటలపాటు శస్త్రచికిత్స జరిగింది. ఇక్కడ నుంచి వీలైనంత త్వరగా నన్ను తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను' అని మియా షెమ్ పేర్కొంది. అక్టోబర్ 7న మ్యూజికల్ ఫెస్టివల్లో హమాస్ దళాల దాడులు దిగ్భ్రాంతిని గురిచేశాయి. రాకెట్ దాడులతో విరుచుకుపడిన హమాస్.. ఇజ్రాయెల్లో పండవేళ మారణహోమాన్ని సృష్టించింది. 199 మందిని బందీలుగా పట్టుకుని గాజాలో బందించింది. ఇజ్రాయెల్లో 75 ఏళ్ల చరిత్రలో ఇంతటి స్థాయిలో ఒకేరోజు మరణాలు సంభవించింది ఇదే ప్రథమం. ఇదీ చదవండి: మోహరించిన ఇజ్రాయెల్ సేనలు -
ఇజ్రాయెల్కు ధర్మశాలతో సంబంధం ఏమిటి?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైనికులు గాజా స్ట్రిప్నంతటినీ చుట్టుముట్టారు. ఈ యుద్ధ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సోదరులను ఇజ్రాయెల్ వెనక్కి రావాలంటూ పిలుపునిచ్చింది. దీంతో ఇప్పుడు భారతదేశ సందర్శనలో ఉన్న యూదులు తమ స్వదేశానికి తిరిగివెళుతున్నారు. ఫలితంగా మనదేశంలోని ఒక నగరం ఖాళీగా మారిపోతోంది. ఈ నగరం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ నగరం గురించి, ఇజ్రాయెల్తో ఆ నగరానికున్న అనుబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న నగరం.. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల. ఇజ్రాయెలీలు ఈ నగరంలోని ధర్మ్కోట్కు వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇజ్రాయెలీలు సమావేశమవుతారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ యువత ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చి, చాలా కాలం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఖబద్ హౌస్ కూడా ఉంది. దానిలో ఇజ్రాయెలీలు ప్రార్థనలు చేస్తారు. ఇజ్రాయెల్లోని ప్రతి ఒక్కరూ అంటే యువకులైనా, యువతులైనా సైన్యంలో తప్పనిసరిగా శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత చాలా మంది యువకులు హిమాచల్ ప్రదేశ్లోని ఈ ప్రాంతానికి వచ్చి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఈసారి హమాస్ దాడి వారి విశ్రాంతికి అంతరాయం కలిగించింది. అనుకోని పరిస్థితుల్లో వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్లవలసి వస్తోంది. భారతదేశానికి వచ్చే ఇజ్రాయెలీలు ధర్మ్కోట్తో పాటు, ఢిల్లీలోని పహర్గంజ్, రాజస్థాన్లోని అజ్మీర్లను కూడా సందర్శిస్తారు. ఇజ్రాయెలీల మతపరమైన స్థలాలు అంటే ఖబద్ హౌస్లు ఢిల్లీ, రాజస్థాన్లో ఉన్నాయి. ఇజ్రాయెలీలు అక్కడ ప్రార్థనలు చేస్తారు. యూదుల మత ప్రార్థనా స్థలాలు దాదాపు ప్రతి దేశంలో ఉన్నాయి. ఇక్కడ యూదులు బస చేస్తుంటారు. ఇది కూడా చదవండి: ఈవీఎంలోని బటన్లను రెండుసార్లు నొక్కితే ఏమవుతుంది? -
మోహరించిన ఇజ్రాయెల్ సేనలు
జెరూసలేం/గాజా స్ట్రిప్/రఫా: గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్ల అంతు చూడడంతోపాటు వారి స్థావరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. పదాతి దళాలు పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాయి. 3 లక్షలకుపైగా ఇజ్రాయెల్ రిజర్వ్ సైనికులు గాజా సరిహద్దుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం సోమవారం పదో రోజుకు చేరుకుంది. ఈ పోరులో ఇప్పటిదాకా గాజాలో 2,750 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్లో 1,400 మందికిపైగా మరణించినట్లు తెలిసింది. అతిత్వరలోనే ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సేనలు భూతల దాడులు ప్రారంభిస్తాయని ప్రచారం సాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వలసబాట పట్టారు. ఇప్పటిదాకా 6 లక్షల మందికిపైగా జనం వెళ్లిపోయినట్లు అంచనా. ఇజ్రాయెల్కు సాయంగా మిత్రదేశం అమెరికా పంపించిన అత్యాధునిక యుద్ధవిమాన వాహక నౌకలు మధ్యదరా సముద్రంలో గాజా తీరంలో మోహరించాయి. గాజాను గుప్పిట్లో పెట్టుకొని తమ భద్రతకు ముప్పుగా పరిణమించిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ను నామరూపాల్లేకుండా చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఇజ్రాయెల్ సైన్యం తేలి్చచెబుతోంది. గాజాలో ప్రజల కష్టాలకు తెరపడడం లేదు. ఆహారం, నీరు, ఇంధనం కొరత తీవ్రరూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాయపడిన వేలాది మంది ఆసుపత్రుల్లో చేరారు. ఆసుపత్రుల్లో వారి పరిస్థితి మరింత హృదయవిదారకంగా మారింది. చికిత్సలు ఆగిపోవడంతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతదేహాలను భద్రపర్చడానికి ప్లాస్టిక్ బ్యాగ్లు కూడా లేవని వాపోతున్నారు. హమాస్ చేతిలో బందీలు 199 మంది గాజాలో హమాస్ మిలిటెంట్ల చేతిలో ప్రస్తుతం 199 మంది బందీలు ఉన్నారని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ సోమవారం వెల్లడించారు. దాదాపు 150 మంది బందీలు ఉన్నట్లు ఇప్పటిదాకా భావించామని, కానీ, 199 మంది ఉన్నట్లు తేలిందని చెప్పారు. బందీల్లో చాలామంది ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, బందీల్లో విదేశీయులు ఉన్నారో లేదో ఆయన బహిర్గతం చేయలేదు. వైమానిక దాడులు నిలిపివేస్తే బందీలు విడుదల గాజా స్ట్రిప్పై వైమానిక దాడులను ఇజ్రాయెల్ నిలిపివేస్తే బందీలను విడుదల చేయడానికి హమాస్ సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారం తెలియజేసింది. కానీ, దీనిపై హమాస్ స్పందించలేదు. తమపై దాడులు ఆపడంతోపాటు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే, అందుకు బదులుగా తమ వద్దనున్న బందీలను విడుదల చేయాలన్న ఆలోచనలో హమాస్ ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో.... లెబనాన్ సరిహద్దుల్లో నివసిస్తున్న యూ దులంతా వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయా లని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లెబనాన్ సరిహద్దుల సమీపంలో 28 యూదు కాలనీలు ఉన్నాయి. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోనూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం, లెబనాన్ ప్రభుత్వ మద్దతున్న షియా తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా సభ్యుల మధ్య పరస్పరం కాల్పులు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైనిక స్థావరాల్లోని నిఘా కెమెరాలను హెజ్బొల్లా సభ్యులు ధ్వంసం చేయడం ప్రారంభించారు. తమ కదలికలను ఇజ్రాయెల్ గుర్తించకుండా ఉండేందుకు వారు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య జరిగిన తాజా ఘర్షణలో ఒక ఇజ్రాయెల్ సైనికుడు, ఒక పౌరుడు మరణించారు. లెబనాన్లో ఒక జర్నలిస్టు సహా ముగ్గురు పౌరులు మృతిచెందారు. వచ్చేవారం ఇజ్రాయెల్కు జో బైడెన్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చేవారం ఇజ్రాయెల్లో పర్యటించబోతున్నారని తెలిసింది. ఈ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అరబ్ దేశాల పర్యటన ముగించుకొని సోమవారం ఇజ్రాయెల్కు తిరిగివచ్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతోపాటు అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. గాజాపై ఆధిపత్యం పొరపాటే అవుతుంది: బైడెన్ ఇజ్రాయెల్ సేనలు గాజాలో సుదీర్ఘకాలంపాటు ఉండడం పెద్ద పొరపాటుగా పరిణమించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. గాజాపై యుద్ధం వద్దంటూ ఇజ్రాయెల్కు పరోక్షంగా సూచించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను కచి్చతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. గాజా ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్కు హితవు పలికారు. గాజాలో పాలస్తీనియన్ల ఆధ్వర్యంలోనే పాలన కొనసాగాలని తాను ఆశిస్తున్నట్లు బైడెన్ తాజాగా స్పష్టం చేశారు. మొత్తం పాలస్తీనియన్లకు హమాస్ మిలిటెంట్లు ప్రతినిధులు కాదని తేల్చిచెప్పారు. గాజాను ఇజ్రాయెల్ ఎక్కువ కాలం అ«దీనంలో ఉంచుకుంటుందని తాను భావించడం లేదన్నారు. మమ్మల్ని పరీక్షించొద్దు: నెతన్యాహూ తమ దేశ ఉత్తర సరిహద్దుల్లో తమను పరీక్షించవద్దని ఇరాన్, హెజ్బొల్లా సంస్థను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఆయన సోమవారం ఇజ్రాయెల్ చట్టసభ ‘నెస్సెట్’లో ప్రసంగించారు. హమాస్ను ఓడించడానికి ప్రపంచ దేశాలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘ఈ యుద్ధం మీ యుద్ధం’ అని అన్నారు. హమాస్ మిలిటెంట్లు నాజీ ముష్కరుల్లాంటివారేనని నెతన్యాహూ తేలి్చచెప్పారు. దాడులు ఆపకపోతే అన్ని చేతులూ ట్రిగ్గర్పైనే: ఇరాన్ గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దురాక్రమణ సాగిస్తున్న ఇజ్రాయెల్పై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రాంతంలో అందరూ సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దొల్లాహియాన్ స్పష్టం చేశారు. గాజాపై దాడులు ఆపకపోతే అన్ని చేతులూ ట్రిగ్గర్పైనే ఉంటాయని, ఇజ్రాయెల్కు గుణపాఠం తప్పదని తేలి్చచెప్పారు. గాజాలో సాధారణ పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను వెంటనే ఆపాలని అమెరికాకు ఇరాన్ సూచించింది. గాజాపై వైమానిక దాడులు ఆపకపోతే తాము ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్కు ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బందీలను వెంటనే విడుదల చేయాలి: ఐరాస బందీలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని హమాస్ మిలిటెంట్లకు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ హితవు పలికారు. అలాగే గాజా స్ట్రిప్కు ఆహారం, నీరు, ఔషధాల సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని సోమవారం ఇజ్రాయెల్కు సూచించారు. ప్రపంచ దేశాల నుంచి పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేలా ఆంక్షలు తొలగించాలని, సరిహద్దులు తెరవాలని అన్నారు. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హర్షించదగ్గ పరిణామం కాదని చెప్పారు. ఈజిప్టు, జోర్డాన్, వెస్ట్బ్యాంకు నుంచి నిత్యావసరాలు పాలస్తీనియన్లకు అందేలా ఇజ్రాయెల్ చొరవ తీసుకోవాలని కోరారు. ఘర్షణ ఆగిపోవాలి: రిషి సునాక్ ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ మరింత విస్తరించవద్దని కోరుకుంటున్నానని బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. ఘర్షణ ఆగిపోవాలని, ఇందుకోసం తన వంతు కృషి చేస్తానని, ఈ దిశగా ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి పని చేస్తానని వివరించారు. రిషి సునాక్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. జోర్డాన్ రాజు అబ్దుల్లాతో లండన్లో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై వారితో చర్చించారు. సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్కు రిషి సునాక్ సూచించారు. -
ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? వారిని ఎలా కాపాడుతుంది?
ఇజ్రాయెల్ జెండాలో మనకు కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని అంటారు. 14వ శతాబ్దం మధ్యకాలం నుండి యూదులు తమ జెండాపై ఈ గుర్తును ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కారణంగా చాలామంది ఇజ్రాయెల్తో పాటు యూదుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు. ఇదేవిధంగా కొందరు జుడాయిజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ జెండాపై ఉన్న నీలి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ గుర్తును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గుర్తుతో వారి చరిత్రకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇజ్రాయెల్ జెండాలో కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని చెబుతారు. 14వ శతాబ్దం నుండి యూదులు ఈ గుర్తును తమ జెండాపై ముద్రిస్తున్నారు. తరువాతి కాలంలో అది యూదుల మత చిహ్నంగా మారింది. దీనితో పాటు 1896 సంవత్సరంలో జియోనిస్ట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ జెండాను చేతబట్టారు. యూదులు అధికారికంగా 1948, అక్టోబర్ 28న దీనిని ఇజ్రాయెల్ జెండాగా స్వీకరించారు. భూమిపై ప్రళయం వచ్చినప్పుడు ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదు మతానికి చెందిన ప్రజలు గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ నక్షత్రాన్ని డేవిడ్ షీల్డ్ అని కూడా అంటారు. చరిత్రకారులు ఈ నక్షత్రాన్ని 3500 సంవత్సరాల క్రితమే యూదులు స్వీకరించారని భావిస్తారు. హిబ్రూ, ఇజ్రాయెల్ బానిసలు తాము ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు ఈ నక్షత్రాన్ని స్వీకరించారు. ఈ నక్షత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది నక్షత్రం కాదని, రెండు త్రిభుజాల కలయిక అని అనిపిస్తుంది. కిందునున్న త్రిభుజం డేవిడ్ రాజు చిహ్నం అని, పైన కనిపించేది డేవిడ్ పట్టుకున్న డాలు అని చెబుతారు. ఇది కూడా చదవండి: భారత రైతులు ఇజ్రాయెల్పై ఎందుకు ఆధారపడుతున్నారు? -
ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం
జెరూసలేం: హమాస్ పాశవిక దాడిపై ఇజ్రాయెలీలు మండిపడుతున్నారు. చీకటిమాటున తీసిన దొంగ దెబ్బపై కనీవినీ ఎరగని రీతిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. హమాస్ను సర్వనాశనం చేసి గానీ విశ్రమించేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేసిన నెతన్యాహు.. యుద్ధంలో మరోస్థాయికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ మేరకు గాజాపై పోరాడుతున్న ఫ్రంట్లైన్ ఇజ్రాయెల్ దళాలను ప్రధాని బెంజమన్ నెతన్యాహు కలిశారు. తొమ్మిదో రోజు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సైనికులను సందర్శించి వారిలో మనోధైర్యాన్ని పెంచారు. యుద్ధంలో మరో స్థాయికి వెళ్లనున్నామని తెలిపిన నెతన్యాహు.. ఇందుకు సిద్ధమేనా అంటూ సైనికులను అడిగారు. అందుకు వారు సిద్ధమని చెబుతూ తలలు ఊపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. యుద్ధంలో అసలైన ఘట్టం వచ్చేసిందని ప్రధాని నెతన్యాహు అన్నారు. హమాస్ 'ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ బ్యాటిల్'కు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' గురించి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని సైనికులతో కరచాలనం చేశారు. యుద్ధంలో మరోస్థాయికి వెళుతున్నామని సైనికులకు తెలిపిన వీడియో బయటకు వచ్చింది. గాజాను ఖాలీ చేయాలని పౌరులను హెచ్చరించిన ఇజ్రాయెల్.. యుద్ధాన్ని తదుపరి మరింత ఉద్ధృతం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. అటు.. గాజాను వీడకూడదంటూ హమాస్ దళాలు పిలుపునిచ్చాయి. ఈ హోరాహోరి పోరు రానున్న రోజుల్లో యుద్ధం మరింత భీకర స్థాయికి చేరనున్నట్లు తెలుస్తోంది. భూతల దాడి.. ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు. ఇస్మాయిల్ హనియే తర్వాత రెండవ స్థానంలో ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ను నిర్మూలించడం గ్రౌండ్ అటాక్ ముఖ్య లక్ష్యం. బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను ఈ దాడుల ద్వారా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. గత శనివారం ఇజ్రాయెల్లపై జరిగిన అకృత్యాలకు సిన్వార్ బాధ్యత వహించాడని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనికి గ్రౌండ్ అటాక్ మాత్రమే సరైనదని భావిస్తున్నారు. ఈ వారాంతంలో ఈ దాడి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా సరిహద్దులో 30,000 ఇజ్రాయెల్ సైనికులు వేచి ఉన్నారు. 10,000 మంది సైనికులు గాజాలోకి అడుగుపెట్టారు. ఈ దాడులకు కావాల్సిన యుద్ధ సామగ్రిని, యుద్ధం ట్యాంకులను సరిహద్దుకు చేర్చారు. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేయడంతో యుద్ధం ఆరంభం అయింది. హమాస్ దాడులకు ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో బదులిస్తోంది. భూతల, వాయు మార్గాల్లో వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. తొమ్మిది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్లో 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలో 1900 మంది మృత్యువాతపడ్డారు. ఇదీ చదవండి: అల్ఖైదా కంటే ప్రమాదకరం -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత హతం
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే హమాస్కు చెందిన సీనియర్ నాయకుడు ఒకరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. నిన్న రాత్రి జరిగిన వైమానికి దాడుల్లో చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ వైమానిక విభాగానికి అధిపతిగా పనిచేసిన మురాద్ అబు మురాద్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ వైమానిక కార్యకలాపాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. ఇజ్రాయెల్లోకి గ్లైడర్ల పైనుంచి చొచ్చుకు వచ్చి దాడి చేసే హమాస్ దళాలకు మురాద్ అబు మురాద్ శిక్షణ ఇచ్చేవారని వెల్లడించాయి. ఇదిలా ఉంటే... పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ పోరులో ఇరువర్గాలకు చెందిన సుమారు 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో 600 చిన్నారులతో 1,900 పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాతపడ్డారు. ఇదీ చదవండి: 'భారత వాలంటీర్లతో ఇజ్రాయెల్కు మరో ఆర్మీ ' -
'భారత వాలంటీర్లతో ఇజ్రాయెల్కు మరో ఆర్మీ '
ఢిల్లీ: హమాస్తో జరుగుతున్న యుద్ధంలో భారత్ తమకు మద్దతు తెలుపుతున్నందుకు ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తరుణంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్కు మద్దతు తెలిపారు. హమాస్ను ఉగ్రదాడిగా పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మద్దతును తాము ఎప్పటికీ మర్చిపోబోమని నౌర్ గిలోన్ అన్నారు. తమకు మద్దతు తెలుపుతున్న వాలంటీర్లతో మరో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ను తయారు చేయవచ్చని నౌర్ గిలోన్ అన్నారు. యుద్ధంలో పోరాడుతున్న తమకు మద్దతుగా మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు. 'ఇజ్రాయెల్ ఎంబసీ సోషల్ మీడియాను చూడండి. మద్దతు తెలుపుతున్న భారత వాలంటీర్లతో మరో రక్షణ దళాన్ని తయారు చేయవచ్చు. ఇజ్రాయెల్ తరుపున పోరాడటానికి మేమంతా ఉన్నామంటూ పోస్టులు పెడుతున్నారు.' అని నౌర్ గిలోన్ తెలిపారు. భారత్-ఇజ్రాయెల్ స్నేహసంబంధాలు ఎంత ప్రత్యేకమో ఇంతకంటే ఎక్కువ చెప్పలేమని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి -
ఉత్తర గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ సైన్యం
జెరూసలేం: హమాస్ మిలిటెంట్లకు కంచుకోట అయిన గాజాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు చేస్తోంది. ఉత్తర గాజాను తక్షణమే ఖాళీ చేయాలని, దక్షిణ ప్రాంతానికి తరలివెళ్లాలని శుక్రవారం అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ప్రజల రక్షణ కోసమే ఈ ఆదేశాలిచ్చామని తెలియజేసింది. ఉత్తర గాజాలో 10 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు జనం దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. గాజా మొత్తం జనాభా 20 లక్షలు. అంటే దాదాపు సగం మంది ఇళ్లు విడిచివెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జనంతో కిక్కిరిసిపోయిన దక్షిణ గాజాపై మరింత ఒత్తిడి పెరగనుంది. గత ఏడు రోజులుగా గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సేనలు భూభాగ దాడులకు సన్నద్ధమవుతున్నాయి. పదాతి దళాలు ఆయుధాలు చేబూని అడుగు ముందుకు వేయబోతున్నాయి. హమాస్పై భూతల దాడుల కోసం 3 లక్షలకు పైగా రిజర్వ్ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. గాజా వీధుల్లో మిలిటెంట్ల వేటకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అనధికారికంగా చెబుతున్నారు. అడుగడుగూ జల్లెడ పడుతూ మిలిటెంట్లను సజీవంగా బంధించడమో లేక అంతం చేయడమో జరుగుతుందని అంటున్నారు. ఉత్తర గాజా ఇప్పుడు ‘యుద్ధభూమి’ కాబట్టి, అక్కడ ప్రజలెవరూ ఉండొద్దని సూచించారు. యుద్ధం ముగిశాక తిరిగి రావొచ్చు ఉత్తర గాజాపై హమాస్కు గట్టి పట్టుంది. అగ్రనాయకులంతా అక్కడే మకాం వేశారు. అందుకే తొలి టార్గెట్గా అదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రజలను దక్షిణ గాజాకు పంపించి, ఉత్తర గాజాలో మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్కు శ్రీకారం చుట్టనున్నారు. హమాస్ స్థావరాలను, సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సామాన్య ప్రజలకు నష్టం కలిగించే ఉద్దేశం లేదని, యుద్ధం ముగిసిన తర్వాత వారంతా తిరిగిరావొచ్చని సూచించింది. హమాస్ మిలిటెంట్లు జనావాస ప్రాంతాల్లో మకాం వేసి, కార్యకలాపాలు సాగిస్తున్నారు. సాధారణ ప్రజలను కవచంగా వాడుకుంటూ ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగిస్తున్నారు. ప్రజలను అక్కడి తరలిస్తే మిలిటెంట్ల ముసుగు తొలగిపోతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఉత్తర గాజాలో లక్షల మంది పాలస్తీనియన్లను నివాసం ఉంటున్నారు. కీలకమైన గాజా సిటీ ఇక్కడే ఉంది. వెంటనే వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించడంతో పాలస్తీనియన్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆహారం, నీరు, విద్యుత్ వంటి సదుపాయాల గురించి మర్చిపోయామని, ప్రాణాలు కాపాడుకుంటే చాలని భావిస్తున్నామని పాలస్తీనా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధి నెబాల్ ఫర్సాఖ్ వ్యాఖ్యానించారు. ఖాళీ చేయించే ఆలోచన మానుకోండి: ఐరాస ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది. సామూహికంగా జనమంతా ఒకేసారి తరలివెళ్లడం సంక్షోభానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ ఇజ్రాయెల్కు సూచించారు. మరోవైపు హమాస్ సైతం స్పందించింది. ఉత్తర గాజా నుంచి జనాన్ని తరలించడం వెనుక కుట్రదాగి ఉందని ఆరోపించింది. ప్రజలెవరూ ఎక్కడికీ వెళ్లొద్దని, ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్ సాగిస్తున్న ‘మానసిక యుద్ధాన్ని’ పట్టించుకోవద్దని సూచించింది. వేలాది మంది క్షతగాత్రులు ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్నారని, వారిని తరలించడం సాధ్యం కాదని గాజా ఆరోగ్య శాఖ తేలి్చచెప్పింది. ఉత్తర గాజాలో పాఠశాల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా ఆశ్రయం పొందుతున్నారు. వారిని దక్షిణ గాజాకు తరలించలేమని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో నిరసనలు గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖండిస్తూ మధ్యప్రాచ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జోర్డాన్, యెమెన్లో ప్రదర్శనలు జరిగాయి. జెరూసలేం ఓల్డ్ సిటీలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. జెరూసలేంలోని అల్–అక్సా మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు 50 ఏళ్ల వయసు దాటినవారిని మాత్రమే ఇజ్రాయెల్ పోలీసులు అనుమతించారు. మసీదు బయట పెద్ద సంఖ్యలో గుమికూడిన పాలస్తీనియన్లపైకి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. లాఠీచార్జి జరిపాయి. ఈ ఘటనలో కనీసం ఆరుగురు గాయపడ్డారు. లెబనాన్ రాజధాని బీరూట్లో హెజ్బొల్లా మద్దతుదారులు ర్యాలీ చేపట్టారు. ఇజ్రాయెల్ నశించాలంటూ నినాదాలు చేశారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై హమాస్తోపాటు దాడులు జరిపారు. మధ్యధరా సముద్ర జలాల్లోని అమెరికా, బ్రిటిష్ యుద్ధ నౌకలపై కన్నేసి ఉంచుతామని హెజ్బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ నయీమ్ కాశీం హెచ్చరించారు. తాము పూర్తి సన్నద్ధతతో ఉన్నామని, సరైన సమయంలో రంగంలోకి దిగుతామని తెలిపారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇరాన్, పాకిస్తాన్లో హమాస్కు మద్దతుగా జనం ర్యాలీలు నిర్వహించారు. ఇజ్రాయెల్ దాడుల్లో 13 మంది బందీలు మృతి! ఇజ్రాయెల్–హమాస్ మధ్య శుక్రవారం కూడా పరస్పరం దాడులు జరిగాయి. ఏడు రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో మృతుల సంఖ్య చేరుకుంది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్లో 1,300 మందికిపైగా చనిపోయారు. వీరిలో 247 మంది సైనికులు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 1,530 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న 150 మంది పరిస్థితి ఏమిటన్నది తెలియరావడం లేదు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో బందీల్లో 13 మంది మృతిచెందారని హమాస్ శుక్రవారం ప్రకటించింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని స్పష్టంచేసింది. అయితే, వారు ఏ దేశానికి చెందినవారన్న సంగతి బయటపెట్టలేదు. వైమానిక దాడుల్లో 13 మంది బందీలు చనిపోయారంటూ హమాస్ చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారీ ఖండించారు. తమకు స్పష్టమైన సమాచారం ఉందని, ఎవరూ మృతి చెందలేదని అన్నారు. ఇజ్రాయెల్కు అమెరికా రక్షణ మంత్రి అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ శుక్రవారం ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పర్యటించిన మరుసటి రోజే లాయిన్ అస్టిన్ సైతం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అస్టిన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్తోనూ భేటీ అయ్యారు. హమాస్పై యుద్ధానికి అమెరికా అందించనున్న సైనిక సాయంపై ఆయన చర్చించినట్లు సమాచారం. -
హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!
ఇజ్రాయెల్-హమాస్ భీకర యుధ్దం తీవ్ర విషాదాన్నిమిగులుస్తోంది. హృదయాల్నిమెలిపెట్టే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యంలోని 77వ బెటాలియన్లో సైనికురాలిగా పనిచేస్తున్న 19 ఏళ్ల కార్పొరల్ నామా బోని మరణం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇజ్రాయెలీ వార్తా సంస్థ Ynet ప్రకారం చావు బతుకులమధ్య అత్యంత దయనీయ పరిస్తితుల్లో కుటుంబ సభ్యులకు పంపిన సందేశం వైరల్ అవుతోంది. హమాస్ సాయుధుడి దాడిలో బోని తలకు తీవ్ర గాయమైంది. అయినా ఎలాగోలా తప్పించుకుంది. ఓ తాత్కాలిక షెల్టర్లో తలదాచుకుని అక్కడినుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసింది. ‘‘నా మీద కాల్పులు జరిగాయి. మీ గురించి చాలా బాధపడుతున్నాను. నా తలకు తీవ్ర గాయమైంది’’ అంటూ మెసేజ్ చేసింది. కాసేపటి తరువాత మరో అప్డేట్ను కూడా ఇచ్చింది. తనకు సమీపంలోనే ఉగ్రవాది ఉన్నాడనీ, ఏ క్షణాన్నైనా తనను కాల్చేయొచ్చనే అందోళన వ్యక్తం చేసింది. ఎవరో అరుస్తున్నట్లు వినిపిస్తోంది, మానవ ప్రాణనష్టం జరిగినట్లు కనిపిస్తోందంటూ అక్కడి పరిస్థితిని వివరించింది. అలాగే ప్రస్తుతం తాను గోలానీ బ్రిగేడ్కు చెందిన గాయపడిన సైనికుడితో ఉన్నాననీ. ఇక్కడ తమకు ఎలాంటి బలగాలు అందుబాటులో లేవని కూడా ఆ మెసేజ్లో ఆమె పేర్కొంది. ఆ తరువాత తీవ్రంగా గాయపడిన బ్రెజిలై మెడికల్ సెంటర్లో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇక లేదని అధికారుల వివరాల బట్టి తెలుస్తోంది. అఫులాలో పుట్టి పెరిగింది బోని. ఏడు నెలల క్రితమే అక్కడి సైన్యంలో చేరింది. ఒక వారం క్రితం ఆమె పుట్టిన రోజును జరుపుకున్న బోనీ తిరిగి రావాలని కోరుకున్న కుటుంబ సభ్యులకు చివరకు విషాదమే మిగిలింది. కాగా హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఐదు రోజుల క్రితం వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుండి 2.3 మిలియన్ల జనాభాఉన్న గాజా స్ట్రిప్లోని పౌరులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం ఉదయం నాటికి 1,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో ఎంత మంది పౌరులు ఉన్నారో స్పష్టత లేదు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలోగాజా నగరంలో ఆహార కొరత నెలకొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాలోని అల్-షిఫా ఆసుపత్రికి వచ్చే రోగులతో నిండిపోయింది. ఒకవైపు ఆక్సిజన్తో సహా ఇతర అత్యవసర మందుల నిల్వలు క్షీణిస్తున్నాయి. మరోవైపు విద్యుత్ అంతరాయంతో రోగులను కాపాడేందుకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. -
Israel-Gaza War: ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఉక్కిరిబిక్కిరవుతున్న గాజా (ఫొటోలు)
-
గాజా సరిహద్దుల్లో 1500 హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ సైన్యం–హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణ నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ మెరుపుదాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్.. ప్రస్తుతం వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. తాజాగా గాజా సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ ప్రాంతంలో సుమారు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు కనుగొన్నామని. గాజా సరిహద్దుపై నియంత్రణ పునరుద్ధరించామని సైనిక ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ . వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచి ఎవరూ లోపలికి రాలేదని, కానీ పలుచోట్ల చొరబాట్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. గాజా సరిహద్దు చుట్టూ ఉన్న ప్రజలను సైన్యం దాదాపు తరలించిందని చెప్పారు. అయితే ఈ మరణాలను పాలస్తీనా మిలిటెంట్లు ధృవీకరించలేదు. మరోవైపు గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. తాజా యుద్ధంలో మృతుల సంఖ్య 1,600 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్లో 900 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 68700 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ అ«దీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. చదవండి: ఇజ్రాయెల్ సూపర్ నోవా ఫెస్టివల్పై హమాస్ దాడి.. అసలేం వేడుకిది..? హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ధీటుగా ఎదుర్కొంటున్నారు.సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను వెంబడించి మరీ కాల్చి పారేస్తున్నారు. తాజాగా గాజా సరిహద్దు లో ఇద్దరు హమాస్ మిలిటెంట్లను గుర్తించిన ఇజ్రాయెల్ పోలీసులు వారిని వెంబడించి మట్టుపెట్టారు. కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఛేజ్ చేసి గన్తో కాల్పులు జరపడంతో మిలిటెంట్లు చనిపోయారు.ఇదంతా బైక్ నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ యూనిఫాంకు అమర్చిన వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ఇజ్రాయెల్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్గా మారింది. Police and Border Police officers heroically neutralized two armed terrorists outside of Netivot on Saturday. We will continue working on the front lines to defend our civilians from terror pic.twitter.com/PQk9KiiKoT — Israel Police (@israelpolice) October 9, 2023 -
'యుద్ధాన్ని మేము మొదలెట్టలేదు.. కానీ ముగిస్తాం'
జెరూసలేం: హమాస్ దళాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధాన్ని తాము మొదలెట్టలేదు.. కానీ తప్పకుండా ముగిస్తామని అన్నారు. హమాస్ తిరుగుబాటుదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. యుద్ధం మొదలెట్టి చారిత్రాత్మక తప్పిదం చేశారని అన్నారు. 'ఇజ్రాయెల్ ప్రస్తుతం యుద్ధం చేస్తుంది. యుద్ధం చేయాలని మేము కోరుకోలేదు. మాపై అతి కిరాతకంగా దారుణమైన దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించలేదు.. కానీ తప్పకుండా ముగిస్తుంది. హమాస్తో పాటు ఇజ్రాయెల్ శత్రుదేశాలకు గుర్తుండిపోయేలా బదులిస్తాం. హమాస్ కూడా ఐఎస్ఐఎస్ లాగే తీవ్రవాద సంస్థ. వీరిని ఓడించడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలి. ' అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. 'అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో నిరంతరం టచ్లోనే ఉన్నా. ఇజ్రాయెల్ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరి తరుపున ఇజ్రాయెల్ పోరాడుతోంది. అనాగరిక వ్యక్తులపై నాగరిక ప్రపంచమే విజయం సాధిస్తుంది. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తున్న ప్రపంచ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు.' అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. హమాస్ తిరుగుబాటుదారులపై పోరాడటానికి ఇజ్రాయెల్ ఇప్పటికే 3,00,000 సైనికులను రంగంలోకి దింపింది. 1973లో జరిగిన యోమ్ కిప్పూర్ యుద్ధంలో అత్యధికంగా 4,00,000 మంది సైనికులు పోరాడారు. ఇంతకాలం తర్వాత ఇంతటి భారీ స్థాయిలో యుద్ధం జరగడం ఇదే ప్రథమం. ఈ యుద్ధంలో దాదాపు 2300 మంది ఇజ్రాయెల్ ప్రజలు గాయపడ్డారు. 700 మంది మృతి చెందారు. హమాస్ మిలిటెంట్ల పీచమణచడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోనూ వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం Follow the Sakshi Telugu News channel on WhatsApp -
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి!
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య పిల్లలలో మీజిల్స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యుద్ధ వాతావరణ నేపధ్యంలో మరోసారి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వీటి పర్యవసానాలను దేశంలోని సామాన్య ప్రజలు భరించవలసి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంలో రెండేళ్ల వయసుగల నలుగురు పిల్లలు తీవ్రమైన తట్టు(మీజిల్స్) వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ పీడియాట్రిక్ అసోసియేషన్ ఈ ప్రాణాంతక వ్యాధి నివారణకు దేశంలోని చిన్నారులకు టీకాలు వేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి నొక్కి చెప్పింది. దేశంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు వెంటనే టీకాలు వేయించాలని వైద్యాధికారులు సూచనలు చేశారు. తట్టు అనేది వాస్తవానికి రుబియోలా అనే వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా పిల్లలపై దాడి చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వైరస్ సోకాక 10 నుండి 14 రోజుల వ్యవధిలో ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు బయపటతాయి. తట్టు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి జ్వరం పొడి దగ్గు జలుబు గొంతు మంట కళ్లు ఉబ్బడం చర్మంపై దద్దుర్లు, చర్మంపై చిన్న మచ్చలు వాస్తవానికి మీజిల్స్(తట్టు) లక్షణాలు సాధారణంగా రోగి ముక్కు, గొంతులో కనిపిస్తాయి. బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఈ వైరస్ గాలిలో కలుస్తుంది. ఫలితంగా వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధికి టీకా అందుబాటులో ఉంది. రెండు మోతాదుల టీకా ఈ వ్యాధిని నివారించడంలో, ప్రాణాలను రక్షించడంలో 97 శాతం ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టమయ్యింది. ఇది కూడా చదవండి: ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు? -
'ప్లీజ్ నన్ను చంపకండి..' హమాస్ దళాల బందీలో యువతి
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్ మిలిటెంట్ల అమానయ చేష్టలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్లో నిర్వహిస్తున్న పీస్ఫెస్టివల్పై హమాస్ ఉగ్రవాదులు.. అరమణి(25) అనే యువతిని ఎత్తుకెళ్లారు. ఆమెను మిలిటెంట్లు బైక్పై బలవంతంగా ఎక్కించుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బైక్పై తీసుకెళ్తున్న క్రమంలో మిలిటెంట్లను వేడుకుంటోంది అరమణి. ప్లీజ్ నన్ను చంపకండి.. దయచేసి వదలిపెట్టండి అంటూ ఏడుస్తోంది. ఆమె బాయ్ఫ్రెండ్ నాథన్ను కూడా హమాస్ దళాలు బంధించి తీసుకెళ్లారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Noa was partying in the south of Israel in a peace music festival when Hams terrorists kidnapped her and dragged her from Israel into Gaza. Noa is held hostage by Hamas. She could be your daughter, sister, friend.#BringBackOurFamily pic.twitter.com/gi2AStVdTQ — Hen Mazzig (@HenMazzig) October 7, 2023 ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఇప్పటికే ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగిస్తున్న ఆందోళనకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్నది జర్మనీ పౌరురాలైన తన సోదరి అని ఓ మహిళ ధృవీకరించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి.. -
వెస్ట్బ్యాంక్లో ముగిసిన సైనిక ఆపరేషన్
వెస్ట్బ్యాంక్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ బుధవారం ముగిసింది. ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి వెళ్లిపోయాయి. సోమవారం, మంగళవారం జరిగిన దాడుల్లో 12 మంది పాలస్తీనావాసులు, ఒక ఇజ్రాయెలీ జవాను మృతిచెందారు. తాము నిర్వహించిన డ్రోన్ దాడుల్లో చనిపోయినవారంతా మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. జెనిన్ శరణార్థుల శిబిరంలో భయం ఇంకా తొలగిపోలేదు. జనం ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. వీధులను శుభ్రం చేసుకుంటున్నారు. దుకాణాలు తెరుచుకుంటున్నారు. ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు క్రమంగా తిరిగివస్తున్నారు. క్యాంప్లో ఎక్కడ చూసినా భీతావహ వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకా పునరుద్ధరించలేదు. ఇంటర్నెట్ సేవలు సైతం ఆగిపోయాయి. డ్రోన్ దాడ్రుల్లో మిలిటెంట్ ముఠాలకు భారీగా నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వెస్ట్బ్యాంక్ నుంచి ఉగ్రవాదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సైనిక ఆపరేషన్లు పునరావృతం కావడం తథ్యమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. జెనిన్ శివారులోని ఓ సైనిక స్థావరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. -
అక్కడంతా మృత్యుభయం! మురికివాడలో శరణార్ధుల గోస
ఇజ్రాయెల్ ఆక్రమిత ఉత్తర వెస్ట్బ్యాంక్లోని జెనిన్ శరణార్థుల శిబిరం 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా వార్తల్లోకి వచి్చంది. జెనిన్ క్యాంప్లో ఉగ్రవాదులను ఎరివేయడానికి ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. లక్ష్యం నెరవేరిందని ఇజ్రాయెల్ చెబుతోంది. జెనిన్ రెఫ్యూజీ క్యాంప్నకు దాదాపు ఏడు దశాబ్దాల కన్నీటి చరిత్ర ఉంది. ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ల మధ్య ఘర్షణలకు ఈ ప్రాంతం వేదికగా మారుతుండడంతో శరణార్థులకు కష్టాలు ఎదురవుతున్నాయి. చెల్లాచెదురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ వల్ల గత 3 రోజుల్లో వేలాది మంది జెనిన్ క్యాంప్ విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఈ క్యాంప్ ఎందుకు ఏర్పాటయ్యిందో, ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసుకుందాం.. శరణార్థుల గడ్డ.. మిలిటెంట్ల అడ్డా అమెరికాతోపాటు పశి్చమ దేశాల అండతో 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ ఆవిర్భవించింది. విస్తీర్ణంలో చిన్నదైనా తన చుట్టుపక్కల దేశాల భూభాగాలను బలప్రయోగంతో ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ప్రాచీన కాలంలో ఆ ప్రాంతాలన్నీ యూదు రాజ్యంలో అంతర్భాగమేనని వాదించింది. అలా పొరుగు దేశమైన పాలస్తీనాపై కన్నేసింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులను తట్టుకోలేక పాలస్తీనా పౌరులు సొంత ఊళ్లు వదిలేసి శరణార్థులుగా మారి వలసబాట పట్టారు. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం 1950వ దశకంలో పాలస్తీనా శరణార్థుల కోసం వెస్ట్బ్యాంక్లో పలు శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి జెనిన్ రెఫ్యూజీ క్యాంప్. నిజానికి ఇదొక మురికివాడ అని చెప్పొచ్చు. పేదరికానికి, ఆకలి చావులకు మారుపేరు. పాలస్తీనా మిలిటెంట్లు తమ కార్యకలాపాల కోసం జెనిన్ను అడ్డాగా మార్చుకున్నారు. తరచుగా ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్నారు. మిలిటెంట్ల చర్య స్వాతంత్య్రం కోసం జరుగుతున్న సాయుధ తిరుగుబాటు అని పాలస్తీనా సానుభూతిపరులు చెబుతుండగా, అది ముమ్మాటికీ ఉగ్రవాదమేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. పాలస్తీనియన్ మిలిటెంట్ కమాండ్ సెంటర్లు జెనిన్లో ఉన్నాయని అంటోంది. వేలాది మందికి ఆవాసం జెనిన్ క్యాంప్ పాలస్తీనా శరణార్థులతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం 18,000 మంది నివసిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అసలైన లెక్క ఎంతన్నది తెలియదు. ఐక్యరాజ్యసమితి పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం 14,000 మంది ఉంటున్నారు. 2020 నాటి పాలస్తీనా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం 12,000 మంది శరణార్థులు నివసిస్తున్నారు. యుద్ధానికి దారితీసిన ఆత్మాహుతి దాడి జెనిన్ క్యాంప్లో 2002లో జరిగిన ఘర్షణలో 50 మందికిపైగా పాలస్తీనా జాతీయులు, 23 మంది ఇజ్రాయెల్ సైనికులు బలయ్యారు. యూదు సెలవు దినం సందర్భంగా మతపరమైన వేడుక కోసం గుమికూడిన యూదు జాతీయులపై మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది యూదు జాతీయులు మరణించారు. దాంతో మిలిటెంట్ల భరతం పట్టడానికి ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్బ్యాంక్పై విరుచుకుపడింది. పాలస్తీనాలోకి సైతం సైన్యం అడుగుపెట్టింది. రమల్లా నగరంలో అప్పటి పాలస్తీనా అధినేత యాసర్ ఆరాఫత్ ఇంటిని చుట్టుముట్టింది. ఇజ్రాయెల్ సైనికులు, పాలస్తీనా మిలిటెంట్ల నడుమ కొన్ని రోజులపాటు హోరాహోరీగా యుద్ధంకొనసాగింది. ఇరువైపులా ప్రాణనష్టంతో యుద్ధం ముగిసింది. జెనిన్ క్యాంప్ అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా మారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. దీనివెనుక పలు కారణాలు కనిపిస్తున్నారు. మిలిటెంట్ల దుశ్చర్యపై ఆగ్రహావేశాలు రెండు వారాల క్రితం జెనిన్ క్యాంప్లో మిలిటెంట్లు రెచి్చపోయారు. జెనిన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్ ప్రయోగించారు. దీంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఏడుగురు ఇజ్రాయెల్ జవాన్లు గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిలిటెంట్ల దుశ్చర్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ చేతగానితనంలోనే ఉగ్రవాదులు రెచి్చపోతున్నారంటూ ఇజ్రాయెల్లో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై ఒత్తిడి పెరిగింది. దానికితోడు వెస్ట్బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్స్లో ఎక్కువమంది నెతన్యాహూ మద్దతుదారులే ఉన్నారు. మిలిటెంట్లను కఠినంగా అణచివేయాలంటూ వారు సైతం ఒత్తిడి తెచ్చారు. దాంతో జెనిన్ క్యాంప్లో సైనిక ఆపరేషన్కు నెతన్యాహూ గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నెల 3వ తేదీన ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. జెనిన్లో శరణార్థుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ముష్కరుల స్థావరాలుగా భావిస్తున్న ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేసింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా? ఇటీవలి కాలంలో బెంజమిన్ నెతన్యాహూ రాజకీయంగా కొంత బలహీనపడ్డారు. ఆయన తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణ బిల్లుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెస్ట్బ్యాంక్లో జెనిన్తోపాటు ఇతర ప్రాంతాల్లో సాయుధ ముఠాలు బలం పుంజుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఆయనకు ఏర్పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకే జెనిన్ క్యాంప్లో సైనిక ఆపరేషన్కు ఆదేశాలు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -సాక్షి, నేషనల్ డెస్క్ -
దక్షిణ లెబనాన్, గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
జెరూసలేం: దక్షిణ లెబనాన్తోపాటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లోని హమాస్ ఉగ్రవాద శిబిరాలపై శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులు నిర్వహించింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో యూదులు పాస్ఓవర్ అనే వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గురువారం దక్షిణ లెబనాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ వైపు 30కిపైగా రాకెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్లో ఇద్దరు గాయపడ్డారు. స్వల్పంగా ఆస్తి నష్టం వాటిల్లింది. రాకెట్ల ప్రయోగానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్లో పాతుకుపోయిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణులు లెబనాన్లో టైర్ సమీపంలోని రషీదియా పాలస్తీనా కాందిశీకుల క్యాంప్ వద్ద నేలను తాకాయని అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఒకరు వెల్లడించారు. లెబనాన్లోని హిజ్బుల్లా మిలీషియాకు ఇరాన్ అండదండలు అందిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యంపై హిజ్బుల్లా మిలీషియా దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే, తాము కేవలం పాలస్తీనా మిలిటెంట్ల శిబిరాలపైనే వైమానిక దాడులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్బ్యాంకులో పాలస్తీనా వాసి ఒకరు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
ఐటీ ఉద్యోగుల్లో కొత్త భయాలు..ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?
ఉక్రెయిన్ యుద్ధం, ధరల మంట, ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీల్లో సంక్షోభం నెలకొంది. ఆ సంక్షోభం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb) మూసివేతతో మరింత తీవ్రతరమైనట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో ఎస్వీబీని షట్డౌన్ చేస్తున్నట్లు రెగ్యులేటరీ ప్రకటించిన నాటి నుంచి ఇజ్రాయిల్కు చెందిన టెక్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపిన బెంజిమన్.. టెక్నాలజీ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘మేం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసి వేత..టెక్నాలజీ వరల్డ్ను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుంది’ అని ట్వీట్ చేశారు. అవసరం అయితే తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ కంపెనీలకు, ఉద్యోగులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్ కేంద్రంగా ప్రధాన టెక్ కంపెనీలపై ఎస్వీబీ ప్రభావం పడితే.. ఆ అలజడిని నుంచి రక్షించేందుకు సిద్ధమని అన్నారు. మరోవైపు ప్రపంచ దేశాల్లో టెక్ కంపెనీలను ఎస్వీబీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో బెంజిన్ రోమ్లో పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే తాజా పరిస్థితులపై టెక్నాలజీ నిపుణులతో మాట్లాడారు. రోమ్ నుంచి స్వదేశానికి వచ్చిన వెంటనే అమెరికన్ దిగ్గజ బ్యాంక్ దివాళాతో దేశీయ టెక్ కంపెనీలపై ఎంత మేరకు ప్రభావం చూపనుందనే విషయంపై ఫైనాన్స్, ఆర్ధిక మంత్రిత్వ శాఖలు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్తో చర్చిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని ట్వీట్లో చెప్పారు. కొంపముంచుతున్న ఎస్వీబీ బాగోతం ఇక మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు ఇప్పటికే ఆర్ధిక మాంద్యం దెబ్బకు కుదేలైన ఐటీ రంగం ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత ఆయా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా అమెరికన్ దిగ్గజ బ్యాంక్తో లావాదేవీలు నిర్వహిస్తున్న అమెరికా, యూకే, ఇజ్రాయిల్తో పాటు మరిన్ని దేశాలకు చెందిన టెక్ కంపెనీలు ఈ విపత్తు నుంచి బయటపడేందుకు ముందస్తు చర్యలకు ఉపక్రమించగా.. ఐటీ రంగంలో అసలేం జరుగుతోంది అంటూ ప్రపంచవ్యాప్తంగా మరో సారి చర్చ మొదలైంది ఐటీ రంగంలో ఏం జరుగుతోంది ఇప్పటికే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నాయి. ఏ మాత్రం లాభదాయకం లేదని అనిపిస్తే మూసేస్తున్నాయి. ట్విటర్లాంటి సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్ తో పాటు ఇతర వస్తువుల్ని అమ్మి పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. తాజాగా ఎస్వీబీ బ్యాంక్ మూసివేతతో ఐటి రంగం మరింత సంక్షోభం తప్పదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పెగాసస్ మీ మైండ్లో ఉంది! ఫోన్లో కాదు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన ఉపన్యాసం.. రాజకీయ విమర్శలకు దారి తీసింది. బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకునే ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ రాహుల్కి కౌంటరిచ్చారు. పెగాసస్ అనేది రాహుల్ గాంధీ ఫోన్లో లేదని, ఆయన మైండ్లోనే ఉందని ఎద్దేవా చేశారు సీఎం శివరాజ్సింగ్ చౌహాన్. ‘‘పెగాసస్ అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోకి ప్రవేశించింది. రాహుల్ తెలివితేటలు చూసి జాలిపడుతున్నా. ఆయన విదేశాలకు వెళ్తాడు. దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి వచ్చేస్తాడు. విదేశీ రాయబార కార్యాలయాలకు వెళ్లి భారత్కి వ్యతిరేకంగా మాట్లాడి.. దేశ పరువు తీయడమేనా? కాంగ్రెస్ ఎజెండా అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. విదేశాల్లో దేశాన్ని విమర్శించడం దేశ వ్యతిరేక చర్య. దేశం గానీ, ప్రజలు గానీ మిమ్మల్ని(రాహుల్ను ఉద్దేశించి) ఎప్పటికీ క్షమించరు. కాగా, ఇటీవల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ..ఇజ్రాయిల్ స్పైవేర్ అయిన పెగాసన్ గురించి ప్రస్తావించారు. ఈ పెగాసస్ ద్వారా తన ఫోన్ గూఢచర్యం జరుగుతోందని, కాల్స్ మాట్లాడటం గురించి జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనను హెచ్చరించాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకుల ఫోన్లో పెగాసస్ ఉందని వ్యాఖ్యలు చేశారు. అలాగే తనపై తప్పుడూ అభియోగాలు మోపి కేసులు పెట్టారన్నారు. అలాగే కేంద్రం ఇంటెలిజెన్సినీ దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలపై కేసులు పెడుతోందన్నారు. ప్రజాస్వామ్య నిర్మిత దేశంలో ఇలాంటి చర్యలు సరికాదని, తాను అందుకోసమే పోరాడుతున్నాని చెప్పుకొచ్చారు రాహుల్. -
జెలెన్స్కీ గురించి పుతిన్ ప్రామిస్ చేశాడట..!
ఇజ్రాయల్ మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్... రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జెలెన్స్కీని పుతిన్ కచ్చితంగా చంపడంటూ తనకు హామీ కూడా ఇచ్చాడని నమ్మకుంగా చెబుతున్నారు బెన్నెట్. గతవారం ఇజ్రాయిల్ మాజీ ప్రధాని బెన్నెట్ మాస్కో పర్యటనలో నేరుగా పుతిన్నే మీరు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి పుతిన్ బదులిస్తూ..తాను చంపాలనుకోవడం లేదని కరాకండీగా చెప్పినట్లు బెన్నెట్ చెబుతున్నాడు. ఈ విషయమై తాను పుతిన్ని గట్టిగా నిలదీశానని ఆయన కచ్చితంగా జెలెన్స్కీని చంపాలనుకోవడం లేదు, ఇది పక్కా అని బెన్నెట్ నమ్మకంగా చెప్పారు. ఈ విషయాన్ని బెన్నెట్ జెలెన్స్కీకి చెప్పారు కూడా. అంతేగాదు నాటోలో చేరేందుకు యత్నించమని మాట ఇస్తే తక్షణమే పుతిన్ యుద్ధాన్ని విరమించుకుంటాడని జెలన్స్కీకి హితవు చెప్పారు. వాస్తవానికి బెన్నెట్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపచేసే ప్రయత్నంలో భాగంగా పలుమార్లు మధ్యవర్తిత్వం చేసేందుకు యత్నించారు. అందులో భాగంగానే బెన్నెట్ పుతిన్తో తాను మాట్లాడానంటూ ఈ వ్యాఖ్యలు చేశారు దీనికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా స్పందిస్తూ... రష్యా మాటలను ఉక్రెయిన్ ఎన్నటికీ విశ్వసించదన్నారు. రష్యా నిరవధిక దాడులతో మగ్గిపోతున్న ఉక్రెయిన్ ఆ దేశ అధ్యక్షుడి మాటలను నమ్మదనడంలో ఆశ్చర్యం లేదన్నారు. పుతిన్ ఒక అబద్ధాలకోరు, ఒక పక్క చేయను అని మాట ఇస్తూనే దారుణాలకు తెగబడుతుంటాడని మండిపడ్డారు. కాగా రష్యా గతేడాది ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధానికి దిగింది. అది నిరాటంకంగా సాగుతూనే ఉంది గానీ ఆగే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్ధంలో వేలాది మంది ఉక్రెయిన్ బలగాలు నేలకొరిగారు, లక్షలాదిమంది ఉక్రెయిన్లు నిరాశ్రయులయ్యారు. అయినా సరే ఉక్రెయిన్ ఏ మాత్రం వెనుక్కు తగ్గకుండా ఊహించని రీతిలో ప్రతి ఘటన చేసింది. దీంతో రష్యా క్షిపణి దాడులతో బాంబుల వర్షం కురిపించి శిథిలాల దిబ్బగా మార్చేసింది. రోజురోజుకి యుద్ధం తీవ్రతరమవుతుందే గానీ ముగియడం అనేది అడియాశగానే మిగులుతోంది. (చదవండి: టర్కీ, సిరియా భారీ భూకంపం.. గాఢనిద్రలోనే సమాధి.. పెరుగుతున్న మృతుల సంఖ్య) -
ఇదో కొత్త రకం ప్రింటర్.. ప్రింట్ చేసిన కాగితాన్ని 10 సార్లు వాడొచ్చు!
అచ్చేసిన కాగితాన్ని ఎన్నిసార్లు వాడొచ్చు? ఒకసారి అచ్చేసిన కాగితాన్ని ఏ పొట్లాలు కట్టుకోవడానికో తప్ప ఇంకెన్నిసార్లు వాడగలరేంటి అనుకుంటున్నారా? ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. ఇప్పటికీ సమాధానం తట్టడం లేదా? సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. అచ్చేసిన కాగితాన్ని అక్షరాలా పదిసార్లు వాడుకోవచ్చు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపడుతున్నారా? ఇంతవరకు అసాధ్యంగా ఉన్నదాన్నే ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు సుసాధ్యం చేసి చూపించారు. అదెలాగో తెలుసుకుందాం... కంప్యూటర్లు వచ్చాక, ఆఫీసుల్లో ప్రింటర్ల వాడకం పెరిగింది. ఒకసారి ప్రింట్ చేసిన కాగితాన్ని మళ్లీ వాడుకునే అవకాశం ఉండకపోవడంతో కాగితాల వినియోగానికి కోతపెట్టే అవకాశం అసాధ్యమయ్యేది. అప్పటికీ కాగితం వినియోగాన్ని వీలైనంతగా తగ్గించేందుకు, కాగితానికి రెండువైపులా ముద్రించే ప్రింటర్లనూ తయారు చేశారు. ఇప్పుడు చాలా చోట్ల కాగితానికి రెండువైపులా ప్రింట్ చేసే ప్రింటర్లు వాడుకలోకి వచ్చాయి. వీటివల్ల కాగితాల వాడకం సగానికి సగం తగ్గింది. కాగితాల వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, ప్రింట్ చేసిన కాగితాలను పునర్వినియోగం చేసుకునేలా ఇజ్రాయెల్లోని ‘రీప్’ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక అద్భుత సాధనాన్ని తయారు చేశారు. ఇది ప్రింటర్లాగానే కనిపిస్తుంది గాని, ప్రింటర్ కాదు. ఇది డీప్రింటర్. ప్రింట్ చేసిన కాగితం మీద ఉన్న ఇంకును పూర్తిగా పీల్చేసుకుని, క్షణాల్లోనే కాగితాన్ని మళ్లీ తెల్లగా మార్చేస్తుంది. ఈ డీప్రింటర్ ద్వారా ఇలా ఒక్కో కాగితాన్ని పదిసార్లు వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే, డీప్రింటర్ ద్వారా ఒకటికి పదిసార్లు కాగితాలను వాడుకోవాలంటే, సాధారణ కాగితాల వల్ల సాధ్యం కాదు. ఇంకును పీల్చుకోని విధంగా ప్రత్యేకమైన కోటింగ్తో తయారైన కాగితాలను ప్రింటర్లో వాడాక, ప్రింట్ అయిన కాగితాలను డీప్రింటర్లో వాడుకోవాల్సి ఉంటుంది. పదిసార్లు పునర్వినియోగానికి అవకాశం ఉండటం వల్ల ప్రత్యేకమైన కోటింగ్తో తయారైన కాగితాలను ప్రింటర్లలో విరివిగా వాడుకునే అవకాశాలు పెరుగుతాయని, డీప్రింటర్ ద్వారా కాగితాల పునర్వినియోగం కూడా బాగా పెరుగుతుందని ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగితాలను రీసైక్లింగ్ చేయడం కొత్త కాకున్నా, ప్రింటర్లో ఒకసారి అక్షరాలను ముద్రించేసిన కాగితాలను ఒకటికి పదిసార్లు వాడుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం మాత్రం ఇదే మొదటిసారి. రీసైక్లింగ్ చేసిన కాగితాలను టిష్యూలు, టాయిలెట్ పేపర్లు, న్యాప్కిన్లు వంటివాటి తయారీకి ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. అలాగే, వార్తపత్రికల కోసం కూడా రీసైకిల్డ్ పేపర్లను ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తున్నారు. డీప్రింటర్ వాడకం పెరిగితే, కాగితాల వాడకానికి ఇక కళ్లేలు పడగలవనే ఆశించవచ్చు. ∙జగదీశ్వర్ కుమార్ -
అది ‘పెగసస్’గా నిర్ధారించలేం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసస్ను కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా ఉపయోగిస్తోందంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ ప్యానెల్ తన నివేదికను ధర్మాసనానికి అందజేసింది. 29 ఫోన్లను పరీక్షించగా, కేవలం 5 ఫోన్లలో ఒకరకం మాల్వేర్ను గుర్తించినట్లు నివేదికలో వెల్లడించింది. అయితే, అది నిజంగా ఇజ్రాయెల్ పెగసస్ స్పైవేర్ అవునో కాదో నిర్ధారణకు రాలేకపోతున్నట్లు పేర్కొంది. పెగసస్ అంశంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలోని ప్యానెల్ తన నివేదికను తాజాగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి అందజేసింది. అందులోని వివరాలను ధర్మాసనం గురువారం బయటపెట్టింది. ‘‘దర్యాప్తునకు కేంద్రం సహకరించలేదని కమిటీ(ప్యానెల్) చెప్పింది. పెగసస్ విషయంలో కోర్టులో విచారణకు మీరు(కేంద్రం) సహకరించలేదు. కమిటీకి సహకరించలేదు’ అని పేర్కొంది. పౌరుల గోప్యత హక్కు రక్షణ, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఇప్పుడున్న చట్టాలను సవరించాలని సూచించిందని వివరించింది. నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం పరీక్ష కోసం టెక్నికల్ కమిటీకి 29 ఫోన్లు అందజేయగా, అందులో 5 ఫోన్లలో మాల్వేర్ కనిపించడం కొంత ఆందోళనకరమైన విషయమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 29 ఫోన్లు ఇచ్చిన వారికి ఈ నివేదికను అందజేయలేదని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, చట్టవిరుద్ధమైన నిఘా, పౌరుల గోప్యత విషయంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్యానల్ ప్రతిపాదించిందని చెప్పారు. నివేదికను విడుదల చేయొద్దంటూ ప్యానల్ తమను కోరిందన్నారు. ఇవన్నీ సాంకేతికపరమైన అంశాలని, నివేదికలో ఏయే భాగాలను బహిర్గతం చేయాలో తాము నిర్ణయిస్తామని, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని వివరించారు. ప్యానెల్ నివేదికను కక్షిదారులకు అందజేయాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాకేశ్ త్రివేది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. దర్యాప్తునకు కేంద్రం సహరించలేదని ధర్మాసనం చెప్పగా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ఆ విషయం తనకు తెలియదని బదులిచ్చారు. ధర్మాసనం తదుపరి విచారణకు నాలుగు వారాలకు వాయిదా వేసింది. రాహుల్ క్షమాపణ చెబుతారా?: బీజేపీ పెగసస్ వ్యవహారంలో ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు దుష్ప్రచారం సాగించాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ ఇకనైనా క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, స్వయం ప్రకటిత మేధావులు, కొన్ని ప్రభుత్వేతర సంస్థలు, ఓ వర్గం మీడియా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేశాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ అబద్ధాలు ప్రచారం చేసినట్లు తేటతెల్లమయ్యిందన్నారు. కేంద్రం ఏదో దాస్తోంది: రాహుల్ పెగసస్ ఉదంతంలో కేంద్ర ప్రభుత్వంతో ఏదో దాచేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్కు మోదీ ప్రభుత్వం సహకరించలేదని తప్పుపట్టారు. దీన్నిబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తెలిసిపోతోందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని మోదీ సర్కారు కోరుకుంటోందన్నారు. దర్యాప్తునకు సహకరించలేదంటే ఏదో నిజాన్ని దాస్తున్నట్లు అంగీకరించినట్లేనని చెప్పారు. ఈ మేరకు రాహుల్ గురువారం ట్వీట్ చేశారు. -
వింతైన దృశ్యం: సముద్రంలో తెల్లటి చుక్కలు: వీడియో వైరల్
జెల్లీఫిష్లు గురించి అందరూ వినే ఉంటారు. వాస్తవానికి అవి మహా సముద్రాల్లో లోతైన ప్రాంతాల్లో సంచరించే ఒక రకమైన జీవి. ఈ అకశేరుకాలలో మెదుడు అనేది ఉండదు. వాటి శరీరంలో మొత్తం దాదాపు 95% నీరు ఉంటుంది. మనం మహా అయితే ఒకటో రెండో జెల్లీ ఫిష్లు సముద్రంలో అరుదుగా కనిపిస్తాయి. ఏకంగా పెద్ద సముహంలా జెల్లీఫిష్లను చూసి ఉండం. కానీ ఇజ్రాయెల్లోని నేషన్స్ పార్క్స్ అండ్ నేచర్ అథారిటీ ఒక అద్భుతమైన వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒక పడవ చుట్టూ భారీ సముహంలా కొన్ని లక్షల జెల్లీఫిష్లు ఉంటాయి. పైగా అవి చూసేందుకు సముద్రంలో తెల్లటి చుక్కల వలే అందంగా కనిపిస్తాయి. చూసేందుకు భలే అద్భుతంగా ఉంటుంది. ఐతే కాలుష్యం, వాతావరణ మార్పులే ఈ జెల్లిఫిష్లు అధిక సంఖ్యలో పెరిగిపోవడానికి కారణమని అంటున్నారు శాస్త్రవేత్లు. ఇవి వాస్తవానికి హిందూ మహాసముద్రలో ఉద్భవించాయి. ఐతే సూయజ్ కాలువా ద్వారా తూర్పు మధ్యధరా ప్రాంతానికి చేరుకుంటాయని విశ్వసిస్తారు. శీతలికరణం కోసం సమద్రపు నీటిని వినియోగిస్తాయి. కానీ అధిక సంఖ్యలో ఉన్న ఈ జెల్లీఫిష్లు పవర్ స్టేషన్లో విద్యుత సరఫరాకి ప్రమాదకరంగా ఉన్నాయి. ఐతే ఈ జెల్లీ ఫిష్లు మానువులను కుడతాయని కొద్దిపాటి మోతాదులో విషం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇవి కుట్టిన ఒక్కోసారి అంతపెద్ద ప్రమాదం సంభవించదు గానీ కాస్త నొప్పిగా ఉండటంతో అసౌకర్యానికి గురవుతాం. కొన్ని అరుదైన సందర్భాల్లో విపరీతమైన నొప్పి ఏర్పడి మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. (చదవండి: శివయ్య మీద పాట: సింగర్ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్.. హిందూ సంఘాల రియాక్షన్ ఇది!) -
అదానీ గ్రూప్ చేతికి ఇజ్రాయెల్ పోర్టు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్లోని పోర్ట్ ఆఫ్ హైఫా ప్రైవేటీకరణ టెండర్ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్), గాడోట్ గ్రూప్ కన్సారి్టయం దక్కించుకుంది. దీనితో పోర్ట్ ఆఫ్ హైఫాను నిర్వహించే హైఫా పోర్ట్ కంపెనీలో 100 శాతం వాటాల కొనుగోలు హక్కులు కన్సార్షియంకు లభిస్తాయి. ఏపీసెజ్ ప్రకటన ప్రకారం ఇందులో అదానీ పోర్ట్స్కు 70 శాతం, గాడోట్ గ్రూప్నకు 30 శాతం వాటాలు ఉంటాయి. డీల్ విలువ 1.18 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,422 కోట్లు). ఏపీసెజ్ను అంతర్జాతీయంగా లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ కార్యకలాపాలతో పాటు రవాణా దిగ్గజంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలకమైన అడుగని కంపెనీ సీఈవో కరణ్ అదానీ పేర్కొన్నారు. భారత్కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్లోనూ, అలాగే యూరప్లోని పోర్టుల రంగంలోనూ తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీసెజ్తో భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడగలదని గాడోట్ సీఈవో ఓఫర్ లించెవ్స్కీ పేర్కొన్నారు. కార్గో హ్యాండ్లింగ్లో తమకు, పోర్టు కార్యకలాపాల నిర్వహణలో అదానీ గ్రూప్నకు అపార అనుభవాలు ఉండటం .. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయో గపడుతుందన్నారు. ఇజ్రాయెల్లో మూడో అతి పెద్ద నగరమైన హైఫాకి దగ్గర్లో పోర్ట్ ఆఫ్ హైఫా ఉంది. 2021లో ఇక్కడ 1.46 మిలియన్ల టీఈయూ (ట్వెంటీ ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్లు) కంటైనర్లను, 2.56 మిలియన్ టన్నుల కార్గోనూ హ్యాండిల్ చేశారు. మరోవైపు, అదానీ గ్రూప్లో రవాణా వ్యాపార విభాగంగా ఏపీసెజ్ కొనసాగుతోంది. -
'పెగసస్' చిచ్చు, సర్వీస్లను షట్ డౌన్ చేసిన అమెజాన్
'పెగసస్' దెబ్బకు అమెజాన్ క్లౌడ్ సర్వీస్, అమెజాన్ వెబ్ సర్వీస్లను షట్ డౌన్ చేసినట్లు అమెరికన్ మీడియా 'వైస్' ప్రకటించింది. గత కొద్దిరోజులుగా ప్రపంచ వ్యాప్తంగా పెగసస్ పేరు మారు మోగిపోతోంది. ఇజ్రాయిల్కు చెందిన టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్ తయారు చేసిన పెగసస్ అనే సాఫ్ట్వేర్ను సైబర్ నేరస్తులు దొంగిలించారు. ఆ దొంగిలించిన పెగసస్ సాఫ్ట్వేర్ సాయంతో సైబర్ దాడికి పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఇదే స్పైవేర్ జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో 37 మంది ప్రముఖుల స్మార్ట్ ఫోన్లలోని రహస్యాల్ని సేకరించిందనే వార్త దావనంలా వ్యాపించింది. స్పైవేర్ డేటా సేకరించిన వారిలో రాజకీయ నాయకులు, జర్నలిస్ట్లు, ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు, హ్యుమన్ రైట్స్ యాక్టివిస్ట్లు ఉన్నట్లు అంతర్గత విచారణలో తేలింది. కానీ ఎన్ఎస్ఓ గ్రూప్ మాత్రం ఈ వార్తల్ని ఖండిస్తోంది. టెర్రరిజంపై ఫైట్ చేసేందుకు పెగసెస్ను ప్రభుత్వాలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఉపయోగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పెగసెస్ పెట్టిన చిచ్చు ప్రముఖుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. తాజాగా అమెజాన్ సైతం ఎన్ఎస్ఓతో సంబంధం ఉన్న సర్వీసుల్ని షట్డౌన్ చేస్తున్నట్లు తెలిపింది. అమెజాన్కు ఎన్ఎస్వోకు మధ్య టెక్నాలజీ పరమైన సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎన్ఎస్పై పెగసస్ ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది. చదవండి: భారీగా ఏర్పాటైన కంపెనీలు, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు -
వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, హమాస్
గాజా సిటీ: ఇజ్రాయెల్, పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య ఉద్రిక్తతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. గురువారం ఇరు వర్గాలు భీకరస్థాయిలో ఘర్షణకు దిగాయి. రాకెట్లతో నిప్పుల వర్షం కురిపించుకున్నాయి. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈజిప్టు రంగంలోకి దిగింది. ఉద్రిక్తతలను చల్లార్చి, సాధారణ స్థితిని నెలకొల్పడమే లక్ష్యంగా ఈజిప్టు మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఒకవైపు చర్చలు సాగుతుండడగానే రాకెట్లతో దాడులు కొనసాగడం గమనార్హం. హమాస్ భారీ స్థాయిలో రాకెట్లతో ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడింది. కొన్ని రాకెట్లు ముఖ్యనగరం టెల్ అవీవ్ దాకా దూసుకురావడం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యం సైతం ధీటుగా బదులిచ్చింది. గాజాపై తన అస్త్రాలను ఎక్కుపెట్టింది. ఇంకోవైపు గాజాలో అరబ్, యూదు ప్రజలు వీధుల్లో బాహాబాహీకి దిగారు. 13 మంది హమాస్ తీవ్రవాదులు హతం! గాజాలో హమాస్ తీవ్రవాదులు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న మూడు బహుళ అంతస్తుల భవనాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 83 మంది పాలస్తీనా పౌరులు మరణించారని, వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. తమ సభ్యులు 13 మంది అమరులైనట్లు హమాస్ తెలిపింది. హమాస్ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ‘ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, దిమోనా, జెరూసలేం నగరాలపై బాంబులు వేయడం మాకు మంచి నీళ్లు తాగడం కంటే సులభం’ అని హమాస్ మిలటరీ విభాగం ప్రతినిధి ఒకరు ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అణు రియాక్టర్ దిమోనా సిటీలో ఉంది. హమాస్ తమ దేశంపై 1,200 రాకెట్లు ప్రయోగించగా, ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్తో 90 శాతం రాకెట్లను నిర్వీర్యం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
గ్రహాంతర జీవులున్నారు!
టెల్అవీవ్: విశ్వంలోని ఇతర గ్రహాల్లో జీవులున్నారని, ఏలియన్స్ ఉన్నారన్న సంగతి అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు సైతం తెలుసని ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ చీఫ్ హైమ్ యేషెడ్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ తమ ఉనికిని రహస్యంగా ఉంచుతున్నారని, మానవాళి గ్రహాంతర జీవులను నమ్మేందుకు ఇంకా తయారుగా లేనందునే వారు రహస్యంగా ఉంటున్నారని యేషెడ్ చెప్పారు. గ్రహాంతర జీవులు, వారితో అమెరికా ప్రభుత్వ ఒప్పందం, ఏలియన్స్ ఏర్పాటు చేసిన గెలాక్టిక్ ఫౌండేషన్ తదితర అంశాలను 87 ఏళ్ల యేషెడ్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన కీలక పదవిలో ఉండడంతో యేషెడ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత వస్తోంది. విశ్వ నిర్మాణాన్ని అధ్యయనం చేయాలని ఏలియన్స్ భావిస్తున్నారని, ఆ మేరకు యూఎస్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారని యేషెడ్ చెప్పారు. దీంతో పాటు మార్స్ గ్రహంపై ఒక రహస్య అండర్గ్రౌండ్ బేస్ నిర్మాణానికి సైతం అమెరికా, ఏలియన్స్ మధ్య ఒప్పందం ఉందన్నారు. గెలాక్టిక్ ఫౌండేషన్ సూచన మేరకు ఏలియన్స్ ఉన్నారన్న నిజం తెలిసినా ట్రంప్ బయటకు చెప్పట్లేదన్నారు. మానవాళి విశ్వం, విశ్వ నౌకల గురించి అవగాహన పెంచుకోవాలని గ్రహాంతర జీవుల కోరికని చెప్పారు. ఐదేళ్ల క్రితం తానీ విషయం చెబితే తనపై పిచ్చోడి ముద్ర వేసి ఆస్పత్రిలో చేర్చేవారని యేషెడ్ అన్నారు. గతంలో ఆయన రచించిన ఒక పుస్తకంలో కూడా యేషెడ్ ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు. తాజాగా యేషెడ్ చేసిన కామెంట్లపై ట్రంప్ కానీ, యూఎస్ ప్రభుత్వం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
ఈ మాస్క్ ధర, యజమాని గురించి తెలిస్తే...
కరోనా మహమ్మారి కాలంలో సాధారణ కాటన్ మాస్క్ నుంచి కొంచెం ఖరీదైన ఎన్99 మాస్క్ లు ధరించడం సర్వసాధారణంగా మారిపోయింది. అలాగే బంగారు, డైమండ్ మాస్క్ లు ఇలా.. వారి వారి స్థాయిలను బట్టి ధరించడం కూడా చూశాం. మాస్క్ ధరించడం కేవలం ఆరోగ్య సంరక్షణ మాత్రమే కాదు. ఇపుడొక స్టేటస్ సింబల్ కూడా. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతి ఖరీదైన జిగేల్.. జిగేల్.. మాస్క్ రూపుదిద్దుకుంటోంది. ఇజ్రాయెల్ ఆభరణాల సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కరోనావైరస్ మాస్క్ ను తయారు చేస్తోంది. టాప్-రేటెడ్ ఎన్99 ఫిల్టర్లు, బంగారం, అతి ఖరీదైన వజ్రాలు పొదిగిన ఈ మాస్క్ ధర 1.5 మిలియన్ డాలర్లు (సుమారు 11.2 కోట్లు రూపాయలు) గా ఉండనుంది. అమెరికాలో ఉంటున్న చైనా వ్యాపారవేత్త దీనిని ఆర్డర్ చేశారు. ఇంతకుమించి ఈ మాస్క్ కొనుగోలుదారుని వివరాలను అందించేందుకు జ్యుయల్లరీ సంస్థ వైవెల్ యజమాని, డిజైనర్ ఐజాక్ లెవీ నిరాకరించారు. జెరూసలేం సమీపంలోని తన కర్మాగారంలో ఒక ఇంటర్వ్యూలో ఈ ఖరీదైన మాస్క్ వివరాలను అందించారు డిజైనర్ ఐజాక్ లెవీ. 18 క్యారెట్ల వైట్ గోల్డ్ తో రూపొందిస్తున్న మాస్క్ చుట్టూ, 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని తెలిపారు. అలాగే కొనుగోలుదారుడి అభ్యర్థన మేరకు ఈ స్పెషల్ మాస్క్ తయారుచేస్తున్నట్టు చెప్పారు. ఇది ఈ సంవత్సరం చివరినాటికి పూర్తవుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా తమ మాస్క్ నిలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు కరోనా సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోతూ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నసమయంలో తమకు మంచి అవకాశం లభించిందన్నారు. తమ సిబ్బందికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందంటూ కొనుగోలు దారుడికి కృతజ్ఞతలు తెలిపారు లెవీ. World's most expensive mask? An Israeli jewelry company is making a $1.5-million gold #coronavirus mask for a Chinese businessman living in the US. The 18-karat white gold mask will be decorated with 3,600 diamonds and fitted with top-rated N99 filters. pic.twitter.com/D9r91HsU3B — Global Times (@globaltimesnews) August 10, 2020 -
ఇజ్రాయెల్ సంస్థను నిషేధించిన ఫేస్బుక్
లండన్: సామాజిక మాధ్యమ దిగ్గజమయిన ఫేస్బుక్ ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఆర్కిమెడిస్ సంస్థను బ్యాన్ చేసింది. ఆర్కిమెడిస్కు చెందిన 256 ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ అకౌంట్లను తొలగించామని ఫేస్బుక్ బుధవారం ప్రకటించింది. కొన్ని పార్టీలను ఎన్నికల్లో గెలిపించేందుకు ఈ గ్రూప్ పెద్ద ఎత్తున నిర్వహించిన అసత్య ప్రచారం, ఫేస్బుక్ పాలసీను లెక్కచేయక పోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. అయితే, ఆర్కిమెడిస్ సంస్థ నుంచి దీనిపై ఎటువంటి స్పందన రాలేదు. 2016 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రదర్శించిన వైఖరి కారణంగా ఫేస్బుక్ సర్వత్రా విమర్శలపాలైంది. ఆ తర్వాత నుంచి ఎన్నికల్లో జరిగే ధోరణులపై విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఓటర్లను ఆకర్షించే క్రమంలో తప్పుడు సమాచారాన్ని షేర్ చేయకుండా ఫేస్బుక్ జాగ్రత్తలు తీసుకోంటుంది. ఇందులో భాగంగా ఫేస్బుక్ తన దృష్టిని లాటిన్ అమెరికాతోపాటు పలు ఆఫ్రికా దేశాలు, ఆగ్నేయ ఆసియాలపై కేంద్రీకరించింది. -
అంకెల గారడి
ఈ విషయ ప్రపంచాన్ని నిర్దేశించే మౌళిక సూత్రం అంకెలే. అంకెల్లోని మర్మం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అంకెల మాయ గందరగోళపరుస్తుంది. ఎందుకంటే అంకెలు కేవలం రాసిని తెలిపేవి మాత్రమే కాదు, కొన్ని నిర్దిష్ట, విశిష్ట లక్షణాలను తెలియపర్చే గుర్తులు. జోస్యం చెప్పాలంటే గవ్వలు వేయాలి. పందెంలో పడ్డ అంకెను బట్టి భవిష్యత్తు నిర్ణయమవుతుంది.ప్రతి చర్యా దాని ప్రతిచర్యా సమన్వయంతో జరిగిపోవటానికి మూలం అంకెలే. సకల చరాచర జీవరాశి యొక్క ఉనికికి కదలికలకు అంకెలే ఆధారభూతాలు. అంకెల సంకెల వస్తువులను ఓ క్రమంలో పేర్చటానికి, వాటిని వేరువేరుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఒకసారి మాత్రం అది పలు హత్యలు జరిగిన రంగాన్ని గుర్తించింది.వార్తాపత్రికలు, టీవీ చానళ్లు 9 చెర్రీ లేన్లో జరిగిన పలు హత్యల ఉదంతాన్ని కర్ణకఠోరంగా ఊదరగొట్టాయి ముఖ్యాంశాల్లో. ‘పోలీసుల కథనం ప్రకారం’ అంటూ జడ్సన్ కుటుంబం మొత్తం ఈ హత్యల్లో అసువులు బాయటాన్ని దారుణమైన దుర్ఘటనగా ఉదహరించాయి. వార్తల్లోని వాక్యాలు జాన్ జడ్సన్ అనేక కత్తిపోట్లకు గురై మృతి చెందాడని చెప్పాయి. ఆ పదబంధాలు అతని భార్య ఏలిస్ జడ్సన్ ఊపిరాడక చనిపోయినట్లు తెలిపాయి. గుర్తుతెలియని వ్యక్తులు జడ్సన్ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి పోలీసులకి అంతుచిక్కని ఏదో వస్తువు కోసం అణువణువూ గాలిస్తున్నప్పుడు పిల్లలు కూడా ఈ ఘోరానికి బలయ్యారు. ఆరు సంవత్సరాల బెట్సీ అందంగా అలంకరించుకున్న తన గదిలో రక్తపు మడుగులో పడి ఉంది. పసివాడు డేవిడ్ తను కంటున్న అందమైన కల భంగం కాకుండానే ముఖం మీద దిండు అదిమిపెట్టటం వల్ల మరణించాడు. పోలీసులు ఇంతకంటే వివరాలేమీ వెల్లడించలేదు.ఫోరెన్సిక్ నిపుణులకు, ప్రత్యేక విచారణాధికారులకు మాత్రమే శవాల అసలు పరిస్థితి తెలుసు. తండ్రి శరీరాన్ని పాక్షికంగా కప్పి ఉంచారు. తాళ్ళతో కట్టేయబడి, నోట్లో గుడ్డలు కుక్కబడి, అరికాళ్ళ కింద మంటలు పెట్టడం వల్ల చర్మం కాలిపోయి, బేస్మెంట్లో కాళ్ళు చేతులు బార్లా చాపి పడి ఉన్న స్థితిలో శవాన్ని కనుగొన్నామని తమ రిపోర్టులో రాశారు. తల్లి చనిపోయిన విధానాన్నైతే పూర్తిగా వైద్య పరిభాషలోనే చెప్పారు. ఆ భార్యాభర్తల శవాల్ని తెల్లగుడ్డలతో పూర్తిగా కప్పివేశాక కూడా మీడియా కంట పడనివ్వలేదు. ఈ దారుణ మారణకాండ జరిగిన ఇంట్లోని బేస్మెంట్, ఇతర గదులు కూడా సీల్ చేసి పోలీసు కాపలా పెట్టారు. పోస్ట్ మార్టం వ్యాన్లో ఎక్కిస్తున్నపుడు పిల్లల శవాల్ని చూసి అదిరిపడ్డారు అక్కడి జనం.విచారణ బృందం ప్రతినిధి ఇంట్లోంచి బయటకు రాగానే మీడియా రిపోర్టర్లు మూకుమ్మడిగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయన అందరినీ ఆగమంటూ చెయ్యెత్తాడు. ఉత్కంఠతో కూడిన నిశ్శబ్దం ఆవరించాక తన గంభీరమైన గొంతుతో ఈ హత్యలకు సంబంధించిన వివరాలు చెప్పాడు ‘‘లభ్యమవుతున్న ఆధారాలను బట్టి ఈ రోజు తెల్లవారుజామున కొంతమంది ఈ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. భర్త మిస్టర్ జాన్ జడ్సన్ని వారు చేతులు వెనక్కి విరిచి పట్టి బేస్మెంట్లోకి తీసుకొచ్చి చిత్రహింసల పాలు చేశారు. కారణం తెలియదు. జాన్ ఎంతకూ రాకపోయేటప్పటికి ఏమైందోనని భార్య ఏలిస్ పడకగదిలోంచి బయటకు వచ్చింది. అపరిచితులను చూసి కంగారుపడింది. దుండగులు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి పెనుగులాడుతున్నా విడువకుండా బేస్మెంట్లోకి ఈడ్చుకెళ్ళారు. అక్కడ ఆమెను గొంతు నులిమి చంపారు. ఆ తరువాత దేనికోసమో ఇల్లంతా వెతికారు. ఆ సమయంలోనే మేలుకున్న చిన్నారి బెట్సీ భయంతో పెడుతున్న కేకలు విని జడ్సన్ కుటుంబంలో మిగిలిన ఇద్దరు పసివాళ్ళని కూడా కనికరం లేకుండా చంపి ఈ కరకు చర్యను ముగించి వెళ్ళిపోయారు. బెట్సీకి ఆరేళ్ళు, డేవిడ్ కి రెండు. తెల్లవారాక వచ్చిన పనిమనిషి ముందుతలుపు తెరిచి ఉండటం, ఏదో పెనుగులాట జరిగిన గుర్తులుండటం చూసి కీడు శంకించింది. లోపల చెల్లాచెదురైన సామాన్ల మధ్య శవాలని చూసి పోలీసులకు వార్త తెలియజేసింది. దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో ఏదైనా ముందంజ వేస్తే అది మీకు తప్పక తెలియజేస్తాం’’ అని చెప్పి ముగించాడు. ఇక ఆపై విలేకర్లు అడిగిన ఏ ప్రశ్నకీ సమాధానం చెప్పకుండా ఆయన హత్య జరిగిన ఇంటి లోపలికి వెళ్ళిపోయి తలుపు మూసేశాడు. 9‘తొమ్మిది’ అంకె సర్వ శక్తిమంతమైనది. అందులో త్రిక త్రయం (మూడు మూళ్ళు) ఉంది. అది సమాప్తికి, సంప్రాప్తికి, సంపూర్ణతకు చిహ్నం. తొమ్మిది దివ్య సంఖ్య. ‘పరిశుద్ధ’ సంఖ్య. ఎందుకంటే ‘9’ తర్వాత ఇక అంకెలు లేవు. ఇదే చివరిది. ఇదే అవధి. మిగిలిన సంఖ్యలన్నీ దీనితోనే ఉండి, దీని చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. భ్రమ(సున్నా) చుట్టూ ఉండే భ్రమణమే తొమ్మిది. తొమ్మిది గ్రహాల తర్వాత గాలి నీరు ఉండవు. అంటే శూన్యానికి ఆరంభం కూడా తొమ్మిదే. ప్రాచీనులు కాళరాత్రి కుమారుడైన కాలయముడిని ప్రసన్నం చేసుకోవటానికి గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసేవారు. తొమ్మిది ప్రళయావతారిణి, భీకర రూపిణి అయిన మహాదుర్గ చిహ్నం. ఇందులో లయం ఉంది. జాన్ జడ్సన్ బతికి ఉన్నప్పుడు ఆదర్శప్రాయుడైన ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్. ఏ పనినైనా పద్ధతిగా చేసేవాడు. అతని వస్త్రధారణ నిర్లోపం. ఇతరులతో ఎప్పుడూ గంభీరంగా మాట్లాడింది లేదు. ఎవరినీ పల్లెత్తు మాట అని ఎరుగడు. సదా నవ్వుతున్నట్టుండే నీలి కళ్ళు, ముఖం మీద చెరగని చిరునవ్వు. నడివయసుకు దగ్గరవుతున్నట్టు తెలిపే చిరుబొజ్జ ఈ మధ్యనే తోడైంది. జాన్ జడ్సన్ హైస్కూల్ రోజుల్నించే తాను ప్రేమించిన ఏలిస్ హాడ్జ్ను పెళ్ళి చేసుకున్నాడు. ఏలిస్ అందగత్తే! సొట్టలు పడే బుగ్గలు కొంచెం ఎత్తుగా ఉండి ఆమె అందాన్ని మరింత పెంచేవి. లేత పసుపు రంగు జుట్టుని పొడుగ్గా పెరగనీయకుండా కత్తిరించుకొని చక్కగా దువ్వుకునేది. బంగారు దొన్నెలో వెలిగిపోయే తామరపూవులా ఉండేది ఆమె ముఖం. వయసు మీరుతున్న కొద్దీ కొద్దికొద్దిగా లావైంది కానీ చేస్తున్న సెక్రటరీ ఉద్యోగానికి తగ్గట్టే గౌరవప్రదంగా ఉండేది ఆమె అలంకరణ. జాన్, ఏలిస్ తమ ప్రపంచంలోకి ఒక అందమైన పాపను తెచ్చారు. బెట్సీ అనే పేరు పెట్టారు. కనుపాపగా పెంచారు. సంతోషం మూట గట్టినట్టుండే బెట్సీని ఆరేళ్ళ వయసులో ఓ క్రూరమైన చేయి తుడిచి పెట్టేసింది. రెండేళ్ళ డేవిడ్ ఆ కుటుంబం అనుభవిస్తున్న సంతోషానికి సంపూర్ణతను చేకూర్చాడు – మరణం వరకూ! జాన్ ఆశయాలు తొందరగానే నెరవేరాయి. పదవిలో ఉన్నతి, జీతంలో పెంపు అతనికి జీవితాన్ని మరింత సుఖవంతంగా అనుభవించే అవకాశం ఇచ్చాయి. ఇటీవలే కొనుక్కున్న చెర్రీ లేన్లోని తొమ్మిదవ నంబరు ఇంట్లో అతని కుటుంబం చీకూ చింతా లేకుండా ఉన్నారు. ఇంటిని తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకునే సమయం చాలా ఉందనుకొని ఆ ఆనంద నిలయంలో తమ ఉజ్జ్వల భవిష్యత్తు కోసం కలలు కంటూ జీవించారు. ఇంటి ప్రవేశ ద్వారం మీద లతలు తీగలతో చెక్కిన ‘9’ ని ఎంతో గర్వంగా మేకులతో బిగించారు. కానీ సమాపనకు చిహ్నమైన ఆ గుర్తుతో ఇంటి మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ‘ఆరు’ మతాధిపతుల అంకె. దీన్ని తర్కంతో సమానంగా చెప్తారు. మృత్యువులోని శూన్యమే ఈ అనంత విశ్వం అని సూచిస్తుందీ అంకె. ఇదే అంతిమ రహస్యం. ఆత్మ పరమాత్మల ఏక చిహ్నం. పారలౌకికతకు, అద్వైతానికి మరో రూపం ఆరు. పాచికలాటలో ఆరు పడితే గెలుపు. పడలేదా, జూదగాడు చిక్కుల్లో పడ్డట్టే! అదృష్టం, అందం, ఆరోగ్యం, ప్రేమ, అవకాశం, సమన్వయాల్ని సూచించే ఆరు పూర్ణ సంఖ్య. షష్ఠి సర్వదా వరద, సుఖద. విజయప్రాప్తి ఈ అంకె. చెర్రీ లేన్లో తొమ్మిదవ నంబరు ఇంటి ఎదురుగా ఉండే ఆరవ నంబరు ఇల్లు కొన్నేళ్ళుగా ఎవరూ సరిగా పట్టించుకోకపోవడంతో పాడుబడింది. దాని చుట్టూ ఉన్న పెరటిలో ఇప్పుడు గడ్డి మోకాలి ఎత్తుకి పెరిగింది. పూల మొక్కలుండాల్సిన చోట ఏపుగా కలుపు మొక్కలున్నాయి. పాదుల్లో రాలిన ఆకుల కుప్పలతో నిండిపోయి, గుబురుగా పెరిగిపోయిన పొదలతో చూడగానే భీతి గొల్పుతుంది. అక్కడ ఎవరూ నివసించటం లేదనిపిస్తుంది. కాని ఎవరికీ తెలియని విషయమేమిటంటే చట్టం కళ్ళు గప్పి సంచరించే అధర్మపరులు, నేరస్థులు కొందరు అప్పుడప్పుడు ఆ ఇంట్లో తలదాచుకుంటుంటారు. అందుకే పోలీసులు అప్పుడప్పుడు ఆ ఇంటిమీద నిఘా పెడుతుంటారు. అలా చివరిగా ఆ ఇంట్లో ఉన్న శరణార్థి చుంచుమొహంతో పొట్టిగా పీలగా ఉండేవాడు. వాడు బ్యాంకుల్ని కొల్లగొట్టే ఆరుగురు దుష్ట రౌడీల ముఠాలో ఒకడు. గుమ్మడికాయలు దొంగిలించి భుజాలు తడుముకున్నాడు. పోలీసుల డేగకన్నుకి దొరికిపోయాడు. అంతే కాదు, తన సహచరుల గురించి చట్టానికి ఉప్పందించాడు. తస్కరించిన డబ్బు దస్కం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. చుంచుగాడు తనకు మాత్రమే తెలిసిన ఒక రహస్య ప్రదేశంలో దాచాడని ముఠాలో మిగతా అయిదుగురు అనుమానించారు. ప్రాథమిక విచారణలో న్యాయమూర్తి నేరారోపణ రుజువు చేయవలసిందిగా గ్రాండ్ జ్యూరీని ఆదేశించాడు. అయితే చుంచుగాడికి భయం పట్టుకుంది. కోర్టులో తను పోలీసులకిచ్చిన వాంగ్మూలాన్ని తోసిపుచ్చాడు. గ్రాండ్ జ్యూరీలో పద్దెనిది మంది సభ్యులున్నారు. తొమ్మిదిమంది అతని మాటలనుబట్టి వీళ్ళు నేరస్థులనీ, మిగతా తొమ్మిదిమంది సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసు కొట్టివేయాలని తేల్చారు. శిక్ష వేయడానికి కనీసం పన్నెండుమంది (ఆరు + ఆరు) ఆమోదం కావాలి కాబట్టి దొంగల ముఠాపై నేరారోపణ ఎత్తివేశారు. రౌడీలు విడుదలయ్యారు. కానీ ఇన్ఫార్మర్గా మారిన తమ ముఠాలో ఆరోవాడైన చుంచుగాడి మీద మిగతావారు పగబట్టారు. వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు గానీ కొన్నాళ్ళకే ఖాళీ ఇనప్పెట్టె వెక్కిరించింది. అది చాలు వారికి చెర్రీ లేన్లో ఆరవ నంబరు ఇంటి మీద ఓ కన్నేసి ఉంచడానికి. మురికి బట్టలేసుకున్న ఓ మనిషి అనేక సమయాల్లో ఆ ఇంటికి కాపలా కాస్తుండేవాడు. వాడి కాలి కింద నలిగిపోయిన సిగరెట్ పీకల వల్ల వాడు ఎంతసేపు అక్కడ ఉండి గమనిస్తున్నాడో తెలిసేది. వీధిలో వచ్చే పోయేవారు వాణ్ణి అసహ్యించుకునేవారు. వాడి ముఖం వెడల్పాటి నల్లని చలువ కళ్ళద్దాల వెనుక దాగుండేది. వాడి తల మీద ఉండే బైకర్స్ టోపీ ప్రమాదకారిగా అనిపించేది. దారిన పోయే ప్రమాదాన్ని నెత్తి మీద వేసుకోవటం ఎందుకని ఎవరూ వాడినేమీ అనలేక మనసులోనే తిట్టుకునేవారు. కానీ చెర్రీ లేన్లో ఒక భయస్థుడు కూడా ఉండేవాడు. కిటికీ తెరలను చాటు చేసుకొని అప్పుడప్పుడు కాపలావాడి వంక చూసేవాడు. ఆ సాక్షి ఈ రౌడీమనిషి గతంలో కొన్నిసార్లు ఆరో నంబరు ఇంటిని సోదా చేస్తూ కనిపించాడని పోలీసులకి చెప్పాడు కానీ తారీఖులు సరిగా చెప్పలేకపోయాడు. ఆ పాడుపడ్డ ఇంటి మీద ఉన్న ‘6’లో పాములాంటి ఒంపు తుప్పు పట్టిన మేకు కారణంగా ఊడి కిందకు వేలాడింది కొన్నాళ్ళు. చూసేవాళ్ళకి అది తొమ్మిదిలా కనిపించేది. చెర్రీ లేన్లో జరిగిన విషాద సంఘటనకు ముందురోజు తీవ్రమైన గాలి వీచడం వల్ల ఉన్న ఒక్క మేకూ ఊడొచ్చేసి వెండి రేకుతో చేసిన ‘6’ నేల మీద పడిపోయింది. యమదూతలు ముగ్గురు గూండాల రూపంలో వచ్చారు. శత్రుశేషాన్ని తుడిచి పారెయ్యడానికి వారికి డబ్బు ముట్టింది. స్వంత ఆలోచన లేని మొదటి రకం కిరాయి గూండాలు వారు. ఆ రోజు పొద్దున్నే ఇంకా చీకట్లు తొలగకముందే చెర్రీ లేన్లో ఇళ్ళ నంబర్లన్నీ చూసుకుంటూ తమ వాహనంలో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వచ్చారు. చుంచుగాడు దాగిన ఇంటి గురించి వాళ్ళ దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. అయితే తమ తెలివి తక్కువతనం వల్ల కాపలావాడు గుర్తులు చెప్పడంలో తప్పు చేశాడనుకున్నారు. ‘‘లూయి గాడికి సరిగా చెప్పటమే రాదు. ఫోన్లో ఇల్లు ఎడమ చేతివైపుందని చెప్పాడు. రాత్రి ఎనిమిది వరకూ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్నాడు. తొమ్మిదో నంబరు, ఎడమ వైపు ఇల్లు అన్నాడంతే.మనం వీధికి అటువైపు నుంచి వచ్చేటప్పుడు ఎడమ వైపేమో!’’వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడ్డారు. శషభిషలు పడ్డారు. ‘‘ఎడమ వైపు అసలు తొమ్మిదో నంబరే లేదు కదా’’ అన్నాడొకడు. ‘‘....ఆ పాడుబడిన ఇల్లు తప్ప! దాని మీద అసలు నెంబరే లేదు’’వాళ్ళ కళ్ళు తొమ్మిది కోసం అటూ ఇటూ వెతికాయి. కుడి చేతివైపు తీర్చిదిద్దిన పెరడు ఉన్న ఇంటి మీద అందంగా తొమ్మిదో నంబరు వాళ్ళని మెరుస్తూ ఆకర్షించింది. ‘‘ఆ, అదుగో అదే. పోలీసుల్లేరులే.. పదండి! అబ్బో! మన బాసుల కష్టార్జితం పోసి పెద్ద ఇల్లే కొన్నాడే! ఇంత నోరేసుకొని ఊరంతా డప్పు కొట్టాడుగా బాసులు నేరస్థులని! అదే నోటితో మిగిలిన సొత్తు ఎక్కడ దాచాడో చెప్పిద్దాం’’నిస్సంకోచంగా బండిని ‘తొమ్మిది’ ఇంటి ముందు ఆపి అందులోంచి దిగారు. ‘తొమ్మిది’ బలిదానానికి గుర్తు చెర్రీ లేన్ తొమ్మిదిలో జరిగినట్టుగా. అది శూన్యానికి ఆరంభం అక్కడ జరిగిన హత్యల్లాగా. ఆ ఇల్లు ఇప్పటికీ తన రహస్యం దాచుకుంది. అధికారులు ఈ ఘోరకలికి పరిష్కారం చెప్పలేకపోయారు. ఆరో నంబరు ఇల్లు అగ్ని ప్రమాదంలో ఆహుతైంది. నేలమీద సగం కాలి వంకరపోయిన ‘ఆరు’లో దాని ఛాయలు ఇంకా కదలాడుతున్నాయి. అందులో నివసించిన చుంచుగాడి శవం కాకతాళీయంగా కొన్ని నెలల తరువాత రాళ్ళు నింపిన సంచీలో కుక్కబడి దగ్గర్లోని చెరువు అడుగున దొరికింది. చెర్రీ లేన్లో తొమ్మిదో నెంబరు ఇల్లు మూతపడింది. అప్పుడప్పుడూ ఔత్సాహికులు అక్కడకు వచ్చి ఏం జరిగి ఉంటుందో అని అనేక రకాలుగా ఊహాగానాలు చేస్తుంటారు. క్రమక్రమంగా వారి సంఖ్యా తగ్గిపోయింది. బంగారు భవిష్యత్తు ఉంటుందనుకున్న ఆ ఆనంద నిలయం విషాదంలో కూరుకుపోయింది. ఇప్పటికీ జాగ్రత్తగా వింటే ఆ ఇంట్లోంచి వీచే గాలుల్లో ఒక చిన్న పాప అందంగా అలంకరించిన తన పడగ్గదిలోంచి ‘మమ్మీ మమ్మీ’ అని దీనంగా పిలవడం వినిపిస్తుంది. ఆంగ్లమూలం : నార్మన్ ఎ. రూబిన్ (ఇజ్రాయిలీ రచయిత) అనువాదం: మోహిత -
గాజా ఆందోళనల్లో 13 మంది మృతి
గాజా సిటీ: ఇజ్రాయెల్ సరిహద్దు వైపు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన వేలాది మంది పాలస్తీనా ఆందోళనకారులపై ఇజ్రాయెల్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసలో 12 వందల మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. పాలస్తీనా శరణార్థుల్ని దేశంలోకి అనుమతించాలంటూ ఆందోళనకారులు గాజా ప్రాంతంలో సరిహద్దు వెంట శుక్రవారం నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. కొద్దిమంది ఆందోళనకారులు ఫెన్సింగ్ వైపుగా దూసుకురావడంతో ఇజ్రాయెల్ బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు కాల్పులు జరిపాయి. డ్రోన్ సాయంతో సరిహద్దు వెంట టియర్ గ్యాస్తో ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశాయి. ఆందోళనకారుల ముసుగులో ఉగ్రవాదులు సరిహద్దు వైపుగా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారని ఇజ్రాయెల్ ఆర్మీ ఆరోపించింది. -
ప్రధాని భార్యపై ఫ్రాడ్ కేసు!
ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భార్య సరా నెతన్యాహు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఫ్రాడ్ కేసు నమోదు చేయాలని భావిస్తున్నట్టు తాజాగా ఇజ్రాయెల్ టాప్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. క్యాటరింగ్ కోసం ప్రభుత్వ నిధులు 3.59 లక్షల షెకెల్స్ (రూ. 63.94లక్షలు) అక్రమంగా ఖర్చు చేసినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను ప్రధాని బెంజమిన్ కొట్టిపారేస్తున్నారు. తన భార్యపై అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని వాదిస్తున్నారు. ఇజ్రాయెల్ న్యాయశాఖ మాత్రం ఈ విషయంలో బెంజమిన్ భార్యపై అభియోగాలు నమోదుచేసే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుదీర్ఘంగా విచారణ జరిగిన నేపథ్యంలో త్వరలోనే సరా నెతన్యాహుపై ఫ్రాడ్ కేసు నమోదుచేయవచ్చునని మీడియా ఊహాగానాలు చేస్తోంది. సెప్టెంబర్ 2010, మార్చి 2013 మధ్యకాలంలో ప్రధాని నివాసంలో ఇచ్చిన విందుల కోసం విచ్చలవిడిగా ఖర్చుచేసినట్టు సరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని నివాసంలో ప్రభుత్వం నియమించిన చెఫ్ ఉన్నప్పటికీ, ప్రైవేటు చెఫ్లతో వంటకాలు చేయించి ఆమె విందులు ఇచ్చారని, ప్రైవేటు చెఫ్లకు ప్రభుత్వ నిధుల కేటాయింపు చట్టవిరుద్ధమని న్యాయనిపుణులు చెప్తున్నారు. ప్రైవేట రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించడం, ప్రైవేటు చెఫ్లకు చెల్లింపులు చేయడం కోసం అక్రమంగా 359,000 షెకెల్స్ను ఖర్చుచేసినట్టు ప్రభుత్వ అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. అయితే, తమ కుటుంబాన్ని రాజకీయంగా వేధించడం కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని నెతన్యాహు అంటున్నారు. -
‘అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు’
►జూలై 4 నుంచి ప్రారంభం కానున్న 3 రోజుల పర్యటన జెరూసలెం: ‘మేల్కొండి... ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు’ ఇదీ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ‘ ద మార్కర్’ చేసిన వ్యాఖ్య. భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథం ప్రచురించిన ద మార్కర్తన హిబ్రూ ఎడిషన్లో మోదీని ప్రశంసించింది. మోదీ-ట్రంప్ను పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ చాలా ఆశించిందని, ఆయన ఎక్కువగా స్పందించలేదంది. 125 కోట్లమంది ప్రజల ఆదరణను పొందిన...ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నారని స్పష్టం చేసింది. స్థానిక పత్రికలు, న్యూస్ పోర్టల్స్ సైతం మూడు రోజుల మోదీ పర్యటనకు చాలా ప్రాధాన్యతను ఇచ్చాయి. భారత్-ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 4 నుంచి ప్రారంభం కానున్న మోదీ మూడు రోజుల పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జూలై 5న టెల్ అవివ్లో భారత సంతతి ప్రజలు పాల్గొనే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. -
‘వండర్ విమెన్’ ఎందుకు ఆపారు?
-
‘వండర్ విమెన్’ ఎందుకు ఆపారు?
న్యూఢిల్లీ: భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ‘వండర్ విమెన్’ అనే హాలీవుడ్ చిత్రం లెబనాన్లో మాత్రం విడుదల కాలేదు. భారత్లో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లెబనాన్ ఆర్థిక, వాణిజ్య శాఖ ఈ సినిమా విడుదలను తమ దేశంలో అడ్డుకోవడం వార్నర్ బ్రదర్స్ నిర్మాతలను నిరాశ పరిచింది. ఈ సినిమాలో సూపర్ హీరోగా నటించిన హీరోయిన్ గాల్ గాడెట్ ఇజ్రాయెల్ దేశస్థురాలవడమే కాకుండా ఇజ్రాయెల్ సైన్యంలో కూడా పనిచేయడమే ‘వండర్ విమెన్’ సినిమాను నిషేధించడానికి కారణం. లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా యుద్ధాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. 2006లో జరిగిన యుద్ధంలో రక్తపాతం ఎక్కువగా జరిగింది. ఇద్దరు తమ సైనికులను సరిహద్దు కాల్పుల్లో చంపేశారని, మరో ముగ్గురు సైనికులను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో 2006లో లెబనాన్పైకి ఇజ్రాయెల్ పదాతి దళాలతోపాటు వైమానిక దాడులు జరిపాయి. ఈ యుద్ధంలో దాదాపు 1000 మంది లెబనీయులు మరణించారు. ఆ యుద్ధం నుంచి ఇజ్రాయెల్ను లెబనాన్ శత్రుదేశంగా పరిగణిస్తూ వస్తోంది. వాండర్ విమెన్ సినిమాను అనుమతించాలని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. పూర్తి ఫాంటసీ చిత్రమైన వాండర్ విమెన్ను అద్భుతమైన గ్రాఫిక్స్తో రక్తికట్టించడంతో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. సమ్మర్ సంప్ కారణంగా ద్వేన్ జాన్సన్ నటించిన బేవాచ్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సీక్వెల్, ఏలియన్:కోవనెంట్, కింగ్ ఆర్థర్ లాంటి హాలివుడ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన మేరకు రాణించక పోవడంతో ఈ సినిమాపైనే నిర్మాతలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. మంచి, న్యాయం, సమానత్వం, సాహసం, యుద్ధం, శాంతి అంశాలను ప్రతిబింబిస్తూ సాగే ఈ సినిమా ఆధ్యంతం ఆసక్తి దాయకంగా ఉందని జాతీయ మీడియా ప్రశంసించడంతోపాటు ఐదు స్టార్లకుగాను నాలుగు స్టార్ల రేటింగ్ను ఇచ్చారు. ‘వీర నారి వర్సెస్ మొదటి ప్రపంచ యుద్ధం’ చందంగా సినిమా ఉందని కితాబిచ్చారు. 3 డీ వర్షన్లో కూడా విడుదలైన ఈ సినిమాకు పాటీ జెన్కిన్స్ దర్శకత్వం వహించారు. ఓ మహిళ దర్శకత్వం వహించడం వల్ల కూడా ఈ సినిమాకు న్యాయం జరిగిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. -
ఇజ్రాయెల్తో సాన్నిహిత్యం
రక్షణ ఒప్పందంతోసహా పలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్ మన దేశంలో అడుగుపెట్టారు. వారంపాటు సాగే ఈ పర్యటనలో ఆయనతోపాటు ఆ దేశ వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు కూడా వచ్చారు. మనతో పూర్తి స్థాయి సంబంధాల కోసం ఇజ్రాయెల్ ఎంత తహతహలాడుతున్నదో దీన్నిబట్టి అర్ధమవుతుంది. మనవైపు నుంచి సైతం అలాంటి ఆత్రుతే ఉన్నా ఆచరణలో మాత్రం అది పెద్దగా ప్రతిఫలించడం లేదు. అందుకు పశ్చిమాసియాలో నెలకొన్న విలక్షణ పరిస్థితులే కారణం. అప్పటివరకూ అనధికార స్థాయిలో మాత్రమే ఉండే సంబంధాలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో 1992లో దౌత్య సంబంధాలుగా మారాయి. ఇది జరిగి పాతికేళ్లవుతున్నా...సరిగ్గా ఇరవైయ్యేళ్లక్రితం ఇజ్రాయెల్ అధ్యక్షుడు మన దేశంలో పర్యటించినా మన దేశాధినేతలు మాత్రం అక్కడికి వెళ్లలేదు. ఇజ్రాయెల్ మంత్రులు సైతం ఒకటికి రెండుసార్లు మన దేశంలో పర్యటించారు. ఇజ్రాయెల్తో సంబంధాలు నెల కొల్పుకోవాలని ఆదినుంచీ బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చినా... ఆ పార్టీ అగ్రనేత వాజపేయి ప్రధానిగా పనిచేసిన కాలంలో ఇజ్రాయెల్ వెళ్లలేదు. అయితే అప్పట్లో విదేశాంగమంత్రిగా ఉన్న జశ్వంత్సింగ్ను పంపారు. నిరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలిసారి అక్కడ అడుగుపెట్టారు. వాస్తవానికి అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తారని కథనాలు వెలువడినా చివరి నిమిషంలో ఆ నిర్ణయం మారింది. ప్రణబ్ కూడా ఇజ్రాయెల్తో సరిపెట్టక జోర్డాన్, పాలస్తీనాలకు వెళ్లి ‘సమతౌల్యం’ పాటించారు. ఇజ్రాయెల్తో సంబంధాల విషయంలో ఎందుకిలా ఆచితూచి వ్యవహరించడం? రక్షణతోసహా వివిధ రంగాల్లో ఆ దేశంనుంచి సహకారం పొందుతున్నా, ఒప్పందాలు కుదురుతున్నా మన దేశం దాన్ని పెద్దగా ప్రచారం చేసుకోలేదు. ఇలా గోప్యత పాటించడం అసాధారణం. ఇందుకు చాలా కారణాలు న్నాయి. ఇజ్రాయెల్ దురాక్రమణలో చాలా భూభాగాన్ని కోల్పోయిన పాలస్తీనాపై మన దేశం ఆదినుంచీ సానుభూతితో ఉండేది. వివిధ అంతర్జాతీయ వేదికలపై అది చేసే పోరాటాలకు మద్దతు పలికేది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్ప డినప్పుడు వాటిని గట్టిగా ఖండించేది. ఇజ్రాయెల్ను అభిశంసించే తీర్మానాలకు మద్దతు ప్రకటించేది. అక్కడి అరాఫత్ ప్రభుత్వాన్ని గుర్తించి దాంతో దౌత్య సంబం ధాలను నెలకొల్పుకుంది. అలీనోద్యమంలో మన దేశం చురుకైన పాత్ర పోషిం చడం, విముక్తి ఉద్యమాలకు నైతిక మద్దతునీయడం, ఇక్కడ ముస్లింల జనాభా 12 శాతం వరకూ ఉండటం, గల్ఫ్ దేశాల్లో మన దేశానికి చెందినవారు లక్షలాదిమంది పనిచేస్తుండటంవంటివి ఇందుకు దోహదపడ్డాయి. అయితే ఇజ్రాయెల్–పాలస్తీనా వ్యవహారంలో ఈజిప్టు వంటి దేశాలు వైఖరి మార్చుకోవడం, పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలు సైతం అనంతరకాలంలో ఇజ్రాయెల్తో సన్నిహితం కావడం, ఆర్ధిక సంస్కరణల తర్వాత మన దేశం అమెరికా, పాశ్చాత్య దేశాలతో సన్నిహితమవుతూ క్రమేపీ అలీనోద్యమానికి దూరం జరగడం వంటి పరిణామాల వల్ల ఇజ్రాయెల్ పట్ల మన వైఖరి మారుతూ వచ్చింది. అయినా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలైనా, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వా లైనా దీన్ని బాహాటంగా వెల్లడించలేదు. వాస్తవానికి మన రక్షణ అవసరాలను తీరుస్తున్న దేశాల జాబితాలో రష్యా, అమెరికాల తర్వాత ఇజ్రాయెల్ తృతీయ స్థానంలో ఉంది. గత ఆర్ధిక సంవత్సరంలో మన దేశం ఇజ్రాయెల్నుంచి 1,200 కోట్ల డాలర్ల మేర రక్షణ కొనుగోళ్లు చేసింది. ఇజ్రాయెల్ కొనుగోలుదారుల జాబితాలో మనదే అగ్ర స్థానమని గుర్తిస్తే ఈ సంబంధాలు ఏ స్థాయికి వెళ్లాయో అర్ధమవుతుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో అనుభవం, ఆ క్రమంలో అక్కడ జరిగిన పరిశోధనల పర్యవసానంగా అభివృద్ధి అయిన అత్యుత్తమ సాంకేతికత మనకు అక్కరకొస్తాయని అనుకోవడం వల్లే రక్షణ కొనుగోళ్లలో ఇజ్రాయెల్ ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు రివ్లిన్ రాకతో ఇవి మరింత విస్తృత స్థాయికి చేరుతాయి. అన్ని స్థాయిల్లోనూ సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి ఆయన తోపాటు ‘అసాధారణ రీతి’లో ప్రతినిధి బృందం వస్తున్నదని ఇటీవల విడుదలైన అధికారిక ప్రకటన తెలిపింది. మంగళవారం నరేంద్ర మోదీ, రివ్లిన్ల మధ్య జరిగిన చర్చల్లో వర్తకం, వాణిజ్యం, వ్యవసాయం, జల వనరులు, విద్య, పరిశోధన రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. వ్యవసాయం, జలవనరుల్లో ఒప్పం దాలు కూడా కుదిరాయి. ఇజ్రాయెల్కు జల వనరులు తక్కువగా ఉండటం వల్ల ఆ రంగంలో అనేక పరిశోధనలు చేసి సూక్ష్మ నీటి పారుదలలో నైపుణ్యాన్ని సంపాదించుకుంది. అధిక దిగుబడిని సాధించడంలో విజయం సాధించింది. ఇవన్నీ మన కరువు ప్రాంతాల సమస్యల్ని తీర్చడంలో ఎంతగానో ఉపయోగ పడతాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో మరింత సహకరించడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది భారత్–ఇజ్రాయెల్ సంబంధాల రజతోత్సవ సంవత్సరం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించాల నుకుంటున్నారు. 1965, 1971ల్లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు, 1999నాటి కార్గిల్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ సహకారం తీసుకున్నా ఆ సంగతిని మన ప్రభుత్వాలు బహిర్గతం చేయలేదు. 2014లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో గాజా సంక్షోభంపై ఇజ్రాయెల్ను అభిశంసిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం ఓటింగ్ నుంచి మన దేశం గైర్హాజరైంది. అందుకు వేరే కారణాలు చూపినా ఇజ్రాయెల్కు మాత్రం ఈ చర్య సంతృప్తి కలిగించింది. పాలస్తీనాపై మన వైఖరిలో మార్పు లేదని పదే పదే చెబుతున్నా గతంతో పోలిస్తే మనం చాలా దూరం జరిగామన్నది వాస్తవం. వర్తమాన ప్రపంచంలో చోటుచేసుకుంటున్న పరిణా మాలు, వాటికి అనుగుణంగా ఏర్పడుతున్న అవసరాలు ఇందుకు దోహదపడ్డాయి. పాలస్తీనా, దానికి మద్దతు పలికే గల్ఫ్ దేశాలు మనతో ఇకపై ఎలా వ్యవహరి స్తాయో వేచిచూడాల్సి ఉంది. -
ఇజ్రాయిల్ లో అరుదైన బంగారు నాణెం..
రెండు వేల వత్సరాలనాటి పురాతన బంగారు నాణేన్ని ఇజ్రాయిల్ పురాతత్వ అధికారులు గుర్తించారు. ఓ పాదచారికి దొరికిన ఆ బంగారు నాణెం క్రీస్తు శకం 107 సంవత్సరం నాటిదిగా చెప్తున్నారు. ఇటువంటి పురాతన బంగారు నాణేల్లో ఇప్పటివరకు ఉన్నవాటిలో ఈ నాణెం రెండవదిగా అధికారులు వెల్లడించారు. ఇజ్రాయిల్ తూర్పు గలిలయ ప్రాంతంలో ఇటీవల వాకింగ్ కు వెళ్ళిన లౌరీ రిమోన్ కు ఓ బంగారు నాణెం మెరుస్తూ కనిపించిందట. అయితే ఆమె దొరికిన ఆ నాణేన్ని దాచి పెట్టుకోకుండా ప్రభుత్వాన్నికి స్వచ్ఛందంగా అప్పగించిందట. ఈ అరుదైన నాణేన్ని అత్యంత పురాతన నాణెంగా గుర్తించిన పురాతత్వ అధికారులు.. రిమోన్ కు ప్రశంసా పత్రాన్ని అందించి సత్కరించారు. ఇంతకు ముందే ఉన్న మొదటి బంగారు నాణెం లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్రీస్తు శకం 107 సంవత్సరంనాటి ఈ నాణెంపై రోమన్ సామ్రాజ్యపు మొదటి చక్రవర్తి ఆగస్గస్ చిత్రం ముద్రించి ఉన్నట్లుగా పురాతత్వ శాఖ అధికారులు గుర్తించారు. రోమన్ పాలకులను గౌరవించడంలో భాగంగా ముద్రించే నాణేల వరుసలో ఈ నాణెం ముద్రించబడిందని పురాతత్వశాఖ అధికారి డానాల్డ్ టి ఏరియల్ చెప్పారు. ఈ నాణెం రోమన్ సైనికులకు చెల్లించిన జీతంలోనిది అయి ఉండొచ్చిని భావిస్తున్నారు. -
ఇజ్రాయెల్ మాజీ ప్రధాని షరాన్ మృతి
జెరూసలెం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఏరియెల్ షరాన్ (85) శనివారం టెల్ హషోమర్లోని ఆస్పత్రిలో మృతి చెందారు. అస్వస్థతతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించారు. 2001లో ప్రధాని అయిన షరాన్, 2006లో అస్వస్థతకు లోనై, కోమాలోకి చేరుకునేంత వరకు పదవిలో ఉన్నారు. 2003లో ఆయన భారత పర్యటనకు వచ్చారు. భారత్లో పర్యటించిన తొలి ఇజ్రాయెల్ ప్రధాని ఆయనే.