kapil mishra
-
అన్ని వర్గాలకు నచ్చే విధంగా... ఢిల్లీ కేబినెట్ కూర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దాదాపు 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తాజాగా ఏర్పాటైన రేఖా గుప్తా ప్రభుత్వంలో అన్ని ప్రధాన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా(50) బనియా వర్గానికి చెందిన ఎమ్మెల్యే. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ప్రమాణం చేశారు. వీరిలో పర్వేశ్ వర్మ జాట్ నేత. సీఎం పదవికి పోటీ పడిన వారిలో ఈయన ముందు వరుసలో ఉన్నారు. రవీందర్ ఇంద్రజ్ సింగ్ దళిత నేత కాగా, మజిందర్ సింగ్ సిర్సా సిక్కు నేత . కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్లు పూర్వాంచల్ ప్రాంత వాసులు. ఆశిష్ సూద్ బీజేపీ పంజాబీ నేతల్లో ప్రముఖుడిగా ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఆయా వర్గాల వారికి సంతుష్టి కలిగించేందుకు బీజేపీ పెద్దలు యత్నించినట్లు చెబుతున్నారు.కేబినెట్లో జాట్ వర్గం నేత ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ సీటు నుంచి ఆప్ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్పై ఘన విజయం సాధించడం ద్వారా ఒక్కసారిగా తెరపైకి వచ్చారు పర్వేశ్ వర్మ(47). ఢిల్లీ సీఎం కుర్చీ కోసం పోటీ పడిన బీజేపీ నేతల్లో ఈయన కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పర్వేశ్ వర్మ పేరు జాతీయ రాజకీయాల్లో వినపడింది. అయితే, మూడుసార్లు సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్ను ఓడించిన తర్వాత ఈయన పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఢిల్లీలోని జాట్ నేతల్లో ప్రముఖంగా ఉన్నారు. గురువారం సీఎం రేఖా గుప్తాతోపాటు మంత్రిగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ ఒకరు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్. కేజ్రీవాల్పై పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించిన ఫైర్ బ్రాండ్ నేత. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు గట్టి పోటీ ఇచ్చేది తానేనంటూ ముందుకు వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల తేడాతో కేజ్రీను ఓడించారు. కాగా, మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ను ఇదే న్యూఢిల్లీ నియోజకవర్గంలో 2013లో కేజ్రీవాల్ ఓడించడం గమనార్హం. 1977లో పుట్టిన పర్వేశ్ వర్మ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని 1991లో ఆర్ఎస్ఎస్లో బాల్ స్వయంసేవక్గా చేరారు. బీజేపీ యువ మోర్చాలో చేరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడి స్థాయికి ఎదిగారు. బీజేపీ ఢిల్లీ విభాగం ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ డిగ్రీ చేసిన వర్మ తన తండ్రి నెలకొల్పిన రాష్ట్రీయ స్వాభిమాన్ అనే ఎన్జీవో ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 2013లో మెహ్రౌలీ నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ఢిల్లీ పశ్చిమ లోక్సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో పర్వేశ్ వర్మ సాధించిన విజయం ఒక రికార్డుగా ఉంది.దంత వైద్యుడు.. పూర్వాంచల్ నేత పంకజ్ కుమార్ సింగ్ రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన మరో ఎమ్మెల్యే పంకజ్ కుమార్ సింగ్(48). వృత్తి రీత్యా దంతవైద్యుడైన పంకజ్ కుమార్ గుప్తా పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన నేత. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వికాస్పురి నుంచి పోటీ చేసి, ప్రత్యరి్థపై 12వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పంకజ్ కుమార్. ఢిల్లీలో ఉండే ఉత్తరప్రదేశ్, తూర్పు ప్రాంతం బిహార్, జార్ఖండ్ వారిని పూర్వాంచల్ వాసులుగా పిలుస్తుంటారు. ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో వీరిదే పైచేయి. బిహార్లోని బోధ్గయలో ఉన్న మగధ్ యూనివర్సిటీ నుంచి 1998లో డెంటల్ సర్జరీలో ఇగ్రీ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ నేతగా పనిచేశారు. మరికొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ ఈయనకు కేబినెట్లో స్థానం కల్పించడం గమనార్హం. ఒకప్పుడు మోదీ విమర్శకుడు.. నేడు హిందుత్వ వీరాభిమాని ఢిల్లీ మంత్రిగా గురువారం ప్రమాణం చేసిన కపిల్ మిశ్రా(44) ఒకప్పుడు ఆప్ సభ్యుడు. ప్రధాని మోదీని, బీజేపీ, ఆర్ఎస్లను తీవ్రంగా విమర్శించిన వివాదాస్పద నేతగా ఉన్నారు. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయారు. నేడు హిందుత్వకు వీరాభిమాని అయ్యారు. కపిల్ మిశ్రాను కేబినెట్లో తీసుకోవడాన్ని బీజేపీ వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగిన సమయంలో కపిల్ మిశ్రా అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్కు సన్నిహితుడిగా భావిస్తారు. ఢిల్లీ వర్సిటీ నుంచి సోషల్ వర్క్లో ఎంఏ చేసిన మిశ్రా 2015లో ఆప్ తరఫున కరవల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేజ్రీవాల్ కేబినెట్లో జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ మధ్య విభేదాలు తలెత్తడంతో కపిల్ మిశ్రా కూడా కేజ్రీకి దూరమయ్యారు. అనంతరం కుమార్ విశ్వాస్, కపిల్ మిశ్రాలు కేజ్రీతోపాటు ఆప్ మరో నేత సత్యేందర్ జైన్లకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేశారు. 2017లో మంత్రి పదవి కోల్పోయారు. అయినప్పటికీ, ఆప్ ఎమ్మెల్యేగా ఉంటూనే కేజ్రీవాల్పై విమర్శలు మాత్రం మానలేదు. 2019లో ఆయనపై ఆప్ బహిష్కరణ వేటు వేసింది. 2019లోనే బీజేపీలో చేరారు కపిల్ మిశ్రా. బీజేపీ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం, బీజేపీ, హిందుత్వకు అనుకూలంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలైంది. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో విద్వేష ప్రసంగాలు చేశారంటూ ఆయనపై ఆరోపణలొచ్చాయి. తాజాగా బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో గతంలో ఆయన ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీల తీరును ఎండగడుతూ ఆయన చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆప్ నేత మనోజ్ కుమార్ త్యాగిపై 23 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.పంజాబీ నేత ఆశిష్ సూద్ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడైన ఆశిష్ సూద్(58) ఢిల్లీలోని బీజేపీ పంజాబీ నేతల్లో ఒకరు. తాజా ఎన్నికల్లో జనక్పురి నుంచి 18 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలుపొంది గురువారం రేఖా గుప్తా కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. సంస్థాగత వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న సూద్ ప్రస్తుతం బీజేపీ గోవా వ్యవహారాలతోపాటు జమ్మూకశ్మీర్ సహ ఇన్చార్జిగా ఉన్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగాను పనిచేశారు. 2003లో బీజేపీ యువమోర్చా జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఈయన, ఆ తర్వాత రెండేళ్లకే జాతీయ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2009లో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికయ్యారు. ఆర్ఎస్ఎస్తోపాటు బీజేపీ అగ్ర నాయకులకు ఆశిష్ సూద్ ఎంతో నమ్మకస్తుడని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త అయిన ఈయన కామర్స్లో డిగ్రీ చేశారు. దళిత వర్గం నేత రవీందర్ రేఖా గుప్తా సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన రవీందర్ ఇంద్రజ్ సింగ్(50) కేబినెట్లో దళిత వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చాలో కీలక సభ్యుడిగా ఉన్న రవీందర్ ఇటీవలి ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెరి్నంగ్(ఎస్వోఎల్) నుంచి బీఏ పట్టా అందుకున్న రవీందర్కు ఢిల్లీ బీజేపీలో దళిత నేతగా మంచి పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో బావన ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో ఆమ్ఆద్మీ పార్టీ నేత జై భగవాన్ ఉప్కార్ను 31 వేల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. నార్త్ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు కూడగట్టడంలో రవీందర్ కీలకంగా వ్యవహరించారు. మొదట్నుంచీ బావన నియోజకవర్గంతోనే ఆయనకు ఎక్కువగా అనుబంధం ఉంది. ఈయన తండ్రి ఇంద్రజ్ సింగ్ గతంతో నరేల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్నికల కమిషన్కు సమరి్పంచిన అఫిడవిట్ను అనుసరించి ఈయన ఆస్తులు రూ.7 కోట్లు కాగా, ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.సిక్కుల ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ రాజకీయ ముఖచిత్రంలో బాగా వినిపించే పేరు మంజిందర్ సింగ్ సిర్సా(53). కోవిడ్ మహమ్మారి ప్రబలంగా ఉన్న సమయంలో ఆక్సిజన్ లాంగార్స్ నిర్వహించి చురుగ్గా వ్యవహరించిన సామాజిక కార్యకర్తగా సిక్కు నేతగా సిర్సాకు మంచి పేరుంది. తాజాగా రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా మాతృభాష పంజాబీలో ప్రమాణం చేశారు. సిక్కు వర్గం మద్దతు కూడగట్టేందుకే ఈయనకు బీజేపీ మంత్రి వర్గంలో స్థానం కల్పించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆప్కు చెందిన ధన్వతి చండేలాపై 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజౌరీ గార్డెన్ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మజీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్ను వీడి 2021లో బీజేపీలో చేరారు. 2013లో మొదటిసారిగా రాజౌరీ గార్డెన్ సీటును గెలుచుకున్నారు. 2013 నుంచి 2019 వరకు ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ(డీఎస్జీఎంసీ)కి సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం డీఎస్జీఎంఎంసీకి అధ్యక్షుడిగా 2019–2022 మధ్య సేవలందించారు. ఎన్నికల సంఘానికి సమరి్పంచిన అఫిడవిట్లో తనకు రూ.188 కోట్ల ఆస్తులు, భార్య సత్విన్దర్ కౌర్ సిర్సాకు కూడా రూ.71 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. మంజిందర్పై ఒక ఎఫ్ఐఆర్, నాలుగు పరువు నష్టం కేసులు నమోదై ఉన్నాయి. -
క్షమాపణలు చెప్పు.. లేదా 'లై డిటెక్టర్' పరీక్షకు రా..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సవాల్ విసిరారు బీజేపీ నేత కపిల్ మిశ్రా. సీబీఐపై సిసోడియా చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే లై డిటెక్టర్, నార్కో పరీక్షకు సిద్ధమని మీడియా ముందుకు వచ్చి అంగీకరించాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై సిసోడియా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సిసోడియాను సోమవారం 9 గంటలపాటు విచారించారు సీబీఐ అధికారులు. అనంతరం మీడియాతో మాట్లాడిన సిసోడియా.. తనను ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని సీబీఐ అధికారులు బెదిరించారని, లేదంటే ఇలాగే మరిన్ని కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. అంతేకాదు తనకు బీజేపీలో సీఎం పదవి ఆపర్ చేశారని పేర్కొన్నారు. ఈ విచారణ అనంతరం తనపై పెట్టింది తప్పుడు కేసు అని పూర్తిగా అర్థమైందని సిసోడియా అన్నారు. తనను ఏం చేసినా సరే ఆప్ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సిసోడియా ఆరోపణలను సీబీఈ ఇప్పటికే ఖండించింది. ఆయన వ్యాఖ్యల్లో అసలు వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. వృత్తిపరంగానే తాము సిసోడియాను విచారించినట్లు స్పష్టం చేసింది. మున్ముందు కూడా చట్టప్రకారమే ఆయన్ను విచారిస్తామంది. తాజాగా బీజేపీ సిసోడియా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరింది. చదవండి: మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష! -
ఆ పుకారు వల్లే ఢిల్లీ అల్లర్లు
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మద్దతుదారులు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే పుకారే ఢిల్లీలో పెద్ద ఎత్తున హింసకు దారి తీసిందని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. కాగా కపిల్ మిశ్రా తన మద్దతుదారులతో కలిసి మౌజ్పూర్లో ఫిబ్రవరి 23న సీఏఏ అనుకూల ర్యాలీ తీశారు. అయితే వీరు జఫరాబాద్లో సీఏఏ వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే వదంతులు వ్యాపించడంతో పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించారు. దీంతో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ క్రమంలో డయల్పూర్లో ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్పై దుండగులు మూక దాడి చేసి అతడిని దారుణంగా హత్య చేశారని ఛార్జిషీటులో ప్రస్తావించారు. (భావజాలం రగిలించిన ఘర్షణలు) అయితే ఉద్దేశపూర్వకంగా అల్లర్లను ప్రేరేపించడానికే ఈ వదంతులు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. మరోవైపు స్వరాజ్ ఇండియా చీఫ్, సామాజిక ఉద్యమ కారుడు యోగేంద్ర యాదవ్ పేరును ఛార్జిషీట్లో ప్రస్తావించినప్పటికీ నిందితుడిగా పేర్కొనలేదు. అయితే అతను ఛాంద్ బాగ్లో విద్వేషపూరిత ప్రసంగం చేశారని పేర్కొన్నారు. ఇక సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగమే ఢిల్లీలో అల్లర్లకు నాంది అయిందని అంతర్జాతీయ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల పాటు కొనసాగిన ఢిల్లీ అల్లర్లలో సుమారు 50 మంది మరణించారు. (ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి) -
గణాంకాలతో సహా ప్రభుత్వంపై కపిల్ మిశ్రా ఫైర్
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రాలు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్యను కావాలనే తక్కువ చేసి చూపెడుతోందంటూ ఆయన ఫైర్ అయ్యారు. కాగా ఢిల్లీలో ఇప్పటిదాకా 6,542 కేసులు నమోదు కాగా, 73 మంది మరణించినట్లు ప్రభుత్వం లెక్కలు చూపింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. కోవిడ్-19 బాధితుల అంత్యక్రియలు నిగంబోడ్ ఘాట్, పంజాబీ బాగ్, ఐటీఓ విద్యుత్ దహన వాటికలలో జరుగుతున్నాయి. చదవండి: కోవిడ్: 75శాతం కేసులు అలాంటివే..! ఏప్రిల్ 3 నుంచి నిగంబోడ్ ఘాట్లో దహనం చేసిన మృతదేహాల సంఖ్య 155 కన్నా ఎక్కువ, పంజాబీ బాగ్లో 72, ఐటిఓ శ్మశానవాటికలో 95 మృతదేహాలను ఖననం చేసినప్పటికీ.. మే 10 నాటికి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 73 మంది మాత్రమే చనిపోయారని తప్పు లెక్కలు చూపెడుతోంది. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ దహన వాటికల వద్ద ఒక్కో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎన్ని గంటల సమయం పడుతుందో గణాంకాలతో సహా వివరించారు. అయితే కపిల్ మిశ్రా విమర్శలపై కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. చదవండి: 2లక్షలు దాటిన కరోనా కేసులు -
ఢిల్లీ అల్లర్లు: అంతర్జాతీయ మీడియా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో చురుగ్గా పర్యటిస్తూ భారత దేశ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తుండగా, ఢిల్లీలో జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వ పరువును, దేశ ప్రతిష్టను ఒక్కసారిగా దెబ్బతీశాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గత ఆదివారం నుంచి మూడు రోజులపాటు కొనసాగిన అల్లర్లలో 42 మంది మరణించిన విషయం తెల్సిందే. వీటిపై ప్రపంచ పత్రికలు తమదైన రీతిలో దాడి చేశాయి. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా చేసిన విద్వేష పూరిత వ్యాఖ్యలే అల్లర్లకు దారి తీశాయని పలు అంతర్జాతీయ పత్రికలు దూషించాయి. అల్లర్లను నిలువరించాల్సిన పోలీసులే ఓ వర్గానికి వ్యతిరేకంగా అల్లర్లను ప్రోత్సహించడం దారుణంగా ఉందని కొన్ని పత్రికలు ఆరోపించాయి. అల్లర్ల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడం వల్లనే ‘2002లో గుజరాత్’ తరహా అల్లర్లు పునరావృతం అయ్యాయని ఆ పత్రికలు వ్యాఖ్యానించాయి. (పేరు అడిగి.. కొట్టి చంపారు.. కిందకు దూకేశాం..) ‘మోదీ స్టోక్డ్ దిస్ ఫైర్’ అనే శీర్షికతో ‘ది గార్డియన్’ పత్రిక వార్తను ప్రచురించింది. ‘పోలిటిషియన్స్ స్టోక్డ్ ఢిల్లీ రైట్స్’ అని ‘ది ఖలీజ్ టైమ్స్’ వార్తను ప్రచురించగా, ‘మోదీ సైలెన్స్ యాజ్ డెత్ టాల్ మౌంటెడ్’ అనే శీర్షికతో లండన్ నుంచి వెలువడుతున్న ‘ది టైమ్స్’ పత్రిక వార్తను ప్రచురించింది. ‘శాంతి, సహనమే మన సంస్కృతి’ అంటూ అల్లర్లు చెలరేగిన మూడో రోజు ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా స్పందించిన విషయం తెల్సిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలసి మోదీ భుజం భుజం రాసుకుంటూ ఢిల్లీ రోడ్డుపై తిరుగుతుంటే అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అల్లర్లు చెలరేగాయంటూ జర్మనీ వార్తా పత్రిక ‘డర్ స్పీజల్’ వార్తను ప్రచురించింది. ఈ అల్లర్లు మోదీ ప్రభుత్వానికి అంతర్గతంగా ఉపయోగ పడవచ్చేమోగానీ అంతర్జాతీయంగా భారత్ పరువు తీస్తున్నాయంటూ ‘అవుట్సైడ్ షో ఆఫ్, ఇన్సైడ్ ప్రొటెస్ట్’ శీర్షికన ఆ పత్రిక వార్తను ప్రచురించింది. (చదవండి: ఢిల్లీ హైకోర్టు జస్టిస్ బదిలీ ఓ శేష ప్రశ్న!) మోదీ హిందూత్వ పాలనలో సెక్యులరిజమ్ చనిపోయిందంటూ ‘వై ఇండియా స్టూడెంట్స్ ఆర్ ఆంగ్రీ, ఇట్స్ ముస్లిం ఆర్ వర్రీడ్’ శీర్షికతో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈశాన్య ఢిల్లీలో అక్బారీ అనే 85 ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా తగులబెట్టడం ఏ నాగరికతను సూచిస్తోందని ‘ఏ గల్ఫ్ న్యూస్ పీస్’ ప్రశ్నించింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా విద్వేషపూరిత ఉపన్యాసమే అల్లర్లకు దారితీసిందని, ముస్లిం పౌరులను హిందూ శక్తులు చంపుతుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షక పాత్ర వహించాయంటూ ‘ది రూట్స్ ఆఫ్ ది ఢిల్లీ రైట్స్, ఏ ఫియరీ స్పీచ్ అండ్ యాన్ అల్టిమేటమ్’ పేరిట ‘న్యూయార్క్ టైమ్స్’ వార్తను ప్రచురించింది. ప్రభుత్వం చేసిన చట్టాన్ని ప్రశ్నించే మేధోవారసత్వంతోపాటు నైతిక, ప్రజాస్వామిక హక్కులు తమకున్నాయంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ముస్లింలపై దాడి చేయడం ఆశను ఆర్పేసిందంటూ ‘అల్ జజీరా’ వ్యాఖ్యానించింది. విభిన్న కుల, మతాల సమ్మేళనంతో సహజీవనం సాగించడం భారత్కున్న ఓ గొప్ప సంస్కృతి అన్న పేరు నేటి ఢిల్లీ అల్లర్లతో మసకబారిందంటూ ‘గల్ఫ్ న్యూస్’ సంపాదకీయం రాసింది. (చదవండి: ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ) -
భావజాలం రగిలించిన ఘర్షణలు
నాటి ప్రధాని ఇందిర హత్యానంతరం సిక్కులపై పనిగట్టుకుని చేసిన విషప్రచారం కారణంగా 1984లో మూక భయంకరదాడులకు పాల్పడింది. 35 ఏళ్ల తర్వాత సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై బీజేపీ నేత కపిల్ మిశ్రా విద్వేష ప్రసంగం మరోసారి మూకదాడులకు దారితీసింది. ఆనాడు ఢిల్లీలో జరిగిన ఘోర దాడులు, నేడు ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండ సందర్భంగా.. పోలీసులు చేష్టలుడిగి నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు. మూక మనసత్వంతో ఘర్షణలకు పాల్పడిన యువతలో చాలామంది రాజ్యం దన్నుతో తీవ్రమైన ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని పుణికిపుచ్చుకుంటూ పెరిగారు. ముస్లింలు చావడానికి సిద్ధపడాలని ఛాందసవాదులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మొత్తం మీద మెజారిటీ వర్గ దురభిప్రాయాలతో కూడిన తప్పుడు పక్షం వైపు నిలబడకూడదన్న స్పృహను మన నేతలు కోల్పోయారు. ఇలాంటి పిరికి మనస్తత్వంతో కూడిన రాజకీయాల దుష్ఫలితాలు రానున్న తరాల్లో కానీ స్పష్టమైన రూపం తీసుకోవు. ఢిల్లీ నగరంలో 1984లో సిక్కు వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఏమిటంటే నగరవ్యాప్తంగా పుకార్లను శరవేగంగా వ్యాప్తి చెందించడం. సిక్కులు ఢిల్లీ నగర నీటి సరఫరా చానల్స్లో విషం కలిపారని, పంజాబ్లో హత్యకు గురైన హిందువుల శవాలను రైళ్లలో కుక్కి ఢిల్లీకి పంపుతున్నారనే స్థాయి పుకార్లను నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం వ్యాపింపచేశారు. అప్పట్లో వాట్సాప్ ఉండేది కాదని గుర్తుంచుకోవాలి. పుకార్లను ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపజేసేవారు. ఇందిర హత్య ఘటన జరి గిన 24 గంటలలోపే ఢిల్లీని ఈ రకమైన పుకార్లు ఆరకంగానే చుట్టుముట్టాయి. ఢిల్లీ పోలీసులు కూడా ఈ పుకార్ల వ్యాప్తికి తమవంతు పాత్ర పోషించారు. పోలీసులే కొన్ని ప్రాంతాలకు వాహనాల్లో వచ్చి లౌడ్ స్పీకర్ల ద్వారా పంజాబ్ నుంచి శవాలతో కూడిన రైళ్లు వస్తున్నాయని, నగరంలో తాగునీటిలో విషం కలుపుతున్నారని గట్టిగా అరుస్తూ ప్రచారం చేశారని అప్పట్లో కొన్ని నిజనిర్ధారణ కమిటీలు నిర్ధారించాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీసు అధికారులు ఇంటి తలుపులు తట్టి జనాన్ని లేపి తాగు నీటిని తాగవద్దని మరీ సలహా ఇచ్చేంతవరకు వ్యవహారం సాగింది. పోలీసులకు, వ్యవస్థీకృత మూకలకు మధ్య అసాధారణమైన కుమ్మక్కుకు ఇదొక స్పష్టమైన ఉదాహరణ. ఆనాడు సిక్కులను ఢిల్లీలో ఊచకోత కోస్తున్నప్పుడు పోలీసులు పత్తా లేకుండా పోయారని, లేక ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారని లేక ఆ హత్యాకాండలో తామూ స్వయంగా పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు నిర్ధారించారు. 1984 ఘర్షణలు వ్యాపించిన కీలక ప్రాంతాల్లో ఒకటైన త్రిలోక్పురిలో పోలీసులే మూకలకు రక్షణగా వచ్చారని, తమ వాహనాల్లోని ఇంధన ట్యాంకులను ఖాళీ చేసి అమాయకులను, ఇళ్లను, దుకాణాలను తగులబెట్టడానికి అవసరమైన డీజిల్ను స్వయంగా అందించారని అప్పట్లోనే వార్తలొచ్చాయి. సిక్కు యువతులను దుండగులు సామూహిక అత్యాచారం చేస్తున్నప్పుడు అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులను ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు వెనక్కు రప్పించారని, సుల్తాన్పురి ప్రాంతంలో ఒక పోలీసు అధికారి ఇద్దరు సిక్కులను స్వయంగా చంపాడని కూడా అప్పట్లో నివేదికలు వచ్చాయి. ఆనాడు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలకు సంబంధించి ఎఫ్ఐఆర్లను నమోదు చేయడానికి కూడా పోలీసులు తిరస్కరించారు. తమ పొరుగున ఉన్న సిక్కు ప్రజలకు హిందువులు రక్షణగా నిలబడి పోలీసు ఠాణాలకు తోడుకెళ్లి ఫిర్యాదు చేయిస్తే మీ మతస్తులకోసం పోరాడండ్రా అంటూ అక్కడి పోలీసులు సలహాఇచ్చిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఒకవైపు హింసోన్మాదులను స్వేచ్ఛగా వది లిపెడుతూ మరోవైపు శాంతియాత్రలు చేస్తున్నవారిని ఎక్కడికక్కడ నిలిపివేశారు. పైగా, ఘర్షణలను నిరోధించాలని చూసిన కొందరు పోలీసులకు తమ సీనియర్ అధికారులు ఏమాత్రం సహకరించలేదు. పోలీసులు తమకు తాముగా ఆ ఘర్షణల పట్ల అలా స్పందించారన్న ముసుగులో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక ఘటనలపై అధికారులు శీతకన్ను వేశారు. అందరూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే ఆ హింసాకాండకు మొత్తంగా పథకరచన చేసి అమలు చేశారని బాధితులు, ప్రత్యక్షసాక్షులు, జర్నలిస్టులు, పౌర బృందాలు ఏకకంఠంతో చెప్పారు. ఆనాడు చుట్టుపక్కల గ్రామాలనుంచి, రీసెటిల్మెంట్ కాలనీలనుంచి గూండాలను టూవీలర్లలో, టెంపో వ్యాన్లలో, ట్రక్కులలో తీసుకొచ్చి హింసకు ప్రేరేపించారు. చివరకు డీటీసీ బస్సులలో కూడా ఒకచోటినుంచి ఒకచోటికి గూండాలను తరలించి హింసకు పాల్ప డ్డారు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తమ తమ నివాస ప్రాంతాల్లో సిక్కు కుటుంబాలకు చెందిన ఇళ్లకు గుర్తు పెట్టి మరీ రంగం సిద్ధం చేశారు. తర్వాత పోలీ సులు తీరుబడిగా మూకతో వచ్చి అలా గుర్తు పెట్టి ఉన్న ఇళ్లపైపడి మృత్యుతాండవం చేయించారు. ఆ విషాద సమయంలో సిక్కు వితంతువులకు ఉపశమన చర్యల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ఆనాడు వారి దిగ్భ్రమను ప్రపంచానికి చాటి చెప్పారు. అన్నాళ్లూ తమ పొరుగునే ఉంటూ పలకరించిన వారే తమను విద్రోహులుగా ముద్రవేసిచూడటం కలిచివేసిందని భర్తల్ని పోగొట్టుకున్న వితంతువులు పేర్కొన్న వైనాన్ని చరిత్రకారిణి ఉమా చక్రవర్తి రాశారు. ఆ దహనకాండ ఎంత ఆకస్మికంగా సంభవించిందంటే ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి బాధితులకు ఏళ్ల సమయం పట్టింది. ఒక్క రాత్రిలోనే వారు ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్పట్ల విశ్వాసాన్ని కోల్పోయారు. అందుకే పైకి రెండు ఘటనల మధ్య సాదృశ్యం ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండకు, 1984లో సిక్కువ్యతిరేక హింసాత్మక దాడులకు మధ్య పోలికలు తీసుకురావడం సమస్యను పక్కదారి పట్టిస్తుంది. ఈ రెండు ఘటనల్లో పోలీసులు చేష్టలుడిగి నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు, ఈ వారం జరిగిన ఘర్షణల్లో కూడా ఏదోమేరకు ముస్లింల ఇళ్లు, షాపులు, కార్లను గుర్తు పెట్టి మరీ దాడి చేయడానికి పథకం పన్నిన ఘటనలు చోటు చేసుకున్నట్లు మనకు తెలుసు. కానీ ఈ రెండు ఘటనల మధ్య పోలిక ఇంతటితోనే ఆగిపోతుంది. 1984 నాటి హింసాత్మక ఘటనల్లో కాంగ్రెస్ నేతల పాత్రకు సంబంధించి విస్తృతంగా సాక్ష్యాలు లభించినప్పటికీ నేటి ఢిల్లీ ఘర్షణల్లో అంతవేగంగా మంటలు చెలరేగడం తమను సైతం నివ్వెరపర్చిందని బీజేపీ నేతలే చెబుతున్నట్లు నేను మాట్లాడిన రిపోర్టర్లు తెలిపారు. అందుకే ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని తట్టుకోలేక తమ పార్టీనేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగాన్ని తప్పు పట్టాల్సి వచ్చింది. అంతే కాకుండా మిశ్రాను పార్టీ పదవి నుంచి తొలగించాలని కూడా తివారీ చెప్పారు. తివారీ అలా మాట్లాడిన కొన్ని గంటల్లోపే కపిల్ మిశ్రా తన మద్దతుదారులతో ర్యాలీ తీయడమే కాకుండా ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్లో తిష్టవేసిన సీఏఏ వ్యతిరేక నిరసనకారులను డిల్లీ పోలీసులు తక్షణం తొలగించనట్లయితే తాను వీధుల్లోకి వస్తానని తీవ్ర హెచ్చరిక చేశాడు. మిశ్రా ప్రసంగం తర్వాత కొన్ని గంటల్లోపే అంటే మరుసటి దినం ఉదయాన్నుం పూర్థి స్థాయి ఘర్షణలు చెలరేగాయి. బీజేపీలో విభేదాలు తివారీ, మిశ్రాలకే పరిమితం కాలేదు. భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా మిశ్రా చేసిన విద్వేష ప్రసంగం ఆమోదనీయం కాదని, తనపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పాడు. కానీ బీజేపీ ఢిల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు మిశ్రాను వెనకేసుకు రావడమే కాకుండా మిశ్రా ప్రసంగం శాంతికి పిలుపుగా వర్ణించాడు. గంభీర్ను సమర్థించాలా లేక మిశ్రాను సమర్థించాలా అనే విషయంపై పార్టీ ట్విట్టర్ విభాగం కూడా చీలిపోవడాన్ని చూస్తే బీజేపీలో విభజన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇక క్షేత్ర స్థాయిలో సైతం, మూక హింసపై స్థానిక స్థాయిలోని బీజేపీ నేతలు రెండుగా చీలిపోయారని వార్తాహరులు చెబుతున్నారు. కొందరు మూకహింసను సమర్థించగా, మరికొందరు ముస్లిం కుటుంబాలను కాపాడటంలో మునిగిపోయారు. 1984లో స్వయంగా కాంగ్రెస్ నేతలే తమ కార్యకర్తలను హింసాత్మక ఘర్షణలవైపు నడిపించగా, ఇటీవలి ఢిల్లీ ఘర్షణలు కింది స్థాయి నుంచి ప్రేరేపితం కావడం గమనార్హం. మూక మనస్తత్వంతో ఘర్షణలకు పాల్పడిన యువతలో చాలామంది తీవ్రమైన ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని పుణికిపుచ్చుకుంటూ పెరిగారు. ఏ పార్టీకి ఓటేసినా వీరంతా హిందుత్వ భావజాలంతోనే ఐక్యమయ్యారు. కపిల్ మిశ్రా కూడా గతంలో ఆప్ పార్టీకి చెందినవాడే కదా. ఒక రీతిలో 2020 ఘర్షణలు 1984 ఘర్షణలకు కొనసాగింపు అని చెప్పవచ్చు. ఆనాడు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చగొట్టిన తీవ్ర హింసాకాండ ఫలితంగా సిక్కు కుటుంబాలు తమ జీవితాలను పునర్నిర్మించుకునే క్రమంలో ప్రభుత్వంపై, రాజకీయ పార్టీలపై, న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. మరోవైపున రాజ్యానికి సంబంధించిన పలు విభాగాలు తమవైపు ఉన్నాయని హిందువులు విశ్వసించడం ప్రారంభించారు. ఒక మతానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు అది హిందువులను కాపాడటానికేనని వీరు నమ్మసాగారు. గత కొన్నేళ్లుగా ఈ సెంటిమెంట్ మరింత పెరుగుతూ వచ్చింది. అందుకే పోలీసులు తమ వైపు ఉన్నారనే భావనతో హిందూ మూకలు కెమెరా ముందుకు ధైర్యంగా వచ్చి ఘర్షణలకు పాల్పడ్డారు. పైగా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు వచ్చాయి కాబట్టి ముస్లింలు చావడానికి సిద్ధపడాలని ఛాందసవాదులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మొత్తం మీద రాజకీయనేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మెజారిటీ వర్గ దురభిప్రాయాలతో కూడిన తప్పుడు పక్షం వైపు నిలబడకూడదన్న స్పృహ కోల్పోయారు. ఇలాంటి పిరికిమనస్తత్వంతో కూడిన రాజకీయాల ఫలితాలు రానున్న తరాల్లో కానీ స్పష్టమైన రూపం తీసుకోవు. -అనింద్యో చక్రవర్తి, సీనియర్ జర్నలిస్టు -
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్
-
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బీజేపీ నేత కపిల్ మిశ్రా కారణమని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. హింసను ప్రేరేపించేలా ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని గంభీర్ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేసినవారు తమ పార్టీకి చెందినవారైనా మరెవరైనా సరే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలకు స్థానం లేదంటూ స్పష్టతనిచ్చారు. ఒకవేళ తమ పార్టీకి చెందిన కపిల్ మిశ్రా ప్రమేయం ఇందులో ఉంటే అతనిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్పూర్ తదితర ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన.. ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. అందులో హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. చదవండి: అమిత్ షా సానుకూలంగా స్పందించారు : కేజ్రీవాల్ ‘వెనక్కి వెళ్లిపో లేదంటే.. కాల్చిపడేస్తా!’ -
అయ్యో.. అల్కా లాంబా
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పార్టీలు మారి ఎన్నికల బరిలో నిలిచిన 17 మందిలో 9 మంది విజయం సాధించారు. గెలుపొందిన వారిలో అత్యధికంగా 8 మంది ఆప్కు చెందిన వారు కాగా బీజేపీ నుంచి ఒక్కరున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో ఆప్ 9 మందిని, బీజేపీ నలుగురిని, కాంగ్రెస్ ముగ్గురిని బరిలోకి దించాయి. ఆప్ తరఫున పోటీ చేసిన మొత్తం 9 మందిలో అయిదుగురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. గాంధీనగర్ ఎమ్మెల్యే అనిల్ బాజ్పాయ్(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈయన ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరిపై 6 వేల పైచిలుకు ఓట్లతో మళ్లీ విజయం సాధించారు. మోడల్ టౌన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈసారి ఈయన్ను ఆప్నకు చెందిన అఖిలేశ్ త్రిపాఠీ 10వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. కాంగ్రెస్కు చెందిన సంజయ్ సింగ్(వికాస్పురి), సురేంద్రపాల్ సింగ్(తిమర్పూర్) ఈసారి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. వీరిద్దరినీ వరుసగా ఆప్కు చెందిన మహీందర్ యాదవ్(31 వేల ఓట్లు), దిలీప్ పాండే(21వేల ఓట్లు) ఓడించారు. ఎన్నికల ప్రచారంలో అల్కా లాంబా (ఫైల్) ఇతర ముఖ్యనేతల్లో ఆప్ను వీడి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన చాందినీచౌక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అల్కా లాంబా.. కాంగ్రెస్ తరఫున గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆప్ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ సాహ్నీ చేతిలో ఓడిపోయారు. అల్కాకు కేవలం 3,881 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సుమన్ కుమార్ గుప్తా 29,584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రహ్లాద్ సింగ్కు 50,891 ఓట్లు వచ్చాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్టు అల్కా లాంబా తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయన్న దానిపై మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంటే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: ‘ఆప్’రేషన్ సప్తపది) -
‘ఒవైసీ హనుమాన్ చాలీసా చదువుతారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం తారాస్థాయికి చేరింది. ఇప్పటివరకు ఇది చేశాం, ఇకముందు అది చేస్తాం అని చెప్పాల్సిన నాయకులు ఇతర పార్టీల నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల కమిషన్ చేత మొట్టికాయలు తిన్న బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మెజారిటీ సీట్లు సాధించడానికి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు హనుమాన్ చాలీసా చదువుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఆమ్ఆద్మీపార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఓ ఇంటర్వ్యూలో హనుమాన్ భక్తుడినని, ఇప్పటికీ హనుమాన్ చాలీసా పఠిస్తానని వెల్లడించగా, దీన్ని ఉటంకిస్తూ కపిల్ మిశ్రా మంగళవారం ట్వీట్ చేశారు. (చదవండి: వివాదాస్పద ట్వీట్ చేసిన మిశ్రాకు నోటీసు..) ‘కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పఠించడం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పుడిక ఒవైసీ వంతు. ఆయన కూడా హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెడతారు. ఐక్యతకు బలమైన శక్తి ఉంది. మన ఐక్యత 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నవాళ్లు చేసే మురికి రాజకీయాలను సమాధి చేస్తుంది. దీనికోసం అందరం కలిసి పోరాడుదాం’ అని పిలుపునిచ్చారు. కపిల్ మిశ్రా వ్యాఖ్యలపై ఎంఐఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గతంలోనూ ఆయన పలుసార్లు అగ్గిరాజేసే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు భారత్కు పాక్కు మధ్య యుద్ధమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రెండు రోజుల పాటు ఢిల్లీ ఎన్నికల ప్రచార నిషేధానికి గురయ్యారు. (బీజేపీ ఇంత దిగజారిపోయిందా?) చదవండి: ‘మీ పార్టీ పేరును ముస్లిం లీగ్గా మార్చుకోండి’ -
‘మీ పార్టీ పేరును ముస్లిం లీగ్గా మార్చుకోండి’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు పెరుగుతోంది. రోజురోజుకి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా మరోసారి ట్విటర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ముస్లిం లీగ్గా మార్చుకోవాలి. ఉమర్ ఖలీద్, అఫ్జల్ గురు, బుర్హాన్ వనీ వంటి ఉగ్రవాదులను తమవారిగా భావించేవారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కి భయపడుతున్నారు’ అంటూ ఆప్పై కపిల్మిశ్రా విమర్శలు గుప్పించారు. కాగా ఆప్ నేత సంజయ్ సింగ్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మత కలహాలు సృష్టిస్తారని.. ఢిల్లీలో ఆయన ప్రచారం చేయకుండా నిషేధించాలని వ్యాఖ్యానించారు. సంజయ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యలో కపిల్ మిశ్రా ఆప్పై వివాదాస్పద విమర్శలు చేయడం గమనార్హం. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్- పాక్ ఎన్నికలుగా వర్ణిస్తూ కపిల్ తన ట్విటర్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా స్పందించి కపిల్ మిశ్రాపై 48 గంటల పాటు ఢిల్లీలో ప్రచార నిషేధం విధించింది. ఈ నిషేదం తర్వాత మళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కపిల్ మిశ్రా మరోసారి తీవ్రమైన విమర్శలకు దిగారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
కపిల్ మిశ్రాపై 48 గంటల నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ మోడల్ టౌన్ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రాపై ఎన్నికల సంఘం 48 గంటల ప్రచార నిషేధం విధించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్–పాక్ ఎన్నికలుగా వర్ణిస్తూ కపిల్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈసీ ఆదేశాల మేరకు ట్విట్టర్ సంస్థ కపిల్ చేసిన ట్వీట్లను తొలగించింది. -
వివాదాస్పద ట్వీట్ చేసిన మిశ్రాకు నోటీసు..
-
భారత్-పాక్ వ్యాఖ్యలు.. ఈసీ నోటీసు
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించింది. ఫిబ్రవరి 8న భారత్-పాకిస్తాన్ పోరు ఉంటుందని ఆప్ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆప్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కపిల్ మిశ్రాకు నోటీసులు జారీచేశారు. ఎన్నికల నియమావళి క్లాజ్ 1(1) ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకే షోకాజ్ నోటీస్ జారీ చేశామని ఈసీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 8న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ను తలపించనున్నాయని బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ట్వీట్పై రాజధాని రాజకీయ వాతావరణం వేడెక్కింది. షాహిన్ బాగ్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ నిరసనలు చేయిస్తుందని విమర్శించారు. పాకిస్తాన్ షాహిన్బాగ్లో ప్రవేశించి మినీ పాకిస్తాన్గా మార్చిందని మండిపడ్డారు. ఢిల్లీలోని చంద్బాగ్, ఇందర్లోక్ ప్రాంతాలలో చట్టాలు అమలు కావడం లేదని అన్నారు. ఢిల్లీని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు మినీ పాకిస్తాన్లు చేశాయని విమర్శించారు. ఎన్నికల్లో వారికి సరైన జవాబు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మోడల్ టౌన్ నుంచి పోటీ చేస్తున్న కపిల్ మిశ్రా నామినేషన్ పత్రాలను తప్పుగా జతపరచారని..మిశ్రా అభ్కర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ఫిబ్రవరి 8న భారత్-పాక్ పోరు..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కపిల్ మిశ్రా గురవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఫిబ్రవరి 8న భారత్-పాకిస్తాన్ మధ్య పోరు జరుగుతోంది. దీని కోసం మారాణాయుధాలతో పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ సమీపంలోని షెహన్బాగ్కు చేరుకుంది. భారత్ చట్టాలను గౌరవించకుండా అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నుతోంది’ అని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆమ్ఆద్మీ పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార ఆప్ సర్కార్పై బీజేపీ నేతలు మాటాల దాడిని ప్రారంభించారు. ఢిల్లీలోని మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కపిల్ మిశ్రా బరిలో నిలిచారు. అయితే బుధవారం ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై ఆప్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్లో పొందుపరిచారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా వారు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతల చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన కపిల శర్మ ఆ పార్టీనేతలను పాకిస్తాన్ ఉగ్రవాదులుగా అభివర్ణించారు. కాగా ఆయన వ్యాఖ్యలపై ఆప్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలిన ఈసీని డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడైన కపిల్ మిశ్రాపై గతంలో శాసనసభలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తీరుతో తీవ్రంగా విభేదించిన మిశ్రా పార్టీకి రాజీనామా చేసి గత ఆగస్ట్లో బీజేపీలో చేరారు.ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
సీఎంకు షాకిచ్చిన సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా నేడు బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడైన కపిల్ మిశ్రాపై గతంలోనే శాసనసభలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తీరుతో తీవ్రంగా విభేదించిన మిశ్రా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు ఆయన బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ నేతలు రాజీనామా చేయడం ఆప్ను కలవరానికి గురిచేస్తోంది. -
‘సీఎం గారు.. ప్లీజ్ బట్టలు మార్చుకోండి’
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బృందం చేపట్టినధర్నాపై రెబల్ ఎమ్మెల్యే, ఆప్ మాజీ ఆప్ మంత్రి కపిల్ మిశ్రా వ్యంగ్యంగా స్పందించారు. కనీసం బట్టలు అయినా మార్చుకోండంటూ ఎద్దేవా చేశారు. ‘సీఎం గారు.. దయచేసి మీరు, మీ బృందం బట్టలు మార్చుకోండి. అలాగే ఉంటే అనారోగ్యపాలవుతారు. బట్టలు మార్చుకోవద్దని మోదీ ఏం చెప్పలేదు’ అని ట్వీట్ చేశారు. కాగా తమ ప్రభుత్వ డిమాండ్ల సాధనకు... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ బృందం చేపట్టినధర్నానాలుగో రోజుకు చేరింది. మరో వైపు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి వైద్య ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్లు ఆమర నిరాహార దీక్షకు దిగారు. బుధవారం ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ నివాసం నుంచి గవర్నర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ కేంద్రమంత్రి, భాజపా మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు రేషన్ సరకులను డోర్డెలవరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలని ఆప్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇదికూడా చదవండి కేజ్రీవాల్కు షాక్ -
కేజ్రీవాల్కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు రెబల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా షాకిచ్చారు. అసెంబ్లీకి తక్కువ హాజరు అయ్యారంటూ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీ హైకోర్టులో కపిల్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. తాగునీటి శాఖను తన వద్దే ఉంచుకున్న కేజ్రీవాల్.. ఆ సమస్యను పరిష్కరించటంలో ఘోరంగా విఫలం అయ్యారని, అంతేకాకుండా అసెంబ్లీ సెషన్స్ను ఎగ్గొడుతూ.. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని కపిల్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ‘ముఖ్యమైన అంశాలపై చర్చించే సమయంలో పట్టుమని పది నిమిషాలు కూడా ఆయన అసెంబ్లీలో లేరు. 2017 నుంచి ఇప్పటిదాకా 27 అసెంబ్లీ సెషన్స్ జరగ్గా.. ఏడింటికి మాత్రమే కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈయనేం ముఖ్యమంత్రో అర్థం కావట్లేదు. ప్రజా సమస్యలపట్ల ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమయ్యేందుకు ఇదే ఉదాహరణ. దయచేసి.. ఆయన(కేజ్రీవాల్) అసెంబ్లీ రికార్డులను ఓసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అంతేకాదు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నిసార్లు పర్యటించారో.. ప్రజల దగ్గరి నుంచి ఎన్ని విజ్ఞప్తులు పరిశీలించారో ఆరా తీయండి. ఆయన ఆస్తుల వివరాలను కూడా ఓసారి పరిశీలించండి’ అని కపిల్ పిటిషన్లో న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పిటిషన్ను బెంచ్ అత్యవసరంగా స్వీకరించగా.. మంగళవారం విచారణకు రానుంది. మరోవైపు ఈ పిటిషన్పై ఆప్ మాత్రం గప్చుప్గా ఉంది. -
‘ఆయనలాంటి స్నేహితులు బీజేపీకి అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేస్తోందని వార్తలు ప్రచారం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆప్ అసంతృప్త ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రాను ఉద్దేశించి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘కపిల్ మిశ్రా వంటి స్నేహితుడి అవసరం బీజేపీకి ఉంది. ఆయన కోసం బీజేపీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకునే ఉంటాయని’ గోయల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా..‘ఆప్ నేతలతో విభేదాలు వచ్చినప్పటి నుంచి మేము ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాం. అయితే బీజేపీలో చేరాలా వద్దా అన్నదానిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని’ గోయల్ పేర్కొన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మే 30న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించిన ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్ధతు కోరే కార్యక్రమం)లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న గోయల్.. కపిల్ మిశ్రాపై ప్రశంసలు కురిపించారు. ‘పాజిటివ్ ఆటిట్యూడ్కు కపిల్ మిశ్రా ఒక ప్రతీక లాంటివారు. సామాజిక సేవ పట్ల ఆయనకున్న అంకిత భావం అమోఘం’ అంటూ గోయల్ ప్రశంసించారు. కాగా తూర్పు ఢిల్లీ మేయర్గా పనిచేసిన కపిల్ మిశ్రా తల్లి అన్నపూర్ణ మిశ్రా బీజేపీ సీనియర్ నేతగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. కారావాల్ నగర్ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా గత కొంత కాలంగా ఆప్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై మిశ్రా పలుమార్లు విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
ఆ 20మందిలో ఏ ఒక్కరూ మళ్లీ గెలవరు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటించిన 20 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు కూడా తిరిగి గెలవబోరని ఆప్ ఎమ్మెల్యే(రెబల్) కపిల్ మిశ్రా చెబుతున్నాడు. ఉప ఎన్నికలకు వెళ్తే.. వారంతా చిత్తుగా ఓడిపోవటం ఖాయమని అంటున్నాడు. అంతర్గత సర్వేలో ఈ విషయం తేటలెల్లమైందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన నివేదికను శనివారం మీడియాకు విడుదల చేశాడు. ‘‘అంతర్గత సర్వే నిర్వహించి నివేదికను తయారు చేశాం. ఆ 20 మందిపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ‘ఎమ్మెల్యేల పనితీరు.. ప్రజల్లో వారిపై ఏ మేర వ్యతిరేకత’ ఉంది అన్న విషయాలను నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాం. వారు తిరిగి గెలిచే అవకాశాలే లేవు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగితే 11 స్థానాల్లో ఆప్ అభ్యర్థుల ఓటమి ఖాయం. 9 స్థానాల్లో ఒకవేళ అభ్యర్థులను మార్చినా లాభం లేకపోవచ్చు’’ అని కపిల్ పేర్కొన్నారు. కపిల్ సూచించిన స్థానాల మార్పుల్లో అల్కా లాంబ, ఆదర్శ్ శాస్త్రి, సరితా సింగ్, ప్రవీణ్ దేశ్ముఖ్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయని తెలుస్తోంది. కారావాల్ నగర్ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా గత కొంత కాలంగా ఆప్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటన వెలువడగానే అంతర్గత సర్వేను ప్రారంభించేశాడు. సోషల్ మీడియా ద్వారా ఆయా నియోజక వర్గాల్లో ప్రజల అభిప్రాయలను సేకరించిన కపిల్.. ఆ నివేదికను రాత్రికి రాత్రే ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అందజేశాడు. మీడియాతో కపిల్ మిశ్రా (పాత చిత్రం) -
కేజ్రీవాల్ నివాసం వద్ద హైడ్రామా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి సస్పెన్షన్కు గురైన మాజీ మంత్రి కపిల్ మిశ్రా, ఆయన అనుచరులను అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద అడ్డగించడంతో శుక్రవారం హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్వహిస్తున్న ‘జనతా దర్బార్’లో పాల్గొనేందుకు తన 25 మంది మద్దతుదారులతో కలిసి కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు. అనుమతి లేదన్న కారణంతో వీరిని అడ్డుకున్నారు. దీంతో మిశ్రా, ఆయన అనుచరులు కేజ్రీవాల్ నివాసం వెలుపల ధర్నాకు దిగారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను ఎందుకు పదవి నుంచి తొలగించలేదని కేజ్రీవాల్ అడగానికి వస్తే తనను అనుమతించలేదని మిశ్రా తెలిపారు. ‘జనతా దర్బార్లో తనను కలిసేందుకు కేజ్రీవాల్ ఎందుకు అనుమతిచడం లేదు? ఆయన ఎటువంటి తప్పు చేయకపోతే నన్ను ఎందుకు కలవడం లేదు?’ అని ప్రశ్నించారు. 2013, ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆప్ కార్యకర్త సంతోష్ కోలి తల్లిని మిశ్రా తన వెంట తీసుకొచ్చారు. సంతోష్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఢిల్లీ అసెంబ్లీలో కపిల్ మిశ్రాపై దాడి
-
‘ముఖ్యమంత్రి బండారం బయటపెడతా’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యే, మాజీమంత్రి కపిల్ మిశ్రాకు బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లో ఆరోపణలు చేసినందుకు ఆప్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కపిల్ మిశ్రాపై దాడి చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో కపిల్ మిశ్రాను మార్షల్స్ బలవంతంగా సభనుంచి బయటకు తీసుకువెళ్లారు. అనంతరం కపిల్ మిశ్రా మాట్లాడుతూ ఆప్ గుండాలు తనపై దాడికి యత్నించారని, కేజ్రీవాల్ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. కేజ్రీవాల్ బండారం మొత్తం బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై తాను మాట్లాడుతుండగానే ఆప్ ఎమ్మెల్యేలు దూసుకు వచ్చి, దాడి చేయడమే కాకుండా, పిడిగుద్దులు గుద్దారన్నారు. తనపై దాడి చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నవ్వుతున్నారని, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ ఎమ్మెల్యేలకు డైరెక్షన్ ఇస్తున్నారని కపిల్ మిశ్రా ఆరోపించారు. కాగా గత నెలలో కూడా ఆప్ మద్దతుదారులు కపిల్ మిశ్రాపై దాడికి యత్నించారు. ఒకప్పుడు కేజ్రీవాల్కు విశ్వాసపాత్రుడుగా ఉన్న కపిల్ మిశ్రా... ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ రూ.2 కోట్లు ఇస్తుండగా తాను చూశానని, మందుల కొనుగోలు విషయంలోనూ ఆరోగ్య శాఖ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
నిజమైతే.. నేను జైల్లో ఉండేవాడ్ని: సీఎం
మాజీ మంత్రి కపిల్ మిశ్రా తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఇవి నిరాధార ఆరోపణలని, వీటిని ప్రత్యర్థులు సైతం నమ్మడం లేదని పేర్కొన్నారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం పస ఉన్నా తాను ఈపాటికి జైలులో ఉండేవాడినని ఆయన అన్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. మాజీ ఆప్ నేత, తన కేబినెట్లో మాజీ మంత్రి అయిన కపిల్ మిశ్రా ఆరోపణలపై తొలిసారి మౌనాన్ని వీడారు. తాను ఏ చిన్న కుంభకోణానికి పాల్పడినా కేంద్రంలోని బీజేపీ తనను జైలులో వేసేదని పేర్కొన్నారు. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ. రెండుకోట్లు కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని, పార్టీ విరాళాలు, నిధుల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని కపిల్ మిశ్రా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని, తాను రూ. 2 కోట్ల లంచం తీసుకోలేదని కేజ్రీవాల్ తెలిపారు. -
హవాలా స్కాంలో ముఖ్యమంత్రి హస్తం!
-
హవాలా స్కాంలో ముఖ్యమంత్రి హస్తం!
హవాలా స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉందని బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. ముఖేష్ కుమార్ అనే ఢిల్లీ వ్యాపారవేత్త ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చానని చెప్పడం అంతా అబద్ధమేనని కొట్టిపారేశారు. ఇదంతా నల్లధనాన్ని తెల్లగా మార్చుకోడానికి చేసిన ప్రయత్నమేనని మిశ్రా అన్నారు. ఈ మొత్తం స్కాంకు సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని ఆయన చెప్పారు. నాలుగు షెల్ కంపెనీల ద్వారా రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ. 2 కోట్ల మొత్తం చెక్కుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకి వచ్చిందని ఐదు రోజుల క్రితం మిశ్రా ఆరోపించారు. అయితే దీన్ని ముఖేష్ కుమార్ అలియాస్ ముఖేష్ శర్మ ఖండించారు. తాను స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ డబ్బులను విరాళంగా ఇచ్చానన్నారు. పేదలకు సేవ చేయడానికే ఆమ ఆద్మీ పార్టీ రాజకీయాల్లోకి వస్తోందని భావించి, అందుకు సాయపడాలనే తాను ఇచ్చినట్లు ఆయన ఒక వీడియో సందేశంలో చెప్పారు. ఆ వీడియోను అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. ఆ నాలుగు కంపెనీలు ఈ వ్యక్తివేనని, తాము ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీకి విరాళం ఇచ్చాడని అన్నారు. కానీ ముఖేష్ కుమార్/శర్మ పూర్తి నిజాలు బయట పెట్టడంలేదని మిశ్రా తాజాగా అంటున్నారు. అతడు రూ. 2 కోట్లు ఇవ్వలేదన్న విషయాన్ని తాను నిరూపించగలనని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 50 లక్షల చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు ఉన్న నాలుగు లేఖలను ఆయన చూపించారు. వాటిలో రెండింటిమీదే శర్మ సంతకాలు ఉన్నాయన్నారు. అంటే శర్మ కేవలం కోటి రూపాయలే ఇచ్చారని, మిగిలిన కోటి ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. గత నెలలో జరిగిన మునిసిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందే ఆ 2 కోట్ల విరాళం వచ్చిందని, ఇది మరింత ప్రశ్నార్థకంగా ఉందని కపిల్ మిశ్రా అన్నారు. ఆదాయపన్ను శాఖ కేజ్రీవాల్ను దాని గురించి అడిగితే, ఎక్కడినుంచి వచ్చాయో తెలియదన్నారని చెప్పారు. మొత్తం 16 షెల్ కంపెనీలను ఉపయోగించుకోవడం ద్వారా కేజ్రీవాల్ మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. -
నిజమే.. కేజ్రీవాల్కు రూ.2 కోట్లు ఇచ్చాను!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్కు రెండు కోట్ల లంచం ఇచ్చారన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త శర్మ స్పందించాడు. తాను కేజ్రీవాల్కు రెండు కోట్లు ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే పార్టీకి విరాళంగా తాను డబ్బు ఇచ్చినట్లు గురువారం తెలిపాడు. కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి 2014 మార్చి నెల 31వ తేదీన డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లింపులు జరిగాయని ఈ విషయం కపిల్ మిశ్రా సహా కీలక నేతలు అందరికీ తెలుసని చెప్పారు. ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు అవాస్తవాలని కొట్టిపారేశాడు. ఢిల్లీ సీఎం, ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఓ పారిశ్రామికవేత్తతో రూ.2 కోట్లు లంచం తీసుకున్నారని, తనతో అందుకు తగిన ఆధారాలున్నాయని కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డొల్ల కంపెనీల పేరుతో లంచం తీసుకున్నారని కేజ్రీవాల్పై కపిల్ మిశ్రా ఆరోపణలు చేయడం చూసి చూసి విసుగుచెంది మరోసారి పార్టీ విరాళం వివరాలను వెల్లడించాల్సి వచ్చిందన్నాడు. పొగాకు వ్యాపారం చేసే తాను ఢిల్లీ అభివృద్ధికి తోడ్పుడుతుందని భావించి ఆ సమయంలో ఆప్కు ఫండ్ ఇచ్చినట్లు శర్మ వివరించాడు. ఆప్ సీనియర్ నేతలు అశిష్ ఖేతన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దుర్గేష్ పాఠక్, సత్యేంద్ర జైన్ల విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను వెల్లడించాలన్న డిమాండ్తో కపిల్ మిశ్రా మే10 నుంచి ఆరు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. కేజ్రీవాల్కు మంత్రి సత్యేంద్రజైన్ రూ.2 కోట్ల లంచం ఇచ్చారనిచ రూ.400 కోట్ల మంచినీటి ట్యాంకర్ల కుంభకోణంలోనూ దర్యాప్తు నివేదికలను కేజ్రీవాల్ తొక్కిపెట్టారని ఆరోపింస్తూ ఢిల్లీ సీఎంపై సీబీఐ, సీబీడీటీ ఆఫీసుకు నేరుగా వెళ్లి కపిల్ మిశ్రా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
‘సీఎం ఆఫీసుకు రాడుగానీ సర్కార్ 3కి వెళ్లాడు’
-
‘సీఎం ఆఫీసుకు రాడుగానీ సర్కార్ 3కి వెళ్లాడు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్కు సీఎం ఆఫీసుకు వెళ్లేందుకు సమయం ఉండదుగానీ, సర్కార్ 3 సినిమాకు మాత్రం వెళ్లారని అన్నారు. గత ఏడాది మొత్తంలో రెండుసార్లు మాత్రమే ఆయన తన కార్యాలయానికి కేజ్రీవాల్ వెళ్లారని చెప్పారు. ‘కేజ్రీవాల్ స్నేహితులు, ఆయన బంధువులు ఇళ్లపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తే కేజ్రీవాల్ చేస్తున్న అవినీతి మరింత వెలుగులోకి వస్తుంది. ప్రజలను మాత్రం పూర్తిస్థాయిలో పనిచేయాలని విధులకు హాజరుకావాలనే కేజ్రీవాల్ వారికి కనిపించడం మానేశారు. కానీ, సర్కార్ 3 సినిమా చూసేందుకు మాత్రం వెళ్లారు’ అని ఆయన అన్నారు. ‘మొత్తం దేశంలోని ముఖ్యమంత్రులందరిలో కూడా ప్రజలను అతి తక్కువ సార్లు కలిసిన ముఖ్యమంత్రి కేజ్రీవాలే. ఆయనకు ఒక పోర్ట్పోలియో అంటూ ఉండని, అతి తక్కువ మాత్రమే పనిచేస్తూ దాదాపు అన్ని రోజుల్లో సెలవులు తీసుకునే ఏకైక ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక్కరే’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే మిక్కిలి అవినీతి ఆరోపణల కేసులు నమోదైన సీఎంగా కూడా కేజ్రీవాల్ మిగిలిపోతారని అన్నారు. తాను ఇప్పటి వరకు ఆయన చేసిన ఎన్నో అవినీతి కార్యకలాపాల విషయాలు చెప్పానని, కానీ, ఒక్కదానికైనా ఆయన స్పందించారా అని ప్రశ్నించారు. త్వరలోనే ఆయన అవినీతి బాగోతంపై ప్రజలే మాట్లాడతారని, ఒక క్రిమినల్ మాదిరిగా కేజ్రీవాల్ మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. -
సీబీఐతో కేజ్రీవాల్ అవినీతి గుట్టు విప్పుతా!
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. ఆరురోజులపాటు కొనసాగించిన నిరాహార దీక్షను ఆప్ బహిష్కృత నేత, మాజీ మంత్రి కపిల్ మిశ్రా సోమవారం సాయంత్రం ముగించారు. అనంతరం కొన్ని కీలక విషయాలపై ఆయన మాట్లాడారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మంగళవారం సీబీఐ, సీబీడీటీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు ఇచ్చి, విచారణ త్వరగా చేపట్టాలని కోరనున్నట్లు చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా హవాలా, నల్లధనం, మనీ ల్యాండరింగ్ లాంటి అవినీతికి కేజ్రీవాల్ పాల్పడ్డారని ఫిర్యాదు చేయనున్నట్లు ఇదివరకే ట్వీట్ చేశారు. అబద్దాల పునాదుపై కట్టిన నిర్మాణం ఎల్లకాలం నిలవదన్నారు. ఇంట్లో ఉండి అసత్యాలు, అబద్దాలను ప్రచారం చేస్తున్నారని కేజ్రీవాల్పై మండిపడ్డారు. మే10న ఆప్ సీనియర్ నేతలు అశిష్ ఖేతన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దుర్గేష్ పాఠక్, సత్యేంద్ర జైన్ల విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను వెల్లడించాలన్న డిమాండ్తో కపిల్ మిశ్రా నిరాహార దీక్ష చేపట్టిన విషయం విదితమే. కేజ్రీవాల్కు మంత్రి సత్యేంద్రజైన్ రూ.2 కోట్ల లంచం ఇచ్చారని ఇదివరకే సీబీఐకి కపిల్ మిశ్రా ఫిర్యాదు చేశారు. రూ.400 కోట్ల మంచినీటి ట్యాంకర్ల కుంభకోణంలోనూ దర్యాప్తు నివేదికలను కేజ్రీవాల్ తొక్కిపెట్టారని ఆరోపించారు. నేడు సీబీఐ, సీబీడీటీ కార్యాలయాలకు నేరుగా వెళ్లి కేజ్రీవాల్ అవినీతిపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. -
కేజ్రీవాల్ భార్యకు కోపం వచ్చింది
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేసి ఈడ్చుకెళ్లి తీహార్ జైలులో పడేస్తానంటూ వ్యాఖ్యానించిన ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రాపై కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధపు ఆరోపనణ చేసిన మిశ్రా భవిష్యత్ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘ ప్రకృతి ధర్మం ఎప్పుడూ తప్పుకాదు. అవన్నీ నమ్మకద్రోహంలో నుంచి పుట్టినవి, తప్పుడు ఆరోపణలు చేశారు. జరగబోయే పరిణామాలన్నింటికి అతడు (కపిల్ మిశ్రా) బాధ్యత వహిస్తాడా? ఆహ్వానిస్తాడా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి తన నల్లధనాన్ని తెల్లధనంగా కేజ్రీవాల్ మార్చుకున్నారని, ఎన్నికల కమిషన్కు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని కపిల్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ చేసిన తప్పులకు ఆయన కాలర్ పట్టుకొని తీసుకెళ్లి తీహార్ జైలులో పడేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భార్య స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కేజ్రీవాల్పై మిశ్రా సంచలన వ్యాఖ్యలు
-
అన్నట్టుగానే బాంబు పేల్చిన మిశ్రా
-
అన్నట్టుగానే బాంబు పేల్చిన మిశ్రా
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ డొల్ల కంపెనీలు పెట్టి నల్లధనాన్ని వైట్గా మార్చారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత నాయకుడు కపిల్ మిశ్రా ఆరోపించారు. ఎన్నిలక సంఘానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని తెలిపారు. ఆదివారం తాను బట్టబయలు చేసే రహస్యాలతో ఢిల్లీ వణుకుద్దని శనివారం ప్రకటించిన మిశ్రా ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, ఢిల్లీ ప్రజలను మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మొహల్లా క్లినిక్ కుంభకోణంలోనూ ఆప్ నేతల పాత్ర ఉందన్నారు. ఆప్ నేతల విదేశీ పర్యటనల ఖర్చపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. షెల్ కంపెనీ నుంచి ఆప్ రూ. 2 కోట్ల విరాళం తీసుకుందని వెల్లడించారు. ఇవన్నీ కొంతమందికి తెలిసినా ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉన్నారని చెప్పారు. తాను చేసిన ప్రతి ఆరోపణకు లిఖిత పూర్వక సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. పార్టీ విరాళాలకు సంబంధించి వారు చెబుతున్న లెక్కలకు, ఈసీకి సమర్పించిన వివరాలకు పొంతన లేదన్నారు. నాలుగు కంపెనీల్లో అక్రమాలకు సంబంధించి కేజ్రీవాల్కు ఆదాయపన్ను శాఖ నోటీసు పంపిందని తెలిపారు. ఆయనకు అక్రమంగా వందలాది కంపెనీలు ఉన్నాయని, ఈ కంపెనీల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు ఉన్నాయని ఆరోపించారు. ఈ కంపెనీలకు సంబంధించిన అధికారిక పత్రాలు తన దగ్గర ఉన్నాయన్నారు. షెల్ కంపెనీలన్నీ కేజ్రీవాల్ నెలకొల్పినవేనని, యాక్సిస్ బ్యాంకు ద్వారా నల్లధనాన్ని వైట్గా మార్చారని తెలిపారు. ప్రెస్మీట్లో మిశ్రా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. -
‘ఆదివారం నేను చెప్పే సీక్రెట్తో ఢిల్లీ వణుకుద్ది’
న్యూఢిల్లీ: తదుపరి తాను చెప్పబోయే మరో విషయం ఢిల్లీ ప్రజల్లో భూకంపం పుట్టిస్తుందని, ముఖ్యంగా ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీపై నమ్మకం పెట్టుకున్నారో వారంతా వణికిపోతారని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురై నిరహార దీక్షలో ఉన్న కపిల్ మిశ్రా చెప్పారు. శనివారం మహాత్మాగాంధీ స్మృతి వనం రాజ్ ఘాట్ను సందర్శించిన ఆయన అక్కడ కంటతడి పెట్టారు. లంచం తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన కపిల్ మిశ్రా ప్రస్తుతం పార్టీలో నుంచి వేటుకు గురై నిరహార దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం బాపూ ఘాట్కు వెళ్లిన ఆయనను ఆరోగ్యం క్షీణించిందని, ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఒంటరినని భావిస్తున్నాను. అందుకే రాజ్ ఘాట్కు వచ్చాను. రేపు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళతా. రేపు నేను మరో విషయాన్ని బయటపెడతా.. దాని తర్వాత ఢిల్లీ ప్రజల ప్రకంపనలు చూస్తారు. ముఖ్యంగా ఎవరు ఆప్ను నమ్మారో వారు’ అని ఆయన అన్నారు. దీంతో రేపు కపిల్ మిశ్రా ఏం బయటపెట్టనున్నారో అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. -
మిశ్రాను కొట్టిన యువకుడు జాబ్ వదిలేశాడు
న్యూఢిల్లీ: కపిల్ మిశ్రాపై దాడికి ప్రయత్నించిన యువకుడు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ జెండా పట్టుకోబోతున్నాడు. అతడు తాను చేస్తున్న సీఏ ఉద్యోగాన్ని వదిలేసి ఇక ఆప్కు సేవలు అందించాలని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఆమ్ ఆద్మీపార్టీ నుంచి బహిష్కరణకు గురైన కపిల్ మిశ్రాపై అంకిత్ భరద్వాజ్ దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు చేసిన కపిల్ మిశ్రా అనంతరం పార్టీ నుంచి బహిష్కరణ వేటుకు గురై నిరాహార దీక్షకు దిగిన సమయంలో అంకిత్ దాడి చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం అతడు తన ఉద్యోగానికి గుడ్బై చెప్పేశాడు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో బయటపెట్టినట్లు తెలిపారు. మోతీ బాగ్ ప్రాంతానికి చెందిన అంకిత్ మిశ్రా మెడపట్టుకొని చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
‘గుర్తుకు తెచ్చుకో.. నువ్వే అడిగావు నన్ను’
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురై ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తున్న కపిల్ మిశ్రా తల్లి, ఒకప్పటి బీజేపీ నేత అన్నపూర్ణ మిశ్రా బహిరంగ లేఖ రాశారు. అందులో కేజ్రీవాల్ను అబద్ధాల కోరుగా అభివర్ణించారు. అంతకుముందు నిరాహార దీక్షలో ఉన్న కపిల్ మిశ్రా ఉదయాన్నే ఓ ట్వీట్ చేశారు. ‘మా అమ్మ అరవింద్ కేజ్రీవాల్కు ఏదో చెప్పాలనుకుంటుంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అరవింద్ను ఉద్దేశించి కపిల్ తల్లి ఏం రాశారంటే.. ‘ఇంకా ఎన్ని అబద్ధాలాడతావు కేజ్రీవాల్.. ఇంకెన్ని.. కొంచెం దేవుడికైనా భయపడు. నా కొడుకు నిన్ను ప్రశ్నిస్తాడనిగానీ, ఆ ప్రశ్నలను తప్పించుకుంటావనిగానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎప్పుడు కలుసుకున్నా ప్రజాజీవితంలో సత్యంగా ఉండాలనే విషయాన్నే చెబుతావు. గుర్తుకు తెచ్చుకో.. కపిల్ను నీ పార్టీ పార్టీలోకి తీసుకుంటానని నువ్వే నా ఇంటికి వచ్చి అడిగావు.. పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేయాలన్నావు.. కానీ కపిల్ మాత్రం ఉద్యమంలోనే భాగస్వామ్యం అవుతానని చెప్పాడు. కానీ, నువ్వు కపిల్ అవసరం తనకు చాలా ఉందని చెప్పావు. కానీ, ఇప్పుడు ప్రజలంతా నిన్ను అవినీతిపరుడని అంటున్నారు.. నువ్వు మాత్రం మౌనంగా ఉన్నావు. నువ్వు కపిల్తో ఉన్నావు. కానీ వాడిని అర్ధం చేసుకోలేదు. వాడు తీవ్ర బాధతో ఉన్నాడు. మూడు రోజులుగా ఏమీ తినడం లేదు. ఒక తల్లిగా నిన్ను అడుగుతున్నాను.. అతడు ఏ సమాచారం అడుగుతున్నాడో అది ఇచ్చేయ్. అతడు ఎవరి ఏజెంటూ కాదు.. ఒక్క నిజానికి తప్ప’ అంటూ ఆమె హిందీలో లేఖ రాశారు. -
‘ఇదంతా కేజ్రీవాల్ ఆడించిన నాటకం’
న్యూఢిల్లీ: తనపై దాడి చేసిన అంకిత్ భరద్వాజ్ బీజేపీ కార్యకర్త అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తప్పుడు ప్రచారం చేస్తోందని కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఆరోపించారు. ఇదంతా కేజ్రీవాల్ ఆడించిన నాటకమని మండిపడ్డారు. తనపై దాడి జరిగిన వెంటనే భరద్వాజ్ బీజేపీ కార్యకర్త అంటూ ఆప్ నేతలు సోషల్ మీడియా అసత్య ప్రచారానికి దిగారని వెల్లడించారు. ఆప్ సీనియర్ నేతల విదేశీ పర్యటనలకు ఖర్చయిన నిధుల వివరాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్తో నిరాహారదీక్షకు దిగిన మిశ్రాపై బుధవారం భరద్వాజ్ దాడి చేశాడు. దీనిపై సీఎం కేజ్రీవాల్కు మిశ్రా లేఖ రాశారు. ‘నాపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు ఫేస్బుక్లో షేర్ చేయడం, ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే గతంలో మీపై (కేజ్రీవాల్) దాడి జరిగినప్పుడు ఎలా చేశారో అలాగే ఇప్పుడు చేశారు. ఇది పాత ట్రిక్కు. భరద్వాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకోకముందే అతడు బీజేపీ కార్యకర్త అని ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రకటించారు. ఇలాంటిది జరుగుతుందని ఆప్ నాయకులకు ముందే తెలుసున’ని లేఖలో మిశ్రా ఆరోపించారు. భరద్వాజ్తో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ యువ మోర్చా తెలిపింది. -
‘ఇదంతా కేజ్రీవాల్ ఆడించిన నాటకం’
-
దాడి చేయబోతే.. పట్టుకుని చితక్కొట్టారు
-
దాడి చేయబోతే.. పట్టుకుని చితక్కొట్టారు
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీమంత్రి కపిల్ మిశ్రాపై దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఆయన మద్దతుదారులు పట్టుకుని చితక్కొట్టారు. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో తన ఇంటివద్దే కపిల్ మిశ్రా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అంకిత్ భరద్వాజ్ అనే వ్యక్తి ఆయనపై దాడికి ప్రయత్నించగా మిశ్రా మద్దతుదారులు అతడిని పట్టుకుని కొట్టి, పోలీసులకు అప్పగించారు. తాను ఆప్ మద్దతుదారుడినని భరద్వాజ్ చెప్పగా, ఆప్ ప్రతినిధులు మాత్రం అతడు బీజేపీ మనిషని అన్నారు. కాసేపటికే ఈ ఘటనతో తమకు ఏమాత్రం సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. మిశ్రా ఉన్న గదిలోనే మీడియాతో మాట్లాడేందుకు భరద్వాజ్ ప్రయత్నిస్తుండగా అతడిని కార్యకర్తలు చుట్టుముట్టారు. జుట్టుపట్టుకుని లాగి, దుస్తులు చింపేశారు. నేలమీద పడేసి కొట్టారు. ఒక పోలీసు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. తన మీద దాడి చేయబోతుంటే తన మద్దతుదారులు ఆపారని, వీళ్లెవరో తనకు తెలియదని కపిల్ మిశ్రా మీడియాతో అన్నారు. అయితే తన మద్దతుదారులకు మాత్రం ఎవరినీ కొట్టొద్దని స్పష్టంగా చెప్పానని చెప్పారు. ఆప్ నాయకులు సంజయ్ సింగ్, ఆశిష్ ఖైతాన్, సత్యేంద్రజైన్, రాఘవ్ ఛద్దా, దుర్గేష్ పాఠక్ తదితరుల విదేశీ పర్యటనల వివరాలు చెప్పాలంటూ బుధవారం ఉదయం నుంచి కపిల్ మిశ్రా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. -
నా ప్రాణాలకు ముప్పుంది: కపిల్
-
నా ప్రాణాలకు ముప్పుంది: కపిల్ మిశ్రా
న్యూఢిల్లీ: తన ప్రాణానికి ముప్పు ఉందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై తిరుగుబాటు చేసిన కపిల్ మిశ్రా పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలేదని, కేవలం విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు చెబితే చాలన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అందులో అంతర్జాతీయ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని.. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకంజ వేయనని ఆయన స్పష్టంచేశారు. బెదిరింపు కాల్స్ లాంటి వాటికి భయపడేవాడిని కాదని ఆప్ బహిత్కృత నేత అన్నారు. కేజ్రీవాల్కు రాసిన లేఖను చదివి వినిపించారు. 'నేను సత్యాగ్రహం చేపట్టాను. ఇందుకోసం నేను మీ ఇంటి ముందు కూర్చుని ఇబ్బంది పెట్టను, ఎక్కడైనా ఏదో ఒక మూలలో అడ్జస్ట్ అయి పోరాటం చేస్తాను. నేను చనిపోయే పరిస్థితి వచ్చినా మీరు లెక్కచేయరని నాకు తెలుసు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా డబ్బులు లేవని చెప్పిన కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతలు విదేశీ పర్యటనలకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి. ఆప్ సీనియర్ నేతలు అశిష్ ఖేతన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దుర్గేష్ పాఠక్, సత్యేంద్ర జైన్ల విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను వెల్లడించాలన్నదే నా డిమాండ్' అని లేఖలో ఉన్న విషయాలను చెప్పారు. కేజ్రీవాల్కు సత్యేంద్రజైన్ రూ.2 కోట్ల లంచం ఇచ్చారని సీబీఐకి కపిల్ మిశ్రా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రూ.400 కోట్ల మంచినీటి ట్యాంకర్ల కుంభకోణంలోనూ దర్యాప్తు నివేదికలను కేజ్రీవాల్ తొక్కిపెట్టారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 'మీ అవినీతిపై పోరాటం చేయాలనుకుంటున్నాను.. దయచేసి నన్ను ఆశీర్వదించండి అంటూ' మంగళవారం కేజ్రీవాల్ను కోరిన కపిల్ మిశ్రా దీక్ష చేపట్టారు. -
నాపై పోటీ చేసి గెలవగలవా: సీఎంకు సవాలు
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద సస్పెండైన పార్టీ నేత కపిల్ మిశ్రా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్ల లంచం తీసుకున్నారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని చెబుతున్న మిశ్రా.. ఢిల్లీలో ఏ నియోజకవర్గం నుంచైనా దమ్ముంటే తన మీద పోటీ చేయాలని కేజ్రీవాల్ను సవాలు చేశారు. తనను అసెంబ్లీ నుంచి పంపేయాలని కేజ్రీవాల్ అనుకుంటున్నట్లు తనకు తెలిసిందని, అయినా తనకు లెక్కేమీ లేదని చెప్పారు. ఆయనకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా, తనమీద తనకు నమ్మకం ఉన్నా రాజీనామా చేసి అసెంబ్లీ బరిలో తనతో పోటీకి దిగాలని అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఆయన తనకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడినుంచి పోటీకి దిగొచ్చని.. ఆయన దగ్గర డబ్బు, అధికారం, పార్టీ జనం ఉన్నారని.. తాను మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతానని, ప్రజలను ఎదుర్కొనే ధైర్యం కేజ్రీవాల్కు ఉందా అని కపిల్ మిశ్రా ప్రశ్నించారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా మిశ్రా కేజ్రీవాల్ ఆశీస్సులు కోరారు. ఇది తన జీవితంలోనే అతిపెద్ద పోరాటమని, అందువల్ల మీపై పోరాటం చేసేందుకు తనకు ఆశీస్సులు ఇవ్వాలని అడిగారు. -
దమ్ముంటే నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టండి!
-
‘కేసు పెడుతున్నా.. ఆశీర్వదించండి’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై దాడిని ఆప్ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఉధృతం చేశారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై కేసు పెడుతున్నట్టు ప్రకటించారు. తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు మంగళవారం ఉదయం మిశ్రాతో మాట్లాడుతూ.. ‘నన్ను ఆశ్వీరదించండి.. మీపై కేసు పెడుతున్నాను’ అని కేజ్రీవాల్ను ఉద్దేశించి అన్నారు. కేజ్రీవాల్కు సత్యేంద్రజైన్ ఇచ్చిన రూ. 2 కోట్ల లంచంపై సీబీఐకు ఆయనే ఫిర్యాదు చేయనున్నారు. రూ.400 కోట్ల మంచినీళ్ల ట్యాంకర్ల కుంభకోణంలో దర్యాప్తు నివేదికను కేజ్రీవాల్ తొక్కిపెట్టారంటూ కపిల్ మిశ్రా నిన్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాల్ని ఏసీబీకి ఆయన అందచేశారు. తనపై ఆరోపణలకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. సత్యానిదే తుది విజయమని పేర్కొన్నారు. -
కేజ్రీవాల్పై మరో అవినీతి పిడుగు!
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కళ్లముందు మంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ.2 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించి తిరుగుబాటు చేయగా.. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరో అవినీతి ఆరోపణను తెరపైకి తెచ్చారు. కేజ్రీవాల్ ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి రెండు కోట్లు లంచం తీసుకున్నారని సుబ్రమణ్యస్వామి అన్నారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్కు లేఖ రాశారు. కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని, ఆయన అవినీతిపై విచారణ చేపట్టాలని తన లేఖలో స్వామి డిమాండ్ చేశారు. రూ.50 లక్షల చొప్పున నాలుగు దఫాలుగా కేజ్రీవాల్ ఆ నగదును తీసుకున్నారని 'క్విడ్ ప్రొకో'లో భాగంగా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. గతంలోనే ఢిల్లీ ఎల్జీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని, విచారణకు ఆదేశించని కారణంగా ఈసారి లేఖాస్త్రం సంధించినట్లు వివరించారు. కేజ్రీవాల్పై చేసిన ఆరోపణలకుగానూ తనవద్ద సాక్ష్యాలు ఉన్నాయని, ఎల్జీ విచారణకు ఆదేశిస్తారని సుబ్రమణ్యస్వామి ఆశాభవం వ్యక్తంచేశారు. ఇప్పటికే కపిల్ మిశ్రా ఆరోపణలపై దర్యాప్తు జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీని ఎల్జీ బైజల్ ఆదేశించిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్పై ఏసీబీకి సాక్ష్యాలు
-
కేజ్రీవాల్పై ఏసీబీకి సాక్ష్యాలు
నేడు సీబీఐకి ఫిర్యాదు చేస్తా: కపిల్ మిశ్రా సాక్షి, న్యూఢిల్లీ: రూ.400 కోట్ల మంచినీళ్ల ట్యాంకర్ల కుంభకోణంలో దర్యాప్తు నివేదికను కేజ్రీవాల్ తొక్కిపెట్టారంటూ ఆప్ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాల్ని సోమవారం ఆయన అందచేశారు. కేజ్రీవాల్కు సత్యేంద్రజైన్ ఇచ్చిన రూ. 2 కోట్ల లంచంపై సీబీఐకు ఫిర్యాదు చేస్తానని, అందుకోసం మంగళవారం 11.30గంటలకు సీబీఐ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు మిశ్రా చెప్పారు. ఇదిలా ఉండగా పార్టీ అధినేత కేజ్రీవాల్పై ఆరోపణలు చేసినందుకుగానూ కపిల్ను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీని ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆదేశించారు. మరోవైపు అవినీతిపరుడంటూ కేజ్రీవాల్ పదే పదే ఆరోపించిన ఏసీబీ చీఫ్ ఎంకే మీనానే ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. ఏసీబీ కార్యాలయం వెలుపల మిశ్రా మాట్లాడుతూ.. పూర్తిస్థాయి విచారణ కోసం ఏసీబీ మళ్లీ పిలుస్తుందని, తాను చేసిన ఆరోపణలపై లైడిటెక్టర్ టెస్ట్కు సిద్ధమని, కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ కూడా టెస్ట్లో పాల్గొనాలని ఆయన సవాలు విసిరారు. వాటర్ ట్యాంకర్ కుంభకోణంలో మాజీ సీఎం షీలాదీక్షిత్ను రక్షించేందుకు ఆప్ సర్కారు ప్రయత్నించిందని, ఆ సాక్ష్యాలను ఏసీబీకి సమర్పించినట్లు చెప్పారు. సత్యానిదే తుది విజయం: కేజ్రీవాల్ తనపై ఆరోపణలకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. సత్యానిదే తుది విజయమని ట్వీట్ చేశారు. కపిల్ మిశ్రాను ఉపయోగించుకుని బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ ఆరోపించింది. ఆ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఇవి నిరాధార ఆరోపణలేనని కొట్టిపారే శారు. కేబినెట్ నుంచి తొలగించారన్న నిరాశలో మిశ్రా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. -
దమ్ముంటే నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టండి!
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఆయన ఒకప్పటి సన్నిహిత సహచరుడు కపిల్ మిశ్రా సవాలు విసిరారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టాలని అన్నారు. రాత్రి 7 గంటలకు పీఏసీ సమావేశం పెడుతున్నారని, నలుగురు పెద్దమనుషులు గదిలో నాలుగు గోడల మధ్య కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం కాదని, ధైర్యం ఉంటే గత రెండేళ్లుగా మొత్తం మంత్రులందరూ తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన టెండర్ల ఫైళ్లు తీసుకుని రాంలీలా మైదాన్కు రావాలని, అక్కడ ప్రజల ఎదుటే నిపుణులతో వాటిని చెక్ చేయించి అక్రమాలకు పాల్పడిన మంత్రులను తొలగించి, నిజాయితీపరులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. తనకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు సీబీఐ వద్ద అపాయింట్మెంట్ ఉందని, అక్కడ తాను ఆధారాలన్నీ ఇవ్వడంతో పాటు అధికారికంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తానని చెప్పారు. ఈ కేసులో సాక్షిగా నిలిచి మొత్తం విచారణకు సహకరిస్తానని తెలిపారు. కేజ్రీవాల్ బంధువులలో ఎవరి పేరు మీద భూములు రిజిస్టర్ అయ్యాయో, ఆ పేరు చెప్పాలని సంజయ్ సింగ్ అడిగారని, ఆయనకే కాక మొత్తం దేశానికి చెబుతానని అంటూ.. అరవింద్ కేజ్రీవాల్ బావమరిది కోసమే మంత్రి సత్యేంద్ర జైన్ భూములకు సంబంధించిన డీల్స్ చేశారని ఆరోపించారు. ప్రశ్నిస్తే బీజేపీ ఏజెంట్లేనా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లు బీజేపీ ఏజెంట్లని, మోదీ ఏజెంట్లని ముద్ర వేయడం మామూలు అయిపోయిందని.. కానీ తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టి వెళ్లేది లేదని కపిల్ మిశ్రా తెలిపారు. బీజేపీ గురించి ఆప్లో ఎవరైనా గట్టిగా మాట్లాడారంటే, పఠాన్కోట్ గురించి గానీ, ఇంకా వాళ్ల అవినీతి గురించి ఎవరైనా మాట్లాడారంటే అది కేవలం తాను మాత్రమేనని మిశ్రా చెప్పారు. గత రెండేళ్లలో తన మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని చెప్పారు. బీజేపీలోకి తాను ఎప్పుడూ వెళ్లబోనని, వాళ్ల నాయకులెవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను బీజేపీ వాళ్లను కలిసినట్లు ఒక్క ఆధారమైనా చూపించాలని సంజయ్ సింగ్, కేజ్రీవాల్ ఇద్దరినీ సవాలు చేశారు. పంజాబ్లో టికెట్ల అమ్మకం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు టికెట్లు అమ్ముకున్నారని, దాని గురించి, ఇతర అవినితి వ్యవహారాల గురించి తనకు ఇప్పుడు దేశం నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయని కపిల్ మిశ్రా అన్నారు. సంజయ్ సింగ్ బంధువులు అమెరికాలో కూడా టికెట్ల కోసం డీల్స్ చేసుకున్నారని.. పోలింగ్కు ముందు మద్యం, డబ్బు పంచడమే కాక చివరకు అమ్మాయిలతో కూడా డాన్సులు చేయించారని ఆయన ఆరోపించారు. ఎన్నారైలు ఇచ్చిన విరాళాల గురించి అక్కడ గొడవ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక ఆప్ నేతలు కొందరు ట్విట్టర్, వాట్సప్లలో తన నంబరు అందరికీ పంపుతున్నారని, చాలామంది నుంచి తనను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని కపిల్ మిశ్రా చెప్పారు. అయితే ఆ బెదిరింపులకు తాను భయపడేది లేదని, కేజ్రీవాల్ తన చెంచాలతో ఏం చేయించుకుంటారో చేయించుకోవాలని సవాలు చేశారు. -
విశ్వాసపాత్రుడే తిరుగుబాటు చేస్తే!
యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్ లాంటి అత్యంత విశ్వాసపాత్రులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బయటకు వచ్చేసిన తరుణంలో సైతం అరవింద్ కేజ్రీవాల్ను వెన్నంటి ఉండి, ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన నాయకుడు.. కపిల్ మిశ్రా. అన్నాహజారే మొదలుపెట్టిన అవినీతి రహిత భారతం ఉద్యమంలో పాల్గొన్న యువకుల్లో ఒకరు. అప్పటినుంచి కేజ్రీవాల్కు బాగా సన్నిహితంగా మెలిగిన మిశ్రా.. ఇప్పుడు ఆయనపైనే బాంబులు పేలుస్తున్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్ల లంచం తీసుకుంటుండగా తాను ప్రత్యక్షంగా చూశానంటూ ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు. ఇప్పటికే అవినీతి నిరోధక శాఖకు తనవద్ద ఉన్న ఆధారాలు సమర్పించిన మిశ్రా, ఆ తర్వాత సీబీఐ తలుపు కూడా తట్టారు. వాటర్ ట్యాంకర్ స్కాం గురించి రెండు విభాగాలకు ఫిర్యాదు చేశారు. కపిల్ మిశ్రా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ చీఫ్ ముకేష్ మీనా తక్షణం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయానికి వెళ్లారు. కింకర్తవ్యం అంటూ ఆయనను అడిగారు. ముఖ్యమంత్రి మీద విచారణ జరిపించాలా.. ఆగాలా అనే సంశయంలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీబీఐ చేతికి కూడా కేసు వెళ్తే.. ఇక ఎటూ ఆ సంస్థ చూసుకుంటుందిలే అన్న నమ్మకం కూడా కనిపిస్తోంది. కొన్ని రోజుల వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోని ప్రముఖ నాయకుల్లో ఒకరిగా పేరొందిన మిశ్రాను ఇప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా బీజేపీ ఏజెంటు అంటూ తిట్టిపోస్తున్నారు. తరచు పత్రికల హెడ్లైన్లలో ఉండే విధంగా కామెంట్లు చేయడంలో కపిల్ మిశ్రా సిద్ధహస్తుడు. ఆయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. 36 ఏళ్ల వయసులో అన్నాహజారే ఉద్యమంలో చేరారు. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల స్కాంపై కామన్ vs వెల్త్ అంటూ ఓ పుస్తకం సైతం రాశారు. ప్రతిసారీ కేజ్రీవాల్ను కాపాడుతూ ప్రకటనలు చేసేవారు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటివాళ్లు పార్టీ వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు చేసిన ఆరోపణలను గట్టిగా ఖండించింది కూడా ఆయనే. న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ను నకిలీ సర్టిఫికెట్ కేసులో అరెస్టు చేసిన తర్వాత న్యాయశాఖను మిశ్రానే నిర్వహించారు. కొన్నాళ్ల తర్వాత ఆ శాఖను తీసేశారు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీద తిరుగుబాటు చేయడానికి మిశ్రాకు మనసొప్పింది. -
‘సిగ్గులేని వ్యక్తి నుంచి రాజీనామా కోరడమా?..’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ఒక సిగ్గు లేని వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి నుంచి రాజీనామా ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు రుజువైతే తప్ప కేజ్రీవాల్ రాజీనామా చేయనందున ఈ విషయాన్ని వెంటనే సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ.2కోట్ల లంఛాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకోవడాన్ని తాను కళ్లారా చూశానని ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్పై ముప్పేట దాడి జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓ మీడియా స్వామిని ఈ విషయంపై స్పందన కోరగా..‘సిగ్గులేని ఒక కేజ్రీవాల్లాంటి వ్యక్తి నుంచి ఎవరు మాత్రం రాజీనామా ఆశిస్తారు? ముందునుంచే నేను ఆయనను రాజీనామా చేయాలని అడుగుతున్నాను. నేను ఆయనను శ్రీ 420 అని పిలుస్తుంటాను. అన్నా హజారేతో ఉన్నప్పటి నుంచి కేజ్రీవాల్ గురించి నాకు తెలుసు. ఆయన కమ్యూనిజానికి అనుకూలంగా ఉంటారని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని స్వామి చెప్పారు. -
‘కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే’
-
శిష్యుడి ‘అవినీతి’పై హజారే ఏమన్నారంటే..
-
శిష్యుడి ‘అవినీతి’పై హజారే ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: ఓ ల్యాండ్ సెటిల్మెంట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ.2కోట్లు లంచం తీసుకున్నారన్న మాజీ మంత్రి కపిల్ మిశ్రా వ్యాఖ్యలతో రాజధానిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కపిల్ ఆరోపణల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆప్ ఆరోపిస్తుండగా, అవినీతిని చీపురుతో ఊడ్చిపారేస్తానన్న కేజ్రీవాల్ తానే అవినీతిపరుడయ్యాడంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇక కేజ్రీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై ఆయన గురువు అన్నా హజారే ఆచితూచి స్పందించారు. ఆదివారం రాలేగావ్సిద్ధిలో మీడియాతో మాట్లాడిన అన్నా హజారే.. కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు బాధాకరమన్నారు. ‘అవినీతిని రూపుమాపేందుకే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటిది ఆయనే లంచం తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. నిజంగా ఇది బాధాకరం’ అని హజారే అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ గరం గరం.. కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఆదివారం ఉదయం లెప్టినెంట్ గవర్నర్ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన తర్వాత పొలిటికల్ సీన్ వేగంగా మారింది. కేజ్రీవాల్ను తూర్పారపట్టడంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడ్డాయి. యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు సీఎం కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించగా, సీఎంను బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్కు వినతిపత్రం అందించారు. (కేజ్రీవాల్పై బాంబు పేల్చిన మిశ్రా) -
‘ఆయన శత్రువు కూడా ఈ మాటలు నమ్మరు’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మొన్న ఆయనపై ధిక్కార స్వరం వినిపించి అవసరం అయితే పార్టీని సైతం వీడిపోతానంటూ వ్యాఖ్యానించిన కుమార్ విశ్వాస్ అండగా నిలిచారు. కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు అర్థరహితం అని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత అయిన విశ్వాస్ అన్నారు. కేజ్రీవాల్ శత్రువు కూడా కపిల్ చేసిన ఆరోపణలు నమ్మబోరంటూ వ్యాఖ్యానించారు. ‘నేను కేజ్రీవాల్తో పనిచేశాను. ఆయన అవినీతికి పాల్పడతారనే విషయాన్నిగానీ, ఒకరి నుంచి లంచం తీసుకుంటారనే విషయాన్నిగానీ నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. కావాలనే కేజ్రీవాల్పై బురద జల్లుతున్నారు. పార్టీలో ఏ నేత అవినీతికి పాల్పడినా వారిని వెంటనే తొలగిస్తానంటూ చెప్పిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అలాంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణలు బాధ్యతారహితమైనవి, నిర్లక్ష్యంతో ఉద్దేశ పూర్వకంగా చేసినవి. కేజ్రీవాల్ శత్రువు కూడా ఈ ఆరోపణలు నమ్మలేరు’ అని కుమార్ విశ్వాస్ చెప్పారు. -
‘కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే’
న్యూఢిల్లీ: లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. కపిల్ చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలన్నారు. కేజ్రీవాల్ ఏడుగురు మంత్రుల్లో ఆరుగురిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని మండిపడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ.2కోట్ల లంఛాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకోవడాన్ని తాను కళ్లారా చూశానని ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన ఆయన ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ఈ విషయాన్ని వివరించారు. తాను చేసిన ఆరోపణలు నిజాలని నిరూపించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అజయ్ మాకెన్ జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ మిశ్రా ఆరోపణలు సీరియస్గా తీసుకొని ఏసీబీ, సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. మరోపక్క, పాండిచ్ఛేరి గవర్నర్ కిరణ్బేడీ కూడా ఈ విషయంపై స్పందించారు. కేజ్రీవాల్పై తక్షణమే విచారణ జరపాలని, దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయాలన్నారు. ఖండించిన సిసోడియా మిశ్రా సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేతలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక సమావేశం అయ్యారు. అనంతరం డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడిమా మీడియాతో మాట్లాడుతూ మిశ్రా ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఇవి చాలా దిగజారి చేస్తున్న ఆరోపణలని, తాను వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాని, కేజ్రీవాల్పై ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న ఆరోపణలే తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. ‘ప్రస్తుతం నీటి సమస్యపై ప్రతి ఎమ్మెల్యే నిరాశలో ఉన్నారు. ప్రజల ఆగ్రహాన్ని ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని నిన్ననే నేను మిశ్రాతో చెప్పాను. ముఖ్యమంత్రి కేబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తారని కూడా చెప్పాను. కానీ, ఆరోజు ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.. ఇంకేం చెప్పాలి నేను’ అని సిసోడియా అన్నారు. -
కేజ్రీవాల్పై బాంబు పేల్చిన మిశ్రా
-
కేజ్రీవాల్పై బాంబు పేల్చిన మిశ్రా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు కపిల్ మిశ్రా బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ.2 కోట్లు లంచం తీసుకోవడం కళ్లారా చూశానని చెప్పారు. ఇలాంటివి రాజకీయాల్లో మామూలేనని తనతో కేజ్రీవాల్ అన్నారని వెల్లడించారు. కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఈరోజు ఉదయం లెప్టినెంట్ గవర్నర్ను కలిశారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... ఆరోపణలు నిరూపించడానికి తాను సిద్ధమన్నారు. కేజ్రీవాల్ అవినీతి గురించి వెల్లడించడంతోనే తనను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు. కేజ్రీవాల్ బంధువుకు సంబంధించిన రూ. 50 కోట్ల భూలావాదేవిని సెటిల్ చేసినట్టు తనతో సత్యేంద్రజైన్ చెప్పారని తెలిపారు. తాను పార్టీలోనే ఉంటానని, అవినీతిపై పోరాడతానని మిశ్రా స్పష్టం చేశారు. కేజ్రీవాల్ అవినీతిపై సీబీఐని ఆశ్రయిస్తానని ప్రకటించారు. తాను మంత్రి పదవి చేపట్టిన తర్వాత మాజీ సీఎం షీలా దీక్షిత్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్కు నివేదిక పంపినా ఎటువంటి చర్య తీసుకోలేదని గుర్తు చేశారు. -
ఢిల్లీ కేబినెట్ నుంచి మిశ్రా ఔట్
న్యూఢిల్లీ: ఢిల్లీ జలవనరుల మంత్రి కపిల్ మిశ్రాను పదవి నుంచి తొలగిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో తలెత్తిన అంతర్గత విభేదాల్లో మిశ్రా, పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్కు మద్దతు పలికారు. కొత్తగా ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేంద్ర పాల్ గౌతమ్(సీమాపురీ), కైలాశ్ గెహ్లాట్(నజఫ్ఘర్)లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తనను పదవి నుంచి తప్పించడంపై మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఆప్ నాయకులు చేసిన ఓ కుంభకోణాన్ని త్వరలో బట్టబయలు చేస్తానని ప్రకటించారు. మరోవైపు వినియోగదారులకు నీటి బిల్లులు అధికంగా రావడంతోనే మిశ్రాపై చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆయన పనితీరు సరిగ్గా లేకపోవడంవల్లే పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. -
‘ఈవీఎంలను కాదు.. మనల్ని చెక్ చేసుకుందాం’
న్యూఢిల్లీ: సొంతపార్టీ నేతల నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పరాభవం ఎదురవుతోంది. ఓటమిని ఈవీఎంలపై తోసివేసి తప్పుకోవడం సరికాదని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ హవా ఉన్నా లేకపోయినా ఆప్ ఓడిపోయిందన్నమాట ఇప్పుడు వాస్తవం అంటూ ప్రకటించారు. రెండేళ్ల తర్వాత ఇలాంటి రోజు ఎందుకు చూడాల్సి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ పరోక్షంగా తమ పార్టీ అధినేతకు హితబోధ చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఫలితాల అనంతరం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే, దీనిపై ఆప్ నేత ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘రెండేళ్ల తర్వాత ఇలాంటి రోజును ఎందుకు చూడాల్సి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రధాని మోదీ హవా ఉన్నా లేకపోయినా ప్రజలు మనకు ఓటు వేయలేదని స్పష్టమైంది. 2015 పొందిన విజయంతోపోలిస్తే అతి తక్కువ సీట్లు మాత్రమే వచ్చాయని తేటతెల్లమైంది. ఫలితాలను ఒక్క ఈవీఎంలను అపఖ్యాతి చేస్తూ మాత్రమే చెప్పలేము’ అని ఆయన అన్నారు. అయితే, ఏదేమైన ఆత్మవిమర్శ అత్యవసరం అని ఇది తన వ్యక్తి గత అభిప్రాయం అని చెప్పారు. మరోపక్క, ఢిల్లీలో బీజేపీ హవా ఉందని ఒప్పుకున్నారు. అయితే, ఇదే పార్టీకి చెందిన కార్మిక మంత్రి మాత్రం మోదీ హవా లేదని ఈవీఎంల హవా ఉందంటూ ఆరోపించారు. -
పోలీసుల అదుపులో ఢిల్లీ డిప్యూటీ సీఎం
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆయన కేబినెట్ మంత్రి కపిల్ మిశ్రాలను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపుగా ర్యాలీతో వెళుతున్న వారిని మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. వెనుదిరిగి వెళ్లాలనని చెప్పినా వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతోపాటు పార్లమెంటువైపుగా దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతవారం కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ వీధుల్లో పెద్ద నోట్ల రద్దు నిరసిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ఏదో ఒక రూపంలో ప్రతిరోజు తన ఆందోళన ఇప్పటికే తెలియజేస్తున్న విషయం తెలిసిందే. మరో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా తాజాగా తీసిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో ఉన్నప్పటికీ ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. -
సీఎంకు వ్యతిరేకంగా వేరే రాష్ట్ర మంత్రి వీరంగం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆప్ మంత్రి వీరంగం సృష్టించారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తితో వేదిక పంచుకోవడానికి ఢిల్లీ పర్యాటకశాఖ మంత్రి కపిల్ మిశ్రా నిరాకరించారు. బుర్హాన్ వనీ, ఆఫ్జల్ గురు మీరు ఎలా భావిస్తారు? అంటూ ఆయన ముఫ్తిని ప్రశ్నించారు. దీంతో సీఎం ముఫ్తి వెంట ఉన్న అధికార యంత్రాంగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పర్యాటక రంగంపై నిర్వహించిన సదస్సు గందరగోళంగా మారింది. సదస్సులో మిశ్రా మాట్లాడుతూ హిజ్జుబుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ పొరపాటు అని, అలా జరిగి ఉండాల్సింది కాదని ముఫ్తి పేర్కొన్నారని విమర్శించారు. పార్లమెంటుపై దాడి నిందితుడు ఆఫ్జల్ గురు, బుర్హాన్ వనీ ఉగ్రవాదులు ఔనా? కాదా? అన్నది ఆమె తెలుపాలని మిశ్రా డిమాండ్ చేశారు. ముఫ్తితో తాను వేదిక పంచుకోలేనంటూ ఆయన మధ్యలోనే సదస్సు నుంచి వెళ్లిపోయారు. ముఫ్తిని విమర్శిస్తూ ఆయన ప్రసంగిస్తుండగా కొందరు ప్రేక్షకులు, ముఫ్తి వెంట ఉన్న అధికారులు గట్టిగా నిరసన తెలుపుతూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. టూరిజం, టెర్రరిజం కలిసి సాగలేవంటూ ఆప్ మంత్రి పేర్కొనగా.. ఆయన వ్యాఖ్యలతో సీఎం ముఫ్తి విస్తుపోయారు. మహిళలపై అత్యాచారాల విషయంలో ఢిల్లీ కన్నా జమ్ముకశ్మీర్ మెరుగ్గా ఉందని ఆప్ మంత్రి ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టారు. -
'నోరు మూసుకో లేకుంటే కాల్చిపారేస్తాం'
న్యూఢిల్లీ: తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు. జేఎన్ యూ వివాదంపై మౌనం వహించకుంటే చంపుతామని ఫోన్ లో బెదిరించారని చెప్పారు. ఉదయం 8.48 గంటలకు తన ఫోన్ కు బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. పూజారి అని చెప్పిన వ్యక్తి తనను బెదిరించాడన్నారు. 'నోరు మూసుకో లేకుంటే కాల్చి చంపుతాం' అని హెచ్చరించాడని తెలిపారు. 'నీ దగ్గర ఎక్కువ బుల్లెట్లు ఉంటే తీవ్రవాదులను కాల్చిచంపాల'ని అతడికి సూచించానని చెప్పుకొచ్చారు. +442, +3844, +9100, +501 నంబర్ల నుంచి తన ఫోన్ కు మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. బెదిరింపులకు భయపడబోనని, విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటానని కపిల్ మిశ్రా స్పష్టం చేశారు. -
టూరిజం హబ్గా ఢిల్లీ: సీఎం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ నగరాల మాదిరిగానే ఢిల్లీని కూడా టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. జనక్పురిలోని దిల్లీ హాట్లో శుక్రవారం ఏర్పాటుచేసిన వార్షిక మామిడిపండ్ల ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా అనేక ఉత్సవాలు జరుపుకుంటుంటామని, వాటిని తిలకించేందుకు అనేకమంది వస్తుంటారని, ఇది పర్యాటక రంగ వికాసానికి దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మనీష్సిసోడియా, న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా హాజరైనప్పటికీ ప్రారంభానికి ముందు ధూళి తుపాను రావడంతో వారు కుప్పకూలిపోయారు. దీంతో వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించలేకపోయారు. కాగా సందర్శకుల కోసం నిర్వాహకులు లంగ్రా, చౌసా, రతౌల్, రాంకేలా, కేసర్, మల్లిక, ఆమ్రాపాలి తదితర రకాల మామిడి పండ్లను అందుబాటులో ఉంచారు. -
జంగ్తో కేజ్రీవాల్ భేటీ
అధికారాల విషయంలో పరస్పర సహకారంపై చర్చ * కొత్త న్యాయశాఖ మంత్రిగా కపిల్ మిశ్రా * పోలీస్ కస్టడీలో తోమర్ విచారణ ప్రారంభం న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ అధికార వ్యవస్థలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో బుధవారం భేటీ అయ్యారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ఆరోపణలతో అరెస్టయిన జితేందర్సింగ్ తోమర్ మంత్రిపదవికి రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో ఢిల్లీ జలబోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కపిల్ మిశ్రాను న్యాయ మంత్రిని చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్కు సమాచారమిచ్చారు. ఇద్దరూ పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఉన్న మార్గాలపై ఎల్జీ, కేజ్రీవాల్ చర్చించినట్లు సమాచారం. కేజ్రీవాల్తో తాను సమావేశమయ్యానని తనకు న్యాయశాఖ అప్పగించనున్నట్లు తెలిపారని కపిల్ మిశ్రా తెలిపారు. మిశ్రా నియామకానికి సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, కేజ్రీవాల్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ భేటీ అయ్యారు. ఢిల్లీ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఫైజాబాద్కు తోమర్..: సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్న మాజీ మంత్రి తోమర్ను నకిలీ సర్టిఫికెట్ విచారణలో భాగంగా పోలీసులు ఫైజాబాద్ తీసుకెళ్లారు. ఇది కేవలం తోమర్ సర్టిఫికెట్ వ్యవహారమే కాదని, దీని వెనుక అతి పెద్ద నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల రాకెట్ ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఫైజాబాద్లోని అవధ్ వర్సిటీకి తోమర్ను అధికారులు తీసుకెళ్లారని, ఆయన సాయంతో అక్కడ కేసు ఆధారాలను సేకరిస్తారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తోమర్ తమ నుంచి ఎలాంటి డిగ్రీ పొందలేదని అవధ్ వర్సటీ ఓ ఆర్టీఐ దరఖాస్తుకిచ్చిన జవాబులో తెలిపింది. ఒక రాష్ట్రం.. ఇద్దరు హోం సెక్రటరీలు ఒకే కార్యాలయం.. ఒకే పదవి.. అధికారులు మాత్రం ఇద్దరు.. ఇద్దరూ విధులు నిర్వర్తించారు. మరి సిబ్బంది ఎవరి మాట వినాలి? ఒకరేమో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆమోదమున్న అధికారి. మరొకరేమో సాక్షాత్తూ సీఎం నియమించిన అధికారి.. ఢిల్లీలో ఈ సంకటం నెలకొంది. ఢిల్లీ హోం శాఖలో కార్యదర్శి పదవిలో ఇద్దరు అధికారులు ఒకేసారి విధులు నిర్వర్తించారు. అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారి నియామకం నేపథ్యంలో ఎల్జీ ఆదేశాలను పాటించిన ఢిల్లీ హోం కార్యదర్శి ధరమ్పాల్ను ఆప్ సర్కారు బదిలీ చేసి మరో అధికారి రాజేంద్ర కుమార్ను ఆ పదవిలో నియమించింది. అయితే పాల్ బదిలీ చెల్లదని.. ఎల్జీ చెప్పటంతో.. బుధవారం ఇద్దరు అధికారులూ తానే హోం కార్యదర్శినంటూ విధులు నిర్వర్తించారు