Lease
-
అభిషేక్ బచ్చన్కు ఎస్బీఐ నుంచి భారీ ఆదాయం
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. గురు, ధూమ్, దోస్తానా, హ్యాపీ న్యూ ఇయర్, బంటీ ఔర్ బబ్లీ వంటి చిత్రాలలో తన నటనతో గుర్తింపు పొందారు. అభిషేక్ నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రీడలలోనూ చురుకుగా పాల్గొనే ఆయనకు వివిధ క్రీడా జట్లలో వాటాలు ఉన్నాయి.ఎస్బీఐ నుంచి నెలకు రూ.18లక్షలుదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అభిషేక్ బచ్చన్కు ప్రతి నెలా రూ. 18 లక్షలు చెల్లిస్తుందని మీకు తెలుసా? అభిషేక్ బచ్చన్, విశ్వ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే ఒక కుమార్తె ఉంది.రూ.280 కోట్ల నెట్వర్త్ ఉన్న అభిషేక్ బచ్చన్ తమ విలాసవంతమైన జుహు బంగ్లా, అమ్ము, వాట్స్ భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లాభదాయకమైన లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎస్బీఐ ఈ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇది బచ్చన్ కుటుంబానికి గణనీయమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుంది.రియల్ ఎస్టేట్ ఒప్పందాలను బయటపెట్టే జాప్కీ (Zapkey.com) అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బచ్చన్ కుటుంబం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదిరింది. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బ్యాంకు నుంచి నెలవారీ అద్దె రూ.18.9 లక్షలు తీసుకుంటున్నారు. ఈ అద్దె కాలానుగుణంగా పెరుగుదలకు సంబంధించిన క్లాజులు కూడా లీజులో పత్రాల్లో ఉన్నాయి. అద్దె ఐదేళ్ల తర్వాత రూ. 23.6 లక్షలకు, పదేళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. నివేదికల ప్రకారం.. బచ్చన్ కుటుంబ నివాసమైన ‘జల్సా’కు సమీపంలో ఉన్న భవనంలో 3,150 చదరపు అడుగుల స్థలాన్నే ఎస్బీఐ లీజుకు తీసుకుంది. -
రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'ఫేస్బుక్' (Facebook) తన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజును మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం రెండు లీజింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పుడు కంపెనీ నెలకు రూ.2.8 కోట్లు అద్దె చెల్లించనుంది.హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్ సిటీలోని ది స్కైవ్యూలో ఉన్న మొత్తం ఆఫీస్ స్పేస్ 3.7 లక్షల చదరపు అడుగులు. ఇప్పటి వరకు కంపెనీ దీనికోసం నెలకు రూ. 2.15 కోట్ల అద్దె చెల్లించింది. ఇప్పుడు అద్దె రూ. 2.8 కోట్లకు చేరింది. ఈ లెక్కన కంపెనీ ఐదేళ్ల కాలనికి చెల్లించాల్సిన అద్దె రూ.168 కోట్లు.మొత్తం లీజు వ్యవధి ఐదు సంవత్సరాలు.. దీని కోసం కంపెనీ రూ.16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ను చెల్లించింది. అయితే 2026 నుంచి అద్దె మరో 15 శాతం పెరుగుతుందని ఒప్పందంలో పేర్కొన్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఐదేళ్ల తరువాత అద్దె మరింత పెరుగుతుందని స్పష్టమవుతోంది.వేగంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగంరియల్ ఎస్టేట్ (Real Estate) రంగం వేగంగా పెరుగుతోంది. దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.. అద్దెకు ఆకాశాన్నంటుతున్నాయి. న్యూస్ పోర్టల్ ప్రకారం.. 2019లో హైదరాబాద్లోని హైటెక్ సిటీలో అద్దె నెలకు రూ. 23,000. ఈ అద్దె 2023లో రూ. 27,500కు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే అద్దె సుమారు 19 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!హైదరాబాద్లో ఐటీ హబ్గా.. బెంగళూరుకు గట్టి పోటీనిస్తుంది. ఇక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు ఐటీ, ఆర్థిక సేవలకు నెలవు. ఆఫీస్ స్పేస్ కూడా.. సాధారణంగా హైటెక్ సిటీలో సగటున అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. అనరాక్ డేటా ప్రకారం.. కొండాపూర్లో 2019 - 23 మధ్యలో అద్దెలు 19 శాతం పెరిగాయి. గచ్చిబౌలిలో 20 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది ఆగస్టులోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా హైదరాబాద్లోని తన ఆఫీస్ స్పేస్ డీల్ పునరుద్ధరణ చేసుకుని నెలకు రూ. 2 కోట్ల రెంట్ చెల్లించేలా డీల్ కుదుర్చుకుంది. -
'మాన్సాస్' కౌలు కిరికిరి
తగరపువలస (విశాఖ): అవి ఏడెనిమిది తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములు.. వాటికి పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ఏనాడూ కౌలు వసూలు చేయలేదు.. ఇప్పుడు ఉన్న పళంగా ఎవరికీ చెప్పాపెట్టకుండా గ్రామసభ పెట్టి కౌలు వేలం నిర్వహిస్తామని ఏకపక్షంగా ప్రకటించేశారు. పైగా గతంలో వన్టైమ్ సెటిల్మెంట్కు వచ్చి ఇప్పుడు ఆ మాట మార్చేశారు. దీంతో ఆ భూములు సాగుచేసుకుంటున్న రైతులు మండిపడుతున్నారు. ఈ కలవరపాటుకు కారణం విశాఖ జిల్లాలో ‘మాన్సాస్’ ట్రస్ట్ తాజా వ్యవహారం. విషయం ఏమిటంటే.. ఆనందపురం మండలం బోని పంచాయతీలో మాన్సాస్ ట్రస్ట్కు 614.97 ఎకరాల భూములున్నాయి. వీటికి సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జూలై ఒకటి నుంచి మూడో తేదీ వరకు లైసెన్సు హక్కులు నిర్ణయించనున్నారు. బహిరంగ వేలం ద్వారా నిర్ణయించనున్న ఈ ట్రస్ట్ భూములకు సంబంధించి మాన్సాస్ ప్రతినిధులు, ఆనందపురం రెవెన్యూ అధికారులు బోని పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం గ్రామసభ నిర్వహించారు. మాన్సాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల అభివృద్ధికి గాను ఈ కౌలు ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు రైతులకు తెలిపారు. కొన్నాళ్లుగా రైతులెవరూ కౌలు చెల్లించకపోవడంతో మాన్సాస్ లక్ష్యం దెబ్బతింటోందని దీనికి కౌలు రైతులంతా సహకరించకపోతే తాము మరోదారిలో వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.మాన్సాస్ భూములు కేవలం కౌలుకు మాత్రమేనని విక్రయానికి సాధ్యపడదని రైతులకు తెలిపారు. ఎవరైనా వన్టైమ్ సెటిల్మెంట్ పేరుతో వచ్చినా నమ్మవద్దని తెలిపారు. వ్యవసాయానికి అయితే ఏడాదికి ఎకరాకు రూ.5వేలు.. ఇటుక బట్టీలకైతే ఇంకా ఎక్కువ ధర నిర్ణయించనున్నట్లు మాన్సాస్ ప్రతినిధులు తెలిపారు. సాగు హక్కులు కావాలంటూ రైతుల పట్టు.. పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఇనాం రైతులకు ఇచ్చినట్లే తమకు కూడా మాన్సాస్ సాగు హక్కులు ఇవ్వాలంటూ కౌలు రైతులు పట్టుబట్టారు. గతంలో మాన్సాస్ ప్రతినిధులు రైతులతో వన్టైమ్ సెటిల్మెంట్కు వచ్చినట్లు గుర్తుచేశారు. అసలు ఇక్కడి భూముల్లో బంజరు, ఇనాం, మాన్సాస్లకు చెందినవి విడివిడిగా చూపించాలన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి తమ ఏడెనిమిది తరాల వారు ఈ భూములను సాగు చేసుకుంటున్నట్లు వారంతా గుర్తుచేశారు. నిజానికి.. 18 ఏళ్లకు పైగా మాన్సాస్ ట్రస్ట్ తమ నుంచి కౌలు వసూలు చేయడంలేదని.. అంతకుముందు ఏడాదిలో ఎకరాకు రూ.20 నుంచి రూ.50 కౌలు మించేది కాదన్నారు. ఆరి్థకంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన తమపై కౌలు పేరుతో చెల్లించలేనంత భారాన్ని మోపితే సహించబోమన్నారు. దీంతో గ్రామసభ మరోమారు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పుడు కౌలు అడగడం సరికాదు.. ముగ్గురు ఆడపిల్లలు, భార్య, నేను కలిసి ఎకరా భూమి సాగుచేసుకుంటున్నాం. మాకు తాతముత్తాతల నుంచి ఈ భూమే ఆధారం. ఇప్పుడొచ్చి ఏడాదికి రూ.5 వేలు కౌలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం సరిగాలేదు. – కాళ్ల నారాయణ, కౌలు రైతు, బోని గ్రామం ముందస్తు సమాచారమే లేదు.. ముందుగా సర్పంచ్, ఎంపీటీసీలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వలేదు. వాళ్లంతట వాళ్లే కరపత్రాలు ఈరోజు పట్టుకొచ్చి గ్రామసభలో పంచిపెట్టారు. కౌలు రైతులు ఎవరూ ఇందుకు సిద్ధంగా లేరు. – బోని ముకుంద, కౌలు రైతు, బోని గ్రామం కౌలు భూములకు కమర్షియల్ ధరలా? మేం సాగు చేసుకుంటున్న భూములపై సాగు హక్కులు కల్పించాలి. అప్పుడే మా కుటుంబాలకు భద్రత. కౌలు భూములకు కమర్షియల్ ధరలంటూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. – సూరకత్తుల వెంకట్రావు, కౌలు రైతు, బోని గ్రామం రైతులను వేధిస్తే ఊరుకోం.. 1971లో గరీబ్ హఠవో ద్వారా ఇందిరాగాంధీ.. 1986లో దున్నేవాడిదే భూమిపై హక్కులు అంటూ ఎన్టీఆర్.. 30 ఏళ్లు సాగులో ఉండేవారికి భూమిపై అన్ని హక్కులు సంక్రమిస్తాయని చెప్పారు. 1956లో ట్రస్ట్లన్నింటినీ ప్రభుత్వం రద్దుచేసింది. 1958లో పుట్టుకొచ్చిన మాన్సాస్పై చాలా కేసులున్నాయి. చాలా ఏళ్ల తరువాత వచ్చి ఇప్పుడు కౌలు కట్టాలని రైతులను వేధిస్తే ఊరుకోం. – బోని సోంబాబు, కౌలు రైతు, బోని గ్రామం వన్టైం సెటిల్మెంట్పై మాటమార్చారు.. మా బోని గ్రామ పంచాయతీ ప్రజలంతా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వాలు కల్పిస్తున్న వసతులతో కౌలు భూములు సాగుచేసుకుంటున్నాం. గతంలో మాన్సాస్ ప్రతినిధులు వన్ టైమ్ సెటిల్మెంట్కు వచ్చారు. ఇప్పుడు కాదంటున్నారు. – మద్దిల తాతినాయుడు, కౌలు రైతు, బోని గ్రామం -
సంద్రంలో ‘విండ్ పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు, వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటన్నిటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్–2023ను తాజాగా ప్రకటించింది. సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం జరిగే సర్వేకు మూడేళ్లు ఉన్న గడువును ఐదేళ్లకు పెంచింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్వాహకులు మెగావాట్కు రూ.1లక్ష సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలని చెప్పింది. అయితే ఇది రిఫండబుల్ అని స్పష్టం చేసింది. థర్మల్ కంటే ఖర్చు తక్కువ పవన శక్తి సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకి చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడంలో సహాయపడుతోంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) విశ్లేషణ ప్రకారం.. విండ్ పవర్ వృద్ధి రేటు వచ్చే దశాబ్దంలో 15 శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దేశంలోని సముద్రంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్ విక్రయానికి ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. రాష్ట్రంలో సముద్రం అనుకూలం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 8,998.323 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్ 4,083.37 మెగావాట్లుగా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పుణె)కి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్ర ప్రాంతాల్లో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. -
టీడీపీ నేతల గ‘లీజు’ దందా
చిత్తూరు అర్బన్: మునిసిపల్ స్థలాన్ని కొట్టేసేందుకు బినామీ పేరుతో టీడీపీ నేతలు సాగించిన గలీజు దందాకు అడ్డుకట్ట పడింది. మంగళవారం చిత్తూరులోని ఎంఎస్ఆర్ మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్లోని వాణిజ్య సముదాయాన్ని మునిసిపల్ కమిషనర్ అరుణ, అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 2016లో చిత్తూరుకు చెందిన టీడీపీ కార్పొరేటర్, ఓ క్రియాశీలక నేత.. జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న మునిసిపల్ ఖాళీ స్థలంపై కన్నేశారు. ఇందులో భాగంగా కమలహాసన్ అనే వ్యక్తి పేరుతో అప్పటి మేయర్కు లేఖ రాశారు. తనకు ఎలాంటి ఆసరా లేదని, మునిసిపల్ స్థలం లీజుకు ఇస్తే బతుకుదెరువు చూసుకుంటానని అందులో పేర్కొన్నారు. ఆ వెంటనే మునిసిపల్ కౌన్సిల్ రూ.కోట్ల విలువైన స్థలాన్ని ఏటా రూ.15 వేలు చెల్లించేలా మూడేళ్ల పాటు లీజుకిచ్చింది. ఆ వెంటనే టీడీపీ నేతలు చిత్తూరులోని ఎంఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పరిధిలో.. ఏడు దుకాణాలు నిర్మించారు. వాటిని ఏటా రూ.70 వేల వరకు అద్దెలకు ఇచ్చారు. అడ్వాన్సుల పేరుతో రూ.లక్షలు వసూలు చేశారు. మూడేళ్ల లీజు పూర్తయినా స్థలాన్ని మునిసిపాలిటీకు అప్పగించకుండా రూ.లక్షలు దండుకున్నారు. ఇదే సమయంలో లీజు పొడిగించాలంటూ హైకోర్టుకు వెళ్లగా.. కొన్నాళ్ల పాటు స్టే ఇచ్చింది. తాజాగా న్యాయస్థానం స్టేను డిస్మిస్ చేయడంతో రూ.కోట్ల విలువైన స్థలాన్ని, వాణిజ్య సముదాయాన్ని మునిసిపల్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. -
బాలీవుడ్ స్టార్ బిల్డింగ్లో సూపర్మార్కెట్: నెలకు అద్దె ఎంతో తెలుసా?
ముంబైలోని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు చెందిన ఇంటిని IIT గ్రాడ్యుయేట్లు లీజుకు తీసుకున్నారు. ఇక్కడ సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేశారు. ముంబైలోని శాంతాక్రూజ్ పరిసరాల్లో సల్మాన్ నాలుగంతస్తుల కమర్షియల్ బిల్డింగ్లో "ఫుడ్ స్క్వేర్" అనే సూపర్ మార్కెట్ కొలువు దీరింది. మయాంక్ గుప్తా, లలిత్ ఝవార్ ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లు దీన్ని షురూ చేశారు. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం లీజుకు తీసుకున్న 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లకు గాను నెలకు అద్దె రూ. 90 లక్షలు. తొలి 12 నెలలకు అద్దె రూ. 90 లక్షలు. ఏడాది తర్వాత రూ. 1 కోటికి పెరుగుతుందని భవిష్యత్తులో మరింత పెరగవచ్చని తెలుస్తోంది. స్వయంగా రైతులమైన తమకు గత ఐదేళ్లకు పైగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆక్వాపోనిక్స్, స్థిరమైన నేల ఆధారిత వ్యవసాయ క్షేత్రాలను నిర్వహిస్తున్న అనుభవం ఉందని ఫుడ్ స్క్వేర్ జనరల్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు మయాంక్ గుప్తా తెలిపారు. "ఫుడ్ స్క్వేర్" ప్రపంచం నలుమూలల నుండి పండ్లు, కూరగాయలను అందిస్తుంది, 350 రకాల చీజ్లను కూడా అందిస్తుంది. గుప్తా, ఝవార్ 2019లో భారతదేశంలోని కొల్హాపూర్లో "ల్యాండ్క్రాఫ్ట్ ఆగ్రో"ని స్థాపించగా ఇప్పటివరకు 3.6 మిలియన్ల పెట్టుబడులను సాధించగలిగారు. 2012లో దాదాపు రూ. 120 కోట్లతో ఆస్తిని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో దీన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన ఫుల్హాల్కు జూలై 2017లో లీజుకు ఇచ్చారు. సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ఈ రిటైల్ చైన్ ఫుడ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ సల్మాన్కు కూడా రూ.2.40 కోట్లు బకాయిపడింది. దీంతో తమ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏప్రిల్లో సల్మాన్ఖు అనుకూలంగా తీర్పు రావడంతో కొన్ని నెలల క్రితం ఫుడ్ హాల్ ఖాళీ చేసింది. ఇప్పుడు ఈ స్థానంలో ఫుడ్ స్క్వేర్ ఈ స్థానంలో చేరింది. సల్మాన్ ఖాన్ నికర విలువ పలు నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ నికర విలువ 2850 కోట్లు. సినిమాలతోపాటు, సల్మాన్ పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోట్లాది రూపాయిలు ఆర్జిస్తాడు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం రూ.6 నుంచి 7 కోట్లు వసూలు చేస్తాడు. వార్షిక సంపాదన దాదాపు రూ.220 కోట్లు. ఆదాయం నెలకు 16 కోట్లు. సల్మాన్కు ముంబైలో ఆస్తి ఉండటమే కాకుండా దుబాయ్లో కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న సంగతి తెలిసిందే. -
ట్రంప్ టవర్స్లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్వుతారు
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ అలియా భట్ పూణెలోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నారన్న వార్తలు మీడియాలో సందడి చేస్తున్నాయి. పూణేలోని ట్రంప్ టవర్స్లోని దాదాపు 7,000 చదరపు అడుగుల అపార్ట్మెంట్కు వార్షిక అద్దెగా రూ. 48 లక్షలకు లీజుకు తీసుకున్నారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్తో కలిసి ఇటీవల న్యూయార్క్ నుండి తిరిగి వచ్చిన రణబీర్ ఈ అపార్ట్మెంట్ లీజ్కు తీసుకోవడం వార్తల్లో నిలిచింది. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) పూణేలోని కళ్యాణి నగర్లోని ట్రంప్ టవర్స్లోని 10వ అంతస్థులో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్ని మూడు సంవత్సరాల పాటు నెలవారీ అద్దెకు రూ. 4 లక్షలు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, అపార్ట్మెంట్ను పూణేకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ వెహికల్ కాంపోనెంట్ పరిశ్రమలోని ప్రముఖ తయారీదారు డ్యూరోషాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అద్దెకు తీసుకున్నారు. లీజు అండ్ లైసెన్స్ ఒప్పందంపై సెప్టెంబర్ 15, 2023న సంతకం చేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా రూ. 24 లక్షల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్కూడా చెల్లించారు. మొదటి ఏడాది రూ.4 లక్షలు, రెండో ఏడాది రూ.4.2 లక్షలు, మూడో ఏడాది నెలకు రూ.4.41 లక్షలు నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. (పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?) మరోవైపు రణబీర్ అప్కమింగ్ మూవీ యానిమల్ డిసెంబరు 1న రిలీజ్కు సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెండు విభిన్నమైన లుక్స్లో కనిపించనున్నారు రణబీర్. ఈ సినిమాలో రష్మిక మందన్న, బాబీ డియోల్ , అనిల్ కపూర్ కూడా నటించారు. గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న రణబీర్ ,అలియా భట్ రాహా అనే కుమార్తె ఉంది. కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్లో నెలకు దాదాపు రూ. 1.5 లక్షల అద్దెకు మూడేళ్లపాటు ఒక ఫ్లాట్ను లీజుకు తీసుకున్నాడు. పూణేలోని ఈ జంట టవర్లు ఇండియాలో తొలి ట్రంప్ టవర్స్. 23 అంతస్తుల ఈ ట్రంప్ టవర్లను అతుల్ చోర్డియా నేతృత్వంలోని పంచశిల్ రియాల్టీ అభివృద్ధి చేసింది. -
రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం
ముంబై: మెగా పట్టణాల్లో రిటైల్ స్థలాల లీజు పరిమాణం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15 శాతం పెరిగినట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. హోమ్వేర్, డిపార్ట్మెంట్ స్టోర్లు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ రిటైలర్ల నుంచి లీజింగ్కు డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో 14.6 శాతం మేర రిటైల్ లీజింగ్ పెరిగింది. మొత్తం లీజు పరిమాణం 0.21 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం ముంబైలో 0.18 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. మొత్తం తాజా లీజు పరిమాణంలో హోమ్వేర్, డిపార్ట్మెంట్ స్టోర్ల వాటా 20 శాతంగా ఉంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ వాటా 17 శాతం మేర నమోదైంది. టాప్ డీల్స్లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో 20,800 ఎస్ఎఫ్టీ స్థలాన్ని కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ లీజుకు తీసుకోవడం ఒకటి. అలాగే, కస్తూరి రీజియస్లో 13,500 ఎస్ఎఫ్టీని పాంటలూన్ లీజుకు తీసుకోగా, విశ్వరూప్ ఐటీ పార్క్లో 10,800 ఎస్ఎఫ్టీని క్రోమా తీసుకుంది. దేశవ్యాప్తంగా 24 శాతం అప్ దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 24 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 2.9 మిలియన్ ఎస్ఎఫ్టీని సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో 15 శాతం వృద్ధితో పోల్చి చూసినప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో లీజు పరిమాణంలో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ పట్టణాల వాటాయే 65 శాతంగా ఉంది. రానున్న కాలంలోనూ రిటైల్ లీజింగ్ మంచి వృద్ధిని చూస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. మాల్ సరఫరాకు తోడు, పండుగల సీజన్లో వినియోగ డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందన్నారు. 2023 మొత్తం మీద రిటైల్ లీజు పరిమాణం 5.5–6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని సీబీఆర్ఈ ఎండీ రామ్ చంద్నాని పేర్కొన్నారు. 2019లో 6.8 మిలియన్ చదరపు అడుగుల లీజు అనంతరం ఇదే అధికమన్నారు. -
అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే?
HDFC: ప్రపంచ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి అమాంతం ముందుకు దూసుకెళుతోంది. ఈ కారణంగా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లకు చేరిన సంగతి తెలిసింది. కాగా అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో ఒక బ్యాంకు నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లిస్తూ ఐదు సంవత్సరాల అగ్రిమెంట్తో ఆఫీస్ స్పేస్ లీజుకి తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నెలకు రూ. 1.62 కోట్లు అద్దె.. నివేదికల ప్రకారం.. హెచ్డీఎఫ్సీ ముంబైలోని వన్ ఇంటర్నేషనల్ సెంటర్లో తన ఆఫీస్ కోసం 64,337 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలానికి నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లించడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీని కోసం సంస్థ ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తరువాత అగ్రిమెంట్ కాలవ్యవధి పెరుగుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. బ్యాంకు 7వ అంతస్తులో మూడు యూనిట్లు, 8వ అంతస్తులో రెండు యూనిట్లను లీజుకు తీసుకుంది. ఇవి టవర్స్ 2, 3లో ఉన్నాయి. ఈ డీల్ కోసం బ్యాంక్ దాదాపు రూ.9.73 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అయితే అద్దె సంవత్సరానికి 4.5 శాతం పెరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ఐదు సంవత్సరాలకు అద్దె ఇలా.. దీని ప్రకారం మార్చి 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అద్దె రూ. 1.62 కోట్లు. 2024 ఆగష్టు 1 నుంచి 2025 జూలై 31 వరకు అద్దె నెలకు రూ.1.69 కోట్లు. 2025 ఆగష్టు 1 నుంచి 2026 జూలై 31 వరకు అద్దె రూ. 1.77 కోట్లు. 2026 ఆగష్టు 1 నుంచి 2027 జులై 31 వరకు అద్దె రూ.1.85 కోట్లు ఉండనున్నట్లు సంస్థ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! గత కొన్ని రోజులకు ముందు హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అద్దె రూపాయి మాత్రమే!
రాజంపేట: దాదాపు రూ.10కోట్లు విలువ చేసే పురపాలక స్థలానికి నేటి అద్దె రూపాయే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవునండి నిజం .. ఇది ఎక్కడో కాదు.. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని పాతబస్టాండు నడిబొడ్డున తిరుపతి వైపు ఉన్న వంకదారి సత్యనారాయణ పెట్రోలు బంకు కథ.. కాస్ట్ ఆఫ్ లివింగ్ టౌన్గా పిలువబడే రాజంపేటలో ఇంటి బాడుగులు ఆకాశంలో ఉంటాయి. అలాంటిది ఏకంగా 19సెంట్ల స్థలానికి 69 ఏళ్లుగా కొనసాగుతున్న రూపాయి అద్దె వ్యవహారం బట్టబయలైంది. ఈ విషయాన్ని పురపాలకసంఘం కౌన్సిల్ సీరియస్గా తీసుకుంది. ఈమేరకు శుక్రవారం చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్లో ఈ పెట్రోలు బంకును స్వాధీనం చేసుకోవాలని తీర్మానం చేశారు. లీజు వ్యవహారం ఇలా.. 1954లో సర్వే నంబరు 961/ఏలో రాజంపేట పురపాలకసంఘం(అప్పట్లో మేజర్ పంచాయతీ)కి సంబంధించిన 19 సెంట్ల స్థలాన్ని వంకదారి సత్యనారాయణ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అప్పట్లో కేవలం రూపాయి అద్దెతో ఆ స్థలాన్ని కేటాయించారు. అయితే నేటి వరకు అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో పెట్రోలు బంక్ను ఏర్పాటు చేశారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లీజుకు తీసుకుంది. స్థలానికి సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ కాలం ముగిసి కొన్ని సంవత్సరాలు అవుతోంది. నోటీసులు ఇచ్చినా కానరాని స్పందన.. సుమారు 40 సంవత్సరాలుగా రూపాయి కూడా అద్దె చెల్లించకుండా ఉచితంగా పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో చైర్మన్ పోలా రంగప్రవేశం చేశారు. కమిషనర్ జనార్దన్రెడ్డి నోటీసులు జారీ చేశారు. వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇందుకు నిర్వాహకులు రెండు మాసాలు గడువు కోరారు. రెండు నెలలు పూర్తి అయినా పెట్రోలు బంకు నిర్వాహకులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. కేవలం రూపాయి అద్దెతో కోట్లు విలువ చేసే స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు తమ ఆధీనంలో ఉంచుకోవడంతో మున్సిపాలిటీ లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. పురపాలక స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం పురపాలక సంఘం నిబంధనల మేరకు స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఆ విధంగానే కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. స్థలం నిర్వాహకులకు అనేక మార్లు నోటీసులు ఇచ్చారు. వారు ఏ మాత్రం స్పందించలేదు. పురపాలక సంఘం స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల పరోక్షంగా ఆదాయ వనరులు పెంచుకునేందుకు వీలుంటుంది. –పోలా శ్రీనివాసులరెడ్డి,చైర్మన్, పురపాలక సంఘం, రాజంపేట -
ఔటర్ లీజుపై రాష్ట్రపతికి లేఖ
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడాన్ని కట్టడి చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాస్తామని, కోర్టుకు కూడా వెళ్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓఆర్ఆర్ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి 30 ఏళ్ల పన్నులను ఒకేసారి తీసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలి? రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భట్టి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగుతోంది. బుధవారం ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదగిరిగుట్టలో ఆటో కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం గొల్లగుడెసెలు, దాతరుపల్లి గ్రామాల మీదుగా యాత్ర భువనగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. బస్వాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న నృసింహసాగర్ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యలను ఆలకించారు. రిజర్వాయర్ కట్టపై మీడియాతో మాట్లాడుతూ ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఎకరానికి రూ.50–60 లక్షల ధర ఉంటుందని పేర్కొన్న సీఎం కేసీఆర్.. ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఎట్లా ఇస్తారని నిలదీశారు. భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి కోటిన్నర పరిహారం ఇవ్వాలన్నారు. -
ఓఆర్ఆర్ లీజులో భారీ కుంభకోణం ఆరోపణలు.. పూర్తి వివరాలు ఇవిగో!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డు లీజు అంతా పారదర్శకమని, కేంద్రం ఆమోదంతో జాతీయ రహదారుల సంస్థ గుర్తించిన టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానాన్ని పాటించినట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ తెలిపారు. 30 ఏళ్ల లీజుపై తాము నిర్ణయించిన బేస్ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు వెల్లడించారు. పోటీలో ఉన్న నాలుగు సంస్థల్లో ఇదే ఎక్కువ మొత్తమని చెప్పారు. బేస్ప్రైస్ విషయంలో సాంకేతికంగానే గోప్యత పాటించినట్లు పేర్కొన్నారు. ఔటర్ లీజులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే.. బిడ్డింగ్లో లోపాల్లేవ్.. . ♦ జాతీయ రహదారుల సంస్థ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6 బండిల్స్లో సుమారు 1600 కిలోమీటర్లను టీఓటీ ప్రాతిపదికన 15 నుంచి 30 ఏళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చిన పద్ధతినే ఔటర్ విషయంలో అనుసరించాం. రెవెన్యూ మ ల్టిఫుల్ పరంగా దేశంలోని రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ప్రాజెక్టుల కోసం ఖరారు చేసిన వాటిలో ఔటర్ లీజు అత్యుత్తమ బిడ్. ♦ హైదరాబాద్ మహానగరం చుట్టూ 8 లేన్లతో చేపట్టిన ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణం 2006లో ప్రారంభమైంది. 2012 నాటికి 79.45 కిలోమీటర్లు, 2018 నాటికి 158 కి.మీ పూర్తి చేశారు. 2012 నుంచే ఔటర్పై టోల్ వసూలు మొదలైంది. ఆ ఏడాది రూ.11.11 కోట్లు ఆదాయం లభించగా 2018 నాటికి రూ.340 కోట్లు, 2022 నాటికి రూ.542 కోట్ల చొప్పున ఆదాయం లభించింది. జాతీయ రహదారుల సంస్థ 2008లో విధించిన నిబంధనల మేరకు టోల్ రుసుము నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టోల్ రుసుముపై అదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ♦ కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ ప్రకారం ఔటర్ రింగ్రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతేడాది నవంబర్ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్డర్లు ఆసక్తి ప్రదర్శించారు. బిడ్డింగ్లో ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకతను పాటించేందుకు 142 రోజుల వ్యవధి ఇచ్చాం. పదేళ్లకోసారి సమీక్ష... ♦ ఐఆర్బీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చినప్పటికీ ప్రతి పదేళ్లకు ఒకసారి లీజును సమీక్షిస్తారు. రోడ్డు మరమ్మతులు, నిర్వహణ, టోల్ రుసుము, సిబ్బంది జీతభత్యాలు, ఆదాయ,వ్యయాలు, తదితర అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ సమీక్షను నిర్వహిస్తారు. ♦ టోల్ పెంపు పైన ఐఆర్బీ చేసే ప్రతిపాదనలు జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు లోబడి ఉంటాయి. హెచ్ఎండీఏ ఆమోదంతోనే అవి అమలవుతాయి. ఔటర్పైన పచ్చదనం నిర్వహణ పూర్తిగా హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును ఐఆర్బీ చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఔటర్పైన ఇంటర్చేంజ్ల వద్ద ఉన్న ట్రామాకేర్ సెంటర్లను ఐఆర్బీ నిర్వహించనుంది. ఐఆర్బీ సంస్థకు లీజు ఆమోదపత్రం అందజేశాం. 120 రోజుల్లోపు ఐఆర్బీ బిడ్డింగ్ మొత్తాన్ని (రూ.7380కోట్లు) ఏకమొత్తంలో చెల్లించిన అనంతరమే ఔటర్ను అప్పగిస్తాం. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఈగిల్ ఇన్ఫ్రా సంస్థే టోల్ వసూలు చేస్తుంది. ఎవరెంత బిడ్ వేశారంటే.. ♦ మొత్తం ఈ బిడ్డింగ్ ప్రక్రియలో 11 సంస్థల్లో చివరకు నాలుగు మాత్రమే అర్హత సాధించాయి. ‘ప్రస్తుతం టోల్ వసూలు చేస్తున్న ఈగల్ ఇన్ఫ్రా సంస్థ 30 ఏళ్ల ఔటర్ లీజుపై రూ.5634 కోట్లు, గవార్ కన్స్ట్రక్షన్స్ రూ.6767 కోట్లు, దినేష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.7007 కోట్లు చొప్పున బిడ్ వేశాయి. ఐఆర్బీ అత్యధికంగా రూ. 7380 కోట్లతో ముందుకు వచ్చింది. తాము నిర్ణయించిన బేస్ ప్రైస్ కంటే ఇది ఎక్కువగా ఉండడంతో ఐఆర్బీ హెచ్–1 కింద లీజు పొందింది. ♦ బేస్ ప్రైస్ ముందే నిర్ణయించినప్పటికీ ఎన్హెచ్ఏఐ నిబంధనలతో పాటు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందే లక్ష్యంతో బేస్ ప్రైస్ను గోప్యంగా ఉంచాం. ఓఆర్ఆర్పై వస్తున్న సుమారు రూ.541 కోట్ల ఆదాయాన్ని రెవెన్యూ మ ల్టిపుల్ ఫార్ములా (ఆర్ఎంఎఫ్) ప్రకారం లీజు మొత్తంతో హెచ్చించగా 30 ఏళ్లలో అది రూ.1.30 లక్షల కోట్లకు సమానమవుతుందన్నారు. ఔటర్ బిడ్డింగ్లో ఆర్ఎంఎఫ్ 13.64 వరకు వచ్చింది. టీఓటీ విధానంలో ఇది ఉత్తమ ఆర్ఎంఎఫ్. ప్రస్తుతం ఔటర్పై ప్రతి రోజు సగటున 1.6 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, రూ.1.48 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. -
కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రైవేటుకు ఓఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారమైన 158 కి.మీ. నెహ్రూ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లపాటు లీజుకు అప్పగించింది. టోల్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) ప్రాతిపదికన ఓఆర్ఆర్ నిర్వహణ లీజు కోసం హెచ్ఎండీఏ బిడ్లను ఆహ్వానించగా 11 అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. చివరకు నాలుగు సంస్థలు అర్హత సాధించగా జాతీయ రహదారుల నిర్వహణలో అతిపెద్ద సంస్థగా పేరొందిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7,380 కోట్లకు ఈ లీజును పొందింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్బీ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డ్ను (ఎల్ఓఏ)ను అందజేసింది. దేశంలోని అతిపెద్ద టీఓటీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. ఈ బిడ్ను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ తెలిపారు. ఏటేటా ఔటర్పై పెరుగుతున్న వాహనాల రద్దీ, టోల్ ద్వారా వస్తున్న ఆదాయం, ఓఆర్ఆర్ నిర్వహణ, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్పీవీ (నెట్ ప్రజెంట్ వాల్యూ) పద్ధతిలో లీజు మొత్తాన్ని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో టోల్ పెంపు వంటి అంశాలతోపాటు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో ఇచి్చన లీజులను కూడా ప్రామాణికంగా తీసుకున్నట్లు చెప్పారు. నిర్వహణ ఇక ప్రైవేట్ సంస్థదే.. ఇప్పటివరకు ఔటర్ రింగ్రోడ్డు నిర్వహణ హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఓఆర్ఆర్పై టోల్ వసూలుతోపాటు రోడ్లకు మరమ్మతులు, లైట్లు, పచ్చదనం, తదితర పనులన్నింటినీ హెచ్జీసీఎల్ పర్యవేక్షిస్తోంది. తాజా ఒప్పందం వల్ల ఆ బాధ్యతలన్నింటినీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనుంది. టోల్ ద్వారా వచ్చే ఆదాయం ఆ సంస్థకే లభించనుంది. ప్రస్తుతం ఔటర్పై నిత్యం సుమారు 1.3 లక్షల నుంచి 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్ వసూలు ద్వారా ఏటా సుమారు రూ. 452 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. ఏటా టోల్ రుసుమును కొంత మేరకు పెంచడం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ ఇప్పటివరకు టోల్ వసూలు చేస్తుండగా ఇకపై ఐఆర్బీ సంస్థ పరిధిలోకి వెళ్లనుంది. రహదారుల నిర్వహణలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు దేశంలో టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) పద్ధతి అత్యుత్తమ విధానంగా పేరొందింది. ఎన్హెచ్ఏఐ 2016 నుంచి ఈ పద్ధతిని అవలంబిస్తోంది. మొత్తం 1,600 కి.మీ.కిపైగా మార్గాన్ని ఈ పద్ధతిలో 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లీజుకు ఇచి్చంది. ఔటర్ లీజు విషయంలోనూ ఇదే పద్ధతిని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడులకు ఊతం: సీఎం కేసీఆర్ ఈ లీజు ఒప్పందంపట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా చక్కటి ఒప్పందమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులకు ఇది ఊతమిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపునకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, వ్యాపార సంస్థలకు అనుకూలమైన విధానాలను అమలు చేయడం వల్లే అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు తీస్తోందన్నారు. ఇదీ ఔటర్ స్వరూపం.. హైదరాబాద్ నగరం చుట్టూ 8 వరుసల్లో ఉన్న 158 కి.మీ. నిడివిగల ఔటర్ రింగురోడ్డు నిర్మాణం ఉమ్మడి ఏపీలో 2006లో మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని 2018లో పూర్తి చేసింది. ఔటర్కు 44 చోట్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉన్నాయి. 22 చోట్ల ఇంటర్ఛేంజ్లను ఏర్పాటు చేశారు. ఔటర్ మీదుగా రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చు. నెహ్రూ ఓఆర్ఆర్ నిడివి: 158 కిమీ. వరుసలు: 8 నిత్యం రాకపోకలు సాగించే వాహనాలు: 1.3 నుంచి 1.5 లక్షలు ఏటా టోల్ వసూలు: రూ. 452 కోట్లు (సుమారుగా). ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు.. పాతరోడ్లను కలుపుతూ.. -
ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్పోర్ట్స్ అథారిటీకి వేల కోట్లు
న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. (సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. -
గుట్టలు గుల్ల.. సర్కారు లీజు గోరంత.. తవ్వుకునేది గుట్టంతా
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘కొండలు పగలేసినం..బండలనూ పిండినం.. మా పదవులు అడ్డుపెట్టి ఉన్నకాడికి ఊడ్చుతం’’.. ఇదేంటీ యాభై ఏళ్ల క్రితం విప్లవ కవి చెరబండ రాజు అప్పటి దోపిడీ పీడనపై ఎక్కుపెట్టిన ‘కొండలు పగిలేసినం..’’అన్న కవితకు పూర్తి వ్యతిరేకంగా ఉంది అనుకుంటున్నారా? అవును..వ్యతిరేకమే..ఇప్పుడిలాగే ఉంది పరిస్థితి. అక్రమాలు సాగించే వారికి పదవుల్లో ఉన్నవారి అండా దండా తోడైతే ఇంక అడ్డేముంది? అందినకాడికి మనదే..అన్నట్టుగా కళ్ల ముందే కొండలన్నీ పిండి చేస్తున్నారు. సర్కారుకు కొసరంత సీనరేజీ కట్టి..కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో భూగర్భ వనరుల శాఖ కొండలు, గుట్టలను పలు సంస్థలకు లీజుకు ఇస్తుంటుంది. ఆయా సంస్థల నుంచి సీనరేజీ వసూలు చేస్తుంది. అయితే కొండ/గుట్టలో కొంత భాగం లీజుకు తీసుకుంటున్న అక్రమార్కులు మొత్తం కొండంతా తవ్వేస్తున్నారు. అధికారులెవరైనా ప్రశ్నిస్తే నయానో, భయానో వారిని చెప్పుచేతల్లో పెట్టుకుని మైనింగ్ జోన్ సహా, ఇతర ప్రాంతాల్లోనూ దందా కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాల్లో అడ్డూఅదుపూ లేని క్రషింగ్తో కొండలు కనుమరుగవుతున్నా, భారీయెత్తున సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వాస్తవ లీజును మించి పదింతల మైనింగ్! నిజామాబాద్ జిల్లాలో గుట్టల్ని మింగే ‘అనకొండలు’ బట్టాపూర్ కొండను ఆనవాళ్లే లేకుండా మింగేస్తున్నాయి. తీసుకున్న లీజును మించి పదింతల మైనింగ్, క్రషింగ్ చేస్తూ ఎవరడ్డొచ్చినా తగ్గేదేలేదంటున్నారు. ఈ జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న బట్టాపూర్ కొండ క్రషింగ్ వివరాల్లోకి వెళితే.. ఏర్గట్ల మండలం బట్టాపూర్ సర్వేనంబర్ 195/1లో 3.85 హెక్టార్లను 2016లో లీజుకు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుండి అనుమతి (కన్సెంట్ ఫర్ ఆపరేషన్) లేకుండానే గుట్టను తొలిచి క్రషింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు 13,686 క్యూబిక్ మీటర్ల మేరకే భూగర్భ శాఖ నుండి అనుమతి తీసుకుని సుమారు రూ.6.36 లక్షల సీనరేజీని చెల్లించారు. కానీ వాస్తవంగా సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కొండను తొలిచి కంకరగా మార్చి కోట్లలో సొమ్ము చేసుకున్నారు. జియో ట్యాగింగ్ ద్వారా ఫిట్ మెజర్మెంట్ పద్ధతిలో బట్టాపూర్ క్వారీలో పరిమితికి మించి తవ్వకం జరిగినట్లు అధికార యంత్రాంగం గుర్తించినా..దీని వెనక ఉన్న ముఖ్యనేత హెచ్చరికతో ఆ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటం లేదు. ఈ క్వారీలో పరిమితికి మించిన పేలుళ్ల కారణంగా బండరాళ్లు పంటపొలాల్లో, పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో పడుతున్నాయన్న ఫిర్యాదుతో.. ఓ మారు తనిఖీకి వచ్చిన కమ్మర్పల్లి ఎఫ్ఆర్వో ఆనంద్రెడ్డిని 24 గంటల్లోనే బదిలీ చేయించడంతో, ఇక ఏ ప్రభుత్వ శాఖ అధికారీ ఆ విషయం పట్టించుకోవడం లేదు. సామాన్యులు బకాయి పడితే వారం రోజులు కూడా ఉపేక్షించని విద్యుత్ అధికారులు.. ఈ వీవీఐపీ ఫిబ్రవరి, 2022 నుండి విద్యుత్ బిల్లు చెల్లించకపోయినా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు సంబంధిత సంస్థ ఎన్పీడీసీఎల్కు రూ.51.15 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా..ఆ వైపు వెళ్లేందుకు విద్యుత్ అధికారులు సాహసించటం లేదు. ఇది బట్టాపూర్ గుట్ట. ఇందులో అతి కొద్ది భాగాన్నే లీజుకు తీసుకున్నారు. (2015లో గూగుల్ ఎర్త్ చిత్రం ఇది) ప్రస్తుతం బట్టాపూర్ గుట్ట దాదాపు కనుమరుగైన పరిస్థితి. (2022లో గూగుల్ ఎర్త్ చిత్రం ఇది) అన్నిచోట్లా ఇదే తంతు.. ►రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సర్వే నంబర్ 268లో 680 ఎకరాల్లో ఉన్న మైనింగ్ జోన్లోనూ పలు అక్రమాలు చోటు చేసుకుంటు న్నట్లు ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వం నుండి లీజు మంజూరైన వాటిలో మెజారిటీ సంస్థలు తమ లీజులను అనధికారికంగా ఇతరులకు విక్రయించేశాయి. ఈ జోన్లోని మెజారిటీ లీజులు ఇద్దరు వ్యక్తుల చేతుల్లోకి వచ్చేశాయి. ►నిబంధనల మేరకు క్వారీ తవ్విన ప్రాంతాలను మళ్లీ మట్టితో నింపి చదును చేయాల్సి ఉండగా ఆ పని ఎవరూ చేయటం లేదు. ఇక మైనింగ్ కోసం ఏకంగా నాలుగు ఇంచుల బోర్లు వేస్తూ వాటిలో పేలుడు పదార్థాలు నింపి పేల్చేస్తున్నారు. తీసుకున్న లీజు పరిధిని మించి మైనింగ్ చేస్తున్నారు. జియో ట్యాగింగ్ ఫిట్ మెజర్మెంట్ పక్కాగా జరగటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ►సంగారెడ్డి జిల్లాలో మైనింగ్ క్వారీల పేలుళ్లతో భూ ప్రకంపనలు నిత్యకృత్యమయ్యాయి. పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల తదితర మండలాల్లోని క్వారీల్లోనూ తీసుకున్న అనుమతుల కంటే భారీ విస్తీర్ణంలో తవ్వకాలు చేస్తున్నారు.పరిమితికి మించిన పేలుడు పదార్థాలు వాడుతుండటంతో మాదారాం, లకుడారం గ్రామాల్లో ఇళ్లకు బీటలు పడుతున్నాయి. పంట పొలాలు దెబ్బతింటున్నాయి. ►క్వారీలు, క్రషర్ల నిర్వాహకులంతా కీలక ప్రజాప్రతినిధులు కావటం, వారు సిఫారసు చేసిన అధికారులే పర్యవేక్షకులు కావడంతో క్రషింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. -
తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను?
సాక్షి, హైదరాబాద్: బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ అద్దె బస్సులను కొనుక్కునే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3,100 అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు సొంతంగా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుతున్న విషయం తెలిసిందే. 2019లో ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వం వాటిని పెంచుకునేందుకు అనుమతించి టెండర్లు పిలవడంతో వాటి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కానీ ఇప్పుడు వాటిల్లో చాలా బస్సులు నడవటం లేదు. వాటిని కొనేందుకు ఆర్టీసీ ఆలోచిస్తోంది. వాటినే ఎందుకు? ఆర్టీసీ కొన్నేళ్లుగా సరిపడినన్ని బస్సులు కొనటం లేదు. 2015లో 800 బస్సులు కొనటం మినహా ఆ తర్వాత కొత్తవి సమకూర్చుకోలేకపోయింది. దీంతో క్రమంగా ఉన్న బస్సులు పాతబడి డొక్కుగా మారిపోయాయి. గత్యంతరం లేక వాటినే మరమ్మతు చేసుకుంటూ, నిత్యం మెయింటెనెన్స్ పనులు జరుపుతూ నెట్టుకొస్తోంది. కొన్ని సరిగా నడవని పరిస్థితి ఉంది. ఆదివారం వికారాబాద్ శివారులో అనంతగిరి గుట్ట దిగుతూ ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇది డొక్కు బస్సు కావటం వల్లనే అదుపు తప్పిందని కార్మిక సంఘాలు ఆరోపణలు ఎక్కుపెట్టాయి. ఇలాంటి బస్సులు దాదాపు రెండున్నర వేలున్నాయని పేర్కొంటున్నారు. ఇటీవలే 675 కొత్త బస్సుల కోసం టెండర్ల ప్రక్రియ ముగిసింది. అవి వచ్చే మార్చి నాటికి చేతికందబోతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న కొరతను అవి తీర్చలేవు. ఈ నేపథ్యంలో అద్దె బస్సులవైపు ఆర్టీసీ దృష్టి సారించింది. నిష్క్రమించినవి 600 కొన్ని నెలలుగా గిట్టుబాటు ఉండటం లేదంటూ అద్దె బస్సు నిర్వాహకులు క్రమంగా వైదొలుగుతూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 600 బస్సులు అలా అర్టీసీ నుంచి నిష్క్రమించాయి. ఇంకా చాలామంది యజమానులు వాటిని విరమించుకునే యత్నంలో ఉన్నారు. ఆరేడేళ్ల వయసున్న బస్సులను వారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ధరకు విద్యాసంస్థలు, ఇతర సంస్థలకు అమ్ముకుంటున్నారు. ఆర్టీసీ అదే కొత్త బస్సు కొనాలంటే రూ.35 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది. తక్కువ ధరలో వస్తున్నందున ఆ బస్సులను కొని సొంత వర్క్షాపులో మెరుగుపరిస్తే కనీసం ఏడెనిమిదేళ్ల వరకు ఇబ్బంది ఉండదనేది అధికారుల యోచన. ఆ బస్సుల కొనుగోలు ఎంతవరకు సరైన నిర్ణయమనేది తేల్చేందుకు ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చే నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ఈలోపు ఎన్ని అద్దె బస్సులు అమ్మకానికి ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం -
అద్దెకివ్వండి.. ఆదాయం పొందండి!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.1.32 లక్షల కోట్లకు చేరడంతో వాటి వసూలుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలకు ఓ మార్గాన్ని చూపింది. గతేడాది అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీరూల్స్–2021(ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్)కు కొనసాగింపుగా మరికొన్ని నిబంధనలను ప్రవేశపెడుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా రాష్ట్రాలు తమ ఆధీనంలోని విద్యుత్ సరఫరా నెట్వర్క్ను అమ్ముకునేందుకు, ఇతరుల నుంచి కొనుక్కునేందుకు, లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ వెసులుబాట్లతో విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని ఆర్జించి అప్పుల ఊబి నుంచి బయటపడతాయని కేంద్రం చెబుతోంది. నెట్వర్క్ సమస్యకు చెక్ ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్కో)కు ప్రస్తుతం 5,532.161 సీకేఎం(సర్క్యూట్ కిలోమీటర్ల) మేర 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎం మేర 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎం మేర 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. మొత్తంగా 400 కేవీ, 220 కేవీ,132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 354 ఉండగా, వాటి ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలకు ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిస్కంల ఆధీనంలోని ట్రాన్స్మిషన్ లైన్ల లీజుకు అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న లైన్లను అద్దె ప్రాతిపదికన ఇకపై ఎవరికైనా ఇవ్వొచ్చు. భవిష్యత్లో రానున్న ప్రైవేటు డిస్కంలకు నెట్వర్క్ సమస్యలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇదీ చదవండి: రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన! -
చిన్న దుకాణానికి రూ.1.72 కోట్ల లీజు.. ఒక్క అడుగు రూ.2.47 లక్షలు
ఇండోర్: గుడి ఆవరణలో కేవలం పూలు, పూజా సామగ్రి, ప్రసాదాలు విక్రయించే 69.50 చదరపు అడుగుల వైశాల్యమున్న చిన్నపాటి దుకాణాన్ని ఓ వ్యాపారి రూ.1.72 కోట్లకు 30 ఏళ్లపాటు లీజుకు దక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని ప్రఖ్యాత ఖజ్రానా గణేశ్ ఆలయ కాంప్లెక్స్లో ఈ లీజు వ్యవహారం చోటుచేసుకుంది. ‘1–ఎ’ దుకాణాన్ని లీజుకు ఇవ్వడానికి ఆలయ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. రూ.30 లక్షలు కనీస మొత్తంగా నిర్ణయించారు. వేలం పాటలో ఇది ఏకంగా రూ.1.72 కోట్లకు చేరింది. అంటే ఒక్కో చదరపు అడుగు స్థలం రూ.2.47 లక్షలు పలికింది. వాణిజ్య స్థలం లీజు కోసం ఈ స్థాయిలో ధర పలకడం అరుదైన సంఘటన అని చెప్పొచ్చు. ఖాజ్రానా వినాయక ఆలయానికి దర్శించుకొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక్కడ వ్యాపారం భారీగానే జరుగుతోంది. -
ఆఫీస్ స్థలం లీజింగ్ పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 1.61 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం వృద్ధి అని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. పరిమాణం పరంగా ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యధికమని వివరించింది. ‘లీజింగ్ లావాదేవీల పరిమాణం మహమ్మారికి ముందస్తు త్రైమాసిక సగటును 6 శాతం అధిగమించాయి. మొత్తం లీజింగ్ పరిమాణంలో బెంగళూరు అత్యధికంగా 45 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ నగరంలో లీజింగ్ 71 శాతం దూసుకెళ్లి 73 లక్షల చదరపు అడుగులుగా ఉంది. గత 18 నెలల్లో ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. కంపెనీలు కార్యాలయం నుంచి పని విధానాలను అమలు చేయడం వల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. ఈ ఏడాది వార్షిక లీజింగ్ పరిమాణం 2019 రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనాగా చెప్పారు. నగరాల వారీగా ఇలా.. ఆఫీస్ లీజింగ్ స్థలం ఢిల్లీ రాజధాని ప్రాంతంలో 23 శాతం పెరిగి 24 లక్షల చదరపు అడుగులు, ముంబై 82 శాతం ఎగసి 21 లక్షల చదరపు అడుగులు, అహ్మదాబాద్ రెండింతలై 7 లక్షల చదరపు అడుగులు, కోల్కత రెండింతలకుపైగా దూసుకెళ్లి 3 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఇక హైదరాబాద్ గతేడాదితో పోలిస్తే కార్యాలయ స్థలం లీజింగ్ 60 శాతం పడిపోయి 8 లక్షల చదరపు అడుగులు, పుణే 27 శాతం తగ్గి 7 లక్షల చదరపు అడుగులకు వచ్చి చేరింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల్లో కార్యాలయ స్థలం నూతనంగా 1.3 కోట్ల చదరపు అడుగులు జతకూడింది. ఇందులో బెంగళూరు 49 లక్షలు, హైదరాబాద్ 33 లక్షల చదరపు అడుగులు సమకూర్చాయి. మొత్తం లావాదేవీల్లో కో–వర్కింగ్ రంగం వాటా 23 శాతానికి చేరింది. చదవండి: Natural Gas Prices Hike: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు -
రైల్వే భూములు లీజు 35 ఏళ్లకు పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఇవాళ(బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రైల్వే భూముల్ని సుదీర్ఘకాలంగా లీజుకు ఇవ్వాలనే అంశంపై లైన్ క్లియర్ అయ్యింది. పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు లీజుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. అలాగే రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీజు కూడా ఆరు శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న లీజ్ పీరియడ్ను.. ఏకంగా 35 ఏళ్లకు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్కు మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. పీఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ కోసం 35 ఏళ్ల లీజుకు రైల్వేభూములు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. అయిదేళ్లలో 300 పిఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ నిర్మాణం చేపడతామని తెలిపారాయన. Union Cabinet has approved policy on long-term leasing of Railways' Land to implement PM Gati Shakti framework. 300 cargo terminals will be developed in 5 years: Union Minister Anurag Thakur on Union Cabinet decisions pic.twitter.com/i3VEwVSXYs — ANI (@ANI) September 7, 2022 ప్రైవేటీకరణలో భాగంగానే.. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాటాను కేంద్రం త్వరగతిన అమ్మేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న రైల్వే లీజ్ నిర్ణయాలు.. నీతి ఆయోగ్ సిఫారసుల ఆధారంగానే తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతకు ముందు నీతి ఆయోగ్.. 3 శాతం కంటే తక్కువగా రైల్వే ల్యాండ్ లీజింగ్ ఫీజు ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం కోసం చౌక ధరకు రైల్వే భూములను లీజ్కు ఇవ్వాలని, పీపీపీ పద్దతిలో రైల్వే భూములను ఆస్పత్రులు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఇవ్వాలని కూడా కేబినెట్ భేటీలో కేంద్రం నిర్ణయించింది. పీఎం శ్రీస్కూల్స్ కేంద్ర కేబినెట్లో ఇవాళ.. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. అలాగే.. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నడిపే స్కూళ్ల నుంచే పీఎం శ్రీ స్కూల్స్ను ఎంపిక చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో రూ. 27,360 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం, ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు ఉండనుంది. నూతన జాతీయ విద్యావిధానం అమలులో వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అనుభవాలు, ప్రాక్టీకల్స్ ఆధారంగా విద్యాబోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర కేబినెట్ భావిస్తోంది. ఇదీ చదవండి: హెలికాప్టర్ సర్వీస్ పేరిట కుచ్చు టోపీ -
రాష్ట్రంలోని సంస్థలకే దేవదాయ లీజులు
సాక్షి, అమరావతి: వ్యవసాయేతర భూములు మినహా దేవదాయ శాఖ పరిధిలో జరిగే లీజు ఒప్పందాలకు రాష్ట్ర పరిధిలో రిజిస్టర్ చేసుకున్న సంస్థలకే ప్రాధాన్యత ఇచ్చేలా లీజు నిబంధనలు మారుస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ అంశంపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల పాటు అవకాశం కల్పించినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధన అమలులోకి వస్తే.. రాష్ట్ర పరిధిలోని ఆలయాల్లో ఎలాంటి లీజు ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా మన రాష్ట్రంలోనే ట్యాక్స్ చెల్లించేలా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవతో పూజరి శైలజకు న్యాయం -
లీజు కట్టరు.. వాటా ఇవ్వరు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో పర్యాటక ఆధారిత ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఇటు లీజు మొత్తం, అటు ఆదాయంలో ప్రతిపాదిత వాటా చెల్లించకుండా బకాయిపడ్డ బడా సంస్థలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలో వాటి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి, బకాయి మొత్తం చెల్లించాల్సిందిగా గడువు విధించనుంది. చెల్లించని పక్షంలో ఆయా సంస్థలకు నీళ్లు, కరెంటు సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో నోటీసులు జారీ కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో స్థలాల కేటాయింపు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంస్థలు.. తమకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే హోటళ్లు, సినిమా హాళ్లు, గోల్ఫ్ కోర్సులు, ఇతర మనోరంజక ప్రాజెక్టులు నిర్మిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. దీంతో ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. అలాంటి వాటిల్లో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, జలవిహార్, స్నో వరల్డ్ లాంటి వాటితో పాటు మరెన్నో హోటళ్లు ఉన్నాయి. ఇవి లీజు మొత్తంతో పాటు రాబడిలో నిర్ధారిత వాటాను కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అలా కొన్ని సంస్థలు లీజు మొత్తం చెల్లిస్తుండగా, రాబడిలో కొంతమేర చెల్లిస్తూ వచ్చాయి. కొన్ని లీజు ఇస్తూ రాబడిలో వాటా చెల్లించటం లేదు. కొన్ని సంస్థలు లీజు మొత్తాన్ని కూడా సరిగా చెల్లించటం లేదు. ఇటీవల కోవిడ్ వల్ల ఆదాయం సరిగా లేదని చెప్తూ కొన్ని సంస్థలు లీజు మొత్తం ఇవ్వటం లేదు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.140 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఎన్నిసార్లు అడిగినా.. అధికారులు ఎన్నిసార్లు కోరినా నిర్వాహకులు బకాయిలు చెల్లించటం లేదు. దీంతో వాటిపై గట్టిగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని సంస్థలు కోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో, కోర్టు కేసులు కూడా సమసిపోయేలా చేసి తగు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ గురువారం అధికారులతో సమావేశమై చర్చించారు. బకాయి పడిన సంస్థలకు మంచినీరు, కరెంటు సరఫరా నిలిపివేసే విషయమై సంబంధిత విభాగాలకు లేఖలు రాయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఐదేళ్ల బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది....
5-Year-Old Girl Gives New Lease Of Life To Four: చండీఘడ్లోని ఐదేళ్ల బాలిక బ్రైయిన్ డెడ్ అయ్యి చనిపోయింది. అయితే ఆ బాధను దిగమింగుకుని మరి తల్లిదండ్రులు అవయదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అయితే ఆ బాలిక డిసెంబర్ 22న ఎత్తు నుండి పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణల కోసం పోరాడి చనిపోయింది. (చదవండి: 200 ఏళ్ల నాటి పండుగ... పిండి, కోడి గుడ్లతో చేసే తమాషా యుద్ధం!!) ఈ చిన్నారి ప్రాణాలతో బయటపడదని గ్రహించిన పీజీమర్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు ఆ చిన్నారి తండ్రిని సంప్రదించారు. అయితే ఆ తండ్రి ఎంతో గుండె నిర్భారాన్ని ప్రదర్శించి అవయదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో ఆ బాలిక శరీరం నుంచి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ వంటి అవయవాలను తీసుకున్నారు. దీంతో ముంబై, ఢిల్లీలో ఒక్కొక్కరు చండీఘడ్లోని ఇద్దరికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ క్రమంలో పీజీమర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్ ఎంతో ధైర్యంతో ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన ఆ బాలిక కుటుంబాన్ని ప్రశంసించడమే కాక ఇలాంటి చైతన్యం ఎందరో రోగుల ఆశాకిరణాన్ని నిలబెట్టడానికి దోహదడుతుందని అన్నారు. (చదవండి: వికటించిన పెడిక్యూర్.. బాధితురాలికి ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం) -
Mahindra : కొత్త కారు.. కొనక్కర్లేదు.. అద్దెతోనే నడిపేయండి
Mahindra Finance Vehicle Leasing & Subscription Business Under Quiklyz Brand: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ క్విక్లీజ్ పేరుతో లీజ్ ఆధారిత సబ్స్క్రిప్షన్ సేవలను పరిచయం చేసింది. ఆన్లైన్ వేదికగా రిటైల్, కార్పొరేట్ క్లయింట్లు లక్ష్యంగా అన్ని రకాల బ్రాండ్లకు చెందిన కార్లను అద్దె విధానంలో ఆఫర్ చేస్తుంది. ఎటువంటి ముందస్తు చెల్లింపు అవసరం లేదు. కనీస చందా నెలకు రూ.10,000 ఉంది. 24–60 నెలల కాలానికి కస్టమర్ తనకు నచ్చిన సరికొత్త కారును అద్దెకు తీసుకోవచ్చు. ఈ పద్దతిలో క్విక్లీజ్ వెబ్సైట్లో లాగిన్ అయి కారుతోపాటు కంపెనీ నుంచి ఎటువంటి సేవలు కావాలో ఎంచుకోవాలి. అవసరమైన పత్రాలు జతచేసి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే చాలు. స్టాక్నుబట్టి కొద్ది రోజుల్లోనే కస్టమర్ పేరునే వైట్ నంబర్ ప్లేట్తో ఇంటి ముంగిట వాహనం ఉంటుంది. కాల పరిమితి తర్వాత కారును వెనక్కి ఇవ్వొచ్చు. లేదా అదే వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మరో కారుకు అప్గ్రేడ్కూ అవ కాశం ఉంది. ఎనిమిది మోడళ్లు బుధవారం నాటికి ఎనిమిది బ్రాండ్లకు చెందిన 22 మోడళ్లు కొలువుదీరాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను జోడిస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్సహా ఎనిమిది నగరాల్లో క్విక్లీజ్ అందుబాటులో ఉంది. ఏడాదిలో 30 నగరాలకు సేవలను విస్తరించాలన్నది సంస్థ ఆలోచన. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: -
ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ... జాబితాలో ఉన్న తెలుగు రాష్ట్రాల ఆస్తులివే
National Monetisation Pipeline ప్రైవేట్ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దీని కింద కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 6 లక్షల కోట్ల విలువను రాబట్టనుంది. ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్’ చేయనుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వే కాలనీలతో పాటు ప లు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి. 2022–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. ఎన్ఎంపీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆవిష్కరించారు. నేషనల్ ఇన్ఫ్రా పైప్లైన్ (ఎన్ఐపీ) కార్యక్రమం కింద తలపెట్టిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఇది మరో అంచె పైకి తీసుకెడుతుందని విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు. ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్కి మాత్రమే ఎన్ఎంపీ పరిమితమని మంత్రి చెప్పారు. అమ్మేయడం లేదు.. ఎన్ఎంపీ విధానంలో యాజమాన్య హక్కులు లేదా స్థలం బదలాయింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రైవేట్ రంగం పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించడం ద్వారా ఆయా ఆస్తుల నుంచి మరింత విలువను రాబట్టడానికి వీలవుతుంది. అలాగే మానిటైజేషన్ ద్వారా వచ్చిన నిధులను .. మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుంది’’ అని పేర్కొన్నారు. ‘ఆయా అసెట్స్ యాజమాన్య హక్కులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత వాటిని తప్పనిసరిగా ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదో అమ్మేస్తోందంటూ గందరగోళపడాల్సిన అవసరం లేదు. ఈ బ్రౌన్ఫీల్డ్ అసెట్లు అన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి‘ అని ఆమె స్పష్టం చేశారు. విభాగాలవారీగా చూస్తే.. రహదారులు..: అసెట్ మానిటైజేషన్లో సింహభాగం వాటా రహదారుల విభాగానిదే ఉండనుంది. సుమారు రూ. 1.6 లక్షల కోట్ల విలువ చేసే 26,700 కి.మీ. మేర జాతీయ రహదారులను (ప్రస్తుతమున్నవి, కొత్తగా రాబోయేవి) మానిటైజ్ చేయనున్నారు. దీన్ని రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అమలు చేయనుంది. టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (టీవోటీ), ఇన్విట్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) రూపంలో ఇది ఉండనుంది. టీవోటీ విధానంలో టోల్ రాబడులను బిడ్డరు నుంచి ప్రభుత్వం ముందుగానే తీసుకుంటుంది. ఆ తర్వాత సదరు రహదారిని వినియోగించే వారి దగ్గర్నుంచి బిడ్డరు టోల్ ఫీజు వసూలు చేసుకుని, నిర్దిష్ట లీజు వ్యవధికి రహదారిని నిర్వహించి, తిరిగి ప్రభుత్వానికి బదలాయించాల్సి ఉంటుంది. ఇక రాబడులు అందించగలిగే ఇన్ఫ్రా అసెట్స్లో ఇన్విట్ల ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం ఉంటుంది. విమానాశ్రయాలు..: నాలుగేళ్లలో 25 విమానాశ్రయాల (విజయవాడ, తిరుపతి, చెన్నై, వడోదరసహా) మానిటైజేషన్ ద్వారా రూ. 20,782 కోట్ల మేర పెట్టుబడులు రాగలవని అంచనా. ఇందులో భాగంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు (13 శాతం వాటా) ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో ఉన్న వాటాలను విక్రయించే యోచన ఉంది. రైల్వే..: రైల్వేలకు సంబంధించి నిర్దిష్ట రైల్వే స్టేషన్లు, ట్రాక్లు, ప్యాసింజర్ రైళ్లు, కొంకణ్ రైల్వే మానిటైజేషన్ విలువ సుమారు రూ. 1.52 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకోసం 400 రైల్వే స్టేషన్లు, 90 ప్యాసింజర్ రైళ్లు, 1,400 కి.మీ. మేర ఉన్న 1 రైల్వే ట్రాక్, 741 కి.మీ. కొంకణ్ రైల్వే, 15 రైల్వే స్టేడియంలు, కొన్ని రైల్వే కాలనీలు, రైల్వేకి చెందిన 265 గూడ్స్–షెడ్లు మొదలైనవి ఎంపిక చేశారు. టెలికం..: సుమారు రూ. 35,100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ అసెట్స్ను ఎన్ఎంపీ జాబితాలో నీతి ఆయోగ్ చేర్చింది. భారత్నెట్ ప్రాజెక్టు కింద బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ వేసిన 2.86 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ అసెట్స్ విలువ రూ. 26,300 కోట్లుగా లెక్కగట్టింది. అలాగే, బీఎస్ఎన్ఎల్కి చెందిన 13,567 మొబైల్ టవర్లు, ఎంటీఎన్ఎల్కి చెందిన 1,350 టవర్ల విలువను రూ. 8,800 కోట్లుగా అంచనా వేసింది. మైనింగ్..: దాదాపు రూ. 28,747 కోట్ల విలువ చేసే బొగ్గు గనులను మానిటైజ్ చేయనున్నారు. ఇందుకోసం 160 అసెట్స్ను గుర్తించారు. 761 ఖనిజ బ్లాక్లను నాలుగేళ్ల వ్యవధిలో వేలం వేయనున్నారు. షిప్పింగ్..: వచ్చే నాలుగేళ్లలో రూ. 12,828 కోట్ల విలువ చేసే షిప్పింగ్ అసెట్ల మానిటైజేషన్ జరగనుంది. దీన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ అమలు చేయనుంది. ఇందుకోసం 31 ప్రాజెక్టులను గుర్తించారు. రియల్ ఎస్టేట్..: రియల్ ఎస్టేట్, హోటల్ అసెట్స్ మానిటైజేషన్ విలువ సుమారు రూ. 15,000 కోట్ల మేర ఉండగలదని అంచనా వేస్తున్నారు. దేశ రాజధానిలోని పలు హౌసింగ్ కాలనీలు, ఎనిమిది ఐటీడీసీ హోటళ్లు కూడా ఈ మానిటైజేషన్ ప్రణాళికలో భాగంగా ఉంటాయి. ఉభయతారకం.. ఈ ప్రణాళిక ప్రకారం ప్రైవేట్ సంస్థలు ఇన్విట్ల(ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు) ద్వారా నిర్దిష్ట ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే నిర్దిష్ట కాలానికి అసెట్లను నిర్వహించి, అభివృద్ధి చేసి, ప్రభుత్వానికి బదలాయించే విధానంలోనూ రాబడులు అందుకోవచ్చు. గిడ్డంగులు, స్టేడియంలు మొదలైన కొన్ని అసెట్స్ను ప్రభుత్వం నుంచి దీర్ఘకాలిక లీజుకి తీసుకోవచ్చు. ఇటు ప్రైవేట్ పెట్టుబడులతో ఇన్ఫ్రా అభివృద్ధి చేయడంతో పాటు అటు ఇతర మౌలిక ప్రాజెక్టులకు నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వానికి ఎన్ఎంపీ ఉపయోగపడనుంది. రూ. 111 లక్షల కోట్లతో నిర్దేశించుకున్న నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఐపీ) ప్రణాళికలో ఎన్ఎంపీ విలువ 5.4%గా ఉండగా, ప్రతిపాదిత ఎన్ఐపీలో కేంద్రం వాటాలో (రూ. 43 లక్షల కోట్లు) 14 %గా ఉండనుంది. ఎన్ఎంపీలో చేర్చేందుకు ఆస్కారమున్న బ్రౌన్ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్ జాబితాను నీతి ఆయోగ్ రూపొందించింది. ఎన్ఎంపీ జాబితాలో ఉన్న తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ ఆస్తులు 1. రహదారులు (పొడవు కి.మీ.లలో) కడ్తాల్–ఆర్మూర్: 31 కి.మీ. కడ్లూరు ఎల్లారెడ్డి– చేగుంట: 52 కి.మీ. చేగుంట – బోయినిపల్లి: 62 కి.మీ. మహారాష్ట్ర /తెలంగాణ సరిహద్దు– ఇస్లాంనగర్ (ఎన్హెచ్ 7): 55 కి.మీ. ఆర్మూర్–కడ్లూరు ఎల్లారెడ్డి: 59 కి.మీ. కడ్లూరు ఎల్లారెడ్డి – గుండ్ల పోచంపల్లి: 86 కి.మీ. హైదరాబాద్–బెంగళూరు (తెలంగాణ): 75 కి.మీ. 2. రైల్వేలు దేశవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉన్న 12 క్లస్టర్లలోని 109 రూట్లలో 150 అధునాతన రైళ్ళను తీసుకొచ్చేందుకు ప్రైవేట్ పెట్టుబడులను స్వాగతిస్తున్నారు. దీని ద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు రానున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి రద్దీ క్లస్టర్లతో పాటు సికింద్రాబాద్ క్లస్టర్ అభివృద్ధికి బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఎన్ఎంపీ జాబితాలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కేంద్రం ఆస్తులు 1. రహదారులు (పొడవు కి.మీ.లలో) ► కొత్తకోట బైపాస్– కర్నూలు: 75 కి.మీ. ► హైదరాబాద్ – బెంగళూరు(ఏపీ): 251 కి.మీ. ► చిలకలూరిపేట– విజయవాడ: 68 కి.మీ. 2. గ్యాస్పైప్ లైన్ నెట్వర్క్ ► కేజీ బేసిన్ పైప్లైన్ నెట్వర్క్ – 889 కి.మీ. పొడవు 3. ఎయిర్పోర్టులు ► విజయవాడ (2023–24) – విలువ అంచనా: రూ. 600 కోట్లు ► తిరుపతి (2023–24) – విలువ అంచనా: రూ. 260 కోట్లు ► రాజమండ్రి (2024–25) – విలువ అంచనా: రూ. 130 కోట్లు 4. నౌకాశ్రయాలు ► పోర్టులకు సంబంధించి 2022–25 మధ్య దేశంలోని పోర్టుల్లో మొత్తం 31 ప్రాజెక్టులను పీపీపీ పద్ధతి ద్వారా అభివృద్ధి చేయనున్నారు. అందులో విశాఖపట్టణం పోర్టుకు సంబంధించిన నాలుగు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. వీటి విలువ సుమారు రూ. 988 కోట్ల మేర ఉండనుంది. 5. రైల్వేలు ► స్టేషన్ల పునర్అభివృద్ధి కింద తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల మానిటైజేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. - సాక్షి, న్యూఢిల్లీ -
10 ఎకరాలు.. రూ. 500 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: రైల్వే శాఖ ప్రైవేటీకరణ వైపు పరుగెడుతోంది. విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడం ద్వారా ఆదాయ వనరులను సమీకరించునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతోపాటు రైళ్లను కూడా ప్రైవేటీకరించేందుకు ఇప్పటికే బడా సంస్థలకు ఆహ్వానం పలికిన రైల్వేశాఖ.. తాజాగా ఖాళీ స్థలాల వినియోగంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే మౌలాలి, మెట్టుగూడ, లాలాగూడ, చిలకలగూడ, తదితర ప్రాంతాల్లోని సుమారు 10 ఎకరాల విలువైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలోని రైల్వే అధికారుల క్వార్టర్స్ను అప్పగించేందుకు రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మొత్తం స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేస్తోంది. అందరి చూపు అటు వైపే... సంగీత్ చౌరస్తా నుంచి రైల్ నిలయం వైపు వెళ్లే దారిలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే అధికారుల క్వార్టర్స్ ఇవి. 40 మందికి పైగా అధికారులు ఈ క్వార్టర్స్లో నివాం ఉంటున్నారు. జనరల్ మేనేజర్, అదనపు జనరల్ మేనేజర్ మినహాయించి కనీసం పదేళ్లకు పైగా సీనియారిటీ కలిగిన ఉన్నతస్థాయి అధికారులకు ఈ క్వార్టర్స్ కేటాయిస్తారు. ఈ ప్రాంగణంలో జీ+1 భవనాల్లో అన్ని వసతులు ఉంటాయి. ఇళ్లల్లో పని చేసేవాళ్లకు, డ్రైవర్లకు ఔట్ హౌస్లు ఉంటాయి. రైల్నిలయంతో పాటే ఈ క్వార్టర్లను 1965–1970 మధ్య కట్టించారు. ఇటు రైల్నిలయం, అటు సంచాలన్భవన్, హైదరాబాద్ భవన్, లేఖాభవన్, తదితర రైల్వేకార్యాలయాలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వే క్వార్టర్స్పై ప్రస్తుతం ఆర్ఎల్డీఏ కన్ను పడింది.ప్రైమ్ ల్యాండ్ కావడంతో దీన్ని లీజుకు ఇవ్వడం ద్వారా ఎక్కువ ఆదాయం లభించగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. లీజుపైనే సందిగ్ధం... రెండేళ్ల క్రితమే రైల్వేస్థలాల లీజుకోసం రైల్ లాండ్ డెవలప్మెంట్ అథారిటీ సన్నాహాలు చేపట్టింది. మొదట్లో 39 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని భావించారు.కానీ నిర్మాణ సంస్థల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. దీంతో గడువును 99 ఏళ్లకు పెంచినట్లు సమాచారం.కానీ సాధారణంగా స్థలాలను పూర్తిగా కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలు లీజు స్థలాల పట్ల ఎలా ఆసక్తి చూపుతారనిదే సందిగ్ధం. లీజుకు ఇలా.... ⇔ రైళ్ల నిర్వహణ, సరుకు రవాణాపైనే కాకుండా రైల్వేస్థలాల నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జించేందుకు రైల్వేశాఖ మూడేళ్ల క్రితం రైల్లాండ్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ రైల్వేస్థలాలను గుర్తించి బడా కార్పొరేట్ సంస్థలకు 99 ఏళ్ల వరకు లీజుకు ఇస్తుంది. ⇔ ప్రస్తుతం సికింద్రాబాద్లోని రైల్వేకార్టర్స్ స్థలంలో భారీ వ్యాపార,వాణిజ్య భవన సముదాయాలను నిర్మించి నిర్వహించేందుకు (బిల్డ్, ఆపరేట్) లీజుకు ఇవ్వనున్నారు. దీనిద్వారా రైల్వేకు రూ.150 కోట్లకు పైగా ఆదాయం రాబట్టవచ్చని అంచనా. -
‘బ్యాండ్ బజా బరాత్’.. ఒక్కరికి రూ.12 లక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: భూములను లీజుకు తీసుకోవడం.. షాపులు లీజుకు తీసుకోవడం చూశాం.. కానీ పిల్లల్ని లీజుకు తీసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదు కదా. కానీ ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్ పిల్లలను లీజకు తీసుకుని.. పెళ్లిల్లలో దొంగతనం ఎలా చేయాలో వారికి శిక్షణ ఇస్తున్నారు. పిల్లల్ని లీజుకు ఇచ్చినందుకు గాను ఒక్కొక్క పిల్లవాడి తల్లిదండ్రులకు వారు ఏకంగా 10-12లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం ఓ భారీ వివాహానికి హాజరయ్యి.. చేతివాటం చూపి నగదుతో ఉడాయిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఇక వీరిని విచారించగా సంచలన విషయాలు తెలిసాయి. గత కొద్ది నెలలుగా నగరంలో పలు ఫంక్షన్హాల్స్లో భారీగా నగలు, డబ్బు మాయమవుతుంది. అతిథిలు పెళ్లి హాడావుడిలో ఉండగా.. దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. రెండు మూడు నెలలుగా ఈ తరహా దొంగతనాలకు సంబంధించి లెక్కలేనన్ని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. నగరంలో భారీ వివాహ వేడుకలు జరిగే ఫంక్షన్ హాల్స్ వివరాలు సేకరించి.. అక్కడికి వెళ్లి దర్యాప్తు చేశారు. సీసీటీవీ కెమరా రికార్డులను పరిశీలించారు. ఇక కొన్ని ఫంక్షన్ హాల్స్ దగ్గర ఇన్ఫార్మర్లను ఉంచారు. అనుమానితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. (చదవండి: సిడ్నీ నగరంలో... సిగ్గే పడుతూ...) ఈ క్రమంలో ఈ నెల 2న ఓ ఫంక్షన్ హాల్లో ఇదే తరహా దొంగతనం చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏడుగురు అనుమానితులను గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం నిందితులు ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వెళ్లే ప్రయత్నంలో ఉండగా వారిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇక వీరిని విచారించగా.. సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు.. న్యూఢిల్లీ సమీప ప్రాంతంలోని గుల్ఖేరీ గ్రామానికి చెందిన పేద పిల్లల్ని ఈ గ్యాంగ్ తమ పని కోసం ఎన్నుకుంటుంది. ఇందుకు ఒక్కొ పిల్లవాడి తల్లిదండ్రులకి 10-12 లక్షల రూపాయల చొప్పున చెల్లించి తమతో పాటు ఢిల్లీకి తీసుకువస్తారు. ఆ తర్వాత వారికి ఓ నెల రోజుల పాటు పెళ్లిల్లలో దొంగతనాలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు. దానిలో భాగంగా మంచి దుస్తులు ధరించడం.. అతిథులతో కలిసి పోవడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. అన్నింటి కంటే ముఖ్యంగా దొంగతనం చేసి పట్టుబడినప్పుడు మిగతా వారి గురించి సమాచారం ఇవ్వకుండా ఉండటం వంటి విషయాలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత పిల్లలను పెద్దవారితో కలిపి బిగ్షాట్స్ పెళ్లిల్లకు పంపిస్తారు. (చదవండి: పెళ్లిలో చేతివాటం.. రూ.3 లక్షలు చోరీ) అయితే ఈ గ్యాంగ్ వెళ్లగానే దొంగతనాలకు పాల్పడదు. ముందుగా అతిథులతో కలిసిపోతారు. వారితో మంచిగా మాట్లాడి నమ్మకం సంపాదిస్తారు. డిన్నర్ చేశాక గెస్ట్లందరు ఇళ్లకు తిరిగి వెళ్లే హడావుడిలో ఉండగా.. అప్పుడు తమ చేతులకు పని చేప్తారు. అప్పటికే వచ్చిన అతిథుల్లో ఎవరు బంగారం, డబ్బు వంటి విలువైన బహుమతలు ఇస్తున్నారో తెలుసుకుని.. వాటితో పాటు వెంటనే అక్కడి నుంచి ఉడాయిస్తారు. గ్యాంగ్ సభ్యులందరు ఒక్క చోటకు చేరాక.. వచ్చిన నగదును పంచుకుని తర్వాత ఎవరి ఊళ్లకు వారు వెళ్లిపోతారు. ఇలా సదరు గ్యాంగ్ సొంతూరికి వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. మిగతా గ్యాంగ్ మెంబర్స్ కోసం వెతుకుతున్నారు. -
ప్రైవేటికరణకు ఒప్పుకోం : కేరళ సీఎం
తిరువనంతపురం : కేంద్ర కేబినెట్ మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలపడాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఖండించింది. తిరువనంతపురం విమానాశ్రయంతో పాటు మరో మూడు విమానాశ్రయాల నిర్వహణ హక్కులను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేరళ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. విమానాశ్రయ కార్యకలాపాలు, నిర్వాహణను స్పెషల్ పర్పస్ వెహికిల్ ( ఎస్పీవీ) కి బదిలీ చేయాలని కేరళ పదేపదే చేసిన చేసిన అభ్యర్థనలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రధాన వాటాదారుగా ఉన్న ఎస్పీవీకి తిరువనంతపురం విమానాశ్రయ నిర్వాహణ బాధ్యతలను తమకు అప్పగిస్తామని 2003లో ఇచ్చిన హామీని కేంద్రం తుంగలో తొక్కిందని ఆరోపించారు. విమానాశ్రయ అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం చేసిన కృషిని విస్మరించిందన్నారు. కేంద్రం తీసుకున్న ఏకపక్షంగా ఉందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. (ఆ ఆరు ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణ) దేశంలో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిలో జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్ప్రైజెస్ బిడ్ రూపంలో గతేడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది. ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్ప్రైజెస్కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది. 50 ఏళ్ల నిర్వహణ తర్వాత ఆయా విమానాశ్రయాలను ఏఏఐకి తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. విమానాశ్రయాలను ప్రైవేటుకు లీజుకు ఇస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్వాగతించారు. బిజెపి ఎంపి వి మురళీధరన్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. (అదానీ చేతికి మరో మూడు విమానాశ్రయాలు) -
అదానీ చేతికి మరో మూడు విమానాశ్రయాలు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు బుధవారం ఆమోదం తెలియజేసింది. ఈ మూడు.. జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్ప్రైజెస్ బిడ్ రూపంలో గతేడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది. ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్ప్రైజెస్కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలియజేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్ సొంతం చేసుకున్న ఆరు విమానాశ్రయాలు ప్రస్తుతం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ తొలుత ఆమోదం తెలిపిన లక్నో, మంగళూరు, అహ్మదాబాద్ విమానాశ్రయాల నిర్వహణ, కార్యకలాపాలు, అభివృద్ధి కి సంబంధించి రాయితీ ఒప్పందాన్ని ఈ ఏడాది ఫి బ్రవరి 14న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో అదానీ కుదుర్చుకుంది. వాస్తవానికి వీటిని ఆగస్ట్ 12 నాటికే అదానీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ 12 వరకు గడువును ఏఏఐ పొడిగించింది. తాజాగా లీజునకు ఆమోదం తెలియజేసిన వాటిల్లో గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాల ప్రైవేటీకరణపై కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. కాగా, కోర్టు నుంచి ఎటువంటి స్టే ఆదేశాలు లేనందున, వీటి లీజు విషయంలో ముందుకు వెళ్లొచ్చని కేంద్రం భావించింది. ‘‘ఈ విమానాశ్రయాలను పీపీపీ కిందకు బదిలీ చేయ డం అంటే సమర్థవంతమైన, నాణ్యమైన సేవలను ప్రయాణికులకు అందించేందుకు వీలు కల్పించడం. ఏఏఐ ఆదా యం పెరగడమే కాకుండా, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరిన్ని విమానాశ్రయాల అభివద్ధిపై ఏఏఐ దృష్టిసారించేందుకు అవకాశం లభిస్తుంది’’ అంటూ పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. ‘‘జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను శాశ్వతం గా ప్రైవేటు ఆపరేటర్కు ఇవ్వడం లేదు. 50 ఏళ్ల నిర్వహణ తర్వాత ఆయా విమానాశ్రయాలను ఏఏఐకి తిరిగి ఇచ్చేయాలి. ఈ లీజు వల్ల ఏఏఐకి ప్రారంభంలోనే రూ.1,070 కోట్లు లభిస్తాయి. ప్రయాణికులకు మంచి సేవలు లభిస్తాయి‘‘అని ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. -
గ‘లీజు’ పనులకు బ్రేక్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం పేరుతో ఎన్ఎస్పీ స్థలాన్ని కాజేసేందుకు టీడీపీ నేతలు చేసిన కుట్రను వైఎస్సార్ ప్రభుత్వం తిప్పి కొట్టింది. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని లీజు పేరుతో అప్పనంగా కొట్టేసేందుకు పన్నిన పన్నాగాన్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. తమ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ జిల్లా నేతలు రూ.25 కోట్ల విలువ చేసే ఎన్ఎస్పీ స్థలాన్ని కాజేసేందుకు చేసిన ప్రయత్నానికి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. గత ఏడాది అక్టోబర్ 11వ తేదీన అప్పటి ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి చ్చిన 1.96 ఎకరాల స్థలానికి ఇచ్చిన జీఓ ఎంఎస్ నెంః 514ను రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు– కర్నూలు హైవే పక్కన సర్వే నంబర్ 68/8లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్పీ)కి చెందిన 1. 96 ఎకరాల స్థలం ఉంది. దీని మార్కెట్ విలువ రూ. 25 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ స్థలానికి తూర్పున ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీఈ కార్యాలయం, పడమర వైపున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్, దక్షిణం వైపున కర్నూలు– నెల్లూరు హైవే ఉన్నాయి. పక్కనే ఉన్న నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయం శిథిలావస్థకు చేరి చిన్నపాటి వర్షానికే కార్యాలయ ఆవరణ తటాకాన్ని తలపిస్తోంది. దీంతో నూతన కార్యాలయ భవన నిర్మాణానికి 2016 మే నెలలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో ఈ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ. 5.90 కోట్ల నిధులను మంజూరు చేసింది. 2016 ఆగస్టు 20వ తేదీన టెండర్లు కూడా పిలిచారు. హైదరాబాద్కు చెందిన ఆర్. గంగయ్య అండ్ కంపెనీ టెండర్ను దక్కించుకుని 2017 మార్చి 3న అగ్రిమెంట్ కూడా చేసి పనులు మొదలుపెట్టేందుకు సమాయత్తమయ్యారు. పనులకు శంకుస్థాపన చేసేందుకు పునాదులు కూడా తవ్వారు. స్థలంపై తమ్ముళ్ల కన్ను.. ఈ స్థలంపై అప్పట్లో టీడీపీ జిల్లా నేతల కన్ను పడింది. సదరు స్థలాన్ని పార్టీ జిల్లా కార్యాలయానికి కావాలంటూ అక్కడ జరుగుతున్న నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయ నిర్మాణ పనులను నిలిపి వేయించారు. అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో అధికారులు సైతం చేసేది లేక మిన్నకుండిపోయారు. ఆ తరువాత టీడీపీ నేతలు చెప్పినట్లుగా 1.96 ఎకరాల స్థలాన్ని ఏడాదికి రూ.1960 చొప్పున అద్దె చెల్లించేలా 33 ఏళ్ళపాటు లీజుకు ఇస్తూ జీఓ జారీ చేశారు. అప్పటి నుంచి ఈ స్థలం టీడీపీ నేతల ఆధీనంలో ఉన్నప్పటికీ ఏడాది దాటినా అందులో పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. దీనికితోడు సదరు స్థలం ఎన్ఎస్పీ శాఖకు అవసరమైన నేపథ్యంలో టీడీపీ కార్యాలయానికి గతంలో ఇచ్చిన జీఓ ఎంఎస్ నం 514ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఛీఫ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్టీసీ సొంతంగా కొనలేకే...
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సొంతంగా బస్సులను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రయాణికుల అవసరాల నిమిత్తం అద్దె బస్సులను లీజుకు తీసుకోవాల్సివస్తోందని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. అద్దెకు బస్సులను తీసుకోవడం ఏనాటి నుంచో ఉందని, ఈ నిర్ణయం వెనుక ఆర్టీసీ కార్మికులను దెబ్బతీయాలనే కుట్ర ఏమీలేదని ఆ సంస్థ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో తెలిపారు. ఆర్టీసీ 1,035 అద్దె బస్సులను తీసుకునేందుకు టెండర్ ఆహ్వానించడాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి సవాల్ చేస్తూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఆర్టీసీ సంస్థ వాదనలతో సునీల్ శర్మ కౌంటర్ పిటిషన్ వేశారు. గత నెల 14న పత్రికల్లో అద్దె బస్సుల కోసం టెండర్ను ప్రచురించామని, అదే నెల 21న టెండర్ల దాఖలుకు ఆఖరు తేదీగా నిర్ణయించి అదే రోజు టెండర్లను తెరిచి ఇప్పటి వరకూ 287 మంది బస్సు యజమానులకు ఖరారు పత్రాలను అధికారికంగా ఇచ్చామన్నా రు. ఆర్టీసీలో 10,460 బస్సులుంటే అందులో అద్దె బస్సులు 2,103 మాత్రమేనని వివరించారు. మొత్తం బస్సుల్లో అద్దె బస్సులు 21.26 శాతమేనని, వాస్తవానికి 20 శాతం నుంచి 25% వరకూ అద్దెబస్సులు ఉండేందుకు వీలుగా 2013లోనే ఆర్టీసీ బోర్డు తీర్మానం చేసిందని చెప్పారు. తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యం లో ప్రయాణికుల సౌకర్యం కోసం అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించామని దీనికితోడు టెం డర్ల ప్రక్రియ ఖరారు అయినందున పిల్ను తోసిపుచ్చాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని ఈ నెల 18న హైకోర్టు విచారణ కొనసాగించనుంది. -
అద్దె బస్సుల టెండర్పై స్టేకు నో
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సంస్థ 1,035 అద్దె బస్సుల్ని ఏడాది పాటు తీసుకునేందుకు పిలిచిన టెండర్ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వేసిన రిట్పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారమైతే అంత పెద్ద సంఖ్యలో ప్రైవేటు బస్సుల్ని అద్దెకు తీసుకోవాల్సిన అవసరం లేదని, కాబట్టి మధ్యంతర స్టే ఆదేశాలు ఇవ్వాలంటూ టీఎస్ ఆర్టీసీ కార్మిక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రమేశ్ కుమార్ దాఖలు చేసిన రిట్ను మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి విచారించారు. సమ్మె కాలానికి అద్దె బస్సులు తీసుకోవడం సబబేనని, ఏడాది కాలానికి అద్దెకు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి ఆర్థికంగా నష్టమని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సూర్యకరణ్రెడ్డి వాదించారు. ఆర్టీసీ సమ్మెపై వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఉన్నాయని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు చెప్పారు. దీంతో ఈ రిట్ను కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి నివేదించాలని న్యాయమూర్తి నిర్ణయించారు. ఈ దశలో పిటిషనర్ న్యాయవాది కల్పించుకుని, ఏడాదిపాటు అద్దెకు తీసుకోకుండా తాత్కాలిక ప్రాతిపదికపై తీసుకునేలా మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరగా, ఈ విషయాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేయాలని సూచించారు. -
‘అన్న’మాట నిలబెట్టుకున్నారు
జీవో నంబరు 97... విశాఖపట్నం మన్యంలోని కొండల్లో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి ఇస్తూ గత టీడీపీ ప్రభుత్వం 2015, నవంబరులో ఇచ్చిన ఉత్తర్వులు ఇవి! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్పై యుద్ధం చేస్తానంటూ గిరిజనులను నమ్మించిన చంద్రబాబు 2014 సంవత్సంలో అధికారంలోకి రాగానే ఆ మాట మరచిపోయారు! అందుకే గిరిజనులంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు! గిరిజనుల సెంటిమెంటుకు గౌరవం.. ఇదీ జనం మనసు ఎరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట! ‘సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటునూ గౌరవించాల్సిందే’నని విస్పష్టంగా చెప్పిన జన నాయకుడని ఇప్పుడు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు! ఇదీ ఇద్దరు నాయకుల మధ్య తేడా! దశాబ్దాలుగా పలు ఉద్యమాలతో కీలక మలుపులు తిరిగిన బాక్సైట్ మైనింగ్ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల మనసుల్లో గూడుకట్టుకున్న భయాందోళనలకు ముగింపు పలికారు. 3,030 ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాక్షి, విశాఖపట్నం/పాడేరు: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని రిజర్వు ఫారెస్టు ప్రాంతంలోనున్న అపారమైన బాక్సైట్ ఖనిజ సంపదపై కొన్ని దశాబ్దాల క్రితమే బడాబాబులు కన్నేశారు. ఖనిజం కోసం కొండలను తవ్వేస్తే తమ జీవనానికి, సాంస్కృతిక వారసత్వానికే కాదు అటవీ, పర్యావరణానికి విఘాతం కలుగుతుందనే భయాందోళనలతో దాదాపు 50 ఏళ్లుగా గిరిజనులు పోరాటం చేస్తూ వచ్చారు. వారి పక్షాన వైఎస్సార్సీపీ అధినేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో మూడేళ్ల క్రితం చింతపల్లిలో బాక్సైట్కు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి భారీ సదస్సు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండు చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు వెనుకంజ వేసినప్పటికీ జీవో 97ను మాత్రం రద్దు చేయలేదు. జీవో నంబరు 97ను రద్దు చేయాలనే డిమాండుతో గిరిజనులు ప్రారంభించిన పోరాటానికి జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏజెన్సీలోని వైఎస్సార్సీపీ నాయకులు కూడా బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర వహించారు. పార్టీ అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి గిరిజనులకు మేలు చేస్తామని జగన్ తన ప్రజాసంకల్పయాత్ర సందర్భంలోనూ పునరుద్ఘాటించారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి నెలలో పాడేరులో నిర్వహించిన బహిరంగ సభలోనూ గిరిజనులకు అభయమిచ్చారు. అలా ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకున్నారు. గిరిజనుల పక్షాన తాను ఉన్నానని నిరూపించారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, గత ప్రభుత్వాలు జారీ చేసిన బాక్సైట్ అనుకూల జీవోలన్నీ రద్దు చేస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి తాజాగా ప్రకటించడంతో విశాఖ ఏజెన్సీలోని అన్ని వర్గాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన ముఖ్యమంత్రి అంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. బాక్సైట్ కొండలిక సురక్షితం... అరకులోయ మండలంలోని గాలికొండ, రక్తికొండ, చిత్తంగొంది, చింతపల్లి ప్రాంతంలోని జర్రెల, సప్పర్లతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గుర్తేడు అటవీ ప్రాంతంలో కలిపి దాదాపు 75 కోట్ల టన్నుల బాక్సైట్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఈ రెండు జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 27 కొండల్లో ఈ బాక్సైట్ నిక్షిప్తమై ఉందని గుర్తించారు. అయితే ఈ కొండలలో బాక్సైట్ తవ్వకాలు జరిపితే 270 గ్రామాలకు చెందిన గిరిజనులు పూర్తిగా నిర్వాసితులవుతారని, వ్యవసాయ భూములు, అటవీ సంపద అంతా నాశనమవుతాయని, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఏజెన్సీ ప్రజల మనుగడమే ముప్పు పొంచి ఉదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే మైదాన ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు చేశారు. దీంతో అప్రమత్తమైన గిరిజనులు దశాబ్దాల క్రితమే ఆందోళనలు ప్రారంభించారు. పంచపట్మాలి ప్రత్యక్ష నిదర్శనం.. విశాఖ మన్యానికి సమీపంలోనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలోనున్న పంచపట్మాలి కొండల్లో జరుగుతున్న దాష్టీకం గిరిజనుల్లో ఆందోళనలను మరింత పెంచింది. దమన్జోడి వద్ద ఏర్పాటు చేసిన అల్యూమినా రిఫైనరీ కోసం 1985 సంవత్సరం నుంచి అక్కడ బాక్సైట్ తవ్వకాలు మొదలుపెట్టారు. కేవలం 48 లక్షల టన్నుల బాక్సైట్ ఖనిజం తవ్వకం వల్లే సమీప గ్రామాల గిరిజనులంతా నిర్వాసితులయ్యారు. అటవీ సంపద కనుమరుగైంది. జలవనరులు కలుషితమయ్యాయి. వేలాది ఎకరాల వ్యవసాయ భూములన్నీ నాశనమయ్యాయి. వాటిపై గిరిజనులంతా మనుగడను కోల్పోయారు. ఈ పరిస్థితిని చూసిన పర్యావరణవేత్తలంతా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో 75 కోట్ల టన్నుల బాక్సైట్ కోసం చేపట్టిన మైనింగ్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 270 గ్రామాలకు చెందిన గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థం చేస్తున్న జీవో నంబరు 97ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రద్దు చేయడంపై సర్వత్రా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన మేధావులు, నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. బాక్సైట్ జీవో 97 రద్దు చారిత్రాత్మకం.. గిరిజనుల పక్షపాతిగా పేరొం దిన సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న బాక్సైట్ అనుకూల జీవో నంబరు 97ను రద్దు నిర్ణయం చారిత్రాత్మకం. గత చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ను తవ్వి గిరిజనులను నాశనం చేసే చర్యల్లో భాగంగానే ఈ జీవోను జారీ చేసింది. ఆ సమయంలో గిరిజనుల పక్షాన జగన్మోహన్రెడ్డి నిలబడ్డారు. బాక్సైట్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పాదయాత్రలో ఈ బాక్సైట్ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించడం సంతోషంగా ఉంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు గిరిజనుల మనుగడకు భద్రత.. రాష్ట్ర ఖజానాకు వచ్చే రూ. వేల కోట్ల ఆదాయం కన్నా గిరిజనుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. బాక్సై ట్ జీవో 97ను రద్దు చేసి ముఖ్యమంత్రి జగన్ గిరిజను ల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. గిరిజనుల పక్షపాతిగా దేశ చరిత్రలో నిలిచారు. – చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే, అరకు గిరిజనులకు పండుగ రోజు.. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ గత చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబరు 97ను జారీ చేసినప్పుడు మే మంతా పోరాటానికి దిగాం. మా గిరిజనులకు అండగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నాడు అండగా నిలబడ్డారు. మాలో మనోధైర్యాన్ని నింపారు. చింతపల్లిలో గిరిజనులతో సదస్సు నిర్వహించారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించారు. ఇది బాక్సైట్ ప్రభావిత జర్రెల, గాలికొండ ప్రాంతాల గిరిజనులకు పండుగ రోజు. – అడపా విజయకుమారి,జర్రెల మాజీ సర్పంచ్, జీకే వీధి మండలం బాక్సైట్ జీవో రద్దును స్వాగతిస్తున్నాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాక్సైట్ జీవో 97 రద్దుకు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. బాక్సైట్కు వ్యతిరేకంగా గిరిజనులు దశాబ్దాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ దోపిడీకి పూనుకోవడం దుర్మార్గ చర్యగా గిరిజన సంఘం అప్పట్లో ఖండించింది. ఉద్యమం చేసింది. సీఎం జగన్మోహన్రెడ్డి బాక్సైట్ జీవో రద్దుకు నిర్ణయం తీసుకోవడం గిరిజనులకు ఎంతో మేలు చేస్తుంది. – పి.బాలదేవ్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, అరకులోయ ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది.. గిరిజనులంతా బాక్సైట్ను వ్యతిరేకించి ఉద్యమాలు చేస్తుంటే, గత చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను నాశనం చేసే చర్యలకు పాల్పడింది. జీవో నంబర్ 97ను జారీ చేసి గిరిజనులకు అన్యాయం చేయాలని చూసింది. బాక్సైట్ ఖనిజ సంపద దోపిడీ చేసి విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కుట్రపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్రెడ్డి గిరిజనుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించడం చరిత్రలో నిలిచిపోతుంది. – పి.రంజిత్కుమార్, దండకారణ్య విమోచన సమితి నేత, హుకుంపేట గిరిజనుల రక్షకుడు జగన్మోహన్రెడ్డి.. సీఎం జగన్మోహన్రెడ్డి తన తండ్రి, మహానేత వైఎస్సార్ వలే మాటకు కట్టుబడి ఉండే మంచి నేతగా గిరిజనుల్లో గుర్తింపు పొందారు. అధికారంలోకి రాగానే బాక్సైట్ అనుకూల జీవో 97ను రద్దు చేస్తానని చింతపల్లి సదస్సులో గిరిజనులకు మాట ఇచ్చారు. ఆ రోజుల్లో గిరిజనుల పక్షాన బాక్సైట్ మైనింగ్కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంను గిరిజనులు ఇప్పటికి మరువలేదు. ప్రభుత్వానికి ఆదాయం కంటే గిరిజనుల ప్రయోజనాలు, వారి సురక్షిత మనుగడే ముఖ్యమని మహోన్నత ఆశయంతో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి బాక్సైట్ జీవో 97 రద్దుకు నిర్ణయించి గిరిజనులకు రక్షకుడిగా మారారు. ఆయన నిర్ణయంపై గిరిజనులు సంతోషంగా ఉన్నారు. – చిట్టపులి శ్రీనివాసపడాల్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పాడేరు -
తాడికొండలో.. అనకొండలు..
సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన అవినీతి అనకొండలు పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ సారథ్యంలో ప్రజా ధనాన్ని నిలువునా దోచుకున్నాయి. రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా భూములను కబ్జా చేశాయి. రైతుల పొలాల్లో సెంట్ల చొప్పున భూమి కాజేసి కోట్ల రూపాయలు దండుకున్నాయి. నీరు– చెట్టు పథకం పేరిట అడ్డగోలుగా చెరువులు, పంట పొలాలను తవ్వేసి మట్టిని అమ్మేసుకున్నాయి. గ్రావెల్ను సైతం కొల్లగొట్టి కోట్ల రూపాయలు గడించాయి. కమీషన్లకు కక్కుర్తి పడి అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పాతర వేశాయి. ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ అండదండలతో నియోజకవర్గాన్ని అక్రమాలు, అవినీతి, అరాచకాలకు కేంద్ర బిందువుగా మార్చాయి. అక్రమంగా కాజేసిన సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చి.. మింగిన ప్రజాధనం వివరాలన్నీ రోడ్డెక్కి మరీ కక్కేశాయి. మొత్తంగా నియోజకవర్గంలో సుమారు రూ.400 కోట్ల వరకు సహజ వనరులను లూటీ చేశాయి. ఇవన్నీ తెలిసినా ముడుపులు తీసుకున్న అధికారుల చేతులు నిబంధనలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని ముడుచుకుపోయాయి. రూ.200 కోట్లపైనే.. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ అండదండలతో రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. నేటి వరకూ తుళ్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, మట్టి తవ్వకాల్లో రూ.200 కోట్లకుపైగా దిగమింగారు. వడ్డమాను గ్రామం ఎంపీటీసీ పిన్నక సాంబశివరావు 74/ఏ, 74/బీ అనే సర్వే నంబర్లలో సుమారు 33.7 ఎకరాల కొండ పోరంబోకు భూమిని కబ్జా చేశాడు. దీని విలువ సుమారు రూ. 20 కోట్లపైనే ఉంటుంది. పేదలకు చెందాల్సిన భూమిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గృహాలు నిర్మించుకున్నారు. యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే శ్రావణ్, ఆయన అనుచరులు నియోజవకర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ రాబందుల్లా వాలిపోయి భూమిని వశపరుచుకొని అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వకాలను సాగిస్తున్నారు. కైలాసగిరి కొండ ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రావణ్ అనుచరులు గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. సర్వే నంబర్ 573లో 7 ఎకరాల 28 సెంట్ల కుంట పోరంబోకు స్థలంలో గతంలో మాజీ సైనికులు, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్లు, పంటలు వేసుకోవటానికి భూమి ఇచ్చింది. ఈ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ పీఏ బత్తుల సురేశ్బాబు, విశదల గ్రామానికి చెందిన ఎమ్మెల్యే సన్నిహితుడు నరేంద్ర 2018 ఫిబ్రవరి నుంచి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్కు రూ.1500 చొప్పున గ్రావెల్ను అమ్ముకుంటున్నారు. ఇలా రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లను తిప్పుతున్నారు. ఇలా ఎమ్మెల్యే శ్రావణ్, ఆయన పీఏ, సన్నిహితుడు గ్రావెల్ అక్రమ రవాణా ద్వారా రూ.2 కోట్లకుపైగా గడించారు. లాంలో అక్రమంగా లోడింగ్ చేస్తున్న గ్రావెల్ (ఫైల్) సొసైటీ లీజులు అతిక్రమించి.. లాంలో ది లాం లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరిట 60 సంవత్సరాలుగా లీజు పాలసీ నడుస్తోంది. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుని సర్వే నెం. 199ఏలో 1.5 హెక్టార్ల కొండను మైనింగ్ చేసుకుంటున్నారు. సొసైటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పరాజయం పాలవడంతో ఎలాగైనా క్వారీని సొంతం చేసుకోవాలనుకున్న నాయకులు కుటిల పన్నాగం పన్నారు. అధికారులను, అధికారాన్ని అడ్డుగా పెట్టి క్వారీని నిలిపేయించడంతోపాటు పలుమార్లు కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో మూడున్నర సంవత్సరాలుగా క్వారీ మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం యథేచ్ఛగా గ్రావెల్ను తవ్వి అమ్మకాలు జరుపుకుంటూ కాసులు వెనకేసుకున్నారు. గతంలో గ్రామానికి చెందిన ఓ మైనార్టీ నాయకుడు ఈ తంతుకు తెరలేపడంతో అధికారులు కిమ్మనకుండా కూర్చున్నారు. రాత్రివేళ యంత్రాలతో మట్టిని తవ్వి పోగుచేయడంతోపాటు లోడింగ్ చేసి గుంటూరు, లాం పరిసర ప్రాంతాలలోని వెంచర్లకు, బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేశారు. దీనిపై సొంత పార్టీ నాయకులే బహిరంగ ఆరోపణలు చేయడం, లీజుదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే అండదండలతో నెక్కల్లు గ్రామంలో ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నెక్కల్లు గ్రామానికి ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నెంబర్ 87/ఏలో తుళ్లూరు చేనేత పరపతి విక్రయ సంఘం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మేకల రవికుమార్ తన భార్య పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి భవనం నిర్మించుకున్నాడు. 25 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమి రూ. 3 కోట్ల విలువ ఉంది. గ్రామంలో 24 ఎకరాల్లో ఉన్న ఊర చెరువు భూమిలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 5 ఎకరాలు ఇప్పటికే ఆక్రమించుకుని పశువుల పాకలను నిర్మించారు. ప్రస్తుతం మరో మూడు ఎకరాలకు మట్టిని తోలి లెవల్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఆక్రమించిన ఈ 8 ఎకరాలు రూ. 80 కోట్లపైనే విలువ చేస్తుంది. సైనికుడి భూమిని చెరబట్టారు... ఆర్మీలో పనిచేసిన కొడుకుతో తల్లి షబీరున్నీసాబీ మేడికొండూరుకు చెందిన షేక్ ఆదాం సైన్యంలో పని చేశారు. భారత్–చైనా యుద్ధంలో పాల్గొన్నారు. ఆదాంను భారత ప్రభుత్వం మెడల్స్తో సత్కరించింది. రెండు దశాబ్దాలకుపైగా భారత సైన్యంలో సేవలందించినందుకుగాను అతనికి మేడికొండూరు పోలీస్స్టేషన్ సమీపంలో సర్వే నంబర్ 347లో 2 ఎకరాల 59 సెంట్ల భూమిని 1964లో రాసిచ్చింది. ఈయనకు ఇద్దరు పిల్లలు. వీరిలో ఒకరు ఆర్మీలో పని చేశారు. మాజీ సైనికుడికి ఇచ్చిన భూమిపై ఎమ్మెల్యే శ్రావణ్ అనుచరుల కన్ను పడింది. పచ్చగా సాగవుతున్న భూమిని టీడీపీ కబ్జాకోరులు 4 సంవత్సరాల క్రితం నీరు– చెట్టు పేరుతో తవ్వేసి చెరువులో కలిపేశారు. భర్త మరణానంతరం షబీరున్నీసాబీ ప్రభుత్వమిచ్చిన భూమిని సాగు చేసుకుంటూ పొట్ట పోసుకొంటోంది. అధికార పార్టీ నేతలు భూమిని అన్యాక్రాంతం చేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ప్రస్తుత ఫిరంగిపురం మార్కెట్ యార్డు చైర్మన్ నార్నె శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన భూకబ్జాపర్వంపై ఎదురు తిరిగినందుకు ఆదాం రెండో కుమారునిపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి జైలుకు పంపారు. దేశం కోసం పోరాడిన సైనికుని కుటుంబానికి ఇంతటి కష్టమొస్తే కనీసం ఆదుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సైతం పచ్చపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తారు. సెంట్లు చొప్పున భూమిని కాజేశారు అనంతవరం లో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ఒక్కో రైతు నుంచి వారి రికార్డుల ఆధారంగా చేసుకుని సెంట్లు భూమిని కాజేశారు. 30 ఎకరాలలో ఈ విధంగా చిన్న సన్నకారు దళిత రైతుల వద్ద నుంచి ఆక్రమించుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేశారు. కోర్టులను ఆశ్రయించడంతో కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసి రెవెన్యూ, సీఆర్డీఏ అధికారులు చేతులను దులుపుకున్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూమి విలువ సుమారుగా రూ.50 కోట్ల వరకు ఉంటుంది. మట్టిని మింగేశారు రావెల–పొన్నెకల్లు గ్రామాల మధ్య చెరువులో మట్టిని మండల పార్టీ ఉపాధ్యక్షుడు దగ్గుమల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీ పేరిట ప్రైవేటు వెంచర్లు, ఇతర గ్రామాలకు మళ్లించి రూ. 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కొమ్మినేని రామచంద్రరావు ఆరోపించడంతో భారీ అవినీతి తంతు బయటపడింది. 4 సంవత్సరాలలో అక్రమంగా క్వారీయింగ్ నిర్వహించి పరిమితికి మించి మట్టిని తవ్వారని, రూ.4 కోట్ల మేర మట్టిని నీరు చెట్టు పథకం పేరిట స్వాహా చేశారని పంచాయతీ వార్డు మెంబర్లే స్వయంగా ఏడుగురి సంతకాలతో కలెక్టర్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను సీజ్ చేశారు. పొన్నెకల్లులో నీరు– చెట్టు కింద పూడికతీత తీసిన మట్టి విక్రయాలకు సంబంధించి లెక్కల విషయంలో మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుర్రం ఆదినారాయణ, ప్రస్తుత మార్కెట్ యార్డు ఛైర్మన్ గుంటుపల్లి మధుసూదనరావు వర్గీయుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తి ఎమ్మెల్యే ఎదుటే వాదోపవాదాలకు దిగారు. రూ. కోట్లు గడించారు తాడికొండ మండల కేంద్రలో నీరు–చెట్టు కార్యక్రమం పేరుతో టీడీపీ నాయకులు భారీగా మట్టిని తరలించి రూ. కోట్లు గడించారు. మట్టిని అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు ఇంత వరకు బయటకు పొక్కనీయకపోవడం గమనార్హం. గ్రామ పంచాయతీలో తీర్మానం, టెక్నికల్ ఎస్టిమేట్లు లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి విరాళాల పేరిట రూ.6 లక్షలు అధికార పార్టీ నాయకులు వసూలు చేశారు. ఎలాంటి వేలం నిర్వహించకుండా విరాళాలు సేకరించిన వారికే దుకాణాలు కేటాయిస్తామంటూ హామీ కూడా ఇచ్చి హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. విషయం పత్రికలకు ఎక్కడంతో దాదాపు ఏడాదిన్నరగా షాపింగ్ కాంప్లెక్స్ మూతబడింది. విరాళాలను పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న టీడీపీ నాయకులు.. ఆ కాంప్లెక్స్కు తిరిగి ప్రభుత్వ నిధులు బిల్లులు చేయాలంటూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. టీడీపీకి చెందిన వార్డు మెంబర్ ఇళ్ల స్థలాలను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అతనికి పంచాయతీకి చెందిన స్థలాలను లీజు పేరిట కట్టబెట్టారు. కంతేరులో భారీ దోపిడీ కంతేరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు సర్పంచ్ను సైతం పక్కన పెట్టి పారదర్శకత అంటూ ప్రచారం చేస్తూ సొంత వ్యక్తులను నియమించుకొని భారీగా మట్టి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ నిధులకు ఆడిటింగ్ చేయించిన అనంతరం గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణం చేయిస్తానంటూ నిధులు జేబులోకి మళ్లించాక చేతులెత్తేశాడు. మట్టి వ్యవహారంపై అçప్పట్లో సర్పంచ్ భర్తకు ఓ ప్రజాప్రతినిధికి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో విషయం బయటకు పొక్కింది. రావెలలో.. తెలుగు తమ్ముళ్లు నీరు– చెట్టు పేరిట సహజ సంపదను దోచుకొని జేబులు నింపుకున్నారు. తాడికొండ మండలం రావెల గ్రామంలో అధికార పార్టీకి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దగ్గుమల్లి శ్రీనివాసరావు నీరు– చెట్టు పథకం కింద మట్టిని అమ్ముకొని రూ. కోట్లు కొల్లగొట్టారంటూ అదే పార్టీకి చెందిన కొమ్మినేని రామచంద్రరావు మీడియా సాక్షిగా ధ్వజమెత్తారు. లాంలో మట్టి దందా నడుపుతూ ఎమ్మెల్యే శ్రవణ్ పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారంటూ గతంలో టీడీపీకి చెందిన ఓ వర్గం ఆందోళనకు దిగింది. పొన్నెకల్లులో మరో అడుగు ముందుకేసిన నాయకులు నీరు–చెట్టు పథకం కింద గ్రామ అవసరాలకు దానంగా ఇచ్చిన ఊర చెరువును పూడ్చి కల్యాణ మండపం నిర్మిస్తామంటూ విమర్శించారు. ఎమ్మెల్యే అండదండలతో నెక్కల్లు గ్రామంలో ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నెక్కల్లు గ్రామానికి ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నెంబర్ 87/ఏలో తుళ్లూరు చేనేత పరపతి విక్రయ సంఘం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మేకల రవికుమార్ తన భార్య పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి భవనం నిర్మించుకున్నాడు. 25 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమి రూ. 3 కోట్ల విలువ ఉంది. గ్రామంలో 24 ఎకరాల్లో ఉన్న ఊర చెరువు భూమిలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 5 ఎకరాలు ఇప్పటికే ఆక్రమించుకు ని పశువుల పాకలను నిర్మించారు. ప్రస్తుతం మరో మూడు ఎకరాలకు మట్టిని తోలి లెవల్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఆక్రమించిన ఈ 8 ఎకరాలు రూ. 80 కోట్లపైనే విలువ చేస్తుంది. కమీషన్ల దందా పెదపరిమి గ్రామంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని టీడీపీ సీనియర్ నాయకుడు, రైతు విభాగం నేత నూతలపాటి రామారావు చేస్తున్న అవినీతి పరాకాష్టకు చేరింది. గ్రామంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఈయన కమిషన్లు వసూలు చేస్తున్నారు. నీరు చెట్టు పథకాన్ని అడ్డుపెట్టుకుని భారీగా మట్టి అమ్ముకున్నారు. సిలార్ఖాన్ అనే కౌలు రైతు 2015 సెప్టెంబరు 21 తేదీన అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మరణించాడు. కౌలు రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయంలో వాటా ఇవ్వటానికి సిలార్ కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే ద్వారా ఆ పరిహారాన్ని నిలిపి వేయించాడు. తుళ్లూరుకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు సీఆర్డీఏ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఉద్యోగ విరమణ చేసిన అధికారులను కొనసాగిస్తూ గ్రామ కంఠాల పరిహారాలను ఒకటికి రెండింతలు పొందుతున్నారు. నీరు–చెట్టు పథకంలో దోపిడీ రూ.100 కోట్లు భూకబ్జాలతో దండుకున్న మొత్తం రూ.200 కోట్లు గ్రావెల్ అమ్ముకున్న సొమ్ము రూ.50 కోట్లు రైతుల పొలాల్లో సెంట్ల రూపంలో కాజేసిన భూమి రూ.50 కోట్లు కైలాసగిరి కొండ ప్రాంతంలో మట్టి తరలిస్తున్న లారీలు తాడికొండలో మట్టి తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లు -
ఫుల్లుగా తాగారు.. ఆపై..!
సాధరణంగా తాగి జీవితాలు నాశనం చేసుకునే వారి గురించే చదువుతుంటాం.. కానీ లైఫ్ సెట్ చేసుకున్న వారి గురించి ఎక్కడ చూడటం కాదు కదా కనీసం చదివి కూడా ఉండం. కానీ ఇలాంటి సంఘటనే ఒకటి శ్రీలంకలో జరిగింది. ఫుల్లుగా తాగిన ఓ కొత్త జంట ఏకంగా హనీమూన్ కోసం వెళ్లిన హోటల్నే కోనేశారు. వినడానికి కాస్తా విడ్డూరంగా అనిపించినా ఇది మాత్రం నిజం. కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. బ్రిటన్కు చెందిన గినా లైయాన్స్, మార్క్ లీలు తమ హనీమూన్ ట్రిప్ కోసం శ్రీలంకకు వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో దిగారు. ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేస్తున్న వారికి ఓ వెరైటీ ఆలోచన వచ్చింది. రూమ్ రెంట్కు తీసుకోవడం కంటే ఏకంగా ఈ హోటల్నే కొంటే ఎలా ఉంటుంది అనుకున్నారు. ఆలోచన రావడమే తడవుగా ఆ హోటల్ యాజమానుల దగ్గరకు వెళ్లారు. తమ ఆలోచన గురించి వారికి చెప్పారు. హోటల్ కూడా కాస్తా పాతబడటం.. త్వరలోనే దాని లీజ్ కూడా అయిపోతుండటంతో హోటల్ యజమానులు కూడా గినా, మార్క్ ప్రతిపాదనను అంగీకరించారు. అలా తాగిన మైకంలోనే బేరసారాలు కానిచ్చేశారు. అలా దాదాపు 30 వేల పౌండ్లు పోసి ఆ హోటల్ను మూడేళ్లకు తీసుకున్నారు. అంటే మన కరెన్సీలో 29 లక్షల రూపాయలు. ఇంకేముందు.. వాళ్ల హనీమూన్ ట్రిప్ కాస్త బిజినెస్ ట్రిప్గా మారిపోయింది. View this post on Instagram How #luckybeachtangalle was born! ❤️ A post shared by Lucky Beach (@luckybeachtangalle) on Oct 7, 2018 at 1:54am PDT అలా ఈ సంవత్సరం జులై 1 నుంచి ఆ హోటల్ని మూడేళ్ల పాటు లీజ్కు తీసుకొన్నారు.. దానికి ‘లక్కీ బీచ్ తంగళ్లె’ అనే పేరు పెట్టి దాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇక.. అప్పటి నుంచి టూరిస్టులు ఆ హోటల్కు క్యూ కడుతున్నారట. బాగుంది కదా ఐడియా.. తాగితే తాగారు కానీ.. మంచి బిజినెస్ దొరికింది.. అంతే కాదు వాళ్లు ఆ ఏరియాలో చిన్నపాటి సెలబ్రిటీలు అయ్యారు. వీరి బిజెనేస్ కూడా సక్సెస్ ఫూల్గా దూసుకుపోతుందంట. -
వక్ఫ్ బోర్డు భూముల లీజులో జలీల్ఖన్ పై మండిపాటు
-
అసలు కౌలు చట్టాలు తెలుసా: పల్లా
సాక్షి, హైదరాబాద్: కౌలు చట్టాలపై అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు రైతుబంధు పథకంపై నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డుతూ, కౌలు రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. కౌలు రైతుల గురించి మాట్లాడుతున్న వారు 1956 టెనెన్సీ యాక్ట్ చదివితే బాగుంటుందన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడే పార్టీలోకి మారతారో ఎవరికీ తెలి యదని పల్లా ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై, మిషన్ భగీరథపై ఏవేవో మాట్లాడుతున్న నాగం వాదనల్లో నిజం ఉంటే కోర్టులకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. -
లీజు రెన్యువల్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: తన స్థలంలో ఉన్న ప్రభుత్వ డిస్పెన్సరీ లీజు పునరుద్ధరణ(రెన్యువల్)కు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వడానికి కార్మిక శాఖ నిరాకరించడంపై ప్రధాని మోదీ ఆంటీగా చెప్పుకుంటున్న 90 ఏళ్ల మహిళ అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించింది. గుజరాత్లోని వాద్నగర్లో దహిబెన్ నరోత్తమ్దాస్ మోదీ నివసిస్తున్నారు. ఆమెకు చెందిన స్థలంలో బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ నడుస్తోంది. 1983లో రూ. 600 అద్దె ఇవ్వగా.. అనంతరం రూ.1,500కు పెంచారు. అప్పటి నుంచి అద్దె పెంచకపోవడంతో గత ఏడాది డిసెంబర్లో లీజు వివరాలు, పునరుద్ధరించక పోవడానికి కారణాలు చెప్పాలంటూ కార్మిక శాఖకు సమాచార హక్కు చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)కి దహిబెన్ ఫిర్యాదు చేశారు. గత వారం సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు వద్దకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. లీజును రెన్యువల్ చేయకపోవడంతో ఆ మొత్తంతో జీవించడం కష్టంగా మారిందని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆమె మొదట దాఖలు చేసిన పిటిషన్కు సరైన సమాధానం రాకపోవడంతో.. 2018 జనవరి 9న ఆమె రెండో అప్పీలు దాఖలు చేశారు. అందులో తాను ప్రధాని మోదీ ఆంటీనని, తనకు న్యాయం జరగకపోతే ప్రధానికే ఈ విషయం తెలియజేస్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో బంధుత్వం గురించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆమె అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ ఎందుకు సమాధానం ఇవ్వలేదని, ఆమె ఆర్టీఐ పిటిషన్ను విచారించిన అధికారులపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలపాలని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు ప్రశ్నించారు. -
ఆ భవనం లీజుకివ్వడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, అల్వాల్లో ఏడో నిజాం నవాబ్ సర్ మీర్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ బహదూర్కు చెందిన 28.48 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్ను లీజుకివ్వడాన్ని సవాల్ చేస్తూ ఏడో నిజాం మునిమనుమరా లు ప్రిన్సెస్ షఫియా సకినా రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటం ప్రారంభించారు. ఏడాదికి రూపాయి చొప్పు న 99 ఏళ్ల పాటు భారతీయ విద్యాభవన్కిచ్చిన లీజును రద్దు చేసి ఆ ప్యాలెస్ను తనకు స్వాధీనం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ సీఎస్, భారతీయ విద్యాభవన్ ప్రెసిడెం ట్, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైదరాబాద్ విలీనం తరువాత తమ ఆస్తుల జాబితాను కేంద్ర హోంశాఖకు ఏడో నిజాం సమర్పించారని, వాటిని అనుభవించేందుకు కేంద్రం అనుమతించిందని ఆమె తెలిపారు. ఏడో నిజాం ఆస్తుల వివరాలు ‘బ్లూ బుక్’లో స్పష్టంగా ఉన్నాయన్నారు. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవన్నారు. ఇలాంటి ఆస్తుల్లో అల్వాల్ సర్వే నంబర్ 157లో ఉన్న కోఠీ ఆసీఫియా ప్యాలెస్ కూడా ఒకటని, ఇది 28.48 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. కంటోన్మెంట్ రిజిస్టర్లో ఈ ఆస్తి నిజాం ఆస్తిగానే రాసి ఉందన్నారు. చట్ట ప్రకారం విలువ లేని లీజ్ ఇది... ఏడో నిజాం చనిపోయిన తరువాత వారసుల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయని, దీంతో అల్వాల్లోని ప్యాలెస్ను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1981లో ఆ ప్యాలెస్ను భారతీయ విద్యాభవన్కు 99 ఏళ్ల పాటు ఏడాదికి రూపాయి చొప్పున లీజుకు ఇచ్చిం దని ఆమె వివరించారు. 11 నెలల్లోపు రిజిస్టర్ కావాల్సిన ఈ లీజు డీడ్ ఆ లోపు రిజిస్టర్ కాలేదని, అందువల్ల దానికి చట్ట ప్రకారం విలువ లేదన్నారు. లీజుకు తీసుకున్న ప్యాలెస్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని ఆమె వివరించారు. ఇప్పటికే భారతీయ విద్యాభవన్ నిర్వాహకులు ఆ ప్యాలెస్ అందాన్ని చెడగొట్టారని, అద్భుతమైన ఫర్నిచర్ను ధ్వంసం చేశారని తెలిపారు. ఆ భవనాన్ని స్వాధీనంలో ఉంచుకుని వాడుకుంటున్నందుకు నెలకు రూ.25 లక్షలను డిపాజిట్ చేసేలా కూడా ఆదేశాలు జారీ చేయాలన్నారు. -
పట్టాదారులు వర్సెస్ కౌలు రైతులు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుంది. ఉగాది నాటికే కౌలు ఒప్పందాలు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ అనేక గ్రామాల్లో అటువంటి సందడే కనిపించడంలేదు. రైతుబంధు పథకంతో గ్రామాల్లో పట్టాదారులకు, కౌలు రైతులకు మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతుంది. కౌలును ఖరారు చేసుకునేందుకు రైతులు ప్రయత్నిస్తుంటే, కౌలుదార్లు ముందుకు రావడం లేదు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తున్నందున ఆ మేరకు కౌలు తగ్గించుకోవాలని కౌలు రైతులు పట్టాదారులను కోరుతున్నారు. అందుకు పట్టాదార్లు ససేమిరా అంటున్నారు. పెట్టుబడి సాయానికి, కౌలుకు ముడిపెట్టడం సరికాదని భూ యజమానులు అంటున్నారు. తమకు పెట్టుబడి సాయం రావట్లేదు కాబట్టి కౌలు తగ్గించాల్సిందేనని కౌలుదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కౌలు ఒప్పందాలు నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కౌలు ఒప్పందాలు ఖరీఫ్లో జరుగుతాయా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఈ కిరికిరితో అనేక చోట్ల పట్టాదారు రైతులు కౌలుకు ఇవ్వకుండా వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు. 85 శాతం సన్న, చిన్నకారు రైతులే.. రాష్ట్రంలో చాలామంది రైతులు తమకున్న భూమికి తోడు మరికొంత కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలు కూడా కౌలు చేస్తుంటారు. మరోవైపు పెద్ద, మధ్య తరగతి రైతులు వ్యాపారం, ఉద్యోగం తదితర కారణాలతో తమ భూమిని కౌలుకు ఇచ్చి పట్టణాలకు వలస వెళ్తుంటారు. బ్యాంకర్ల కమిటీ తేల్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 14లక్షల మంది కౌలు రైతులున్నారు. అంతేకాదు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 40 శాతం మంది వరకు వారే ఉన్నారు. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 61.96 శాతం మంది సన్నకారు రైతులే. వీరి చేతిలో సరాసరి ఎకరా నుంచి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇక చిన్నకారు రైతులు 23.90 శాతం మంది ఉన్నారు. వారి చేతిలో సరాసరి రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకు భూమి ఉంది. అంటే 85.86 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. కౌలు రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. వారికి ప్రైవేటు అప్పులే దిక్కు. ఇంత కష్టపడ్డాక తనకు లాభం వచ్చినా రాకున్నా పంట అనంతరం భూ యజమానికి కౌలు చెల్లిస్తారు. నష్టపోయేది కౌలు రైతులే.. రైతుబంధు పథకం కింద భూ యజమానికి పెట్టుబడి సాయంతోపాటు కౌలు సొమ్ము కూడా అదనంగా అందుతుంది. ఇక్కడ సాగు ఖర్చు అంతా భరించి నష్టపోయేది కౌలు రైతేనన్న చర్చ జరుగుతోంది. ఇంతటి గణనీయ సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు పెట్టుబడి పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాయం చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పడంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పట్టాదారులతో కౌలుదారులు పంచాయితీకి దిగుతున్నారు. -
నాడు విక్రయానికి..నేడు లీజుకు!
చిలకలూరిపేట: గతంలో టీడీపీ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం విక్రయించేందుకు, ఇప్పుడు లీజు ప్రాతిపదికన అప్పగించేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. చిలకలూరిపేటలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేకున్నా వాటి నిర్మాణానికి ఆసక్తి చూపని అధికార యంత్రాంగం అమాత్యుల వారి మెప్పు కోసం విలువైన ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీకి అప్పగించేందుకు హైరాన పడుతున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో నాగార్జున సాగర్ కెనాల్స్ సంస్థకు చెందిన భూమిని దక్కించుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. భవన నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకున్నా ఇప్పటికే ఒకసారి రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన నిర్వహించారు. గతేడాది ఆగస్టు 31న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించి, టేబుల్ అజెండాగా 20 సెంట్ల భూమిలో టీడీపీ కార్యాలయ భవనం నిర్మించుకొనేందుకు తగు చర్యలకై ఆమోదించారు. ఈ విషయమై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అప్పట్లోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అప్పట్లో స్థలాన్ని విక్రయించేందుకు తీర్మానం చేశారు. తిరిగి పం«థా మార్చి అదే స్థలాన్ని టీడీపీ కార్యాలయం నిర్మించుకొనేందుకు లీజు చెల్లించే నిబంధనపై స్థలం అప్పగించేందుకు బుధవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలో చేర్చి ఆమోదించారు. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్కు డిసెంట్ నోటును అందజేశారు. న్యాయస్థానం నిర్మించేందుకు ఇవ్వాలని న్యాయవాదులు కోరిన విషయాన్ని ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా శంకుస్థాపన.. చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఎన్ఆర్టీ రోడ్డులోని ఎన్ఎస్పీ కెనాల్స్ డివిజనల్ కార్యాలయంతో పాటు, సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి. ఈ భూమిలో సర్వేనంబర్ 123సీ–2ఈలో 20 సెంట్ల స్థలం టీడీపీ కార్యాలయ భవన నిర్మాణానికి లీజు ప్రాతిపదికన ఇవ్వాలని తీర్మానించటం వివాదంగా మారింది. ఒక ప్రభుత్వ శాఖకు చెందిన స్థలాన్ని మరో శాఖకు మార్చాలన్నా ఇతర సంస్థలకు విక్రయించాలన్నా, లీజుకు కేటాయించాలన్నా ప్రభుత్వం తప్పనిసరిగా జీవో జారీ చేయాల్సి ఉంటుంది. కేవలం ప్రతిపాదనల స్థాయిలోనే 2016 ఏప్రిల్ నెలలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిబంధనలు కాదని ఏకంగా శంకుస్థాపన చేయటం అధికార దుర్వినియోగానికి అద్దం పట్టింది. టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయించే ప్రతిపాదనలు తెలుసుకొన్న ఎన్ఎస్పీ కెనాల్స్ సిబ్బంది ఈ ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ 2016లోనే జిల్లా కలెక్టర్కు వినతి పత్రం కూడా పంపారు. కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు ఇదే స్థలంలో బాలికల వసతి గృహం నిర్మించేందుకు నాడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు 2003 నవంబర్ 14న శిలాఫలకం వేశారు. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. తదుపరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మర్రి రాజశేఖర్ టీటీడీ బోర్డు మెంబర్గా 2009లో ఆ స్థలం పక్కనే టీటీడీ కల్యాణ మండప నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే ఆ తదుపరి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రత్తిపాటి ఆ ప్రతిపాదనలను పట్టించుకోలేదు. అనంతరం న్యాయస్థానం నిర్మాణానికి బార్ అసోసియేషన్ సభ్యులు ఈ స్థలం కేటాయించాలని కోరుతూ వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఇక్కడ సెంటు రూ. 25లక్షలకు పైబడి ఉంది. ఆ స్థలాన్ని టీడీపీ కార్యాలయ భవనం కోసం నామమాత్రపు ధరకు 20 సెంట్లు భూమిని లీజుకు కేటాయించేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సిరుల మాగాణిలోనే.. చివరి మజిలీ
- కౌలు రైతు అనుమానాస్పద మృతి - ఆత్మహత్య చేసుకున్నట్టు సందేహాలు - పీడలా మారిన అప్పులే కారణమంటున్న కుటుంబ సభ్యులు - ఓదూరులో విషాదం ఆరుగాలం శ్రమించి.. చెమట చుక్కలు చిందించి.. సిరులు పండించిన చేనే.. ఆ అన్నదాతకు ఆఖరి మజిలీ అయింది. కౌలుసాగులో దక్కుతున్నది గోరంత.. పెరుగుతున్న అప్పులు కొండంత కావడం.. అవి తీరే దారి కానరాకపోవడం వంటి కారణాలు అతడి మనసును కలచివేశాయి. మరోదారి లేదనుకున్నాడో ఏమో కానీ.. సుమారు 20 రోజుల కిందట అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అంతకుముందు కూడా అలాగే వెళ్లి.. తిరిగి వచ్చేస్తుండడంతో.. ఈసారి కూడా అలాగే జరుగుతుందని, ఇంటికి తిరిగి వచ్చేస్తాడని కుటుంబ సభ్యులు ఎదురు చూశారు. కానీ, అలా వెళ్లడమే అతడి చివరి ప్రయాణమని వారు ఊహించలేకపోయారు. రామచంద్రపురం రూరల్ : ప్రశాంతంగా ఉన్న ఓదూరు గ్రామంలో ఆదివారం ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామానికి చెందిన రైతు ముమ్మిడివరపు సతీష్ (35) తాను కౌలుకు చేస్తున్న పొలంలోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం గ్రామస్తుల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. సతీష్ ఐదేళ్లుగా ఎనిమిదెకరాల్లో కౌలుకు వరిసాగు చేస్తున్నాడు. భూమి యజమానులు అంగీకరించరన్న ఉద్దేశంతో కౌలు రైతు గుర్తింపు కార్డును అతడు తీసుకోలేదు. దీంతో బ్యాంకు రుణం పొందే అవకాశం అతడికి లేకుండా పోయింది. సాగు అవసరాల కోసం ఈ ఐదేళ్లలో ప్రైవేటు వ్యక్తులవద్ద రూ.2 వడ్డీకి సుమారు రూ.5 లక్షల వరకూ అప్పు చేశాడు. ఇందులో ఇంకా లక్ష రూపాయలకు పైగా అప్పు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అతడు గత నెల 14న అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. గతంలో కూడా ఇలాగే ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి వచ్చేశాడు. ఈసారి కూడా అలాగే వచ్చేస్తాడని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా సతీష్ సాగు చేస్తున్న పంటచేనులో ఎముకల గూడుగా మారిన ఓ అస్తిపంజరాన్ని గ్రామంలో టముకు వేసే తొగరపు పెద్దబ్బులు గుర్తించి, సంబంధిత రైతు కాకర శ్రీరామకృష్ణచౌదరికి సమాచారం అందించాడు. దీంతో ఆయన వీఆర్ఓ వెంకటరెడ్డికి విషయం తెలిపాడు. వీఆర్ఓ నుంచి సమాచారం అందుకున్న రామచంద్రపురం డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, సీఐ కొమ్ము శ్రీధర్కుమార్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలం వద్ద సతీష్ లుంగీ, చొక్కా, చేతి సంచిలను కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించారు. దీంతో ఆ అస్తిపంజరం సతీష్దిగా నిర్ధారించారు. అక్కడి ఆధారాలనుబట్టి సతీష్ తాను కౌలుకు చేస్తున్న చేనులోనే మజా డ్రింకులో పురుగుల మందు కలుపుకొని తాగి, తనువు చాలించినట్టు భావిస్తున్నారు. సంఘటన జరిగి 20 రోజులు పైగా కావడంతో సతీష్ మృతదేహాన్ని నక్కలు పీక్కు తినేశాయి. పుర్రె ఒకచోట, ఎముకల గూడు ఒకచోట ఉండి సంఘటన స్థలంలో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. మృతునికి తండ్రి సత్యనారాయణ, భార్య అన్నపూర్ణ, 12 ఏళ్ల కవల పిల్లలు రాముడు, లక్ష్మణుడుతోపాటు మరో కుమారుడు విజయ్కుమార్ (7) ఉన్నారు. సతీష్ మరణవార్త తెలిసిన వెంటనే భార్య అన్నపూర్ణ స్పృహ తప్పిపోయింది. దీంతో ఆమెను వేళంగిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. తన భర్తకు లక్ష రూపాయలకు పైగా అప్పులున్నాయని, ఐదేళ్లుగా చేస్తున్న వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని ఆమె చెప్పింది. ఈ ఏడాది పంట బాగానే పండినా రేటు తక్కువగా రావడంతో, గతంలో చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయని వాపోయింది. గతంలో పెద్ద కుమారులు పుట్టినప్పుడు సతీష్ తమను వదిలి వెళ్లిపోయాడని, చాలాకాలం తర్వాత తిరిగి వచ్చాడని, ఇప్పుడు కూడా అలాగే వెళ్లి ఉంటాడనుకున్నామని, ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేకపోయామని విలపించింది. యజమాని మృతితో ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులకు కలచివేసింది. పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవాడని, చిన్నకుమారుడు విజయ్కుమార్ను ఎప్పుడూ భుజం దించేవాడు కాదని స్థానికులు అంటున్నారు. సతీష్ మరణంపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎముకల గూడును రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమ సమాజం భూములు ధారాదత్తం
♦ 33 ఏళ్లు సాయి ప్రియా రిసార్ట్స్కు లీజుకిచ్చిన సర్కారు ♦ ఈ భూముల విలువ రూ. 500 కోట్లు సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని ప్రేమ సమాజం అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన రూ.500 కోట్ల విలువైన భూము లను చంద్రబాబు ప్రభుత్వం సాయి ప్రియా రిసార్ట్స్కు కారు చౌకగా కట్టబెట్టింది. ఏడు దశాబ్దాలకు పైగా సేవా కార్య క్రమాలు నిర్వహిస్తున్న ‘ప్రేమ సమాజం’ సంస్థకు 1959లో రావు అండ్ కంపెనీ అ«ధినేత చెరువు ప్రసాదరావు రుషి కొండలోని సర్వే నంబర్ 16, 23, 24లో ఉన్న సుమారు 50 ఎకరాల భూమికి పట్టా రాయించి ఇచ్చారు. 1971లో సర్వే చేయిస్తే నికరంగా 47.33 ఎకరాలు అక్కడ ఉన్నట్టు తేలింది. 2003–04లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రేమ సమాజం కార్యదర్శిని ప్రలోభపెట్టి సాయి ప్రియా రిసార్ట్స్ 33 ఏళ్లకు 33.70 ఎకరాలు లీజుకు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ భూములు తమకు చెందిన వంటూ దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై సంస్థ ప్రతి నిధులు హైకోర్టును ఆశ్రయించగా ఆ భూమిపై హక్కులు ప్రేమ సమాజానివేనని తీర్పు ఇచ్చింది. అయినా భూములపై తమకే హక్కు ఉందని దేవాదాయ శాఖ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రుల ఒత్తిడి మేరకు ఈ భూములను సాయి ప్రియా రిసార్ట్స్కే ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదికిచ్చారు. దీని ఆధారంగా ఈ భూములను 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం గురువారం జీవో 161 జారీ చేసింది. 2003 – 04లోనే లీజుకు తీసుకున్నందున గడిచిన 13 ఏళ్లను లీజు కాలపరిమితిగానే పరిగణిస్తూ మిగిలిన 20 ఏళ్లకు ఏడాదికి రూ.2.62 లక్షల చొప్పున రూ.19.06 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ గజం భూమి రూ.40 వేలకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన 33.70 ఎకరాల భూమి విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. -
30 ఏళ్ల పాటు వక్ఫ్బోర్డు ఆస్తుల లీజు
- వక్ఫ్బోర్డు అధీనంలో నాంపల్లి దర్గా హుండీ - వారం పద్ధతిపై జాన్పాడ్ దర్గా హుండీ వేలం - వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ఆస్పత్రి నిర్మాణం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆదాయ వనరులు పెంచుకునేందుకు 11 రకాల ఆస్తులను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వా లని రాష్ట్ర వక్ఫ్బోర్డు పాలక మండలి సమా వేశం తీర్మానించింది. సోమవారం హైదరా బాద్ హజ్హౌస్లో బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ నాంపల్లిలోని దర్గా యూసుఫైన్ ముతవల్లి పదవీకాలం పొడిగిం పును రద్దు చేస్తూ దర్గా హుండీని వక్ఫ్బోర్డు అధీనంలోకి తీసుకోవాని నిర్ణయించింది. వక్ఫ్బోర్డు ఆస్తులపై హోర్డింగ్ల ఏర్పాటును రద్దు చేసింది. నల్లగొండ జిల్లాలోని హజరత్ జాన్పాడ్ దర్గా హుండీ వారం పద్ధతిపై వేలం వేయాలని, బడా పహాడ్, జహంగీర్ పీరా హుండీలకు టెండర్ పిలవాలని నిర్ణయిం చింది. గుట్టల బేగంపేటలోని ఆస్తులను పూర్తి స్థాయి వక్ఫ్బోర్డు నిర్వహణలోకి తీసుకుంటూ తీర్మానించింది. వక్ఫ్బోర్డు ద్వారా వితంతు వులు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయిం చింది. సీఎంతో చర్చించి రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. వక్ఫ్బోర్డులో పనిచేస్తున్న 70 ఏళ్లు దాటిన వారి సేవలను రద్దు చేస్తూ ఇటీవల పదవీ విరమణ చేసిన ముగ్గురి పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్, మిర్జా అన్వర్ బేగ్, వహీద్ అహ్మద్, డాక్టర్ నాసిర్ హుస్సేన్, మల్లిక్ మోతసమ్ ఖాన్, సోఫియా బేగం తదితరులు పాల్గొన్నారు. -
లీజుకు ఆర్టీసీ స్థలాలు
హైదరాబాద్: ఆర్టీసీ సంస్థకు చెందిన ఖాళీగా ఉన్న 69 స్థలాలను ఆయిల్ కంపెనీలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. 357 బస్ స్టేషన్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఆర్టీసీకి చెందిన మరో 150 స్థలాలను గుర్తించి అదనపు ఆదాయం కోసం కృషి చేస్తున్నామన్నారు. -
ఆయనది అవినీతి దారి
► టైపిస్టుగా చేరి సూపరింటెండెంట్గా ఎదిగి ►ఇదీ వెల్లాల ఆలయాల ఈఓ భాగోతం ప్రొద్దుటూరు టౌన్ : దేవుని సొమ్ము ఒక్క రూపాయి తిన్నా అరగాయించుకోలేరని పెద్దలు చెబుతుంటారు. ఈ కోవలోకే వచ్చా డు వెల్లాల సంజీవరాస్వామి దేవాలయాల ఈఓగా పని చేసి సస్పెండైన మేకల రామాం జనేయులు. టైపిస్టుగా చేరి సూపరింటెండెం ట్ స్థాయికి ఎదిగిన ఆయన డిప్యుటేషన్ పే రుతో జిల్లాలోని పలు ఆలయాలకు ఈఓగా పని చేశారు. ఎక్కడ పని చేసినా అధికార పార్టీనేతలతో చేతులు కలపడం, ఆలయ భూములను అక్రమ పద్ధతుల్లో లీజులకు ఇవ్వడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మిట్టా పాపయ్య సత్రం... ప్రొద్దుటూరు పట్టణం శివాలయం వీధిలో దాదాపు దాదాపు 50 సెంట్ల మిట్టాపాపయ్య సత్రానికి చెందిన స్థలాన్ని వాణిజ్య అవసరాల కోసం కొన్నేళ్ల కిందట అప్పటి ఈఓగా ఉన్న మేకల రామాంజనేయులు లీజుకు ఇ చ్చారు. ఈ స్థలంలో నందిని క్లాత్ మార్కెట్ పేరుతో నిర్మాణం పనులు మొదలెట్టారు. మూడు అంతస్తులు నిర్మాణం పూర్తయింది. దీనిపై మిట్టా పాపయ్య వంశీకులు కోర్టును ఆశ్రయించారు. దేవాలయ భూములను ఏవి ధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారని కో ర్టు ప్రశ్నించి అనుమతులను రద్దు చేసింది. వ స్త్ర దుకాణదారుల నుంచి లీజు హక్కులు పొంది న వారు భారీ మొత్తంలో అడ్వాన్స్ లు వసూలు చేశారు. అనుమతులు రద్దు కావడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో వ్యా పారులు తీవ్రంగా నష్టపోయారు. జీఓ ఎం ఎస్ నంబర్ 866 ఏపీ ఎండోమెంట్ యాక్టుకు విరుద్ధంగా నారాయణ రంగయ్య సత్రానికి చెందిన వ్యవసాయ భూమిని లీజుకు ఇవ్వడంపై కూడా కోర్టు మొట్టికాయ వేసింది. రాయచోటిలో... రాయచోటి వీరభద్రస్వామి ఆలయ ఈఓగా పని చేసిన సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. కర్ణాటక భక్తులు ఇచ్చిన డబ్బును ఆలయ అకౌంట్లో జమ చేయకుండా స్వాహా చేశాడని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి నుంచి తిరిగి ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ప్రొద్దుటూరులోని అగస్తే్యశ్వరస్వామి, చాపాడు మండలంలో ఉన్న అల్లాడుపల్లె ఆలయాలు, నారాయణ చౌల్ట్రీ, మిట్టాపాపాయ్య సత్రం స్థలాలకు సంబంధించి ఈఓగా పని చేసిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వెల్లాలలో... వెల్లాల సంజీవయరాయస్వామి దేవాలయా ల ఈఓగా పని చేస్తున్న సమయంలో శని వారాలు మాత్రమే గుడికి వచ్చేవాడు. భక్తులు అన్నదానానికి ఇచ్చే డబ్బును అకౌంట్లో రా సేవాడు కాదని, ఇక్కడ పని చేస్తున్న కొందరు అర్చకులతో సత్సంబంధాలు పెట్టుకొని అవినీతికి పాల్పడేవారన్నా ఆరోపణలు లేక పోలేదు. హైదరాబాదులో నివాసం ఉండటంతో ఎక్కువ సమయం అక్కడే గడిపేవాడని అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. అలాగే గుడికి సంబంధించిన సర్వే నెంబర్ 177లో 5.13 ఎకరాల స్థలంలో దేవాదాయ కమిషనర్ అనుమతులు లేకున్నా అక్కడ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో తన వాటాగా కొంత శాతం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా అవినీతి ఈఓపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అతని బాగోతం బయటపడుతుందని ఆశాఖలోని అధికారులే అంటున్నారు. -
99 యేళ్ల లీజ్ ఘనత.. టీఆర్ఎస్ ప్రభుత్వానిదే
గన్ఫౌండ్రీ : ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలాన్ని 99 సంవత్సరాలు లీజ్కు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ అన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ముగింపు ఉత్సవాల అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్అలీ మాట్లాడుతూ... హైదరాబాద్లో నిర్వహించే నుమాయిష్ ప్రదర్శన ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని శాంతి రాష్ట్రంగా అభివర్ణింపజేస్తుందన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఈ ఏడాది కొంత వ్యాపారం తగ్గిందన్నారు. విద్యాభివృద్ధికి పాటుపడుతున్న సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక్కటేనన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... సామాన్య విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలతో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ జమ్మూకాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారులు నుమాయిష్లో పాల్గొనడం ప్రశంసనీయమన్నారు. అనంతరం పలు కళాశాలల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను, నుమాయిష్ ప్రదర్శనలో అత్యంత వ్యాపారం చేసిన స్టాల్ యజమానులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్యా మార్గం, సొసైటీ ప్రతినిధులు రంగారెడ్డి, సుఖేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేవస్థానం సత్రాల లీజుకు వేలంపాట
అన్నవరం : అన్నవరం దేవస్థానానికి కొండ దిగువన పాత బస్టాండ్ సమీపంలో గల పంపా సత్రం (పంపా ఎమినిటీస్ సెంటర్), కిర్లంపూడి, శంఖవరం గ్రామాల్లోనిS సత్యదేవ కల్యాణ మండపాలను ప్రవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు బుధవారం సాయంత్రం టెండర్ కం వేలం నిర్వహించి ఖరారు చేశారు. పంపా సత్రం మూడేళ్లకు లీజు : అన్నవరంలోని పంపా సత్రాన్ని ఏటా పదిశాతం పెంపు పద్ధతిన మూడేళ్ల పాటు లీజు కిచ్చేందుకు బుధవారం సాయంత్రం టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో మొదటి ఏడాదికి రూ.7.05 లక్షలు, రెండో ఏడాది పదిశాతం పెంచి చెల్లించేందుకు, రెండో ఏడాది లీజు మొత్తంపై మూడో ఏడాది పది శాతం చెల్లించేందుకు పాట ఖరారైంది. అలాగే శంఖవరం, కిర్లంపూడి గ్రామాల్లో దేవస్థానం 1999–2000 సంవత్సరాల మధ్య రూ. మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు కల్యాణ మండపాలకు లీజు కిచ్చేందుకు వేలం నిర్వహించారు. కిర్లంపూడి కల్యాణ మండపం ఏడాదికి రూ.2.55 లక్షలు, శంఖవరం కల్యాణ మండపం ఏడాదికి రూ.32 వేలుకు లీజు ఖరారైంది. పాట నిర్వహణలో దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, ఏఈఓ లు ఎంకేటిఎన్వి ప్రసాద్, శ్రీనివాస్, నటరాజ్, సూపరిండెంట్ లక్ష్మణస్వామి పాల్గొన్నారు. -
కౌలుకు శ్మశానం!
శ్మశాన భూముల సర్వే రిపోర్టులు బుట్టదాఖలు గతంలో రెవెన్యూ, జీవీఎంసీ సంయుక్త సర్వే కలెక్టరు బదిలీతో ఆగిన చర్యలు విశాఖపట్నం: ఎక్కడయినా రైతుల భూము లు కౌలుకు ఇస్తుంటారు. ఇందులో విడ్డూరమేం లేదు. మరి శ్మశానాన్ని ఎక్కడయినా కౌలుకు ఇవ్వడం తెలుసా... ఇదేంటని ఆశ్చర్యపోతున్నారు కదూ... ఔను నిజమే మరి. ఇది గోపాలపట్నం శివారు వెంకటాపురంలో జరుగుతున్న వింత. ‘శ్మశానాలు కబ్జా చేసి కౌలుకిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా... మీరుండి దేనికి... సర్వే చేసి చర్యలు తీసుకోండని రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ శేషాద్రి ఆదేశించినా రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఆ దిశగా స్పందించలేదు. కలెక్టర్ ఆదేశించాక ఏదో హడావుడిగా ఆ ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయారు. ఇపుడా ఫైలు బుట్టదాఖలు చేసేశారు అధికారులు. ఆ సర్వే ఏమయిందో... భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేదో ప్రశ్నార్థకంగా ఉంది. వెంకటాపురం సర్వే నంబరు 109, 110లో దాదాపు 7.35 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన స్థలం ఉంది. వెంకటాపురం, పద్మనాభనగర్, ఎస్సీ బీసీ కాలనీ, కంపరపాలెం, నందమూరినగర్ ప్రాంతాలకు ఇదే శ్మశానం. ఇక్కడ జీవీఎంసీ అభివృద్ధి పనులు చేపట్టకపోవడంఆక్రమణదారులకు ఇష్టారాజ్యమయింది. కౌలుకు శ్మశానం : శ్మశాన స్థలాన్ని కొందరు అంచెలంచెలుగా ఆక్రమించి పొలాలుగా మార్చేశారు. అరటితోటలు, మిర్చితోటలు, వరి, నువ్వులు పండిస్తున్నారు. ఇలా ఇక్కడ దుక్కు దున్నేసి ఇపుడు శ్మశానానికి పావు ఎకరమే మిగిల్చారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ భూఆక్రమణకు పాల్పడినవారు ఇంకో ఘనకార్యం చేశారు. వీరు మరికొందరికి ఇక్కడి భూములు కౌలుకిచ్చి సొమ్ము చేసుకుంటుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ కోట్ల విలువయిన భూమి అన్యాక్రాంతమవడంపై ఇంతవరకూ పనిచేసిని జిల్లా కలెక్టర్లందరికీ స్ధానికులు ఫిర్యాదులు చేస్తుండడడం, కిందిస్ధాయి అధికారులకు మొక్కుబడిగా ఆదేశాలిచ్చి ఆ ఫిర్యాదులను బుట్టదాఖలు చేయడం సాధారణమయిపోయింది. ఫలించని ఆదేశాలు : ఇక్కడి ఆక్రమణలపై గతంలో కలెక్టర్లుగా పనిచేసిన ప్రవీణ్ప్రకాష్, శేషాద్రి స్పందించారు. భూములు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ నిర్మించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కదిలినట్లు నటించారు. అప్పట్లో ఇక్కడ రెవెన్యూ, జీవీఎంసీ సంయుక్త సర్వే చేపట్టారు. సర్వే రికార్డుల ఆధారంగా భూముల్ని పరిశీలించారు. అయినా చర్యలు జరిగితే ఒట్టు. దీంతో ఆక్రమణదారులు మరింత ముందుకొచ్చేశారు. ఉన్న భూమిని కుదించేశారు. ఇలా ఫిర్యాదు చేసీ చేసీ స్థానికులు విసిగిపోయారు. అధికారులపై నమ్మకం కోల్పోయారు. -
‘మల్టీ’ టాస్క్!
► ఎంఎంటీఎస్ స్టేషన్లలో బహుళ అంతస్థుల భవనాలు ► మల్టీప్లెక్స్ థియేటర్లు, షాపింగ్ మాల్స్ ► ఏటా రూ.250 కోట్లకు పైగా ఆదాయం ► రైల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలు సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ స్టేషన్లు ఇక వాణిజ్య భవన సముదాయాలుగా అవతరించనున్నాయి. రవాణాతో పాటు సినిమాలు, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ కేంద్రాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్రయాణికులతో పాటు సందర్శకులకు చక్కటి వినోదం, షాపింగ్ సదుపాయాన్ని అందజేయనున్నాయి. ప్రయాణికుల టిక్కెట్లపై వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా... రైల్వే స్థలాలను వాణిజ్య కార్యకలాపాలకు లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని రైల్వే స్థలాలపై సమగ్ర సర్వే చేసిన రైల్ డెవలప్మెంట్ అథారిటీ వీటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించింది. నగరంలోని ప్రధాన ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లకు ఆనుకొని ఉన్న స్థలాల లీజుతో ఏటా రూ.250 కోట్లకు పైగా ఆదాయం లభించగలదని అంచనా వేసింది. అధికారులు ఈ దిశగా కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. అంతా లీజు బేరమే... ఒక్కొక్క రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వేకు అందుబాటులో ఉన్న స్థలాన్ని గుర్తించి వ్యాపార సంస్థలకు 45 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని రైల్వే ల్యాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ సూచిం చింది. దేశవ్యాప్తంగా రైల్వే స్థలాలపై సర్వేలు నిర్వహించి, వాటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించే ఈ సంస్థ (రైల్వేకు అనుబంధంగా పని చేస్తుంది.) ప్రతినిధుల బృందం ఇటీవల నగరంలో విస్తృతంగా పర్యటించింది. నిత్యం పర్యాటకులు, సందర్శకులతో రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు రైల్వేస్టేçషన్లతో పాటు, బేగంపేట్, ఖైరతాబాద్, లకిడీకాపూల్ ఎంఎంటీఎస్ స్టేషన్లలోని రైల్వే స్థలాలను వాణిజ్య సముదాయాలుగా అభివృద్ధి చేయవచ్చునని సూచించింది. రైల్వే ల్యాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ అందించినlవివరాల ప్రకారం సంజీవయ్య పార్కు స్టేషన్కు ఆనుకొని సుమారు ఎకరా స్థలం ఉంది. దీన్ని లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.45 కోట్లు లభిస్తుంది. నెక్లెస్ రోడ్డు స్టేషన్ వద్ద ఉన్న ఎకరంపై మరో రూ.60 కోట్లు ఆర్జించవచ్చు. బేగంపేట్ రైల్వేస్టేషÙన్ ప్రాంతంలో 2 వేల గజాలు ఉంది. ఖైరతాబాద్, లకిడీకాపూల్ స్టేషన్లలో ఒకటిన్నర ఎకరం ఉన్నట్లు అంచనా. ఒక్కో స్టేషన్లో రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు లభిస్తుంది. ఈ ఐదు స్టేషన్లలోని స్థలాలను లీజుకు ఇవ్వగలిగితే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు లభించగలదని రైల్వే ల్యాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాథమిక అంచనా. రెండో దశలో సనత్ నగర్, హైటెక్ సిటీ, లింగంపల్లి, బోరబండ, నేచర్క్యూర్ తదితర స్టేషన్లను ఆనుకొని ఉన్న స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
కౌలుకు ఇవ్వలేదని.. కాటికి పంపారు
భార్యతో కలిసి తమ్ముడు, మరదలును చంపిన అన్న అనాథలైన పిల్లలు... పోలీసుల అదుపులో నిందితులు తమకు పొలాన్ని కౌలుకు ఇవ్వలేదన్న కోపంతో తమ్ముడిని, మరదలిని అన్న, వదిన కలిసి చంపేశారు.. దీంతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.. ఈ సంఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసులో నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మక్తల్ : మండలంలోని రుద్రసముద్రానికి చెందిన చిన్న లింగప్ప (35), నడిపి లింగప్ప సొంత అన్నదమ్ములు. వీరికి శివారులో నాలుగెకరాల చొప్పున పొలం ఉంది. కాగా, పదిరోజుల క్రితం తమ్ముడు తన భూమిని ఇతరులకు కౌలు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. దీంతో అన్న తనకు కాకుండా వేరే వారికి ఇవ్వొద్దని మందలించడమేగాక తుదముట్టిస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం భారీగా ఈదురుగాలులు రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంతా చీకటిమయంగా మారింది. అదే రాత్రి భోజనం చేశాక చిన్న లింగప్ప ఆరుబయట, భార్య మణెమ్మ (30) అలియాస్ పద్మమ్మ, కుమారుడు రాకేష్, కూతురు మహేశ్వరి ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు. ఇదే అదనుగా భావించిన అన్న నడిపి లింగప్ప, వదిన లక్ష్మి అర్ధరాత్రి దాటాక వచ్చి గొడ్డలితో తమ్ముడు, మరదలిని నరికి చంపేసి పారిపోయారు. కొద్దిసేపటికి మేల్కొన్న చిన్నారులు తమ తల్లిదండ్రులు హత్య కు గురైనట్టు తెలుసుకుని చుట్టుపక్కలవారికి రోదిస్తూ చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, స్థానిక సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి జాగిలాన్ని రప్పించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం ఊట్కూర్లో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇక మాకెవరు దిక్కు? అభం, శుభం తెలియని చిన్నారుల దీనస్థితి చూసి గ్రామస్తులు చలించి పోయా రు. ప్రాథమిక పాఠశాలలో రాకేష్ నాలుగో, మహేశ్వరి ఒకటో తరగతి చదువుతోంది. ‘మా అమ్మ, నాన్నలను పెద్దమ్మ, పెద్దనాయనలే చంపేశారు..’ అంటూ చిన్నారులు రోదిస్తూ పోలీసులకు చెప్పడం అక్కడి వారిని కలచివేసింది. ఇక మాకెవరు దిక్కు ఎవరంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనతో వారిద్దరూ అనాథలుగా మారా రు. అలాగే సంఘటన స్థలాన్ని డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీటీసీ సభ్యుడు వాకిటి శ్రీహరి, డీసీసీ ఉపాధ్యక్షుడు అక్కల సత్యనారాయణ తది తరులు పరిశీలించారు. అనంతరం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. -
లీజు కాదు.. అమ్మకమే
పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల విక్రయం * అయినకాడికి విక్రయిద్దామన్న సీఎం * పారిశ్రామిక విధానంలో సవరణలు తెస్తూ జీవో 48 జారీ * ఇక ప్రైవేట్ సంస్థలు ఇష్టానుసారంగా ఆ భూములను అమ్మేసుకోవచ్చు * మూడు సంస్థలకు ఇప్పటికే 1,617.56 ఎకరాల విక్రయం సాక్షి, హైదరాబాద్: పేద రైతుల పొట్ట కొట్టి పెద్దలకు విందు భోజనం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీఐఐసీని అడ్డుపెట్టుకుని రైతులనుంచి నామమాత్రపు ధరకు సేకరించిన వేలాది ఎకరాల భూములను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు సంతర్పణ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. లీజుకు ఇవ్వాల్సిన భూములను అన్ని హక్కులతో అమ్మేసేందుకు సవరణలు తీసుకువస్తూ సీఎం చంద్రబాబు స్వయంగా జీవో జారీ చేయించేశారు. దీనిపై అధికార వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులకు భూములను 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని పారిశ్రామిక, పర్యాటక విధానంలో ఉంది. అలాగే వెనుకబడిన ప్రాంతంగా ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతంలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేసే మెగా ప్రాజెక్టులకు అన్ని హక్కులతో భూములు విక్రయించే విషయాన్ని సీఎం అధ్యక్షతన జరిగే పారిశ్రామిక ప్రోత్సాహక మండలి పరిశీలించవచ్చునని 2015 ఏప్రిల్ 29వ తేదీన ప్రకటించిన పారిశ్రామిక విధానంలో పేర్కొన్నారు. ఆ భూములను తమకు పూర్తిగా విక్రయించకపోతే పెట్టుబడులు తీసుకురావడం కష్టంగా ఉందని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. దీంతో చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పారిశ్రామిక విధానంలోనే సవరణలు తేవాలని గత నెల 2వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు ‘ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మండలి సమావేశం’ అనే పదాన్ని తొలగించేశారు. లీజుకు ఇవ్వాల్సిన భూములను సర్వ హక్కులు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు విక్రయించడాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)తో పాటు సంబంధిత శాఖల అధికారులు వ్యతిరేకించిన నేపథ్యంలో ఏకంగా నూతన పారిశ్రామిక విధానంలోనే సవరణలు తీసుకువచ్చారు. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ కార్యదర్శుల సమావేశంలో కూడా ఔట్ రైట్ సేల్ను వ్యతిరేకించారు. అయినాసీఎం అధ్యక్షతన జరిగిన పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఔట్ రైట్ సేల్కు నిర్ణయం తీసుకుని జీవో-48 జారీ చేయించారు. భూములు విక్రయించాలంటూ క్యూ ఎటువంటి షరతులు లేకుండా భూములపై పారిశ్రామిక వేత్తలకు సర్వహక్కులు కల్పిస్తూ అమ్మేయడానికి జీవో-48 మార్గం సుగమం చేయడంతో ఏపీఐఐసీ చెలరేగింది. కాకినాడలోని ఓ సంస్థకు గతంలో కేటాయించిన 1,563 ఎకరాలను ఔట్ రైట్ సేల్ కింద విక్రయించేసింది. ఆ భూములను షరతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ఆ సంస్థ కోరుతోంది. మరోవైపు చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో నాలుగు మొబైల్ సెల్ఫోన్ కంపెనీలకు 69.56 ఎకరాలను ఎకరం రూ.20 లక్షల చొప్పున అమ్మేయాలని ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. ఓ సెల్ఫోన్ సంస్థకు 19.28 ఎకరాలను, మరో సంస్థకు 15 ఎకరాలను, ఓ కంపెనీకి 15 ఎకరాలను, మరో పారిశ్రామిక సంస్థకు 19.28 ఎకరాలను ఔట్ రైట్ సేల్కు ఇచ్చేశారు. అనంతపురం జిల్లా గుడిపల్లి గ్రామంలో ఓ కంపెనీకి 25 ఎకరాలను ఎకరం రూ. పది లక్షల చొప్పున ఏపీఐఐసీ ఔట్ రైట్ సేల్కు ఇచ్చేసింది. కర్నూలు జిల్లాలో ఫుడ్ పార్కు ఏర్పాటుకు ఓ సంస్థకు ప్రభుత్వం 623 ఎకరాలను లీజుకు కేటాయించింది. ఆ సంస్థ కూడా లీజును తొలగించి ఔట్ రైట్ సేల్ కింద ఇవ్వాలని కోరింది. త్వరలోనే 623 ఎకరాలను ఔట్ రైట్ సేల్కు ప్రభుత్వం ఇచ్చేయనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరికొన్ని సంస్థలు ఔట్రైట్ సేల్ కోసం ఇక క్యూ కట్టనున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. భూములను అమ్మేయడం దారుణం రైతుల నుంచి పరిశ్రమల కోసం అని తీసుకున్న భూములను పరిశ్రమలు స్థాపించకుండానే పారిశ్రామిక వేత్తలకు విక్రయ హక్కులు కట్టబెట్టడం దారుణమని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఏర్పాటయ్యే ప్రత్యేక ఆర్థిక జోన్ల విధానంలో భూములను లీజుకు మాత్రమే ఇవ్వాలని ఉందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అమ్మేయడం, అదీ రాయితీ ధరలతో ఇవ్వడం అన్యాయమని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. పరిశ్రమల కోసం భూములు తీసుకున్న సంస్థలు... రైతుల నుంచి కారు చౌకగా తీసుకున్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ములు చేసుకున్నా అడిగే అధికారం ప్రభుత్వానికి ఉండదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏపీఐఐసీని దళారీగా పెట్టి రైతుల నుంచి నామమాత్రపు ధరకు సేకరించి, అధిక ధరలకు వాటిని అమ్ముకునే అధికారం ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టడం కంటే దారుణం ఏముంటుందని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. -
ఆర్టీసీ లీజుబాట
ఆదాయం పెంపుదలే లక్ష్యం శ్రీకాకుళం కాంప్లెక్స్లో 1.5 ఎకరాల స్థలం లీజుకు రంగం సిద్ధం చేసిన అధికారులు శ్రీకాకుళం అర్బన్ : ఆదాయమే లక్ష్యంగా... నష్టాలనుంచి గట్టెక్కడమే ధ్యేయంగా ఆర్టీసీ కొత్త మార్గాలను వెదుకుతోంది. సంస్థ పరిధిలోని స్థలాలను లీజుకి వ్వడం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని యోచిస్తోంది. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో దాదాపు రూ. 20 కోట్ల మేర నష్టాల్లో ఉన్నప్పటికీ రాజమండ్రి పుష్కరాలు ఆర్టీసీకి కలిసొచ్చాయి. ప్రైవేటు వాహనాల హవా కొనసాగినా ప్రయాణికులు ఆర్టీసీనే నమ్ముకుని అధిక సంఖ్యలో ప్రయాణించారు. దీంతో సంస్థ కొంతమేర నష్టాల నుంచి గట్టెక్కింది. మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా స్థలాన్ని లీజుకు ఇస్తామని సంస్థ ఎండీ ఇప్పటికే ప్రకటించారు. జోన్-1 పరిధిలో తుని, రాజమండ్రి, విశాఖ, ఎస్.కోట, చోడవరం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో ఆర్టీసీ స్థలాలను లీజుకు కట్టబెట్టిన అధికారులు ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలపై దృష్టి సారించారు. టెండర్ల కోసం ప్రతిపాదనలు విజయనగరంలోని ఆర్ఎం కార్యాలయం ఎదురుగా ఉన్న మూడెకరాల స్థలాన్ని, విశాఖలోని మద్దిలపాలెం డిపో పరిధిలో ఆరెకరాలు, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో 1.5 ఎకరాల స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు ప్రతిపాదనలు పంపించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ 16.82 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో బస్టాండ్తోపాటు శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోలు ఉన్నాయి. అదే ప్రాంతంలో ఇప్పటికే కొన్ని భవనాలు నిర్మించి అద్దెలకు ఇచ్చారు. మరికొంత స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్తోపాటు సులభ్ కాంప్లెక్స్ ఉంది. దీనిపై వచ్చే ఆదాయం కంటే లీజుద్వారా వచ్చే భారీ మొత్తమే ఉపయోగపడుతుందని భావించి ఉన్నతాధికారులు ఫైలును హైదరాబాదుకు పంపించినట్లు తెలుస్తోంది. సుమారు ఎకరంన్నర స్థలాన్ని బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన కట్టబెట్టేందుకు యోచిస్తున్నారు. బ్యాంకు చిక్కులు తప్పేనా... ఆర్టీసీ పరిధిలో ఉన్న కొంత స్థలాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తెచ్చారు. ప్రస్తుతం వాయిదాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు అదేస్థలంలో ఉన్న కొంత భాగాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే యోచనలో ఉన్నారు. ఇదేవిషయం గుర్తించిన బ్యాంకు సిబ్బంది ఆర్టీసీ అధికారులను వివరణ కోరినట్లు తెలుస్తోంది. తమవద్ద స్థలం తాకట్టుపెట్టి రుణం తీసుకున్న సందర్భంలో అదే స్థలం పరిధిలో ఉన్న స్థలాన్ని లీజుకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తోంది. బ్యాంకు నుంచి ఎన్వోసీ వస్తే లీజుకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించేది లేదని, న్యాయపరంగానే లీజుకు ముందుకు వెళతామని ఆర్టీసీలోని ముఖ్య ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. -
ఇక ఎంతకాలమైనా భూముల లీజు
-
వన్ బై టు!
సాక్షి, సిటీబ్యూరో : ఓ అధికారి చేసిన నిర్వాకం హెచ్ఎండీఏకు తల పోటు తెచ్చిపెట్టింది. నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా స్థలాన్ని ఒకే తేదీన రెండు సంస్థలకు లీజ్కు ఇవ్వడం వివాదానికి మూల కారణమైంది. లీజ్ ఒప్పందం ప్రకారం పీపుల్స్ ప్లాజా స్థలాన్ని తమకే ఇవ్వాలని ఆ రెండు సంస్థలూ పట్టుబట్టడంతో సమస్య ముదురు పాకానపడింది. ఓ వైపు హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్, మరో వైపు గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం‘ఫేషియల్ యోగా’ కార్యక్రమం. ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఎటూ పాలుపోని పరిస్థితిలో ‘వన్ బై టు’ విధానాన్ని కొత్తగా ప్రవేశ పెట్టాల్సిన అగత్యం ఎదురైంది. విధానపరంగా ఇది హెచ్ఎండీఏను చిక్కుల్లో పడేయడమే సంస్థ ఇమేజ్కు మచ్చ తెచ్చిపెట్టింది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించుకొనేందుకు అసోసియేషన్ ఆఫ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఆ స్థలాన్ని లీజ్కు తీసుకొంది. ఇందుకు గాను రోజుకు లక్ష రూపాయల చొప్పున లీజ్ మొత్తం చెల్లించేలా హెచ్ఎండీఏతో ఒప్పందం చేసుకొని ప్రాథమిక రుసుం మొత్తాన్ని చెల్లించింది. ఈ నేపథ్యంలో గిన్నిస్ బుక్ రికార్డ్స్ కోసం ‘ఫేషియల్ యోగా’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ‘బీయింగ్ హ్యూమన్ ఆర్గనైజేషన్’పీపుల్స్ ప్లాజాను ఈ నెల 11న ఉదయం 6-10గం.ల వరకు లీజ్కు తీసుకొంది. ఇందుకోసం రూ.10వేలు దరావత్తు సొమ్ము కూడా చెల్లించింది. అయితే అప్పటికే ఆ స్థలాన్ని హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కోసం లీజ్కు ఇచ్చిన బీపీపీ అధికారులు ఆ విషయాన్ని విస్మరించి బీయింగ్ హ్యూమన్ సంస్థకు కూడా లీజ్కు ఇస్తూ ఒప్పందం చేసుకొన్నారు. దీంతో ‘ఫేషియల్ యోగా’ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేసుకొనేందుకు శనివారం బీయింగ్ హ్యూమన్ సంస్థ నిర్వాహకులు రావడంతో అక్కడ ఎగ్జిబిషన్ కొనసాగుతున్న విషయాన్ని హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు. తాము గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని ఒప్పందం మేరకు తమకు పీపుల్స్ ప్లాజాను అప్పగించాలని గట్టిగా కోరారు. అటు ఎగ్జిబిషన్ కూడా ఈనెల 11వరకు కొనసాగాల్సి ఉండడంతో వారు ఆ స్థలాన్ని ఖాళీ చేసేందుకు ససేమిరా అన్నారు. దీంతో పీపుల్స్ ప్లాజా లీజ్ వ్యవహారం పీటముడిలా మారింది. ఇందుకు బాధ్యులైన వారిపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సమస్యను ఏదోలా పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులకు పురమాయించారు. ఈ మేరకు శనివారం అధికారులు పీపుల్స్ ప్లాజా వద్దకు చేరుకొని ఇరు సంస్థల నిర్వాహకులతో చర్చించి ఆ స్థలాన్ని వన్ బై టు చేసేందుకు ఒప్పించారు. దీంతో పీపుల్స్ ప్లాజాలోని డయాస్క్ ఎదురుగా కొంత స్థలాన్ని ఖాళీ చేయించి ప్రత్యేకంగా బారికేడ్స్ ఏర్పాటు చేయడం ద్వారా ‘ఫేషియల్ యోగా’ కార్యక్రమానికి అంతరాయం కల్గకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ గందరగోళానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ నిర్ణయించినట్లు సమాచారం. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా పక్కా విధానాన్ని బీపీపీలో అనుసరించాలని శాలిని మిశ్రా అధికారుల్ని ఆదేశించారు. -
రైతు బలవన్మరణం
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పూసం భద్రయ్య (50)కు రెండెకరాల పొలం ఉంది. దీనికితోడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. గతేడాది, ఈ ఏడాది కలిపి రూ.2 లక్షల మేర అప్పులు చేశాడు. వర్షాలకు పూత, పిందె రాలిపోవడంతో మనస్తాపం చెందిన భద్రయ్య సోమవారం రాత్రి పురుగుల ముందు తాగాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. -
భూసేకరణకు చెక్!
ఆర్డినెన్స్ ఉపసంహరణ యోచనలో కేంద్రం ♦ అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ చెల్లుబాటు కాదు ♦ అమల్లోకి 2013 భూసేకరణ చట్టం ♦ దీని ప్రకారం బహుళ వార్షిక పంటలు పండే భూములను సేకరించరాదు ♦ 80% ప్రజల మద్దతు అనివార్యం ♦ సామాజిక ప్రభావం మదింపు చేయాలి ♦ అయినా సేకరించాలంటే ఎకరాకు రూ. 5 కోట్లు చెల్లించాలి ♦ 11 వేల ఎకరాలను సేకరించాలంటే దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయం సాక్షి, హైదరాబాద్: భూ సేకరణ, నష్టపరిహారం, పునరావాస, పునరుపాధి కల్పన చట్టానికి (2013) సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటే రాష్ట్ర రాజధానికి భూ సేకరణకు బ్రేక్ పడుతుందంటున్నారు న్యాయవాద, హక్కుల సంఘాలు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి మూడుసార్లు ఆర్డినెన్స్ను జారీ చేసినా పార్లమెంటులో చట్టం కాకపోవడంతో ప్రభుత్వం దాదాపు ఉపసంహరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. పూర్తిగా ఉపసంహరించుకోకుండా వివాదాస్పదమైన కీలకాంశాలను సడలించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 14న- కేంద్రం ఆర్డినెన్స్ ఆధారంగా భూ సేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్కు విలువ లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ఆర్డినెన్స్ ఉపసంహరించుకుంటే అమల్లోకి వచ్చే 2013నాటి భూసేకరణ చట్టప్రకారం రాజధానికి 11 వేల ఎకరాలను సేకరించాలంటే ప్రభుత్వం కనీసం రూ.60 వేల కోట్లు రైతులకు చెల్లించాలని, సహాయ పునరావాస పథకానికి మరో 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. 80 శాతం మంది రైతులు ఆమోదిస్తేనే... 2013 నాటి భూ సేకరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావ మదింపు అనివార్యం. ప్రైవేటు వ్యవహారమైతే 80 శాతం మంది, పబ్లిక్ వ్యవహారమైతే 70 శాతం మంది భూ యజమానుల అనుమతివ్వాలి. సర్వే, నిపుణుల కమిటీ పరిశీలన జరగాలి. దీనికి11 నెలల గడువు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భూ సేకరణ మొదలు పెడితే 2016 ఆగస్టునాటికి కానీ పూర్తికాదు. పంట పొలాలు తీసుకునే వీలు లేదు... చట్టంలోని మూడో అధ్యాయం సెక్షన్ 10-ఎ ప్రకారం బహుళ పంటలు పండే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. గత్యంతరం లేక తీసుకుంటే దానికి సమానమైన భూమిని అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం రాజధానికి గుర్తించిన 29 గ్రామాల్లో (మరో నాలుగు గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది) లక్షా 40 వేల మంది జీవనోపాధి కోల్పోతారు. 90 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. దీన్ని మదింపు చేయాలి. సహాయ పునరావాస ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్)ని అమలు చేయాలి. నిర్వాసితులకు పూర్తి ప్రత్యామ్నాయం కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలి. బాబు ప్రభుత్వం ఈ ప్యాకేజీ ఊసెత్తకుండా భూసమీకరణ చేస్తోంది. కేంద్రం ఆర్డినెన్స్ రద్దయితే రూ.వేల కోట్లు అవసరమవుతాయి. పరిహారానికే రూ.70 వేల కోట్లు కావాలి... రాజధాని ప్రాంతంలో 44 వేల ఎకరాల భూ సమీకరణకు రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి 22 వేల ఎకరాలు సమీకరించినట్టు ప్రకటించింది. మిగతాదాన్ని భూ సేకరణ చట్టం కింద తీసుకుంటామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఒకే ప్రయోజనం (రాజధాని నిర్మాణం) కోసం రెండు నోటిఫికేషన్లు, వేర్వేరు చట్టాలను ప్రయోగిస్తోంది. భూ సమీకరణ పథకం కింద భూమి ఇచ్చిన జరీ భూముల రైతులకు ఒక ఎకరానికి 1450 గజాలు, మెట్టరైతులకు 1200 గజాల అభివృద్ధి చేసిన భూమిని, ఏటా రూ. 50 వేలుచొప్పున కౌలు ఇస్తామని ప్రకటించింది. 2013 చట్టం ప్రకారం భూమిని సేకరిస్తే మార్కెట్ విలువ ్ఠ1.25 ఫార్ములా (ఏపీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్) (తెలంగాణ అయితే 2, మహారాష్ట్ర అయితే 5) ప్రకారం పరిహారం చెల్లించాలి. దీంతోపాటు భూమి ఇచ్చిన వారికి సాంత్వన (సొలాషియమ్) కింద వంద శాతం ఇవ్వాలి. ఈ మొత్తాన్ని బ్యాంక్లో వేసేంతవరకు 19 శాతం వడ్డీ కలపాలి. తుళ్లూరులో ఎకరం భూమి విలువ రూ.రెండు కోట్లుగా నమోదైంది. తాడికొండ, మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈమేరకు ఆధారాలున్నాయి. దీన్ని బట్టి 2013 భూ సేకరణ చట్టం కింద ఎకరం ఉన్న రైతుకు మార్కెట్ విలువ కింద రెండు కోట్లు, మల్టిప్లికేషన్ ఫార్ములా కింద 50 లక్షలు (మొత్తం 2.5 కోట్లు), సోలాషియమ్ కింద రెండున్నర కోట్లు... ఇలా ఎకరానికి రూ. ఐదు కోట్లు చెల్లించాలి. డబ్బు పూర్తిగా చెల్లించేవరకు 19 శాతం వడ్డీని కూడా ఇవ్వాల్సి ఉంది. ఇలా ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి పోను మిగతా 11 వేల ఎకరాలను సేకరించాలంటే కనీసం రూ.60 వేల కోట్లు చెల్లించాలి. పునరావాస పథకానికి మరో రూ. 20 నుంచి 30 వేల కోట్లు కావాల్సి ఉంది. భూ సమీకరణ కింద ఇచ్చిన రైతులకే కౌలు చెల్లించలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం ఇంత మొత్తాన్ని ఎలా తీసుకువస్తుందో అంతుబట్టని విషయమని రైతు సమాఖ్య కన్వీనర్, హక్కుల సంఘం నాయకుడు మల్లెల శేషగిరిరావు వ్యాఖ్యానించారు. -
అప్పన్నకు ‘ఐటీ’ నామం!
- మధురవాడలోని దేవస్థానం భూములు మాయం.. - రూ. 250 కోట్ల విలువైన భూమి నామమాత్రపు లీజుకు - ఈ-సెంట్రిక్ సొల్యూషన్కు ధారాదత్తం - ఆగమేఘాలపై ప్రతిపాదనలు - పాలకమండలి తీర్మానం లేకుండానే... - నేడు కేబినెట్ భేటీలో ఆమోదముద్ర సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దేవుడి భూములనూ వదలకుండా ప్రైవేట్పరం చేసేందుకు సిద్ధమైంది. సింహాద్రి అప్పన్న భూములపైన కన్నేసింది. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో కోల్పోయిన భూమికి ప్రత్యామ్నాయంగా సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న వంద ఎకరాల సింహాద్రి అప్పన్న భూములపై మళ్లీ ఆయన హయాంలోనే సర్కారు పెద్దల కన్నుపడింది. మధురవాడలోని సింహాచలం దేవస్థానానికి చెందిన వంద ఎకరాల విలువైన భూముల్లో 50 ఎకరాలను ఐటీ కంపెనీకి నామమాత్రపు లీజుపై అప్పనంగా ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధమైంది. మధురవాడలోని సింహాద్రి అప్పన్నకు చెందిన రూ.250 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ‘ఈ-సెంట్రిక్ సొల్యూషన్’ అనే ఐటీ కంపెనీకి నామమాత్రపు లీజుకు అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేశారు. బుధవారం రాజమండ్రిలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 50 ఎకరాల భూమిని ఈ-సెంట్రిక్ సొల్యూషన్ కంపెనీకి ఎకరానికి కేవలం రూ.లక్ష చొప్పున లీజుకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. అది కూడా 50 ఎకరాలకు రూ.లక్ష చొప్పున లీజుపై అనుకుంటే పొరపాటే. తొలి ఏడాది కేవలం మూడు ఎకరాలకు, ఆ మరుసటి ఏడాది ఆరు ఎకరాలకు... ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.6 లక్షలకు లీజుకు ఇస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మిగతా భూమి కూడా ఐటీ కంపెనీ ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఆ భూమికి ఇప్పుడు లీజు ఇవ్వరు. ఇంత అడ్డగోలు వ్యవహారం కోసం రాజమండ్రిలో మకాం వేసి ఉన్న ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద ఈ-సెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్కు 50 ఎకరాలు ఉదారంగా ధారాదత్తం చేసే ప్రతిపాదనలను తెప్పించుకున్నారు. భూ కేటాయింపు విధానానికి విరుద్ధంగా దేవుడి భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలంటే ఆ దేవస్థానం పాలకమండలి తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. అందుకు భిన్నంగా పాలకమండలి తీర్మానం లేకుండానే కేటాయింపు తంతును కానిచ్చేస్తున్నారు. మధురవాడలోని సింహాచలం దేవస్థానానికి చెందిన 50 ఎకరాలు లీజుపై కావాలని దేవాదాయ శాఖకు ఈ-సెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్కి చెందిన ‘పారాడిగం నాలెడ్జ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ దరఖాస్తు చేసుకుంది. దీనిపై దేవాదాయ శాఖ దరఖాస్తు చేసిన కంపెనీ పూర్వాపరాలను తెలియజేయాల్సిందిగా ఐటీ శాఖను కోరింది. ఈమేరకు ఐటీ శాఖ కంపెనీపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా 50 ఎకరాలను ఈ-సెంట్రిక్ సొల్యూషన్కు కట్టపెడుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుపై కేటాయించిన పక్షంలో ఆ భూమి మార్కెట్ విలువలో పది శాతం మేర లీజు నిర్ధారించాలని భూముల కేటాయింపు విధానంలో స్పష్టంగా ఉంది. దీనిప్రకారం సింహాద్రి అప్పన్నకు చెందిన 50 ఎకరాలు లీజుకు ఇచ్చినా ఏడాదికి రూ.25 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖలోని సెంట్రల్ జైలు కోసం సింహాచలం దేవస్థానానికి చెందిన 100 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది. అయితే, దేవస్థానం ఆ భూమికి బదులుగా ఇంకో చోట వంద ఎకరాలు కేటాయించాలంటూ సుదీర్ఘ పోరాటం చేసింది. ఆ పోరాట ఫలితంగా మధురవాడలో 100 ఎకరాలను గతంలో ప్రభుత్వం సింహాచలం దేవస్థానికి కేటాయించింది. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన మధురవాడలోని 50 ఎకరాల భూమిని కారు చౌకగా ఐటీ కంపెనీ కోసం కేటాయిస్తున్నారు. -
పార్వతీపురంలో కౌలు రైతుల ఆందోళన
పార్వతీపురం: తమకు గుర్తింపు కల్పించాలని, రుణాలు మాఫీ చేసి కొత్తగా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురంలో కౌలు రైతులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం కౌలు రైతులు ఆందోళన ప్రారంభించారు. తమకు వ్యవసాయ రుణాలు ఇవ్వడంలేదని అధికారులు వెంటనే స్పందించి కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వడంతో పాటు రుణాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
‘పునరుద్ధరణ’కు మంగళం!
సాక్షి, హైదరాబాద్: చిన్నతరహా ఖనిజాల మైనింగ్ లీజులు (ఎంఎల్), గ్రానైట్ తదితర క్వారీ లీజులు (క్యూఎల్) గడువు ముగిస్తే ఇక.. ఏకంగా రద్దయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మైనింగ్ పాలసీని రూపొందించింది. ఈ పాలసీ ఈనెల ఒకటో తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదం పొందాల్సి ఉంది. ఈ మేరకు ఎజెండాలోనూ చేర్చారు.అయితే, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇరకాటంలో పడటంతో సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో మైనింగ్ పాలసీపై చర్చించలేదు. దీంతో ఇది వచ్చే కేబినెట్ సమావేశానికి వాయిదా పడింది. గడువు ముగిసిన మైనింగ్ లీజులను లీజుదారుల దరఖాస్తు ఆధారంగా పునరుద్ధరించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కొత్త మైనింగ్ పాలసీ ప్రకారం ఈ పద్ధతికి మంగళం పలకనున్నారు. తమ అనుయాయులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం రాజకీయ కోణంలో ఈ కొత్త్త విధానాన్ని రూపొందించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూగర్భ గనుల శాఖకు చెందిన అధికారులను పక్కనపెట్టి ప్రభుత్వ పెద్దలు ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా తమకు అనుగుణంగా ఉండేలా మైనర్ మినరల్ పాలసీని తయారు చేయించుకున్నారు. కేపీఎంజీ అనే ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు పరిశ్రమలు - వాణిజ్య శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీలు)గా పనిచేస్తున్నారు. ఈ ఓఎస్డీలు కొత్త మైనింగ్ పాలసీని రూపొందించారు. దీనినే భూగర్భ గనుల శాఖ అధికారులు కేబినెట్ ఆమోదం నిమిత్తం ప్రతిపాదించారు. -
చిత్తూరు షుగర్స్పై సీఎం రమేష్ కన్ను?
లీజు కోసం కదులుతున్న పావులు పోటీ పడుతున్న మాజీ మంత్రి 15 నాటికి అధ్యయన కమిటీ రిపోర్ట్ ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులు చిత్తూరు: చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని లీజు పేరుతో దక్కించుకునేందుకు ఎంపీ సీఎం రమేష్ పావులు కదుపుతున్నట్లు అధికార పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సైతం పోటీపడుతున్నట్లు సంకేతాలున్నాయి. మొత్తంగా ఇద్దరు నేతలు చిత్తూరు చక్కెర కర్మాగారం కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇరువురు నేతలు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల మద్దతు కోసం తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధ్యయన కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాతనే ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టాలా? లేక లీజుకు అప్పగించాలా ? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. ఎలాగైనా * 800 కోట్ల విలువైన ఫ్యాక్టరీని దక్కించుకొనేందుకు ఇటు ఎంపీ అటు మాజీ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చారిత్రక చిత్తూరు షుగర్స్లో ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేశారు. ఈ కర్మాగారం పరిధిలో 16 నెలలుగా 400 మంది కార్మికులకు ప్రభుత్వం జీతాలు చెల్లించకపోగా మూడేళ్లుగా చెరుకు రైతులకు సైతం కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించాల్సి వుంది. బకాయిలు చెల్లించి చక్కెర కర్మాగారాన్ని నడిపిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తరువాత మంగళం పాడారు. ఫ్యాక్టరీని తన అనుచరుల పరం చేసేందుకు బాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి చాపకింద నీరులా పావులు కదుపుతోంది. ఇందులో భాగం గా చక్కెర కర్మాగాల నిర్వహణపై అధ్యయన కమిటీ అంటూ ఐదుగురు ప్రైవేటు వ్యక్తులతో కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కర్మాగారాలపై నిర్ణయం తీసుకుంటామంటూ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నాటికి అధ్యయన కమిటీ నివేదిక రానున్నట్లు సమాచారం. 2002లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు *18 కోట్లకు చక్కెర కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టారు. అప్పట్లో రైతులు, కార్మికులు కోర్టుకు వెళ్లి ఫ్యాక్టరీని దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అధికారం చేపట్టిన బాబు తన హయాంలోనే మరోసారి కర్మాగారాన్ని అమ్మకానికి పెడితే సొంతజిల్లా వాసుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లీజుకు అప్పగించడమే మేలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చిత్తూరు కర్మాగారం పరిధిలో 84.5 ఎకరాల విలువైన స్థలం ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం మొత్తం స్థలాన్ని అమ్మితే * 800 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ స్క్రాప్ అమ్మితే రూ.10 కోట్లకు పైగా వస్తుంది. తొలుత లీజు పేరుపెట్టి ఆ తరువాత కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఫ్యాక్టరీని లీజుకు లేదా అమ్మకానికి పెట్టే పక్షంలో ఆందోళనలు ఉధృతం చేయడంతో పాటు మరో మారు కోర్టుకు వెళ్తామని కర్మాగారం కార్మికులు, శాంతియుత ఉద్యమనేత వెంకటాచలంనాయుడు హెచ్చరిస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఖమ్మం: పండిన పంటకు గిట్టుబాటు ధర లేక...అప్పు తీర్చే మార్గం కానరాక ఆ రైతు పంట చేలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు...ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలప్పేట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలివీ... గ్రామానికి చెందిన పాలెపు పుల్లారావు (40) తనకున్న ఎకరం పొలంలో మిర్చి సాగు చేశాడు. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పత్తి ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఉంది. ధర కూడా తక్కువగానే ఉంది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడులు, కౌలు చెల్లింపు కోసం తీసుకొచ్చిన అప్పులు రూ.5 లక్షలకు చేరుకున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు శనివారం రాత్రి మిరపతోటలో పురుగుమందు తాగి తనువు చాలించాడు. (తల్లాడ) -
గలీజు
నిబంధనలకు విరుద్ధంగా సబ్ లీజులు ఎన్టీఆర్ పార్కులో యథేచ్ఛగా దోపిడీ హెచ్ఎండీఏ ఆదాయానికి భారీగా గండి సిటీబ్యూరో: మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు లీజుల వ్యవహారం తలబొప్పి కట్టిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది సబ్ లీజులతో సంస్థ ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొడుతున్నారు. తాము మాత్రం హాయిగా జేబులు నింపుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ ఈ అక్రమాలకు కేంద్రంగా మారింది. నగరంలో సందర్శకుల రద్దీ అధికంగా ఉన్న పార్కుల్లో ఎన్టీఆర్ గార్డెన్ ఒకటి. నిత్యం వేలాదిమంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఇంత రద్దీ ఉన్న పార్కుపై అధికారుల పర్యవేక్షణ కరువవుతోంది. ప్రవేశ టిక్కెట్లు, షాపుల కేటాయింపు, ఇతర మార్గాల్లో ఈ పార్కు ద్వారా హెచ్ఎండీఏకు ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో సగంలీజుల ద్వారానే వ స్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే... షాపుల కేటాయింపులో లోపాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని లీజుకు తీసుకున్న వ్యక్తులు అధిక ఆదాయం కోసం విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తమకు కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకొని దర్జాగా ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నా... అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. పక్కాగా మస్కా ఎన్టీఆర్ గార్డెన్లోని అధిక షాపులు లీజుపై కేటాయించినవే. కొన్నిటి లీజుల్లో యథేచ్ఛగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో రెండు ప్రాంతాల్లో షాపులను లీజుకు తీసుకున్న వ్యక్తి ఏకంగా మరో అయిదు ప్రాంతాలను తన అధీనంలో పెట్టుకున్నాడు. వాటిని సబ్ లీజుకిచ్చి హెచ్ఎండీఏకు మస్కా కొడుతున్నాడు. రికార్డుల ప్రకారం ఎన్టీఆర్ గార్డెన్లో ఒక క్యాంటీన్ నిర్వహించుకునేందుకు ఓ సంస్థకు అనుమతిచ్చినట్లు ఉంది. మచన్ ట్రీ వద్ద ఒకటి, అక్కడి రైల్వే స్టేషన్లో మరో క్యాంటీన్ అనధికారికంగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. ఈ రెండు క్యాంటీన్లు ఒకటిగానే చూపించి సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకొనే నాథుడే లేడని బీపీపీ సిబ్బందే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. పార్కులోని షాపింగ్ కాంప్లెక్స్లో 5 షాపులను సబ్లీజుదారులే నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇక్కడి ‘బంగీ జంప్’ క్రీడా స్థలం కూడా సబ్ లీజుదారు ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సందర్శకుల జేబులకు కన్నం అక్రమ లీజులతో సంస్థకు టోకరా వేస్తున్న నిర్వాహకులు సందర్శకులనూ వదలడం లేదు. పార్కుల్లో ఆహారం, పానీయాలు, ఇతర వస్తువుల విక్రయాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలను పక్కనపెట్టి... అధిక ధరలకు విక్రయిస్తూ జనం నుంచి దోచుకుంటున్నారు. ఈ అక్రమాలు అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై సంబంధిత అధికారిని వివరణ కోరగా... అలాంటి అక్రమాలు తమ దృష్టికి రాలేదన్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకొంటామని చెప్పారు. లీజుకు కేటాయించిన షాపులను సబ్ లీజ్కు ఇచ్చినట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకొని... వాటిని రద్దు చేస్తామని ఆయన తెలిపారు. -
నిజం.. నమ్మండి!
పట్టణాల్లో స్థలం కొనడం సామాన్యుడికి కలగా మారుతున్న పరిస్థితి... ఓ నాలుగు సెంట్లు స్థలం లీజుకు తీసుకుని వ్యాపారం చేయూలంటే ధరలు చూస్తే కళ్లు తిరగక మానవు... ఇది అందరూ చెప్పుకునే నేటి నిజం. ఇలాంటి రోజుల్లో రాజంపేటలో రూపారుుకే సెంటు స్థలం లీజుకు ఇచ్చారని అంటే ఎవరైనా ఏమంటారు... జోకుతున్నావా అనేగా. కాదండీ బాబు ఇది నిజం నమ్మండి అంటే... అవునా అదెలా అంటూ ఆశ్యర్యపోతున్నారు కదా! ఇదిగో ఆ లీజు కథ చదవితే మీకూ తెలుస్తుంది. రాజంపేట: రాజంపేట పట్టణ నడిబొడ్డున రైల్వేకోడూరు రహదారిలోని పెట్రోలు బంకు ఉన్న స్ధలం లీజు వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయిలు విలువ చేసే దాదాపు 19సెంట్లు స్ధలం కేవలం రూ19ల లీజుతో నడుస్తోంది. ఒకటి రెండు రోజులు కాదు ఆరు దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారమే నేటికే నడుస్తుండడం తెలిసి పురపాలిక అధికారులు విస్తుపోయూరు. పట్టణంలో అమ్మవారిశాల స్ధలం సమీపంలో ఉన్న 19 సెంట్ల స్ధలాన్ని 10.11.1954లో అప్పటి పంచాయతీ అధికారులు బర్మాసెల్ ఆయిల్ కంపెనీకి లీజుకు అప్పగించినట్లు రికార్డులు చెబుతున్నారుు. పంచాయతీకి ఆయిల్సంస్ధ కట్టాల్సింది రూ19ల మాత్రమే. అయితే అదైనా సక్రమంగా కడుతున్నారా? లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. బర్మాసెల్ ఆయిల్ కంపెనీ తర్వాత కాలంలో భారత్పెట్రోలియం సంస్ధకు అప్పగించగా పెట్రోలు బంకును నిర్వహిస్తూ వచ్చారు. రూ19ల లీజుతో ఎన్నేళ్లు ఇచ్చారనేది తెలియడంలేదు. దానికి సంబంధించిన రికార్డుల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు రూ.8కోట్ల విలువ చేసే స్ధలం లీజు నేటికీ రూ.19లేనా అన్నది పట్టణవాసులను తొలిచివేస్తున్న ప్రశ్న. పరిశీలించిన పురపాలిక అధికార్లు తక్కువ లీజులో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న పెట్రోలు బంకు స్ధలాన్ని మంగళవారం పరిశీలించినట్లు పురపాలక కమిషనర్ ఫజులుల్లా తెలిపారు. స్ధలాన్ని స్వాధీనం చేసుకొని బోర్డు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమిషనర్తోపాటు టౌన్ప్లాన్ అధికారి బాలాజీ, ఇతర పురపాలక ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెట్రోలు బంకు స్ధలంతోపాటు ఎగువ భాగంలో మరికొంత స్థలం ఉందని గుర్తించామని, సర్వే చేయిస్తామన్నారు. లీజుకు ఇచ్చిన వ్యవహారం సమాచారం సేకరించే పనిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం ఈ బంకును శ్రీనువాసులు అనే వ్యక్తి నిర్వహిస్తున్నారని వివరించారు. బంకు నిర్వహకుని సంప్రందిస్తే లీజు విషయం వాస్తవ మేనని చెపుతున్నారని చెప్పారు. సాక్షి కథనాలతో కదిలిక పట్టణంలో రూ.కోట్ల విలువ చేసే స్ధలాలు అన్యాక్రాంతంలో ఉన్నాయని.. కబ్జాకు బడాబాబులు ప్రయత్నిస్తున్నారంటూ సాక్షి కథనాలతో పురపాలక అధికారుల్లో కదిలిక వచ్చింది. ఇప్పటికే అనేక స్ధలాలను అధికారులు గుర్తించి బోర్డులు నాటారు. నారపురెడ్డిపల్లెలో ఏకంగా ఎకరా స్ధలాన్ని స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. పట్టణంలో వివిధ పురపాలక స్ధలాలను అప్పజెప్పే విధంగా సాక్షిలో కథనాలు వెలువడటంతో పట్టణవాసులు అభినందిస్తున్నారు. -
చట్టబద్ధంగానే థియేటర్ల లీజు: ఎగ్జిబిటర్లు
రాంగోపాల్పేట్: గత విధానాల వల్ల థియేటర్ల యజమానులు తీవ్రంగా నష్టపోవడంతోనే..థియేటర్లను చట్టబద్ధంగా లీజుకు ఇచ్చామని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిబిటర్స్ విభాగం స్పష్టం చేసింది. శనివారం ఫిల్మ్ చాంబర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎగ్జిబిటర్స్ విభాగం చైర్మన్ బాలగోవింద్రాజ్, ఫిల్మ్ చాంబర్స్ అధ్యక్షులు విజయేందర్రెడ్డి, పలువురు థియేటర్ల యజమానులు మాట్లాడారు. గతంలో థియేటర్లో సినిమాలు వేసేందుకు నిర్మాతలు, పంపిణీదారులు ఫిక్స్డ్ హయ్యర్, షేర్ గ్యారెంటీ, మినిమం గ్యారెంటీ పేరిట భారీగా అడ్వాన్సులు వసూళ్లు చేసేవారని తెలిపారు. ఈ విధానంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందల సంఖ్యలో థియేటర్లు మూతలు పడ్డాయని చెప్పారు. గతంలో అడ్వాన్సులు తీసకున్న పంపిణీదారులు సినిమా ఆడకపోతే మళ్లీ ముఖం చూపించకుండా వెళ్లేవారని తర్వాత సినిమా కూడా తమకు ఇవ్వకుండా తప్పించుకునే వారని వాపోయారు. లీజు విధానం లేకపోతే ఇప్పుడున్న థియేటర్లలో ఇంకా చాలా మూతపడేవన్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని, త్వరగా తీసేస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అగ్రిమెంట్ ప్రకారమే సినిమా నడిపిస్తారని పేర్కొన్నారు. ఎగ్జిబిటర్స్ విభాగం ఉపాధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల నిరాహారదీక్ష చేపట్టిన రామకృష్ణగౌడ్కు సినిమా ఫీల్డ్పై ఏ మాత్రం అవగాహన లేదన్నారు. గత పదేళ్ల నుంచి ఆయన ఎక్కడున్నాడో తెలియదని, వ్యక్తిగత ప్రచారం కోసం ఇలా చేస్తున్నాడని ఆరోపించారు. సమావేశంలో మల్లారెడ్డి, జగన్, పలువురు లీజుదారులు, థియేటర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. -
గుట్టు రట్టయ్యేనా!
వెల్దుర్తి: ఖనిజ తవ్వకాలకు అనుమతి పొం దిన వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. నిబంధనల మేరకు లీజుకు తీసుకున్న భూములను విస్మరించి ప్రభుత్వ బంజారు, అటవీ, దేవాదాయ భూములను అడ్డంగా తవ్వేస్తూ పచ్చని పల్లెల్లో పుడమితల్లికి గర్భకోశాన్ని మిగుల్చుతున్నారు. భూదందాలకు తోడు ఇనుప ఖనిజాన్ని రాత్రికి రాత్రే ఎల్లలు దాటిస్తు సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగారు.జిల్లాలో ఖనిజ నిక్షేపాలకు రామళ్లకోట గ్రామం పేరుగాంచింది. ఇక్కడి ఖనిజానికి రాష్ట్రం లోనే కాక ఇతర ప్రాంతాలలోనూ మంచి డిమాండ్ ఉంది. ఇంతటి ఘనత ఉన్న ఈ గ్రామంలో ఖనిజ మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోయింది. రామళ్లకోట, రత్నాపల్లి, పుల్లగుమ్మి, సర్పరాజ పురం గ్రామాల పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజ నిక్షేపాలను నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు వెలికితీస్తున్నారు. ఈ గ్రామాల పరిధిలో ఖనిజాల తవ్వకాలకు ప్రభుత్వం 12 మందికి మాత్రమే కొన్ని ప్రైవేట్ భూముల్లో అనుమతి ఇచ్చింది. అయితే సర్కార్ కేటాయించిన భూముల్లో ఖనిజ సంపద లేకపోవడంతో వ్యాపారుల కన్ను ప్రభుత్వ, దేవాదాయ భూములపై పడింది. వీరికి అధికార పార్టీ నేతలు, అధికారులు అండదండగా నిలవడంతో అక్ర మంగా ఖనిజాన్ని వెలికితీసి రాజమార్గంలో తరలిస్తు న్నారు. ఇలా ఐదేళ్లుగా వ్యాపారులు భూదందా కొనసాగిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. 200 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు.. రామళ్లకోట గ్రామ పరిధిలోని ప్రభుత్వ, దేవాదాయ భూముల్లో సుమారు 200 ఎకరాలలో అక్రమంగా ఖనిజ తవ్వకాలు చేపడుతున్నారు. గ్రామంలోని వనం లక్ష్మివెంకటేశ్వర స్వామికి చెందిన 359 సర్వేనంబర్లో 58 ఎకరాలు, అటవీశాఖకు సంబంధించిన తిప్పారెడ్డి కొండలో 25 ఎకరాల్లో ఖనిజ తవ్వకాలు యధేచ్చగా జరుగుతున్నాయి. పుల్లగుమ్మి గ్రామ సమీపంలోని అటవీశాఖకు చెందిన బుగ్గ తిప్పకొండలోనూ 20 ఎకరాలు, రత్నాపల్లి గ్రామ పొలిమేరలోని 30 ఎకరాల్లోనూ అక్రమ ఖనిజ తవ్వకాలు జరుగుతున్నాయి. బ్రహ్మగుండం క్షేత్రం పరిధిలోని 1231, 821, 822, 824 సర్వే నంబర్లలోని అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన భూముల్లో ఖనిజ తవ్వకాలు చేపడుతున్నట్లు స్థానికులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి వెనుక ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి. పరోక్షంగానే అక్రమ ఖనిజ తవ్వకాలను అధికారులే ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఏమిటీ గ‘లీజు’..?
ఈ దుకాణాన్ని చూశారా..శ్రీకాకుళం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉంది. స్వప్న హెయిర్ స్టైల్స్ పేరుతో..ఓ సెలూన్ను నిర్వహిస్తున్నారు. దీనిని..మాజీ కౌన్సిలర్ లండ శ్రీను..మున్సిపాలిటీ నుంచి లీజుకు తీసుకున్నారు. అయితే..దీనిని ఆయన నిర్వహించకుండా..టి.నాగరాజు అనే వ్యక్తికి సబ్ లీజుకు ఇచ్చారు. ఇలా..మున్సిపాలిటీలో..సబ్ లీజుల పర్వం నడుస్తోంది. మున్సిపాలిటీ నుంచి దుకాణాలను తక్కువకు దక్కించుకుని..వాటిని సబ్ లీజులకు ఇచ్చి..అద్దెలు వసూలు చేసుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. సాక్షాత్తూ..మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే..సబ్ లీజుల దందా నడుస్తోందంటే..పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రిమ్స్క్యాంపస్: జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీలు,రాజాం, పాలకొండ నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో వందలాది దుకాణాలు ఉన్నాయి. వీటిని..నిరుపేద వ్యాపారుల అభ్యన్నతి కోసం లీజు ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. టెండర్ల ప్ర క్రియ ద్వారా తక్కువ అద్దెలను వసూ లు చేస్తున్నారు. ఇక్కడే కొందరు గలీ జు దారులు తమ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనకు తూట్లు పొడుస్తూ..తక్కువ అద్దెలకు దుకాణాలను అద్దెకు తీసుకుని..సబ్ లీజులకు ఇస్తున్నారు. అధిక మొత్తాల్లో అద్దెలను వసూ లు చేసుకుంటున్నారు. ఇలా..70 శాతం దుకాణాలు సబ్లీజులకిచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సబ్లీజ్కు దుకాణాలను ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం. అయినా..అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. 331 దుకాణాలకు గాను..200 వరకు సబ్ లీజులే... శ్రీకాకుళం మున్సిపాలిటీలో..ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 14 షా పింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 402 దుకాణాలు ఉండగా..331 దుకాణాలను లీజ్కు ఇచ్చారు. మిగిలిన 71 ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే..లీజ్కు తీసుకున్న 331 దుకాణాల్లో సుమారు 200 వరకు సబ్లీజులకు వెళ్లినట్టు తెలుస్తోంది.ఇలా సబ్లీజుల వ్యవహారం నడుపుతున్న వారంతా..రాజకీయ పలుకుబడి ఉన్నవారు..మున్సిపల్ కౌన్సిలర్లుగా పనిచేసిన వారే కావడం గమనార్హం. పత్తాలేని గుడ్విల్ ప్రతిపాదనలు లీజు దుకాణాలను సబ్లీజులకు ఇస్తున్న వైనంపై మున్సిపల్ అధికారులు గతంలో గుడ్విల్ ప్రతిపాదనలు చేశారు. లీజు దారుల నుంచి సబ్ లీజుకు తీసుకుని అద్దె చెల్లిస్తున్న వారికే నేరుగా దుకాణాలను కట్టబెట్టే ఆలోచన చేశారు. వారి నుంచి కొంత గుడ్విల్ను మున్సిపాలిటీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఒక్కో దుకాణానికి సుమా రు *లక్ష వరకు తీసుకుని..దుకాణాలను కట్టబెట్టాలని ఆలోచన చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు పత్తా లేకుం డా పోయింది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారిం చి..ఈ బాగోతానికి చెక్ చెప్పాలని పలువురు కోరుతున్నారు. -
‘మహావీర్’ భూమి లీజుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: మహావీర్ ఆస్పత్రి భూమి లీజుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. వివిధ సంస్థలకు భూముల కేటాయింపునకు సంబంధించి శనివారం గవర్నర్ వద్ద ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి, గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్ అహ్మద్, ఏఎన్ రాయ్, సీనియర్ అధికారులు అజయ్ కల్లం, పీవీ రమేష్, ప్రదీప్ చంద్ర, శివ శంకర్, లక్ష్మీ పార్థసారధి, బీఆర్ మీనా తదితరులు హాజరయ్యారు. మహావీర్ ఆస్పత్రికి ఇప్పుడున్న భూమిని మరో 30 ఏళ్ల పాటు లీజుకోసం అనుమతిని ఇచ్చారు. అయితే లీజు అద్దె విషయంలో తుది నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వానికి వదిలి పెట్టారు. అలాగే పుల్లెల గోపీచంద్ ఏర్పాటు చేసే బ్యాడ్మింటన్ అకాడమీకి భూ కేటాయింపునకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే ఈ విషయంలో పొందుపరిచే నిబంధనలపై కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటితో పాటు నెల్లూరు జిల్లాలో 4.79 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 502.30 ఎకరాలను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించే విషయాన్ని కొత్త ప్రభుత్వానికి వదిలి పెట్టారు. కాగా రాజ్భవన్లో పనిచేయడానికి అదనపు సిబ్బంది, వారు ఉండడానికి వసతి, వాహనాలను సమకూర్చడానికి సంబంధించిన ఫైల్ను గవర్నర్ ఆమోదించారు. -
టీడీపీ ట్రావెల్స్ దందా