Magic shows
-
ప్రధాని మోదీ మ్యాజిక్ ట్రిక్.. ఫిదా అయిన చిన్నారులు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవడానికి వచ్చిన కొందరు చిన్నారులను కాయిన్ ట్రిక్ తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మోదీ "మ్యాజిక్ ట్రిక్" చేశారు. ప్రధాని మోదీ నుదిటికి నాణెం పెట్టుకుంటారు. తల వెనుక భాగంలో తట్టగానే ఆ నాణెం ముందుకు పడిపోతుంది. ఈ దృగ్విశయాన్ని పిల్లలు విస్మయంతో చూశారు. #Watch | PM Modi's "Memorable Moments" With Children pic.twitter.com/4r2AysENHu — NDTV (@ndtv) November 16, 2023 పిల్లల నుదిటిపై నాణెం అంటించి వారి తల భాగంలో నొక్కినప్పుడు మాత్రం నాణెం పడిపోదు. ఇదిలాగో తెలియక పిల్లలు విచిత్రంగా చూస్తారు. అయితే.. ఈ క్రమంలో పిల్లల నుదిటిన అంటించిన నాణాన్ని మోదీ మరో చేతితో లాక్కుంటారు. సరదాగా పిల్లలతో ప్రధాని మోదీ పిల్లలతో ఈ మ్యాజిక్ చేశారు. ఈ విషయాన్ని మరిచిపోలేని జ్ఞాపకాలుగా పేర్కొంటూ ప్రధాని మోదీ ట్విట్టర్(ఎక్స్)లో షేర్ చేశారు. ఈ ఏడాది రక్షా బంధన్ వేడుకల్లోనూ ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపారు. పిల్లలు ప్రధానికి ఘనస్వాగతం పలికి రాఖీ కట్టారు. అఖిల భారతీయ శిక్షా సమాగమ్ వేడుకలో భాగంగా కూడా ప్రధాని మోదీ పిల్లలతో ముచ్చటించారు. పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇదీ చదవండి: జిన్పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట! -
ఇదేం మ్యాజిక్ రా బాబు
-
ఇదేంది రా మామా...ఈ వయ్యారి యాడికెల్లి వచ్చింది? కనిపెట్టగలరా?
న్యూఢిల్లీ: మెజీషియన్లు తమ అద్భుతమైన యామాజాలంతో జనాన్ని మెస్మరైజ్ చేస్తారు. రకరకాల జిమ్ముక్కులతో మంత్రం వేసి మాయచేసి మ్యాజిక్ చేయడం మనందరికి తెలిసిందే. పిట్టల్ని, బట్టల్ని మన ముందే కనికట్టు చేసి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా అందమైన అమ్మాయిలను క్షణాల్లో మాయం చేసిడం బాగా ఆకట్టుకుంటూ ఉంటారు ప్రముఖ మెజీషియన్లు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓరి నీ మ్యాజిక్కో! ఇదేం మ్యాజిక్ రా మామా సాధారణ ప్రజలు అబ్బుర పడిపోవడం కూడా సహజమే.అలాంటి మ్యాజిక్కు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది. 1.3 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ వీడియోపై పలు ఫన్నీ ఫన్నీ కమెంట్లతో నెటిజన్లు సందడి చేస్తున్నారు. మరి వీకెండ్ మూడ్లో ఉన్న మీరు కూడా ఆ అమ్మడు ఎక్కడనుంచి ఎలా వచ్చింది అనే విషయాన్ని బాగా పరిశీలించండి. ఆ కనికట్టు ఏంటో కనిపెట్టండి. (ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?) Next-level magic ✨ pic.twitter.com/AxrzcAOJKy — Next Fucking Level (@NxtFuckingLvl) February 3, 2023 -
వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారోయి..!
ఎలాంటి రాయినైనా సరే ముక్కలు చేయొచ్చు, ఉలితో చెక్కి శిల్పంగా మలచవచ్చు. కానీ, ఫొటోలో కనిపిస్తున్నట్లు ఎలా వంచగలుగుతున్నారో తెలియాలంటే ఈ రాయి గురించి తెలియాల్సిందే. పేరు.. ఇటాకోలమైట్. పోరస్ ఇసుకరాయి జాతికి చెందింది. సాధారణ రాళ్ల మాదిరే ఇది కూడా వివిధ రంగులు, రూపాలు, పరిమాణాల్లో ఉంటుంది. అయితే, ఎప్పుడైతే ఈ రాయి.. ఒక సెంటీమీటర్ మందం, 20 సెంటీమీటర్ల పొడవుగల సమాంతర పరిమాణంలోకి మారుతుందో.. అప్పుడు దీనికి వంగే స్వభావం వస్తుంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ఇటలీకి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకంటే ఒక్క మిల్లీమీటర్ సైజ్లో తేడా వచ్చినా, ఆ రాయి అంగుళం కూడా వంగదు. ఈ రాయికి, ఆ పరిమాణానికి, ఆ స్వభావానికి ముడిపడి ఉన్న సంబంధం ఏమిటో ఇంకా అంతుచిక్కాల్సి ఉంది. కానీ, భూకంపాలు, బలమైన గాలులు, తుఫానుల వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడగలిగే భవన నిర్మాణాల రూపకల్పనలో ఈ రాళ్లు ఎంతోగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లల్లో కొన్నిరకాలు నీటిలో తేలే స్వభావం కలిగి ఉంటాయి. అలాగే ఈ రాళ్లు వంగే స్వభావం కలిగినవిగా చెబుతున్నారు. ఏది ఏమైనా అసలు నిజం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. చదవండి: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! -
హర్మన్ మ్యాజిక్ ట్రిక్కు ఫ్యాన్స్ బౌల్డ్..!
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా స్వీయ నిర్భందంలో ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇటీవల తనకు తెలిసిన ట్రిక్స్తో అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. హౌస్ మాజీషియన్గా మారిపోయి కార్డ్ ట్రిక్ షోను ప్రదర్శించి బీసీసీఐని సైతం అబ్బుర పరిచాడు. ఇలా కార్డ్ ట్రిక్ ద్వారా నవ్వులు తెప్పించిన అయ్యర్ వీడియోకు థాంక్యూ చాంపియన్ అంటూ బీసీసీఐ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తాజాగా పోస్ట్ చేసిన వీడియోకు బీసీసీఐ ఏమంటుందో చూడాలి. వివరాల్లోకి వెళితే.. హర్మన్ ప్రీత్ కౌర్ అద్దం ముందు నిల్చుని మ్యాజిక్ ట్రిక్ను చేసింది. (అతనికి గాయం.. నాకు ఒక జ్ఞాపకం!) ఆ వీడియోలో హర్మన్ చేతిలో ఓ గాజు గ్లాసు అందులో బాల్ పట్టుకొని నిల్చొని ఉంది. ఆ బంతిని ఎదురుగా ఉన్న అద్దం వైపు విసరగా అది మళ్లీ హర్మన్ వైపు రావడం గ్లాస్లో పడటం జరిగింది. అవతలి వైపు గ్లాస్లోకి వెళ్లి అక్కడ్నుంచి మళ్లీ హర్మన్ గ్లాస్లోకి రావడం టాప్ మ్యాజిక్గా నిలిచింది. ఈ వీడియోను ఎలా చేశానో చెప్పాలంటూ హర్మన్.. అభిమానులకు పజిల్ విసిరింది. అయితే అభిమానులు మాత్రం అది ఎలా సాధ్యం అనే విషయంలో పరేషాన్ అవుతున్నారు. హర్మన్ విసిరిన మ్యాజిక్ ట్రిక్ను కనుక్కొనే పనిలో తలలు పట్టుకుని అన్వేషణ సాగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. ఇందులో మ్యాజిక్ అనేదే ప్రధానాంశం కాబట్టి లాక్డౌన్ను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులు ఎలాగైనా కనుక్కోవాలనే పనిలో ఉన్నారు. ప్రస్తుతం హర్మన్ మ్యాజిక్ ట్రిక్కు బౌల్డ్ అయిన ఫ్యాన్స్.. ఇందులోని అసలు విషయాన్ని కనుక్కోంటే మాత్రం హర్మన్ ‘బౌల్డ్’ కావడం ఖాయం. View this post on Instagram Mirror, mirror on the wall, who the realest of them all. A post shared by Harmanpreet Kaur (@imharmanpreet_kaur) on Apr 22, 2020 at 2:30am PDT -
ఒక లడ్డూ నన్ను జాదూగర్గా మార్చింది
ఐదు దశాబ్దాలుగా 36 దేశాల్లో 37 వేలకుపైగా ఇంద్రజాల ప్రదర్శనలు. నాలుగు ప్రపంచ రికార్డులు. వేలాది సన్మానాలు. మ్యాజిక్ షోలతో పిల్లలు, పెద్దలను అమితాశ్చర్యంలో ముంచెత్తే ఫీట్స్. జాదూగర్ ఆనంద్గా ప్రసిద్దికెక్కిన ప్రముఖ ఇంద్రజాలికుడు అవస్తి ఆనంద్ సాధించిన ఘనత ఇది. ఇంద్రజాల ప్రదర్శనలో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చిన జాదూగర్ ఆనంద్ ‘సాక్షి’తో ముచ్చటించారు. మీరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వాటిలో అమితంగా ఆకట్టుకున్నవి..? పద్ధెనిమిదేళ్ళ వయస్సులో ‘అండర్ వాటర్ ఎస్కేప్’గా మొదటి రికార్డు, ఆ తర్వాత ఏడు ‘బ్లైండ్ ఫోల్డ్ ఫో’తో రెండో ప్రపంచ రికార్డు సాధించాను. ఇండోర్ నుంచి భూపాల్ వరకు 210 కిలో మీటర్లు కళ్లకు గంతలు కట్టుకుని స్కూటర్ మీద ప్రయాణం చేయడం మర్చిపోలేని సంఘనలు. ఇప్పటి వరకు నాలుగు ప్రపంచ రికార్డులు, 36 దేశాలలో 37 వేలకు పైగా ప్రదర్శనలు నిర్వహించి మూడో ప్రపంచ రికార్డు, అత్యంత వేగవంత మెజీషియన్గా నాల్గవ ప్రపంచ రికార్డు సాధించినందుకు ఆనందంగా అనిపిస్తోంది. షో జరిగే సమయంలో అకస్మాత్తుగా ప్రేక్షకుల్లో ఒక అమ్మాయిని స్టేజీ మీదకు పిలిపించి, ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో పైకి లేపడం, మరొకరిని క్షణాల్లో మాయం చేయడం, తిరిగి వారిని ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమయ్యేలా చేయడం... ఒకటి కావు అన్నీ ఆకట్టుకునేవే. స్టేజీ మీద ప్రదర్శించబడుతున్న సినిమా తెరలోకి వెళ్లి అక్కడి నటుల్ని స్టేజీ మీదకు తీసుకురావడం, అండర్ వాటర్ ఎస్కేప్ ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఏదైనా ప్రేక్షకుల అభినందనలు అందుకున్న ప్రతీసారి వారు ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చానన్న సంతృప్తి అన్ని రికార్డులకన్నా మించినదిగా భావిస్తాను. మీ పేరు అవస్తి ఆనంద్. జాదూగర్ ఆనంద్గా ఎలా మారారు? నేను పుట్టిపెరిగింది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో. మా కుటుంబంలో అందరూ బాగా చదువుకున్నవారే. ఆ రోజుల్లోనే నాన్న ఏ.పి.అవస్తి డాక్టర్, అమ్మ మహేశ్వరిదేవి ఫ్రొఫెసర్. మా ముగ్గురు అక్కయ్యలూ బాగా చదువుకున్నవారు. ఆఖరివాడినైన నేనూ పీజీ చేశాను. ఇప్పుడు నా వయసు అరవైఏడేళ్లు. ఆరేళ్ల వయసులో మా స్కూల్కి వెళ్లేదారిలో కొందరు గారడీవిద్య ప్రదర్శించేవారు. రోజూ అక్కడికి వెళ్లి ఆ గారడీ చూసేవాడిని. వాళ్లు గాల్లో నుంచి నాకు లడ్డూలు తీసి ఇచ్చేవారు. రోజూ లడ్డూలు తినేవాడిని. అప్పుడే అనిపించింది ‘నేనే సొంతంగా గారడీ చేసి లడ్డూలు తెచ్చేసుకుంటే..’ అని. ప్రయత్నించా.. లడ్డూ రాలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఒక్క లడ్డూ కూడా రాలేదు. కానీ నిరాశపడలేదు, ప్రయత్నాన్నీ వదలలేదు. ఎక్కడ ఏ చిన్న గారడీ, మ్యాజిక్ షోలు జరిగినా ఎంత దూరమైనా వెళ్లి చూసేవాడిని. అలా అలా చిన్న చిన్న మేజిక్లు నేర్చేసుకున్నా. వాటిని మా స్కూల్లో ప్రదర్శించేవాడిని. చుట్టూ ఫ్రెండ్స్ బాగా ప్రోత్సహించేవారు. ఆ తర్వాత టీచర్లూ మెచ్చుకున్నారు. అక్కణ్ణుంచి గణేష్, దుర్గాదేవి నవరాత్రులలో జరిగే ఉత్సవాలలో ప్రదర్శనలు ఇచ్చేవాడిని. అక్కడ వారు ఇచ్చే డబ్బులు, అమ్మా–నాన్న ఇచ్చే పాకెట్ మనీతో ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకాలు కొనేవాడిని. చదివేవాడిని. ప్రాక్టీస్ చేసేవాడిని. అలా మొదలైన నా ప్రస్థానం.. అంతర్జాతీయ స్థాయి ‘జాదూగర్’గా మార్చింది. నాకెవ్వరూ గురువులు లేరు. స్వయంకృషి, స్వంతప్రయత్నంతోనే ఈ విద్యను సాధించాను. మీకు గురువెవ్వరూ లేరు అంటున్నారు.. మీ తల్లిదండ్రుల సహకారం లభించలేదా? లేదు. మా కుటుంబంలో ఏకైక మగ పిల్లవాడైనందున మా అమ్మానాన్నలు నాపై అనేక ఆశలు పెట్టుకుని, నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. నేను మెజీషియన్గా మారడం వారికి ఇష్టం వుండేది కాదు. అదేమైనా తిండి పెడుతుందా, దేనికి ఉపయోగపడుతుంది..? అనేవారు. అయితే వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఇంద్రజాల విద్యలోనే రాణించాను. నీళ్లలోనూ విన్యాసాలు చేశారు.. స్కూల్లోనూ, కాలేజీలోనూ చిన్న చిన్న మేజిక్ షోలు చేసిన నేను పద్దెనిమిదేళ్ల వయసులో సొంతంగా వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. ‘అండర్వాటర్ ఎస్కేప్’లో భాగంగా తలకు ముసుగు వేసి, కాళ్లను, చేతులను సంకెళ్లతో బంధించి, ఒక పెట్టెలో పెట్టి తాళం వేస్తారు. ఆ పెట్టెను నదిలో పడేస్తారు. ఆ పెట్టెలో నుంచి తప్పించుకుని బయటకు రావాలి. సంకెళ్లను విడదీసేదెలా? పెట్టె తాళం పగలగొట్టేదెలా? బయటకు ఎలా వస్తాను అని పైన అంతా ఉత్కంఠ. కానీ, నేను కేవలం నలభైసెకన్లలో ఈ విన్యాసాన్ని ప్రదర్శించి నది నుంచి బయటకు వచ్చేశాను. ఇది కూడా స్వతహాగానే నేర్చుకున్నాను. ప్రపంచ ప్రసిద్ధి పొందిన మీరు ఇక ముందు ఏం చేయబోతున్నారు? ఇంద్రజాలాన్ని ప్రభుత్వాలు ఓ కళగా గుర్తించాలి. అప్పుడే ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగమైన ఇంద్రజాలాన్ని పరిరక్షించుకోగలుగుతాం. సర్కస్ అంటే రష్యాది అని... ఇంద్రజాలం అంటే ఇండియాది అని ప్రపంచం అంతటా పేరుంది. దేశానికి పేరు తెచ్చిన ఇంద్రజాల విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదుంది. అన్ని రాష్ట్ర్రాల రాజధానుల్లో మ్యాజిక్ అకాడమీలు ఏర్పాటు చేసి ఇంద్రజాలాన్ని ప్రోత్సహించాలి. ఆ దిశగా నా కార్యాచరణను కొనసాగిస్తున్నాను. – మాడా చంద్రమోహన్, సాక్షి, మదనపల్లె, చిత్తూరు -
గుంటూరులో జాదుగర్ ఆనంద్ మ్యాజిక్ షో
-
గుంటూరులో జాదూగర్ ఆనంద్ మ్యాజిక్ షో
-
ఆ సర్వేలో బీజేపీకి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : గత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ప్రస్తుతం ఆశావహ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్కు బీజేపీ చేరుకోలేదని ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ చేపట్టిన మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంఓటీఎన్) సర్వే వెల్లడించింది. 543 స్ధానాలున్న లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు కేవలం 281 స్ధానాలు లభిస్తాయని, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమికి 122 స్ధానాలు లభిస్తాయని అంచనా వేసింది. జులై 18 నుంచి జులై 29 మధ్య జరిగిన ఈ సర్వేలో ఇతరులకు గణనీయంగా 140 సీట్లు లభిస్తాయని పేర్కొంది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 282 స్ధానాలను గెలుచుకోగా ఎన్డీఏ కూటమికి 336 సీట్లు దక్కాయి. విపక్ష కాంగ్రెస్ భారీ పరాజయం మూటగట్టుకుని కేవలం 44 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక ఎంఓటీఎన్ సర్వే ఎన్డీఏకు 36 శాతం ఓట్లు లభిస్తాయని, యూపీఏకు ఐదు శాతం తక్కువగా 31 శాతం ఓట్లు పోలవుతాయని లెక్కగట్టింది. ఇతరులకు యూపీఏ కన్నా అధికంగా 33 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. -
అబద్ధం చెప్పని ఓ అద్దం కథ!
అద్దమెప్పుడూ అబద్ధం చెప్పదంటారు..మిగతావాటి సంగతి తెలియదుగానీ..ఈ అద్దం మాత్రం చెప్పదట..సత్యహరిశ్చంద్రుడిలా ఎప్పుడూ నిజమే చెబుతుందట.. కావాలంటే.. ‘స్నోవైట్’ కథలో అడిగినట్లు.. ‘మిర్రర్ మిర్రర్ ఆన్ ద వాల్..’ అంటూ అడగండి.. నిజమే చెబుతుంది. ఇంతకీ దేని గురించి నిజం చెబుతుంది అని అడిగితే.. మీ గురించే అంటారు దీన్ని తయారుచేసిన సిలికాన్ వ్యాలీ స్టార్టప్ కంపెనీ ‘నేక్డ్ ల్యాబ్స్’ ప్రతినిధులు.. ఇంతకీ మన గురించి ఇది చెప్పే ఆ నిజమేంటి? రోజూ పేపర్ తిరగేస్తే.. భారతీయులు బరువెక్కువున్నారు.. కొవ్వు శాతం ఎక్కువైంది.. దీనివల్ల ఆ జబ్బు వస్తుంది.. ఈ రోగం రావచ్చు అని వార్తలే వార్తలు.. కదా.. అందుకే ఓసారి మన శరీరం పరిస్థితేమిటి? ఎక్కడ కొవ్వు శాతం ఎక్కువైంది? ఒకవేళ తగ్గించుకోవడానికి మనం కసరత్తులు వంటివి చేస్తుంటే.. డైట్లు వంటివి పాటిస్తుంటే.. అవి నిజంగా పనిచేస్తున్నాయా? శరీరంలో నిజంగానే కొవ్వుతగ్గుతుందా లేదా పెరుగుతుందా? పెరిగితే.. ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి విషయాలకు సంబంధించిన ‘నగ్న’సత్యాన్ని ‘నేక్డ్’ అనే ఈ మ్యాజిక్ మిర్రర్ మన ముందుంచుతుందట. అదెలా? ముందుగా మనం అద్దానికి ఎదురుగా ఉండే పీటలాంటి దాని మీద నిల్చోవాలి. అది మనల్ని చుట్టూ తిప్పుతుంది.. ఇలా 20 సెకన్లపాటు చేస్తుంది. అంతలోనే ఆ అద్దం మన శరీరాన్ని స్కాన్ చేసేస్తుంది. త్రీడీ మ్యాప్స్ తీసేస్తుంది. ఇందుకోసం ఇందులో ఇంటెల్ రియల్ సెన్స్ సెన్సర్లు పెట్టారు. ఆ సమయంలో నగ్నంగా నిల్చుంటే.. మరింత కచ్చితంగా త్రీడీ మోడల్ తయారవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అనంతరం ఈ మ్యాజిక్ మిర్రర్తో అనుసంధానించి ఉండే స్మార్ట్ఫోన్ యాప్లోకి వివరాలు స్టోర్ అయిపోతాయి. వెంటనే విశ్లేషణ ప్రారంభమవుతుంది. శరీరంలోని కొవ్వు శాతం.. బరువు, లీన్మాస్, ఫ్యాట్మాస్ వంటి వివరాలు వచ్చేస్తాయి. అప్పట్నుంచి ఈ అద్దం ఎప్పటికప్పుడు మన శరీరంలో వచ్చిన మార్పులను విశ్లేషించి.. సమాచారాన్ని అందిస్తుంది. అంటే వారాలు, నెలలు లెక్కన విశ్లేషణ చేసి.. ఆ నిర్ణీత కాలంలో కొవ్వు తగ్గిందా పెరిగిందా అన్న వివరాలను తెలుపుతుంది. ముఖ్యంగా మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ పరికరం తోడ్పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. కండల వీరులకూ ఉపయోగపడుతుందని.. ఎక్కడ మజిల్ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి వివరాలనూ అందిస్తుందని అంటున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి హోం బాడీ స్కానర్ అని చెబుతున్నారు. సురక్షితమేనా? యాప్లో స్టోర్ అయ్యే మన వ్యక్తిగత చిత్రాలు, సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదముందని సైబర్ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. అలాంటి చాన్సే లేదని కంపెనీ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. డాటా హ్యాక్ అయ్యే పరిస్థితి లేదని.. పూర్తిస్థాయిలో భద్రతాచర్యలు చేపట్టామని.. పైగా.. ఆ అద్దాలు తీసేవి ఫొటోలు కావని.. త్రీడీ మోడల్ మాత్రమేనని.. అది ఎక్స్రేలాగ ఉంటుందని చెబుతున్నారు.. సంబంధిత యూజర్కు మాత్రమే ఆ సమాచారం అందుబాటులో ఉంటుందని.. భయపడాల్సిన పనేలేదని భరోసా ఇస్తున్నారు. దీని ధర రూ. లక్ష. వచ్చే నెల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయట.. ఇదండీ.. అబద్ధమే ఎరుగని ఓ అద్దం కథ.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కూటమి తప్పదా?
కరాచీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీగా నిలిచిన పీటీఐ మేజిక్ ఫిగర్కు కొద్ది దూరంలో నిలిచింది. శుక్రవారం రాత్రి వరకు అధికారికంగా వెల్లడైన 265 స్థానాల ఫలితాల్లో పీటీఐ 118 చోట్ల విజయం సాధించగా.. మరో రెండుచోట్ల ఆధిక్యంలో ఉంది. పీఎంఎల్ ఎన్ 62 స్థానాల్లో, పీపీపీ 43 చోట్ల గెలిచాయి. స్వతంత్ర అభ్యర్థులు 12 చోట్ల గెలిచారని ఎన్నికల సంఘం వెల్లడించింది. మతతత్వ పార్టీల కూటమి అయిన ఎంఎంఏపీ 11 స్థానాల్లో గెలవగా.. ఎంక్యూఎం 4 చోట్ల గెలిచింది. గెలిచిన ఎంపీ సీట్ల ఆధారంగా మహిళలు, మైనారిటీ సభ్యుల కోటాలో పీటీఐ ఖాతాలోకి మరో 34–35 స్థానాలు దక్కనున్నాయి. మొత్తంగా కలుపుకుంటే పార్లమెంటులో పీటీఐ ఎంపీ సీట్ల సంఖ్య 160 వరకు ఉంటుందని అంచనా. ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు మొత్తం 172 స్థానాలు అవసరం. దీంతో ఇమ్రాన్ ఖాన్కు స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం పీటీఐ ముఖ్యనేతలతో ఇస్లామా బాద్లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై వీరితో చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు దక్కుతుందని, ఆందోళన అవసరం లేదని ఆయన పార్టీ నేతలతో దీమా వ్యక్తం చేశారు. కాగా, ఇమ్రాన్కు వీవీఐపీ ప్రొటోకాల్ను అమల్లోకి తెచ్చారు.మరోవైపు, పాక్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. పారదర్శకత లేని ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాతీర్పును ప్రతిబింబించడం లేదని అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించబోమని ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. పంజాబ్ ప్రావిన్స్లో పీటీఐ నవాజ్ షరీఫ్ కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులో తొలిసారిగా పీటీఐ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. 297 అసెంబ్లీ స్థానాల్లో పీఎంఎల్ఎన్ 127 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. 117 స్థానాలు గెలిచిన పీటీఐ.. స్వతంత్రుల (27 సీట్లు)తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అటు 140 సీట్లున్న సింధ్ ప్రావిన్స్లో 72 చోట్ల గెలిచిన పీపీపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఇక్కడ పీటీఐ 20 చోట్ల గెలిచింది. అటు, 99 స్థానాలున్న ఖైబర్–ఫక్తున్ఖ్వా అసెంబ్లీలో పీటీఐ 66 చోట్ల గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. బెలూచిస్తాన్ అసెంబ్లీలో 51 స్థానాలుండగా.. కొత్తగా ఏర్పాటైన బెలూచిస్తాన్ అవామీ 13 సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది. రాజకీయ అస్థిరతపై ఆందోళన పాకిస్తాన్లో ఎన్నికలు జరిగిన తీరు ఫలితాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ దేశ తదుపరి ముఖచిత్రంలో అస్థిరత తప్పదని పాక్ రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు, ముఖ్యనేతలంతా వారి కంచుకోటల్లో ఓడిపోవడం వంటి కారణాలతో.. కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందంటున్నారు. ప్రజల్లో పీటీఐ పట్ల సానుభూతి లేనప్పటికీ ఈ ఫలితాలు రావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్ రాజకీయాల్లో వచ్చే కొద్ది రోజులు అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో ఓడిన పార్టీలన్నీ ఏకమై దేశవ్యాప్త ఆందోళనలు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాయి’ అని పాక్ రాజకీయ నిపుణుడు ఒమైర్ అలావీ పేర్కొన్నారు. కుట్ర జరిగింది: విపక్షాలు పార్లమెంటులో 68 స్థానాలు గెలవడం, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీలో 122 స్థానాల్లో గెలవడం తమ పార్టీపై జరిగిన కుట్రేనని పీఎంఎల్–ఎన్ ఆరోపిస్తోంది. అటు పీపీపీ కూడా తమ పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా ఓడిపోయామని.. ఏకంగా పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో కంచుకోట అయిన కరాచీలో ఓడిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలను హైజాక్ చేశారని.. ఫలితాలు అనుమానాస్పదంగా ఉన్నాయని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ గెలవలేదని.. ఆయన్ను కొందరు (ఆర్మీ, ఎన్నికల సంఘం పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ) గెలిపించారన్నారు. తొలి హిందూ ఎంపీ పాకిస్తాన్లో తొలిసారిగా ఓ హిందువు ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నాడు. పీపీపీ తరపున సింధ్ ప్రావిన్స్లోని థార్పార్కర్–2 స్థానం నుంచి పోటీ చేసిన మహేశ్ కుమార్ మలానీ 20వేల ఓట్లతో విజయం సాధించాడు. పాకిస్తాన్లో ముస్లిమేతరులకు పార్లమెంటుకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు కల్పించిన 16 ఏళ్ల తర్వాత ఓ హిందువు పోటీచేసి గెలవడం ఇదే తొలిసారి. హిందు రాజస్తానీ పుష్కర్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహేశ్.. 2003–08లో పీపీపీ తరపున పార్లమెంటుకు నామినేటెడ్ ఎంపీగా ఉన్నారు. -
‘మెజారిటీ’ సర్కారే..!
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పునిస్తారనేది ఉత్కంఠగా మారింది. అన్ని పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం జరగటం.. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుందని వెల్లడిస్తున్న నేపథ్యంలో ఫలితంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే కర్ణాటక రాజకీయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం కర్ణాటకలో మెజారిటీ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్లలో ఒకరికి మేజిక్ ఫిగర్ దక్కుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్పోల్స్ అంచనాలు తారుమారైన విషయాన్ని వీరు గుర్తుచేస్తున్నారు. యూపీ ఫలితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. కన్నడలో ప్రజానాడిపై విడుదలైన ఎనిమిది సర్వేల్లో.. ఆరు బీజేపీవైపు, రెండు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి. కేవలం మూడు సర్వేలు మాత్రమే ఏకపార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని పేర్కొన్నాయి. ఇందులో ఇండియాటుడే–యాక్సిస్ సంస్థ కాంగ్రెస్ 106 నుంచి 118 సీట్లతో సర్కారు ఏర్పాటుచేస్తుందని పేర్కొనగా.. రిపబ్లిక్–జన్కీ బాత్, టుడేస్ చాణక్య సంస్థలు బీజేపీకీ స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టాయి. యూపీలో గతితప్పిన అంచనాలు గతంలోనూ వివిధ రాష్ట్రాలపై పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్పోల్స్ క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించటంలో విజయం సాధించలేకపోయాయి. ఉదాహరణకు, గతేడాది యూపీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ+కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే ఎస్పీ+కాంగ్రెస్ కూటమిదే అధికారమని కొన్ని సంస్థలు, బీజేపీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్నా అత్తెసరు మెజారిటీయే ఉంటుందని మరికొన్ని సంస్థలు ఎగ్జిట్పోల్స్ను వెల్లడించాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా ఓవైపు ప్రధాని మోదీ, అమిత్షాల వ్యూహాలు.. కాంగ్రెస్ తరపున సిద్దరామయ్య ఒంటరిగా ప్రతివ్యూహాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏ పార్టీ మరొకరికి తీసిపోని విధంగా ప్రచారం చేసింది. మే 15 నాటి ఫలితాలతోనే ఎవరిపై ఎవరిది పైచేయనేది స్పష్టమవుతుంది. సిద్దరామయ్య విశ్వాసం కాంగ్రెస్ తరపున సీఎం సిద్దరామయ్యే కన్నడ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఐదేళ్ల కాలంలో చేపట్టిన పలు పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన విశ్వాసంతో ఉన్నారు. ప్రభుత్వంపై ఉండాల్సినంత వ్యతిరేకత లేకపోవటం, సామాన్యులు, పేదలకోసం ఉద్దేశించిన పథకాలను సరిగ్గా అమలుచేయటమే తనకు మళ్లీ పట్టంగడతాయని ఆయన విశ్వసిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది కేవలం సిద్దరామయ్య వ్యక్తిగత చరిష్మా వల్ల మాత్రమేననేది సుస్పష్టం. కన్నడ గౌరవం, కన్నడ ప్రత్యేక జెండా వంటివి కర్ణాటక ఓటర్లను కాంగ్రెస్కు దూరం కాకుండా చేస్తాయని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఐదారు నెలలుగా తమ పార్టీకి 120కి పైగా సీట్లొస్తాయని విశ్వాసంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవానికి ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత లేదు. అటు బీజేపీకి కూడా 2008లో అధికారంలోకి వచ్చిన నాటి పరిస్థితులు కూడా లేవు. క్షేత్రస్థాయి పనిలో బీజేపీ! కర్ణాటక ఎన్నికలకు కనీసం ఆర్నెల్ల ముందునుంచే బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లింది. బూత్ స్థాయిలో పనిచేసేలా కార్యకర్తలకు శిక్షణనివ్వటం మొదలుకుని ఓటింగ్ రోజు వారిని పోలింగ్ బూత్లకు తీసుకురావటం వరకు పకడ్బందీగా నిర్వహించింది. ఈ పనిని అమిత్షాయే ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూవచ్చారు. అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల జాబితా విశ్లేషణ, ఎన్నికల ర్యాలీలు, యాత్రలు, ప్రజలను చేరుకునే కార్యక్రమాల్లో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కర్ణాటక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఇక్కడ తొలిసారి ఓటేస్తున్న వారి సంఖ్య గతంలో కంటె రెట్టింపు కాగా, మహిళాఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మోదీ తన ప్రచారంలో యువత, మహిళలను పదేపదే ప్రస్తావించటం వెనక వ్యూహం కూడా ఇదే. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అమిత్ షా సందేశమిస్తూ.. ‘ ఉదయం 10.30 కల్లా ఓటు వేసి.. మిగిలిన వారు ఓటింగ్లో పాల్గొనేలా ప్రోత్సహించండి’ అని సూచించారు. లింగాయత్లు ఎటువైపు? ఈసారి కన్నడ ఫలితాలను నిర్ణయించే ప్రధాన అంశం లింగాయత్లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించటం. ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం తనకు అండగా నిలుస్తుందని సీఎం భావిస్తున్నారు. లింగాయత్ల జనాభా ఎక్కువగా ఉండే, సెంట్రల్ కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్పోల్స్, అంతకుముందు ఒపీనియన్ పోల్స్కూడా వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే 10 శాతం లింగాయత్లు మినహా మిగిలిన వారంతా బీజేపీతోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఓటింగ్ శాతం పెరగటం అధికార పార్టీపై వ్యతిరేకతకు సంకేతమని అనుకోవడానిక్కూడా వీల్లేదు. దళిత, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కర్ణాటక, వక్కలిక ఓట్లు మెజారిటీగా ఉన్న పాత మైసూరు ప్రాంతాలపైనే కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. హైదరాబాద్ కర్ణాటకలోనూ బీజేపీనుంచి తీవ్రమైన పోటీ తప్పదని తెలుస్తోంది. కోస్తా కర్ణాటకలోనూ బీజేపీయే మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
బోస్.. మ్యాజిక్ బాస్
భీమవరం: ఇంద్రజాలంలో రాణిస్తూ.. అంతర్జాతీయస్థాయి కీర్తిని సొంతం చేసుకున్నారు డాక్టర్ బోస్. ఆయన పూర్తిపేరు దంతులూరి సత్యనారాయణరాజు. ఊరు భీమవరం. ఇంద్రజాల ప్రదర్శనలు, పుస్తక రచన, పరిశోధనలతో ఆయన మ్యాజిక్ స్టార్గా గుర్తింపు పొందారు. సుమారు 50 ఏళ్లుగా ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ.. అనేక అవార్డులు, బిరుదులు, సన్మానాలు, సత్కారాలు పొందారు. 1948లో జన్మించిన బోస్ కామర్స్లో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ అకౌంట్స్, మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లమో పూర్తిచేశారు. పీపుల్స్ మ్యాజిక్ సర్కిల్(ఇండియా) అధ్యక్షునిగా, ఇంద్రజాలం, ఇంద్రజాల ప్రపంచం, మాయాదండం వంటి పత్రికలకు ఎడిటర్గా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మోడర్న్ మ్యాజిక్ డైరెక్టర్గా, నేషనల్ మ్యాజిక్ కళాశాల కర్సపాండెంట్గా పనిచేశారు. 16 మ్యాజిక్ పుస్తకాల రచన డాక్టర్ బోస్ ఇంద్రజాలం, మ్యాజిక్ గైడ్, మాయా బజార్, మ్యాజిక్ షో, మహిమలు, మర్మాలు, బుద్ధ గాథ–బుద్ధ బోధ వంటి ఇంద్రజాలానికి సంబంధించిన 16 పుస్తకాలను రచించారు. వివిధ పత్రికల్లో వ్యాసాలూ రాశారు. బిరుదులు, అవార్డుల పరంపర ఆయన ఇంద్రజాల కళా సార్వభౌమ, మ్యాజిక్ చక్రవర్తి, మెగా మెజీషియన్, మ్యాజిక్ మాస్టర్ వంటి 11 బిరుదులు పొందారు. అలాగే మ్యాజిక్ రత్న, ఆంధ్ర రత్నం, విశిష్ట ఇంద్రజాలికుడు అవార్డు, నేతాజీ అవార్డు, శాంతి సామరస్యం వంటి దాదాపు 27 అవార్డులను కుబుద్బెన్జోషి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, బీష్మనారాయణసింగ్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. 13 వరల్డ్ రికార్డులు ఆయన సొంతం సత్యనారాయణరాజు మ్యాజిక్లో అద్భుతాలు సృష్టించి వరల్డ్ రికార్డులనూ సొంతం చేసుకున్నారు. యూనిక్ వరల్డ్ రికార్డు, ఎమేజింగ్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డు, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డు వంటి 13 రికార్డులను తన కీర్తిమకుటంలో పొందుపరుచుకున్నారు. అంతేనా.. బోస్ స్వయంగా వంద మ్యాజిక్ ట్రిక్కులను మరొక 100 మ్యాజిక్ పరికరాలను తయారు చేయడం విశేషం. గతంలో భీమవరం పట్టణంలో కళ్ళకు గంతులు కట్టుకుని మోటారు సైకిల్ నడిపి అబ్బురపర్చడమేగాక మ్యాజిక్కు సంబంధించి రాష్ట్ర, జాతీయస్థాయి సమావేశాలు, తరగతులు నిర్వహించారు. వేలాది ప్రదర్శనలిచ్చిన డాక్టర్ బోస్ సమాజంలోని మూఢ నమ్మకాలపై ప్రచారం చేయడంతోపాటు శాంతి, అహింసలను ప్రబోధించే బౌద్ధ పుస్తకాలను రచించి జైళ్లలోని ఖైదీలకు ఉచితంగా పంపిణీ చేశారు. వారిలో మానసిక పరివర్తన తీసుకురావడానికి కృషి చేశారు. విదేశీ పర్యటనలు సత్యనారాయణరాజు మ్యాజిక్ను ప్రదర్శించడానికి సింగపూర్, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, ఇంగ్లాడ్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, వాటికన్ సిటీ, ఇటలీ వంటి దేశాల్లో పర్యటించారు. తోటి మేజీషియన్లను గౌరవించాలనే సంకల్పంతో ఏటా బోస్ మ్యాజిక్ నగదు అవార్డును అందజేస్తున్నారు. -
మూఢనమ్మకాలు హాంఫట్!
చేతుల్లో వస్తువులు మాయం చేసి మస్కా కొడుతూ తాను భగవత్ స్వరూపునిగా అభివర్ణించుకుంటుంటారు కొందరు. నిమ్మకాయ కోసి రక్తం చూపి తమను తాము దైవాంశ సంభూతులమనుకొమ్మంటారు మరికొందరు. చేతబడులకు తిరుగుబడి చేస్తే జ్వరాలు తగ్గుతాయంటూ కోళ్లు, కానుకలు దండుకుంటుంటారు ఇంకొందరు. ముఖ్యంగా గిరిజనుల అమాయకత్వం, నిరక్షరాస్యత అడ్డం పెట్టుకుని కొందరు స్వాములు పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఇంద్రజాలాన్ని అస్త్రంగా వాడుతున్నారా ముగ్గురు. వారే మ్యాజిక్ సిస్టర్స్ అయిన మౌనిక, సుస్మిత. వారి తండ్రి జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి (చారి). మ్యాజిక్ సహోదరీమణుల ఆ ద్వయం... తమ తండ్రితో కలిసి త్రయంగా ఏర్పడి... మూఢనమ్మకాలు తొలగించాలని పడుతున్న తాపత్రయం వారిది. వాళ్ల జీవిత‘ఆదర్శం’ ఆ అక్కాచెల్లెళ్ల మాటల్లోనే... ఇంద్రజాలంతో ఎందరో మోసగాళ్లు అమాయకులను మోసం చేస్తుంటారు. అదే ఇంద్రజాలంతో మోసాన్ని మాయం చేస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు... మా నాన్న పేరు జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి (చారి). విజయనగరం పట్టణంలోని గంటస్థంభం దగ్గర కానుకుర్తివారివీధిలో నివాసం. నాన్న న్యాయస్థానంలో జూనియర్ అసిస్టెంట్. బీవీ పట్టాభిరామ్ వంటి ప్రముఖుల షోలు చూసి తానూ మ్యాజిక్ నేర్చుకొని ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టారు నాన్న. తన పదహారేళ్ల వయసులో తొలి ప్రదర్శనను తాను ఇంటర్మీడియెట్ చదువుతున్న ఎమ్మార్ కళాశాలో ఇచ్చారు. అప్పటి నుంచి గత 32 ఏళ్లుగా ఆయన దాదాపు 10 వేల ప్రదర్శనలిచ్చారు. మా అమ్మ పేరు రమణి. పెళ్లి తర్వాత ఆమె సహకారంతో తన ప్రవృత్తికి మరింత పదును పెట్టి మూఢనమ్మకాలపై కత్తి దూశారు. కొరడా ఝుళిపించారు. మేమింకా మ్యాజిక్ యవనికపైకి అడుగుపెట్టకముందే ఒక ఇంద్రజాలికునిగా పది వేలకు పైగా ప్రదర్శనలిచ్చి జాతీయ అవార్డు అందుకున్నారు మా తండ్రి. మాది సమాజం హర్షించే మాయ అవును... మేమూ మాయ చేస్తున్నాం. కాకపోతే మాది సమాజం హర్షించే మాయ. నిజం చెప్పాలంటే మా మాయతో మేము మూఢనమ్మకాలను మాయం చేస్తున్నాం. అంధ విశ్వాసాలను అంతం చేస్తున్నాం. మాయలతో మోసపుచ్చే మాయగాళ్ల గారడీ చేతబడికి తిరుగుబడి చేస్తున్నాం. ఇందుకు తగిన కారణమూ, నేపథ్యమూ ఉంది. మా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమూ, అక్కడ అమాయక గిరిజనులు ఎక్కువ. అప్పట్లో క్యాన్సర్, గుండె జబ్బు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా మరణిస్తే ప్రజలకు వాటి గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల చేతబడి, చిల్లంగి, బాణామతి వంటి క్షుద్ర ప్రయోగం వల్ల చనిపోయి ఉంటారని అపోహ పడేవారు. అవన్నీ కేవలం మూఢనమ్మకాలంటూ మేము మ్యాజిక్ సాయంతో నిరూపిస్తున్నాం. విజయనగరం జిల్లాలోని సాలూరు, పి కోనవలస, నీలకంఠాపురం, మొండెంకళ్లు, చినమేరంగి, కురుపాం, మక్కువ, కూనేరు, పార్వతీపురం, పెదబొండపల్లి, పాచిపెంట, మామిడిపల్లి, గుమ్మలక్ష్మీపురం, ఇంగిలాపల్లి, బొద్దాం, అలమండ, కొత్తవలస, కొట్యాడ, ఎస్కోట ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక ప్రదర్శనలిచ్చాం. మాయను మాయతోనే ఎలా ఛేదిస్తామంటే... మా ప్రాంతంలోని మాయలోళ్లు అమాయకులను బుట్టలో వేసుకోడానికి రకరకాల ప్రదర్శలను ఇస్తుంటారు. వాటి సాయంతో తమకు మహిమలున్నాయని చెప్పుకుంటుంటారు. మహిమల పేరు చెప్పి వారు చేసేవన్నీ మేమూ చేస్తాం. నిమ్మకాయ నుంచి రక్తం రావడం, కొబ్బరి కాయలో నుంచి పువ్వులు, రక్తం రావడం, నాలుకపై త్రిశూలం గుచ్చుకోవడం, నోట్లో బ్లేడులు వేసుకుని నమిలి, మింగిన తర్వాత తోరణంగా వాటిని బయటకు తీయడం, విభూది సృష్టించడం, మెడలో కత్తి గుచ్చుకోవడం, తాడుమీద కొబ్బరికాయను అటూ ఇటూ నడిపించడం, దయ్యాలు, భూతాలపై భయాన్ని పోగొట్టేందుకు మనిషిని హిప్నటైజ్ చేసి తలపై మంటపెట్టి పాలు, నీరు మరిగించడం వంటి విద్యలను ప్రదర్శిస్తాం. అవి కేవలం సైంటిఫిక్గా ప్రదర్శించే విద్యలే తప్ప మహిమలు కాదని చాటి చెబుతాం. ఊరూరా కేవలం ఈ ప్రదర్శనలే కాకుండా కళ్లకు గంతలు కట్టుకుని రోడ్లపై మోటార్ సైకిల్ నడిపి ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలే ప్రయత్నాలూ మా ప్రదర్శనలో భాగంగా ఉంటాయి. మాది సఫల ప్రయత్నం.. అందుకు ఇదీ ఉదాహరణ! మా ప్రదర్శనలు ఎంతో విజ్ఞానవంతమైనవి. మరింత చైతన్యపరిచేవి. మా ప్రయత్నం ఎంత సఫలమో చెప్పేందుకు ఉదాహరణ ఒకటుంది. మా నాన్నగారు మ్యాజిక్ చేస్తుండగా విజయనగరం జిల్లాలోని జియమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మా నాన్న దగ్గరికి వచ్చాడు. తాను చిల్లంగి చేస్తున్నాననే నెపంతో కొందరు తన భార్యను పొట్టనబెట్టుకున్నారట. తననూ చంపేస్తామంటున్నారంటూ బోరున విలపించాడు. ఇవే ప్రదర్శనలు తమ గ్రామంలో ఇచ్చి తన ప్రాణాలు నిలపమంటూ నాన్నను ప్రాధేయపడ్డాడు. నాన్న కారణంగా తన ప్రాణం దక్కుతుందంటూ కన్నీళ్లతో నమస్కరించాడు. ఇలా మా ప్రదర్శనలతో ప్రజలు చైతన్యవంతం కావడమే కాదు... చాలామంది ప్రాణాలూ నిలిచాయి. కొన్ని జీవితాల్లో మార్పులూ వచ్చాయి. వినోదంతో పాటు సామాజిక బాధ్యత మా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో శిశుమరణాలు ఎక్కువ. గర్భిణీ ఆరోగ్యం విషయంలో వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సరైన మందులు, వైద్యం కూడా అందదు. ఇక పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం కూడా ఉండదు. ఈ కారణంగా బిడ్డలు పౌష్టికాహార లోపంతో చిన్న వయసులోనే మృత్యువాత పడుతుంటారు. కనీసం వారికి తల్లిపాలైనా సరిగ్గా ఇస్తే కొంతమందినైనా బతికించుకోవచ్చు. ఈ నేపథ్యంలో తల్లిపాల విశిష్టత, శిశువులకు పౌష్టికాహార ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. గిరిజనులు తమ పిల్లలను బడికి పంపకుండా, కూలీ పనులకు పంపిస్తుంటారు. అలా చేయడం వల్ల వారి జీవితాల్లో వెలుగులు ఎన్నటికీ రావంటూ, విద్య ఆవశ్యకతపైనా ప్రదర్శనలిస్తుంటాం. ఆడపిల్లను చంపుకుంటే ఇంటి లక్ష్మిని చంపుకున్నట్టేనంటూ మా ఇద్దరినీ ఉదాహరణగా చూపిస్తూ.. భ్రూణహత్యలు, స్త్రీ శిశు హత్యలకు వ్యతిరేకంగా చైతన్యం తెస్తుంటారు నాన్న. చిన్నారి పొన్నారి చిరు వయసు నుంచే... మా ఇద్దరిలో మూడున్నర ఏళ్ల వయసప్పుడు నాచేత ప్రదర్శన ఇప్పించారు నాన్న. నన్ను చూసి చెల్లెలు రెండున్నర ఏళ్లున్నప్పుడే వేదిక ఎక్కడానికి ఉత్సాహం చూపింది. తాను అంత చిన్న వయసు నుంచే మ్యాజిక్ మొదలుపెట్టింది. అలా నాన్నతో పాటు మేమిద్దరమూ 28కి పైగా జాతీయ, రాష్ట్రీయ అవార్డులు ఎన్నో పురస్కారాలు గెలుచుకున్నాం. మాది ఒక్కటే కోరిక. సమాజంలోని మూఢనమ్మకాలు అంతమైపోవాలి. అందుకు మా మ్యాజిక్ ఉపయోగపడి... అది మూఢనమ్మకాలను మాయం చేసేస్తే మాకు అంతకంటే ఏం కావాలి? జాతీయ స్థాయి గుర్తింపు ఇంద్రజాల ప్రదర్శనలో ప్రతిభకు వచ్చిన జాతీయ అవార్డు అందుకోవడానికి 2006లో మా అక్కాచెల్లెళ్లమిద్దరమూ ఢిల్లీకి వెళ్లాం. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ నుంచి అవార్డు తీసుకుంటుండగా మా విజిటింగ్ కార్డును ప్రధానికి ఇచ్చి ‘హమారా ఐడెంటిటీ కార్డ్’ అన్నాం. వెంటనే స్పందించిన మన్మోహన్సింగ్ ‘తుమ్హారా ఐడెంటిటీకార్డ్!’ అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్నట్లు ముఖం పెట్టి ఆయన ఫక్కున నవ్వేశారు. విజిటింగ్ కార్డుకి ఐడెంటిటీ కార్డుకీ తేడా తెలియని వయసులో ఇంద్రజాలంలో జాతీయ అవార్డు అందుకున్నాం మేం. బహుశా ఇలా అక్కాచెల్లెళ్లిద్దరూ ఇంద్రజాలం ప్రదర్శించే మ్యాజిక్ సిస్టర్స్ మేమే కాబోలు. లాయర్ని అవుతా నాన్న కోర్టులో జూనియర్ అసిస్టెంట్ కావడంతో తరచుగా అక్కడికి తీసుకువెళ్లేవారు. దాంతో న్యాయవాద వృత్తిని చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. మరి కొద్ది నెలల్లో ఎల్ఎల్బి పట్టా అందుకోబోతున్నాను. ఆటబొమ్మల బదులు మ్యాజిక్ వస్తువులు ఇచ్చి నాన్న ఆడుకోమనేవారు. ఆలా ఇంద్రజాలాన్ని ఉగ్గుపాలతోనే అలవాటు చేశారు. చెల్లి కూడా నాతో జతకలిసిన తర్వాత ఏ ప్రదర్శన చేసినా ఇద్దరం కలిసే చేస్తున్నాం. – మౌనిక, ఇంద్రజాలికురాలు, విజయనగరం షార్ట్ ఫిల్మ్స్కు ఎడిటర్గా చేస్తున్నా మానవ వనరులను సబ్జెక్ట్గా తీసుకుని డిగ్రీ చదువుతున్నాను. యానిమేషన్పై ఇష్టంతో అదీ నేర్చుకుని ఫ్రెండ్స్ ఫిల్మ్స్ అనే యూ ట్యూబ్ చానెల్ ద్వారా స్నేహితులతో కలిసి తీస్తున్న షార్ట్ ఫిల్మ్స్కి ఎడిటర్గా కూడా చేస్తున్నాను. చిన్నప్పుడు అక్క మ్యాజిక్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టడం చూసి నాకూ మ్యాజిక్ చేయాలనిపించింది. నాన్న అక్కకూ, నాకూ దానిలో మెళకువలు నేర్చించారు. ఒకప్పుడు మేం చేస్తుంటే విమర్శించిన వారు ఇప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. – సుష్మిత, ఇంద్రజాలికురాలు, విజయనగరం చాలా విమర్శలు ఎదుర్కొన్నా ఆడపిల్లల ముఖానికి రంగేసి తిప్పుతున్నానని, పెళ్లి చేయకుండా ఈ గారడీ ప్రదర్శనలేంటని బంధువర్గంలో సూటిపోటి మాటలు బాధించేవి. మ్యాజిక్ను చాలా చులకనగా చూసేవారు. ఒకానొక దశలో క్షుద్ర విద్యలు నేర్పుతున్నాననేవారు. ఇది క్షుద్రవిద్య కాదని, ఇంద్రజాలం అనేది ఓ కళ అని నమ్మిన నేను ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంతగా నిరుత్సాహ పరిచినా వెనుదిరిగి చూడలేదు. వాళ్లన్న క్షుద్ర విద్యలు, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా ప్రదర్శనలిస్తున్నాం. – జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి, తండ్రి, ఇంద్రజాలికుడు, విజయనగరం – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
అమిత్ షాది కాలం చెల్లిన మ్యాజిక్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి భారతీయ జనతాపార్టీ చీఫ్ అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షావి కాలం చెల్లిన వ్యూహాలని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ విజయం తరువాత కర్ణాటక మీద బీజేపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మళ్లీ పాగా వేసేందుకు కమల దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం బెంగళూరు వచ్చారు. అమిత్ షా బెంగళూరు రావడంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. అమిత్ షాది కాలం చెల్లిన వ్యూహాలని ఆయన మీడియాతో అన్నారు. అమిత్ షా మ్యాజిక్కు కాలం చెల్లిందని.. ఇప్పుడు అది పనిచేయదని సిద్దరామయ్య అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మైసూర్ జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి సిద్ద రామయ్య బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. నవంబర్లోనూ బీజేపీ చీఫ్పై సిద్దరామయ్య ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక పర్యటనకు వచ్చిన అమిత్ షాను.. ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేని ఒక పర్యాటకుడిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని.. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
ఇతర మెట్రో నగరాల్లో పరిస్థితేంటి?
900–1,200 చ.అ. ఫ్లాట్లకు 40 శాతం డిమాండ్ వచ్చే ఐదేళ్లూ అందుబాటు గృహాలదే ఆధిపత్యం: మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక సాక్షి, హైదరాబాద్: రానున్న ఐదేళ్ల కాలం దేశీయ స్థిరాస్తి రంగంలో అందుబాటు గృహాలదే ఆధిపత్యం కొనసాగుతుందని మ్యాజిక్బ్రిక్స్ ఎడిటోరియల్ అండ్ అడ్వైజరీ హెడ్ ఈ జయశ్రీ తెలిపారు. ♦ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 900–1,200 చ.అ. మధ్య ఉండే మిడిల్ ఇన్కం గ్రూప్ (ఎంఐజీ) గృహాలకు 40 శాతం డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా పుణె, నోయిడా, థానే, నవీ ముంబై నగరాల్లో అయితే మరీనూ. రూ.6 లక్షల వరకు వార్షిక వేతనముండే వాళ్లూ సీఎల్ఎస్ఎస్కి అర్హులవుతుండటంతో 300–600 చ.అ. ఫ్లాట్లకూ గిరాకీ ఉంది. ♦ 600 చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఫ్లాట్లనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ప్రధాన నగరాల్లో ఈ తరహా గృహాలకు 11 శాతం డిమాండ్ ఉంది. నోయిడా, పుణె, హైదరాబాద్, గుర్గావ్, బెంగళూరు, అహ్మదాబాద్ల్లో 300 చ.అ.లోపుండే ఫ్లాట్లకు గిరాకే లేదు. ఆయా నగరాల్లో 450 చ.అ. ఫ్లాట్లకు డిమాండ్ ఉంది. ♦ గుర్గావ్లో మాత్రం 2,200 చ.అ. కంటే పైనుండే ఫ్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. 1,000 చ.అ. ఫ్లాట్లు ఆ తర్వాత నేరుగా 1,300 చ.అ. ఫ్లాట్లకే గిరాకీ ఎక్కువగా ఉందిక్కడ. ♦ నగరాలను బట్టి అందుబాటు గృహాల ఎంపికలోనూ కొనుగోలుదారుల దృష్టి మారడానికి కారణముంది. ఫరీదాబాద్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో చ.అ.కు నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుంది. దీంతో ఆయా నగరాల్లో 1,000–1,200 చ.అ. ఫ్లాట్లకు డిమాండ్ ఉంటుంది. అదే ఢిల్లీ, నవీ ముంబై వంటి ప్రీమియం నగరాల్లో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుండటంతో ఇక్కడ చిన్న ఫ్లాట్లకు మొగ్గు చూపుతుంటారు. -
సెన్సేషన్ సృష్ఠిస్తున్న ఆడమ్ ట్రెంట్ మేజిక్
-
అప్పణంగా భోంచేశారు!
జేఎన్టీయూలో మెస్ బిల్లుల మాయాజాలం లెక్కల్లో చూపకుండా రూ.8 లక్షలు స్వాహా కలికిరి కళాశాల విద్యార్థులతో చలానాకు బదులు నగదు రూపంలో వసూలు హాస్టల్ ఖాతాకు జమ చేయకుండా దారి మళ్లించిన వైనం! సాఫ్ట్వేర్ రూపకల్పనకు అనధికారికంగా రూ.4లక్షల చెల్లింపు!! జేఎన్టీయూ(ఏ)కు కానిస్టిట్యూట్ కళాశాలగా కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అక్కడ ల్యాబ్ సదుపాయాలు, పర్మినెంట్ ఫ్యాకల్టీ లేకపోవడంతో ప్రయోగాలు చేసుకోవడానికి అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు విద్యార్థులు వస్తుంటారు. ఏడాదిలో నాలుగు పర్యాయాలకు పైగా ఇక్కడి ల్యాబ్లను వారు ఉపయోగించుకుంటారు. దీంతో క్యాంపస్ కళాశాల హాస్టల్లోనే వారికి వసతి ఏర్పాట్లు చేస్తుంటారు. సాధారణంగా ఏ విద్యార్థి అయినా మెస్ బిల్లు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి హాస్టల్ అధికారులు నేరుగా మెస్ బిల్లులు కట్టించుకున్నారు. కానీ ఆ నగదు ఏ ఖాతాల్లోనూ చూపలేదు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి రూ.8లక్షలకు పైగానే నగదు కట్టించుకున్నట్లు తెలుస్తోంది. ఎంత మంది విద్యార్థులు భోజనం చేస్తారో వారందరి మీద మెస్ బిల్లు సమానంగా వేస్తారు. వసూలు చేసిన రూ.8లక్షలను హాస్టల్ ఖాతాకు చేర్చకపోవడంతో ఆ భారం కాస్తా స్థానిక కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులపై పడింది. వ్యూహంతో విద్యార్థులు బలి సాధారణంగా ఎవరైనా విద్యార్థి వరుసగా మూడు రోజులు మెస్కు గైర్హాజరయితే సెలవులో ఉన్నట్లు గుర్తించాలి. సెలవు రోజులకు మెస్ బిల్లు వేయకూడదు. కానీ ఇందుకు భిన్నంగా నెల రోజులు సెలవులో ఉన్న విద్యార్థులకు సైతం మెస్ బిల్లు వేశారు. దీంతో మెస్కు నిరంతరంగా హాజరైన విద్యార్థులకు బిల్లు తక్కువగా వచ్చింది. బిల్లు తక్కువగా వచ్చిన అంశాన్ని ముమ్మర ప్రచారం చేస్తూ హాస్టల్స్లో అంతా సజావుగా ఉందన్న భ్రమ కల్పించేందుకు ప్రయత్నించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇండెంట్కు.. బిల్లులకు భారీ వ్యత్యాసం మెస్లో నిత్యావసర సరుకుల కొనుగోలుకు సంబంధించి ఇండెంట్లో నిర్ధారించిన ధరకు, కొనుగోలు బిల్లుకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. జనవరి 24న ఇండెంట్లో ఉల్లిగడ్డలు కిలో రూ.14, మిర్చి రూ.10గా నిర్ధారించారు. కానీ బిల్లులో మాత్రం కిలో ఉల్లిగడ్డలు రూ.20, మిర్చి రూ.13గా చూపించారు. అంటే కిలోకు ఆరు రూపాయలు అదనంగా బిల్లు వేశారు. తిరిగి జనవరి 27న ఇండెంట్లో ఉల్లిగడ్డలు రూ.13, ఆలూ రూ.10, కానీ బిల్లులో ఉల్లి రూ.20. ఆలూ రూ.25గా బిల్లు వేశారు. బిల్లులోని ప్రతి వస్తువుపైనా అదనపు ధరలతో దండుకున్నారు. సాప్ట్వేర్ రూపకల్పనకు రూ. 4లక్షలు ఖర్చు మెస్బిల్లు వసూలుకు సంబంధించిన సాఫ్ట్వేర్ రూపకల్పనకు రూ.4 లక్షలు వెచ్చించారు. ఇందుకు ఎలాంటి విధివిధానాలు, అనుమతులు లేకుండానే హాస్టల్ అధికారులు ఖర్చు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రోగ్రాంను రూపొందించిన కంపెనీ సైతం లోకల్దే చూపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండడంతో మెస్ బిల్లులు భారంగా పరిణమించాయని విద్యార్థులు బాహాటంగానే వాపోతున్నారు. -
ప్రాణం మీదకు తెచ్చిన మ్యాజిక్
♦ విజిల్ మింగిన విద్యార్థి ♦ శ్వాసనాళంలో ఇరుక్కుని అవస్థలు ♦ విజయవంతంగా బయటికి తీసిన గాంధీ వైద్యులు గాంధీ ఆస్పత్రి: డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు విజల్ను మింగాడు. నోటి నుంచి మాటకు బదులుగా విజిల్ సౌండ్ రావడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి శ్వాసనాళంలో ఇరుకున్న విజల్ను విజయవంతంగా బయటికు తీయడంతో ప్రాణాపా యం తప్పింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్, ఈఎన్టీ హెచ్ఓడీ హన్మంతరావు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఒండ్రుగొండకు చెందిన భిక్షపతి (21) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం ఇంట్లో విజిల్ ఊదుతూ చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు. మ్యాజిక్ చేయాలని పిల్లలు కోరడంతో విజల్ను నోటి లోపలదాచుకున్నాడు. ఇదే సమయంలో ఓ చిన్నారి భిక్షపతి కడుపుపై సరదాగా కొట్టడంతో పెద్దగా ఊపిరితీసుకున్నాడు.దీంతో నోట్లో ఉన్న విజిల్ ప్రమాదవశాత్తు గొంతులోకి జారిపోయి ఎడమవైపు ఊపిరితిత్తి శ్వాసనాళంలో ఇరుక్కుంది. పలువిధాలుగా యత్నించిన విజిల్ బయటకు రాకపోవడంతోపాటు మాటలకు బదులుగా విజిల్ సౌండ్ రావడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు స్ధానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. సూర్యాపేట వైద్యుల సూచన మేరకు నగరంలోని కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకురాగా, ప్రాణాలకు ప్రమాదం ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో గురువారం గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చారు. ఇటీవల విజిల్ మింగిన చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ వైద్యులకు సమాచారం అందించారు. ఈఎన్టీ విభాగాధికారి హన్మంతరావు ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించి ఎడమ ఊపిరితిత్తి శ్వాసనాళంలో విజిల్ ఇరుక్కున్నట్లు గుర్తించారు. బ్రాంకోస్కోపీతో పాటు ట్రకాస్టమీ సర్జరీలు నిర్వహించి విజిల్ను విజయవంతంగా బయటకు తీశారు. బాధితుడు బిక్షపతి కోలుకుంటున్నాడు. శ్వాసనాళంలో ఇరుకున్న విజిల్ను తొలగించకుంటే ఇన్ఫెక్షన్కు గురై ప్రాణాపాయం సంభవించేందని వైద్యులు తెలిపారు. గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ నిర్వహించినట్లు సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ తెలిపారు. సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్యులు హన్మంతరావు, శ్రీకాంత్, వెంకటరామిరెడ్డి, అరుణ, అప్పారావు, సాధన, సంజీవ్, శ్యాంసన్, రాథోడ్, పీజీలు సునీల్, అభినవ్, చంద్రశేఖర్, డిపిన్, శ్రావణి వైద్య ఉన్నతాధికారులు అభినందించారు. -
మీ సేవలో.. మాయా దర్పణం!
అలెక్సా... సిరి... కోర్టానా. ఈ పేర్లు మనకు పెద్దగా పరిచయం లేకపోవచ్చుగానీ... ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ అసిస్టెంట్స్ వీళ్లంతా! మన మాటే మంత్రంగా... మనం చెప్పే పని (మెయిల్ చూడటం, సమాచారం ఇవ్వడం వంటివి) చేసి పెట్టేస్తాయి ఇవి. అయితే ఇప్పటివరకూ ఇవన్నీ కేవలం ఆడియోకే పరిమితమైపోయాయి. ఇప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ అద్దంతో పరిస్థితి మారిపోనుంది అంటోంది డాప్ట్లీ డిస్ప్లే! అమెరికన్ కంపెనీ ఈ డిస్ప్లేని అభివృద్ధి చేసింది. పొద్దున్న లేవగానే... మీరు ఈ అద్దం ముందు నిలబడితే చాలు.. డాప్ట్లీ మిమ్మల్ని గుర్తు పడుతుంది. హలో చెబుతుంది. ఈలోపు మీరు బ్రష్పై పేస్ట్ వేసేసుకుని.. ‘‘ఏంటి ఈ రోజు వార్తలు’’ అని అనడం ఆలస్యం.. ఆవేళ్టి ముఖ్యమైన వార్తల్ని చదివి వినిపిస్తూంటుంది. ఇంకోవైపు మీకు ఇష్టమైన న్యూస్ ప్రోగ్రామ్ ప్రత్యక్షమవుతుంది. ఈలోపుగానే మీరు మెయిల్స్ ఓపెన్ చేయి అనేసి వాటిని చూస్తూండవచ్చు కూడా. చేతి కదలికలతోనే... అద్దంపై కనిపించే మెయిల్స్ను వరుసగా చూడవచ్చు. అనవసరమైన వాటిని అక్కడికక్కడే ట్రాష్లో పడేయవచ్చు కూడా. మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరికైనా ఫోన్ చేయాలనుకోండి. సింపుల్. వారికి కాల్ చేయమని డాప్ట్లీకి చెబితే చాలు. మొబైల్ అవసరం లేకుండానే వీడియోకాల్ రెడీ ఐపోతుంది. మీరు అద్దం ముందు నుంచి తప్పుకున్న వెంటనే ఈ సమాచారమంతా మాయమైపోతుంది. ఇతర కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వారిని కూడా పేరుపేరునా గుర్తుపెట్టుకుని పలకరించడంతోపాటు వారికి కావాల్సిన సమాచారం ఇస్తుంది కూడా. అంతేకాదు.. ఈ సూపర్ హైటెక్ అద్దాన్ని ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, లైట్ బల్బులకు అనుసంధానించుకుంటే చాలు.. వాటిని కూడా మన మాటలతో నియంత్రించవచ్చు. ఉదాహరణకు పడుకోబోయే ముందు బెడ్రూమ్లోని ఏసీ ఆన్ చేయమని, మిగిలిన గదుల్లోని అన్ని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయమని ఆర్డర్ ఇవ్వవచ్చు. ఎవరూ వాడని సమయంలో దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే... అందమైన ఫొటోఫ్రేమ్గానూ ఉపయోగపడుతుంది. అబ్బో... భలే ఉందే వ్యవహారం.. మా ఇంట్లోనూ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారా? కొంచెం ఆగండి. ఇది అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో తొమ్మిది నెలలు పడుతుంది. ధర దాదాపు రూ.50 వేల వరకూ ఉండవచ్చునని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మాయలో మొనగాడు
ఇంద్రజాలం.. అదో అద్భుతం! ప్రేక్షకులను సంభ్రమ సాగరంలో ముంచెత్తి, విభ్రమంలో ఓలలాడించి, ఊహాలోకాల్లో విహరింపజేసే వర్ణనాతీత విచిత్రం. అతి ప్రాచీన విన్యాసం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు.. ఓ చిత్రమైన భ్రాంతిని కలిగించి పరవశింపజేసే అనుభవం. ఏకకాలంలో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే ఈ ఇంద్రజాలం మన భారతీయ కళల్లో అంతర్భాగం. నాటికీ, నేటికీ ఎన్నో మార్పులకు లోనయిన ఈ కళలో విశాఖ వాసులెందరో ప్రతిభ చూపుతూ ఉండడం విశేషం. వాళ్లలో ప్రతిభ చూపుతున్న సింహాచలం వాస్తవ్యుడు రవిశంకర్ నైపుణ్యం మరీ రసవత్తరం. 8,500 ప్రదర్శనలతో గుర్తింపు 15వ ఏట నుంచే మ్యాజిక్పై ఆసక్తి విలక్షణ ప్రదర్శనలతో విశ్వవ్యాప్త ఖ్యాతి సింహాచలం వాస్తవ్యుడు రవిశంకర్ ప్రతిభ సింహాచలం(పెందుర్తి) : అబ్రకదబ్ర అంటూ ఆ యువకుడు చేసే అద్భుతాలు మనల్ని అప్రతిభుల్ని చేస్తాయి. క్షణమయినా చూపు తిప్పుకోనివ్వని భ్రాంతిలో తేలుస్తాయి. మెరుపులా కదిలే అతడి వేళ్లు అపూర్వ హస్త లాఘవంతో చిటికెలో ఎన్నో చిత్రాలు చేస్తాయి. అవి అతడికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చి పెట్టాయి. కేవలం స్వయంకృషి పెట్టుబడిగా, నిర్విరామ సాధనతో ఇంత ఖ్యాతిని సొంతం చేసుకున్నారు సింహాచలం ప్రాంతానికి చెందిన కలగొట్ల రవిశంకర్. ఆసక్తే ఆలంబన రవిశంకర్ అడవివరం జిల్లా పరిషత్ హైస్కూల్లో 1997లో టెన్త్ చదువుతున్నప్పుడు పాఠశాలలో మ్యాజిక్ షో జరిగింది. ఆ కార్యక్రమం అతడి జీవిత గమ్యాన్నే మార్చేసింది. మాజిక్లో ఎలాగైనా రాణించాలన్న పట్టుదల అప్పుడే కలిగింది. దాంతో పదో తరగతి పూర్తి కాగానే ఏడాది పాటు కోల్కతలోని కొంతమంది ఇంద్రజాలికుల దగ్గర, విజయనగరానికి చెందిన శ్యామ్, విశాఖకు చెందిన షరీఫ్ దగ్గర మ్యాజిక్ నేర్చుకున్నారు. 1998 నుంచి సొంతంగా మ్యాజిక్షోలు ప్రారంభించారు. విశ్వమంతా వేలాది ప్రదర్శనలు 1998 నుంచి ఇప్పటి వరకు 19 ఏళ్లలో రవిశంకర్ ప్రపంచవ్యాప్తంగా 8500 ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చారు. చెన్నైలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. విజయవాడ, భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి ఇంద్రజాల పోటీల్లో ప్రథమ బహుమతులు పొందారు. థాయ్లాండ్లో ఇప్పటి వరకు 10 ప్రదర్శనలు చేశారు. మెజీషియన్గా గుర్తింపు పొందుతున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో లాబ్ టెక్నీషియన్గా రవిశంకర్కు ఉద్యోగం వచ్చినా ఆయన తన ప్రవృత్తికే ప్రాధాన్యమిచ్చారు. థాయ్లాండ్లో మువ్వన్నెల రెపరెపలు 2016లో థాయ్లాండ్లో ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసిన థాయ్ ఇండియన్ ఫెస్టివల్లో మ్యాజిక్ షో చేసేందుకు రవిశంకర్కు ఆహ్వానం అందింది. అక్కడ ప్రదర్శనలో మన మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి రవిశంకర్ మన్ననలు పొందారు. జగన్మోహన్రెడ్డి పర్యటనల్లో ఆకర్షణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో స్టేజీలపై రవిశంకర్ దాదాపు 40 ప్రదర్శనలు ఇచ్చారు. సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తున్న సైనికుల వద్దకు వెళ్లి వాళ్లను మ్యాజిక్ షో ద్వారా ఆనందపరచాలన్నది తన ఆలోచనని, అందుకు అనుమతి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ‘ఇంటర్ చదివిన 60 మంది నిరుద్యోగ యువతకు శిబిరం నిర్వహించి ఉచితంగా శిక్షణ ఇచ్చాను. ఉత్సాహం ఉన్న ఎవరికైనా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.’ అన్నారు. ఎన్నో ప్రత్యేకతలు రవిశంకర్ క్లోజప్ మ్యాజిక్, స్టేజ్ మ్యాజిక్, గ్రాండ్ ఇల్యూషన్ మ్యాజిక్లో ప్రావీణ్యాన్ని సంపాదించారు. డవ్ యాక్ట్ (గాల్లోంచి పావురాలను సృష్టించడం), ది గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ (ప్రాచీన ఇంద్రజాలికుల మాదిరిగా గాలిలో తాడు నిలపడాన్ని నూతన పద్ధతుల్లో ప్రదర్శించడం), లేడీ లివియేషన్ (అమ్మాయిని గాల్లో నిలబెట్టడం), జిగ్జాగ్ లేడీ (అమ్మాయిని మూడు భాగాలుగా చేయడం) వంటి ప్రదర్శనలతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. జపాన్లో ఉన్న ఫ్లాష్ యాక్ట్ ప్రదర్శనను రవిశంకర్ మన దేశానికి పరిచయం చేశారు. గిరిజనుల్లో మూఢనమ్మకాలు తొలగించడానికి కృషి చేశారు. -
మందుల మాయాజాలం
ప్రజల ప్రాణాలతో చెలగాటం విచ్చల విడిగా శాంపిల్స్ విక్రయాలు మెడికల్ షాపుల్లో నకిలీ, కాలం చెల్లిన మందులు గ్రామీణ ప్రజలకు అంటగడుతున్న వైనం.. జగిత్యాల అర్బన్ : ‘ధర్మపురి మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన కోరెపు శంకర్కు జ్వరం రావడంతో పట్టణంలోని జంబిగద్దె ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. అయితే సదరు వైద్యుడు పరీక్షలు అన్ని నిర్వహించి మందులు రాసి ఇచ్చాడు. శంకర్ మెడికల్ షాపుకు వెళ్లగా కొన్ని మంచి మందులు ఇచ్చి, మిగతావి శాంపిల్స్ ఇచ్చి వెనుక ఉన్న ‘నాట్ఫర్సేల్’ లేబుల్ తీసేశాడు. అతను ఇంటికి వెళ్లి మందులు వేసుకోగా, విరేచనాలై అస్వస్థతకు గురయ్యాడు.’ ‘జగిత్యాల పట్టణంలోని విద్యానగర్కు చెందిన వెంకటేశ్వర్రావు కోర్టు సమీపంలోని ఓ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూసుకోగా అవి అప్పటికే కాలం చెల్లినవి అని గుర్తించాడు’ అమాయకులు, గ్రామీణ ప్రజలే లక్ష్యంగా జగిత్యాల పట్టణంలో మందుల షాపుల యజమానులు మాయాజాలం చేస్తున్నారు. నకిలీ, కాలంచెల్లిన మందులు అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. కాసులకు కక్కుర్తి పడి గ్రామీణప్రాంతాలకు చెందిన విద్యార్థుల, ప్రజల అనవసరపు ఆపరేషన్లు చేసి అందినంత దోచుకున్న వైద్యులు అనైతిక చర్యలకు పాల్పడి జైలు పాలైన సంగతి తెలిసిందే. కొందరు వైద్యులు తమ వృత్తని వ్యాపారం చేస్తూ దోచుకున్నట్లుగానే మెడికల్ షాపుల యజమానులు ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ, మెడికల్ ఏజెన్సీలు ఇచ్చే శాంపిల్స్ అంటగడుతున్నారు. ఆర్ఎంపీల వద్ద స్టాక్ మెడికల్ శాంపిల్స్, కాలం చెల్లిన మందుల దందా ఎక్కువగా ఆర్ఎంపీలే చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. మెడికల్ ఏజెన్సీల రిప్రజెంటేటివ్లు తమ వద్దకు వచ్చే శాంపిల్స్ను ఆర్ఎంపీలకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఆర్ఎంపీలు ఈ మందులనే గ్రామీణులకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. బహిరంగంగానే ఈ దందా జరుగుతున్నా జిల్లా డ్రగ్ అధికారులు తమకేమీ తెలియనట్లు ఉంటున్నారు. ఫిర్యాదులు అందినపుడు, పత్రికల్లో కథనాలు వచ్చినపుడు మాత్రం మూకుమ్మడిగా ఒకరోజు తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ‘సాక్షి’లో కథనం రాగా పాతబస్టాండ్లోని ఓ ఆస్పత్రి, పలు మెడికల్షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కానీ ఒక్కరిపైనా చర్య తీసుకోలేదు. గతంలో టవర్సర్కిల్ ప్రాంతంలో ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇంట్లో మందులు దొరికాయి. తర్వాత ఆ అంశం కూడా అటకెక్కింది. లక్షల్లో వ్యాపారం ప్రధాన పట్టణంగా గుర్తింపు పొందిన జగిత్యాలలో శాంపిల్స్ దందా, నకిలీ మందులు, కాలం చెల్లిన మందుల దందా ఎక్కువగా జరుగుతోంది. లాట్ల రూపంలో మెడికల్ శాంపిల్స్ తెప్పిస్తూ కంపెనీల ప్రచారం చేపిస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలను మచ్చిగ చేసుకుని వారి ద్వారా ప్రజలకు అంటగడుతున్నారు. కానరాని డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు జిల్లా డ్రగ్ అధికారుల నియంత్రణ లేకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడంతో జగిత్యాల పట్టణంలో మెడికల్ షాపుల యజమానులు ఆడిందే ఆటగా మారింది. నకిలీ మందులు, శాంపిల్స్ విక్రయిస్తున్నా, కాలం చెల్లిన మందులను అమ్ముతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పొరపాటున ఎప్పుడైనా డ్రగ్ ఇన్స్పెక్టర్లకు నకిలీ, కాలం చెల్లిన మందులు దొరికినా వారు ‘మామూలు’గానే తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జగిత్యాల పట్టణంలోని పలు మెడికల్షాపులో మందుల మాయాజాలం దందా విచ్చలవిడిగా సాగుతోంది. -
మందుల గాలం
పీడీ కంపెనీల మందులే అధిక విక్రయం లాభాలు చూస్తున్న కొందరు వైద్యులు, మందుల దుకాణదారులు ఫారిన్ ట్రిప్పులు, నజరానాలతో ఆకట్టుకుంటున్న ఆయా కంపెనీలు ‘పది కొంటే మరో పది ఉచితం.. మా మందులు అధికంగా రోగులకు రాసి, ఎక్కువ వ్యాపారం చేస్తే ఫారిట్ ట్రిప్, నగదు బహుమతి..’ ప్రస్తుతం ఔషధ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరిది. ‘ఇదేదో బాగుందే.. రోగి జేబు గుల్లయితే మనికేంటి.. కానిచ్చేద్దాం’ అన్న రీతిలో కొందరు వైద్యులు, మందుల దుకాణదారులు ఉన్నారు. – కంబాలచెరువు (రాజమహేంద్రవరం) వీరి ఆర్జన దండిగా ఉండడంతో.. చివరకు రోగి జేబుకు చిల్లుపడుతోంది. ఒకవేళ ఆ మందులను బయట ఎక్కడైనా కొందామంటే అవి దొరకవు. వాటిని ఏ వైద్యుడు రాశారో, అతని ఆస్పత్రిలోని మందుల దుకాణంలో మాత్రమే లభిస్తాయి. జిల్లాలో ఈ రకమైన దందా ఎక్కువగా సాగుతోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు చిక్కకుండా వీరు వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు. ఒకవేళ పట్టుబడితే వైద్య లైసెన్సు రద్దు చేయడమే కాక, జైలు శిక్ష కూడా తప్పదు. వ్యాధులను నయం చేసేందుకు ఇటీవల కాలంలో మందులు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లో వచ్చాయి. ఆయా ఔషధ కంపెనీలు అదే స్థాయిలో పోటీపడుతూ, వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో వృద్ధి చేసుకుంటున్నాయి. లాభం అధికంగా ఉండడంతో వైద్యులతో పాటు మందుల దుకాణాల్లోను పీడీ మందులనే ఎక్కువగా రోగులకు అంటగడుతున్నారు. ప్రముఖ కంపెనీలు ఎలాంటి ఆఫర్లు ఇవ్వకపోవడంతో.. వ్యాపారులు పీడీ కంపెనీల మందులనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పీడీ కంపెనీ అంటే..? ప్రొపగండ ఫర్ డిస్ట్రిబ్యూషన్(పీడీ) అంటే.. నేరుగా కంపెనీ నుంచి హోల్సేల్ లైసెన్సుదారుడు తెచ్చుకుని, విక్రయించే మందులు. ఇవి జిల్లాలో సుమారు 50 కంపెనీలు వాటిని సరఫరా చేస్తున్నాయి. ఈ మందుల కంపెనీలు వైద్యులనే టార్గెట్గా పెట్టుకుని, ఏడాదికి లక్షల రూపాయల్లో కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నాయి. ఆ ఏడాదికి ఆ కంపెనీ చెప్పిన టార్గెట్ను ఆ వైద్యుడు పూర్తిచేస్తే, ఫారిన్ ట్రిప్లు, భారీ నజరానాలు ఇస్తున్నాయి. దీంతోపాటు పది బాక్సులు కొంటే, మరో పది ఉచితంగా ఇస్తున్నాయి. సగానికి సగం లాభం వస్తుండడంతో ఆ వైద్యులు.. రోగికి ఆ మందులనే అంటగడుతున్నారు. అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్టు మందులు రాసిచ్చేస్తున్నారు. కేవలం ఆ ఆస్పత్రిలోనే అవి దొరకుతాయి. రోగికి ఆ మందులు అవసరమైతే మళ్లీ అక్కడకే రాకతప్పదు. ఔషధ నియంత్రణ శాఖ నిఘా! దీనిపై కన్నేసిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు.. ఫారిన్ట్రిప్లు, నజరానాల విధానంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో పలు ప్రాంతాల్లో కొందరు వైద్యులు ఇలా దొరికితే, వారి లైసెన్సు రద్దు చేశారు. అంతేకాక కొందరికి జైలుశిక్షలు కూడా పడ్డాయి. వీటిపై అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఔషధ కంపెనీల ప్రతినిధులతో పాటు వైద్యులూ రూటు మార్చుకున్నారు. నేరుగా నగదు తీసుకోవడం లేదా అందుకు సరిపడా మందులు స్వీకరిస్తున్నారు. మరో పద్ధతి కూడా ఇటీవల ప్రారంభించారు. ఆ పీడీ కంపెనీ పేరిట వైద్య శిబిరం నిర్వహించి, రోగులకు ల్యాబ్టెస్ట్లు, ఇతర వైద్యసేవల రూపంలో ఆ వైద్యుడికి లబ్ధి చేకూరుస్తున్నారు. కాగా ప్రైవేట్ ఆస్పత్రులు డీఎంహెచ్ఓ పరిధిలో ఉంటాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లను నిత్యం తనిఖీ చేయాలి. పీడీ మందుల విక్రయం జిల్లాలో అధికంగా సాగుతున్నా, వాటిని రోగులకు అంటగడుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నోరు మెదపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దృష్టి సారిస్తాం ఆస్పత్రులకు వచ్చే రోగులకు వ్యాధి నయం చేసే మందులు రాయడం వైద్యుడు పని. వాటిని సక్రమంగా రాయకుండా, ప్రజలను దోచుకోవడం తప్పు. పీడీ మందుల విషయం ఇప్పటివరకూ మా దృష్టికి రాలేదు. వెంటనే వాటిపై దృష్టి సారిస్తాం. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో తనిఖీ చేపడతాం. వైద్యులెవరైనా అలా చేస్తే చర్యలు చేపడతాం. –చంద్రయ్య, డీఎంహెచ్ఓ, కాకినాడ పీడీ మందుల నాణ్యత తనిఖీ జిల్లాలో సుమారు 50 పీడీ కంపెనీల మందులు సరఫరా అవుతున్నాయి. మందు ఒకటే, కంపెనీయే వేరు. హోల్సేల్ విక్రయదారుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాం. శాంపిల్స్ను ల్యాబ్ రిపోర్టుకు పంపాం. కొన్ని స్టాండర్డ్స్కు అనుగుణంగానే ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. వాటి నాణ్యత, లైసెన్సు వరకు మాత్రమే మా పరిధి ఉంటుంది. ఆస్పత్రులు, డాక్టర్లపై మాకు అధికారం లేదు. – పి.శ్రీరామమూర్తి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ, రాజమహేంద్రవరం -
మరో అద్భుతాన్ని సృష్టించిన చైనా
బీజింగ్: అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతనూ తట్టుకొనే ఓ అద్భుతమైన మెటీరియల్ను చైనా సృష్టించింది. ఇప్పటిదాకా తయారు చేసిన లోహాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొనే లోహమిదేనని ఏరోస్పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెటీరియల్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సీనియర్ ఇంజనీర్ జు జంగ్ఫెంగ్ తెలిపారు. అంతరిక్షంలోకి పంపే రాకెట్లు, స్పేస్క్రాఫ్ట్లు, శాటిలైట్ల తయారీలో ఈ లోహాన్ని వినియోగించవచ్చని చెప్పారు. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామి దేశాలుగా చెప్పుకుంటున్న అమెరికా, రష్యా మరికొన్ని ఐరోపా దేశాలు రాకెట్ల తయారీ కోసం ఏరోజెల్ మెటీరియల్ను ఉపయోగిస్తున్నాయని, దానికి మించి ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి తాము రూపొందించిన లోహానికి ఉందన్నారు. ఏరోజెల్ను సైతం తమ సంస్థే తయారు చేసిందని, అన్ని దేశాలూ ఇప్పుడు ఏరోజెల్నే ఉపయోగిస్తున్నాయన్నారు. కొత్తగా తాము తయారుచేసిన లోహం కేవలం ఉష్ణోగ్రతనే కాకుండా భారీ వైబ్రేషన్ను సైతం తట్టుకుంటుందని జంగ్ఫెంగ్ చెప్పారు. -
బీమా... ఓ డ్రామా
– గతేడాది ఆగస్టు 1 8 నాటికి 40 శాతం తక్కువగా వర్షాలు – అన్ని మండలాలను కరువు జాబితాలోకి చేర్చాలని నివేదిక – కానీ.. 24 మండలాలకే బీమా పరిమితం చేయడం విశేషం అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమా పథకం ‘అనంత’ వేరుశనగ రైతులను మాయ చేస్తోంది. ఈ ఏడాది జరిగిపోయింది. వచ్చే ఏడాదైనా న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ‘పాలిచ్చే ఆవును అమ్మేసి దున్నను కొన్న’ చందంగా గ్రామం యూనిట్గా అమలవుతున్న పంటల బీమా ద్వారా లబ్ధి పొందుతున్న తరుణంలో 2011లో బలవంతంగా వాతావరణ బీమా పథకాన్ని అమలులోకి తెచ్చి ఇబ్బందుల్లోకి నెట్టేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా వాతావరణ బీమా కింద విడుదలవుతున్న పరిహారాన్ని చూస్తే నిజంగానే రైతులకు ఒక్కసారి కూడా న్యాయం జరగలేదు. 2015కు సంబంధించి తాజాగా మంజూరు చేసిన రూ.109 66 కోట్లు పరిహారాన్ని చూస్తే వాతావరణ బీమా ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. చివరకు రైతులు చెల్లించిన ప్రీమియం కూడా వెనక్కి రాని విధంగా బీమా కంపెనీ మాయ చేస్తోంది. ఈ క్రమంలో ఈసారి కూడా 24 మండలాల రైతులకు కూడా కంటి తుడుపుగా పరిహారం మంజూరు చేసినట్లు కనిపిస్తోంది. జిల్లాలో కరువు ఉందని అధికారిక నివేదిక వర్షాలు లేక జిల్లాలో పంటలు దారుణంగా దెబ్బ తిని కరువు పరిస్థితులు రాజ్యమేలుతున్నాయని గతేడాది ఆగస్టు మూడో వారంలో జిల్లా అధికారులు నివేదిక పంపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనంతపురం జిల్లాలో 52 మండలాలు కరువు బారిన పడ్డాయని ప్రకటించింది. జూన్, జూలై, ఆగస్టు 18వ తేదీ నాటికి జిల్లాలో ఉన్న 63 మండలాల్లో 45 మండలాల్లో వర్షపాతం తక్కువగానూ (డెఫిసీట్), 7 మండలాల్లో మరీ తక్కువ (స్కానిటీ)గానూ మిగతా 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. సుమారు 40 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని 63 మండలాలను కరువు జాబితాలోకి చేర్చాలని అధికార యంత్రాంగం నివేదించింది. కానీ.. వాతావరణ బీమా కొన్ని మండలాలకు పరిమితం చేస్తూ పరిహారం మంజూరు చేయడం.. 39 మండలాలను పూర్తిగా విస్మరించడంపై రైతులు కన్నెర చేస్తున్నారు. ఆగస్టు చివర్లో ఆశాజనకంగా వర్షాలు జూన్ నుంచి మొహం చాటేసిన వరుణుడు ఆగస్టు 18 తర్వాత కరుణించాడు. ఆగస్టుతో పాటు సెప్టెంబర్లో కూడా మంచి వర్షాలు పడ్డాయి. ఖరీఫ్ ముగిసే నాటికి 40 శాతం తక్కువగా ఉన్న స్థాయి నుంచి సాధారణ స్థాయికి చేరుకోవడం విశేషం. ఆగస్టులో 88.7 మిల్లీమీటర్లకు గానూ 88, సెప్టెంబర్లో 118.4కు గానూ 111 మి.మీ కురిసింది. ఎట్టకేలకు సీజన్ ముగిసేనాటికి 338.4 మి.మీకు 319 మి.మీ వర్షపాతం నమోదైంది. కానీ.. వాతావరణ బీమా మాయాజాలంతో ‘అనంత’ వేరుశనగ రైతులకు మరోసారి అన్యాయం జరిగిపోయింది.