Model School
-
మోడల్ స్కూల్ విద్యార్థినులకు అరుదైన అవకాశం
కంచిలి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని మఠం సరియాపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రాజెక్టు రూపకల్పన చేసే అరుదైన అవకాశాన్ని పొందారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాదికారి టి.తిరుమల చైతన్య నుంచి పాఠశాలకు శనివారం ఉత్తర్వులు అందాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రాజెక్టు రూపకల్పన చేసి ప్రదర్శించేందుకు ఇక్కడి విద్యార్థినులకు అవకాశం లభించింది. పాఠశాల విద్యా శాఖ తరఫున జిల్లాలో మఠం సరియాపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు ఐదుగురు, పొన్నాడ కేజీబీవీ విద్యార్థినులు ఐదుగురు ఎంపికైనట్టు ఉత్తర్వులు వెలువడ్డాయని ప్రిన్సిపాల్ శివప్రసాద్ వెల్లడించారు.వీరు ఈ నెల 26నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు బెంగళూరులో జరిగే ఇంటర్స్టేట్ హాకథాన్ ప్రోగ్రామ్లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. పాఠశాలకు చెందిన ఆరాధ్య పాణిగ్రాహి (9వ తరగతి), శ్రద్ధాంజలి మహంతి (9వ తరగతి), యాస్మిన్ చౌదరి (7వ తరగతి), రితిక బడిత్య (9వ తరగతి), మహంతి శ్రద్ధాంజలి (9వ తరగతి), గైడ్ టీచర్ బడియా సత్యనారాయణ ఈ ప్రాజెక్టు ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఐదుగురు విద్యార్థినులు, గైడ్ టీచర్ బెంగళూరు వెళ్లి రావడానికి ఉచిత విమాన ప్రయాణం, ఫైవ్ స్టార్ వసతి కల్పించనున్నారు. -
తెలంగాణలో మళ్లీ ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి: తెలంగాణలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా మోడల్ స్కూల్ హాస్టల్లో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి ఐదుగురు బాలికలు ఆసుపత్రిలో చేరగా.. ఈరోజు మరో ఇద్దరు కడుపు నొప్పితో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో, బాలికల సంఖ్య ఏడుకు చేరుకుంది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, తీవ్రమైన కడపు నొప్పి రావడంతో వారికి వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం రాత్రి పరామర్శిచారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. విద్యార్థినలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగలేదని.. రెండు మూడు రోజులుగా విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోకపోడంతో నీరసంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అయితే, బాలికలు మాత్రం.. తాము తిన్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు.దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మూడు రోజుల నుంచి భోజనం సరిగా ఉండటం లేదు. ఎస్వోకి చెప్పినా పట్టించుకోవడం లేదు. అన్నం సరిగా ఉడకడం లేదు. సగం ఉడికించిన అన్నం పెట్టడంతో అదే తినాల్సి వస్తోంది. మూడు రోజుల నుంచి కడుపునొప్పి వస్తోంది. మాకు పెట్టే భోజనంలో నాణ్యత ఉండటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రి ఎదుట పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు సరైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. -
ఐదు నెలలుగా పులిహోరనే దిక్కు
కుల్కచర్ల: ‘విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి పులిహోర ఒక్కటే టిఫిన్గా పెడుతున్నారు. ఏడాదిలో పది రోజులు మాత్రమే పాలు ఇచ్చారు. రెండుసార్లే గుడ్లు ఇచ్చారు. భోజనం నాసిరకంగా ఉండడంతో తినలేక పస్తులుంటున్నాం..’అని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ వసతి గృహంలో ఉంటున్న బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తమ హాస్టల్ను సందర్శించిన తహసీల్దార్ మురళీధర్కు తమ గోడు విని్పంచారు. వసతి గృహంలో గదులను తామే శుభ్రం చేసుకుంటున్నామని, మరుగుదొడ్లలోకి బకెట్లలో నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు.చలిపెడుతున్నా నేలపైనే పడుకుంటున్నామని, బెడ్ïÙట్లు కూడా ఇళ్ల నుంచి తెచ్చుకున్నామని వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయాలను ఎంఈఓ హబీబ్ అహ్మద్ వెంటనే డీఈఓకు తెలియజేయడంతో ఆమె వెంటనే వసతి గృహానికి చేరుకున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు:డీఈఓ డీఈఓ రేణుకాదేవి మోడల్ స్కూల్ వసతి గృహాన్ని పరిశీలించి, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నా రు. పాలు, కూరగాయలు, చికెన్, మటన్, గుడ్లు పంపిణీ చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. భోజనం కూడా నాణ్యతతో ఉండటం లేదని తెలిపా రు. దీనిపై డీఈఓ స్పందించారు. మెనూ ప్రకారం భోజన వస్తువులను సరఫరా చేయని టెండరు దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఆమె వెంట మిషన్ భగీరథ డీఈ సుబ్రమణ్యం, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి తదితరులు ఉన్నారు. -
Heart Attack: అయ్యో పాపం ‘వెంకటస్వామి’
జగదేవ్పూర్(గజ్వేల్): బదిలీ అయ్యి పాఠశాలలో విద్యార్థులకు పరిచయం కాకముందే ఆ ఉపాధ్యాయుడిని విధి కాటేసింది. ఇంటి వద్ద కాలకృత్యాలకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన మండలంలోని అలిరాజ్పేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ధ్యాప వెంకటస్వామి(42), మంజుల (ఉపాధ్యాయురాలు), ఇద్దరు కుమార్తెలు సుష్మిత మిత్ర, అక్షర మిత్ర ఉన్నారు. వెంకటస్వామి గజ్వేల్ మోడల్ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా 11 ఏళ్లుగా పని చేస్తున్నాడు. భార్య మంజుల జగదేవ్పూర్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అలిరాజ్పేట గ్రామం నుంచి గజ్వేల్కు మారి నూతనంగా ఇల్లు నిర్మించుకొని గత నెల 23న గృహ ప్రవేశం చేశారు. ఈ నెల 14న ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా గజ్వేల్ నుంచి జగదేవ్పూర్ మోడల్ స్కూల్కు బదిలీ అయ్యారు. అదే రోజు సాయంత్రం పాఠశాలలో బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం గజ్వేల్లోని కొత్త ఇంటిలో కాలకృత్యాలకు వెళ్లగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. వైద్యులు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సామాజిక కార్యక్రమాలు.. వెంకటస్వామి ఉపాధ్యాయుడికి ముందు సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక పాటలపై ప్రేమతో 11 పాటలను సొంత ఖర్చులు, దర్శకత్వంతో తీశారు. గ్రామానికి చెందిన పల్లెటూరి హీరో అనిల్ మొగిలితో 7 పాటలకు దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించారు. అలాగే రైతుల ఆత్మహత్యలపై పాటలకు నిర్మాత, దర్శకత్వం వహించారు. నేత్రదానం.. వెంకటస్వామి మృతి చెందిన వెంటనే లోక్ నేత్ర ట్రస్టు వారికి అతడి కళ్లను దానం చేశారు. నేత్రదానం చేసి మరొకరికి చూపు ఇవ్వడంతో గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు ఆ కుటుంబాన్ని అభినందించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్శర్మ, మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘూల నేతలు శంకర్, సత్తయ్య, ప్రవీణ్, వెంకట్ కిరణ్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు నివాళులరి్పంచారు. -
21న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: ఏపీ మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు)లో 2024–25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు లేదా ఇంగ్లిష్ మాధ్యమాల్లో రాయవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లు https://cse.ap.gov.in లేదా https:// apms.apcfss.in/StudentLogin.do వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
కరీంనగర్: సంబురంగా చిందులేస్తూ కుప్పకూలి..
సాక్షి, కరీంనగర్: వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణాలు సంభవిస్తున్న రోజులవి. పైగా గుండె సంబంధిత సమస్యలే అందుకు కారణం అవుతుండడం మరీ ఘోరం. తాజాగా జిల్లాలోనూ ఓ స్కూల్ స్టూడెంట్ గుండె ఆగి కన్నుమూసింది. అదీ సంబురంగా చిందులేస్తున్న సమయంలోనే.. గంగాధర మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. ఆ హుషారులో డాన్స్ చేస్తూ కుప్పకూలింది ఓ విద్యార్థి. ఊపిరి తీసుకోవడంలో అవస్థలు పడింది. దీంతో ఆమెకు సీపీఆర్ చేసి మరీ ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. అయితే మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలిని వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తిగా గుర్తించారు.అయితే ఆమెకు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ప్రదీప్తి మరణంతో ఆమె సొంతూరు వెంకటాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: లవర్ను రప్పించి మరీ యువతి ఘాతుకం -
మోడల్ స్కూల్లో బోరు నీరే దిక్కు
జనగామ రూరల్: ఆంగ్ల బోధన.. మెరుగైన వసతులు, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిచా లన్న గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. అయితే అన్ని రకాల వసతులతో ముందుకెళ్లాల్సిన ఆదర్శ పాఠశాలలో కనీసం మంచి నీరు కూడా లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మండల పరిధి చౌడారం ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 450 మందిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్కూల్లో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ మోటారు కొన్ని రోజుల క్రితం పాడైపోయింది. దానికి మరమ్మతు చేయించడానికి సైతం నిధులు లేకపోవడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు బోరు నీటితో కాలం వెల్లదీస్తున్నా రు. మూడేళ్ల నుంచి పాఠశాలకు రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాకపోవడం, పెరిగిన నిర్వహణ ఖర్చుల మేరకు నిధులు కేటాయించకపోవడంతో అరకొర వసతులతో నెట్టుకు వస్తున్నారు. దీనికితోడు పాఠశాలకు రావాలంటే ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు సమయాని కి చేరుకోలేక పాఠాలు కోల్పోతున్నారు. ఈ విషయ మై పాఠశాల ప్రిన్సిపాల్ను వివరణ కోరగా ‘వాటర్ ఫిల్లర్ మోటారు పాడైందని, బాగు చేయించాలంటే రూ.10 వేల వరకు ఖర్చవుతుంది, అలాగే కరెంటు బిల్లు రూ.8 వేల వరకు వస్తున్నది.. చెల్లించలేని పరిస్థితి ఉంది.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు దరఖాస్తు చేశామని’ తెలిపారు. -
మోడల్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి హైదరాబాద్: ఇంగ్లిష్ మీడియం చదువులు.. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ మోడల్ స్కూల్స్లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. 2023–24 సంవత్సరం ప్రవేశాల నోటిఫికేషన్ను మోడల్ స్కూల్స్ డైరెక్టర్ ఉషారాణి సోమవారం విడుదల చేశారు. 6వ తరగతితో పాటు, 7–10తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభంకానుండగా, ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 16న నిర్వహిస్తారు. ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉండగా, 6వ తరగతిలో 19,400సీట్లతోపాటు, 7–10 తరగతుల్లో మరికొన్ని ఖాళీ సీట్లున్నాయి. విద్యార్థులు http:// telanganams.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజుగా జనరల్ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ, ఈడబ్లూŠఎస్ విద్యార్థులు రూ.125 ఫీజుగా చెల్లించాలన్నారు. ప్రవేశాలు ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. ప్రవేశాల షెడ్యూల్ ►ఆన్లైన్లో దరఖాస్తు: 10–01–2023 నుంచి 15–02–2023 ►హాల్టికెట్ల డౌన్లోడ్: 08–04–2023 ►పరీక్షతేదీ: 16–04–2023 ►సమయం: 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ►7–10 తరగతుల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ►ఫలితాల ప్రకటన 15–05–2023 ►పాఠశాలల వారీగా ఎంపికైనవారి జాబితా ప్రకటన 24–05–2023 ►సర్టిఫికెట్ వెరిఫికేషన్ 25–5–2023 నుంచి 31–5–2023 వరకు క్లాసుల నిర్వహణ 1–6–2023 -
అయ్యో టీచరమ్మ! స్కూల్కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి..
సంస్థాన్నారాయణపురం/నాంపల్లి: బ్రెయిన్ డెడ్తో ఉపాధ్యాయురాలు మృతిచెందింది. నారాయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి నాంపల్లి మోడల్ స్కూల్లో పీజీటీగా పని చేస్తూ భర్త నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. ఈనెల 21 పాఠశాలకు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను హయత్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. మెరుగైన చికత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజలక్ష్మి కోమాలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్ అవయవాలు జీవన్దాన్ ట్రస్టుకు.. విజయలక్ష్మి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఆస్పత్రి వర్గాల ద్వార జీవన్ దాన్ సంస్థకు రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని సంస్థాన్ నారాయణపురానికి తీసుకొచ్చారు. శనివారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతికి ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజా నాట్య మండలి సభ్యులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎంఈఓ గురువారావు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చిలువేరు నారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్కేవీ నాయకుడు బిరుదోజు దామోదరచారి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, ఉపాధ్యాయులు సంజీవరావు, విఠల్, కృష్ణారెడ్డి, భారతి, పలువురు నేతలు తదితరులు ఉన్నారు. బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది! -
అవసరమే ఆవిష్కరణ..
బిడ్డా.. ఈ గోలీ ఎప్పుడు వేసుకోవాలి.. గిది చూసిపెట్టు... ఇది పరగడుపున వేసుకునేదా... పడుకునే ముందు వేసుకునే గోలీనా... ఇలా ప్రతినిత్యం అమ్మ టాబ్లెట్స్ టైమ్కు తీసుకోవడానికి çపక్క వారి సహాయం కోసం ఎదురు చూడటం నుంచే ఈ ఎకోఫ్రెండ్లీ మెడిసిన్స్ టైమ్ టేబుల్ బ్యాగ్ తయారు చేయాలనే ఆలోచన వచ్చేలా చేసింది. ఈ ఆలోచనే రాష్ట్రస్థాయిలో పెద్దపల్లి పిల్లలను రాష్ట్ర ఇన్నోవేషన్ చాలెంజ్ విజేతగా నిలిపింది. అలాగే మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా పోర్టబుల్ అంబరిల్లా రూమ్ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థినులు రెండవ బహుమతి అందుకున్నారు. మరిన్ని ఆవిష్కరణలు చేస్తా మేం తయారు చేసిన మినీ పోర్టబుల్ రూమ్, అంబరిల్లా టాయిలెట్స్ ఆవిష్కరణకు ఇంత మంచి స్పందన వస్తుందని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉంది. పెద్ద పెద్ద సార్ల చేతుల మీదుగా బహుమతి అందుకున్నాం. ఇప్పుడు మరిన్ని అవిష్కరణలు తయారు చేయాలనే సంకల్పం కల్గింది. మా సార్లు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలు చేస్తాం. – రితిక, 10వ తరగతి, నెల్లికుదురు మోడల్స్కూల్, మహబూబాబాద్ సంతోషంగా ఉంది ఎగ్జిబిట్ను తయారు చేయడానికి వారం రోజులకు పైగా కష్టపడ్డాం. సార్లు మంచిగా చెప్పి తయారు చేయించారు. ఎగ్జిబిట్ గురించి చెప్పేటప్పుడు ముందుగా భయం వేసింది. తర్వాత వివరించడం సులువయ్యింది. ఇకనుంచి ప్రతి సంవత్సరం ఎగ్జిబిట్స్ తయారు చేస్తా. మా సార్లు, అమ్మానాన్న, మా ఊరిలోని వారు అందరూ మెచ్చుకుంటున్నారు. సంతోషంగా ఉంది. – కీర్తన, 6వ తరగతి, టీఎస్ మోడల్ స్కూల్, నెల్లికుదురు, మహబూబాబాద్ అమ్మ తిప్పలు చూడలేక... సైన్స్ ఇన్నోవేషన్స్ ఛాలెంజ్ కోసం ఐదు నెలల క్రితం నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మెంటర్ శివకృష్ణ సర్ ఆధ్వర్యంలో తమన్నా, నేను సర్టిఫికేషన్ కోర్సు చేశాం. ఇందులో ఆన్లైన్లో 10 వీడియోలు చూసి, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి సర్టిఫికేట్ ఇచ్చారు. అందులో గెలిచిన వారి నుంచి సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కొన్ని సూచనలు చేయాలని చెప్పారు. దాని గురించి రెండు – మూడు ఆలోచనలు చేశాం. అందులో అమ్మ ప్రతిరోజూ టాబ్లెట్స్ వేసుకోవడానికి పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపితే బాగుంటుందని నా ఆలోచన గురించి చెప్పా. నాన్న గల్ఫ్లో పనిచేస్తున్నాడు. అమ్మ బీడీలు చుడుతుంది. నాకు చెల్లి, తమ్ముడు ఉన్నారు. అమ్మకు ఒంట్లో బాగుండదు. ప్రతి రోజూ మందులు తీసుకోవాలి. ఆమెకు ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో తెలిసేది కాదు. నేను సహాయం చేస్తుంటాను. అమ్మలాంటి నిరక్షరాస్యులందరిదీ ఇదే సమస్య కదా అనిపించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మందులు సులువుగా తెలుసుకోవడానికి అరలతో సంచి చేద్దాం అనుకున్నాను. ఇలాంటి సంచి ఉంటే ఒక సమయంలో వేసుకోవాల్సిన మందులను మరొక సమయంలో తీసుకోవటం వంటి పొరపాట్లు జరగవు. ఈ ఆలోచనను పైకి పంపించగా మా ప్రాజెక్టు సెలెక్టు అయ్యింది. – జి. శివాని అంధులకు సైతం ఉపయోగపడాలని... తెలంగాణ ఇన్నోవేషన్ చాలెంజ్ కోసం మేము అబ్దుల్ కలాం అనే గ్రూప్గా ఏర్పడి ఎకో ఫ్రెండ్లీ మెడిసిన్ టైమ్ టేబుల్ బ్యాగ్ను రూపొందించాం. మొదట కేవలం నిరక్షరాస్యుల కోసం బ్యాగ్ తయారు చేయాలనుకున్నాం. తర్వాత మనం తయారు చేసే ప్రాజెక్టు నిరక్షరాస్యులతోపాటు, అంధులు సైతం ఉపయోగించేలా పర్యావరణ హితంగా రూపకల్పన చేస్తే బాగుంటుందనిపించి, నా ఆలోచనను సార్తో పంచుకున్నాను. మా సర్ సహకరించారు. ఒక్కో పూటకు ఒక్కో బ్యాగ్ అనుకున్నాం. కానీ ఎక్కువ బ్యాగ్లు ఐతే ఇబ్బంది అవుతుందని ఒక్కటే బ్యాగ్గా తయారు చేసి ముందు వైపు నాలుగు పాకెట్లు, వెనుక రెండు పాకెట్లు ఉండేలా తయారు చేశాం. ఆ పాకెట్ల పై అందరూ సమయం గుర్తుపట్టేలా సింబల్స్ పెట్టాం. అంధుల కోసం ప్రత్యేకం గా బ్రెయిలీ లిపి గుర్తులు ఉంచాం. మందుల కోసం షాప్కి వెళ్లేటప్పుడు ఈ సంచిని తీసుకెళితే షాపు వాళ్లే ఏ పూట వేసుకోవాల్సిన మందులను ఆ అరలో సర్ది ఇవ్వగలుగుతారు. లేదంటే తర్వాత పిల్లలు కానీ తెలిసిన వాళ్ల సహాయం కానీ తీసుకోవచ్చు. నెలకోసారి ఇలా మెడికల్ టైమ్ టేబుల్ బ్యాగ్ను సర్దుకుంటే నెలంతా మరొకరి అవసరం లేకుండా సమయానికి మందులు వేసుకోవచ్చు. – బి. తమన్నా, 9వ తరగతి, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, ధర్మారం, పెద్దపల్లి జిల్లా శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
మోడల్ స్కూల్ ఎదుట క్షుద్రపూజల కలకలం
జైనథ్( ఆదిలాబాద్): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి క్షుద్రపూజలు నిర్వహించడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి మోడల్ స్కూల్ గేటు ఎదుట మట్టి బొమ్మలకు పసుపు పూసి, నిమ్మకాయలు, గుడ్లు పెట్టి పూజలు చేశారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యార్ధులు కొంతమంది పాఠశాలకు రావడంతో క్షుద్ర పూజలు చేసిన స్థలాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ తహశీల్దార్ రాఘవేంద్రరావుకు ఫోన్లో సమాచారం అందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ క్షుద్రపూజల సామగ్రిని అక్కడి నుంచి తొలగింపజేసి వాటిని కాల్చి వేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు. సోమవారం అవగాహన సదస్సు.. క్షుద్రపూజల వంటి మూఢనమ్మకాలను నమ్మరాదని తహసీల్దార్ రాఘవేంద్రరావు గ్రామస్తులకు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. సోమవారం పాఠశాలలో మూఢనమ్మకాలపై ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరు కావాలని కోరారు. -
Telangana: 11న గురుకుల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రుక్మాపూర్ (కరీంనగర్), అశోక్నగర్ (నర్సంపేట్) సైనిక విద్యాలయాల్లో ఆరోతరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. https://tswreis.in, https://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్సైట్ల నుంచి విద్యార్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయా సొసైటీలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే హాజరు కావాలని తెలిపాయి. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్ చూడాలని సూచించాయి. ఆదర్శ స్కూళ్ల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో అడ్మిషన్లతోపాటు ఏడు నుంచి పదో తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం http://telanganams.cgg.gov.in వెబ్సైట్ చూడాలని ఆయన సూచించారు. -
విద్యార్థిని ఆత్మహత్య
జయపురం: ఆదర్శ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్ గదిలో శుక్రవారం చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొరాపుట్ జిల్లా జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ఈ విషాద సంఘటన జరిగింది. ఆ పాఠశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదం నింపడంతో పాటు భయాందోళన రేకెత్తించింది. వివరాలిలా ఉన్నాయి. భయాందోళనకు గురైన హాస్టల్ విద్యార్థినులు మధ్యాహ్న భోజనాల సమయానికి ఆ విద్యార్థిని రాక పోవడంతో సహచర విద్యార్థినులు ఆమెను పిలిచేందుకు వెళ్లారు. ఎంత పిలిచినా జవాబు లేదు. అంతేకాకుండా తది తలుపులకు లోన గడియ పెట్టి ఉంది. దీంతో కిటికీ లోంచి స్నేహితులు చూడగా దూలానికి వేలాడుతున్న విద్యార్థిని మృతదేహం కనిపించింది, అది చూసిన వారు భయపడి పరుగుతీసి ఉపాధ్యాయులకు విషయం తెలిపారు. వెంటనే ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ చందన పట్నాయక్ పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని బొయిపరిగుడ సమితిలోని రామగిరి గ్రామానికి చెందిన బింగుచారి కుమార్తె విలాసిని చారి. 9 వ తరగతి చదువుతూ ఆదర్శపాఠశాల హాస్టల్లో ఉంటోంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణం స్పష్టంగా తెలియరాలేదు. హాస్టల్ సూపర్వైజర్, ఉపాధ్యాయిని సరోజ నాయక్ మానసిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విలాసిని రాసి సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యార్థిని మృత దేహాన్ని పోస్ట్మార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. పోలీసుల అదుపులో టీచర్ కొద్ది రోజుల కిందట ఉపాధ్యాయురాలు సరోజ నాయక్ ఇష్టం వచ్చినట్లు తిట్టి మానస క్షోభకు గురిచేసిందని అందుచేతనే తన కుమార్తె విలాసిని ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంపై మృతురాలి సోదరుడు డొంబురు దొర చారి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉపాధ్యాయురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మిడ్డే మీల్స్ వివాదం.. పీఎస్లో పంచాయితీ..!
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా వండి విద్యార్థులకు అందించాల్సిన వంట నిర్వాహకులు కొద్ది రోజులుగా అరకొరగా వంటలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులు పాల్జేస్తున్నారు. దీన్ని కొద్ది రోజులుగా గమనిస్తూ వస్తున్న తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మంగళవారం నిర్వాహకులను నిలదీశారు. మాటమాట పెరిగి ఈ వివాదం కాస్త పోలీస్స్టేషన్కు చేరింది. సాక్షి, విజయనగరం అర్బన్: విజయనగరం మోడల్ స్కూల్ భోజన నిర్వాహకులపై పేరెంట్స్ కమిటీ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం వారి మధ్య వివాదం పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణ శివారుల్లోని ఏపీ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన నిర్వాహణ సక్రమంగా లేదని ఆ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ కొద్దిరోజుల క్రితం గుర్తించింది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా భోజనం వండటం లేదని ఈ విషయంపై గత కొద్ది రోజులుగా భోజన నిర్వాహకులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఆ సందర్భంగానే వారి మధ్య మాటల వివాదం చోటుచేసుకంది. మధ్యాహ్నం భోజన వంటకాలు సరిపడక పోవడాన్ని కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా చూశారు. కమిటీ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు 2 గంటల సమయంలో భోజనం అందని విద్యార్థులకు తిరిగి వంట చేయించారు. ప్రతి రోజూ కనీసం పది కేజీల బియ్యాన్ని మిగిల్చడం వల్లే వంటకాలు చాలడం లేదని కమిటీ చైర్మన్ రాంబాబు, వైస్చైర్మన్ స్వాతి భోజన నిర్వాహకులను నిలదీశారు. కమిటీ ఆధిపత్యాన్ని జీర్జించుకోని భోజన నిర్వాకురాలు శ్యామల, స్రవంతి, భర్త సంతోష్ వారితో వాగి్వవాదానికి దిగారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్ అప్పాజీ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ప్రతి రోజూ చెబుతున్నారని తెలిపారు. విద్యార్థులకు సరిపడినంత వంటకాలు వండకుండా బియ్యం, గుడ్లు మిగుల్చుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. కమిటీ చెప్పిన మాటలు పట్టించుకోకుండా నిర్వాహకులు మంగళవారం కూడా విద్యార్థుల సంఖ్యకు సరిపడా వండకపోవడంతో కమిటీ సభ్యులు నిలదీశారని వివరించారు. మాటల యుద్ధంతో జరిగిన ఈ వివాదం ముదిరి టూ టౌన్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇరువురి వాదన విన్న పోలీసులు సర్ది చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా భోజనం ఒకే సారి వండి బోధన సమయానికి అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. -
‘మోడల్’ కష్టాలు!
నారాయణఖేడ్: జిల్లాలోనే వెనుకబడిన మండలమైన నాగల్గిద్ద మండల పరిధిలోని మోర్గి మాడల్ స్కూల్ విద్యార్థులు నిత్యం సమస్యలతో సమతమతం అవుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దున మోర్గి గ్రామంలో మోడల్ పాఠశాల నిర్మించిన నాటి నుంచి విద్యార్థులు నిత్యం నరకమే అనుభవిస్తున్నారు. మోర్గి మోడల్ స్కూల్, మరియు కళాశాలల్లో కలిపి మొత్తం 600మంది విద్యార్థుల వరకు నిత్యం విద్యాభ్యాసం చేస్తారు. దీంతో వివిధ ప్రాంతా నుంచి విద్యార్థులు పాఠశాలకు రావాలంటే వాహన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులుల ఎదుర్కొంటున్నారు. నాగల్గిద్ద మండలానికి మోర్గి మాడల్ పాఠశాల వచ్చిన కాడినుండి ఇబ్బందులు తప్పడంలేదు. గత పాలకుల తప్పిదమే.. మెర్గి మాడల్ స్కూల్ను నాగల్గిద్ద నుంచి మోర్గికి మార్చడంతో ఈ ఇబ్బందులు విద్యార్థులుకు శాపంగా మారినాయి. రూ కోట్లు వెచ్చింది మారుమూల గ్రామంలో భవనం నిర్మించడంతో ఇలాంటి పిరిస్థతులు నెలకొన్నాయి. నాటి పాలకుల తప్పిదం నిర్ణయంవల్లె నాగల్గిద్ద నుంచి పాఠశాలను మోర్గికి మార్చారు. అక్కడ అయిదు ఎకరాల ప్రభుత్వ భూమిని కెటాయించారు. రూ.కోట్లు వెచ్చించి భవనం నిర్మాణం చేపట్టారు. కాని విద్యార్థులకు మాత్రం సమస్యలు తీరండలేదు. కలెక్టర్ హామీ ఇచ్చినా తీరని రోడ్డు సమస్య.. గత ఏడాది ప్రారంభంలో విద్యార్థులు తమ పాఠశాలకు నాగల్గిద్ద పీడబ్యూడీ రోడ్డునుండి మోర్గి వరకు నాలుగు కిలోమీటర్ల బీటి రోడ్డు అవసరం ఉంది. గతంలో వేసిన పీఎంజీఎస్వై రోడ్డు పూర్తిగా చిద్రం కాగా గోతులు ఏర్పడినాయి. రోడ్డుకు మద్యన ఉన్న భారి కల్వర్టు సైతం శిథిలమై కూలిపోయింది. దీంతో వాహనాలు సైతం సక్రమంగా వెళ్లడం లేదు. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు.. మోర్గి మాడల్ పాఠశాలకు నాగల్గిద్ద మండలంలోని కరస్గుత్తి, కారముంగి, ఔదత్పూర్, శేరిదామర్గిద్ద, గుడూర్, నారాయణఖేడ్, తదితర గ్రామాలనుండి నిత్యం వందాలాది విద్యార్థులు పాఠశాలకు చేరుకోవాల్సిన పరిస్థితి, దీంతో వారు వివిద ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడంలేదు. ఇక నారాయణఖేడ్నుండి ఆర్టీ అధికారులు ఒక్క పూట బస్సును రెండు ట్రిప్పులుగా ఎమ్మెల్యే చొరవతో వేసిన ఫలితం అగుపించడంలేదు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు సైతం తీరడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, రణస్థలం (శ్రీకాకుళం): ఆదర్శ పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని తీరుతో మానసిక వేదనకు గురై ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గిన్నె భార్గవి ఆత్మహత్యకు యత్నించింది. గత కొద్ది కాలంగా ఉపాధ్యాయిని కక్ష కట్టి ఎన్నో విధాలుగా వేధిస్తునట్లు తమ కుమార్తె అనేకసార్లు వాపోయినట్లు మండలంలోని గోసాం గ్రామానికి చెందిన గిన్నె అసిరినాయుడు (పాలు రెడ్డి) తెలిపారు. శనివారం ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ప్రవేశం లేదని ఉపాధ్యాయిని కరాఖండిగా చెప్పడంతో భార్గవి మానసిక ఆందోళనకు గురైనట్లు తండ్రి తెలిపారు. శనివారం సాయంత్రం పురుగు మందు తాగి ఆసుపత్రి పాలైనట్టు పేర్కొన్నారు. హుటాహుటిన శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శనివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తండ్రి చెప్పారు. అయితే తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని జె.ఆర్.పురం ఎస్సై వి.బాలకృష్ణ తెలిపారు. ప్రిన్సిపాల్ వివరణ ఈ దుర్ఘటనపై ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కె.మహేశ్వరరావును వివరణ కోరగా.. ఆదర్శపాఠశాల వసతి గృహం గత ఏడాది నవంబర్లో ప్రారంభమైందని, ఆమె ప్రథమ సంవత్సరం చివరిలో ఒక నెలరోజులపాటు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల హాస్టల్కు రాలేదని, హాస్టల్లో ఉన్నప్పుడే ఒకసారి కడుపులో నొప్పి అని చెబితే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి వసతి గృహంలో ప్రవేశాలకు శనివారం దరఖాస్తులు కోరామన్నారు. గతంలో అనారోగ్యం, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవద్దని హాస్టల్ మెయింటినెన్స్ చూస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని లక్ష్మికి చెప్పామని ప్రిన్సిపాల్ మహేశ్వరరావు తెలిపారు. -
ఫలితాలు రాకముందే ప్రవేశాలా?
కర్నూలు సిటీ: పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కాకముందే మోడల్ స్కూళ్లలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. అలాగే మే రెండో వారంలో పది ఫలితాలు రావచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈనెల 30వ తేదీ లోగా దరఖాస్తులకు ఆఖరు ప్రకటించడం విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఫలితాలు రాకముందే ఎలా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు తేదీని ఎలా ముగిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల రెండో వారంలో పది మూల్యాంకనం ప్రారంభం కావాల్సి ఉండగా ఎన్నికల కారణంగా ఆలస్యం కావడంతో ఈనెల 15వ తేదీనుంచి మొదలైంది. ఇలా పది రిజల్ట్ ప్రకటించక ముందే దరఖాస్తు తేదీని ముగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆరో తరగతి ప్రవేశాలకు గత నెల 31వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించి ఇటీవల ఫలితాలను విడుదల చేశారు. 7,8,9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను సైతం భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఫలితాలు రాకముందే ఈనెల 15న షెడ్యుల్ జారీ చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 7,8,9 తరగతుల ప్రవేశాలపై స్పష్టత కరువు.. జిల్లాలో ఉన్న 36 ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకునేందుకు మొదట ప్రకటించిన ప్రకారం నేడు ఆఖరి రోజు. అయితే ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు జూన్లో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్ష పెడితే బాగుంటుందని విన్నవించడంతో డీఈఓతో చర్చించి ప్రవేశ పరీక్షపై నిర్ణయం తీసుకోవాలని కమిషనర్ ఇటీవల సూచించారు. ప్రవేశ పరీక్షను ముందు తరగతిలోని అన్ని సబ్జెక్టుల్లో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఐచ్ఛిక విధానంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో పరీక్ష ఉంటుంది. ముందుగా అనుకున్నట్లు అయితే ఈ నెల 20న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆరోజు సమ్మెటివ్–2 పరీక్షలు ఉండడంతో 21వ తేదీ జరపాలని నిశ్చయించినా కుదరకపోవడంతోనే ప్రవేశ పరీక్ష ఏర్పాటుపై నేటికీ స్పష్టత రాలేదు. దరఖాస్తు ప్రక్రియ ఇలా.. ఆన్లైన్లో దరఖాస్తూలు చేసుకోవాలి. ఓసీ విద్యార్థులు రూ.100, బీసీలు రూ.60, ఇతరులు అయితే రూ.30 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 30వ తేదీలోగా ఏపీ ఆన్లైన్లో కానీ, మీ సేవ ద్వారా దరఖాస్తు పంపించాలి. మే 25న ఎంపిక జాబితా ప్రదర్శించి, 26వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. ‘మోడల్’లో అందుబాటులో ఉండే కోర్సులివే.. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూప్ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో విభాగానికి 20 సీట్ల చొప్పున ఒక ఆదర్శ పాఠశాలలో నాలుగు విభాగాలకు మొత్తం 80 సీట్లు ఉంటాయి. వీటి ప్రవేశాలకు విద్యార్హత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. -
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
పర్వతగిరి: మండల కేంద్రం మోడల్ స్కూల్లోని వసతి గృహంలో బుధవారం మధ్యాహ్నం మడ్డి ప్రసన్న (16) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం.. మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ప్రసన్నను పాఠశాలలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు వ్యక్తిగత కారణాలతో తోటి విద్యార్థుల ముందు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై వసతి గృహంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్కు తెలపటంతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రసన్నను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించినట్లు తెలుపటంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురికి ప్రసన్న మృతుదేహన్ని తరలించారు. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు ప్రసన్న మృతితో తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రసన్న అందరితో కలివిడిగా ఉండేదని, అందరి మన్ననలు పొందుతూ చదువులో రాణించేదని విద్యార్థులు శోక సముద్రంలో మునిగిపోయారు. -
ఆదర్శం.. సువర్ణావకాశం
విశాఖపట్నం ,ఆరిలోవ(విశాఖ తూర్పు): గ్రామీణ ప్రాంతంలో ప్రతిభా వంతులైన విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చేరేందుకు చక్కని అవకాశం ఉంది. ఉచిత వసతి, భోజనం, విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన ఆదర్శ విద్యాలయాల్లో 2019–20 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించలేని పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించేందుకు ఈ ఆదర్శ పాఠశాలలను నెలకొల్పారు. జిల్లాలో ఐదు ఆదర్శ విద్యాలయాలు 2013లో రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయగా మన జిల్లాలో నర్సీపట్నం మండలం వేములపూడి, రావికమతం మండలం మరుపాక, చీడికాడ మండలం మంచాల, కశింకోట మండలం తేగాడ, మునగపాక మండలం పాటిపల్లిలో ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలలో 80 మంది వంతున 5 పాఠశాలల్లో 400 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిభావంతులైన బాలబాలికలకు ప్రవేశం కల్పిస్తారు. వారికి ఇంటర్ వరకు అన్ని సౌకర్యాలతో ఉచిత విద్యను అందిస్తారు. దరఖాస్తు చేసుకోండిలా.. ఏపీ ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.ఏపీపీ.జీవోవీ. ఇన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రింట్ తీసుకుని ఆయా మండలాల్లోని ఆదర్శ బడుల్లో సమర్పించాలి. ఆధార్, కులం, ఆదాయం, తదితర ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. ప్రవేశ రుసుం ఓసీ, బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50లను ఏపీ ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో చెల్లించాలి. రిజర్వేషన్లు ఇలా.. ఆదర్శ పాఠశాలల్లో ప్రతి తరగతిలో 15శాతం ఎస్సీలకు, ఆరు శాతం ఎస్టీలకు, 29శాతం బీసీలకు(బీసీ‘ఎ’–07, బీసీ‘బీ’–10, బీసీ‘సీ’–01, బీసీ‘డీ’–07, బీసీ‘ఈ’–04శాతం) కేటాయించారు. దివ్యాంగులకు మూడు శాతం, బాలికలకు 33.33శాతం సీట్లను కేటాయించారు. నిర్దేశించిన గ్రూపుల్లో అర్హులైన వారు లేని పక్షంలో ఇతర విభాగాల్లోని వారితో భర్తీ చేస్తారు. ఇక మిగిలిన 50శాతం సీట్లను ఇతర కులాలకు నిర్దేశిస్తారు. మార్చి 31న ప్రవేశ పరీక్ష ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశానికి మార్చి 31న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 23 నాటికి పూర్తి చేయాలి. 2019 మార్చి 31న ఉదయం 9 నుంచి 11గంటల వరకు ఆయా ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఎంపిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం ఉంటుంది. అర్హులు ఎవరంటే.. ♦ ఓసీ, బీసీ విద్యార్థులు 2007 సెప్టెంబరు 1, 2009 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ♦ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2005 సెప్టెంబరు 1, 2009 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ♦ జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలలో చదివి ఉండాలి. 2018–19లో మాత్రం ఐదో తరగతి చదివి ఉండాలి.. రాత పరీక్ష ఇలా.. మార్చి 31న ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ఐదో తరగతి సామర్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఇంగ్లిష్ పాఠ్యాంశాలపై 25 మార్కుల వంతున ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరో తరగతిలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు కనీస అర్హతగా 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 35 మార్కులు విధిగా సాధించాలి. -
మోడల్ స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, మఠంపల్లి (హుజూర్నగరర్) : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన మంఠంపల్లి మోడల్ స్కూల్లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు, తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రఘునాథపాలేనికి చెందిన చలిగంటి కొండయ్య కుమా ర్తె నీరజ (17) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. నీరజ శనివారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. అనంతరం తండ్రి ఫోన్ చేయగా మాట్లాడి పడుకుంది. తెల్లవారిన తర్వాత తోటి విద్యార్థినులు స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లగా గడియ పెట్టి ఉంది. చాలా సేపు వేచి చూసిన అందులో ఉన్న వారు గడియ తీయకపోవడంతో అనుమానంతో విద్యార్థినులు బాత్రూం తలుపును బలంగా నెట్టారు. అందులోని దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. అప్పటికే నీరజ బాత్రూం వెంటిలేటర్కు చున్నీతో ఉరి పెట్టుకుని కనిపించడంతో కేకలు వేశారు. విషయాన్ని స్కూల్ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంజిత్కుమార్ ఘటన స్థలా న్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. నీరజ మృతిపై అనుమానాలు నీరజ మృతిపై తండ్రితో పాటు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రాత్రి వరకు బాగానే ఉన్న తన కుమార్తె తెల్లారేసరికే విగతజీవిగా మారిపోవడానికి బలమైన కారణాలు ఏమీ లేవని వాపోయారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని పోస్టుమార్టం నివేదికలో నిజాలు వెలుగుచూస్తాయని, అప్పటి వరకు శాంతియుతంగా ఉండాలని నచ్చజెప్పారు. మృతురాలి తండ్రి కొండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. రఘునాథపాలెంలో విషాదఛాయలు .. ఇంటర్ విద్యార్థిని నీరజన అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో రఘునాథపాలెంలో విషాదఛా యలు అలుముకున్నాయి. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఇద్దరు చిన్నారులు దారుణంగా మృతిచెందిన ఘటన మరువక ముందే మరో వి ద్యార్థిని మృతిచెందటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.ఆరుమాసాల క్రితం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్న పెదవీడుకు చెందిన విద్యార్థిని హాస్ట ల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుంది. -
ప్లీజ్ సార్..వెళ్లొద్దు
అనంతపురం, కళ్యాణదుర్గం: ఉపాధ్యాయుడంటే...ఏ విద్యార్థికైనా భయమే..కానీ ఆ ప్రిన్సిపాల్ అంటే మాత్రం ఆ పాఠశాలందరికీ గౌరవం..కాదు..ప్రేమ...ఆ ప్రిన్సిపాల్కు కూడా విద్యార్థులంటే ప్రాణం..తండ్రిలా బిడ్డలపై వాత్సల్యం. అందుకే బదిలీపై ఆ ప్రిన్సిపాల్ పాఠశాల వదిలివెళ్తుంటే విద్యార్థులంతా చుట్టుముట్టారు..వెళ్లవద్దు సార్..ప్లీజ్..అంటూ అడ్డుపడిపోయారు. దీంతో ఉద్వేగానికిలోనైన సదరు ప్రిన్సిపాల్ కూడా ఇక్కడి నుంచి వెళ్లలేకపోయారు..ఈ ఘటన గురువారం కళ్యాణదుర్గంలో మోడల్ స్కూల్లో చోటుచేసుకుంది. ఐదేళ్ల క్రితం ఎఫ్ఏసీపై వచ్చి... ఐదేళ్ల క్రితం కళ్యాణదుర్గంలో మోడల్ పాఠశాల తరగతులు ప్రారంభమయ్యాయి. ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్గా వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. అరకొర వసతులతో మొదట్లో పాఠశాలను నడుపుకొచ్చారు. విద్యార్థులను తండ్రిలా చూశారు. పేద విద్యార్థులకు ఫీజులు సైతం చెల్లించారు. బాలురకు భోజన వసతి లేకపోతే... సొంత డబ్బులతో భోజనం పెట్టారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ముందు నెలరోజులు ప్రత్యేక స్టేడీ హవర్స్ నిర్వహించి భోజన వసతి కల్పించారు. సుదూర ప్రాంతాల్లో రెజ్లింగ్, జూడో, హ్యాండ్బాల్ లాంటి పోటీలకే వెళ్లే క్రీడాకారులకు ఖర్చులు భరిస్తు సౌకర్యాలు కల్పించారు. అందువల్లే వరప్రసాద్తో విద్యార్థులకు విడదీయరాని బంధం ఏర్పడింది. ఇంతటి అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ప్రిన్సిపాల్ వరప్రసాద్ను పామిడి ఆదర్శ పాఠశాలకు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులందాయి. దీంతో గురువారం ఆయన ఈ విషయం విద్యార్థులకు చెప్పడంతో వారంతా అడ్డుపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్లీజ్సార్...వెళ్లొద్దు ఇక్కడే ఉండండి అంటూ విద్యార్థిని, విద్యార్థులు ఆయనను చుట్టుముట్టారు. భావోద్వేగానికి గురైన వరప్రసాద్ కూడా కంటతడి పెట్టారు. ప్రిన్సిపాల్ వెళ్లకూడదంటూ ధర్నా అనంతరం విద్యార్థులంతా తమ ప్రిన్సిపాల్ను మరోచోటకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ పాఠశాల దాటకుండా అడ్డుకుని చుట్టుముట్టారు. ప్రిన్సిపాల్ వెళ్లకూడదూ... ఉండాలి ప్రిన్సిపాల్ ఇక్కడే ఉండాలి... అంటూ నినాదాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం 1.00 గంట నుంచి 4.30గంటల వరకు ఆందోళన జరిగింది. అనంతరం ర్యాలీగా విద్యార్థులంతా ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఇంటికి వెళ్లి ప్రిన్సిపాల్ బదిలీ ఆపాలని విజ్ఞప్తి చేశారు. నాకు అన్నం పెట్టాడు నాకు తల్లిలేదు. మా నాన్న సురిబాబు వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ వసతి గృహం సౌకర్యం లేనప్పుడు ప్రిన్సిపాల్ సార్ భోజన సౌకర్యం కల్పించారు. – మాతశ్రీ, 8వ తరగతి విద్యార్థిని లోటు లేకుండా చూసుకున్నారు 8వ తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నా. ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఏ ఇబ్బంది ఉన్నా పరిష్కరించారు. మా సార్ను బదిలీ చేయకూడదు.– బాలాంజలి, ఇంటర్ విద్యార్థిని క్రీడాకారులకు ప్రోత్సహించారు రాష్ట్రంలో ఏ ప్రాం తానికి వెళ్లినా క్రీడకారుల ఖర్చంతా సారే భరించేవారు. విజయం తో తిరిగి రావాలంటూ ఉత్సాహపరిచేవారు. అలాంటి సార్ను బదిలీ చేయడం అన్యాయం.–మౌర్య, 9వ తరగతి విద్యార్థి -
విద్యార్థిని చితకబాదిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్
జూపాడుబంగ్లా: స్థానిక మోడల్ స్కూల్ ఓ విద్యార్థి్థని ప్రిన్సిపాల్ చితకబాదారు. విద్యార్థి తండ్రి వివరాల మేరకు..నాగపుల్లయ్య కుమారుడు దేవేంద్ర మోడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం ఎవరో విద్యార్థి తరగతి గదిలోని డెస్కులపై బురదకాళ్లతో తొక్కారు. ఈ విషయం ప్రిన్సిపాల్ హుసేన్వలికి తెలియటంతో ఎలాంటి విచారణ చేయకుండా దేవేంద్రను కర్రతో వీపు, చెయ్యి, కాళ్లపై చితకబాదారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి పాఠశాల వద్దకు వెళ్లి కుమారుడిని తీసుకుని గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరైన నోడల్ అధికారి వెంకటరమణయ్య, ఎంపీడీఓ సుబ్బారెడ్డి, తహసీల్దార్ శివరాముడుకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయకపోయినా విద్యార్థుల మాట విని ప్రిన్సిపాల్ తనను చితకబాదాడని విద్యార్థి కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రిన్సిపాల్ను పిలిపించి మందలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థి తండ్రి శాంతించాడు. విద్యార్థి అల్లరి చేయటంతో కాస్త మందలించినట్లు ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. -
బదిలీ(ల)లు..!
రాజకీయ ఒత్తిళ్లకు అనుకూలంగా విద్యాశాఖ పనిచేస్తోందా అన్న సందేహం తలెత్తుతోంది. ఓ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీల విషయంపై అధికారపార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెరవెనుక పావులు కదుపుతుండమే దీనికి కారణం. వేసవి సెలవుల్లో జరగాల్సిన సాధారణ బదిలీలు పాఠశాలలు ప్రారంభమయ్యాక జరగడమే వివాదానికి అసలు కారణం. ఉపాధ్యాయులను బదిలీ చేయాలంటూ ఒకరు, ఇప్పుడు బదిలీ చేస్తే మా ప్రాంత పాఠశాలల అభివృద్ధి కుంటుపడుతుందని మిగతా ఇద్దరు శాసనసభ్యులు అంటున్నట్లు సమాచారం. ఎవరి ప్రాంత అభివృద్ధిని వారు కాంక్షిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అసలు కారణం ఏమై ఉంటుందా అని, అధికార పార్టీలో ఈ పట్టు విడుపులు ఎటుదారితీస్తాయో.. అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉన్నతాధికారి ఆదేశాలు అమలు చేయకుండా ఉండలేక.. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు బేఖాతరు చేయలేక మధ్యలో హెచ్ఎంలు నలిగిపోతున్నారు. మార్టూరు: చీరాల పట్టణం వేటపాలెం మండల పరిధిలోని కొత్తపేట ఐఎల్టీడీ కాలనీ సమీపంలో ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా మోడల్ పాఠశాలను ప్రారంభించింది. స్థాయికి మించి అర్జీలు వచ్చినప్పటికీ 1200 మందికి పైగా విద్యార్థుల ప్రవేశాలు మెదటి సంవత్సరమే పూర్తయ్యాయి. సాక్షాత్తూ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన కుమారుడిని సైతం ఇక్కడ చేర్పించటంతో ఈ పాఠశాల వార్తల్లో నిలిచింది. గతవారం చీరాలలో పర్యటించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా అధికారికంగా ఈ స్కూల్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో పాఠశాలను ప్రారంభించకుండానే మంత్రి లోకేష్ వెనుతిరిగిన సంఘటన తెలిసిందే. ఈ పాఠశాలకు అవసరమైన ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధారణంగా బదిలీపై రావాల్సి ఉండగా ఈ వేసవిలో ప్రభుత్వం సాధారణ బదిలీలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న, చీరాల పరిసర ప్రాంతాలకు చెందిన ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై చీరాల మోడల్స్కూల్కు వెళ్లవల్సిందిగా డీఈఓ కార్యాలయం నుంచి అనధికార ఉత్తర్వులు వెలువడినట్లు తెలిసింది. సహజంగానే తమ ప్రాంతమైన చీరాల వైపు వెళ్లటానికి ఆసక్తి చూపుతున్న ఉపాధ్యాయులు డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవటం వారిని రిలీవ్ చేయమని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ కార్యాలయం నుంచి అధికార ఉత్తర్వులు జారీ కావటం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇక్కడ నుంచే అసలు కథ ప్రారంభం.. తమకు ఏలాంటి సమాచారం లేకుండా తమ నియోజకవర్గంలోని పాఠశాలల నుంచి డిప్యూటేషన్పై ఉపాధ్యాయులను పంపించటానికి పర్చూరు, అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు అంగికరించడం లేదనేది విశ్వసనీయ సమాచారం. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో పాటు, పర్చూరు, అద్దంకి ఎమ్మెల్యేలు కూడా అధికారపార్టీకి చెందిన వారే. ఆధిపత్య పోరో లేక మరొకటో తెలియదు కానీ తమకు తెలిమకుండా తమ నియోజవర్గ ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై పంపవద్దని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. డిప్యూటేషన్ బదిలీల కోసం పర్చూరు నియోజవర్గంలోని మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు మండలాల నుంచి అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి దరఖాస్తులు రాగా వారిని రిలీవ్ చేయాల్సిందిగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ సుబ్బారావు ఆదేశాలు జారీ చేశారు. మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్ కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఒకరు విరమించుకున్నట్లు సమాచారం. మరొక ఉపాధ్యాయురాలిని ప్రధానోపాధ్యాయుడు దుడ్డు డేవిడ్ రిలీవ్ చేయకపోవటం గమనార్హం. ఇది ఇలా ఉండగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్తో వచ్చే ఎన్నికల్లో చీరాలతో పాటు పర్చూరు, సంతనూతలపాడు నియోజవర్గాల్లో కూడా పార్టీ గెలుపుకోసం కృషి చేయవల్సిందిగా సూచించిన నేపథ్యంలో బదిలీలు ఆగి ఉండవచ్చనే కోణంలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రధానోపాధ్యాయులు డీఈఓ ఉత్తర్వులను బేఖాతరు చేసే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం డీఈఓ ఆదేశాలను ఉల్లంఘీస్తూ రిలీవ్ చేయకుండా ఉండటాన్ని చూస్తే ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లే అని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి. బదిలీ కోసం వచ్చిన అర్జీల్లో ఒకరిని అక్కడి ప్రధానోపాధ్యాయురాలు రిలీవ్ చేయగా మిగతా వాటిపై ఏం చేయాలో తెలియక హెచ్ఎంలు సతమతమవుతున్నారు. డీఈఓ ఉత్తర్వులు వచ్చిన మాట నిజమే.. పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్పై చీరాల పంపవల్సిందిగా డీఈఓ ఉత్తర్వులు వచ్చిన మాట నిజమే. ఈ సంవత్సరం సాధారణ బదిలీలు లేనందున రిలీవ్ అయిన వారి స్థానంలో మరొకరు వచ్చే అవకాశం లేదు. మధ్యంతర బదిలీలతో పాఠశాల అభివృద్ధి కుంటు పడుతుందని ఆ ఉపాధ్యాయురాలిని రిలీవ్ చేయలేదు. దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు లేవు.దుడ్డు డేవిడ్, ప్రధానోపాధ్యాయుడు డీఈఓ ఆదేశాల మేరకు రిలీవ్ చేశా.. పాఠశాల సైన్సు ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్పై పంపవలసిందిగా డీఈఓ ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో సోమవారం రిలీవ్ చేశాను. రాజకీయ వత్తిళ్ళు ఏమీ లేవు. ఎమ్ నిర్మల,వలపర్ల ప్రధానోపాధ్యాయురాలు -
మోడల్ బ్యాంకింగ్
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి) : విద్యార్థులకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించేందుకుగాను పట్టణంలోని మోడల్ స్కూల్లో సోమవారం మోడల్ బ్యాంకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సాయిబాబా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు బ్యాంకింగ్ సేవల గురించి వివరించారు. బ్యాంకు లో జరిగే లావాదేవీలు, సేవల గురించి విద్యార్థులకు తెలియజేశా రు. మనీ ట్రాన్స్ఫర్, డిమాండ్ డ్రాఫ్ట్సŠ, చెక్కుల వినియోగం, ప్రభుత్వ చాలాన్లు చెల్లింపు, ఆర్టీజీఎస్, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకునకు డబ్బుల బదిలీ తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భవిష్యతులో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు మోడల్ బ్యాంకింగ్, మోడల్ ఎలక్షన్స్ తదితర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వివరించారు. మోడల్ బ్యాంకింగ్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు లక్ష్మీనర్సయ్య, స్రవంతి నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ సేవలపై పూర్తి అవగాహన వచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శశిశంకర్, ఉపాధ్యాయులు శక్తిరాజ్, నాగరాజ్, గంగాప్రసాద్, విద్యార్థులు ఉన్నారు. చాలా నేర్చుకున్నాను.. బ్యాంకుల్లో డబ్బులు జమ చేసే విధానంపై ఉపాధ్యాయులు వివరించారు. డబ్బులు జమ చేసేందుకు వినియోగించే వోచర్, డ్రా చేసేందుకు వినియోగించే ఓచర్.. డిడి, తదితర వివరాలన్నింటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ విధానం నేర్చుకున్నాను. – పావని, విద్యార్థిని చెక్కుల వినియోగం తెలుసుకున్నా.. మాలాంటి విద్యార్థులకు బ్యాంకు లావాదేవీల గురించి అవగాహన ఉండదు. అయి తే ఉపాధ్యాయులు నిర్వహించిన మోడల్ బ్యాంకింగ్ ద్వారా అవగాహన వచ్చింది. చెక్కులను వినియోగించడం గురించి తెలుసుకున్నాను. మోడల్ బ్యాంకింగ్పై ఉపాధ్యాయులు తెలిపిన వివరాలు బాగున్నాయి. – గాయత్రి, విద్యార్థిని మనీ ట్రాన్స్ఫర్ సులువుగా ఉంది.. డబ్బులను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసే విధానం సులువుగా ఉంది. ఆన్లైన్ ద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేసే విధానం గురించి తెలుసుకున్నాను. – భానుప్రసాద్, విద్యార్థి -
మోడల్ స్కూల్ పిలుస్తోంది
పొందూరు: తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించాలని ఎంతోమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు రూ.వేలల్లో ఫీజులు చెల్లించలేక వెనకడుగు వేస్తున్నారు. మధ్యతరగతి వారు అప్పోసొప్పో చేసి ఫీజులు చెల్లించి కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. నిరుపేదల పిల్లలకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ.. ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు ప్రారంభించింది. ఉచితంగా విద్యతో పాటు పక్కా భవనాలు, ల్యాబ్లు, లైబ్రరీ సదుపాయాలు అందుబాటులో ఉంచుతోంది. ఆరో తరగతిలో ప్రవేశిస్తే ఇంటర్మీడియట్ వరకు అదే పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 2018–19కు గాను ఆరో తరగతిలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 16తో దరఖాస్తులు చేసుకొనేందుకు గడువు ముగుస్తుంది. దరఖాస్తులు ఇలా ఆదర్శ పాఠశాలల్లో 2018–19కి గాను ఆరో తరగతిలో విద్యార్థుల ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2018 ఏప్రిల్ 8వ తేదీన ఐదో తరగతి స్థాయిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు చేరే పాఠశాలలోనే దీనిని ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రాయాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2006, సెప్టెంబర్ 1 నుంచి 2018, ఆగస్టు 31 మధ్య జన్మించాలి. వయసు 10 నుంచి 12 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు 2006 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31, 2018 మధ్య జన్మించాలి. 10 నుంచి 14 ఏళ్లు దాటకూడదు. విద్యార్థి ప్రాథమిక వివరాలతో ప్రవేశ పరీక్ష రుసుమును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి చెల్లిస్తే జనరల్ నంబర్ కేటాయిస్తారు. ఆ నంబరు ఆధారంగా విద్యార్థి పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలా చేసిన దరఖాస్తును సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్కు అందించాలి. ఓసీ, బీసీలకు రూ.100లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఐదో తరగతి సిలబస్ మేరకు తెలుగు – 25, ఇంగ్లీష్ – 25, గణితం – 25, పరిసరాల విజ్ఞానం –25 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఈ పరీక్షలో ఓసీ, బీసీలు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 35 మార్కులు పొందాలి. ప్రవేశాలు ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఉంటాయి. జిల్లాలో 1120 సీట్లు జిల్లాలో ఉన్న 14 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరేందుకు 1120 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఆదర్శ పాఠశాలలో 80 మందిని మాత్రమే చేర్చుకుంటారు. పొందూరు, కుప్పిలి, రణస్దలం, లావేరు, జి.సిగడాం, పోలాకి, జలుమూరు, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, భామిని, పాతపట్నం, కంచిలి, ఓవిపేట(బూర్జ) ఆదర్శ పాఠశాలల్లో చదివేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పాఠశాల ప్రత్యేకతలు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్య, క్రమ శిక్షణ, నైతిక విలువలు, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిషులపై బోధన ఉంటుంది. అన్ని సదుపాలతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్, గ్రంథాలయం అందుబాటులో ఉన్నాయి. ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న బోధన సదుపాయం ఉంది. విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఈ–లెర్నింగ్, సీసీఈకు అనుగుణంగా విద్యాబోధన చేస్తారు. బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నాం తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లల కోసం ఆరో తరగతిలో బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తున్నాం. ఏడో తరగతికి వచ్చేసరికి పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నప్పటికీ అర్థం చేసుకుంటున్నారు. ఈ పాఠశాల నుండి రిలీవైన పిల్లలు ఉన్నత విద్యను పూర్తి చేసుకొన్న తర్వాత ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో విజయం సాధించగలరు. – మార్తా తిలకం, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, పొందూరు -
‘మోడల్’ విద్య అందని ద్రాక్షేనా..?
సారంగాపూర్ : మండలంలోని విద్యార్థులకు ‘మోడల్’ విద్య అందని ద్రాక్షగా మారింది. ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాలకు మోడల్ పాఠశాలలు మంజూరైనా సారంగాపూర్లో మాత్రం ఏర్పాటు కాలేదు. జిల్లా కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్లో మండల విద్యార్థులకు అడ్మిషన్లు దక్కడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మోడల్స్కూల్ ప్రత్యేకత మోడల్స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసినప్పటిటీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వీటి నిర్వాహణ కొనసాగుతుంది. ఇక్కడి విద్యార్థులకు బోధన పరంగా ఉన్నత ప్రమాణాలతో విద్య అందుతుండడంతో విద్యార్థులు అడ్మిషన్ల కోసం పోటీపడుతున్నారు. కానీ సారంగాపూర్ మండల విద్యార్థులకు అవకాశం దక్కడం లేదు. మండల విద్యార్థులకు నో అడ్మిషన్లు ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి తరగతిలో 100 సీట్లు ఉన్నప్పటికీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడానికి నిర్వహించే పరీక్షల్లో, స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. గతేడాది ఆరో తరగతిలో అడ్మిషన్లు పొందడానికి 1100 మంది పరీక్షలు రాశారు. ఇందులో కేవలం అడ్మిషన్లు పొందినది 100 మంది విద్యార్థులు మాత్రమే. మంజూరైనా.. ఏర్పాటు కాలేదు సారంగాపూర్కు మోడల్స్కూల్ మంజూరైనా స్థల సేకరణ జరిపినా, సకాలంలో అధికారులు స్పందించకపోవడంతో మోడల్స్కూల్ ఏర్పాటు రద్దైయింది. ఇప్పటికైనా మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పరీక్ష రాసినా పట్టించుకోలేదు గతేడాది తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ పొందడానికి పరీక్ష రాసినా, మాకు కనీసం ఫలితం ఏమి అన్నది అధికారులు సమాదానం ఇవ్వలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే వారి నుంచి సరైన సమాదానం రాలేదు. మాకు మోడల్స్కూల్లో చదవాలని ఉంది. అధికారులు మాకు అవకాశం కల్పించాలి. – యశ్వంత్, సారంగాపూర్ మాకు అడ్మిషన్లు ఇవ్వాలి మాకు మోడల్స్కూల్లో అడ్మిషన్లు ఇవ్వాలి, మా దగ్గర మోడల్స్కూల్ లేదు. మాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల మోడల్స్కూల్లో అడ్మిషన్లు ఇచ్చే విషయాన్ని అధికారులు పరిశీలించాలి. – కస్తూరి వెంకటేష్, సారంగాపూర్ ప్రభుత్వం సీట్లు పెంచితే అడ్మిషన్లు ఉన్న సీట్లకోసం విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వం మరిన్ని సీట్లు పెంచితే కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం కోసం ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి పరిశీలిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, డీఈవో -
ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
డెంకాడ: అక్కివరం గొల్లపేట వద్ద ఉన్న మోడల్ స్కూల్లో 2018–19 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.స్వర్ణలత ప్రకటనలో తెలిపారు. బీసీ, ఓసీ విద్యార్థులు 01.09.2006 నుంచి 31.8.2008 సంవత్సరాల మధ్యలో, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2004 నుంచి 31.8.2008 మధ్యలో పుట్టి ఉండాలన్నారు. బీసీ విద్యార్థులకు వంద రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 రూపాయలు పరీక్షా రుసుం చెల్లించాలన్నారు. ఇంకా ఏమైనా వివరాలు కావాల్సి వస్తే సెల్ నంబర్లు 70329 96542, 99493 49598కు సంప్రదించాలన్నారు. -
విద్యార్థిని చితకబాదిన పీఈటీ
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గంలోని మోడల్ స్కూలులో ఏడో తరగతి చదివే తమ కుమారుడు మహమ్మద్ ఆదిల్ అనే విద్యార్థిని పీఈటీ దివాకర్ చితకబాదినట్లు తండ్రి హెచ్.కె.బాషా ఆరోపించారు. మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్లిన తర్వాత ప్రార్థన చేసేందుకు వెళ్తుండగా, ఐడీ కార్డు ఎందుకు వేసుకొని రాలేదంటూ చేతులు, కాళ్లపై విపరీతంగా కొట్టినట్లు ఆయన వివరించారు. తమ బిడ్డతో పాటు మరో ఇద్దరు విద్యార్థులనూ అతను కొట్టినట్లు చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం(రోజా) ఉన్న తమ కుమారుడ్ని కొట్టడంతో బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మోడల్ స్కూలు ప్రిన్సిపల్ ప్రకాశ్నాయుడుకు ఫోన్లో వివరిస్తే సరైన సమాధానం చప్పకపోగా.. ‘కొట్టేదే.. ఏం చేసుకుంటావో చేసుకోపో...’ అంటూ దురుసుగా మాట్లాడినట్లు ఆయన వాపోయారు. గతంలోనూ ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను కొట్టాడని తెలిపారు. ఇప్పుడు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాషా తెలిపారు. ఈ ఆరోపణలపై ప్రిన్సిపల్ స్పందిస్తూ.. ఘటనపై విచారిస్తామని చెప్పారు. -
ఊరిస్తున్న ‘మోడల్’ వసతి
– అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తున్న ప్రభుత్వం – ఏటా విద్యార్థులకు తప్పని తిప్పలు – ఈసారైనా ప్రారంభించేరా? చాలామంది పేద పిల్లలు ప్రతిభ ఉండి సరైన ప్రోత్సహం లేక చదువుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారికోసం ఆంగ్లమాధ్యమంతో కూడిన మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉత్తమ విద్య, అత్యుత్తమ సౌకర్యాలు అంటూ చేసిన ప్రకటనలు నేడు నీటమూటలయ్యాయి. నాలుగేళ్లు పూర్తయినా కనీస వసతి గృహాలు కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ‘మోడల్ చదువు’ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లు సమస్యలతో సతమతమవుతన్నాయి. వీటి ఏర్పాటు వెనుక లక్ష్యం పాలకుల పుణ్యామా అని నెరవేరే సూచనలు కనిపించడం లేదు. - అనంతపురం ఎడ్యుకేషన్ మోడల్ స్కూళ్లలో వసతి ఏర్పాటుపై ప్రభుత్వం వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. 2013–14 విద్యా సంవత్సరంలో ఈ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించినా.. నేటికీ వసతి కల్పించలేకపోయింది. అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తోంది తప్ప ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వ అలసత్వం.. ఇతర విద్యా సంస్థలకు మోడల్గా నిలవాల్సిన ఈæ స్కూళ్లు ప్రభుత్వ అలసత్వం కారణంగా నిర్వీర్యమవుతున్నాయి. 2012–13 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 63 మండలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు అనుకూలించక 2013–14 సంవత్సరానికి వాయిదా వేశారు. ఆ ఏడాది కూడా తొలివిడతగా కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. ప్రభుత్వంలో జవాబుదారీ తనం లోపించడం... నిధుల కొరత కారణంగా తక్కిన మండలాల్లో నేటికీ ఈ స్కూళ్లు ఏర్పాటు కాలేదు. ‘వసతి’ కల్పనలో అంతులేని నిర్లక్ష్యం ప్రారంభ సంవత్సరంలో హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీ పడి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి వసతి విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆయా మండల పరిధిలో సుదూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకోలేక, వదిలిపెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల తల్లిదండ్రులు అద్దె ఆటోలను మాట్లాడి రోజూ పిల్లలను బడికి పంపుతున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి, కనుముక్కల, ఓబుళంపల్లి, వెంకటాంపల్లి, పులేటిపల్లి తదితర గ్రామాల నుంచి వందమంది దాకా విద్యార్థులు రోజూ ఆటోల్లో స్కూల్కు వస్తున్నారు. మోడల్ స్కూల్ ఉన్న ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి. ఊరిస్తున్న అధికారులు వసతి కల్పిస్తామంటూ ఏటా ప్రారంభంలో ప్రకటించడం తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. అన్ని తరగతులకు హాస్టల్ వసతి ఉంటుందని చెప్పిన అధికారులు తర్వాత బాలికలకు మాత్రమే అన్నారు. అది కూడా 9 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న బాలికలకు మాత్రమే కల్పిస్తామని చెప్పుకొచ్చారు. పోనీ అదైనా అమలు చేశారా అంటే లేదు. ప్రతి హాస్టల్లోనూ 9 నుంచి ఇంటర్ వరకు బాలికలకు వంద సీట్లు కేటాయిస్తామన్నారు. జిల్లాలో 25 స్కూళ్లకు గాను 19 స్కూళ్లలో ప్రారంభించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు. ఒక్కో స్కూల్కు రూ. 61 వేలతో వంటపాత్రలు కొనుగోలు చేశారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశారు. కానీ ఈసారి స్కూళ్లు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా వసతిపై అధికారుల నుంచి స్పష్టత లేదు. ఇదిలా ఉండగా హాస్టళ్లు ప్రారంభించాలంటే ముందుగా మ్యాట్రిన్, చౌకీదారు, హెడ్, హెల్పర్ కుకింగ్ పోస్టులు భర్తీ చేయాలి. ఇప్పటిదాకా వీటి భర్తీ ప్రక్రియ జరగలేదు. తొలివిడతగా 19 స్కూళ్లలో ప్రారంభం తొలివిడతగా జిల్లాలో 19 స్కూళ్లలో బాలికలకు వసతి కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కణేకల్లు, నల్లచెరువు, పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రాయదుర్గం, విడపనకల్లు, యాడికి, యల్లనూరు మండలాల్లో హాస్టళ్లు ప్రారంభించనున్నారు. అయితే ఇది ఎంత మాత్రం ఆచరణలో ఉంటుందో నమ్మశక్యంగా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఆటోలో వస్తున్నాం మా ఊరి నుంచి ఆదర్శ పాఠశాలకు 12 కిలోమీటర్ల దూరం ఉంది. హస్టల్ వసతి లేకపోవడంతో ప్రతిరోజూ ఆటోలో బడికి వెళ్లి వసుం్తన్నాం. ఇలా రోజూ తిరగడం వల్ల స్కూల్లో చెప్పిన పాఠాలను ఇంటి వద్ద అభ్యసన చేసేందుకు సమయం చాలడం లేదు. ఇబ్బందిగా ఉంది. హాస్టల్ వసతి కల్పిస్తే చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. – అరుణ, పదోతరగతి మడ్డిపల్లి, పుట్లూరు మండలం ఈ ఏడాది ప్రారంభిస్తామన్నారు ఈ సంవత్సరం నుంచి హాస్టల్ను ప్రారంభిస్తామన్నారు. పాఠశాల ప్రారంభించి వారం రోజులు కావస్తున్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. హాస్టల్ లేకపోవడంతో పుట్లూరులోని మా బంధువుల ఇంటిలో ఉంటూ చదువుకోవాల్సి వస్తోంది. హాస్టల్ వసతి కల్పిస్తే బాగుంటుంది. – గంగవైష్ణవి, ఇంటర్ ప్రథమ సంవత్సరం, తాడిపత్రి -
మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి 20న రాత పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 7,8,9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 20న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, మోడల్ స్కూళ్ల ఏడీ శ్రీరాములు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 18 లోపు సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్ల వద్ద దరఖాస్తులు అందజేసి, రశీదు పొందాలన్నారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి శనివారంలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులను పాఠశాల ప్రిన్సిపాళ్లకు అందజేయాలన్నారు. -
ప్రవేశ పరీక్షలు ప్రశాంతం
కర్నూలు సిటీ: గురుకుల, ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 32 స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు 8028 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, 7386 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. డీఈఓ తాహెరా సుల్తానా పెద్దపాడు ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష పత్రాలను త్వరలోనే మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. గురుకుల ప్రవేశాలకు 4710 మంది హాజరు గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5115 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4710 మంది పరీక్షలకు హాజరైనట్లు గురుకుల పాఠశాలల కన్వీనర్ ఉబేదుల్లా తెలిపారు. -
నేరడ మోడల్ స్కూల్లో గ్యాస్ సిలిండర్ లీక్
చెలరేగిన మంటలు పదో తరగతి విద్యార్థినికి స్వల్ప గాయాలు మంటలను ఆర్పిన విద్యుత్ సబ్స్టేషన్ సిబ్బంది నేరడ(కురవి) : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ ఆవరణలోని బాలికల వసతిగృహంలో గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్కు ఉన్న పైప్ లీకై మంటలు చెలరేగిన సంఘటన చోటుచేసుకుంది. కురవి ఎస్సై తీగల అశోక్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.... నేరడ మోడల్ స్కూల్ ఆవరణలో బాలికల వసతిగృహం ఉంది. గురువారం రాత్రి బాలికలకు భోజనాల కోసం వంట మనుషులు వంటలను వండుతున్న క్రమంలో సిలిండర్, స్టౌకు ఉన్న పైప్ లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్కూల్ ఎదురుగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లో పనిచేసే సిబ్బంది పరుగున చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థిని ఝాన్సీకి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన విషయం తెలుసుకున్న కురవి ఎస్సై తీగల అశోక్ హుటాహుటిన వసతిగృహం వద్దకు చేరుకుని విద్యార్థులకు మనోధైర్యం చెప్పారు. ఎంఈఓ ఇస్లావత్ లచ్చిరాంనాయక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ పైప్ లీకై మంటలు చెలరేగినప్పటికీ విద్యుత్ సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
మోడల్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
మోడల్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం వచ్చేనెల 26న ప్రవేశ పరీక్ష కథలాపూర్ (వేములవాడ): రాష్ట్రంలోని మోడల్స్కూళ్లలో వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. జిల్లాలో 13 మోడల్స్కూళ్లు ఉన్నాయి. 2017–18 విద్యాసంవత్సరానికి గాను ఆరోతరగతిలో ఒక్కో స్కూల్లో 100 సీట్ల చొప్పున 1,300 సీట్లును భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు ఆయా పాఠశాలల్లో 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. ఈనెల 17 నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారని కథలాపూర్ మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ నరేశ్ పేర్కొన్నారు. 7,8,9,10 తరగతుల్లో ఖాళీల వివరాలు ఆయా స్కూళ్ల నోటీస్బోర్డుపై అంటిస్తారు. విద్యార్థులకు హాల్టికెట్లు సైతం ఆన్లైన్లోనే జారీచేస్తారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 26న ప్రవేశపరీక్ష ఉంటుంది. దరఖాస్తులు చేసుకోవడం ఇలా... ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకోవాలి. కలర్ పాస్పోర్టు సైజు ఫొటో, ఆధార్కార్డు, కులం, నివాసం, ఆదాయం సర్టిఫికెట్లతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు జిరాక్స్ కాపీని పరీక్ష రాయబోయే స్కూల్లో సమర్పించాలి. ఈనెల 17 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 26న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరోతరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు 7,8,9,10 తరగతుల్లో చేరే విద్యార్థులకు ప్రవేశపరీక్ష ఉంటుంది. మార్చి నెల 9న మెరిట్ లిస్టు, 10న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రదర్శన, 17, 18 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. -
మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత
► 13 మందికి కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స ► వైరస్ వల్లేనన్న చొప్పదండి ఎస్పీహెచ్వో రవీందర్ చొప్పదండి/కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ మోడల్ స్కూల్లో పదమూడు మంది విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం విద్యాలయంలో ప్రార్థన అనంతరం ఒకరి వెంట ఒకరికి విపరీతమైన దగ్గు రావడంతో వారిని ఆటోలలో చొప్పదండి పీహెచ్సీకి తరలించారు. వైద్యులు చంద్రశేఖర్, శ్రీకర్ ప్రాథమిక చికిత్స జరిపారు. విద్యార్థులకు చికిత్స చేసే సమయంలో అక్కడ ఉన్నవారికి కూడా దగ్గు మొదలైంది. ఏదో వైరస్ వ్యాపిస్తోందని గ్రహించి ఆస్పత్రిలో ఉన్న అందరికి మాస్కులు ధరింపజేశారు. విద్యార్థులు దగ్గుతూ ఆయాసపడటంతో మెరుగైన చికిత్స కోసం వైద్యాధికారులు రెండు అంబులెన్సలలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థులకు ప్రమాదమేమీ లేదని తెలిపారు. వారందరిని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యచికిత్స అందిస్తున్నట్లు ఇన్చార్జి ఆర్ఎంవో శ్రీధర్ తెలిపారు. పలువురు విద్యార్థులు సాయంత్రం వరకు కోలుకోగా వారి తల్లిదండ్రులు వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. మరో ఇద్దరు ముగ్గరు విద్యార్థినులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు వారాల క్రితం శిరీష, అంజలి అనే ఇద్దరు విద్యార్థినులకు ఆస్తమా సోకిందని, వారిని వైద్యం కోసం ఇంటికి పంపించామని, పూర్తిగా నయం కాకుండానే తిరిగి కళాశాలకు రావడంతో మిగిలిన వారికి సోకిందని ప్రిన్సిపాల్ వరప్రసాద్చారి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మాడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీహిత, శిరీష, పూజ, సమత, శైలజ, సమత, శిరీష, సమత, అక్షిత, అఖిల, అంజలి, తొమ్మిదవ తరగతి విద్యార్థి కావేరి, ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థి సుష్మిత ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీహెచ్వో రవీందర్ మాడల్ స్కూల్ను సందర్శించి వైరస్ ప్రభావంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. శిరీష, అంజలి ఎక్కువ అస్వస్థకు గురయ్యారని, వారి ద్వారా వైరస్ ఇతరులకు సోకిందని చెప్పారు. శీతాకాలం కావడం, డార్మెటరీలో అపరిశుభ్రత ఉండటం, విద్యార్థులకు సరైన పోషకాలు అందక బలహీనంగా ఉండటం కూడా కారణమని ఆయన పేర్కొన్నారు. ఎంపీడీవో అన్వర్, ఎంఈవో రాజాస్వామి, సీఐ లక్ష్మిబాబు విద్యార్థులకు అందుతున్న చికిత్సను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. -
9న ఆదర్శ హాస్టళ్లను ప్రారంభించాలి
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన హాస్టళ్లను ఈ నెల 9న ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కూళ్లకు అప్రోచ్ రోడ్లు, గ్రౌండ్ లెవెలింగ్, మొక్కల పెంపకంపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులు, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, ప్రిన్సిపాళ్లు, ఏపీడబ్ల్యూడీసీ అధికారులతో సమీక్షించారు. హాస్టళ్లలో సదుపాయాల కల్పనకు ఎంపీడీఓ, ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లతో నమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏపీడీలకు కేటాయించిన పనులు పూర్తి చేయడంలోతీవ్ర నిర్లక్ష్యం చేశారని, ఇకపై నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. 15 రోజుల్లోపు పనుల్లో పురోగతి చూపించాలన్నారు. పనులు జరుగుతున్న స్కూళ్లను డీఈఓ సక్రమంగా తనిఖీ చేయడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, స్కూళ్లలో ఉపాధి నిధులతో చేపట్టిన పనులు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మీరు నా ఓపికను పరీక్షిస్తున్నారని, చేతకాకపోతే మాతో కాదు అని చెబితే మరొకరితో చేయించుకుంటామని అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు తమకేమి పట్టనట్లు వ్యహారిస్తున్నారని, ఇకపై అలాంటి అభిప్రాయాలను మానుకుని పాఠశాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటే సరిపోతుందో తెలియజేయాల్సిన అవసరం మీపై ఉందన్నారు. జిల్లాలోని ఆదర్శ స్కూళ్లను విభజించి డిప్యూటీ డీఈఓలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. హాస్టల్ రన్ కాకపోతే సంబంధిత ప్రిన్సిపాల్, డిప్యూటీ డీఈఓలదే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డిప్యూటీ డీఈఓలు, ఏపీడీలు, పీఆర్ ఏఈఈలు, ఆదర్శ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
ఆదర్శ పాఠశాలల సమస్యలపై స్పెషల్ డ్రైవ్
కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్త ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు డీఈఓ హామీ ఇచ్చినట్లు ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మన్న తెలిపారు. మంగళవారం ఎస్టీయూ నాయకులు డీఈఓను కలిసి పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాళ్లకు సంబంధించిన సంపాదిత సెలవులు సర్వీస్ రిజిస్టర్లో నమోదు.. గోనుగండ, జూపాడుబంగ్లా మోడల్ స్కూల్లో పని చేస్తున్న మహిళ టీచర్ల మాతృత్వ సెలవులు, సి.బెళగల్ స్కూల్లోని తెలుగు టీచర్ జీతం రాని విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వీరి వెంట ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రఫీ, తదితరులు ఉన్నారు. -
విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి గుంటూరు ఎడ్యుకేషన్ : మోడల్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మెరుగుçపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ భవన్లో మంగళవారం నాలుగు జిల్లాల పరిధిలోని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ తరహాలో నాణ్యమైన విద్యను అందించేందుకు స్థాపించిన మోడల్ స్కూళ్లలో విద్యార్థుల నమోదు నూరు శాతం పూర్తి చేసేందుకు పటిష్టచర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్ఈ వంటి ప్రతిభ పరీక్షల్లో ప్రతిభ చూపే విధంగా ప్రోత్సహించడంతో పాటు త్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. మోడల్ స్కూళ్ల పరిధిలో గత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్మీడియెట్లో నమోదై ఫలితాలపై సమీక్షించిన కమిషనర్ వచ్చే ఏడాది పరీక్షల్లో ఆయా పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదు చేయాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు అడిగారు. అనంతరం ఎఫ్ఏ–1, ఎఫ్ఏ–2, ఎస్ఏ–1 పరీక్ష ఫలితాలు, విద్యార్థుల నమోదు, ప్రతిభా అవార్డులు, ఇతర పరిపాలన అంశాలపై చర్చించారు. సమావేశంలో పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి, ఆర్ఎంఎస్ఏ డైరెక్టర్ పి.ప్రభాకర్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్, డీవైఈవోలు తదితరులు పాల్గొన్నారు. -
మో‘డల్’ స్కూళ్లు
– బాలారిష్టాల్లో వసతి గహాల ఏర్పాటు – ఏళ్లుగా సాగుతున్న నిర్మాణాలు – ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీ పోస్టులు ఖాళీలతో విద్యార్థుల ఇక్కట్లు – 172 టీచర్ పోస్టులు ఖాళీ – వివిధ తరగతుల్లో 3,532 సీట్లు ఖాళీ అనంతపురం ఎడ్యుకేషన్ : ఇది గార్లదిన్నెలోని మోడల్ స్కూల్లోని తరగతి గది నిర్మాణం. 2013లో అప్పటి రాష్ట్ర ప్రాథమికశాఖ మంత్రి శైలజానాథ్ ఈ స్కూల్ను ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి దాకా నిర్మాణం జరుగుతూనే ఉంది. బాల, బాలికలకు మరుగుదొడ్లు, రెండో తరగతి గదుల నిర్మాణం పూర్తి కాలేదు. జిల్లాలోని అన్ని మోడల్ స్కూళ్ల పరిస్థితి ఇలానే ఉంది. 2012–13 విద్యా సంవత్సరంలో ప్రతి మండలంలోనూ ఓ మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2013–14లో తొలివిడతగా కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. ఇవి కూడా పూర్తిగా నిర్మాణాలకు నోచుకోలేదు. సౌకర్యాలు కరువు.. హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీలు పడి దరఖాస్తులు చేసుకున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి రెసిడెన్షియల్ విషయంలో చేతులెత్తేశారు. ఆ తర్వాత విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటించారు. అది కూడా అమలు కాలేదు. తాజాగా ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10, 11, 12 తరగతుల విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పిన అధికారులు భవన నిర్మాణాలు పూర్తి కాలేదని చేతులెత్తేశారు. తగ్గుతోన్న విద్యార్థుల సంఖ్య ఆంగ్లమాధ్యమంతో పాటు రెసిడెన్షియల్ వసతి కల్పిస్తామని ప్రకటించడంతో స్కూళ్లలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎగబడ్డారు. ఎమ్మెల్యే, మంత్రులు, చివరకు కేంద్రమంత్రులు కూడా సీటు కోసం సిఫార్సులు చేశారు. ఏడాదికేడాది స్కూళ్లకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. వసతి లేమి, ఉపాధ్యాయుల కొరత కారణంగా తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 25æ స్కూళ్లలో విద్యార్థుల సీట్లు 3,532 ఖాళీగా ఉన్నాయి. ప్రిన్సిపాళ్ల పోస్టులు 19, పీజీటీ 96, టీజీటీ 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ––––––––––––––––––––––––– అక్టోబర్ పూర్తవుతాయి నిర్మాణాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమే. ఈ నెల 1 నుంచి విద్యార్థినులకు వసతిగహాలు ప్రారంభించాల్సి ఉన్నా చాలాచోట్ల నిర్మాణాలు జరగక పెండింగ్ పడింది. అక్టోబర్ నాటికి వసతి గహాలు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. పూర్తిస్థాయిలో హాస్టల్ వసతి కల్పిస్తే ఈ స్కూళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. – శ్రీరాములు, అసిస్టెంట్ డైరెక్టర్ మోడల్ స్కూల్స్ -
ఆదర్శం.. అదుర్స్
వెయిట్ లిఫ్టింగ్లో విద్యార్థుల ప్రతిభ రాష్ట్రస్థాయికి ఎంపిక ధర్మపురి : పట్టణస్థాయి విద్యార్థులకు దీటుగా గ్రామీణ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు ధర్మపురి మండలం మగ్గిడి ఆదర్శ పాఠశాల విద్యార్థులు. వెయిట్లిఫ్టింగ్లో ప్రతిభకనబర్చి ఏకంగా రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. చొప్పదండి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 9న జూనియర్, సబ్జూనియర్లకు జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో ధర్మపురి మండలం మగ్గిడి ఆదర్శ పాఠశాలకు చెందిన ఐదుగురు బాలికలు, ముగ్గురు బాలురు ప్రతిభకనబర్చి జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బుచ్చన్న సహకారం, ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్ శిక్షణతో బహుమతులు సాధించారు. రాష్ట్ర స్థాయికి 8మంది.. పాఠశాలకు చెందిన 8మంది జిల్లా స్థాయిలో పతకాలు సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వారిలో ఆర్.మనూష(జైనా), జి.లావణ్య(నక్కలపేట), విరంచి స్వప్నిక, జ్యోష్నశ్రీ, వెంకటేశ్, పి.యశ్వంత్ (ధర్మపురి), జగన్(నేరెల్ల), కావ్య(చిన్నాపూర్) ఉన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. -
ఉద్యోగాల భర్తీకి 26,27న ఇంటర్వ్యూలు
అల్లాదుర్గం: మోడల్ స్కూల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 26, 27వ తేదీల్లో సంగారెడ్డిని కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పోతులబోగుడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లిక మంగళవారం తెలిపారు. 26న ఫిజికల్ డైరెక్టర్, కంప్యూటర్ ఆఫరేటర్, ఆఫీస్ సబార్డినేటర్ కం స్వీపర్ పోస్టులు, 27న వాచ్మెన్ కం స్వీపర్ పోస్టును భర్తీ చేయడానికి ఏజేసీ చాంబర్లో ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పారు. -
మోడల్ స్కూల్లో ఎమ్మెల్సీ తనిఖీ
గీసుకొండ : మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్ను ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల విద్యార్థుల కోసం హాస్టల్ను ప్రారంభించగా వంటకాలను పరిశీలించారు. స్వయంగా రుచి చూసి సరిగా లేవని, నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుచికరంగా పోషకాలు అందేలా వంటలు వండాలని ప్రిన్సిపాల్ మాధవిని ఆదేశించారు. అనంతరం అదే గ్రామంలో ఉన్న కస్తూరిబా పాఠశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. -
నిర్లక్ష్యం నీడలో ‘ఆదర్శం’
నత్తనడకన పాఠశాల భవన నిర్మాణం నాలుగేళ్లుగా కొనసాగుతున్న పనులు అధికారుల పర్యవేక్షణ లోపం కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం షిప్టింగ్ పద్ధతిలో నష్టపోతున్న విద్యార్థులు హత్నూర: ఆదర్శ పాఠశాల భవన నిర్మాణం నాలుగేళ్లుగా నత్తనడకన కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మండలానికో ఆదర్శ పాఠశాల నిర్మించి మౌలికసదుపాయాలతో విద్యను అందించాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం మూలంగా పనులు ముందుకు సాగడం లేదు. హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామ శివారులో 3 కోట్ల పైచిలుకు నిధులను 2012-13 విద్యా సంవత్సరంలో ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో అప్పటి మంత్రి సునీతారెడ్డి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రారంభంలో సదరు కాంట్రాక్టర్, అధికారులు, హడావిడి చేసి పిల్లర్ల స్థాయి వరకు పనులు చేసి వదిలేశారు. రెండేళ్ళు గడిచిన ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. అనంతరం అధికారుల్లో కదలిక వచ్చి తిరిగి పనులు ప్రారంభించినా నాలుగేళ్ళు గడుస్తున్నా ఇప్పటికి స్లాబ్లెవల్ మాత్రమే పనులు పూర్తయ్యాయి. మూడు సంవత్సరాలుగా ఆదర్శ పాఠశాల ప్రారంభమైనా భవనం అసంపూర్తిగా ఉండడంతో హత్నూరలోని కస్తుర్బాగాంధీ పాఠశాలలో తరగతులు ప్రారంభించారు. మూడేళ్ళుగా విద్యార్థులు షిప్టింగ్ పద్ధతిలోఒకే పూట మోడల్స్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తు వస్తున్నారు. సౌకర్యాలు సరిపోను లేకపోవడంతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మూడో సంవత్సరం ఆదర్శపాఠశాలలో 415మంది విద్యార్థులు, 5నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువును కొనసాగిస్తున్నారు. పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయించాలని పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే మదన్రెడ్డి దృష్టికి , అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు , ప్రజాప్రతినిధులు స్పందించాలని వారు కోరుతున్నారు. షిప్టింగ్ పద్ధతితో నష్టపోతున్నాం పాఠశాల భవనం పూర్తికాకపోవడంతో హత్నూరలోని కస్తుర్భాగాంధీ పాఠశాలల్లో షిప్టింగ్ పద్ధతిలో మధ్యాహ్నం వరకు తరగతులు బోధించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. - మహేష్, విద్యార్థి త్వరగా నిర్మించాలి ఆదర్శ పాఠశాల భవనం త్వరగా నిర్మాణం పూర్తిచేసి మా విద్యార్థులను అక్కడికి తరలించాలి. నత్తనడకన కొనసాగుతుండటం వల్ల విద్యార్థులందరం నష్టపోతున్నాం. పాఠశాల నిర్మాణం చేయాలని రాస్తారోకో సైతం చేశాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. - బిందు, విద్యార్థిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం పాఠశాల భవనం లేక విద్యార్థులు నష్టపోతున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. త్వరగా సొంత భవనాన్ని నిర్మించి ఇస్తే విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది. ఇక్కడ సౌకర్యాలు సరిపోవడం లేదు. - మహమ్మద్రఫీ, ప్రిన్సిపాల్ -
మోడల్ హాస్టళ్ల ప్రారంభంపై నీలినీడలు
– సెప్టెంబర్లో ప్రారంభించాలన్న ప్రభుత్వం – వార్డెన్, ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టని వైనం – సంరక్షణాధికారి బాధ్యతలను తిరస్కరిస్తున్న అధ్యాపకులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మోడల్ స్కూల్ బాలికల హాస్టళ్ల ప్రారంభంపై నీలినీడలు అలుముకున్నాయి. హాస్టళ్లకు పక్కా భవనాలు పూర్తయి ఏడాది గడిచినా వాటిని ప్రారంభించేందుకు సర్కార్ చర్యలు తీసుకోవడం లేదు. వచ్చే సెప్టెంబర్లో ప్రారంభించాలని సర్కారు నిర్ణయించినప్పటికీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం, మంచినీరు, విద్యుత్ సమస్యలు, మైనర్ మరమ్మతులు నిర్వహించాల్సి ఉండడం ఇందుకు కారణం. 33 హాస్టల్ భవనాలు రెడీ.. జిల్లాలోని అత్యంత వెనుకబడిన 33 మండలాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 33 మోడల్ స్కూళ్లను 2012లో ప్రారంభించారు. ప్రారంభ సమయంలోనే బాలబాలికలకు హాస్టల్ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంది. అయితే అప్పట్లో నిధులలేమితో కేవలం స్కూళ్లకు మాత్రమే ప్రారంభం చేశారు. మోడల్ స్కూళ్లన్నీ మండల కేంద్రాలకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం, హాస్టళ్లు లేకపోవడంతో బాలుర సంగతి పక్కనపెడితే బాలికలు ఇతర స్కూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో 2013–14 లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 28 లక్షలతో బాలికలకు మాత్రమే హాస్టల్ సదుపాయాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసకుంది. వీటిని 2014–15లో ప్రారంభించేందుకు నిర్ణయించినా భవనాల నిర్మాణంలో అంతులేని జాప్యం కారణంగా కుదరలేదు. వార్డెన్ బాధ్యతలపై అధ్యాపకుల వ్యతిరేకత.. టీజీటీ, పీజీటీలుగా మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న అధ్యాపకులకు అదనపు బాధ్యతగా వార్డెన్ పోస్టును అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా అందుకు వారు విముఖత ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రతిపాదనను గతేడాదే ప్రభుత్వం అధ్యాపకుల ముందుంచగా 33 హాస్టళ్లకుగాను కేవలం 15 మంది మాత్రమే వార్డెన్గా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. నిరుద్యోగులతో భర్తీ చేయాలి.. మరోవైపు మోడల్స్కూల్ హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. పనిచేస్తున్న లెక్చరర్లకే అదనపు బాధ్యతలుగా హాస్టల్ సమన్వయ పనులను అప్పగిస్తే తీవ్రంగా నష్టపోతామని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. మాకు సమాచారం లేదు: కష్ణయ్య, మోడల్ స్కూల్ ఏడీ సెప్టెంబర్లో హాస్టళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. హాస్టళ్లలో సదుపాయాలు, సిబ్బంది నియామకం, ఇతర విషయాలపై విధివిధానాలేమి రాలేదు. 33 హాస్టళ్లకు భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఆదేశిస్తే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. -
పదికి ఆదర్శం.. ఇంటర్కు అధ్వానం
– మోడల్ స్కూళ్ల దుస్థితి – ఆ వైపునకు రాని ఇంటర్ విద్యార్థులు – రెండేళ్లుగా ఇదే పరిస్థితి – సుదూరంలో స్కూళ్లు – బోధనా సిబ్బంది కొరత ఆళ్లగడ్డ: కార్పొరేట్కు దీటుగా గ్రామీణ పేద విద్యార్థులకు సైతం అన్ని వసతులతో కూడిన ఆంగ్ల మీడియం విద్యను అందించేందుకు ఉద్దేశించిన మోడల్ స్కూళ్లు పదోతరగతి వరకే పరిమితమవుతున్నాయి. పదో తరగతి వరకు సీట్లు భర్తీ అవుతున్నా ఇంటర్కు వచ్చే సరికి విద్యార్థులంతా ఇతర కాలేజీలవైపు వెళ్తున్నారు. ఫలితంగా ఇంటర్ విద్యార్థులు లేక మోడల్ స్కూళ్లు వెలవెలబోతున్నాయి. పది వరకు పర్వాలేదు.. ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో సీటు కోసం పోటీ అధికంగా ఉంటోంది. 75 మార్కులు దాటితే తప్ప సీటు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధ్యాపకులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల నాయకులు, భూస్వాములు సైతం ప్రయివేటు పాఠశాలలను కాదని తమ పిల్లలను మోడల్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇంటర్కు ఆదరణ కరువు పది వరకు ఇంత ప్రాధాన్యం ఉన్న మోడల్ స్కూళ్లకు ఇంటర్ మీడియట్కు వచ్చే సరికి ఆదరణ కరువైంది. పది వరకు ఇక్కడే చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం ఇంటర్ మీడియట్ను అక్కడే చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండేళ్లుగా ఆయా స్కూళ్లలో ఇంటర్ విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్కు దాటకపోవడం ఇందుకు నిదర్శనం. రుద్రవరం మోడల్ స్కూల్లో ఇంటర్కు ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం గమనార్హం. అన్ని పాఠశాలల్లో నాలుగు గ్రూపులకు కలిపి 20 సీట్ల ప్రకారం 80 సీట్లు ఉన్నాయి. ఇలా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలను తీసుకుంటే 160 సీట్లు అందుబాటులో ఉండగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఏ మోడల్ స్కూలు చూసినా ఇంటర్ విద్యార్థుల సంఖ్య 30 మందికి మించడం లేదు. ఎంపీసీ, బైపీసీకే పరిమితం ఇంటర్ మీడియట్ విషయానికొచ్చేసరికి పాఠశాలల్లో బోధనా సిబ్బంది సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఇటువైపు వచ్చేందుకు విద్యార్థులు సంకోచిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులుండగా దాదాపు అన్ని స్కూళ్లలో అధ్యాపకుల కొరత కారణంగా ఎంపీసీ, బైపీసీ మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో మిగతా గ్రూపులపై ఆసక్తి ఉన్న వారు దూరమవుతున్నారు. వర్షం వస్తే నడవలేం: విష్ణువర్ధన్, జూనియర్ ఇంటర్ పొలాల్లో స్కూలు బిల్డింగ్ కట్టించారు. రోడ్డు వేయకపోవడంతో చిన్నపాటి వర్షం వచ్చినా దారి బురదగా మారుతోంది. దీంతో ఇబ్బంది పడుతున్నాం. బాడుగ ఇంట్లో ఉంటున్నాం: శిరీష, సీనియర్ ఇంటర్ మాది అహోబిలం. హాస్టల్ ఉంటుందని సారోళ్లు చెబితే ఇంటర్కు ఇక్కడే చేరాను. సంవత్సమైనా హాస్టల్ తెరవలేదు. రోజూ ఊరు నుంచి వచ్చేందుకు వేళకు బస్సులు లేకపోవడంతో అమ్మతో కలిసి ఇక్కడే ఇళ్లు బాడుగకు తీసుకుని ఉంటున్నాం. రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తే ఫలితం ఉంటుంది: డాక్టర్ మహమ్మద్ఇష్మాయిల్, రుద్రవరం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనేక స్కూళ్లలో బోధనకు కాంట్రాక్టు సిబ్బందే దిక్కయ్యారు. అలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియమిస్తే విద్యార్థులను ఇంటర్కు ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. హాస్టల్ ఏర్పాటు చేయాలి: ఇప్తెకార్హుస్సేన్, ఆళ్లగడ్డ ప్రిన్సిపాల్ బాలికలను బస్సులు, ఆటోల్లో పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. హాస్టల్ ప్రారంభించి వసతి కల్పిస్తే ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. ఇక్కడే 10 వరకు చదువుకున్న బాలికలందరూ ఇంటర్లో చేరే అవకాశం ఉంది. పాఠశాలల్లో ఉండాల్సిన సిబ్బంది, విద్యార్థుల వివరాలు.. మండలం – ఉండాల్సిన అధ్యాపకులు– ఉన్న రెగ్యులర్ అధ్యాపకులు – పార్ట్టైం టీచర్లు – 5 నుంచి 10 వరకు విద్యార్థులు – ఇంటర్ రుద్రవరం – 21– 6 – 7 – 30 – 0 – 0 ఆళ్లగడ్డ – 21 – 7 – 10 – 350 – 24 – 6 ఉయ్యలవాడ– 21 – 6 – 11 – 380 – 30 – 12 -
అభివృద్ధిని అడ్డుకుంటే ఎవరినీ వదిలిపెట్టను
పగిడ్యాల: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఎవ్వరిని వదిలి పెట్టమని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరించారు. ఆదివారం మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో మోడల్ పాఠశాల నిర్మాణం పూర్తి చేసిందన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనుల్లో కూడా పలు అడ్డంకులు వచ్చాయని అయినా పనులను ఆగష్టులోగా పూర్తి చేసి, రెండో పంటకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. వెనుకబడిన కర్నూలు జిల్లాను అభివృద్ధిలో నడిపించి అగ్రగామిగా నిలిపేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలన్నారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నెల రోజులుగా పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని స్వాములు అనే వ్యక్తి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. స్పందించిన ఆయన విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్డీవో రఘుబాబుకు ఆదేశించారు. కార్యక్రమంలో పీడీ రామకృష్ణ, డీఈవో రవీంద్రానాథ్రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్ కుమారస్వామి, ఎంఈవో రంగారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్లో నేటి నుంచి ప్రవేశాలు
మర్రిపాడు : మండలంలోని నందవరంలో నూతనంగా నిర్మించిన మోడల్ పాఠశాలలో సోమవారం నుంచి ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శారదకుమారి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ స్కూల్లో ప్రవేశాల కోసం ఇటీవల ప్రవేశపరీక్ష నిర్వహించామన్నారు. అందులో ఉత్తీర్ణులైన విద్యార్థుల జాబితాను ప్రచురించామని చెప్పారు. జాబితాలో పేర్లు ఉన్న విద్యార్థులు తమ టీసీలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్కార్డులను సోమవారం నుంచి బుధవారం లోగా అందచేయాలని సూచించారు. అలాగే మోడల్స్కూల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 21వ తేదీన జరిగే డెమో తరగతులకు హాజరుకావాలన్నారు. అదే రోజున ఉపాధ్యాయుల ఎంపిక కూడా జరుగుతుందని తెలియజేశారు. -
ప్రశాంతంగా ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష
-225మంది 198 హాజర్, 27 మంది గైర్హాజర్ పెద్దేముల్ (రంగారెడ్డి జిల్లా) పెద్దేముల్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలల్లో అదివారం జరిగిన ఆదర్శపాఠశాల(మెడల్ స్కూల్) ప్రవేశ పరీక్ష ప్రశాతంగా ముగిసింది. మొత్తం 225 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా 198మంది పరీక్షకు హాజరైనట్ల్లు మోడల్ స్కూల్ ప్రిన్సిఫాల్ రాఘవేందర్ తెలిపారు. 6వ తరగతిలో 99మందికి 88మంది,7వ తరగతిలో 66మందికి 58మంది,8వ తరగతిలో 62కు 52మంది విద్యార్థులు ప్రవేశ పరిక్ష రాసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ శాంతప్ప చెప్పారు. ఉదయం 9గంటల నుండే విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్ద బారులు తీరారు. -
మోడల్ స్కూల్లో ‘అత్తెసరు’
పొందూరు: మండల పరిధిలోని వావిలపల్లిపేట సమీపంలో ఉన్న మోడల్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం బాగోలేకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. ఉడకని అన్నం పెట్టడంతో విద్యార్థులు పారబోశారు. కొంత మంది విద్యార్థులు కొంచెం అన్నం తిని అర్ధాకలితో ఉండిపోయారు. మరి కొంత మంది విద్యార్థులు పూర్తిగా అన్నం తినకుండా పారిబోసేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకు 349 మంది విద్యార్థులు ఉండగా వారంతా బుధవారం ఆకలిని తట్టుకోలేకపోయారు. ఇలా పలుమార్లు ఉడకని అన్నం పెట్టడం, కూరలు బాగోలేకపోవడం, రుచిగా వండకపోవడం తదితర సమస్యలు ఇక్కడ సర్వసాధారణంగా జరుగుతుండడంతో పలువురు విద్యార్థులు నేరుగా ఇంటి నుంచి మధ్యాహ్న భోజనాన్ని తెచ్చుకొంటున్నారు. ఎన్ని సార్లు చెప్పినా మధ్యాహ్న భోజన నిర్వాహకుల్లో మార్పు రాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంబారు, కూరలు బాగోలేవని వంట నిర్వాహకులను విద్యార్థులు పలుమార్లు ప్రశ్నిస్తే తింటున్న వారందరికి బాగుంది...మీకేనా బాగోలేదు అని కోపగించుకొనే వారని చెప్పారు. బుధవారం మధ్యాహ్న భోజనం మరీ అధ్వానంగా ఉండడంతో ఆకలిని తట్టుకోలేని విద్యార్థులు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్కు బి.శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్ఛార్జి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మళ్లీ అన్నం వండించారు. అప్పటికి సమయం 2.30 గంటలు అయింది. వంట నిర్వాహకులతో మాట్లాడగా కొత్త బియ్యం కావడంతో తేడా వచ్చిందని, దానిని గుర్తించలేకపోయామని చెప్పారు. అన్నం తినలేకపోతున్నాం... పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోవడం లేదు. ఎన్ని సార్లు చెప్పినా వంటలో మార్పు రాలేదు. సర్దుకుపోయి తింటుం డడంతో ఆరోగ్యం పాడైంది. దీంతో రోజూ పాఠశాలకు మధ్యాహ్న భోజనాన్ని ఇంటి నుంచి తెచ్చుకొంటున్నాను. మా స్నేహితులంతా ఈ రోజు ఆకలితో ఉన్నారు. - కోరుకొండ రమ్యశ్రీ, తొమ్మిదో తరగతి. -
మోడల్ స్కూల్ను పరిశీలించిన డీఈవో
కారేపల్లి: ఖమ్మం జిల్లాలోని మోడల్ స్కూల్ను జిల్లా విద్యా శాఖాధికారి (డీఈవో) రాజేష్ బుధవారం సందర్శించారు. కారేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులతో డీఈవో మాట్లాడుతూ... టీచర్ల బోధనా విధానంపై ప్రశ్నలు అడిగారు. వసతిగృహాన్ని సందర్శించిన అనంతరం పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలోని పాఠశాలలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సిబ్బందికి డీఈవో సూచించారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం
ఆత్మకూర్ (ఎస్) : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం వండిన భోజనం వికటించి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే పాఠశాలలో జూన్ 24వ తేదీన కూడా ఇలాగే జరిగి దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మోడల్ స్కూల్లో 364 మంది విద్యార్థులకు శుక్రవారం 360 మందికి సరిపడ భోజనం వండారు. భోజన సమయంలో ముందుగా 8,9,10వ తరగతి విద్యార్థులు మొదటగా భోజనం చేశారు. కాసేపటి తర్వాత వాంతులు చేసుకోవడంతో మిగతావారు భోజనం వదిలేశారు. గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థులను హుటాహుటిన విద్యార్థి సంఘాల సహకారంతో 108 అంబులెన్స్, ఆటోలో ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యమందించారు. వారిలో తీవ్రంగా అస్వస్థతకు గురైన ఎనిమిది మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం సూర్యాపేటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని మండల వైద్యాధికారి కె.రామకృష్ణ తెలిపారు. ఇదిలావుండగా పాఠశాలలో వండిన సోరకాయ చెడిపోయిందని, కూరలో కారం అధికంగా వేయడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. గతంలో గతంలో అస్వస్థతకు లోనైనప్పుడు కూడా సోరకాయ కూరనే వడ్డించడంతో నాసిరకమైన కూరగాయలు వాడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. -
నేడు మోడల్ స్కూల్ ఎంట్రెన్స్
సిద్దిపేట రూరల్: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి గాను ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ఎంట్రెన్స టెస్ట్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని 26 మోడల్ స్కూళ్లలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల మంది ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులను గంట ముందు నుంచే లోనికి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని మోడల్ స్కూల్ డిప్యూటీ కన్వీనర్ భాస్కర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆయా కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు వీలుగా ఫర్నిచర్ అందుబాటులో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు... సిద్దిపేట మండలం ఇర్కోడ్ మోడల్ స్కూల్లో పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే వారి కోసం స్థానిక పాత బస్టాండ్లో రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఇర్కోడ్లో 368 మంది అర్హత పరీక్ష రాయనున్నట్టు ఆయన చెప్పారు. -
14న మోడల్ స్కూళ్లకు ప్రవేశ పరీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2015-16 విద్యా సంవత్సరానికి గాను 6వ తర గతిలో ప్రవేశాల కోసం పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రత్యేక కేటగిరీ పాఠశాలలుగా గుర్తించడంతో ప్రవేశ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టింది. గతంలో లాటరీ ద్వారా ప్రవేశాలు చేపట్టడం వల్ల ప్రతిభావంతులకు సీట్లు రావడం లేదన్న వాదనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 177 మోడల్ స్కూళ్లలో 14,160 సీట్ల కోసం పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 50లు ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించాలని పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ చిరంజీవులు తెలిపారు. ఫీజు చెల్లించాక విద్యార్థులు http://telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇదీ ప్రవేశాలు షెడ్యూలు ఈ నెల 2 నుంచి: ఫీజులు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణ 8వ తేదీ వరకు: ఫీజు చెల్లింపునకు చివరి గడువు 9వ తేదీ: దరఖాస్తులు సబ్మిషన్ చివరి గడువు 14వ తేదీ: ప్రవేశ పరీక్ష.(ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆయా మోడల్ స్కూల్స్/మండల కేంద్రాల్లో). -
స్కూలు ఫీజు కట్టలేదని.. గెంటేశారు..!
-
ఉద్యోగాలిప్పిస్తానని మోసం
ఎల్కతుర్తి : మోడల్ స్కూల్(ఆదర్శ పాఠశాల)లో కంప్యూటర్ ఆటరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన ఓ వ్యక్తి 16 మంది నుంచి రూ. లక్షల్లో దండుకున్నారు. తమ ఉద్యోగాల మాటేమిటని అడిగితే ఇదిగో.. అదుగో అంటూ పది నెలల పాటు తిప్పుకున్నాడు. చివరకు కోర్టు నుంచి ఐపీ నోటీలు పంపాడు. దీంతో బాధితులు హతాశులయ్యూరు. చివరకు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసానికి తెర లేచింది ఇలా బాధితుల కథనం ప్రకారం.. హుస్నాబాద్, ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ మోడల్ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆయూ పోస్టులు ఇప్పిస్తానంటూ జూలపల్లి మండల కేంద్రానికి చెందిన పాటుకుల మహేశ్, ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన ఎర్రోల్ల చైతన్యకుమార్ సాయంతో 16 మంది వద్ద (రూ. 20వేల నుంచి రూ. 2లక్షల వరకు)డబ్బులు తీసుకున్నాడు. తాను డబ్బు తీసుకున్నట్లు ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. తమ ఉద్యోగాల సంగతేంటని బాధితులు ప్రశ్నిస్తే ఇదిగో అదిగో అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ పది నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు ఇటీవల కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపించాడు. నోటీసులు అందుకున్న వారిలో కొంతమందికి సాక్షిగా వ్యవహరించిన వ్యక్తిసైతం ఉండడం గమనార్హం. తేరుకున్న బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బయటపడ్డ బాధితులు మోసపోయిన వారిలో ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన గొడిశాల పరమేశ్ రూ. 40వేలు, దామెర గ్రామానికి చెందిన సోలెంకి రాజేశ్వర్రావు తన ఇద్దరు కుమారుల కోసం రూ. 1.85లక్షలు, హుజూరాబాద్కు చెందిన పి. కవిత రూ.1.50 లక్షలు, కొమ్ముల రమేశ్ రూ. 60వేలు, మంతుర్తి రాజయ్య, మంద అశోక్, ఐత సంపత్, గబ్బెటి శ్రీలత, చిట్యాల సుమలత వద్ద నుంచి తలా రూ.20 వేలు తీసుకోగా వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం జయగిరికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. నోటీసులు అందుకుంది వీరే నోటీసులు అందిన వారిలో జూలపల్లికి చెందిన జువ్వాజి చంద్రమౌళి, మహ్మద్ అబ్దుల్ నబీ, ఎర్రోల్ల చైతన్య (మధ్యవర్తి), సోలెంకి రాజేశ్వర్రావు, గబ్బెటి శ్రీలత, మంతుర్తి రాజయ్య, మంద అశోక్, రేణుకుంట్ల సాంబరాజ్, మాడ్గుల మానస, మహ్మద్ మోహిన్, ఐత సంపత్, కొమ్ముల రమేశ్, గొడిశాల పరమేశ్, ఇల్లందుల సంపత్కుమార్, చిట్యాల సుమలత ఉన్నారు. -
చదువుల 'బడి' రుణం తీర్చుకున్నారిలా..!
-
ఈ నెలాఖరులో మోడల్ స్కూల్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో నిలిచిపోయిన పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ ను ఈ నెలాఖరులో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. భర్తీ ప్రక్రియ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను 25 లేదా 26 తేదీల్లో జారీ చేయనున్నారు. ఏడాదిగా పెండింగ్లో ఉన్న ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని మోడల్ స్కూ ల్స్ ఎక్స్అఫీషియో పీడీ జగదీశ్వర్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీలో తెలుగు మీడియం అభ్యర్థులను అనుమతించని కారణంగా న్యాయ వివాదం ఏర్పడి ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీంతో 1000 పీజీటీ, 600 వరకు టీజీటీ పోస్టుల భర్తీ ఆగిపోయింది. -
పేరుకే ఆదర్శం
నిజాంసాగర్: జిల్లాలోని 15 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను రెండేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి రూ. 3.2 కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఈ పాఠశాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సదరు పాఠశాల ల్లో ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించాలి. జిల్లాలోని 15 మండలాల్లో గతేడాది నుంచి తరగతులను ప్రారంభించారు. మొదట్లో 6, 8వ తరగతితోపాటు ఇంటర్ ప్రథమ తరగతులకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులను లాటరీ పద్ధతిన పాఠశాలల్లో చేర్చుకున్నారు. ప్రస్తుతం రెండో సంవత్సరం ఆదర్శ పాఠశాలల్లో పదోతరగతి మినహా ఆరు నుంచి ఇంట ర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. ఆద ర్శ పాఠశాలల్లో తరగుతులవారీగా విద్యాబోధన చేపట్టేందుకు సరపడా ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్కు అధ్యాపకుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్ట లేదు. దీంతో ఆదర్శ పాఠశాలల్లో బోధించేం దుకు ఉపాధ్యాయులు, ఆధ్యాపకుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యాబోధనకు గాను ఒక్కొక్క మోడల్ పాఠశాలల్లో 20 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలోని పలు మోడ ల్ పాఠశాలల్లో ఏడెనిమి మంది ఉపాధ్యాయులు మాత్రమే భర్తీ అయ్యారు. ఆదర్శ పాఠశాలలకు ఉపాధ్యాయుల ఎంపిక పూర్తయినా అప్పటి ప్రభుత్వం వారిని పాఠశాలల్లో నియమించ లే దు. నిజాంసాగర్, మద్నూర్, కొత్తాబాది, ఎల్లారెడ్డి, గాందారి, సదాశివనగర్, రెంజల్ తదితర మండలాల్లోని ఆదర్శ పాఠశాలలు సమస్యలతో సతమవుతున్నాయి. ఆదర్శానికి ఆరు వందలు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటితో పాటు మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. అలాగే సబ్జెక్టులవారిగా ఉపాధ్యాయులను ప్రభుత్వం భర్తి చేయకపోవడంతో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. గతేడాది ఆరకొర వసతులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరతతో విద్యాసంవత్సరాన్ని నెట్టుకొట్చారు. కానీ ఈ విద్యాసంవత్సరంలో తరగతులు పెరిగినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులపై భారం పడుతోంది. ఈ విషయమై పాఠశాల నిర్వహకులు విద్యార్థుల తల్లితండ్రులతో ఇటీవల సమావేశమై పాఠశాలలో కనీస వసతులతోపాటు ప్రైవేట్ ఉపాధ్యాయుల నిమాయకం కోసం ఒక్కొక్క విద్యార్థి రూ. 600 చెల్లిం చాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లిస్తేనే వసతులు కల్పించడంతోపాటు ప్రైవేట్ టీచర్ల నియమించొచ్చని నిర్వహకులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న బోజనం తింటున్నా తాగడానికి మంచినీటి కొరత వేధిస్తోంది. ఈ సమస్య తీర్చడానికి విద్యార్థులు డబ్బులు చెల్లించాలని నిర్వహకులు డిమాండ్ చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని విద్యార్థులను పంపిస్తే ఆరువందలు చెల్లిం చడం ఇబ్బందికరంగా మారుతోందని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పన, విద్యాబోధనకు ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని తల్లితండ్రులు కోరుతున్నారు. -
రోడ్డెక్కిన మోడల్ స్కూల్ విద్యార్థులు
కలిగిరి: కలిగిరి సమీపంలోని కమ్మ వారిపాళెంలో మోడల్ స్కూల్ వద్ద నెల్లూరు-పామూరు వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సులను ఆపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు శుక్రవారం పాఠశాల ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై 2 గంటలపాటు రాస్తారోకో నిర్వహించా రు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ బస్సు సౌకర్యం ఉన్న మార్గంలో కూడా ఆర్టీసీ బస్సులను నిలపడం లేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆటోలను బాడుగకు మాట్లాడుకుని పాఠశాలకు వస్తున్నామన్నారు. గురువారం ఆటో బోల్తాపడి సహచర విద్యార్థులు ఐదుగురు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు సక్రమంగా నిలిపి ఉంటే వారికి ఆ దుస్థితికి కలిగేది కాదన్నారు. బస్లో విధులు నిర్వహించే కండక్టర్ సుధాకర్ తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని నాగిరెడ్డిపాళేనికి చెందిన పలువురు విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు పాసులు లాక్కుంటున్నాడని, అసలు మిమ్మల్ని బస్సులో ఎవరూ ఎక్కమన్నారంటూ దుర్భాషలాడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్ ప్రవర్తనకు నిరసగా ప్లకార్డులు ప్రదర్శించారు. పాఠశాలల వేళల్లో బస్సులు ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు రాస్తారోకోకు సంఘీభావం తెలిపారు. నెల్లూరు డిపో మేనేజర్ సుబ్రమణ్యం ఫోన్లో మాట్లాడుతూ కలిగిరి మోడల్ స్కూల్ వద్ద సమస్య ఇంతవరకు తమ దృష్టికి రాలేదన్నారు. సంగం - కలిగిరి మార్గంలో ఎక్కడ చెయ్యి ఎత్తినా బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
విద్యార్థుల ఆటో బోల్తా
కలిగిరి: ఆటోల దూకుడు ప్రయాణికులకే కాదు.. పాఠశాల విద్యార్థులకూ ప్రమాదాలు తప్పడం లేదు. విద్యార్థులను జాగ్రత్తగా తీసుకు రావాల్సిన ఆటో డ్రైవర్లు ఇవేమి పట్టించుకోకుండా ఇష్టానుసారం మితిమీరిన వేగంతో నడుపుతుండటంతో విద్యార్థులు ప్రమాదాల భారిన పడుతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న ఆటో తిరగబడి విద్యార్థులు గాయపడిన సంఘటన గురువారం కలిగిరిలో చోటుచేసుకుంది. కలిగిరి సమీపంలోని కమ్మవారిపాళెంలో మోడల్ స్కూల్ నుంచి విద్యార్థులను ఇళ్లకు తీసుకువెళుతున్న ఆటో బోల్తాపడింది. ఈ సంఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మోడల్ స్కూల్ నుంచి 8 మంది విద్యార్థులు ఆటోలో వస్తున్నారు. ఆటో డ్రైవర్ ఫిరోజ్ మీతిమీరిన వేగంతో నడుపుతుండటంతో కేజీబీవీ పాఠశాల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కలిగిరికి చెందిన 6వ తరగతి విద్యార్థి పెద్ది వంశీ, 9వ తరగతి విద్యార్థి శెట్టి రుచితకు తీవ్ర గాయాలవ్వగా, 8వ తరగతి చదువుతున్న రాజనాల ప్రత్యూష, ఆవుల మానస, ఆవుల పూర్ణిమ గాలయాలపాలయ్యారు. స్థానికులు గాయపడిన విద్యార్థులను మరో ఆటోలో కలిగిరిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆర్టీసీ బస్సులు పాఠశాల వద్ద ఆపకపోతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆటోలను నెల అద్దెకు మాట్లాడుకుని విద్యార్థులను పంపుతుంటారు. ప్రమాదం అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోల్లో పంపాల్సి వస్తుందని, అధికారులు స్పందించి పాఠశాల వద్ద బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైందని తెలుసుకున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ప్రజలు వైద్యశాల వద్దకు చేరుకున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో రైలు ఢీకొన్న సంఘటనను టీ వీల్లో చూస్తున్న ప్రజలు ఈ ప్రమాదం విషయం తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. గాయపడిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై దాసరి రాజారావు సంఘటన స్థలానికి చేరుకొని ఆటోను స్వాధీనం చేసుకొని పోలిస్స్టేషన్కు తరలించారు. అనంతరం వైద్యశాలకు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
మోడల్!
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో మోడల్ స్కూళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈ స్కూళ్లు సమస్యలకు ‘మోడల్’గా నిలుస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంతో పాటు రెసిడెన్షియల్ సౌకర్యం కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించడంతో ఈ స్కూళ్లలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎగబడ్డారు. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు చేసుకున్నారు. లాటరీ పద్ధతిలో సీట్లను భర్తీ చేశారు. కొన్ని స్కూళ్లలో అరకొర ఖాళీలు ఉండడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు కేంద్ర మంత్రులు కూడా సిఫారసులు చేశారంటే వీటి పట్ల ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఏడాది కూడా తిరక్కుండానే ఈ స్కూళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం ఉపాధ్యాయుల కొరత. విద్యార్థులు ఫుల్గా ఉన్నా.. ఉపాధ్యాయులు మాత్రం తగినంత మంది లేరు. ఫలితంగా విద్యార్థులు ఒక్కొక్కరుగా టీసీలు తీసుకుని బయటకు వస్తున్నారు. ఒక్కో మోడల్ స్కూల్లో 6-9 తరగతుల వరకు 320 మంది విద్యార్థులు ఉండాలి. ఈ లెక్కన జిల్లాలోని 25 పాఠశాలల్లోనూ 320 మంది చొప్పున విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. అయితే.. ప్రస్తుతం అగళిలో 280 మంది, తాడిపత్రి 265, ధర్మవరం 289, ఆమడగూరులో 286 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రతి కళాశాలలోనూ 80 మంది ఉండాలి. అయితే.. రామగిరిలో 11 మంది, అమడగూరు 11, గుత్తి 21, తాడిపత్రిలో 24 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వాటిలోనూ ఇదే పరిస్థితి. మొదటి నుంచి ఇంతే... వాస్తవానికి 2012-13 విద్యా సంవత్సరంలోనే మోడల్ స్కూళ్లు ప్రారంభిస్తామని గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే.. రాష్ట్రంలో ఎక్కడా ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు 2013-14 విద్యా సంవత్సరంలో తొలివిడతగా జిల్లాలో 25 పాఠశాలలను ప్రారంభించారు. అమ్మాయిలకు రెసిడెన్షియల్ వసతి ఉంటుందని ప్రకటించారు. ఏ ఒక్క పాఠశాలలోనూ వసతి కల్పించడం లేదు. ఇప్పటికీ జిల్లాలో ప్రారంభమైన 25 మోడల్ స్కూళ్లలో ఏ ఒక్క భవనమూ పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. ప్రతి భవనంలోనూ పనులు పెండింగు ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రవేశాలు సరే.. తరగతులేవీ? మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు జరిగాయి కానీ తరగతులు మాత్రం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు ఉపాధ్యాయుల కొరతే కారణం. 25స్కూళ్లకు గాను 25 మంది ప్రిన్సిపాళ్లు ఉండాల్సివుండగా.. 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక టీజీటీ పోస్టులు 81 ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే.. తెలుగు 13, ఇంగ్లిష్ 14, గణితం 13, హిందీ 17, సైన్స్ 10, సోషియల్ 14 ఖాళీలు ఉన్నాయి. పీజీటీలకు సంబంధించి 83 ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా.. ఇంగ్లిష్ 11, గణితం 7, ఫిజికల్ ైసైన్సు 10, కెమిస్ట్రీ 10, బాటనీ 10, జువాలజీ 10, ఎకనామిక్స్ 7, సివిక్స్ 7, కామర్స్ 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నాన్టీచింగ్ స్టాఫ్ ఎప్పుడొస్తారనే విషయం అధికారులకే తెలియడం లేదు. ఉపాధ్యాయులు లేకపోవడంతో చాలా స్కూళ్లలో అన్ని తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులు కావలెను! జిల్లాలోని 25 మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం సీట్లు భర్తీ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నుంచి 28 లోపు ఆయా స్కూళ్లలో విద్యార్థులు నేరుగా చేరాలని సూచించారు. నేడు ప్రిన్సిపాళ్లతో మంత్రి సమావేశం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శనివారం అనంతపురంలో సమావేశం ఏర్పాటు చేశారు. కళాశాలలు, మోడల్ స్కూళ్ల సమస్యలు, అడ్మిషన్లు, మౌలిక వసతులు తదితర వాటిపై చర్చించనున్నట్లు తెలిసింది. -
సమస్యల్లోనే ‘ఆదర్శ’మా?
నిజాంసాగర్ : కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదర్శ పాఠశాల భవన సదుపాయాన్ని నిర్మించినా.. కనీస వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకూ అవస్థలు తప్పడం లేదు. ఈ విద్యాసంవత్సరంలో తరగతులు పెరిగినా ఉపాధ్యాయుల సంఖ్యలో మార్పు లేకపోవడం తో విద్యాబోధనపైనా ప్రభావం పడుతోం ది. ప్రయోగశాల ఉన్నా.. శిక్షకులు లేరు. దీంతో రూ. 3.2 కోట్లు వెచ్చించి నిర్మించిన మోడల్ స్కూల్ భవనం.. సమస్యల్లోనే ఆదర్శంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడం కోసం రెండేళ్ల క్రితం ప్రభుత్వం మాడల్ పాఠశాలలను ప్రవేశపెట్టింది. మండలానికొకటి చొప్పున ఆదర్శ పాఠశాలలను మంజూరు చేసింది. ఒక్కో పాఠశాల భవన సముదాయ నిర్మాణానికి రూ. 3.2 కోట్ల చొప్పున కేటాయించింది. మొదటి విడతలో గత విద్యా సంవత్సరంలో జిల్లాలోని 15 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు విద్య అందించనున్నారు. గతేడాది ఆరు, ఎనిమిది, ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభించారు. ఒక్కో తరగతిలో 80 సీట్లున్నాయి. భారీగా దరఖాస్తులు రావడంతో లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేసి సీట్లు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు పెరిగాయి. 6, 7, 8, 9, ఇంటర్ ప్రథమ, ద్వితీయ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే తరగతులకు అనుగుణంగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. అన్ని తరగతుల్లో పూర్తిస్థాయి విద్యాబోధనకుగాను ఒక్కో మోడల్ స్కూల్లో 20 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలోని చాలా స్కూళ్లలో ఎడెనిమిది మందే ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. దీంతో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. ప్రయోగశాల ఉన్నా.. ఆదర్శ పాఠశాలలో ప్రభుత్వం ల్యాబ్ సౌకర్యం కల్పించింది. అయితే శిక్షకులు లేకపోవడంతో ఇది నిరుపయోగంగానే ఉంటోంది. అసౌకర్యాలే.. నిజాంసాగర్ సమీపంలో నిర్మించిన మోడల్ పాఠశాలలో టాయ్లెట్స్ నిరుపయోగంగా ఉన్నాయి. నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం సైతం లేదు. దీంతో ఇంటినుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి మాడల్ స్కూల్ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
మోడల్
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్లైన్ : గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మోడల్ స్కూళ్లు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఆశయం బాగున్నా ఆచరణలో మాత్రం వీటి పరిస్థితి ‘మూడడుగులు ముందుకు.. ఆరడులు వెనక్కు’ అన్న చందంగా తయారైంది. ఫలితంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారింది. పేద పిల్లలు ప్రతిభ ఉండి కూడా సరైన ప్రోత్సాహం లేక చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉత్తమ విద్య, అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా అలాంటి జాడ కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ‘మోడల్’ చదువు ప్రశ్నార్థకంగా మారింది. అడుగడుగునా నిర్లక్ష్యం ఇతర విద్యా సంస్థలకు మోడల్గా నిలవాల్సిన ఈ స్కూళ్లు ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ‘డల్’ స్కూళ్లుగా మారాయి. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తుత్తివేనని ఈ స్కూళ్ల విషయంలో మరోసారి తేట తెల్లమవుతోంది. ప్రతి మండలంలోనూ ఓ మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 63 మండలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2012-13 విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2013-14 సంవత్సరానికి వాయిదా వేశారు. ఆ ఏడాది కూడా తొలివిడతగా కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. పోనీ ఈ 25 స్కూళ్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయ్యాయా అంటే అదీ లేదు. ఆగమేఘాల మీద ప్రారంభించి అద్దె భవనాల్లో స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ స్కూళ్ల భవనాలు పూర్తి స్థాయి నిర్మాణాలకు నోచుకోలేదంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 38 మండలాల్లో ఈ ఏడాది (2014-15) మోడల్ స్కూళ్లు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే నిధుల కొరతతో కొన్ని మండలాల్లో భవన నిర్మాణాలు పెండింగ్పడగా, మరికొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు. బాలారిష్టాల్లో తొలి విడత స్కూళ్లు తొలివిడతగా గతేడాది జిల్లాలో అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, హిందూపురం, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కణేకల్, నల్లచెరువు, పామిడి, పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రాయదుర్గం, శెట్టూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడి కి, యల్లనూరు మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. స్కూళ్లు ప్రారంభమై ఏడాది అయినా బాలరిష్టాలు ఎదుర్కొంటున్నాయి. కనీస వసతులు కరువయ్యాయి. కనీసం తాగునీటి సదుపాయం చాలా స్కూళ్లలో లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఫర్నీచరు కరువైంది. వసతి సదుపాయం కరువు మోడల్ స్కూళ్లలో 6,7,8 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీలు పడి దరఖాస్తు చేసుకున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి రెసిడెన్షియల్ విషయంలో చేతులెత్తేశారు. దీంతో మండల పరిధిలోనే దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకోలేక, అలాగని వదిలి పెట్టలేక తలలు పట్టుకుంటున్నారు. చాలాచోట్ల తల్లిదండ్రులు అద్దె ఆటోలను మాట్లాడి రోజూ పిల్లలను బడికి పంపుతున్నారు. ఉదాహరణకు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి, కనుముక్కల, ఓబుళంపల్లి, వెంకటాంపల్లి, పులేటిపల్లి తదితర గ్రామాల నుంచి వంద మంది దాకా విద్యార్థులు రోజూ ఆటోల్లో స్కూల్కు వస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా గతేడాది ప్రతి స్కూల్లోనూ 20 శాతం అదనంగా విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం అన్ని స్కూళ్లలోనూ కలిపి 100 సీట్లకు పైగా ఖాళీలు ఉండడం విశేషం. ఈ‘సారీ’ ప్రవేశాలు లేవు వాస్తవానికి ఈ ఏడాది (2014-15 విద్యా సంవత్సరం) 38 మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఏ ఒక్క మండలంలోనూ ప్రారంభం కాని పరిస్థితి. 6,7,8 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశం కల్పించాల్సి ఉంది. స్కూళ్లు ప్రారంభానికి నోచుకోని కారణంగా గతేడాది ప్రారంభమైన 25 స్కూళ్లలో కేవలం ఆరో తరగతికి మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. సీట్లు 2 వేలు.. దరఖాస్తులు 5,680 జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు 2 వేల సీట్లుంటే.. 5,680 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. దీన్ని బట్టి మోడల్ స్కూళ్లలో చదువుకునేందుకు విద్యార్థులు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సాగుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరానికి మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి సంబంధించి మంగళవారం డీఈఓ మధుసూదన్రావు ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు. అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, హిందూపురం , కళ్యాణదుర్గం మండలాలకు కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లాటరీ నిర్వహించారు. కనగానపల్లి, కనేకల్లు, నల్లచెరువు, పామిడి, పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు మండలాలకు ఆదిమూర్తినగర్లోని లిటిల్ఫ్లవర్ స్కూల్.. రాయదుర్గం, శెట్టూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు మండలాల విద్యార్థులకు కేఎస్ఆర్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో లాటరీ నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ తీశారు. మొత్తం 2 వేల సీట్లకు గాను 5,680 దరఖాస్తులు వచ్చాయి. ప్రతి స్కూల్లోనూ 80 సీట్లు భర్తీ చేశారు. 20 శాతం అదనంగా అంటే ఎనిమిది మందిని ఎంపిక చేశారు. ఈలెక్కన ఒక్కో స్కూలుకు 88 మందిని ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా యల్లరూరు మండలంలో సీట్లకంటే కూడా దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వచ్చాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ అవకాశం కల్పించారు. ఇంకా పది సీట్లు ఖాళీగా మిగిలాయని డీఈఓ వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్ఎంఎస్ఏ ఏడీ శ్రీరాములు, డైట్ కళాశాల లెక్చరర్లు సుబ్బారావు, సాయిప్రసాద్, హెచ్ఎంలు లోకేశ్వర్రెడ్డి, చంద్రశేఖర్తో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
234 మోడల్ స్కూళ్ల నిర్మాణాలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రెండో విడతలో మంజూరైన 234 మోడల్ పాఠశాలల భవనాల నిర్మాణానికి బ్రేక్ పడింది. నిర్మాణ వ్యయం పెరిగినందున కొత్త రేట్లు ఇస్తేనే.. భవనాలను నిర్మిస్తామంటూ రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూడీసీ) చేతులెత్తేసింది. మరోవైపు కేంద్రం మాత్రం వాటి కోసం అదనంగా పైసా ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే తొలివిడతలో మంజూరైన మోడల్ పాఠశాలల్లో పూర్తిగా సదుపాయాలు చేకూరకపోగా... ఇప్పుడు రెండో విడత పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. 2012 డిసెంబర్లో కేంద్రం రాష్ట్రానికి 234 మోడల్ స్కూళ్లను మంజూరు చేసింది. వాటి నిర్మాణం కోసం ఒక్కో స్కూల్కు రూ. 2.71 కోట్ల చొప్పున నిర్ణయించి.. నిధులు కూడా విడుదల చేసింది. అయితే స్టీల్ ధరలు పెరిగి పోయాయని, నిర్మాణ వ్యయం కూడా పెరిగినందున ప్రస్తుత రేట్లతో నిర్మాణాలు చేపట్టబోలేమని మౌలిక సదుపాయాల సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఆ భవనాల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. అయితే, ఇంతకు ముందు తొలి విడతలో మంజూరైన 355 స్కూళ్ల నిర్మాణాలు ఆలస్యమైనప్పుడు కూడా... రేట్లు పెరిగాయని, రివైజ్డ్ రేట్లు ఇవ్వాలని సెకండరీ విద్యా శాఖ కేంద్రాన్ని కోరింది. కానీ, తాము అదనంగా పైసా ఇవ్వబోమని, అదనంగా అవసరమైతే మీరే భరించండి అని కేంద్రం స్పష్టం చేసింది కూడా. ఈ నేపథ్యంలో ప్రస్తుత రెండో విడతలో మంజూరైన మోడల్ స్కూళ్లకు కూడా అదనపు నిధులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జూన్ 2న కొత్తగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడి, కొత్త ప్రభుత్వాలు రానున్నందున.. ఆయా ప్రభుత్వాల నిర్ణయంపై ఈ స్కూళ్ల నిర్మాణం ఆధారపడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెనుకబడిన అన్ని మండలాలకు స్కూళ్లు.. రాష్ట్రంలో విద్యాపరంగా వెనుకబడిన మండలాలు 737 ఉన్నాయి. ఈ మండలాలు అన్నింటికి మోడల్ స్కూళ్లను మంజూరు చేసేందుకు కేంద్రం 2009 డిసెంబరులోనే అంగీకరించింది. అందులో భాగంగా తొలివిడతలో 355 స్కూళ్లను మంజూరు చేసింది. 2011లోనే అవి ప్రారంభం కావాల్సి ఉన్నా.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా 2013లో ప్రారంభించారు. అయినా వాటిలో ఇప్పటివరకు 250 స్కూళ్లకు కూడా అన్ని వసతులు సమకూరలేదు. ఈ పరిస్థితుల్లోనే 2012 డిసెంబరులో మరో 234 స్కూళ్లను కేంద్రం మంజూరు చేసింది. కానీ నిర్మాణ వ్యయ భారం పేరుతో అవీ ఆగిపోయాయి. వీటి నిర్మాణాలను పూర్తి చేస్తే తప్ప మరో 148 స్కూళ్లను కేంద్రం మంజూరు చేసే పరిస్థితి లేదు. రెండో విడత మంజూరైన మోడల్ స్కూళ్లు.. శ్రీకాకుళం 8, విజయనగరం 4, విశాఖపట్నం 20, తూర్పుగోదావరి 4, కృష్ణా 1, గుంటూరు 5, ప్రకాశం 18, అనంతపూర్ 24, కడప 17, చిత్తూరు 1, కర్నూలు 7, మహబూబ్నగర్ 40, నల్లగొండ 5, ఖమ్మం 7, వరంగల్ 10, నిజమాబాద్ 14, రంగారెడ్డి 6, మెదక్ 9, ఆదిలాబాద్కు 34 స్కూళ్లు మంజూరయ్యాయి. -
మౌలిక వసతులు కల్పించరూ...
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్: ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలోని ఆదర్శ పాఠశాలకు మౌలిక వసతులు కప్పించాలని, పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్సెల్లో వారు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ పాఠశాలలో కేశరావుపేట, ఫరీద్పేట, ముద్దాడ, ఎచ్చెర్ల, కుశాల పురం, తమ్మినాయుడుపేటకు చెందిన సుమారు 150 మంది చదువుతున్నారని, బస్సు సౌకర్యం లేకపోవడంతో వారంతా ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందిని ఆయా గ్రామాలకు చెందిన సీతమ్మ, కుమారి, బి.చిన్నమ్మడు తదితరులు కొరారు. ఎన్నికల ప్రభావంతో ఈ వారం కూడా గ్రీవెన్స్ సెల్ వెలవెలబోయింది. కలెక్టర్ సౌరభ్గౌర్, జాయింట్ కలెక్టర్ వీరపాండియన్, డావమా పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, డీఆర్డీఏ ఏపీడీ సావిత్రి, తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అందిన వినతుల్లో ముఖ్యమైనవి ఇవీ... గార మండలం శ్రీకూర్మాంలోని ఏపీజీవీబీ కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు, స్వయంశక్తి సంఘాల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. రుణాలు ఇచ్చేలా చూడాలని కోరారు. కోళ్ల ఫారం వల్ల జల, వాయు కాలుష్యం పెరుగుతోందని, గ్రామస్తులు అనార్యగ్యం పాలవుతున్నారని, వెంటనే దాన్ని ఎత్తివేయించాలని బూర్జ మండలం ఆద్దూరిపేట సవర సింహాచలం, తోటయయ్య, పెంటయ్య తదితరులు కోరారు. ఈ విషయమై పలుమార్లు గిరిజన సంక్షేమ శాఖ డీఓకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అన్నారు.పాతపట్నం నియోజకవర్గంలోని 5 మండలాల్లో వీఎస్ఎస్ల పేరిట వాటర్షెడ్ల నిర్మాణానికి ఒక్కొక్క మండలానికి *12 కోట్లు మంజూరుచేశారని, వీటితో పనులు చేపట్టి బాగున్న వాటినీ పాడుచేస్తున్నారని కొత్తూరు మండలం నేరడికి చెందిన కంబాల కృష్ణారావు ఫిర్యాదు చేశారు. పాడైన వాటిని బాగు చేయించాలని, నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. వంశధార నిర్వాసిత గ్రామాలైన మోదుగువలస, కొల్లివలసల్లో ఉపాధి హమీ పనులు కల్పించాలని, ఆ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పోస్టులను బర్తీచేయాలని, పెండింగ్లో ఉన్న ఇళ్ల బిల్లులు మంజూరు చేయాలని, విద్యుత్ సదుపాయం పూర్తి స్థాయిలో కల్పించాలని బి.మల్లేసు, వై.చంద్రరావు, జి.శ్రీనివాసరావు, తదితరులు విజ్ఞప్తి చేశారు. -
అమ్మాయిల చదువు ఇంటికి వెలుగు
తాడిమర్రి,న్యూస్లైన్: ఆడపిల్లలంటే భారమనే రోజులకు కాలం చెల్లింది. అమ్మాయిల చదువు ఇంటికి వెలుగనీ, ప్రస్తుతం వారు అన్ని రంగాల్లో అబ్బాయిలతో పోటీ పడుతున్నారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.మండల కేంద్రంలో రూ.1.25 కోట్లతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆదివారం రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. అనంతరం విద్యాలయంలోని వసతి, వంట, భోజనం గదులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పేద విద్యార్థినుల కోసం సకల వసతులు ఉన్న కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని మంజూరు చేయించానన్నారు. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరారు. రూ.3.2 కోట్లతో మోడల్ స్కూల్, రూ.86 లక్షలతో బీసీ హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన ఎస్సీ కాలనీ సమీపంలో ఆర్డీటీ పాఠశాల వద్ద నిర్మిస్తున్న బీసీ హాస్టల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారని, కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తేనే వారి ఆశలు నెరవేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హర్షిత, ఎంపీడీఓ రమేష్నాయక్, తహశీల్దార్ నాగరాజు, ఎంఈఓ కృష్ణమోహన్, ఎస్ఓ మాధవీలత, ఇంజినీర్ రియాజ్అహ్మద్, వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మవరం మార్కెట్యార్డు చైర్మన్ రామకృష్ణారెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు పాటిల్ భువనేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.