Naminations
-
ఇస్తారా.. ఆపుతారా? నామినేటెడ్ పదవుల భర్తీపై ఉత్కంఠ!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ నేతలు గంపెడాశతో ఉన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు పొందడం కోసం ఆశావహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను రద్దు చేయగా.. జిల్లాస్థాయిలోనూ పలు పదవులను భర్తీచేయాల్సి ఉంది. ఈ నేపథ్యాన లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఆలోపే పదవులు భర్తీచేస్తారా, ఎన్నికల తర్వాతే పదవుల పందేరం ఉంటుందా అనే సందిగ్ధంలో ఆశావహులు ఉన్నారు. అయితే, పదవులు ఎప్పుడు భర్తీ చేసినా తమకే దక్కేలా నేతలు లాబీయింగ్లో నిమగ్నమయ్యారు.' రాష్ట్రస్థాయి పదవులే లక్ష్యం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు మిత్రపక్షమైన సీపీఐతో కలిసి కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను దక్కించుకుంది. అలాగే మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపథ్యాన జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఈ ముగ్గురు నేతల అనుచరుల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నేతలు ఉండగా.. పార్టీ అధికారంలోకి రావడంతో వీరంతా రాష్ట్రస్థాయి పదవులనే ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కూడా జిల్లాకు చెందిన కొండబాల కోటేశ్వరరావు కు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, బొర్రా రాజశేఖర్కు మార్క్ఫెడ్ వైస్ చైర్మన్, పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. దీంతో కాంగ్రెస్ హయాంలో కూడా జిల్లా నేతలకు రాష్ట్రస్థాయి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. జిల్లాస్థాయిలోనూ.. ఇక జిల్లాస్థాయి నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఏమీ లేదు. ఓ పక్క రాష్ట్రస్థాయి పదవుల కోసం ప్రయత్నిస్తూనే అది దక్కకపోతే ఉమ్మడిజిల్లా, జిల్లాస్థాయి పదవులు దక్కించుకోవాలనే వ్యూహంతో పలువురు నేతలు ఉన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలాగైనా పదవి పొందాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను రద్దు చేసిన నాటి నుంచే ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్లతో పాటు ఆలయాల పాలకవర్గాలు, ఇతర నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. త్వరలోనే లోక్సభ నోటిఫికేషన్! మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ తరుణాన నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే యత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను రద్దు చేయగా.. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులను కట్టబెట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. దీంతో త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని పలువురు భావించగా.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తి కావొస్తున్నా అడుగులు పడలేదు. మొదట్లో లోక్సభ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఎన్నికల తర్వాత జరుగుతుందా అనే మీమాంస నెలకొంది. ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే పదవులు రాని వారు పార్టీ అభ్యర్థుల తరఫున పనిచేయరనే భావనతో కొంతకాలం ఆపుతారని ప్రచారం జరుగుతుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. జాబితా పెద్దదే.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ప్రధాన అనుచరులుగా ఉన్న నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారు. భట్టికి ప్రధాన అనుచరులుగా మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో పాటు రాయల నాగేశ్వరరావు, నాగా సీతారాములు, పువ్వాళ దుర్గాప్రసాద్, జావీద్ కొనసాగుతున్నారు. అలాగే పొంగులేటికి బొర్రా రాజశేఖర్, మువ్వా విజయ్బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, మద్దినేని బేబిస్వర్ణకుమారి, మేకల మల్లిబాబు, తుమ్మలకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్రెడ్డి, కమర్తపు మురళి, చావా నారాయణ అనుచరులుగా ఉన్నారు. ఇందులో కొందరు నామినేటెడ్, మరికొందరు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం. ఇవి చదవండి: బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం! మంత్రి కొండా సురేఖ -
అవార్డుల జాతర.. నామినేషన్ కోసం సిద్దమైన కార్లు ఇవే!
2023 అక్టోబర్ 30న 'ఆటో అవార్డ్స్ సెషన్ 3' (Auto Awards Season 3) కార్యక్రమం జరగనుంది. ఇందులో ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ కార్లు చూపరులను కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్తో సహా వివిధ విభాగాల్లో అవార్డుల కోసం నామినేషన్లు జరుగుతాయి. సోమవారం (2023 అక్టోబర్ 30న) జరగనున్న ఈ కార్యక్రంలో ఏ అవార్డు ఏ కారు సొంత చేసుకుంటుందనే విషయాలు అధికారికంగా విడుదలవుతాయి. ఆటో అవార్డ్స్ 2023 కార్యక్రమంలో నామినేషన్ కోసం సిద్దమైన కార్ల జాబితా (విభాగాల వారీగా): ఫేస్లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ హోండా సిటీ ఫేస్లిఫ్ట్ ఎంజీ హెక్టర్ ఫేస్లిఫ్ట్ కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ (బడ్జెట్ కార్లు) టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ మారుతి ఫ్రాంక్స్ హ్యుందాయ్ వెర్నా హ్యుందాయ్ ఎక్స్టర్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ (లగ్జరీ కార్లు) మెక్లారెన్ ఆర్టురా మెర్సిడెస్ ఏఎంజీ ఎస్ఎల్ 55 4మ్యాటిక్ ప్లస్ రోడ్స్టర్ ఆస్టన్ మార్టిన్ డీబీ12 హ్యుందాయ్ ఐయోనిక్5 ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎంజీ కామెట్ సిట్రోయెన్ ఈసీ3 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్లిఫ్ట్ ఇదీ చదవండి: రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4 మ్యాటిక్ వోల్వో C40 రీఛార్జ్ బీఎండబ్ల్యూ ఐ7 ఆడి క్యూ8 ఈ-ట్రాన్ -
ఆస్కార్ నైన్టీసిక్స్కి డేట్ ఫిక్స్
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగి నెలన్నర (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) అవుతోంది. అప్పుడే 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ప్లాన్ మొదలుపెట్టింది కమిటీ. వచ్చే ఏడాది మార్చి 10న ఆస్కార్ వేడుక జరపనున్నట్లు ప్రకటించి, ఇందుకు సంబంధించిన కొన్ని కీలకమైన తేదీలను కూడా వెల్లడించారు నిర్వాహకులు. 96వ ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ను ఈ ఏడాది డిసెంబరు 21న ప్రకటిస్తారు. నామినేషన్స్ను వచ్చే ఏడాది జనవరి 23న వెల్లడిస్తారు. ఆస్కార్ విజేతల ఎంపికకు ఫిబ్రవరి 22న ఓటింగ్ ఆరంభించి, 27 వరకూ కొనసాగిస్తారు. అవార్డుల ప్రదానోత్సవం మార్చి 10న జరుగుతుంది. ఇక జనరల్ ఎంట్రీ కేటగిరీలో అవార్డుల దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 15 చివరి తేదీగా పేర్కొంది కమిటీ. మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందిస్తారు. -
తొలి రోజు మూడు నామినేషన్ల దాఖలు
సాక్షి , కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సంగ్రామంలో ప్రథమ ఘట్టం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్రెడ్డి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజునే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్సూరి అలీ నామినేషన్ వేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ నామినేషన్ను పలు సాంకేతిక కారణాలతో అధికారులు స్వీకరించలేదు. కాగా.. నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వంద మీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తల్లిదండ్రుల దీవెనలు.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఆశీర్వదించి బీఫారం అందించగా, శ్రీనివాస్ శుక్రవారం ఉదయం కొమురెల్లి మల్లిఖార్జునస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కమలాపూర్ మండలం ఉప్పల్ చేరుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా 12.40 నిమిషాలకు మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి హుజూరాబాద్లోని ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే గెల్లు శ్రీనివాస్ తల్లిదండ్రుల మల్లయ్య, లక్ష్మి దీవెనలు తీసుకోగా, భార్య శ్వేత శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి 12.55 నిమిషాలకు మొదటి సెట్, 01.16 నిమిషాలకు రెండో సెట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదటి నామినేషన్ను మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రతిపాదించగా, రెండో సెట్కు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ప్రతిపాదించారు. కోడ్ హుజూరాబాద్కే పరిమితం.. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఆ నియోజకవర్గానికే అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్, వరంగల్ (హనుమకొండ) నగరపాలక సంస్థలకు వర్తించదని ప్రకటనలో స్పష్టంచేశారు. నామినేషన్ ప్రక్రియ పరిశీలన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఎన్నికల అధి కారి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నా మినేషన్ల స్వీకరణ సమయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. తుపాకులు వెనక్కివ్వాలని.. కోడ్ వెలువడిన నేపథ్యంలో పోలీసు అధికారులు లైసెన్స్డ్ తుపాకులను సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక మంది తమకు ప్రాణహాని ఉందని వెపన్స్ను తమతోపాటే ఉంచుకుంటామని పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. కానీ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరికీ మినహాయింపులు లేవని కరాఖండిగా చెప్పిన పోలీసులు మొత్తానికి దాదాపు 40 మందికిపైగా వ్యక్తుల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రానికి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్నికల కోడ్ పరిధిని హుజూరాబాద్కే పరిమితం చేస్తూ ప్రకటన రావడంతో మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని పలువురు ప్రముఖులు పోలీస్స్టేషన్లకు పరుగులు తీశారు. చెక్ పోస్ట్ తనిఖీ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్, హుజూరాబాద్ మధ్యలో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్తో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు. శుక్రవారం వరంగల్ నుండి హుజూరాబాద్ వచ్చే ప్రధాన రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను ఎక్స్పెండేచర్ అబ్జర్వర్ జి.ఎలమురుగుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ద్వారా వచ్చే ప్రతీ వాహనాన్ని చెక్ పోస్టు వద్ద తనిఖీ చేయాలని స్టాటిక్ సర్వలెన్స్ టీమ్ను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా అక్రమంగా డబ్బులు, మద్యం రవాణా చేసే అవకాశం ఉందని, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చదవండి: BJP: వ్యూహాలు సిద్ధం.. హుజూరాబాద్లో గెలవాల్సిందే.. -
నోబెల్ అవార్డు నామినేషన్లలో ట్రంప్ పేరు!
స్టాక్హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి అవార్డు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ ఏడాది అక్టోబర్లో బహుకరించే ఈ శాంతి పురస్కారం రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోబెల్ అవార్డు నామినేషన్లో ట్రంప్ పేరు వినిపించడం ఆసక్తిని రేపుతోంది. ఆయనతో పాటు ఈ అవార్డు నామినేషన్లో స్వీడన్కు చెందిన 18 ఏళ్ల బాలిక, పర్యావరణ వేత్త గ్రెటా థన్బర్గ్, రష్యా అసమ్మతి నేత అలెక్సీ నావల్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లు కూడా ఉన్నాయి. కాగా బాల పర్యావరణ వేత్తగా గ్రెటా పలు కార్యక్రమాలు చేపుడుతున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ... అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ప్రసంగించడమే గాక పర్యావరణ అంశాలపై ధైర్యంగా ఆమె గళం విప్పుతోంది. చిన్న వయసులోనే పర్యావరణంపై ఆమెకు ఉన్న అవగాహన, ఇతరులను కూడా పర్యావరణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె ప్రసంగం ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులకు అందుకుంది. (చదవండి: అప్పుల ఊబిలో డొనాల్డ్ ట్రంప్..?) అలాగే రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ కూడా రష్యాలో శాంతియుత ప్రజాస్వాయ్యం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలను వ్యతిరేకించే నావల్నీపై ఇటీవల విషయ ప్రయోగం కూడా జరిగింది. దీంతో అయిదు నెలల పాటు ఆయన జర్మనీలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల తిరిగి రష్యా వచ్చిన నావల్నీని అరెస్టు చేయడంతో రష్యాలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే వీరితో పాటు ఈసారి నామినేషన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉండటం విశేషం. అంతేగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ ప్రారంభించిన కోవ్యాక్స్ ప్రోగ్రామ్ కూడా ఈ అవార్టు నామినీల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నోబెల్ కమిటీ మాత్రం నామినీల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. (చదవండి: గ్రెటా థంబర్గ్ : లక్ష డాలర్ల భారీ విరాళం) -
రాజధానిలో వేడెక్కిన రాజకీయం
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. నామినేషన్ పత్రాలు దాఖలకు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ తుది జాబితాపై కసరత్తు మరింత వేగవంతం చేశాయి. అధికార టీఆర్ఎస్ 25 మంది తన చివరి జాబితాను విడదల చేయగా.. మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిని చర్లపల్లి డివిజన్ నుంచి బరిలో దింపారు. బల్దియా ఎన్నికల్లో గట్టెక్కేందుకు గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పక్షాలు భారీ కసరత్తు చేశాయి. పార్టీ శ్రేణులు టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ సైతం పోటాపోటీగా గెలుపు గుర్రాల వేటలో వ్యహత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్ దక్కనివారిని చేరదీస్తున్నాయి. (చార్మినార్ వద్ద హైటెన్షన్.. సంజయ్ సవాల్) టీఆర్ఎస్ నేతలే టార్గెట్గా మరోవైపు అధికార టీఆర్ఎస్లో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. టికెట్ ఆశించిన భంగపడ్డ నేతలు.. రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో తెలంగాణ భవన్ వద్దకు టీఆర్ఎస్ ఆశావహులు భారీ ఎత్తున చేరుకున్నారు. టికెట్ దక్కని వారు పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బాలాజీనగర్ డివిజన్ టిక్కెట్ కోసం లక్ష్మీ మల్లేష్ యాదవ్ తీవ్రంగా పోరాడినా.. టికెట్ దక్కకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక టీఆర్ఎస్ నేతలే టార్గెట్గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ అసంతృప్తులను, రెబల్స్ను తన వైపుకు తిప్పుకుంటోంది. అస్త్రశస్త్రాలు సిద్ధం నామినేషన్ల అంకం పూర్తయ్యాక ప్రచారానికి మిగిలింది వారం రోజులే కావడంతో ఉరుకులు, పరుగులు తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రచారంలోనూ వ్యూహ ప్రతివ్యూహాలు, లోపాయికారీ ఒప్పందాలు, ఇతరత్రా కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. అన్ని పార్టీల్లోనూ హేమాహేమీల ప్రచార యాత్రలూ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ, స్వతంత్రులూ సర్వసన్నాహకాల్లో మునిగారు. ఓట్ల వేట కోసం ఇంటింటి ప్రచారాలు, సోషల్మీడియా వేదికగానే కాక ఇతరత్రా మార్గాలూ యోచిస్తున్నారు. ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించాలని భావిస్తున్నవారితోపాటు గుంభనంగా చేయాలని భావిస్తున్నవారూ ఉన్నారు. ఇక అధికార పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే ఆయుధంగా చేసుకోనుండగా, ప్రతిపక్షాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మరోసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్, ప్రభావం చూపాలని బీజేపీ, పట్టునిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పెద్ద సంఖ్యలో నామినేషన్లు జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల రెండోరోజైన గురువారం 522 మంది అభ్యర్థులు 608 నామినేషన్లను దాఖలు చేశారు. మంచి రోజు కావడంతో ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 537 మంది అభ్యర్థులు 628 నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం నామినేషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నుంచి 140 మంది, సీపీఐ నుండి ఒకరు, సీపీఎం నుంచి నలుగురు, కాంగ్రెస్ నుండి 68 మంది, ఎంఐఎం నుండి 27 మంది, టీఆర్ఎస్ 195 మంది, టీడీపీ 47 మంది, వైఎస్సార్సీపీ ఒకరు, గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల నుండి 15 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక శుక్రవారం రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. గ్రేటర్ టీఆర్ఎస్ అభ్యర్ధుల తుది జాబితా విడుదల 25 మంది అభ్యర్ధులతో టీఆర్ఎస్ తుది జాబితా మేయర్ బొంతు రామ్మోహన్ భార్యకు చర్లపల్లి టిక్కెట్ టీఆర్ఎస్: ఏఎస్రావు నగర్-పావనిరెడ్డి, మీర్పేట్-ప్రభుదాస్ టీఆర్ఎస్: నాచారం-శేఖర్, చిలుకానగర్- ప్రవీణ్ టీఆర్ఎస్: హబ్సిగూడ-స్వప్నారెడ్డి, ఉప్పల్-భాస్కర్ టీఆర్ఎస్: అత్తాపూర్- మాధవీ అమరేందర్, కాచిగూడ-శిరీష టీఆర్ఎస్: నల్లకుంట-శ్రీదేవి, అంబర్పేట్-విజయ్కుమార్ టీఆర్ఎస్: అడిక్మెట్-హేమలతారెడ్డి, ముషీరాబాద్-భాగ్యలక్ష్మి టీఆర్ఎస్: కవాడిగూడ-లాస్య, యూసుఫ్గూడ-రాజ్కుమార్ టీఆర్ఎస్: వెంగళ్రావ్నగర్-దేదీప్యరావు, రెహమత్నగర్-సీఎన్రెడ్డి టీఆర్ఎస్: నేరెడ్మెట్-మీనా ఉపేందర్రెడ్డి, ఈస్ట్ ఆనంద్బాగ్-ప్రేమ్కుమార్ టీఆర్ఎస్: గౌతమ్నగర్-సునీతా రాము, గోల్నాక-లావణ్య టీఆర్ఎస్: చందానగర్-రఘునాధరెడ్డి, హైదర్నగర్-నార్నె శ్రీనివాసరావు టీఆర్ఎస్: తార్నాక-శ్రీలత, మౌలాలి-ఫాతిమా తుది జాబితాలో 6 సిట్టింగ్ స్థానాల్లో మార్పులు నేరేడ్మెట్, ఈస్ట్ ఆనంద్బాగ్, అంబర్పేట్, హైదర్నగర్.. గోల్నాక, తార్నాక స్థానాల్లో అభ్యర్ధులను మార్చిన టీఆర్ఎస్ -
తొలి రోజు 17 మంది.. 20 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు గాను నామినేషన్లు ప్రారంభమైన తొలిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లను దాఖలు చేశారు. దాఖలైన 20 నామినేషన్లలో టీఆర్ఎస్ 06, బీజేపీ 02, కాంగ్రెస్ 03, టీడీపీ 05, గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఒక నామినేషన్ వచ్చింది. మరో ముగ్గురు స్వంతత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 150 వార్డులకు గాను డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు అఖరు తేది నవంబర్ 20 కాగా, 21న నామినేషన్లు పరిశీలించి, 22న ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. -
ఐసీసీ చైర్మన్ బరిలో ఇద్దరే!
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసు నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ తప్పుకోవడంతో ఇప్పుడు ప్రధానంగా గ్రెగ్ బార్క్లే (న్యూజిలాండ్), ఇమ్రాన్ ఖాజా (సింగపూర్)ల మధ్య పోటీ ఏర్పడింది. డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో ఈ ఇద్దరి నుంచే ఎవరో ఒకరు చైర్మన్ అయ్యే అవకాశముంది. కాగా న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లేకు బీసీసీఐ మద్దతు ఇస్తుంది. భారత బోర్డుతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు కూడా బార్క్లే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. మరోవైపు పాక్ బోర్డు (పీసీబీ) సహా ఐసీసీ స్వతంత్ర మహిళా డైరెక్టర్ ఇంద్ర నూయి, పలు బోర్డులు ఇమ్రాన్ ఖాజాకు మద్దతు పలుకుతున్నాయి. బార్క్లేకు ఐసీసీ శాశ్వత సభ్యదేశాల మద్దతు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికా బోర్డు సంక్షోభంలో ఉండటం తో వారి ఓటు పరిగణించేది లేనిది ఇంకా స్పష్టమవ్వలేదు. శశాంక్ మనోహర్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఇమ్రాన్ ఖాజానే తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఎందుకనో ఈసారి ఐసీసీ స్పష్టమైన వైఖరి కాకుండా గోప్యత పాటిస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియ సాధారణ మెజారిటీతో ముగిస్తారా? లేదంటే 3/4 మెజారిటీతో నిర్వహిస్తారో చెప్పనే లేదు. ఐసీసీ అధికారిక వెబ్సైట్లో స్ట్రక్చర్ పేజీని ఉన్నపళంగా ఎందుకు మార్చారో తెలియడం లేదు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెబుతున్నా... జాబితాను మాత్రం ప్రకటించడం లేదు. -
మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు
-
బీజేపీ కూటమికి రెబెల్స్ బెడద
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది. ఈ నెల 21న పోలింగ్ జరిగే ఈ ఎన్నికల్లో సోమవారంతో నామినేషన్ గడువు ముగిసింది. బీజేపీ, శివసేనలు ఆఖరి నిమిషం వరకు తిరుగుబాటు అభ్యర్థుల్ని బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం 288 నియోజకవర్గాలకు గాను 50కిపైగా చోట్ల 100 మందికి పైగా అభ్యర్థులు బీజేపీ–సేన కూటమికి సవాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి 15–20 స్థానాల్లో రెబెల్స్ బెడద ఉంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా వినే పరిస్థితి లేదు. రెబెల్స్ను శాంతింపజేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినా ఫలితం లేదు. -
నామినేషన్లు వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారి బాలకృష్ణమచార్యులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి మోపిదేవి రమణ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ పదవుల నియమాకాల్లోనూ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు.పదవుల పంపకంలో వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, బాల నాగిరెడ్డి, అన్న బత్తుల శివకుమార్, కిలారు రోశయ్య, ముస్తఫా, వసంత కృష్ణ ప్రసాద్, విడదల రజనీ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు నిర్వహించడానికి ఆగస్టు 7న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. టీడీపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ నుంచి ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. 16న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 19 వరకు అవకాశం కల్పించారు. 26న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు. 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
తొలిరోజు ‘జెడ్పీటీసీ’కి 91 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తొలి విడత జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల దాఖ లు పర్వం మొదలైంది. వచ్చేనెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ విడతలో భాగంగా 195 మండలాల్లో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు తొలిరోజు సోమవారం 197 జెడ్పీటీసీ స్థానాలకు 91 మంది అభ్యర్థులు 91 నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 38, టీఆర్ఎస్ నుంచి 31 మంది, బీజేపీ నుంచి ఆరుగు రు, సీపీఐ, టీడీపీల నుంచి చెరొక అభ్యర్థి, ఇండిపెం డెంట్లు 14 మంది నామినేషన్లు వేశారు. సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా పదేసి చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నామినేషన్ల దాఖలుకు సంబంధించిన వివరాలు ప్రకటించింది. ఎంపీటీసీ 665.. తొలి విడతలో భాగంగా 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 656 స్థానాల్లో 665 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 296, కాంగ్రెస్ నుంచి 212, బీజేపీ నుంచి 30, సీపీఎం నుంచి 6, సీపీఐ, టీడీపీల నుంచి రెండే సి, ఇండిపెండెంట్లు 113, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టరయిన రాజకీయ పార్టీల నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఊర్మిళ ఆస్తులు రూ. 68 కోట్లు
ముంబై: లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళ మటోండ్కర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో తనకు రూ.68.28 కోట్ల ఆస్తులు(మార్కెట్ విలువ మేరకు) ఉన్నట్లు ఊర్మిళ తెలిపారు. ఇందులో రూ.40.93 కోట్ల చరాస్తులు ఉండగా, రూ.27.34 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. 2013–14 ఆర్థిక సంవత్సరానికి రూ.1.27 కోట్ల ఆదాయాన్ని అర్జించినట్లు పేర్కొన్నారు. 2017–18 నాటికి తన ఆదాయం రూ.2.85 కోట్లకు చేరుకుందన్నారు. అలాగే తన భర్త పేరుపై రూ.32.35 కోట్ల చరాస్తులు, రూ.30 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. -
నెల్లూరు: సార్వత్రిక బరిలో 132 మంది
సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 132 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 182 మంది నామినేషన్లు వేశారు. 39 మందివి తిరస్కరించారు. 11 మంది విత్డ్రా చేసుకున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 21 మంది నామినేషను వేయగా ఏడు తిరస్కరించారు. ఒకరు విత్డ్రా చేసుకున్నారు. 13 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. తిరుపతి పార్లమెంట్కు సంబంధించి 17 మంది నామినేషన్లు వేశారు. ఐదుగురివి తిరస్కరించారు. 12 మంది పోటీలో ఉన్నారు. కావలి అసెంబ్లీకి 14 మంది నామినేషన్లు వేయగా అందులో ఐదు తిరస్కరించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి విత్డ్రా చేసుకున్నాడు. ఎనిమిది మంది అభ్యర్థులు పోరులో ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఒకరిది తిరస్కరించారు. 13 మంది రంగంలో ఉన్నారు. కోవూరు అసెంబ్లీకి 11 మంది నామినేషన్లు వేయగా, మూడు తిరస్కరించారు. ఒకరు విత్డ్రా చేసుకున్నారు. ఏడుగురు అభ్యర్థులు తుదిపోరులో నిలిచారు. నెల్లూరు సిటీకి సంబంధించి 20 మంది నామినేషన్లు వేయగా ఆరు తిరస్కరించారు. ఇద్దరు ఉపసంహరించుకోగా 12 మంది రంగంలో ఉన్నారు. నెల్లూరు రూరల్ అసెంబ్లీకి 15 మంది నామినేషన్లు వేయగా ఒకరిది తిరస్కరించారు. ఇద్దరు ఉపసంహరించుకున్నారు. 12 మంది పోటీలో ఉన్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 12 మంది నామినేషన్లు వేయగా, రెండు తిరస్కరించారు. పదిమంది బరిలో నిలిచారు. గూడూరు అసెంబ్లీకి 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరివి తిరస్కరించారు. 12 మంది రంగంలో ఉన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబం ధించి 13 మంది నామినేషన్లు వేయగా ఇద్దరివి తిరస్కరించారు. ఇద్దరు విత్డ్రా చేసుకున్నారు. తుదిపోరులో 9 మంది నిలిచారు. వెంకటగిరిలో 14 మంది నామినేషన్లు వేయగా ముగ్గురివి తిరస్కరించారు. 11 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి 17 మంది నామినేషన్లు వేశారు. వాటిలో నాలుగు తిరస్కరించారు. 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
ప్రకాశం: బరిలో నిలిచింది వీరే..
సాక్షి, ఒంగోలు అర్బన్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా శాసనసభా స్థానాలకు జాతీయ, రాష్ట్రీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలిపి 234 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో 65 నామినేషన్లు తిరస్కరించగా గురువారం 14 నామినేషన్లు ఉపసంహరణ అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాలో 155 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటున్నట్లు తుది జాబితా ఖరారైంది. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 32 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన అనంతరం 27 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఒక నామినేషన్ ఉపసంహరించుకోగా మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో ఉంటారని నిర్ధారణ అయింది. -
విజయనగరం పోరుకు సై
సాక్షి, విజయనగరం గంటస్తంభం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్లు పక్రియ పూర్తయింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు అధికారికంగా అధికారులు ప్రకటించారు. దీంతో తదుపరి సమరం మిగిలి ఉంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ తేదీలు ప్రకటిచింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 18న నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. అదేరోజు జిల్లాలో ఉన్న విజయనగరం పార్లమెంట్ స్థానానికి కలెక్టర్ హరి జవహర్లాల్, 9 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేరోజు నామినేషన్లు స్వీకరించారు. ఈ పక్రియ 24వ తేదీ వరకు సాగింది. జిల్లాలో విజయనగరం పార్లమెంట్ స్థానానికి 18 మంది, 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 30 మంది నామినేషన్లు పరిశీలనలో అధికారులు తిరస్కరించారు. బుధ, గురు శుక్రవారాల్లో జరిగిన నామినేషన్లు విత్డ్రా కార్యక్రమంలో 16 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను రిటర్నింగ్ అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు. గుర్తుల కేటాయింపు అధికారిక సమాచారం ప్రకారం ఎంపీ, 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 88 మంది బరిలో ఉన్నారు. విజయనగరం ఎంపీ స్థానానికి 14మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మిగతా 9 అసెంబ్లీ సిగ్మెంట్ల్లో 74మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 18 మంది స్వతంత్ర అభ్యర్ధులు కాగా మిగిలినవారంతా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలతో పాటు ఇతర పార్టీలవారు ఉన్నారు. కురుపాం నుంచి ఒకరు, పార్వతీపురం నుంచి ఇద్దరు, సాలూరు నుంచి ముగ్గురు, గజపతినగరం నుంచి ఒకరు, నెల్లిమర్ల నుంచి ముగ్గురు, విజయనగరం నుంచి ఒకరు, ఎస్.కోట నుంచి ఇద్దరు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. విజయనగరం ఎంపీ స్థానానికి ఏకంగా ఐదుగురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఇదిలాఉండగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రిటర్నింగు అధికారులు వెంటనే గుర్తులు కేటాయించారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకు పార్టీ గుర్తులు లభించగా గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించారు. ఈ మేరకు ఫారం–7ఎ జనరేట్ చేసి ఎన్నికల సంఘానికి పంపించారు. దీంతో నామినేషన్లు పక్రియ ముగిసినట్లైంది. విజయనగరం ఎంపీ బరిలో నిలిచిన అభ్యర్థులు వ.సం. అభ్యర్థి పార్టీ కేటాయించిన గుర్తు 1 అశోక్గజపతిరాజు పూసపాటి తెలుగుదేశం సైకిల్ 2 ఆదిరాజు యడ్ల కాంగ్రెస్పార్టీ హస్తం 3 బెల్లాన చంద్రశేఖర్ వైఎస్సార్ సీపీ సీలింగ్ ఫ్యాన్ 4 పాకలపాటి సన్యాసిరాజు బీజేపీ కమలం 5 పీవీఏ సాగర్ సామాన్య ప్రజాపార్టీ ఎలక్ట్రికల్ పోల్ 6 చిరంజీవి లింగాల ఆంధ్ర చైతన్యపార్టీ టూత్బ్రెష్ 7 ముక్క శ్రీనివాసరావు జనసేన గాజుగ్లాసు 8 లగుడు గోవిందరావు జనజాగృతిపార్టీ మైకు 9 కె.సూర్యభవాని పిరమిడ్ ఫ్లూట్ 10 సియాదుల ఎల్లారావు గ్యాస్ స్వతంత్ర సిలిండర్ 11 దనలాకోటి రమణ స్వతంత్ర అగ్గిపెట్టె 12 పెంటపాటి రాజేష్ స్వతంత్ర బ్యాటరీ టార్చ్ 13 ఇజ్జురోతు రామునాయుడు స్వతంత్ర కోట్ 14 వెంకట త్రినాథరావు వెలూరు స్వతంత్ర సితార్ అసెంబ్లీ నియోజకవర్గాలు వారీగా బరిలో ఉన్న అభ్యర్థులు వ.సం. నియోజకవర్గం పోటీలో ఉన్న అభ్యర్థులు 1 కురుపాం 6 2 పార్వతీపురం 7 3 సాలూరు 8 4 బొబ్బిలి 6 5 చీపురుపల్లి 8 6 గజపతినగరం 9 7 నెల్లిమర్ల 12 8 విజయనగరం 9 9 ఎస్.కోట 9 -
ముగిసిన నామినేషన్ల పర్వం
సాక్షి, విజయనగరం గంటస్తంభం: నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. మొత్తం ఆరు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం ఎంపీ స్థానానికి 17 మంది, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలకు 130 మంది నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు పరిశీలన మంగళవారం జరగనుంది. ఇదేరోజు నుంచి 28వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీన జరిగే తొలివిడత పోలింగ్కు మార్చి 18న నోటిఫికేషన్ జారీ చేయగా అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరణ జరిగింది. 18 నుంచి 22వ తేదీ వరకు వరుసుగా నామినేషన్లను అధికారులు స్వీకరించారు. 23, 24 తేదీలు సెలవులు కావడంతో ఆఖరి రోజు 25న నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. చివరిరోజు రోజు 83 నామినేషన్లు జిల్లాలో చివరి రోజు ఏకంగా 83 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతకుముందు ఐదురోజులు పాటు 64 నామినేషన్లురాగా ఆఖరి రోజు అంతకుమించి రావడం విశేషం. ఇందులో విజయనగరం ఎంపీ స్థానానికి 10 నామినేషన్లు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వేశారు. కురుపాం నియోజకవర్గానికి 5, పార్వతీపురానికి 6, సాలూరులో 12, బొబ్బిలిలో 7, చీపురుపల్లిలో 7, గజపతినగరంలో 7, నెల్లిమర్లలో 13, విజయనగరంలో 3, శృంగవరపుకోటలో 13 చివరి రోజైన సోమవారం దాఖలయ్యాయి. బొబ్బిలి నుంచి టీడీపీ అభ్యర్థి సుజయ్కృష్ణ రంగారావు మాత్రమే నామినేషను వేశారు. రెండు నియోజకవర్గాల్లో అత్యధికంగా 19మంది మొత్తంగా చూస్తే విజయనగరం ఎంపీ స్థానానికి 17మంది నామినేషను దాఖలు చేశారు. ఎమ్మెల్యే స్థానాల్లో ఎస్.కోట, నెల్లిమర్లలో 20మంది చొప్పున నామినేషన్లు వేశారు. అత్యల్పంగా పార్వతీపురంలో 10 మంది నామినేషన్లు సమర్పించారు. నియోజకవర్గాల వారీగా నామినేషన్ల సంఖ్య నియోజకవర్గం నామినేషన్లు విజయనగరం ఎంపీ 17 కురుపాం 13 పార్వతీపురం 10 సాలూరు 15 బొబ్బిలి 11 చీపురుపల్లి 15 గజపతినగరం 13 నెల్లిమర్ల 20 విజయనగరం 13 శృంగవరపుకోట 20 -
నామినేషన్ల దాఖలుకు తెర!
సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నామినేషన్లకు చివరి రోజైన సోమవారం 96 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. రెండు పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 173 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నెల్లూరు పార్లమెంట్కు 17, తిరుపతి పార్లమెంట్కు 16 నామినేషన్లు, పది అసెంబ్లీలకు 140 నామినేషన్లు దాఖలయ్యాయి. నెల్లూరు పార్లమెంట్కు కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి ఆర్ ముత్యాలరాజు నామినేషన్లు స్వీకరించారు. తిరుపతి పార్లమెంట్కు సంబంధించి జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి డీఆర్డీఏ పీడీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆర్వోలు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 18, 19 తేదీల్లో నామినేషన్లు ఎవరూ వేయలేదు. 20న ఆరుగురు నామినేషన్లు వేశారు. ఈ నెల 21వ తేదీ 12, 22వ తేదీ 59 మంది నామినేషన్లు వేశారు. 23, 24వ తేదీలు సెలవులు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. చివరి రోజు 96 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. నెల్లూరు పార్లమెంట్కు 17 మంది, తిరుపతి పార్లమెంట్కు 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 15 మంది అభ్యర్థులు, అంతకన్నా ఎక్కువ మంది పోటీలో ఉంటే రెండు ఈవీంఎలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్కు సంబంధించి 2856 పోలింగ్ కేంద్రాల్లో ఎంపీలకు రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అసెంబ్లీకి సంబంధించి నెల్లూరు నియోజకవర్గంలో 20 మంది, ఉదయగిరిలో 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులందరూ పోటీలో ఉంటే పోలింగ్ కేంద్రాల్లో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణన తర్వాత ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తుంది. 29వ తేదీ తరువాత బరిలో ఉండే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయిస్తారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. గుర్తులు కేటాయించిన తరువాత బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేస్తారు. బ్యాలెట్ పత్రంలో గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటో ఉంటుంది. వచ్చే నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ అభ్యర్థులతో కిటకిటలాడాయి. ఆకరి రోజు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రేపు, ఎల్లుండి నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు 28 వరకు గడువు ఉంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మరోవైపు రెబల్ అభ్యర్థులను విత్డ్రా చేయించేందుకు పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగి వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో నేతలు ప్రచారంలో మునిగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ , 25 లోక్సభ స్థానాలకు ఎన్నికల జరుగనున్నాయి. అలాగే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11న దేశ వ్యాప్తంగా తొలివిడత ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. -
కోలాహలంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లు
-
మూడో రోజు రెండు నామినేషన్లు
సాక్షి, మెదక్ రూరల్: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానంలో పోటీ చేసేందుకు బుధవారం మూడో రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సంతోష్రెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థిగా సిద్దిపేటకు చెందిన బన్సీలాల్లు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణకు కౌటర్లను ఏర్పాటు చేశామన్నారు. కానీ 18, 19 తేదీల్లో నామినేషన్లు రాలేదన్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణకు సమయం ఉండగా 21, 23, 24 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. అందువల్ల 22, 25వ తేదీల్లో మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. -
కోలాహలంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వచ్చేనెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులంతా గురు, శుక్రవారాల్లోనే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లతో సందడి వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా మదనపల్లి శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం నవాజ్ పాషా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. కృష్ణాజిల్లా తిరువూరు శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె రక్షణ నిధి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతపురం లోక్సభ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తలారి రంగయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముదునూరి ప్రసాద్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెత్త ఎత్తున్న పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా వై వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు, మోషన్ రాజు, పాతపాటి సర్రాజు, ఏఎస్ రాజు, జాన్సన్, ఉమాబాల, రామకృష్ణం రాజు తదితరులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం నామినేషన్ వేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కృష్ణా జిల్లా నూజీవీడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు ఈ రోజు ఉదయం 11.20 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని ద్వారకా ఎస్టేట్ నుండి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. అవనిగడ్డ అభ్యర్థిగా సింహాద్రి రమేష్, పామర్రు అభ్యర్థిగా అనిల్ కూమార్లు నామినేషన్లు వేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ వేశారు. పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులతో భారీ ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్ నామినేషన్ వేశారు. ముందుగా ద్వారకా తిరుమల లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట జిల్లా అసెంబ్లీ అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తులు తరలివచ్చారు. రామచంద్రపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి గా చెల్లుబోయిన వేణు నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ భారీ ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్ వేశారు. గాంధీ బొమ్మ నుంచి వందలాది మంది కార్యకర్తలతో నామినేషన్కు తరలివచ్చారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీమంత్రి కొలుసు పార్థసారధి నామినేషన్ దాఖలు చేశారు. పోరంకి నుంచి పెనమలూరు వరకు భారీ ర్యాలీ తరలివచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు శ్రీకాకుళం టెక్కలి అభ్యర్థి పేరాడ తిలక్, రాజాం అభ్యర్థి కంబాల జోగులు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అరకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెట్టి ఫాల్గుణ భారీ ర్యాలీగా తరలి వచ్చిన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటి రమ్యశ్రీ, విద్యార్థి నాయకులు తేడబారికి సురేష్ కుమార్, యూత్ అద్యక్షులు వినయ్ రేగ మత్సలింగం,మిథుల తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి నామినేషన్ వేశారు. రామిరెడ్డితో పాటు ఎర్రబోతుల వెంకట్ రెడ్డి, పట్టణ మాజీ సర్పంచ్ లక్ష్మి రెడ్డి, శంకర్ రెడ్డి లు నామినేషన్ కార్యాక్రమనికి వెళ్లారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం పెరిగిపోయాయని రామిరెడ్డి పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల అరాచకాలు, ఎమ్మెల్యే దురగతాలు నియోజకవర్గంలో పెరిగిపోయాయని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి పాలన లో రైతులకు, మహిళలకు, ప్రతి వర్గం వారికి ఎంతో మేలు జరిగిందన్నారు. వైఎస్సార్ రుణం తీర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ని అధికారంలోకి తీసుకురావాలని గ్రామాల్లో ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం లో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని కాటసాని రామిరెడ్డి ధీమా వ్యక్తం శారు. కడపలో లోక్సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. రెండవ సారి ప్రజల ఆశిస్సులతో ఎంపీ గా పోటీ చేస్తున్నానన్నారు. ‘నికర జలాల సాధన కోసం పోరాటం తాను పోరాటం చేశానన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశానని మళ్లీ తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కోత్త రైళ్ళను జిల్లాలో నడిపించే విధంగా కృషి చేశానన్నారు. ఆలు లేదు సోలు లేదన్న చందంగా మారిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, ప్రత్యేక హోదా, విభజన హమీలు, ఉక్కు పరిశ్రమ వంటి సమస్యలపై భవిష్యత్తులో పోరాటం చేస్తానని తెలిపారు. భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం వైస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజన్నదొర నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గురువారం ఉదయం 11 గంటల ముహూర్తం సమయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా నామినేషన్ పత్రాల దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ జరజాపు ఈశ్వర్ రావు మాజీ వైస్ చైర్మన్ పువ్వుల నాగేశ్వరరావు సాలూరు జడ్పిటిసి రెడ్డి పద్మావతి మాజీ మున్సిపల్ చైర్మన్ ముగడ గంగమ్మ తదితరులు హాజరయ్యారు. మెజార్టీ అభ్యర్థులందరూ 22నే వెఎస్సార్సీపీ తరపున విశాఖ, అరకు, అనకాపల్లి లోక్సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, కాండ్రేగుల సత్యవతిలు 22వ తేదీన నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. అదే విధంగా వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థులు బూడి ముత్యాలనాయుడు(మాడుగులు), అవంతి శ్రీనివాస్ (భీమిలి), గుడివాడ అమర్నాథ్(అనకాపల్లి), అన్నంరెడ్డి అదీప్రాజు (పెందుర్తి), కరణం ధర్మశ్రీ (చోడవరం), గొల్ల బాబూరావు(పాయకరావుపేట), తిప్పల నాగిరెడ్డి (గాజువాక), కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి(పాడేరు), అక్కరమాని విజయలక్ష్మి(విశాఖ తూర్పు), ద్రోణంరాజు శ్రీనివాస్ (విశాఖ దక్షిణం), యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబు) (యలమంచలి)లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు మెజార్టీ జనసేన, బీజేపీ అభ్యర్థులందరూ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. -
రేపు కోలగట్ల నామినేషన్
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విజయనగరం శాసనసభా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీ, ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి ఈ నెల 20న నామినేషన్ను దాఖలు చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి కోలగట్ల తమ్మన్నశెట్టి వెల్లడించారు. సోమవారం ఎమ్మెల్సీ కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు విజయనగరం మండల తహసీల్దార్ కార్యాలయంలో కోలగట్లతో పాటు మరో ఐదుగురు వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎటువంటి ఆడంబర కార్యక్రమాలు నిర్వహించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మాట తప్పని నాయకునికి మద్దతు పలకండి రాష్ట్రంలో ఐదేళ్లపాటు జరిగిన నయవంచనకు పాలనకు స్వస్తిపలికి... తప్పని, మడమ తిప్పని నాయకునిగా గుర్తింపు సాధించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బలపర్చిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి నియోజకవర్గ ప్రజలు మద్దతు పలకాలని తమన్నశెట్టి కోరారు. జగనన్న తోనే రాజన్న రాజ్యం సాధ్యమనీ, అటువంటి సంక్షేమ రాజ్యం కోసం అందరూ తమ ఓటును కోలగట్ల వీరభద్రస్వామికి వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
రెబల్తో బోణీ..
సాక్షి, చీపురుపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు పర్వానికి తెర లేచిన మొదటి రోజునే బోణీ పడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా కె.త్రిమూర్తులురాజు నామినేషన్ దాఖ లు చేశారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునను అధిష్టానం ఎంపికగా చేయగా... దానిని వ్యతిరేకిస్తూ త్రిమూర్తులురాజు సోమవారం ఉదయం నామినేషన్ వేశారు. పట్టణంలోని ఆంజనేయపురంలో గల ఆయన నివాసం నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయిలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సాల్మన్రాజ్కు అందజేశారు. అంతకుముందు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 2014లో పార్టీ అధిష్టానం మృణాళినిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించి గెలిపించాలని ఆదేశిస్తే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గెలిపించామనీ, ఆమె గెలిచిన తరువాత నియోజకవర్గంలో పార్టీ భ్రష్టుపట్టిపోయిందని, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందనీ పేర్కొన్నారు. మూడేళ్లుగా ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెబుతున్నా కనీసం పట్టించుకోలేదనీ, ఆమెకు ఈసారి టిక్కెట్టు ఇవ్వొద్దని సమన్వయ కమిటీలో 80 శాతం మంది వ్యతిరేకించామనీ, అయినా ఆమె కుమారుడికి ఇవ్వడం తమను బాధించిందని చెప్పారు. మరో ఐదేళ్లు బాధలు అనుభవించలేమని, కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు అనుగుణంగా పోటీకి వెళ్లాలని భావించినట్లు తెలిపారు. ఆయనకు చీపురుపల్లి జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్ మద్దతు తెలిపారు. -
స్వతంత్ర అభ్యర్థికి చుక్కలు చూపించిన పోలీసులు
-
నామినేషన్ కార్యక్రమంలో కారు నడిపిన ఎంపీ కవిత
-
టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్.. ఆసక్తికర దృశ్యం
సాక్షి నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున గణేష్ గుప్తా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. గణేష్ గుప్తా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా కారు నడిపి అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యంలో ముచెత్తారు. గులాబీ రంగులో ఉన్న అంబాసిడర్ కారును గణేష్ గుప్తా ఇంటి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఆమె డ్రైవింగ్ చేశారు. మహిళలు డ్రైవింగ్ చేయటం సాధారణమే. కానీ, ఎంపీగా ఉన్న ఓ మహిళ కారు నడపడం, అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పని చేయడం అందరినీ ఆకర్షించింది. అనంతరం కార్యకర్తలు, అభిమానులు, పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రగా ఎంపీ కవిత తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్ సురేష్రెడ్డి సమక్షంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థిగా గణేష్ గుప్తా, ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్లో అసంతృప్తులు.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ టికెట్ను నల్లమడుగు సురేందర్కు కేటాయించడం పట్ల వడ్డేపల్లి సుభాష్రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమైన సుభాష్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు నిర్ణయించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీనివాస్రెడ్డికి కారు బొమ్మలు ఇచ్చిన మనవళ్లు
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని రాజకీయ నాయకులు అన్నింటికీ మంచి, చెడు, ముహుర్తం, సెంటిమెంట్ అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే విధంగా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి కారు బొమ్మలు మనవళ్లు అందరజేశాకే నామినేషన్ వేశారు. -
తొలి రోజు నామినేషన్లు వేసింది వీరే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో తొలిరోజు నామినేషన్ల గడువు ముగిసింది. మొదటి రోజు మొత్తం 48 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 10 మంది నామినేషన్లు వేశారు. బీజేపీ-9, కాంగ్రెస్-6, టీడీపీ-2, సీపీఐ(ఎం)-2, సీపీఎం-1, బీఎల్ఎప్ -2, బీఎస్పీ-1, ఆప్-2, పీపీఐ-2, స్వతంత్రులు -11 మంది తొలిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి లక్ష్మణ్( ముషీరాబాద్), రాజాసింగ్( గోషామాల్), రఘునందన్ రావు(దుబ్బాక)లు తొలి రోజు నామినేషన్ వేశారు. ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్తిగా కొప్పుల ఈశ్వర్, మంథని అభ్యర్థిగా పుట్టా మధుకర్ నామినేషన్లు దాఖలు చేశారు. పుట్టమధుకర్ తరపున ఆయన సతీమణి శైలజ నామినేషన్ వేశారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు పోటీ చేసేందుకు నామినేషన్లు సమర్పించే కీలక ఘట్టం సోమవారం (నేటి) నుంచి శ్రీకారం చుట్టుకుంటోంది. జిల్లాలో అభ్యర్థుల నుంచి వీటిని స్వీకరించేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో అక్కడ పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19వ తేదీన మ«ధ్యాహ్నంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 20వ తేదీన పరిశీలించి, సరైన పత్రాలు లేని వాటిని తిరస్కరిస్తారు. కాగా డిసెంబర్ 7వ తేదీన శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక పోటీలో నిల్చునే అభ్యర్థులు ముమూర్తాలు చూసుకుని మరీ..నామినేషన్ పత్రాలు సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 19వ తేదీన మంచి ముహూర్తం ఉందన్న కారణంతో ఆరోజు నామినేషన్ వేయనున్నారు. ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ కూడా అదేరోజు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మహాకూటమి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాక వారు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మొదటిరోజు నామినేషన్లు పడేనా ? టీఆర్ఎస్ మినహా మిగతా పార్టీలు పూర్తిస్థాయిలో తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నామినేషన్లు మొద టి రోజు పడే అవకాశం కన్పించట్లేదు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల కూటమి పొత్తులు ఇంకా తేలకపోవడం, అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేవారు ఖరారు కాలేదు. దీంతో తొలిరోజు నామినేషన్లు పడే సూచనలు కన్పించట్లేదు. టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వీరంతా..మొద టి రోజే నామినేషన్ వేసేందుకు ఆసక్తి కనబర్చట్లేదు. జిల్లాకు అబ్జర్వర్లు రాక.. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను పర్యవేక్షించేందుకు వ్యయ పరిశీలకులు ఇద్దరు జిల్లాకు రానున్నారు. వీరిలో ఒకరు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలను పర్యవేక్షించనుండగా, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలను మరొకరు చూస్తారు. ఈ నెల 17వ తేదీన పోలీస్ అబ్జర్వర్ కూడా వస్తారు. జనరల్ అబ్జర్వర్లు ముగ్గురు ఈ నెల 19వ తేదీన చేరుకుంటారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గానికి ఒకరు, వైరా, మధిర నియోజకవర్గాలకు ఒకరు, సత్తుపల్లి నియోజకవర్గానికి ఒకరి చొప్పున ఉంటారు. డిపాజిట్ ఇలా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందిన వారైతే రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.5వేలు డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి ఫారం– 26 అఫిడవిట్ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. -
14 న ముహూర్తం
సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల ముహూర్తం ఖరారైంది. మెజార్టీ అభ్యర్థులు ఈనెల 14వ తేదీన నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. వేద శాస్త్రాల ప్రకారం ఆ రోజున తిథి, నక్షత్రాలు బాగున్నాయని వేద పండితులు తేల్చి చెప్పడంతో అదే రోజున నామినేషన్లు వేసేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. జన సమీకరణ కుదరకపోతే ముందు ఒంటరిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించి, మరో రోజు భారీ ఊరేగింపుతో వెళ్లి రెండో సెట్ పత్రాలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వచ్చి బీ–ఫారాలు తీసుకుని వెళ్లాలని ‘గులాబీ’ దళపతి కేసీఆర్ నుంచి అభ్యర్థులకు ఆహ్వానం అందింది. వచ్చేటప్పుడు కచ్చితంగా ఓటరు గుర్తింపు కార్డు, నేరచరిత్ర ఉంటే ఆ వివరాలను వెంట తీసుకుని రావాలని ఆయన ఆదేశించారు. దీంతో అభ్యర్థులందరూ ఆదివారం హైదరాబాద్కు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.ఈ నెల 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నెల19తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుండడంతో తిథి, నక్షత్రాలు చూసుకుని నామినేషన్లు వేసేందుకు వీలుగా ముందస్తుగానే బీ–ఫారాలు ఇస్తున్నారు. నేర చరిత్ర ఉంటే.. అభ్యర్థులు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకే ఓటరు గుర్తింపు కార్డుతో తెలంగాణభవన్కు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు. నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు ప్రతి సాంకేతిక పరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించే విధానాన్ని వివరించే అవకాశం ఉంది. ఓటరు గుర్తింపుకార్డులో ఉన్న పేరునే ప్రామాణికంగా తీసుకుంటారని.. అదే పేరును బీ–ఫారంపై రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నేరచరిత్రపై రెండు పత్రికలు, టీవీలలో ప్రచారం చేయాల్సి ఉన్నందున వాటికి సంబంధించిన పత్రాలు తేవాలన్నారు. నేర చరిత్రకు సంబంధించిన పత్రికా ప్రకటనలను టీఆర్ఎస్ అధిష్టానమే అభ్యర్థుల తరఫున ఇవ్వనున్నట్లు తెలిసింది. జాతకం కూడా బయటపెడతారు.. బీ–ఫారాల అందజేతతోపాటు అభ్యర్థులకు ఎన్నికలపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు ముందు అందరు అభ్యర్థులతో కలిసి నిర్వహించే చివరి సమావేశమైనందున.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలను గులాబీ దళపతి వివరించే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ 6న అభ్యర్ధులను ప్రకటించారు. అంటే దాదాపు రెండు నెలల కాలం అయింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత కేసీఆర్ సర్వే చేయించారు. ఈ సమావేశంలో తాజాగా వచ్చిన సర్వే నివేదికలను సైతం వారికి అందజేయనున్నట్లు సమాచారం. మెజార్టీ సభ్యులు 14వ తేదీనే.. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో మెజార్టీ సభ్యులు ఈనెల 14న నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. జనగామ అభ్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ములుగు అభ్యర్థి అజ్మీరా చందూలాల్, స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి రాజయ్య, వరంగల్ పశ్చిమ అభ్యర్థి వినయ్ భాస్కర్, నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి, పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి శంకర్నాయక్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట అభ్యర్థి ఆరూరి రమేష్ మాత్రం ఈనెల 19న నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. 14వ తేదీనే ఎందుకు..? వారాధిపతి బుధుడు, సప్తమి తిథి , శ్రవణానక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు (కార్తీకమాసం) అన్నీ కలిసి వచ్చిన శుభదినం. శ్రవణా నక్షత్రం అనగా శుభకారకుడైన చంద్రుడు. చంద్రుని ఆశీర్వాదాన్ని కోరుకుని పనులు ప్రారంభించిన వారి మాటలను ఎదుటివారు అంగీకరిస్తారు. ఎదుటివారి నుంచి వచ్చే కోపావేశాలు తగ్గిపోతాయి. ఉదయం 10.43 వరకు వర్జ్యం ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు ఉన్న మకరలగ్నానికి ఏకాదశస్థానంలో గురు, బుధ గ్రహాలు శుభదృష్టితో ఉంటాయి. కాబట్టి ఇవి శుభ ఘడియలుగా భావిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30గంటల వరకు మీన లగ్నంలో గురు, బుధ గ్రహాలు 9వ స్థానంలో ఉండడంతో పాటు మకర లగ్నంలో చంద్రుడు, కేతువు 11వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో తలపెట్టిన కార్యాలు అనుకూల విజయానికి దారి తీస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ మేరకు అభ్యర్థులు ఎక్కువ మంది ఇవే ఘడియల్లో నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. 19వ తేదీ ఏకాదశితో పాటు శివప్రీతికరమైన కార్తీక మాస సోమవారం కాబట్టి కలిసివస్తుందని.. ఈ రోజున నామినేషన్లు దాఖలుచేసేందుకు ఎర్రబెల్లి, అరూరి సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
ఆస్కార్.. కొత్త బెస్ట్ యాక్టర్ ఎవరో..?
ఈరోజుకి ఇరవై రోజులు ముందుకెళ్తే లాస్ ఏంజిల్స్లో జరిగే ఓ పెద్ద వేడుకను సినీ అభిమానులంతా చూస్తూ కూర్చుంటారు. ఆ వేడుక పేరే ఆస్కార్స్. హాలీవుడ్ అంతా ఈ వేడుక కోసం ఎదురు చూస్తోంది. ‘‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’’ అన్న లైన్ ఇరవై నాలుగుసార్లు వినిపిస్తుంది ఆ రోజు. అందులో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డుల తర్వాత ఆ లైన్లో అందరూ ఎదురు చూసే మూడో విభాగం బెస్ట్ యాక్టర్. ఎప్పట్లానే ఈసారి కూడా బెస్ట్ యాక్టర్ లిస్ట్లో గట్టి పోటీనే ఉంది. ఐదుగురిలో ఇద్దరు ఫస్ట్ టైమ్ నామినేషన్ పొందినవారు కావడం ఇక్కడ విశేషం. అలాగే వాళ్లిద్దరిలోనే ఒకరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు లెక్కలేస్తూ ఉండడం మరింత విశేషం. నామినేషన్స్ దక్కించుకున్నది ఎవరెవరో చూద్దాం... తిమోతీ ఛాలమేట్ (‘కాల్ మీ బై యువర్ నేమ్’) ఈ ఏడాది బెస్ట్ యాక్టర్కు నామినేషన్స్ దక్కించుకున్నవారిలో చిన్నవాడు తిమోతీ. 22 ఏళ్లు ఇతనికి. ఇంతకుముందు ఎప్పుడూ నామినేషన్ దక్కించుకోలేదు. అవార్డు గనక ఇతనికే వస్తే అతి చిన్న వయసులో బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ అందుకున్నవాడిగా రికార్డులకెక్కుతాడు. ‘కాల్ మీ బై యువర్ నేమ్’ సినిమాలో తిమోతీ ఒక టీనేజ్ బాయ్గా నటించాడు. అందరూ అద్భుతంగా నటించిన సినిమాలో తిమోతీ వాళ్లందరినీ మరిపించేలా నటించాడని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్కార్ రేసులో అందరికంటే తిమోతీనే ముందున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఆస్కార్ అతన్ని వరిస్తుందా? డేనియ్ డే లూయీజ్ (‘ది ఫాంటమ్ థ్రెడ్’) 1950 కాలంలో నడిచే ‘ది ఫాంటమ్ థ్రెడ్’ అనే సినిమాలో ఓ ఫేమస్ డ్రెస్మేకర్గా లూయిజ్ కనిపించాడు. ఈ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లూయిజ్ ఇప్పటికే మూడుసార్లు బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్నాడు. అతని నటన గురించి ప్రత్యేకించి ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘మై లెఫ్ట్ ఫూట్’ (1990)తో 18 ఏళ్ల క్రితమే ఆస్కార్ అందుకొని అప్పట్నుంచీ ఆయన తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు. ‘దేర్ విల్ బి బ్లడ్’ (2003), ‘లింకన్’ (2013) తర్వాత ఇప్పుడు మళ్లీ ఆస్కార్ కొడితే లూయీజ్కి ఇది నాలుగో ఆస్కార్ అవుతుంది. ఇవి కాకుండా లూయిజ్.. ‘నేమ్ ఆఫ్ ది ఫాదర్’ (1994), ‘గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్’ (2003) సినిమాలకు నామినేషన్స్ దక్కించుకున్నాడు. డేనియల్ కలూయా (‘గెట్ ఔట్’) డేనియల్ కలూయా బెస్ట్ యాక్టర్గా నామినేషన్స్ దక్కించుకున్న చిన్నవాళ్ల లిస్ట్లో ఉంటాడు. ఇతనికిప్పుడు 28 ఏళ్లు. ‘గెట్ ఔట్’ సినిమాకు గాను డేనియల్ కలూయా ఈ నామినేషన్ దక్కించుకున్నాడు. ఇది ఇతనికి ఫస్ట్ నామినేషన్. ఒకవేళ ఇతనే గనక అవార్డు దక్కించుకుంటే బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ అందుకున్న అతి చిన్నవాడిగా రికార్డులకెక్కుతాడు. తెల్లజాతి అమ్మాయిని ప్రేమించిన నల్లజాతి అబ్బాయి, ఆ అమ్మాయి ఇంటికి వెళ్లడం, వాళ్ల ఫ్యామిలీని కలుసుకోవడం.. ఈ క్రమంలో కథ రకరకాల మలుపులు తిరగడమే సినిమా. డేనియల్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లిస్ట్లో గట్టి పోటీ ఇచ్చేట్టే కనిపిస్తున్నాడు. తిమోతీ, కలూయా.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఆస్కార్ దక్కించుకుంటారని ఎక్కువమంది అంచనా. ఎవరు దక్కించుకున్నా ఆస్కార్ అందుకున్న చిన్న వయసు యాక్టర్గా రికార్డు దక్కించుకుంటారు. గ్యారీ ఓల్డ్మన్ (‘డార్కెస్ట్ అవర్’) ‘టింకర్ టైలర్ సోల్జర్ స్పై’ (2012) సినిమాకుగాను గతంలో గ్యారీ ఓల్డ్మన్ ఒకసారి ఆస్కార్కు నామినేట్ అయ్యాడు. కాకపోతే అప్పుడు అవార్డు ఆయనను వరించలేదు. ఈసారి ‘డార్కెస్ట్ అవర్’తో ఓల్డ్మన్ తన రెండో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నాడు. ఈసారి గ్యారీ ఓల్డ్మన్ ఆస్కార్ను అందుకుంటాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఈ మధ్యే ఇదే సినిమాకుగాను బెస్ట్ యాక్టర్గా గ్యారీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నాడు. దీంతో ఆస్కార్ కూడా ఈయన్నే వరిస్తుంది అనేవారు కూడా చాలామందే ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. అప్పటి బ్రిటీష్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ తీసుకునే ఒక కీలక నిర్ణయం చుట్టూ సినిమా నడుస్తుంది. డెంజెల్ వాషింగ్టన్ (‘రోమన్ జె. ఇజ్రాయెల్ ఎస్క్’) డేనియల్ లూయీజ్ తర్వాత ఈ లిస్ట్లో ఆస్కార్కు దగ్గరి వ్యక్తి అంటే డెంజెల్ వాషింగ్టన్. గతంలో గ్లోరీ (1989), ట్రైనింగ్ డే (2002) సినిమాలకు ఆస్కార్ అందుకున్న డెంజెల్, ఇవి కాకుండా ఎనిమిది నామినేషన్స్ కూడా దక్కించుకున్నాడు. నామినేషన్స్, అవార్డులు కలిపి చూస్తే ఈ లిస్ట్లో ఆస్కార్కు బాగా దగ్గరి వ్యక్తి అంటే డెంజెల్ అనే చెప్పుకోవాలి. తన జీవితాన్నంతా న్యాయం కోసం పోరాడటానికే అంకితం ఇచ్చేసిన న్యాయవాది పాత్రలో డెంజిల్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ఆస్కార్ 2018 ‘బెస్ట్ యాక్టర్ అవార్డు’ ఎవరికి వస్తుందనే దానిపై ఎన్ని చర్చలు జరిగినా, అసలు ఫలితం తేలాలంటే మార్చి 4 వరకూ ఆగాల్సిందే! ఈ ఐదుగురూ ఎవరికి వారే గట్టి పోటీ ఇచ్చేవాళ్లే కావడంతో ‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’ అనే టైమ్కి ఎవరు లేచి నిలబడి, స్టేజ్ వరకూ వెళ్లి అవార్డు అందుకుంటారో వేచి చూడాలి!! డేనియ్ డే లూయీజ్, డెంజెల్ వాషింగ్టన్ -
రివీల్ చేస్తారట!
జనవరి 24. హాలీవుడ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు. విశేషం ఏంటా అనుకుంటున్నారా? మార్చి 4న 90వ ఆస్కార్ వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించిన నామినేషన్స్ ఈ బుధవారం అనౌన్స్ చేస్తారట. ఈ అనౌన్స్మెంట్కు సంబంధించిన చిన్న క్లూను ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్’ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఆ క్లూ ఏంటంటే.. ఆస్కార్ ఫైనల్స్ రౌండ్ వరకూ చేరుకున్న యాక్టర్స్, మూవీస్ నామినేషన్ లిస్ట్ను బాలీవుడ్ నటి, హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రియాంకా చోప్రా రివీల్ చేస్తారట. ప్రియాంకతో పాటు రెబల్ విల్సన్, రొసారియో డాసన్, మిచెల్ రోడ్రిగేజ్ లాంటి హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇందులో పాల్గొంటారట. దీనికి సంబంధించిన షూటింగ్ లొకేషన్ పిక్స్ను బయటకు వదిలి ఆస్కార్ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరింత ఆసక్తి రేపింది ‘ఆస్కార్ బృందం’. -
ఆస్కార్లోనూ ఆ రెండు సినిమాలే!?
హాలీవుడ్ సినిమాకు అవార్డులంటే ఆస్కార్ అవార్డులే! ఇక ఆ తర్వాత చెప్పుకునే అవార్డులంటే ‘గోల్డెన్ గ్లోబ్’. చాలాసార్లు ఈ రెండు అవార్డుల ఫలితాలూ ఒకేలా ఉంటాయ్! బెస్ట్ అనుకునే సినిమా రెండు అవార్డులనూ తన్నుకుపోతుంది. ఈ ఏడాదికి కూడా ఆస్కార్ బరిలో మహా మహా దర్శకుల సినిమాలే పోటీపడనున్నాయి. ఆస్కార్ నామినేషన్స్ అనౌన్స్ కావడానికి ఇంకా నెల టైమ్ ఉంది. ఏయే సినిమాలు నామినేషన్స్ దక్కించుకుంటాయి అన్నది ఇంకా సస్పెన్సే! గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ అయితే ఇప్పటికే బయటకొచ్చేశాయ్. ఇందులో ‘ది షేప్ ఆఫ్ వాటర్’ మొత్తం ఏడు నామినేషన్స్ దక్కించుకుంది. స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన ‘ది పోస్ట్’ ఆరు నామినేషన్లు దక్కించుకుంది. ఈ రెండు సినిమాలకు చాలాకాలం నుంచే విపరీతమైన క్రేజ్ ఉంది. గోల్డెన్ గ్లోబ్లో ఈ సినిమాలు నామినేషన్స్ తెచ్చుకోవడంతో ఆస్కార్ నామినేషన్స్లోనూ ఈ రెండు సినిమాలదే జోరు ఉంటుందని హాలీవుడ్ సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 2018 జనవరి 7న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానం జరగనుంది. ది షేప్ ఆఫ్ వాటర్ -
ఆర్టీసీలో ఎన్నికల సందడి
సాక్షి,అమరావతి బ్యూరో : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికల సందడి మొదలయింది. గుర్తింపు ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ఆర్టీసీలో కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 16న జరిగే ఎన్ని కలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 9న పరిశీలన, 10 నుంచి 13వ తేదీ వరకు ఉపసంహరణ జరుగు తుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం యూనియ¯ŒS నేతలు వ్యూహప్రతివ్యూహా లతో ఎన్నికల వేడి పెంచారు. ఐదేâýæ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో ఈయూ, ఎస్డబ్యూఎఫ్ మిత్రపక్షంగా, ఎ¯ŒSఎంయూ యూనియ¯ŒS స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నాయి. టీఎ¯ŒSటీయూసీ అనుబంధ కార్మిక సంఘం కార్మికపరిషత్ మాత్రం అటూ ఈయూతో, ఇటు ఎ¯ŒSఎంయూలతో అవసరమైన ప్రాతిపదికన పొత్తులు పెట్టుకుంటోంది. ఈ ఎన్నికలను ఆ యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 127 డిపోలు, 5 వర్క్ షాపులు, ఒక అడ్మినిసే్ట్రటివ్ ఆఫీసు పరిధిలోని 245 కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్ల పరిధిలో ఎన్నికల వేడి పుంజుకొంది. 58 మంది డెలిగేట్స్ ఎన్నిక కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్ల పరిధిలో సీసీఎస్ సభ్యులుగా ఉన్న 14,337 మంది ఈ ఎన్నికల్లో పాల్గొని 58మంది డెలిగేట్స్ను ఎన్నుకోవాలి. అమరావతి పరిధిలో ఉన్న కృష్ణా రీజియ¯ŒS పరిధిలో 26 మంది, గుం టూరు రీజియ¯ŒS పరిధిలో 22 మందిని డెలిగేట్స్ను ఎన్నుకోవాలి. విజయవాడ జో¯ŒS పరిధిలో ఉన్న పశ్చిమ గోదావరి రీజియ¯ŒS పరిధిలో 10 మందిని ఎన్నుకోవాలి. ఈ డెలిగేట్స్ అంతా కలిసి 9 మందితో కూడిన పాలకవర్గాన్ని ఈనెల 30వ తేదీన ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఎంప్లాయీస్ యూనియ¯ŒS (ఈయూ) నేతృత్వంలో పాలకమండలి పనిచే స్తోంది. ఆర్టీసీ కార్మికుల కోసం పనిచేసే ఈ సొసైటీ వెయ్యికోట్ల రూపాయల టర్నోవర్తో పనిచేస్తుంది. పూర్తి స్థాయి ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉన్న కో– ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్) ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు వ్యక్తిగత, విద్య, ఇంటి నిర్మాణం, తదితర అవసరాలకు అవసరమైన రుణాలు అందిస్తారు. ఆ రెండు యూనియన్ల మధ్యే పోటీ ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో ఈయూ, ఎస్డబ్యూఎఫ్, కార్మిక పరిషత్తో కూటమికట్టి బరిలోకి దిగుతున్నాయి. గత గుర్తింపు ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గుర్తింపు తెచ్చుకున్న ఎ¯ŒSఎంయూ స్వతంత్రంగా బరిలోకి దిగుతోంది. అటు కూటమితో ఎలాగైనా సీసీఎస్ను కైవసం చేసుకోవాలని ఈయూ ఉవ్విళ్లూరుతోంది. 31 నామినేషన్లు దాఖలు కృష్ణా రీజయ¯ŒS పరిధిలో 26 మంది డెలిగేట్స్ ఎన్నికకు రెండు రోజులుగా 17 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ఎ¯ŒSఎంయూ తరుఫున 12, ఎంప్లాయీస్ యూనియ¯ŒS తరుఫున 5 నామినేషన్లు వేశారు. గుంటూరు రీజియ¯ŒS పరిధిలో 22మంది డెలిగేట్స్కు 14 నామినేషన్లు దాఖలుచేశారు. ఎ¯ŒSఎంయూ నుంచి 10, ఎంప్లాయీస్ యూనియ¯ŒS నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
– కొత్తపేట ఎంపీటీసీ ఏకగ్రీవం – మూడు సర్పంచ్లు, 9వార్డు సభ్యులకు ఎన్నికలు – ప్రచారంలోకి అభ్యర్థులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్) : జిల్లాలో మూడు సర్పంచ్, 47వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పోటీలో ఉండే అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మంగళవారం పరిశీలించారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. బాలనగర్ మండలం నేరెళ్లపల్లి సర్పంచ్ స్థానానికి 6 నామినేషన్లు రాగా ఒక్కరు తన నామినేషన్ను ఉపసంహరించుకోగా మిగిలిన ఐదుగురు బరిలో నిలిచారు. కోయిలకొండ మండలలోని బూర్గుపల్లి సర్పంచ్ స్థానానికి మూడు నామినేషన్లు రాగా ఒక్కరు ఉపసంహరించుకున్నారు. ఇద్దరు బరిలో ఉన్నారు. మద్దూర్ మండలంలోని పల్లెర్ల గ్రామానికి ఐదు నామినేషన్లు రాగా ఇద్దరు ఉపసంహరించుకున్నారు. ముగ్గురు బరిలో నిలిచారు. మొత్తం 47వార్డు సభ్యులకు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. 37 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో హన్వాడ మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 9స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో సీకేపల్లి, వటవర్లపల్లి, చిన్నతాండ్రపాడు, కుమార్లింగంపల్లి, పెద్దనందిగామ, నాచారం, బాలానగర్, శ్రీరంగాపూర్, బొక్కలోనిపల్లి గ్రామాల్లో వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. కాగా కేశంపేట మండలంలోని కొత్తపేట ఎంపీటీసీ ఎన్నిక ఏకగ్రీవమయింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో 8వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు. -
ఇప్పటివరకు 114 నామినేషన్ల తిరస్కరణ
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ 114 నామినేషన్లు తిరస్కరించడం జరిగిందని ఆయన సోమవారమిక్కడ వెల్లడించారు. ఇంకా 23 వార్డులకు సంబంధించి వివరాలు అందలేదని చెప్పారు. ఓటరు జాబితాలో పేరు లేకపోవడం, ముగ్గురు సంతానం ఉన్నవారి నామినేషన్లు తిరస్కరించినట్లు కమిషనర్ తెలిపారు. మరోవైపు 126వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి శేఖర్ యాదవ్ నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉండటంతో అధికారులు నామినేషన్ తిరస్కరించడం జరిగింది. కాగా 1-6-1994 నాటికి ముగ్గురు పిల్లలు ఉంటే వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
ఏపీఎంసీ సభ్యుల స్థానాలకు మద్దతుదారులతో నామినేషన్లు దాఖలు గంగావతి: గంగావతి తాలూకాలో రెండు ఏపీఎంసీ సభ్యు ల స్థానాలకు ఈనెల 18న నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శనివారం ముగిసింది. శనివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నగరంలోని ఏపీఎంసీ కార్యాలయంలో జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గంగావతి, కారటగి రెండు ఏపీఎంసీలలో 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గంగావతి ఏపీఎంసీకి 13 మంది వ్యవసాయ క్షేత్ర సా ్థనాల పరిధిలో 71,735 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 53,398 మంది పురుష ఓటర్లు, 19,337 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వర్తకుల క్షేత్ర స్థానం పరిధిలో 888 మంది ఓటర్లు కలిగి ఉండగా, ఇందులో 864 మంది పురుష ఓటర్లు, కేవలం 24 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. కారటగి ఏపీఎంసీ పరిధిలో 33,784 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 24,596 మంది పురుష ఓటర్లు, 9,188 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈనెల 18న జరిగే ఎన్నికలకు గంగావతి ఏపీఎంసీకి 145 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. కారటగి ఏపీఎంసీకి 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు ఏపీఎంసీలకు వర్తకుల కోసం కేటాయించిన ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్ నాయకులు ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలకు తమ మద్దతుదారులైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. -
ముగిసిన 8వ దశ నామినేషన్ల పర్వం
న్యూఢిల్లీ: వచ్చే నెల 7న జరగనున్న ఎనిమిదవ విడత పోలింగ్కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ దశలో సీమాంధ్రలోని 25 స్థానాలు సహా ఏడు రాష్ట్రాల్లోని 64 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో బీహార్లో 7, హిమాచల్ప్రదేశ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 2, ఉత్తరప్రదేశ్లో 15, ఉత్తరాఖండ్లో 5, పశ్చిమబెంగాల్లోని 6 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 21 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 23తో ఆఖరు. హిమాచల్ప్రదేశ్లో చివరి రోజైన శనివారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటితో కలిపి మొత్తం 52 నామినేషన్లు దాఖలయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా స్థానం నుంచి 18 మంది, లడక్ స్థానం నుంచి 9 మంది పోటీలో ఉన్నారు. పశ్చిమబెంగాల్లోని ఆరు స్థానాలకు 79 మంది నామినేషన్లు వేశారు. వారణాసిలో మోడీపై హిజ్రా పోటీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 12న జరిగే తుది విడత పోలింగ్కు సంబంధించి ఇప్పటి వరకు 46 నామినేషన్లు దాఖలయ్యాయి. యూపీలో మోడీ పోటీ చేయనున్న వారణాసి స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వారణాసి నుంచి హిజ్రా కమల నామినేషన్ వేశారు. ఎస్పీ తరపున కైలాశ్ చౌరాసియా కూడా నామినేషన్ వేశారు. -
బీజేపీ నోట్లో మట్టికొట్టిన బాబు
వారికిచ్చిన సీట్లలో టీడీపీ అధికారిక పోటీ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులకు బీ ఫారాలిచ్చిన చంద్రబాబు పలుచోట్ల రెబెల్స్గా టీడీపీ నేతలు పొత్తుల్లో మొదటి నుంచి కోతలే అభ్యర్థుల ఎంపికపైనా పెత్తనం మండిపడుతున్న బీజేపీ అభ్యర్థులు హైదరాబాద్: బీజేపీ నాయకత్వం అనుమానించినట్టే జరిగింది. పొత్తు పేరుతో తెలుగుదేశం పార్టీ బీజేపీ నోట్లో మట్టి కొట్టింది. పొత్తు కుదిరిన రోజు నుంచి రోజుకో డ్రామా నడిపిస్తూ బీజేపీకి కేటాయించిన సీట్లల్లో కోత పెడుతూ చివరికొచ్చేసరికి అసలుకే ఎసరు పెట్టింది. కేవలం మూడు నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్నేహ ధర్మాన్ని పక్కనపెట్టారు. నామినేషన్ల ఘట్టం చివరి రోజు వరకూ మిత్రపక్షానికి సాకులు చెబుతూ పొత్తు సీట్లలో కోత పెట్టిన చంద్రబాబు.. నామినేషన్ల చివరి రోజు శనివారం బీజేపీకి కేటాయించిన మరో మూడు సీట్లలో తమ పార్టీ నేతలకు అధికారిక బీ ఫారాలు అందజేసి అభ్యర్థులను పోటీకి దించారు. పొత్తులో బీజేపీకి ఇవ్వాల్సిన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, వైఎస్ఆర్ జిల్లాలోని కడప, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ అధికారిక బీ ఫారంతోనే పోటీకి పెట్టింది. మిగిలిన చోట్ల కూడా టీడీపీ నేతలు పలువురు బీజేపీకి వ్యతిరేకంగా స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. హైడ్రామా నడుమ ఇరు పక్షాల నేతలు శుక్రవారం పొత్తుపై మరో దఫా చర్చలు జరిపి ఒక అంగీకానికి వచ్చిన దరిమిలా టీడీపీ అధికారికంగా అభ్యర్థులను బరిలోకి దింపడంపై కమల దళం అగ్గిమీదగుగ్గిలమవుతోంది. సంతనూతలపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ కాంగ్రెస్ పార్టీకి స్వస్తి చెప్పి కమలం, సైకిల్ పొత్తు కుదరడానికి కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరారు. పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థి దారా సాంబయ్యకు వ్యతిరేకంగా విజయకుమార్ మూడు రోజుల కిందట నామినేషన్ వేయగా.. శనివారం ఆయనకు చంద్రబాబు బీ ఫారం అందజేశారు. కడప అసెంబ్లీ స్థానంలో బీజేపీ ప్రకటించిన కె.హరినాథరెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నేత ఆర్. శ్రీనివాస్రెడ్డి బీ ఫారంతో శనివారం నామినేషను దాఖలు చేశారు. గుంతకల్లులో జితేంద్రగౌడ్కు బీ ఫారం ఇచ్చి బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ పోటీలో నిలిపింది. వీటితో పాటు బీజేపీకి కేటాయించిన పాడేరు అసెంబ్లీ స్థానంలో ఇద్దరు టీడీపీ నేతలు రెబల్స్గా పోటీలో ఉంటే, తాడేపల్లిగూడెం, విజయవాడ పశ్చిమ, కైకలూరులో ఒక్కొక్కరు, నరసరావుపేట, మదనపల్లిలో ముగ్గురేసి టీడీపీ నాయకులు రెబల్స్గా పోటీలో ఉన్నారు. వీటిలో పలువురు టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. నరసాపురం లోక్సభ స్థానంలో బీజేపీ నేత రఘురామకృష్ణరాజు రెండు రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు సూచన మేరకే ఆయన నామినేషన్ దాఖలు చేశారని ప్రచారం జరిగింది. దీనికి తోడు రాజమండ్రి అర్బన్ స్థానంలో టీడీపీ నేత గోరుంట్ల బుచ్చయ్యచౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు రాజమండ్రి రూరల్ స్థానం కేటాయించడంతో అర్బన్లో వేసిన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. కోతలపై కోతలు.. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినపుడు సీమాంధ్రలో బీజేపీకి 5 లోక్సభ, 15 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ప్రాంతంలో నామినేషన్లు ప్రారంభమయ్యే నాటికి ముందు అనుకున్న సీట్లలో ఒక్కో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు కోత పెట్టి బలవంతంగా బీజేపీ రాష్ట్ర నేతలను ఒప్పించారు. మిగిలిన నాలుగు లోక్సభ, 14 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా... వారు బలహీనంగా ఉన్నారంటూ టీడీపీ కొత్త నాటకానికి తెరతీసింది. తుది ధపా చర్చల్లో మరో అసెంబ్లీ సీటుకు సైతం చంద్రబాబు కోత పెట్టారు. తీరా ఇప్పుడు మరో మూడు బీజేపీ నియోజకవర్గాలలో టీడీపీ తమ పార్టీ అధికారిక అభ్యర్థులను పోటీలో నిలిపి బీజేపీకి గట్టి షాకిచ్చింది. అగ్రనేతల సీట్లు సేఫ్.. పొత్తులలో పార్టీకి కేటాయించిన దాదాపు అన్ని సీట్లలో టీడీపీ నేతలు అధికారికంగానో, రెబల్స్గానో పోటీలో ఉన్నప్పటికీ బీజేపీ ముఖ్యనేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో మాత్రం కనీసం రెబల్స్ బెడద కూడా లేకపోవడం విశేషం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పోటీ చేస్తున్న విశాఖ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజంపేట లోక్సభ స్థానాల్లో పోటీ అభ్యర్థులు లేరు. ఇక కోడుమూరులో అయితే బీజేపీ తొలుత ప్రకటించిన అభ్యర్థిని టీడీపీ బలవంతంగా మార్పించింది. ఇక్కడ టీడీపీ నేతలు పోటీలో లేకపోవడం గమనార్హం. -
మాకినేని పెదరత్తయ్య హల్చల్
గుంటూరు : గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్ల సందర్భంగా టీడీపీ నేత మాకినేని పెదరత్తయ్య హల్చల్ చేశారు. ఇతరులను నామినేషన్ కేంద్రంలోకి అనుమతించనందుకు సీఐ శ్రీనివాసరావుపై ఆయన దౌర్జన్యం చేశారు. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో సీఐ ...పెదరత్తయ్యను బయటకు లాక్కొచ్చారు. ఈ చర్యను నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట రత్తయ్య ఆందోళనకు దిగారు. -
బీజేపీ స్థానాల్లో టీడీపీ నేతల నామినేషన్లు
ఏలూరు : ఓవైపు బీజేపీతో పొత్తులపై చర్చలు జరుపుతూనే మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు. బీజేపీ స్థానాల్లో టీడీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారు. నర్సాపురం లోక్సభ స్థానానికి రఘురామ కృష్ణంరాజు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒక సెట్ నామినేషన్ బీజేపీ తరపున...మరో సెట్ నామినేషన్ను బీజేపీ తరపున ఆయన సమర్పించారు. ఇక తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానానికి కొట్టు సత్యనారాయణ మూడు సెట్ల నామినేషన్లు వేశారు. ఒక సెట్ ఇండిపెండెంట్గా, రెండో సెట్ బీజేపీ తరపున, మూడో సెట్ టీడీపీ తరపున నామినేషన్ వేశారు. చంద్రబాబు నాయుడు సూచనలతోనే వీరు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. -
15 నుంచి ఓటర్ స్లిప్పుల జారీ
తనిఖీల్లో దొరికిన మొత్తం రూ. 92.58 కోట్లు 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండి స్వాధీనం రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ వెల్లడి హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 17 పార్లమెంట్ స్థానాలకు గాను 267 మంది రంగంలో మిగిలారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1682 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ శనివారం వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో ఈ నెల 12వ తేదీ వరకు ఓటర్ల సంఖ్య 2,81,66,266గా ఉందని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో 3.63 కోట్ల మందితో కలిపి రాష్ట్రం మొత్తం మీద 6.45 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరుగనున్నందున, 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వానికి తెరపడుతుందన్నారు. 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉన్న స్థానాల్లో రెండేసి ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఓటరు స్లిప్పుల పంపిణీ మొదలవుతుందని, వారంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భన్వర్లాల్ చెప్పారు. ఓటరు స్లిప్పులను ఓటర్కు లేదా వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తామని, అందువల్ల ఈ వారం పాటు ఇళ్లలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. వాటిలో పోలింగ్ కేంద్రం సంఖ్య, ప్రాంతం, పోలింగ్ సమయం ముద్రించి ఉంటుందని వివరించారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చీరలు, ఇతర సామగ్రి పంపిణీకి సంబంధించి కలెక్టర్ నుంచి నివేదిక అందిందని, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. నోటా గుర్తు విషయంలో హైకోర్టు ఆదేశాలపై ఈసీకి నివేదించామని, వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భన్వర్లాల్ తెలిపారు. దేశంలోనే అత్యధికంగా నగదు స్వాధీనం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నగదు తరలిస్తున్న వారి నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటి వరకు 92.58 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. అలాగే 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండితోపాటు 3.48 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ డబ్బును కోర్టుకు అప్పగించి, ఆదాయపన్ను శాఖకూ సమాచారమిస్తున్నామన్నారు. సరైన ఆధారాలను చూపించి డబ్బును తిరిగి పొందవచ్చని, అలాగే ఆదాయపన్ను శాఖకు సరైన వివరాలు ఇవ్వలేనిపక్షంలో వారు విధించే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రానికి 400 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయని, వాటిని నక్సల్ ప్రభావిత, ఫ్యాక్షన్ ప్రాంతాల్లో వినియోగించనున్నామని చెప్పారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎంపీకి పోటీ ఎక్కువ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం 39 మంది ఎంపీ అభ్యర్థులు, 554 మంది అసెంబ్లీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకొన్నారు. దీంతో మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ స్థానాల నుంచి అత్యధికంగా 30 మంది చొప్పున, నాగర్కర్నూలుకు అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు. నియోజకవర్గాలవారీగా చూస్తే.. ఆదిలాబాద్(8), పెద్దపల్లి(17), కరీంనగర్(17), నిజామాబాద్(16), జహీరాబాద్(10), మెదక్(13), మల్కాజిగిరి(30), సికింద్రాబాద్(30), హైదరాబాద్(16), చేవెళ్ల(16), మహబూబ్నగర్(10), నాగర్కర్నూల్(6), నల్లగొండ(9), భువనగిరి(13), వరంగల్(12), మహబూబాబాద్(17), ఖమ్మం ఎంపీ స్థానానికి 27 మంది రంగంలో ఉన్నారు. ఆందోల్ అసెంబ్లీ స్థానానికి ఐదుగురే..: మెదక్ జిల్లా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదుగురే రంగంలో నిలవగా.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, ఖమ్మం అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 25 మంది చొప్పున పోటీలో ఉన్నారు. కాగా జిల్లాల వారీగా చూస్తే... ఆదిలాబాద్లో 10 స్థానాలకు 124 మంది, నిజామాబాద్లో 9 సీట్లకు 101 మంది, కరీంనగర్లోని 13 నియోజకవర్గాలకు 168 మంది, మెదక్లో పది స్థానాలకు 105 మంది, రంగారెడ్డిలో 14 స్థానాలకు 284 మంది, హైదరాబాద్లో 15 స్థానాలకు 298 మంది, మహబూబ్నగర్లో 14 స్థానాలకు 144 మంది, నల్లగొండలోని 12 స్థానాల్లో 161 మంది, వరంగల్లో 12 నియోజకవర్గాలకు 154 మంది, ఖమ్మంలో పది స్థానాలకు 143 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. -
సీమాంధ్రలో మోగిన ఎన్నికల నగారా
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీమాంధ్రలో ఎన్నికల నగారా మోగింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో జరగనున్న 25 ఎంపీ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. కాగా ఈనెల 13న ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి, అలాగే 18వ తేదీ గుడ్ఫ్రైడేను సెలవు దినాలుగా ప్రకటించారు. దాంతో ఈ మూడు రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 తుది గడువు. పోలింగ్ మే 7వ తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 16న జరుపుతారు. -
సీమాంధ్రలో ఎన్నికలకు నేడే నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ స్థానాలకు శనివారం ఉదయం 11 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. అప్పటినుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే మధ్యలో 3 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆ సెలవుల రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఈ నెల 13వ తేదీన ఆదివారం సెలవు వస్తోంది. అలాగే 14వ తేదీన అంబేద్కర్ జయంతిని, అలాగే 18వ తేదీ గుడ్ఫ్రైడేను నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ చట్టం కింద సెలవు ప్రకటించారు. దీంతో ఈ మూడు రోజుల్లోను నామినేషన్లు స్వీకరించరు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 తుదిగడువు. పోలింగ్ మే 7న, ఓట్ల లెక్కింపు 16న జరుగుతాయి -
చివరిరోజు భారీగా నామినేషన్లు
{పముఖుల్లో కేసీఆర్, జైపాల్రెడ్డి, పొన్నాల, కిషన్రెడ్డి, దినేష్రెడ్డి, ఎర్రబెల్లి నేడు నామినేషన్ల పరిశీలన.. 12న ఉపసంహరణకు ఆఖరి రోజు హైదరాబాద్: తెలంగాణలో సాధారణ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రధాన అభ్యర్థులంతా చివరిరోజునే నామినేషన్లు దాఖలు చేశారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను దశల వారీగా మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత , బుధవారం ఉదయం కూడా ప్రకటించడంతో ‘బీ’ ఫారాలు తీసుకోవడం, నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ యూవత్తూ హడావుడిగా సాగింది. దశమి మంచిరోజు అనే ఉద్దేశంతో పలువురు ప్రముఖులు బుధవారం వరకు వేచి చూసి నామినేషన్లు దాఖలు చే శారు. మధ్యాహ్నం మూడు గంటల వరకే గడువు కాగా.. కొన్నిచోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరుుతే సమయంలోగా క్యూలో నిలబడినవారికి టోకెన్లు ఇచ్చి వారంతా నామినేషన్లు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. చివరిరోజున నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (మెదక్ పార్లమెంటు, గజ్వేల్ అసెంబ్లీ), ఆయన కుమార్తె కవిత (నిజామాబాద్ లోక్సభ), కేంద్ర మంత్రి ఎస్.జైపాల్రెడ్డి (మహబూబ్నగర్ లోక్సభ), టీపీసీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య (జనగామ), పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (నిజామాబాద్ రూరల్), మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (ఆంధోల్), మాజీ మంత్రి కె.జానారెడ్డి (నాగార్జునసాగర్), వైఎస్సార్సీపీ తరఫున మాజీ డీజీపీ దినేష్రెడ్డి (మల్కాజిగిరి లోక్సభ), పీజేఆర్ కుమార్తె విజయూరెడ్డి (ఖైరతాబాద్), ఎం.ఎ.రహమాన్ (మహబూబ్నగర్ లోక్సభ), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి (అంబర్పేట), బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ (సికింద్రాబాద్ లోక్సభ), టీడీపీ సీనియర్లు ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి), మోత్కుపల్లి నర్సింహులు (మధిర), సీపీఐ నాయకుడు నారాయణ (ఖమ్మం లోక్సభ) తదితరులు ఉన్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 12 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్ లోక్సభ, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీకి అత్యధిక నామినేషన్లు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 68 నామినేషన్లు దాఖలయ్యూరుు. అత్యల్పంగా నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యూరుు. ఇక అసెంబ్లీకి వస్తే అత్యధికంగా నిజామాబాద్ అర్బన్కు 55 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా ముథోల్కు 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
.ఉత్కంఠ!
సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలోని రెండు లోక్సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడే 2వ తేదీ నుంచే నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. 9వ తేదీ ఆఖరు తేదీ. ఎన్నికలు ముంగిట్లో నిలిచినా.. ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలేవీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఒక్క సీపీఎం మాత్రమే నల్లగొండ, భువనగిరి లోక్సభ, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. ఉగాది రోజునే తొలి జాబితా ప్రకటిస్తామని తొలుత ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం.. పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కిరాని కారణంగా మరో మూడు నాలుగు రోజులు జాబితాల విడుదలను వాయిదా వేసుకుంది. దీంతో కాంగ్రెస్లో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న పలువురు ఢిల్లీలో మకాం వేసి ఏఐసీసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆ పార్టీ సీపీఐతో పొత్తులు దాదాపు ఓ కొలిక్కి వచ్చినా, అధికార ప్రకటన వెలువడక పోవడంతో అభ్యర్థులనూ ప్రకటించడం లేదు. పార్టీ వర్గాల సమాచారం మేరకు సీపీఐ మునుగోడు, దేవరకొండలను తీసుకుం టుంది. కాంగ్రెస్ మరో పదిచోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంది. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాలు తీవ్ర ఉత్కంఠను రేపుతుండగా, కోదాడ అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం ఇంకా, తమ అభ్యర్థులను మాత్ర,అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఆ పార్టీ నుంచి టికెట్లు ఖాయం అన్న ధీమాతో ఉన్న నాయకులు కొందరు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒంటరి పోరుకు సిద్ధమంటున్న టీఆర్ఎస్ సైతం తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. అయితే, చివరి నిమిషంలో కాంగ్రెస్తో పొత్తు కుదిరినా కుదరొచ్చన్న కారణంగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూర్నగర్ నుంచి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను పోటీకి పెడుతున్నట్లు ప్రచారం జరిగినా, పార్టీ అధినేత కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. సీపీఐతోనూ ఆ పార్టీ పొత్తు ఉంటుందా, ఉండదా అన్న విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. ఈ కారణంగానే జిల్లాలో టీఆర్ఎస్ పోటీ చేసే స్థానాల విషయంపై ఇంకా గందరగోళమే నడుస్తోంది. టీడీపీ-బీజేపీల పరిస్థితి దీనికంటే భిన్నంగా ఏమీలేదు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురిందని, ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయమూ ఖరారైందంటున్నా.. ఇంకా అధికార ప్రకటన రాలేదు. దీంతో ఈ రెండు పార్టీల శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బీజేపీ మొత్తం అన్ని సీట్లలో పోటీ చేసే పరిస్థితిలో లేకపోవడం, టీడీపీ తరపున బరిలోకి దిగడానికి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉండడం వంటి కారణాలతో ఇరు పార్టీల కార్యకర్తలు టెన్షన్లోనే ఉన్నాయి. లోక్సభ, అసెంబ్లీ స్థానాల పంపకాలు జరిగినా, నాయకత్వాల నుంచి ఎప్పుడు ప్రకటన వెలువడుతుందాని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు ఖరారు చేసుకున్న సీపీఐ మాత్రం తమ సిట్టింగ్ స్థానం మునుగోడు, చానాళ్ల పాటు తమ ప్రాతినిధ్యంలో ఉన్న దేవరకొండ సీట్ల నుంచి పోటీకి సిద్ధమవుతోంది. అయితే, ఆ పార్టీ సైతం తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈసారి మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే యాదగిరిరావును పక్కన పెట్టి వేరొకరికి అవకాశం ఇవ్వాలన్న చర్చ సీపీఐలో జరుగుతోందని చెబుతున్నారు. నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో కూడా మెజారిటీ ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించకుండా రాజకీయ విశ్లేషకులకు పనికల్పించాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ఇక ‘సార్వత్రికం’
‘పుర’ పోరు ముగిసింది. ‘స్థానిక’ సమరం సాగుతోంది. ఇక జిల్లా యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల రంగానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి సంబంధించి నామినేషన్ల పర్వానికి గడువు సమీపిస్తుండడంతో అధికారులు అందుకు రెడీగా ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీలు కూడా తమ అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు తీవ్రస్థాయిలో చేస్తున్నాయి. వివిధ కోణాల్లో అంచనాలు వేసుకుంటూ జాబితాలు రూపొందించే పనిలో పడ్డాయి. సార్వత్రిక సమరభేరికి రాజకీయ పక్షాలు సన్నద్దమయ్యాయి. రేపటి(బుధ వారం)నుంచి అసెంబ్లీ, పార్లమెంటు సాధా రణ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. జిల్లా అధికారయంత్రాంగం అందుకు అనుగుణంగా సర్వసన్నద్దమైంది. జిల్లాలోని రెం డు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు సం భందించి నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఈ నెల 2 నుంచి 9వ తేదిల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన, 11, 12 తేదిల్లో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఎన్నికలు ఈనెల 30న జరుగనున్నాయి. నామినేషన్ దాఖలిలా... మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీచేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ ఎం.గిరిజా శంకర్కు అందజేయాల్సి ఉంటుంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల సహాయాధికారి అయిన జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్కు దాఖలు చేయవలసి ఉంటుంది. పార్లమెంట్కు పోటీచేయనున్న జనరల్ లేదా బీసీ అభ్యర్థులు నామినేషన్ ధరావత్తు రూ..25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.12,500లు చెల్లించవలసి ఉంటుంది. అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ స్థానానికి పోటీచేయనున్న జనరల్, బీసీ అభ్యర్థులు నామినేషన్ ధరావత్తు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు... పార్లమెంట్ స్థానానికి పోటీచేయనున్న అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఎన్నికల వ్యయం చేయకూడదు. అసెంబ్లీ స్థానానికి పోటీచేయనున్న అభ్యర్థి రూ.28 లక్షల వరకే ఎన్నికల ఖర్చు పెట్టవలసి ఉంటుంది. పోటీచేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు వేసే ముందురోజు ఎన్నికల ఖర్చుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లను తెరవాల్సి ఉంటుంది. లావాదేవీలన్ని అదే అకౌంట్ ద్వారా నిర్వహించి ఎన్నికల అధికారులకు ఖర్చు లెక్కలు చూపాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చుకు పొందుపర్చవలసిన అవసరం ఉంటుంది. -
ప్రచారానికి పదును
పురపాలక సంఘాలు, నగరపంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఓ క్రతువు ముగిసింది. నామినేషన్ల పరిశీలన ఘట్టం ఇప్పటికే పూర్తయింది. మరో వైపు అభ్యర్థులు ప్రచారానికి పదును పెట్టారు. ఓటరు మహాశయుని కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఐదు రోజులపాటు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల పరిధిలో మొత్తం 3,083 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన ఆదివారం కొలిక్కి వచ్చింది. మొ త్తం 323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 2,758 నామినేషన్లు అర్హత సా ధించాయి. దేవరకొండలో దాఖలైన నామినేషన్లలో సగానికిపైగా తిరస్కరణకు గురికావడం గమనార్హం. మొత్తం 340 నామినేషన్లకుగాను 190 నామినేషన్లను అధికారులు తి రస్కరించారు. భువనగిరిలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. అయితే కొన్ని స్థానాలకు ఒక్కో అభ్యర్థి రెండు నామినేషన్లు కూడా సమర్పించారు. ఒకటి కాకపోయినా ఒక టైనా అర్హత సాధిస్తాయన్న ఉద్దేశంతో ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు అందజేశారు. ఈ క్ర మంలో చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లు 18వ తేదీన ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తద్వారా అంతి మంగా బరిలో నిలి చే అభ్యర్థుల సంఖ్య ఎంతన్నది తేలనుంది. ప్రచారబాట పట్టిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అప్పుడే ప్రచారబాట పట్టా రు. వాడల్లో తిరుగుతూ తమకే ఓటేయాలని అర్థిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోవద్దన్న కృత నిశ్చయంతో ఉన్న అభ్యర్థులు ముందు నుంచే ప్రచారం సాగిస్తున్నారు. పరిశీలన లో అర్హత సాధించిన అభ్యర్థులంతా మున్సిపాలిటీల్లో ప్రచారానికి దిగుతున్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ప్రచారంలో తలమునకల య్యా రు. చైర్పర్సన్ అభ్యర్థులదీ ఇదేబాట. ప్రచార ఖర్చు కు ఎన్నికల నిబంధనలు అడ్డు వస్తుండటంతో అభ్యర్థులు కొంత జంకుతున్నారు. ఎలాగైనా గెలవాలనే తపనతో మరికొం దరు ఖర్చుకు వెనకాడటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా మద్యం, ఇతర ఖర్చులు పెట్టేస్తున్నారు. -
పాదేశికాలకు రేపటి నుంచి నామినేషన్లు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు నామినేషన్ల స్వీకరణకు జెడ్పీ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల్లో 19.56 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 790 ఎంపీటీసీ స్థానాలు, 56 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జర గనున్నాయి. జిల్లాలో ఓటర్లు 19,56,304 మంది ఉండగా వీరిలో మహిళలు 9,78,920 మంది, పురుషులు 9,77,384 మంది ఉన్నారు. 790 ఎంపీటీసీ స్థానాల్లో 384 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. 56 ఎంపీపీ స్థానాలకుగాను 27 స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. 56 జెడ్పీటీసీ స్థానాల్లో 28 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీపరంగా జరుగుతుండడంతో గ్రామస్థాయిలో ఎన్నికల వేడి పుంజుకుంది. దీంతో నామినేషన్ల కోసం పార్టీ నాయకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈనెల 20వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించేందుకుగాను అన్ని మండల కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని, మరో ఇద్దరు అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగాను, మరో ఏడుగురు జిల్లా స్థాయి అధికారులను అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకుగాను జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కౌంటర్లో పది మండలాల చొప్పున నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన ఈనెల 21న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈనెల 22న తిరస్కరించిన నామినేషన్లకు సంబంధించి అభ్యంతరాలను ఆర్డీవోలకు దాఖలు చేసుకోవచ్చు. వాటిపై తుది నిర్ణయాన్ని 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అధికారులు ప్రకటిస్తారు. 24వ తేదీ సాయంత్రం 3 గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావాలి. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను, వారికి కేటాయించిన గుర్తులను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. 2587 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. కౌంటింగ్ 8వ తేదీ చేపట్టి పూర్తికాగానే ఫలితాలు ప్రకటిస్తారు. -
ఓటయితే ఎయ్యరాదే..!
నాయకుడు : ‘తాత మన వార్డు కౌన్సిలర్ సీటు ఆడోళ్లకచ్చిందే. నా భార్యను నిలబెట్టిన. ఏట్లైన మనమే గెలుస్తమన్న నమ్మకముందే. ఎందుకైన మంచిదని ముందగల్లా మన అనుకున్నోళ్లను కలుస్తున్న. మన గల్లీల ఏఇంట్లో ఎంతమంది ఉన్నరో.. ఓళ్లకు ఎంజెప్తే సమజైతదో నీ పక్కా ఎరుక్కుంటదని అచ్చిన్నే. మన గల్లీలో రచ్చబండ పెట్టినప్పుడు ముసలోలందరిని కూడగట్టుకుని ఫించన్లు కావాలే.. అని లొల్లి పెట్టి, అచ్చిన ఆఫీసర్లను పరేషాన్ జేసినవ్ గదనే. మీ లొల్లికి బుగులు పడి ఫించన్ రానోళ్లందరి అప్లికేషన్లు తీసుకున్నరు. తాత : అవ్ బిడ్డ మంచి ముచ్చట యాదిజేసినవ్. నాఅసుంటి ముసలోల్లు పాపం పించిన్లు రాక,అరిగోసపడుతున్నరు. గల్లీల మీటింగ్లు పెట్టినప్పుడల్లా అప్లికేసన్లు ఇచ్చుడుకే సరిపోయింది. పించిన్లు రాలేదు. మీటింగులల్లా 65 ఏళ్ల నిండి గరీబోళ్లందరికి ఫించన్లు ఇస్తమని, దరఖాస్తుపెట్టుకొమ్మని లీడర్లు, ఆఫీసర్లు చెబితే నమ్మి ఆశపడ్డం. పెద్ద లీడర్లు చెబుతున్నరు నిజంగా ఇత్తరేమోనని కూడబెట్టుకున్న పైసలు ఖర్సుబెట్టి ఫొటువోలు దిగి, అప్లికేసను పెట్టుకున్నం. ఆడికెళ్లి పించిన్ కోసం తిరగనిగడప, మొక్కని కాళ్లు లేవు బిడ్డ. ఎవరికి కనికరం రాలేదాయె. దేవుడా నీవె దిక్కని దినాలు ఎల్లదీస్తున్నం. ఎవరిని అడిగిన.. ఇగో అస్తయ్ అగో అస్తయ్ అంటున్నరు. ఇప్పుడేమో ఎలచ్చన్లు అచ్చినయ్, అయ్యిపోయేదాక రావంటున్నరు. మళ్లీ ఓట్లడుగ అస్తర గదా బిడ్డ అప్పుడు శెప్తామని ఎదురుచూస్తున్నం. నాయకుడు: తాతా ఇగో గా పార్టీ రాజుగాడు గట్లనే జెప్పి అందర్ని పరేషాన్ జేసిండు. ఇగ రందిపెట్టుకోకు. ఈ ఎలచ్చన్ల నా భార్యను గెలుపిస్తే, గల్లీల ఇంటింటికి తిరిగి ముసలోల్లందరి పేర్లు రాసుకుని, అల్లకు పించిన్లు ఇప్పిస్తా. నా మాట మీద నమ్మకముంచే.. నేన్ జూస్కుంట. మీకందరికి పించిన్లు ఇప్పించే జిమ్మెదారి నాది, ఏం ఫికర్ జేయకు. తాత: పోయిన ఎలచ్చన్ల కౌన్సిలర్గా గెలిసిన రాజుగాడూ.. ఓట్ల ముందు గివే మాటలు జెప్పిండు.. మరి గెలిసినంక అడిగితే. తాత నాచేతుల ఏముంది, సర్కారోళ్లు ఇస్తేనే గదా అన్నడు. మల్ల మల్ల అడిగితే కోపమైతుండని, ఇడసబెట్టేసినం. పించిన్లు, ఇల్ల జాగలు , రేషన్కార్డులు, ఇల్లు కట్టుకుంటే లోన్ ఇస్తమని మస్తు మాటలు జెప్పిండు. కడుపు కాలేటోళ్లకు రాలేదు. పెద్ద లీడర్లు చెప్పినోళ్లకొచ్చినయ్. ముచ్చట్లపడి అసలు మాట మరిసిపోయిన బిడ్డ.. ఓట్లల్ల నువ్వే నిలబడుతున్న అంటివి గదా? నాయకుడు : అవ్ తాత.. నేనే పోటీ చేద్దామనుకుని, యాడాది సంది గల్లీలదిరుగుతున్న. అందరి కాడి కెళ్లి చెప్పిన. అందరు మంచ్చిగన్నరు. గని ఏంజేద్దాం. నా అదృష్టం బాగ లేదేమో. మన గల్లీ సీటు ఆడోల్లకు అచ్చింది. ఆడోళ్లను ఇంటి బయటకు తెచ్చుడెందుకని సప్పుడు సెయకుండా ఉన్నుంటి. ఓ పార్టీవోల్లు మేమే ఖర్సుపెడుతం పోటీ చేయమని కబురు పంపిండ్రి. జర ఇంట్ల అరుసుకుంటని జెప్పిన, టైం లేదు.. ఎనకముందు సూడకు మేమున్నం గదా అన్నరు ఆ పార్టీవోళ్లు. గంతే పెళ్లాంను ఎంట దీస్కుని పోయి నామినేషన్ ఏసొచ్చిన. తాత : అవ్ బిడ్డ.. నీ భార్య ఓట్లల్ల గెలిస్తే గల్లీల్ల తిరగాలే. మీటింగులకు పోవాలే. గల్లీలో మంచి చెడ్డ ఏం జరిగిన ముందుగల్ల నిలబడాలే. ఎవరికి ఏమాపత్ అచ్చిన సూడాలే. నీకేమో పెద్దగా కూడవెట్టినై లేకపాయే. ఉన్న రెండెకరాల ఎవుసం చేసుకుని బతకాలే. పెళ్లాం నువ్వు చెరొక పని చేసుకుంటే మంచిగా బతకొచ్చు గదా. గీ ఓట్లల్ల నిలబడితే నీకేమోస్తదంటవ్. ఎలచ్చన్లంటే వట్టిది కాదు. లచ్చలు ఖర్సు పెట్టాలే. పార్టీలోల్లు ఎంతిస్తరు బిడ్డ. బాకీ చేసుకుని పరేషాన్ గాకు. ఒకయాల నీ పెళ్లాం గెలిచిందనుకో.. ఇంట్లో పని వోళ్లు జేస్తరంటవ్. నీ కిద్దరు పిల్లలున్నరు గదా. పొద్దుగల్లానే ఆళ్లని తయారుజేసి బడికి పంపాలే. గిట్ల మస్తు పనులుంటయ్. నాయకుడు: నువ్ జెప్పింది సైయే తాత. నా పెళ్లాం గెలిస్తే యాడికిబోదు. నేనే అన్నీ జూస్కుంట. మూడు నెలకొపారి మున్సిపాలిటిల మీటింగ్ ఉంటదట. దానికి బోతే సరిపాయే. గల్లీల దిరిగేదిముంటది. ఎవుసం చేసుకుంటా అంతా నేనే చూస్తా. తాత: ఇంతకి మన గల్లీల ఎంతమంది పోటీ జేస్తుండ్రు. పెద్ద లీడర్ల సుట్టాలు ఏవరైన ఉన్నరా? పోయిన ఎలచ్చన్ల గెలినోళ్లు, గెలువ నోళ్లు, పక్క గల్లీల నుంచి వచ్చినోళ్లు పోటీ జేస్తుండ్రని విన్న బిడ్డ నిజమేనా? పెద్ద లీడర్లు గల్లీల్ల పెచారంకు అస్తరటని గూ విన్న బిడ్డ.. నాయకుడు: అవ్ తాత.. మస్తుమంది నామినేషన్లు ఏసిండ్రు. రెండు రోజుల దాకా పోటీల ఎవరుంటరో దెల్వదు. ముందగల్ల నా సంగంతి సూడరాదే. పెద్ద,సిన్న లీడర్ల ముచ్చట మనకేందుకే తాత. తాత: గిప్పుడు అసలు ముచ్చట కాడికి అచ్చినవ్. మన గల్లీలో ఏళ్ల కిందట కట్టిన మోరీలు కూలీపోయినయ్, గలీజు నీళ్లు రోడ్లమీదకొచ్చి కంపు ఆసనోస్తుంది, ఆనకాలంలా సంటి పోరగాండ్లకు రోగాలొచ్చి దవాఖానకు పాలైండ్రు. మన గల్లీ పక్కపొంటి పారుతున్న చెరువు కాల్వలో మేము సిన్నప్పుడు ఈతకొట్టినం, నీళ్తు ఎప్పుడు తాజాగా ఉండేయి. ఇప్పుడేమో మోరీల నీళ్లు కలిసి కంపు ఆసనొస్తుంది. పెద్దలీడర్లు గల్లీల్ల ఓట్లడుగ అస్తే అల్ల సంగతి అరుసుకుందామని జూస్తున్నా. నాయకుడు : ఇగో తాత గా పెద్దలీడర్లను ఏమన్న అడుక్కో.. ఏమన్న జేస్కో.. గని నా మాట యాదికుంచుకో. జర మనోళ్ల ఓట్లన్నీ మనకే ఏసేటట్లు సూడే. గా పక్క గంగన్న తాత దగ్గరికి గూడ పోయి ఓ మాటజెప్పెస్తా. -
పల్లె వేడెక్కింది
సార్వత్రిక ఎన్నికలలో ఎలా గట్టెక్కేదని ప్రధాన పార్టీల నేతలు ఆందోళన చెందుతుంటే, పురపాలక ఎన్నికలు, ఆపై వచ్చిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వారికి తల నొప్పి తె చ్చిపెడుతున్నాయి. జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగనున్నాయి. వాటికి సంబంధించి నామినేషన్ల ప్ర క్రియ ముగిసింది. అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో ఎవరికి బీ ఫారం ఇవ్వాల న్న దానిపై ఇంకా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదే సమయంలో నిన్నమొన్నటి వరకు పరిషత్ ఎన్నిక లు వాయిదా పడుతాయనుకున్న వారికి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు సిద్ధం జిల్లాలో 36 మండలాలున్నాయి. ఆయా మండలాలకు సంబంధించి ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఎన్నికలు వచ్చే నెల 6న జరుగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 17 నుంచే మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. అన్ని పార్టీల్లోనూ టికెట్ నాకంటే నాకంటూ పోటీపడుతున్నారు. దీంతో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలో తెలియక ఆయా పార్టీల నేతలు తలలుపట్టుకోవలసి వస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఎన్నికలు రావడంతో ఎవరిని కాదన్నా తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థిత్వాల ఎంపిక సమయంలో జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో చోట ఒక పార్టీ నుం చి నలుగురైదుగురు టిక్కెట్ రేసులో నిలుస్తున్నారు. దీంతో అందరినీ సముదాయించడం తలకుమించిన భారంగా మారింది. పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు పది మ ందిని వెంటేసుకుని ముఖ్య నాయకుల వద్దకు తరలివస్తుండడంతో నేతల ఇండ్లు సందడిగా మారుతున్నాయి. అప్పుడే సిట్టింగులు ఎన్నికలలో పోటీ పడాలనుకుంటున్నవారు గ్రామాలలో అప్పుడే సిట్టింగులు ఏర్పాటు చేసి అందరినీ కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ వస్తుందన్న నమ్మకం ఉన్నవారు మాత్రం ఏకంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల నుంచి టికెట్లు ఆశిస్తున్నవారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న భిక్కనూరు మండలంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు జడ్పీటీసీగా బరిలో నిలవడానికి సిద్ధమై తనకు సంబంధించిన భూమిని అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది . మరొకరు జడ్పీటీసీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు గాను తన స్నేహితుల తో విందు ఏర్పాటు చేయగా అందరూ మద్దతు తెలిపి రూ. 20 లక్షల వరకు సహాయం అందిస్తామని ముందుకు వచ్చినట్టు సమాచారం. ఎస్సీ మహిళకు రిజర్వు అయిన మాచా రెడ్డి జడ్పీటీసీ స్థానంలో తమ కుటుంబ సభ్యులను పోటీకి నిలపడానికి పలువురు నాయకులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో టికెట్ ఆశించే వారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పోటీ ఎక్కువే పార్టీలో ముగ్గురు, టీఆర్ఎస్లో ఇద్దరు టిక్కెట్ రేసులో నిలిచారు. ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. దోమకొండ జడ్పీటీసీ స్థానం కూడా జనరల్ కావడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ల్లో తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేయడానికి అన్ని చోట్లా తీవ్ర పోటీ కనిపిస్తోంది. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే ఇతర పార్టీల నుంచి పోటీచేస్తామని కొందరు, ఇండిపెండెంట్గా నిలిచి తన సత్తా చూపుతామనేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలేమో గాని పల్లెల్లో మాత్రం రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల ఫిరాయింపులు కూడా పెరిగాయి. ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారో, ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నొక పార్టీలోకి వెళ్లిన నేత, నేడొక పార్టీ గడప తొక్కుతున్నాడు. -
తొలి అంకానికి తెర
పురపోరులో తొలిఘట్టానికి తెర పడింది. శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో చివరి రోజు నామినేషన్లు పోటెత్తాయి. అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి ఆర్భాటంగా కదిలి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. పది చోట్లా మొత్తం 1764 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజునే 933 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 373, టీడీపీ నుంచి 280, కాంగ్రెస్ తరఫున 100 మంది, ఇండిపెండెంట్లుగా 136 మంది నామినేషన్లు వేశారు. ఇతర పార్టీల విషయానికి వస్తే బీజేపీ 26, సీపీఎం 8, లోక్సత్తా 5, సీపీఐ 2, ఇతరులు 3 నామినేషన్లు వేశాయి. చివరిరోజు అమలాపురంలో 97, మండపేటలో 176, రామచంద్రపురంలో 70, తునిలో 76, సామర్లకోటలో 142, పెద్దాపురంలో 60, పిఠాపురంలో 124 నామినేషన్లు దాఖలు కాగా నగర పచాయతీలకు సంబంధించి ముమ్మిడివరంలో 39, గొల్లప్రోలులో 54, ఏలేశ్వరంలో 95 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా శుక్రవారం గడువు ముగిసే నాటికి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోని 264 వార్డులకు 1764 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ 638, టీడీపీ 642, కాంగ్రెస్ 157, ఇండిపెండెంట్లు 253, బీజేపీ 40, సీపీఎం 17, సీపీఐ 4, లోక్సత్తా 8 తోపాటు ఇతరుల నామినేషన్లు 5 ఉన్నాయి. మున్సిపాలిటీల్లో అత్యధికంగా సామర్లకోటలో 30 వార్డులకు 253 నామినేషన్లు, అతితక్కువగా రామచంద్రపురంలో 132 దాఖలయ్యాయి. నగర పంచాయతీల్లో అధికంగా ఏలేశ్వరంలో 20 వార్డులకు 180 నామినేషన్లు పడ్డాయి. ‘కోట’లో కనుమరుగైన కాంగ్రెస్ సామర్లకోటలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేక పోయిన కాంగ్రెస్ పెద్దాపురంలో ఆఖరు రోజున అతి కష్టం మీద ఐదింటిని వేయగలిగింది. వార్డు సంఖ్యతో పోలిస్తే కాంగ్రెస్ తరఫున 55 శాతం కూడా నామినేషన్లు పడలేదు. నగర పంచాయతీలైన గొల్లప్రోలు, ముమ్మిడివరంలలో ఆ పార్టీ అభ్యర్థుల సంఖ్య ఒక్క అంకెకే పరిమితమైంది. నేడు పరిశీలన.. నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు. ఈనెల 18 వరకూ ఉపసంహరణకు గడువుంది. అదే రోజున తుది జాబితా ప్రకటించి, అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని మున్సిపల్ ఆర్డీ రమేష్బాబు తెలిపారు. ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులుగా ఉన్న కమిషనర్లు అవసరమైతే న్యాయ సలహాలు కూడా తీసుకుని పరిశీలనను నిక్కచ్చిగా నిర్వహిస్తారన్నార -
నాల్గోరోజు అదే జోరు
స్థానిక నగరపంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం 59 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా వివిధ పార్టీల నుంచి 171 నామినేషన్లు సమర్పించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ నుంచి 37, టీఆర్ఎస్ 39, టీడీపీ 15, బీజేపీ 19, బీఎస్పీ 3, సీపీఐ 1, స్వతంత్ర అభ్యర్థులు 57 మంది ఉన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తోట రాజేంద్రప్రసాద్ 19వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. జమ్మికుంట : జమ్మికుంట నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు నాల్గో రోజు నామినేషన్ల జోరు కనిపించింది. వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీపడి మరీ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం వరకు 20 వార్డుల నుంచి 72 నామినేషన్లు దాఖలు కాగా కొత్తగా నామినేషన్ వేసిన వారిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. మిగతా 32 మంది మంగళ, బుధవారం వేసి మళ్లీ రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు. వార్డుల వారీగా నామినేషన్ వేసిన అభ్యర్థులు వీరే.. -
725/11
మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నాలుగో రోజు గురువారం జిల్లాలోని 11 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 323 వార్డులకు 725 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారంతో నామినేషన్ల ఘట్టానికి తెరపడనుంది. నాలుగో రోజున అత్యధికంగా గుంతకల్లు మునిసిపాలిటీలో 148 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ తర ఫున 193, టీడీపీ తరఫున 232, స్వతంత్ర అభ్యర్థులుగా 180, కాంగ్రెస్ తరఫున 55, సీపీఐ తరఫున 22, బీజేపీ తరఫున 2, సీపీఎం తరఫున పది మంది, ఇతర పార్టీల నుంచి 10 మంది, లోక్సత్తా నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. హిందూపురం మునిసిపాలిటీలో 74, గుంతకల్లులో 148, తాడిపత్రిలో 68, ధర్మవరంలో 75, కదిరిలో 89, రాయదుర్గంలో 32, మడకశిరలో 26, పుట్టపర్తిలో 44, గుత్తిలో 62, పామిడిలో 25, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలో 82 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, పామిడి మునిసిపాలిటీల్లో ఇప్పటి వరకు ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. కాంగ్రెస్ తరఫున హిందూపురంలో ముగ్గురు, ధర్మవరంలో ఒకరు నామినేషన్ వేశారు. కార్పొరేషన్లో ముగిసిన నామినేషన్ల పర్వం 50 డివిజన్లకు మొత్తం 403 చివరి రోజున 254, మొదటి మూడు రోజులు 149 వైఎస్సార్సీపీ 129, టీ డీపీ 140 స్వతంత్రులు 69, కాంగ్రెస్ 23 బీజేపీ 14, సీపీఎం 6, సీపీఐ 4 ఇతర పార్టీలు 8, లోక్సత్తా 6, బీఎస్పీ 3 -
గందరగోళం
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ప్రారంభమైనా తెలుగుదేశం పార్టీ ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ విషయంలో తెలుగుతమ్ముళ్లలో అయోమయం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తారనే విషయం ఇంకా తేలలేదు. స్థానిక ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నారు. 2009 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం మాత్రమే పార్టీ గెలుచుకుంది. జిల్లా అధ్యక్షుడు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనే పరిస్థితి ఇలా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకోవడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో సంప్రదింపులు జరుపుతున్నారు. నేడో రేపో వరద తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఎలాంటి హామీ లేకున్నా వరదరాజులరెడ్డి తెలుగుదేశం పార్టీలో బేషరతుగా చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముందు మున్సిపల్ చైర్మన్గా పార్టీ అభ్యర్థిని గెలిపించుకురావాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయంపై మంగళవారం వరదరాజులరెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. వరదరాజులరెడ్డి చేరికపై లింగారెడ్డి అయిష్టత వ్యక్తం చేస్తున్నా పార్టీ నేతలు ఈ విషయంలో చొరవ చూపుతున్నారు. ప్రస్తుతం లింగారెడ్డి వెంట ఉన్న తెలుగుతమ్ముళ్లు కౌన్సిలర్ సీట్లను ఆశిస్తున్నారు. వరద రాజులరెడ్డి పార్టీలో చేరుతుండటంతో ఇంత వరకు ఏ వార్డుకు ఏ అభ్యర్థి అనే విషయాన్ని ప్రకటించలేదు. లింగారెడ్డి వరదరాజులరెడ్డితో చర్చించిన తర్వాతే వార్డు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నిర్ణయంపై హర్షం ప్రొద్దుటూరు మున్సిపల్ స్థానానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో పలువర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ కేటగిరీకి (అన్రిజర్వుడు) కేటాయించినా బీసీలనే ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండేళ్లపాటు ముక్తియార్ను మున్సిపల్ చైర్మన్గా కొనసాగిస్తారు. మిగతా మూడేళ్ల చైర్మన్ పదవీకాలాన్ని పట్టణంలో ప్రధానంగా ఉన్న దేవాంగ, తొగట, పద్మశాలీయ వర్గాల్లో ఎవరో ఒకరికి అప్పగించాలని నిర్ణయించారు. వైస్ చైర్మన్ పదవిని ఆర్యవైశ్యులకు కేటాయించారు. దీంతో అన్ని వర్గాలలో హర్షం వ్యక్తమవుతోంది. -
రెండంటే.. రెండే...
పుర పోరులో నామినేషన్ల ప్రక్రియకు తెరలేచింది. తొలిరోజు నామినేషన్ల పర్వంలో రెండంటే రెండే దాఖలయ్యాయి. జిల్లాలో జగ్గయ్యపేట, విజయవాడ కార్పొరేషన్లలో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వేశారు. మిగిలిన ఏడు మున్సిపాలిటీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ముహూర్త బలం కుదరలేదనో, అభ్యర్థి దొరకలేదనో అనేక కారణాలతో నామినేషన్ల వైపు పార్టీలు తొంగిచూడలేదు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ రోజునే రూల్ నంబర్ 6ను అనుసరించి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల ఐదున మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల మొదటి రోజున జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఖరారు చేసిన వార్డుల రిజర్వేషన్ల వివరాలను మున్సిపాలిటీల్లోని నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 24వ వార్డు నుంచి బొందిలి బాలాశ్రీను, విజయవాడ కార్పొరేషన్లో 42వ డివిజన్ నుంచి కె.శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మచిలీపట్నంలో తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ మున్సిపాలిటీ పరిధిలో 73, విజయవాడలో 204 మంది దరఖాస్తులు తీసుకెళ్లినట్లు సమాచారం. వాటిని పూర్తిచేసి అభ్యర్థులు మంచి ముహూర్తంలో సమర్పించే అవకాశముంది. పెడన, గుడివాడ, నూజివీడు, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు మున్సిపాలిటీల్లోనూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అభ్యర్థుల కోసం కసరత్తు... మున్సిపల్ నామినేషన్ల పర్వం మొదలుకావడంతో రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీల నేతలు రెండు రోజులుగా రాత్రీ పగలు తేడా లేకుండా సమావేశాలు, సమాలోచనలతో తలమునకలయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఆ పార్టీకి అభ్యర్థుల కొరత వెంటాడుతోంది. మరోవైపు వైఎస్సార్సీపీలో అభ్యర్థిత్వాలు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఆయా వార్డులకు సమర్థులైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు వైఎస్సార్సీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనూ అభ్యర్థుల వెదుకులాట తప్పడం లేదు. ముహూర్తం ముందరున్నది... తొలిరోజు నామినేషన్లకు ముహూర్తం కుదరలేదు. దీంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపలేదు. మంగళవారం దశమి కావడంతో నామినేషన్లకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. బుధవారం ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో దాఖలు చేసేందుకు పార్టీల నేతలు, అభ్యర్థులు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థుల విషయంలోను పలు పార్టీల నేతల ప్రయత్నాలు కొలిక్కిరాకపోవడంతో ఒకటి రెండు రోజుల్లో నామినేషన్లు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. అందుకు ముహూర్తబలం కలిసి వస్తుందని వారు ఆశిస్తున్నారు. శిరోభారం... వరుస ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలపై ఆశలు పెట్టుకున్న పలు పార్టీల నేతలకు శిరోభారంగా మారాయి. జిల్లాలోని పలు పార్టీల నేతలు గత కొంతకాలంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇది చాలదన్నట్టు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ముందే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను గెలిపించుకోవడం వ్యయప్రయాసలకు దారితీస్తోంది. స్థానిక సంస్థల ఫలితాలు తమ ఎన్నికలపై పడతాయని భావించిన నేతలు కష్టమైనా తప్పక అభ్యర్థుల ఎంపిక, ఖర్చులకు సిద్ధపడుతున్నారు. -
సమరభేరి
అటు పురపోరుకు, ఇటు సార్వత్రిక సంగ్రామానికి మధ్య మరో ప్రతిష్టాత్మక సమరానికి తెర తొలగింది. పరిషత్ యుద్ధభేరి మార్మోగింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందుగా అన్ని పల్లెల్లో వాతావరణాన్ని వేడెక్కించే ప్రాదేశిక యుద్ధానికి నాందీ ప్రస్తావన జరిగింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉండడంతో ఇక గ్రామీణ రాజకీయం రసవత్తరంగా మారనుంది. , విశాఖపట్నం: జిల్లాలో 39 జెడ్పీటీసీలు, 656 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు పరిషత్ ఎన్నికలతో కళకళలాడబోతున్నాయి. ప్రస్తుతం వరుస ఎన్నికల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు వాయిదా వేయాలన్న పార్టీలు,అధికారుల విన్నపాల మధ్య ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈనెల 17నుంచి 20వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించింది. 21న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఎంపీటీసీ స్థానాలకు మండలస్థాయిలో నామినేషన్లు వేయాలి. జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్లను విశాఖనగరంలోని జిల్లాపరిషత్ కార్యాలయంలో దాఖలు చేయాలి. 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. అదేవిధంగా ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య, లేదా బ్యాలెట్ ఎన్నికల్లో అవకతవకలు వంటివేవైనా జరిగితే తిరిగి ఏప్రిల్ 7న అంటే మరుసటి రోజు పోలింగ్ నిర్వహిస్తారు. ఫలితాలు కూడా ఎన్నికలైన మరుసటి రోజే అంటే ఏప్రిల్ 8న వెలువడనున్నాయి. జిల్లాలోని మొత్తం 39 జెడ్పీటీసీ స్థానాల్లో 20 మహిళలకు,19 జనరల్కు కేటాయించారు. 656 ఎంపీటీసీ స్థానాలను 163 బీసీ,45 ఎస్సీ, 166 ఎస్టీ, 282 అన్రిజర్వుడ్కు కేటాయించారు.ఈదఫా జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలు 10 పెరిగాయి. జిల్లాపరిషత్ ఛైర్మన్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈసారి పరిషత్ ఎన్నికల్లో మహిళామణుల హవా కొనసాగనుంది. అయితే ఇప్పటికే చాలాచోట్ల రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడతో మైదాన ప్రాంతాల్లో చాలాచోట్ల ఎస్టీలకు, ఏజెన్సీలో బీసీలకు ఎక్కువ స్థానాల్లో సీట్లు రిజర్వు అయ్యాయి. దీంతో నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పార్టీలో తగిన అభ్యర్థిని వెదకడం కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి. -
సందడే..సందడి
జిల్లాలో ప్రక్రియ సోమవారం అధికారికంగా ప్రారంభం కానుంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలకు ఆయా మున్సిపల్ కమిషనర్లు (ఎన్నికల అధికారులు) ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇందుకోసం ముందురోజు ఆదివారం అయినప్పటికీ ఆయా మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాంగోపాల్కు ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణకు మున్సిపాలిటీల్లో చేసిన ఏర్పాట్లపై నివేదిక ఇచ్చారు. నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఎన్నికల నియమావళి, ఆయా వార్డుల ఓటర్ల జాబితా అందజేయనున్నారు. నేటి నుంచి నామినేషన్ల పర్వం చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల్లో మార్చి 10 నుంచి 14వ తేదీ వరకు వార్డులకు, డివిజన్లకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఎన్నికల సిబ్బందితో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సమాచారం ఇచ్చేందుకు మున్సిపాలిటీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలలోపే ఎన్నికల అధికారి అయిన కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సంబంధించి ఓటర్ల ఫొటో జాబితాను నోటీస్బోర్డులో ప్రదర్శిస్తారు. మార్చి 14వ తేదీ వరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 15వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 19న ఉపసంహరణ, 21న తుదిజాబితా ప్రకటిస్తారు. 50 డివిజన్లు, 169 వార్డులకు ఎన్నికలు చిత్తూరు కార్పొరేషన్లోని 50 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పుత్తూరు మున్సిపాలిటీలో 24, నగరిలో 27 , మదనపల్లెలో 35, శ్రీకాళహస్తిలో 35, పుంగనూరులో 24, పలమనేరులో 24 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి. తమ అభ్యర్థులతో మొదటి రోజు నుంచే నామినేషన్లు వేయించి ప్రచారం ఉద్ధృతం చేయాలని భావిస్తున్నాయి. మొత్తం మీద సోమవారం నుంచి చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి కనబడనుంది. -
నేతలు ఉక్కిరి బిక్కిరి !!
కడప: మూడేళ్లుగా ఎలాంటి పదవులు లేకపోవడంతో నిరుత్సాహంగా కాలం గడిపిన పట్టణాల్లోని రాజకీయనేతలు మునిసిపల్ ఎన్నికల సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉన్న ఫళంగా మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం... అభ్యర్థుల ఎంపికకు వారం మాత్రమే గడువుండటంతో ఓ వైపు అభ్యర్థుల ఎంపిక.. మరో వైపు ఎన్నికల ఖర్చుకు డబ్బుల మూటలను పోగు చేసుకోవడంపై దృష్టి సారించారు. క్షణం తీరిక లేకుండా చర్చలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వారం రోజులు... 236 మంది అభ్యర్థులు: మునిసిపల్ ఎన్నికల నామినేషన్లు ఈ నెల 10 నుంచి స్వీకరిస్తారు. అంటే అభ్యర్థుల ఎంపికకు వారం రోజులు మాత్రమే గడువుంది. ఈ వారంలో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న పార్టీలు కార్పొరేషన్తో పాటు ఎన్నికలు జరగబోయే అన్ని మునిసిపాలిటీల్లోని 236వార్డులకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయడం అన్నిపార్టీలకు కత్తిమీద సాముగా మారింది. ముఖ్యంగా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ హవా జోరుగా ఉండటంతో మునిసిపల్ ఎన్నికలకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కదనోత్సాహంతో సిద్ధమయ్యారు. మునిసిపల్ ఎన్నికల బరిలో ప్రథమంగా వైఎస్సార్సీపీ శ్రేణులు దిగుతుండటంతో ఏ వార్డుకు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా వారి గెలుపే ధ్యేయంగా పనిచేసి అన్ని మునిసిపాలిటీల పాలకవర్గాలను దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో కార్యకర్తలు ఉన్నారు. నాయకత్వం కూడా ఆ దిశగానే పావులు కదుపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్పార్టీ జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కాంగ్రెస్పార్టీ మునిసిపల్ ఎన్నికల రేసులో ఉన్నా నామమాత్రపు పోటీకే పరిమితమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. గతం పునరావృతమవుతుందనే టెన్షన్లో టీడీపీ: గత మునిసిపల్ ఎన్నికలు కడప కార్పొరేషన్తో పాటు ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలులో జరిగాయి. అప్పట్లో ఒక్కపాలక వర్గాన్ని కూడా తెలుగుదేశంపార్టీ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ హవా జోరుగా ఉండటంతో ఈ ఎన్నికల్లో కూడా గతేడాది అనుభవం తప్పదనే భయం టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. అలాగే కొత్తగా ఆవిర్భవించిన మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో కూడా టీడీపీ గెలుపొందడం కష్టమే. దీనికి తోడు ఎన్నికల వ్యయం భారీగా పెరగడంతో పోటీచేసేందుకు అభ్యర్థులు జంకుతున్నారు. ఈ క్రమంలో వారంలోపు అభ్యర్థులను వెతకడం తమ్ముళ్లకు విషమపరీక్షగా మారింది. వామపక్షపార్టీలు జిల్లాలో ఉన్న కొన్ని వార్డులకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి. డబ్బుమూటల వేటలో నేతలు: ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కు 26 రోజులు గడువుంది. దీంతో ఎన్నికల వ్యయానికి అవసరమయ్యే డబ్బుమూటల వేటకు సన్నద్ధమయ్యారు. బరిలో నిలవాలనుకునే వ్యక్తులు తమకు బాకీలు ఉన్నవారి వద్ద వసూళ్లు,స్థిరాస్తుల అమ్మకాలు, అప్పులు తెచ్చుకోవడం, విరాళాలతో పాటు అన్నిమార్గాలను అన్వేషించి డబ్బులు పోగు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే మద్యం దుకాణాలకు అడ్వాన్స్లు చెల్లించి మద్యం కేసులను దిగుమతి చేసుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల సరిహద్దుల్లో పోలీస్ నిఘా కట్టుదిట్టంగా ఉంటుంది. ఈక్రమంలో ఎన్నికల వ్యయం కోసం డబ్బులు సేకరించుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవడం పార్టీలకు కష్టతరమైన పని. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా నెలరోజుల పాటు కోరుకున్న పదవిని దక్కించుకునేందుకు అన్నిపార్టీలు అవిశ్రాంతంగా పోరాడేందుకు సన్నద్ధమయ్యాయి. -
నిద్ర లేకుండా హింసించారు...న్యాయమే గెలిచింది
హైదరాబాద్ : రాజ్యసభ రెబల్ అభ్యర్థులు చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. వారిద్దరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల కమిషన్ తేల్చింది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లపై అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ బరిలో ఉన్న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని దుర్మార్గాలు చేసినా చివరికి న్యాయం గెలిచిందన్నారు. తమ నామినేషన్లను తిరస్కరించేందుకు కాంగ్రెస్ పెద్దలు శతవిధాలా యత్నించారని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. తనను, చైతన్య రాజును గత రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా హింసించారని ఆదాల అన్నారు. తమకు మద్దతు ఇచ్చి నామినేషన్లపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురి చేశారని ఆయన తెలిపారు. వివరణ లేఖలు ఇవ్వాలంటూ తమను వేధించారన్నారు. రిటర్నింగ్ అధికారిపై కూడా తీవ్ర ఒత్తిడి ఒత్తిడి తెచ్చారని ఆదాల అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారిని స్క్రూటినీ ప్రక్రియకు రప్పించారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల చట్టం నిబంధన 33 ప్రకారం ప్రతిపాదకుల ఉపసంహరణ అంశమే లేదని అన్నారు. అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకోవాలనే నిబంధనను అధికారులు చెప్పటంతో తమ నామినేషన్లు ఆమోదం పొందాయన్నారు. -
ఎమ్మెల్యేలను తీసుకురావాలని రెబల్స్కు ట్విస్ట్
-
ఎమ్మెల్యేలను తీసుకురావాలని రెబల్స్కు ట్విస్ట్
హైదరాబాద్ : రాజ్యసభ నామినేషన్ల వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది. రెబల్ అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ట్విస్ట్ ఇచ్చారు. సభ్యుల నుంచి లిఖితపూర్వక లేఖలు తీసుకు రావాలని రిటర్నింగ్ అధికారి వారికి గంట సమయం ఇచ్చారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. అయితే వారికి మద్దతు ప్రకటించిన సభ్యుల్లో కొంతమంది మద్దతు ఉపసంహరించుకున్నారు. చైతన్య రాజుకు ఎనిమిది మంది, ఆదాలకు ఎనిమిది మంది మద్దతు ఉపసంహరించుకున్నారు. ఇక మిగిలినవారిలో కొందరు బయటకు వెళ్లటం, మరికొందరు సెల్ఫోన్లు స్విచాఫ్ చేసినట్లు సమాచారం. దాంతో ఎమ్మెల్యేలు అందుబాటులోకి రాకపోవటంతో ఆదాల, చైతన్య రాజు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు చైతన్య రాజుపై క్రిమనల్ కేసు ఉన్నందున ఆయన నామినేషన్ను తిరస్కరించాలని కాంగ్రెస్... రిటర్నింగ్ అధికారిని కోరింది. అలాగే ఆరుగురి నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిట్నరింగ్ అధికారి తెలిపారు. కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, టి సుబ్బరామిరెడ్డి, టీఆర్ఎస్ నుంచి కేశవరావు, టీడీపీ నుంచి సీతా మహాలక్ష్మి, గరికపాటి మోహనరావు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు.