NCB
-
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
డ్రగ్ గుట్టు రట్టు 95 కిలోలు స్వాధీనం
-
భారీగా డ్రగ్స్ పట్టివేత.. తిహార్ జైలు వార్డెన్తో సహా నలుగురి అరెస్ట్
లక్నో:ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నోయిడాలోని మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్లో వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రగ్స్ తయారీ ల్యాబ్ను తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్తోపాటు విదేశాలకు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.ఈ ల్యాబ్లో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95కిలోల మెథాంపేటమిన్(డ్రగ్స్), వివిధ రసాయనాలు, ఆధునాతన తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మూడురోజల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా.. వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షించేవాడని ఎన్సీబీ తెలిపింది. ల్యాబ్లో పట్టుబడిన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆ సమయంలో అతడిని తిహార్ జైల్లో ఉంచగా.. అక్కడ వార్డెన్తో పరిచయం పెంచుకొని అతడిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు. -
ఆ ఆరోపణలతో నాకు సంబంధం లేదు: నటుడు
దర్శకుడు, నటుడు అమీర్ ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన సినీ నిర్మాత జాఫర్ సాధిక్తో దర్శకుడు అమీర్కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళవారం నాడు ఎన్సీబీ, ఈడీ అధికారులు అమీర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సంఘటన కోలీవుడ్లో తీవ్ర కలకలానికి దారి తీసింది. కాగా బుధవారం మధురైలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఇంట్లో అధికారులు 11 గంటలపాటు సోదాలు నిర్వహించిన విషయం నిజమేనన్నారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించాయన్నది వారే చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. అలాగే తనను లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నారా? అన్న ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదన్నారు. అయితే ఈ విషయమై ఒక రోజు కచ్చితంగా వివరంగా మాట్లాడతానన్నారు. ఈ వ్యవహారం గురించి తాను ఒక నెలరోజులుగా మాట్లాడలేని పరిస్థితి అని.. ఆ దేవుడు చూసుకుంటాడనే మౌనంగా రోజులు గడిపానన్నారు. చదవండి: మీకు నచ్చకపోతే అలా చేస్తారా?.. ట్రోల్స్పై మండిపడ్డ నటి! -
ఆర్యన్ఖాన్ను వదిలేసేందుకు రూ.25 కోట్లు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖేడెపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2021, అక్టోబర్ 2న ఒక క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ని సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్ఖాన్ను ఎన్సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. -
డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి భర్త అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్ మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన భార్య నేహా దేశ్పాండే పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. అతడు డీజే నిర్వాహకులతోపాటు ఈవెంట్లలో మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని, గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ నుంచి వీటిని ఖరీదు చేసేవాడని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన మోహిత్ 2014లో ‘ది అన్స్క్రిప్టెడ్’పేరుతో సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరుల్లో జరిగే అనేక ఈవెంట్లు, పబ్స్కు డీజేలు సరఫరా చేస్తున్నాడు. గోవాలో సన్బర్న్ బీచ్ క్లబ్ సహా అనేక భారీ ఈవెంట్స్ నిర్వహించాడు. ఆయా పబ్స్ నిర్వాహకులతో కలిసి వాటిలో ప్రత్యేకంగా రేవ్ పార్టీలు నిర్వహించే వాడు. దీనికోసం ఎడ్విన్సహా దాదాపు 50 మంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి నుంచే కొకైన్ ఖరీదు చేసి సరఫరా చేసేవాడు. ‘క్రూయిజ్’లో ఆధారాల్లేక.. గతేడాది అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు ముంబై క్రూయిజ్ డ్రగ్ పార్టీపై దాడి చేసి షారూఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ సహా పలువురిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహిత్ కూడా అదే క్రూయిజ్లో ఉన్నా ఇతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోవడం, ఆర్యన్తో సంబంధాలపై ఆధారాలు లేకపోవడంతో అధికారులు విడిచిపెట్టారు. గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ను హెచ్–న్యూ అధికారులు గతేడాది నవంబర్ 5న అరెస్టు చేసి విచారించగా మోహిత్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు గోవా, ముంబైల్లో తలదాచుకున్నాడు. హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్ నేతృత్వంలోని బృందం అతడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించింది. మోహిత్ ‘డిసెంబర్ 31’న గోవాలో రూ.2 కోట్లు వెచ్చించి భారీ ఈవెంట్ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న హెచ్–న్యూ బృందం అక్కడికి వెళ్లగా త్రుటిలో తప్పించుకుని విమానంలో హైదరాబాద్ వచ్చేశాడు. వేట కొనసాగించిన హెచ్–న్యూ ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకుంది. రామ్గోపాల్పేట ఠాణాలో ఉన్న ఎడ్విన్ కేసులోనూ రిమాండ్కు తరలించింది. విచారణలో నగరానికి చెందిన అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులతో అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. అయితే వారిలో ఎందరు డ్రగ్స్ ఖరీదు చేశారు? ఏఏ పబ్స్ నిర్వాహకులతో అతడికి ఒప్పందాలు ఉన్నాయనే వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ దందాలో మోహిత్ భార్య నేహా దేశ్పాండేకు ఏమైనా లింకు ఉందా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేహా దేశ్పాండే ‘ది కిల్లర్, దిల్ దివానా, బెల్స్’తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఇదీ చదవండి: సర్వం ‘త్రిమూర్తుల’ కనుసన్నల్లోనే! -
ఆర్యన్ ఖాన్ను ఇరికించారు: ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సీనియర్ అధికారితో పాటు ఎనిమిది మందిపై చర్యలకు సిఫార్సు చేసింది. ఓ క్రూయిజ్ పడవలో పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆర్యన్తో పాటు 15 మందిని గతేడాది అక్టోబర్లో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. కానీ ఆర్యన్ను కేసు నుంచి తప్పించేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారని అనంతరం ఆరోపణలొచ్చాయి. ఆర్యన్తో పాటు ఇతర కేసుల్లో వచ్చిన ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ గత ఆగస్టులో మొత్తం 8 మంది అధికారులపై 3,000 పేజీల సుదీర్ఘ చార్జ్షీట్ నమోదు చేసింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు కమిటీ గత మేలో క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు సొంత అధికారులే ఆర్యన్ను కావాలని ఇరికించారని తేల్చడం ఎన్సీబీకి మరోసారి తలవంపులు తెచ్చింది. -
అమిత్ షా సమక్షంలో 40,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
గువాహటి: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 40,000 కిలోల వివిధ రకాల డ్రగ్స్ను పట్టుకున్నారు. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం ధ్వంసం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా గువాహటి నుంచి వర్చువల్గా డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించినట్లు ట్వీట్ చేసింది. అస్సాంలో 11,000 కిలోలు, అరుణాచల్ ప్రదేశ్లో 8,000 కిలోలు, మేఘాలయలో 4,000 కిలోలు, నాగాలాండ్లో 1600 కిలోలు, మణిపుర్లో 398 కిలోలు, మిజోరాంలో 1900కిలోలు, త్రిపురలో 13,500 కిలోలు పట్టుకున్నట్లు వెల్లడించింది. అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. డ్రగ్ అక్రమ రవాణా, జాతీయ భద్రత అంశంపై ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణపై సమీక్షించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఎన్సీబీ ఆధ్వర్యంలో 75,000 కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంతకు రెండింతలు 150,000 కిలోలు ధ్వంసం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద విజయం.’ అని తెలిపారు షా. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎన్సీబీ జూన్ 1 నుంచి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మత్తు పదార్థాలను పట్టుకుంటోంది. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మారుస్తామన్న మోదీ ప్రభుత్వ ఆశయానికి తగినట్లుగా డ్రగ్స్ను ధ్వంసం చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. గత జులై 30న సుమారు 82వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేశారు. అదే రోజు ఛత్తీస్గఢ్లో పర్యటించిన అమిత్ షా.. 31 వేల కిలోల డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను వర్చువల్గా పర్యవేక్షించారు. #WATCH | Union Home Minister Amit Shah conducts a meeting on Drug Trafficking and National Security in Guwahati in the presence of Assam CM Himanta Biswa Saram and Union Minister G Kishan Reddy. pic.twitter.com/yAvXXDvTsn — ANI (@ANI) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
ఆపరేషన్ గరుడ: డ్రగ్స్ ముఠాలపై సీబీ‘ఐ’.. 175 మంది అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్థాల(డ్రగ్స్) దందా నిర్వహిస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఇంటర్పోల్, రాష్ట్రాల పోలీసుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు నెరుపుతూ దేశంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై కేసులు, అరెస్టులు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 127 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ గరుడ ఏమిటి? అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్న నెట్వర్క్లను నిరోధించేందుకు ఆపరేషన్ గరుడ పేరుతో పలు దఫాలుగా తనిఖీలు చేపట్టింది సీబీఐ. ఇంటర్పోల్ ద్వారా క్రిమినల్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి డ్రగ్ ట్రాఫికింగ్లను గుర్తించేందుకు ఈ ఆపరేషన్ను నిర్వహిస్తోంది. ఇంటర్పోల్ ద్వారా అంతర్జాతీయ చట్టాల పరిధిలోనూ ఈ తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీబీఐ తెలిపింది. ఇంటర్పోల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)ల సమన్వయంతో గ్లోబల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ముఠాలతో లింక్స్ ఉన్న నెట్వర్క్లే లక్ష్యంగా ఈ ఆపరేషన్ గరుడ కొనసాగిస్తోంది సీబీఐ. దీని ద్వారా డ్రగ్స్ నిర్వహణ, సరఫరా, తయారీ జోన్స్, వారికి మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు బలగాల సమన్వయంతో సమాచారం సేకరించి డ్రగ్స్ ముఠాలపై చర్యలు చేపట్టింది. 6600 అనుమానితులపై.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించింది సీబీఐ. సుమారు 6600 అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసింది. 127 కొత్త కేసులు నమోదు చేసి.. 175 మందిని అరెస్ట్ చేసింది. అందులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులు సైతం ఉన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా 5.1 కిలోల హెరాయిన్, 33.4 కిలోల మరిజున, 3.29 కిలోల చరాస్, 1365 గ్రాముల మెఫెడ్రోన్, 33.8 గ్రాముల స్మాక్, బుప్రెనోర్ఫిన్కు చెందిన 87 సిరంజీలు, 122 ఇంజెక్షన్లు, 87 ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే 946 అల్ప్రాజోలమ్ ట్యాబ్లెట్లు, 106 కిలోల ట్రామడోల్, 10 గ్రాముల హాష్ ఆయిల్, 0.9 గ్రాముల ఎక్స్టాసీ పిల్స్, 1.15 కిలోల ఓపియమ్, 30 కిలోల పప్పీ హక్, 1.43 కిలోల ఇటోక్సికాంట్ పౌండర్, 11039 పిల్, క్యాప్సల్స్ సీజ్ చేసింది. ఇదీ చదవండి: పెళ్లితో సంబంధం లేదు.. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
ఆర్యన్ఖాన్కు క్లీన్చిట్
అందరికీ ఎన్నడో అర్థమైన ఒకానొక సత్యం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్సీబీ)కి ఆలస్యంగా తలకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు మాదక ద్రవ్యాలతో ఏవిధమైన సంబంధమూ లేదని ఆ సంస్థ తేల్చిచెప్పింది. నిరుడు అక్టోబర్ మొదటివారంలో ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్తోపాటు అనేకుల్ని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ప్రకటించింది. ఇంకేం? సామాజిక మాధ్యమాలూ, టీవీ చానెళ్లూ హోరెత్తిపోయాయి. మాదకద్రవ్యాలు తీసుకుం టుండగా ఆర్యన్ను స్వయంగా చూసినంత హడావుడి చేశాయి. అందులోనూ పట్టుబడింది బీజేపీకి అయిష్టుడిగా ముద్రపడిన షారుఖ్ తనయుడు కావడంతో కొన్ని చానెళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అవి రోజంతా నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నవారు ఈ కేసులో తీర్పులిచ్చేశారు. సెలబ్రిటీల పిల్లల పెంపకంపై విరుచుకుపడ్డారు. దేశభక్తి లేనివారి సంతానం ఇలాగే ఉంటారని దెప్పిపొడిచారు. కొందరు ఆ అరెస్టు వెనకున్న పరమార్థమేమిటో అంచనా వేశారు. ఆ సమయంలో గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. నిజానికి ‘ఫలానా హీరో తనయుడు లేదా తనయ’ అనే విశేషణం అవసరం లేకుండానే స్టార్ హీరోల పిల్లలు వారికై వారు సెలబ్రిటీలుగా మారిపోతున్న కాలమిది. గతంలో ఎంత పేరు ప్రఖ్యాతులున్న నటులైనా తమ వారసులను వెండితెరపై వెలిగించాలనుకున్నప్పుడు చేయితిరిగిన దర్శకులను ఆశ్రయించేవారు. దీటైన పబ్లిసిటీ కోసం వెంపర్లాడేవారు. ఇవాళ ఏ చిత్రంలోనూ నటించకపోయినా, కనీసం నలుగురి దృష్టినీ ఆకర్షించే పనులేమీ చేయకపోయినా ఆర్యన్ నుంచి ఆరాధ్య వరకూ ఎవరు ఎవరి వారసులో అందరికీ తెలుసు. ఎవరినైనా రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మార్చే చిట్కాల్లో ఆరితేరిన పీఆర్ మేనేజర్ల పుణ్యమిది. ఇన్స్టాగ్రామ్లోనో, ట్విటర్లోనో లక్షల మంది అనుచరగణాన్ని సృష్టించి ఆ పిల్లల ఫొటోలు పెడితే చాలు... బహుభాషా మాధ్యమాల్లో అవి చిలవలు, పలవలుగా అల్లుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అటుపై వారి గురించి తెలియ దంటే అలా అన్నవారి అజ్ఞానమే బయటపడుతుంది. అయితే ఈ మాదిరి ప్రచారం కూడా వికటించే ప్రమాదం లేకపోలేదు. ఆర్యన్ఖాన్కు జరిగింది అదే. అతను షారుఖ్ కుమారుడు కాకపోయివుంటే కథ వేరేలా ఉండేది. బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ ఆత్మహత్య కేసులో అతడి స్నేహితురాలు నటి రియా చక్రవర్తికి చుక్కలు చూపించిన అప్పటి ముంబై జోన్ ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేనే ఆర్యన్ ను కూడా కటకటాల్లోకి నెట్టగలిగారు. ఏలికల ఆదేశాలను శిరసావహించి ఎవరినైనా కేసుల్లో ఇరికించగల నైపుణ్యంగల అధికారుల్లో ఒకరిగా ఆయనకున్న అపకీర్తి ఎవరికీ తెలియనిది కాదు. రోజంతా మోతమోగే చానెళ్ల కారణంగా హఠాత్తుగా వచ్చిపడిన గ్లామర్ ఆయనను మరింత వ్యామోహంలోకి నెట్టింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆర్యన్ఖాన్ కేసును సవాలుగా తీసుకొని రోజుకొక కొత్త కోణంతో వాంఖడే చరిత్రను ఏకరువు పెట్టడంతో ఈ మొత్తం వ్యవహారంపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ కేసులో మధ్యవర్తులుగా ఉన్నవారికి వాంఖడేతో ఉన్న సంబంధాలు వెల్లడి కావడంతో ముందు ఎన్సీబీ విజిలెన్సు విభాగం దర్యాప్తు, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు జరిగాయి. ఈ రెండు విభాగాలూ వాంఖడేను గుచ్చి గుచ్చి ప్రశ్నించి నిజాలు నిగ్గు తేల్చాయి. ఆర్యన్తోపాటు ఆరుగురిపై ఆధారాల్లేవని నిర్ధారణ కావడంవల్ల కేసులు ఉపసంహరిస్తున్నామని సిట్ ప్రకటించింది. ఉగ్రవాదం తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ మాదకద్రవ్యాల వాడకమే కొరకరాని కొయ్యగా మారింది. అంతటి పెను రక్కసి ఆరా తీసి, దాన్ని దుంపనాశనం చేయాల్సిన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావాల్సిన ఎన్సీబీ వంటి సంస్థ స్వప్రయోజనాపరులైన నేతల చేతుల్లో కీలుబొమ్మయితే, దాని అధికారులు బానిస మనస్తత్వంతో అడుగులేస్తుంటే జరిగేదేమిటో తెలియంది కాదు. యువతను మత్తులో ముంచెత్తి మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేయగల సత్తా మాదకద్రవ్యాల కుంటుంది. వాటివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నమవుతాయి. ఏదో ఒక ముసుగులో ప్రపంచం నలుమూలల నుంచీ మాదకద్రవ్యాలు ఇక్కడికొస్తున్నాయి. మరెన్నో దేశాలకు చడీచప్పుడూ లేకుండా పోతున్నాయి. గట్టి నిఘా ఉంటే తప్ప వీటిని అరికట్టడం అసాధ్యం. మనం ఆ పని చేయలేకపోతే ప్రపంచంముందు చులకనవుతాం. దర్యాప్తు సంస్థలు దీన్ని గుర్తెరిగి వృధా కేసులతో పొద్దుపుచ్చడం మానుకోవాలి. ప్రచారయావను తగ్గించుకోవాలి. అవకాశం దొరికిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా తీర్పులీయటం అలవాటైన చానెళ్లకూ ఈ కేసు గుణపాఠం కావాలి. వాంఖడే ఆర్యన్ జోలికి పోయాడు గనుక ఈ కేసు దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో దర్యాప్తు సక్రమంగా సాగి నిజానిజాలేమిటో వెల్లడయ్యాయి. మరి అమాయకుల మాటో?! ఎన్సీబీతోసహా అన్ని దర్యాప్తు సంస్థలనూ ప్రక్షాళన చేయడం ముఖ్యమనీ, అవి స్వతంత్రంగా మెలిగేందుకు తోడ్పాటునందించడం అవసరమనీ కేంద్రం గుర్తించాలి. -
Aryan Khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు ఎన్సీబీ క్లీన్ చిట్..
Narcotics Control Bureau Has Given Clean Chit To Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యు టర్న్ తీసుకుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో లేదని స్పష్టం చేసింది. 2021, అక్టోబర్ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్తో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్తోపాటు మరో 17 మందికి బెయిల్ దొరికింది. కాగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల పక్కకు తప్పించిన విషయం తెలిసిందే. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్ ప్రొబ్ ఏజెన్సీ (ఎన్సీబీ) స్పష్టం చేసింది. చదవండి:👇 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ 12 ఏళ్ల లవ్.. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ -
ఎన్సీబీ అదుపులో డీకే శ్రీనివాస్నాయుడు
బనశంకరి(బెంగళూరు): మాదకద్రవ్యాల కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన దివంగత పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు, పారిశ్రామికవేత్త డీకే శ్రీనివాస్నాయుడును ఎన్సీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. బుధవారం నగర కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి కస్టడీకి ఆదేశించారు. బెంగళూరు సదాశివనగరలోని ఒక అపార్టుమెంటులో పార్టీ చేసుకుంటుండగా ఎస్సీబీ అధికారులు దాడి చేశారు. అక్కడ నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడటంతో శ్రీనివాస్నాయుడును అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి
ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఓ ప్రధాన సాక్షి మృతిచెందాడు. ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ గుండెపోటుతో కన్నుమూశాడు. శుక్రవారం మధ్యాహ్నం ముంబై పరిధిలోని చెంబూర్లోని మహుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో అతను చనిపోయినట్లు తెలుస్తోంది. 2021లో నమోదు అయిన ఆర్యన్ ఖాన్ కేసులో ప్రభాకర్ ఇండిపెండెంట్ విట్నెస్గా ఉన్నాడు. ప్రభాకర్ మృతిలో ఎలాంటి అనుమానాలు లేవని అతని కుటుంబం ధృవీకరించిన విషయాన్ని ప్రభాకర్ తరపు న్యాయవాది తుషార్ ఖాండేర్ వెల్లడించారు. ప్రభాకర్కు తల్లి, భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీ గోసావీ అనే వ్యక్తి దగ్గర ప్రభాకర్ సెయిల్ సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు. ముంబై క్రూయిజ్ పార్టీలో గోసావీ కూడా పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరో సాక్షి సామ్ డీసౌజా, గోసావీ-ప్రభాకర్ల మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. వాళ్లు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించాడు. అయితే ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేతో పాటు ఎన్సీబీ పైనా అవినీతి ఆరోపణలు చేశాడు ప్రభాకర్. ఈ నేపథ్యంలో అన్ని ఆరోపణల మీద విచారణ జరుగుతోంది. ఈలోపే ప్రభాకర్ గుండె పోటుతో చనిపోవడం.. కేసును మలుపు తిప్పే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో ముంబైలో చోటు చేసుకున్న ఈ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ముంబై తీరంలో కార్డీలియా క్రూయిజ్ లైనర్ అనే నౌకపై ఎన్సీబీ అధికారులు దాడులుచేశారు. రేవ్ పార్టీ జరుగుతోందని, విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం అందడంతో సోదాలు చేశారు. క్రూయిజ్లో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొలి అరెస్ట్ ఆర్యన్ ఖాన్దే కావడం విశేషం. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: అందుకు అదనంగా 90 రోజులు..
Aryan Khan Drugs Case: NCB Seeks 90 More Days For File Charge Sheet: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. గతేడాది అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఆర్యన్ను అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్ జైలుకు తరలించగా సుమారు 20 రోజులు గడిపాడు ఈ స్టార్ కిడ్. ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా పలుమార్లు తిరస్కిరించింది. దీంతో ఆర్యన్ ముంబై హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసును ఎన్సీబీ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం) దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే.. ఈ కేసులో ఛార్జ్షీట్ను దాఖలు చేసేందుకు తమకు 90 రోజుల అదనపు సమయం కావాలని కోర్టును ఎన్సీబీ కోరింది. ముంబై సెషన్స్ కోర్టులో మార్చి 28న పిటిషన్ వేసింది. అయితే ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 180 రోజుల్లోగా ఛార్జ్షీట్ను దాఖలు చేయాలి. దీని ప్రకారం చూస్తే ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు ఏప్రిల్ 2 చివరి తేది అవుతుంది. ఈ లెక్కన మరో 90 రోజుల అదనపు సమయం అంటే ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు జూలై 2 తేది చివరి తేది కానుంది. గతేడాది అక్టోబర్ 2న పార్టీ జరగగా.. అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఈ కేసులో సుమారు 20 మందిని ఎన్సీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 18 మంది బెయిల్పై బయట ఉన్నారు. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు -
ఎన్సీబీ నుంచి తిరిగి డీఆర్ఐకి సమీర్ వాంఖడే
న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్గా కొనసాగిన సమీర్ వాంఖడే తిరిగి మాతృసంస్థ అయిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) పరిధిలోకి వెళ్లిపోయారు. 2008 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారి అయిన సమీర్ వాంఖడే ఎన్సీబీ ముంబై విభాగం చీఫ్గా 2020 ఆగస్ట్ నుంచి కొనసాగుతున్నారు. 2021అక్టోబర్లో ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో సోదాలు జరిపి డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ సహా కొందరిని అదుపులోకి తీసుకోవడంతో వాంఖడే పేరు మార్మోగింది. డిసెంబర్ 31వ తేదీతో ఎన్సీబీలో వాంఖడే పదవీ కాలం ముగిసింది. కేంద్రం పదవీ కాలాన్ని పొడిగించకపోవడంతో తిరిగి వాంఖడే డీఆర్ఐకు వెళ్లిపోయారు. -
డ్రగ్ కేసులో ఇరికిస్తామని బెదిరింపులు, యువ నటి ఆత్మహత్య
ఫేక్ ఎన్సీబీ అధికారుల రైడింగ్తో కలత చెందిన యువ నటి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటు చేసుకుంది. డ్రగ్ కేసులో ఇరికిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 20న నటి స్నేహితులతో కలిసి హుక్కా పార్లర్కు వెళ్లింది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎన్సీబీ అధికారులమంటూ రైడ్ చేశారు. కేసు పెట్టకూడదంటే 40 లక్షల రూపాయలివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. దీంతో సదరు నటి అతికష్టం మీద రూ.20 లక్షలు సర్దగలిగింది. అయినప్పటికీ వారు మరింత డబ్బు కావాలని వేధింపులకు గురి చేశారు. ఈ వ్యవహారంతో కలత చెందిన నటి డిసెంబర్ 23న తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైడ్ జరిపింది ఫేక్ ఎన్సీబీ అధికారులని గుర్తించారు. ఎన్సీబీ అధికారులమని చెప్పుకున్న నిందితులు సూరజ్ పర్దేశి, ప్రవీణ్ వాలింబేను అరెస్ట్ చేశారు. అయితే ఆమె దగ్గర డబ్బు గుంజడానికి నటి స్నేహితులే ఆమెను పార్టీకి తీసుకెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్సీబీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీబీ అధికారులు ప్రైవేట్ ఆర్మీని సృష్టించి సెలబ్రిటీలను పనిగట్టుకుని వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. అయితే అధికారులు మాత్రం నటి ఆత్మహత్యలో అరెస్టయిన ఇద్దరు వ్యక్తులతో ఎన్సీబీకి ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. -
బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్కు ఊరట
Aryan Khan Gets Relief From Weekly Attendance At NCB Mumbai Office: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్పై విడుదలైన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న బెయిల్ షరతు నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన విచారణలో బాంబే హైకోర్టు ఆర్యన్కు సంబంధించిన బెయిల్ షరతు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆర్యన్.. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఢిల్లీ ఎన్సీబీ కార్యాలయం ఎప్పుడు సమన్లు పంపినా 72 గంటల్లోగా హాజరు కావాలని ఆర్యన్కు సూచించింది. అంతేకాకుండా ముంబై వదిలి వెళ్లేటప్పుడు అధికారులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
బాంబే హైకోర్టుకు నవాబ్ మాలిక్ క్షమాపణ
ముంబై: మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్ బాంబే హైకోర్టుకు శుక్రవారం క్షమాపణ చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖెడే, ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తాను హామీ ఇచ్చినప్పటికీ బహిరంగంగా విమర్శలు చేసినందుకు గాను ఈ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు నవాబ్ మాలిక్ తరపు న్యాయవాది అస్పీ చినోయ్ కోర్టులో అఫిడవిట్ వేశారు. నవంబర్ 29న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు క్షమాపణ చెబుతున్నట్లు మాలిక్ పేర్కొన్నారు. కోర్టును అగౌరవపర్చడం తన ఉద్దేశం కాదన్నారు. వాంఖెడేపై తన క్లయింట్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని చినోయ్ వివరించారు. మాలిక్ క్షమాపణను హైకోర్టు అంగీకరించింది. మాలిక్పై వాంఖెడే తండ్రి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ దావా విచారణకు వచ్చేదాకా వాంఖెడే కుటుంబంపై విమర్శలు చేయనంటూ మాలిక్ హామీ ఇచ్చారు. కానీ, విమర్శలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బెయిల్ నిబంధనలు మార్చండి: ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ విధించిన నిబంధనలు మార్చాలని షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బాంబే శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాడు. ప్రతి శుక్రవారం దక్షిణ ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కార్యాలయంలో హాజరు కావాలంటూ విధించిన నిబంధనను మార్చాలని అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు వచ్చేవారం విచారణ చేపట్టనుంది. -
కొత్త బాడీగార్డ్ కావాలంటున్న బాలీవుడ్ బాద్షా.. కారణం ఇదే
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ డిసెంబరులో తన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అక్టోబర్ 3న అరెస్ట్ చేసింది. దీంతో షారుఖ్ తన మూవీ షూట్లకు బ్రేక్ ఇచ్చాడు. కుమారుడి అరెస్టుతో అతని కుటుంబంతో కలిసి ముంబై తిరిగి రాక తప్పలేదు. అనేక పరిణామల తర్వాత అక్టోబర్ 28న ఆర్యన్కు బెయిల్ రావడంతో షారుఖ్ ఊపిరిపీల్చుకున్నాడు. దీంతో మళ్లీ బాద్షా పనిలో నిమగ్నమయ్యేముందు కుటుంబంతో కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆర్యన్ కోసం షారుఖ్ కొన్ని మార్పులు చేశారు. ఆర్యన్కు ఒక నమ్మదగిన బాడీగార్డ్ను నియమించాలను చూస్తున్నారని సమాచారం. చాలా కాలం పాటు తనతో ఉండి, తన కుటుంబంలో వ్యక్తిగా భావించే షారుఖ్ బాడీగార్డ్ రవి సింగ్ను ఆర్యన్తో ముంబైలో ఉండమని అడిగారట. ప్రస్తుతం తన కోసం కొత్త బాడీగార్డును నియమించుకోవాలని చూస్తున్నారట షారుఖ్. బెయిల్ షరతుల ప్రకారం ఆర్యన్ ప్రతి శుక్రవారం ఎన్సీబీ కార్యాలయంలో హాజరవ్వాలి. కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త బృందంతో తరచుగా సమన్లు రావొచ్చు. ఇలాంటి సందర్భంలో ఆర్యన్ వెంట షారుఖ్కు తెలిసిన, నమ్మదగిన వ్యక్తి ఉండటం ఉత్తమమని భావించారు. ముందుగా షారుఖ్ పఠాన్ సినిమా షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లాల్సి ఉంది. అన్ని సక్రమంగా జరిగితే వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. షారుఖ్ ఖాన్ పఠాన్లో జాన్ అబ్రహం, దీపికా పదుకొనేతో కలిసి నటించనున్నారు. అలాగే అట్లీ తదుపరి చిత్రం కూడా చేయనున్నారు. -
బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మరో కొత్త విషయం వెలుగులోకి..
ముంబై: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శామ్ డిసౌజా మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నౌకపై దాడి చేసిన తర్వాత ఆర్యన్ఖాన్ను విడిచిపెట్టడానికి ఆ కేసులో సాక్షి అయిన కిరణ్ గోసావి షారూక్ఖాన్ మేనేజర్ పూజ దాడ్లాని దగ్గర నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఎన్సీబీ ఆర్యన్ను అరెస్ట్ చేయడంతో తిరిగి ఆ డబ్బులు ఇచ్చేశారని ఈ డీల్కి మధ్యవర్తిత్వం వహించినట్టుగా అనుమానాలున్న శామ్విల్లి డిసౌజా ఆరోపించారు. ఆర్యన్ను విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారుల తరఫున మధ్యవర్తులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గుతేల్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ విషయాలన్నీ తెలిసిన తనని సిట్ అరెస్ట్ చేస్తుందన్న భయంతో బాంబే హైకోర్టులో శామ్ డిసౌజా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. దీన్ని హైకోర్టు తిరస్కరించింది. కిరణ్ గోసవి, ప్రభాకర్ సాయిల్ ఈ కేసులో సాక్షులు కారని, వారే అసలు సిసలైన కుట్రదారులని డిసౌజా ఆరోపించారు. చదవండి: (చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?) -
డ్రగ్స్ కట్టడిలో ఏపీ భేష్.. వాస్తవాలు ఇవే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది. డ్రగ్స్ కేసులతోపాటు దేశంలో అన్ని రకాల నేరాలకు సంబంధించి ఎన్సీబీ నివేదికే ప్రామాణికం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా డ్రగ్స్ను కట్టడి చేస్తోందని ఆ నివేదిక స్పష్టం చేస్తుండగా చంద్రబాబు మాత్రం రాష్ట్రంపై బురద చల్లుతుండటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. ఎన్సీబీ నివేదికలే వాస్తవాలను వెల్లడిస్తున్నాయని పేర్కొంటున్నారు. టాప్లో యూపీ, పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర 2020లో దేశంలో నేరాలకు సంబంధించి ఎన్సీబీ ఇటీవల నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం గతేడాది డ్రగ్స్ కేసుల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ 10,852 కేసులు నమోదయ్యాయి. 6,909 కేసులతో పంజాబ్ రెండో స్థానంలో ఉంది. 5,403 కేసులతో తమిళనాడు మూడో స్థానంలో, 4,968 కేసులతో కేరళ నాలుగు, 4,714 కేసులతో మహారాష్ట్ర ఐదో స్థానంలో నిలిచాయి. 2020లోనే కాదు గత కొన్నేళ్లుగా ఆ ఐదు రాష్ట్రాలే అటూ ఇటూగా డ్రగ్స్ కేసుల్లో అగ్ర స్థానాల్లో ఉన్నాయి. 2018, 2019లో మహారాష్ట్ర, పంజాబ్, యూపీ, కేరళ, తమిళనాడు వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 2017లో మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, యూపీ, తమిళనాడు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. సమర్థంగా కట్టడి.. 18వ స్థానంలో ఏపీ 2020లో డ్రగ్స్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది. 28 రాష్ట్రాలున్న జాబితాలో మన రాష్ట్రం 18వ స్థానంలో ఉందంటే ప్రభుత్వం డ్రగ్స్ దందాను ఎంత సమర్థంగా కట్టడి చేస్తోందన్నది స్పష్టమవుతోంది. దేశంలో ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కేసుల్లో అంత చివరిలో ఉండటం ప్రభుత్వ సమర్థతకు నిదర్శమని నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ వ్యవహారాలను మరింత సమర్థంగా కట్టడి చేస్తోంది. దీంతో ఏపీ ట్రాక్ రికార్డ్ 2020లో మరింత మెరుగైంది. టీడీపీ హయాంలో 2017లో మన రాష్ట్రం డ్రగ్స్ కేసుల్లో 16వ స్థానంలో ఆ తరువాత ఏడాది 17వస్థానంలో నిలిచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరింత సమర్థంగా డ్రగ్స్ వ్యవహారాలను కట్టడి చేసింది. దీంతో 2020లో మన రాష్ట్రం డ్రగ్స్ కేసుల్లో దేశంలో 18వ స్థానానికి తగ్గిపోయింది. అంటే రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాలను ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లేనన్నది స్పష్టమవుతోంది. -
జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై NCB విచారణ
-
డ్రగ్స్ కేసు: ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్లో అనన్య పేరు.. ఎవరీ భామ?
బాలీవుడ్లో డ్రగ్స్ కేసుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య టైమ్లో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అప్పటినుండి ఎన్సీబీఐ చూపు మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీల పైనే ఉంది. తాజాగా క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టై జైల్లో ఖైదీగా ఉన్న విషయం తెలిసింది. (చదవండి: షారుక్ నాకు తండ్రిలాంటి వాడు.. వైరల్ అవుతున్న పాత ఇంటర్వ్యూ) ఈ కేసుకు సంబంధించి తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంటిలో ఎన్సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.అక్కడ ఆమె ఫోన్ను స్వాదీనం చేసుకున్న అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలిపారు. అంతేకాదు ఆమె ఫోన్, ల్యాబ్టాప్నీ సీజ్ చేశారు కూడా. . రేవ్ పార్టీ జరుగుతన్న సమయంలో ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కోసం ఒక నటికి వాట్సప్ మెసేజ్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ సమయంలో ఆర్యన్ చాట్ చేసింది అనన్య పాండేతోనే అని తేలింది. అలా అనన్య కూడా ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. ఎవరీ అనన్య పాండే? ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న అనన్య పాండే.. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే తనయ అనే విషయం తెలిసిందే. 2019లో `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో బాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వాహ్’తో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ భామ ఒక హిందీ మూవీతో పాటు.. తెలుగులో 'లైగర్' లో నటిస్తోంది. హీరోయిన్గా ఇప్పటివరకు పెద్ద హిట్ కొట్టకపోయినా.. పార్టీ, పబ్బుల్లో మాత్రం ఈ భామ జోరు ఓ రేంజ్లో ఉంటుంది. షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్, అమితాబ్ మనవరాలు నవ్య నవేలి నందా, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. అనన్యకు మంచి స్నేహితులు. వీళ్లంతా కలిసే పబ్లకి వెళ్తుంటారు. అర్యన్ ఖాన్తో సహా మరికొంతమంది కూడా ఈ గ్యాంగ్తో కలిసి పార్టీలకు వెళ్తుంటారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ పోలీసులకు పట్టుబడడంతో వీరి బాగోతం అంతా బయటపడుతోంది. -
అనన్యపాండే మొబైల్, ల్యాప్టాప్ సీజ్
Ananya Pandays Mobile, Laptop Seized : బాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కుదిపేస్తుంది. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ అనన్య పాండే ఎన్సీబీ ఎదుట హాజరయ్యింది. తండ్రి, నటుడు చంకీ పాండేతో కలిసి ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈరోజు ఉదయం అనన్య ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్, ల్యాప్టాప్ను సీజ్ చేశారు. ఈనెల 2న జరిగిన క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్రగ్స్ కావాలని ఆర్యన్.. అనన్యకు వాట్సప్ చాట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చాట్లో లైగర్ భామ అనన్యతో పాటు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా స్టార్ హీరోల పిల్లలు కావడంతో అందరికి ఓ కామన్ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. తెలుగులోనూ విజయ్ దేవరకొండ సరసన లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. చదవండి: నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్! బెస్ట్ఫ్రెండ్తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత -
రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్
ముంబై: డ్రగ్స్ దందాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, కేటుగాళ్లు సరికొత్త దారులు ఎంచుకుంటూ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఓ మహిళ ఏకంగా శానిటరీ న్యాప్కిన్లో డ్రగ్స్ తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో షాక్ గరయ్యారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్ ఇంతియాజ్ ఖత్రీకి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే ప్రయత్నించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ముంబై మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆర్యన్ ఖాన్ సహా ఏడుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టులో.. ఆర్యన్ ఖాన్ను క్రూయిజ్ పార్టీకి ఆహ్వానించారు. అయితే, అతనికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. రెండవది, పోలీసులు అర్యాన్ని అదుపులోకి తీసుకుంది కూడా కేవలం అతని చాట్ ఆధారంగా మాత్రమేనని మరే ఇతర బలమైన అధారాలు లేవని తెలిపారు. చదవండి: భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..? -
ఆర్యన్ కేసులో బీజేపీ హస్తం!
ముంబై: బాలీవుడ్ స్టార్కిడ్ ఆర్యన్ ఖాన్ అరెస్టు కేసు విషయం పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు అంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమని, సోదాల్లో ఎన్సీబీ అధికారులతో పాటు బీజేపీ నేత ఒకరు పాల్గొన్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్టకి చెందిన మహారాష్ట్ర మైనార్టీ వ్యవహరాల మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. మరోవైపు ఎన్సీబీ, బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో ఆర్యన్తో సహా 17మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. జాతీయ నార్కొటిక్ బ్యూరో జరిపిన ఈ సోదాలన్నీ డ్రామాలని, నకిలీవని నవాబ్ మాలిక్ విమర్శించారు. అసలా నౌకలో డ్రగ్సే దొరకలేదన్నారు. ఈ సందర్భంగా రైడ్ జరుగుతున్నప్పటి కొన్ని వీడియోలను ఆయన విడుదల చేశారు. ఇందులోని ఒక వీడియోలో ఆర్యన్ను ఎస్కార్ట్ చేస్తూ గోస్వామి అనే వ్యక్తి కనిపించారు. అయితే అతను ఎన్సీబీ అధికారి కాదని, గోస్వామి సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం అతను ఒక ప్రైవేట్ డిటెక్టివని నవాబ్ ఆరోపించారు. మరో వీడియోలో ఇదే కేసులో అరెస్టయిన అర్బాజ్ మర్చెంట్ను ఇద్దరు ఎస్కార్ట్ చేస్తూ కనిపించారు. వీరిలో ఒక వ్యక్తి బీజేపీ సభ్యుడని నవాబ్ చెప్పారు. వీరంతా ఎన్సీబీ అధికారులు కానప్పుడు రైడ్లో ఎందుకున్నారని ప్రశ్నించారు. మర్చంట్తో పాటు ఉన్న వ్యక్తి గుజరాత్లో సెపె్టంబర్ 21–22 తారీకుల్లో కనిపించాడని, అందువల్ల అతనికి ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్తో సంబంధం ఉండి ఉండొచ్చని ఆరోపించారు. సదరు వ్యక్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్ను, తమ ప్రభుత్వాన్ని మకిలిపట్టించేందుకు ఎన్సీబీని బీజేపీ ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. నవాబ్ అల్లుడు సమీర్ ఖాన్ను ఎన్సీబీ డ్రగ్స్ కేసులో గత జనవరిలో అరెస్టు చేయగా, సెపె్టంబర్లో బెయిల్పై బయటకు వచ్చారు. అవును.. అక్కడే ఉన్నాను: నౌకలో ఎన్సీబీ సోదాలు జరిపినప్పుడు తాను అక్కడే ఉన్నానని మాలిక్ ఆరోపణల్లో కేంద్రబిందువుగా మారిన మనీశ్ భన్సాలీ తెలిపారు. తాను బీజేపీ కార్యకర్తనేనని, కానీ ఏ నాయకుడిని ఇంతవరకు కలవలేదని తెలిపారు. తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కలి్పంచాలని కోరతానన్నారు. ‘‘అక్టోబర్ 1న డ్రగ్స్ పార్టీ గురించి సమాచారం వచ్చింది. దీన్ని ఎన్సీబీకి చెప్పమని నా స్నేహితుడు సూచించాడు. ఈ పార్టీ విషయమై ఎన్సీబీ వద్ద స్వల్ప సమాచారమే ఉంది. మేము మరికొంత అందించాం. అక్టోబర్ 2న రైడ్ను ప్లాన్ చేశారు. సాక్షిగా నేను సంఘటనా స్థలంలో ఉన్నాను’’ అని మనీశ్ వెల్లడించారు. ఎన్సీబీ అధికారులతో తాను ఉన్నానని, అందుకే వీడియోల్లో ఎస్కార్ట్ చేస్తున్నట్లు కనిపించిందని ఇండియాటుడేకు ఆయన తెలిపారు. నవాబ్ మాలిక్ మలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను దేశం కోసం పనిచేస్తున్నామని, నౌకలో షారూఖ్ కొడుకున్నట్లు తమకు తెలియదని చెప్పారు. వారంతా సాక్షులు తమ ఏజెన్సీపై వస్తున్న ఆరోపణలు నిరాధారాలని, గతంలో తాము చేసిన అరెస్టులకు ప్రతీకారంగా చేస్తున్నవై ఉండొచ్చని ఎన్సీబీ డీఐజీ జ్ఞానేశ్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. తమ విచారణ చట్టబద్ధంగా, పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. రైడ్లో ఎన్సీపీ అధికారులతో పాటు గోస్వామి, భన్సాలీతో పాటు ప్రభాకర్, గోమెజ్, ఉస్మానీ, వైగాంకర్, రానే, ప్రకాశ్, ఫయాజ్, ఇబ్రహీంలు పాల్గొన్నారని, వీరంతా సాక్షులుగా వ్యవహరించారని వివరించారు. ఎన్సీబీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆర్యన్ ఖాన్కు వ్యతిరేకంగా సాక్ష్యాలుండబట్టే కోర్టు అతన్ని కస్టడీకి పంపిందని బీజేపీ ఎంఎల్ఏ అతుల్ అభిప్రాయపడ్డారు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోతే వెంటనే బెయిల్ వచ్చేదన్నారు. అల్లుడి అరెస్టును మనసులో ఉంచుకొని మాలిక్ ఆరోపణలు చేశారని విమర్శించారు. డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్ ముంబైలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో ఎన్సీబీ అధికారులు తాజాగా మరొక డ్రగ్ విక్రేతను అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముంబైలోని సబ్–అర్బన్ పోవాయ్లో ఈ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీఐ ముంబై జోనల్ అధికారులు బుధవారం వెల్లడించారు. దీంతో, బాలీవుడ్ స్టార్ షారుఖ్ఖాన్ కొడుకుసహా మొత్తం 17 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. కాగా, మంగళవారం అరెస్టయిన నలుగురు ఈవెంట్ ఆర్గనైజర్లు సమీర్ సెహగల్, మానవ్ సింఘాల్, భాస్కర్ అరోరా, గోపాల్ ఆనంద్లను 14 తేదీ దాకా ఎస్సీబీ కస్టడీకి పంపుతూ ముంబైలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నెర్లికర్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. మరోవైపు, అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులు కొందరు బుధవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వచ్చారు. అరెస్ట్ అయిన అర్బాజ్ మర్చంట్ తండ్రి అస్లాం వారిలో ఉన్నారు. తన కుమారుడు అమాయకుడని ఆయన వ్యాఖ్యానించారు. అర్బాజ్కు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు లాయర్ పిటిషన్ దాఖలుచేశారు. అక్టోబర్ రెండో తేదీన ముంబై పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ వద్ద ఉదయం 11.30 నుంచి రాత్రి 8.30 వరకు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని తెప్పించి, భద్రపరచాలని విన్నవించు కున్నారు. దీనిపై మీ స్పందన తెలపాలని ఎన్సీబీని కోర్టు ఆదేశించింది. -
ఆర్యన్ ఖాన్తో సెల్ఫీపై విమర్శలు.. ‘బీజేపీ హస్తం ఉంది’
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్యన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు అతడితోపాటు మరో ఇద్దరికి ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్కు సంబంధించిన ఓ ఫోటో తెగ వైరలవ్వడంతో పాటు వివాదాస్పదంగా కూడా మారింది. పోలీసుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్తో ఓ వ్యక్తి సెల్ఫీ దిగాడు. సదరు వ్యక్తిని ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్గా గుర్తించారు. ఇక ఈ ఫోటోపై మహారాష్ట్ర మినిస్టర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు. (చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం, ఎవరీ మున్మున్ ధమేచ) ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ ఈ ఆరోపణలు చేశారు. ఈ సందరన్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం ఆర్యన్ ఖాన్ చేయి పట్టుకుని.. ఎన్సీబీ కార్యాలయానికి తీసుకుని వచ్చి వ్యక్తి ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి. అలానే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మనీశ్ భానుశాలి రెయిడ్ జరిగిన విజువల్స్లో కనిపించారు. ఎన్సీబీ అధికారులతో పాటు ఉన్న వీరిద్దరని చూస్తే.. దీనిలో బీజేపీ హస్తం ఉందని అర్థం అవుతుంది. నకిలీ డ్రగ్స్ రాకెట్ను పట్టుకుని.. మహారాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది’’ అన్నారు. నవాబ్ మాలిక్ వ్యాఖ్యలను ఎన్సీబీ కొట్టిపారేసింది. ఈ ఇద్దరినీ "స్వతంత్ర సాక్షులు" అని పేర్కొంది. ‘‘నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ కేసుకు సంబంధించిన విచారణ చట్టపరంగా, వృత్తిపరంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోంది" అని ఎన్సీబీ అధికారి జ్ఞానేశ్వర్ సింగ్ అన్నారు. ఆర్యన్ ఖాన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్తో పాటు మరో ఆరుగురిని సోమవారం అరెస్టు చేశారు. (చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..?) భానుశాలి పాత్రపై బీజేపీ స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలి. "రాజకీయాలు చేయడానికి అనేక సమస్యలు ఉంటాయి, కానీ మన దేశ భవిష్యత్తు తరాలకు సంబంధించిన డ్రగ్స్ విషయంలో మేము రాజకీయాలు చేయలేం’’ అని బీజేపీ ప్రతినిధి రామ్ కదం స్పష్టం చేశారు క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీపై గత శనివారం రాత్రి దాడులు చేసిన తరువాత, డ్రగ్స్ నిరోధక అధికారులు 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరాస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 33 1.33 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదు. అయితే, అతని వాట్సాప్ చాట్లో నేరపూరితమైన విషయాలు ఉన్నట్లు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. చదవండి: మీ టీనేజర్ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..! -
తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్ ఖాన్
Aryan Khan Cried: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే! శనివారం రాత్రి ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్పై ఎన్సీబీ అధికారులు మెరుపుదాడి జరిపి పలు రకాల నిషేధిత డ్రగ్స్తోపాటు ఆర్యన్ ఖాన్తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన ముంబై కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు అతడిని ఎన్సీబీ కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది. ఇదిలా వుంటే తన కొడుకును కలవడానికి షారుఖ్ కొద్దిరోజుల క్రితం అధికారుల అనుమతి కోరగా ఇందుకు ఎన్సీబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లాకప్లో ఉన్న కొడుకును చూడటానికి వెళ్లాడు షారుఖ్. అయితే తండ్రిని చూడగానే ఆర్యన్ బోరుమని ఏడ్చినట్లు మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. కొడుకును అలాంటి దుస్థితిలో చూసి షారుఖ్ సైతం తల్లడిల్లిపోయినట్లు సమాచారం. అధికారులు రైడ్ చేసిన సమయంలో తన కొడుకు దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోయినప్పటికీ అతడిని ఇలా లాకప్లో పెట్టడాన్ని చూసి ఎంతగానో బాధపడ్డాడట షారుఖ్. కాగా క్రూయిజ్ షిప్పై ఎన్సీబీ అధికారులు చేసిన మెరుపుదాడిలో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 5 గ్రాముల మెఫెడ్రోన్తో పాటు కొన్ని పిల్స్ను అలాగే రూ.1,33,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్తో సహా మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్, ఇస్మీత్ సింగ్, గోమిత్ చోప్రా, నూపుర్ సారిక, విక్రాంత్ చోకర్, మొహక్ జైస్వాల్ తదితరులను అరెస్ట్ చేశారు. -
మీ టీనేజర్ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..!
డ్రగ్స్ తీసుకున్నారనే విషయంపై షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్తో పాటు అతని స్నేహితులైన మరో ఏడుగురు టీనేజర్లను ఎన్సిబి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) నిన్న అదుపులోకి తీసుకుంది. ఈ వార్త విన్న వారిలో చాలా మంది ‘డబ్బున్న వారి పిల్లలు అంతే’ అని ఓ మాట ఘాటుగా అనేసి తిరిగి తమ పనుల్లో పడిపోయుంటారు. ఇటీవల తరచూ మనముందుకొస్తున్న వార్తల్లో డ్రగ్స్ అనే బూచి తీసుకువస్తున్నవే ఎక్కువ. సినీ తారలు, డబ్బున్నవారు మాత్రమే డ్రగ్స్ వాడతారు అనుకునే సాధారణ జనం కూడా ఇప్పుడు తమ పిల్లల గురించి చర్చించుకోవాల్సిన, సరి చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ‘సమస్య మా ఇంట్లోకి రాదు, మా పిల్లలు బంగారం’ అనేది చాలామంది తల్లిదండ్రుల భావన. బయట సులువుగా దొరుకుతున్నప్పుడు, పిల్లలు ఆకర్షణకు లోనుకాకుండా ఉండరు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ‘డ్రగ్’ ప్రపంచంలో అత్యంత సాదాసీదాగా అడుగుపెట్టేవారిలో 18 ఏళ్ల లోపు టీనేజర్లే ఉంటున్నట్టు నివేదికలు చూపుతున్నాయి. అంటే, టీనేజర్లు డ్రగ్స్ వినియోగంలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్నారన్నమాట. ఒక్కసారేగా..! ఏదేమైనా ఈ దశలో ‘ప్రయోగం చేద్దాం’ అనుకోవడం నిజం. మాదకద్రవ్యాలు లేదా మద్యం ప్రయత్నించినంత మాత్రాన వాటికి బానిస అవుతారని చెప్పలేం. అయితే, కొంతమంది టీనేజర్లు ఈ తరహా ప్రయోగాలు చేయడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం. ‘అదేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత, తోటి స్నేహితుల నుంచి తీసుకోమనే ఒత్తిడి, ట్రెండ్లో ఉన్నామని అనుకోవడం, కష్టం నుంచి తప్పించుకోవాలనే కోరిక’ సాధారణ కారణాలుగా ఉన్నాయి. అతి సాధారణ సంకేతాలు ఇంట్లో టీనేజ్ దశలో ఉన్న పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారా.. అని కొన్ని విషయాలను గమనించి తెలుసుకోవచ్చు. పిల్లలతో రోజూ కొద్దిసేపు సన్నిహితంగా మెలిగితే అవేంటో ఇట్టే తెలిసిపోతుంది. పిల్లల మాట, ఆలోచన, ప్రవర్తన.. ఈ మూడింటిని గమనించాలి. అలాగే.. ‘పిల్లలు చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారా... కారణం లేకుండా నవ్వడం లేదా ఏడ్వడం చేస్తున్నారా, చదువు, ఇతరత్రా రోజువారి కార్యకలాపాలపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదా, శుభ్రంగా ఉండటం లేదా, బాగా ఆకలి అంటూ రుచీ పచీ అని పట్టించుకోకుండా తింటున్నారా, వారి శ్వాస సిగరట్ వాసన వస్తోందా, బట్టలు పొగ వాసన వస్తున్నాయా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా, వారి వయసువారితో కాకుండా కొత్త కొత్త స్నేహాలు చేస్తున్నారా, ఇంట్లో డబ్బులు, ఖరీదైన వస్తువులు కనిపించకుండా పోతున్నాయా... వంటి విషయాలను పరిశీలించక తప్పదు. అయితే, తాము వారిని అనుమానిస్తున్నట్టు పిల్లలు అనుకోకూడదు. మరింత రహస్య జీవనంలోకి జారుకోవచ్చు! మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారనే నిజం తెలిసి కరకుగా పిల్లలతో ప్రవర్తిస్తే ‘మీకు తెలియకుండా మరింత రహస్యంగా వాటిని తీసుకునే ప్రయత్నం చేయవచ్చు’ అంటారు మానసిక నిపుణులు. ‘మీరు గమనించారని తెలిస్తే.. ఎత్తుకు పై ఎత్తు వేసి ఇంకా రహస్యంగా డ్రగ్స్ తీసుకోవచ్చు. పిల్లలను విమర్శిస్తూ మాట్లాడితే వారు ఎదురు తిరిగే అవకాశమూ ఉంది’ అంటారు. ప్రేమతోనే మందు వేయడం అనేది తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత. గమనింపు అనేది అసలు బాధ్యతగా ఉండాలి. పిల్లలతోనే కాకుండా, వారి స్నేహితుల తల్లిదండ్రులతో కూడా సంభాషించాలి. మారేందుకు మూడు పద్ధతులు.. పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని తెలిస్తే వారితో గొడవపడకుండా, ప్రేమ పూర్వకమైన వాతావరణంలోనే వారిని నేర్పుగాSతమ దారిలోకి తెచ్చుకోవాలి అన్నది మానసిక నిపుణుల సూచన.‘స్కూల్ లేదా ఇంటి చుట్టుపక్కల వాతావరణంపై అనుమానం వస్తే వాటిని మార్చాలి. ఒక్కోసారి ఉన్న చోటును వదిలి మరో కొత్త ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. ఇవి మొదట్లో తల్లిదండ్రులు చేస్తారు. రెండవది.. ఇంట్లో వాతావరణం ఎలా ఉంది అనేది ప్రతి కుటుంబాల్లో సరిచూసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు పిల్లల మీద ప్రభావం చూపుతాయి. అందుకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరం. మూడవది.. డ్రగ్స్కు బానిస అయ్యారని గుర్తిస్తే వైద్యుల సాయంతో రిహాబిలిటీ సెంటర్లో పెట్టి కౌన్సెలింగ్, యోగా, మందులు వాడకం ద్వారా తిరిగి మామూలు జీవనంలోకి తీసుకురావచ్చు’ అని వివరించారు. డ్రగ్స్ కేవలం సెలబ్రిటీ క్లాస్ ట్రెండ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా టీనేజర్లు ఉన్న ఇంటింటి సమస్య కూడా. మన ఇంట్లో లేదంటే పొరుగింట్లో టీనేజ్ వయసున్న పిల్లలున్నారంటే వారిని ఓ కంట కనిపెడుతూ వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయచ్చు. సకాలంలో గుర్తించి, మాదక ద్రవ్యాల బారి నుంచి టీనేజర్లను కాపాడుకోవడం ఈ రోజుల్లో మన ముందున్న అసలైన సవాల్. మన ఇంట్లోనూ ఉండొచ్చు! కరోనా కారణంగా 18 నెలలుగా బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న పిల్లలు, ఇప్పుడు ఒక్కసారిగా తిరిగి కొత్త లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. గతంలో టీనేజ్ దశలో అబ్బాయిలు, అమ్మాయిలు 3:1 రేషియోలో ఉండేవారు. ప్రస్తుత రోజుల్లో 1:1 గా ఉన్నారు. పల్లె, పట్నం అని తేడా లేకుండా అన్నిచోట్లా, అన్ని దిక్కులా మాదకద్రవ్యాలు సులువుగా దొరకడం కూడా ప్రధాన కారణం. – డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం, ఎవరీ మున్మున్ ధమేచ
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి డ్రగ్స్ వ్యవహరం బాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆర్యన్తో పాటు మున్మున్ ధమేచ అనే యువతి, ఆర్బాజ్ సేతు మర్చంట్లతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆర్భాజ్.. ఆర్యన్కు క్లోజ్ ఫ్రెండ్ కాగా మున్మున్ ధామేచ ఎవరనేది ఆసక్తిగా మారింది. దీంతో ఆమె ఎవరా అని ఆరా తీయగా.. మున్మున్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యాషన్ మోడల్గా తెలిసింది. చదవండి: నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాను: ఆర్యన్ ఆమె వయసు 39. మున్మున్ స్వస్థలం మధ్య ప్రదేశ్లోని సాగర్ జిల్లా. ఇటీవల ఆమె తల్లిదండ్రులు మరణించడంతో తన సోదరు ప్రిన్స్ ధమేచతో కలిసి 6 ఏళ్లుగా ఢిల్లీలో నివసిస్తుంది. అయితే స్కూలింగ్ అంతా సాగర్లో చేసిన ఆమె ఆ తర్వాత పై చదువుల నిమిత్తం భోపాల్ల్కు వెళ్లినట్లు సమాచారం. కాగా ఈ కేసులో ఆర్యన్, మున్మున్తో పాటు ఆర్భాజ్ మర్చంట్, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. కాగా విచరాణలో నాలుగేళ్లుగా తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆర్యన్ పోలీసులతో వెల్లడించాడు. చదవండి: Shahrukh Khan: షారుక్ ఖాన్కి భారీ షాక్! -
నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నా: ఆర్యన్
Shahrukh Khan Son Drugs Case: ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ దాడి చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్తోపాటు మొత్తం 8మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అయితే కస్టడీలో ఆర్యన్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆర్యన్ నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎన్సీబీకి తెలిపాడు. అతను యూకే, దుబాయ్, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పాడు. అయితే అంతకుముందు షారుక్ ఖాన్ కస్టడీలో ఉన్న తన కుమారుడితో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు. కాగా ఆర్యన్ ఎన్సీబీ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ సమయంలో అతను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం. చదవండి: ఆర్యన్ ఖాన్తో లీకైన ఫోటో.. క్లారీటీ ఇచ్చిన ఎన్సీబీ -
ఆర్యన్ ఖాన్తో లీకైన ఫోటో.. క్లారిటీ ఇచ్చిన ఎన్సీబీ
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆర్యన్తో మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకుంది. అయితే ఎన్సీబీ ఆఫీస్లో విచారణ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆర్యన్తో సెల్ఫీ తీసుకున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అయితే వైరల్ పిక్లో ఉన్నది ఓ ఎన్సీబీ అధికారి అని అందరూ అనుకున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఎన్సీబీ ఆ సెల్ఫీలో ఉన్నది తమ డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీసర్ కాదని స్పష్టం చేసింది. అయితే ఈ డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాను ఎన్సీబీ అరెస్టు చేసింది. కాగా వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. చదవండి: షారుక్ కొడుకు ఫోన్ సీజ్.. డ్రగ్స్ కేసులో ప్రమేయంపై విచారణ -
Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..?
ముంబై: పర్యాటక నౌకలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల బరితెగించిన పిల్లలను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి గురించి ఇంటర్నెట్లో జనం ఆరా తీస్తున్నారు. 40 ఏళ్ల సమీర్ వాంఖెడే ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్. సమీర్ 2017లో మరాఠి నటి క్రాంతీ రెద్కర్ను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. చదవండి: (Shah Rukh Khan: షారుక్ కొడుకు ఫోన్ సీజ్.. డ్రగ్స్ కేసులో ప్రమేయంపై విచారణ?) జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లో జాయింట్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని బయటపెట్టారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. ఎగవేతదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సమీర్కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. బాలీవుడ్ సినిమాలంటే సమీర్కు చాలా ఇష్టం. అయినప్పటికీ విధి నిర్వహణలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరు. 2020 నవంబర్ 22న డ్రగ్స్ ముఠా సమీర్తోపాటు మరో ఐదుగురు ఎన్సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. చదవండి: (నా కొడుకు అమ్మాయిలతో తిరగొచ్చు..డ్రగ్స్ తీసుకోవచ్చు!) -
నా కొడుకు అమ్మాయిలతో తిరగొచ్చు..డ్రగ్స్ తీసుకోవచ్చు!
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్యన్తో పాటు మొత్తం 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లతో ఆర్యన్ చాటింగ్పై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో షారుక్ తన కుమారుడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భార్య గౌరీ ఖాన్తో కలిసి సిమి గేర్వాల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్.. 'నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్ చేయొచ్చు. సిగరెట్ తాగొచ్చు. సెక్స్, డ్రగ్స్ని కూడా ఆస్వాదించొచ్చు. అన్ని రకాలుగా అతను ఎంజాయ్ చేయవచ్చు' అంటూ షారుక్ సరదాగా మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తను యవ్వనంలో చేయని పనులు తన కొడుకు చేయాలంటూ షారుక్ సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నిజం అయ్యాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) చేసిన రైడ్లో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా మరికొందరు ప్రముఖుల పిల్లలు ఉండటం సంచలనంగా మారింది. చదవండి: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ Seriously Shahrukh Khan!! @narcoticsbureau Today he has been arrested pic.twitter.com/1WfZkNkvSC — Priya Kulkarni (@priyaakulkarni2) October 3, 2021 -
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్
Shah Rukh Khan's Son Aryan Khan Arrest: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఉన్న ఆర్యన్ను వైద్య పరిక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరు పరిచారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శనివారం రాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక రేవ్ అందులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉండటం హాట్టాపిక్గా మారింది. డ్రగ్స్ పెడ్లర్స్తో ఆర్యన్ అనేకమార్లు వాట్సప్ ఛాటింగ్ చేసినట్టుగా ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆర్యన్ ఖాన్ ఫోన్ను అధికారులు సీజ్ చేశారు. -
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారీ దందా!
మహారాష్ట్ర:ముంబైలో పట్టుబడుతున్న భారీ డ్రగ్స్ స్థావరాలు హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) గుర్తించింది. శుక్రవారం ముంబై నార్త్ అంధేరీలో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ 4.6కిలోల ఎపిడ్రిన్ డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో తయారు చేసి పరుపులు, మెత్తల్లో పెట్టి సముద్ర మార్గంగా ఆస్ట్రేలియా తరలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియా డ్రగ్స్ తరలింపు జరుగుతోంది. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ యోగిత అరెస్టు.. కీలక విషయాలు వెల్లడి మూడు రోజుల క్రితం గోవా డ్రగ్స్ కేసులో హైదరాబాది సిద్ధిక్ అహ్మద్ అరెస్టు అయ్యారు. శనివారం ముంబైలో షిప్లో పట్టుబడ్డ ఎపిడ్రిన్ సైతం హైదరాబాద్ నుండే వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎపిడ్రిన్ డ్రగ్స్కు హైదరాబాద్ కేంద్రంగా మారినట్లు సమాచారం. నైజీరియన్ పెడ్లర్లుగా మార్చుకుని పెద్ద ఎత్తున డ్రగ్స్ బిజినెస్ జరుగుతోంది. ఇటీవల బెంగళూర్లో పట్టుబడ్డ డ్రగ్స్ డాన్ యోగిత, హైదరాబాద్లోనూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. యోగిత, సిద్ధిఖ్ అహ్మద్ల విచారణలో హైదరాబాద్ డ్రగ్స్ లింకులు బయటపడనున్నట్లు తెలుస్తోంది. ముంబై తీరంలో శనివారం క్రూజ్ షిప్లో రేవ్ పార్టీపై అధికారులు దాడి చేయగా.. రేవ్ పార్టీలో షారుఖ్ పెద్ద కొడుకు అర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. -
ముంబై తీరంలో రేవ్ పార్టీ.. ఎన్సీబీ అదుపులో షారుఖ్ కొడుకు?
డ్రగ్స్కు సంబంధించిన కేసుల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులపై కేసులు నమోదు అవ్వడం తెలిసిందే. తాజాగా అటువంటిదే ముంబై తీరంలో జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కు ఓ షిప్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందింది. ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తన బృందంతో కలిసి సముద్రం మధ్య క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో షారుఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో హర్యానా, ఢిల్లీకి చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 7 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత స్టార్ హీరో కొడుకుతో పాటు 10 మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇంతకుమందు కూడా ఇలాగే సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలి సోదరుడు అగిసిలాస్ డెమెట్రియాడ్స్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా అనేక ఇతర బాలీవుడ్ ప్రముఖులను ఫెడరల్ యాంటీ-నార్కోటిక్స్ ఏజెన్సీ విచారించింది. చదవండి: కొడుకుతో పార్క్కు వెళ్లిన షకీరా.. ఒక్కసారిగా అడవి పందుల దాడి -
గోవాలో హైదరాబాదీపెడ్లర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోవా డ్రగ్ రాకెట్లో హైదరాబాద్ యువకుడు పట్టుబడటం సంచలనం రేపుతోంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వారం రోజులు జల్లెడ పట్టి డ్రగ్స్ దందా సాగిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది. వీరిలో హైదరాబాద్కు చెందిన సిద్దిఖ్ అహ్మద్ కూడా ఉన్నాడు. ఇప్పటికే డ్రగ్స్కు సంబంధించిన ఒక కేసులో టాలీవుడ్కు చెందిన 12 మంది సినీ ప్రముఖులను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారించింది. అదే కేసులో మనీలాండరింగ్ అనుమానంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా దర్యాప్తు జరిపింది. ఇంతలోనే గోవాలో సిద్దిఖ్ పట్టుబడటంతో.. డ్రగ్స్ మాఫియాలో హైదరాబాద్ లింకు మరోసారి చర్చనీయాంశమయ్యింది.. ఛత్తీస్గఢ్ వ్యక్తితో కలిసి.. సిద్దిఖ్ అహ్మద్ అరెస్టుకు సంబంధించి గోవా ఎన్సీబీ అధికారులను ఆరా తీయగా సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్కు చెందిన నౌమాన్ సవేరీతో కలిసి సిద్దిఖ్ గోవాలో డ్రగ్స్ను (ఎల్ఎస్డీ, ఎమ్డీఎమ్ఏ) సరఫరా చేస్తున్నాడు. గత బుధవారం సవేరీని ఎన్సీబీ అరెస్టు చేసి విచారించగా తనతో పాటు ప్రధాన భాగస్వామి సిద్దిఖ్ అహ్మద్ ముంబయితో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు డ్రగ్స్ రవాణా (పెడ్లింగ్) చేస్తున్నాడని వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే శనివారం అర్ధరాత్రి సిద్దిఖ్ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. పుట్టి పెరిగిందంతా ఇక్కడే... సిద్దిఖ్ అహ్మద్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే అని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం గోవాలోని సియోలిమ్ బీచ్ ప్రాంతంలో సెటిల్ అయ్యాడని, ఆ బీచ్ కేంద్రంగానే డ్రగ్ పెడ్లర్గా మారి ప్రధానంగా ముంబయి, బెంగళూరు తర్వాత హైదరాబాద్కు మాదకద్రవ్యాలైన లైసర్జిక్ యాసిడ్ డైతల్మైడ్ (ఎల్ఎస్డీ), మిథలిన్ డయాక్సీ మెథమాపెటమైన్ (ఎండీఎమ్ఏ) సరఫరా చేస్తున్నట్టు విచారణలో బయటపడిందని తెలిపారు. అయితే సిద్దిక్ హైదరాబాద్ నుంచి గోవాకు ఎందుకు మకాం మార్చాడన్న దానిపై ఎన్సీబీ దృష్టి పెట్టింది. గోవా కేంద్రంగా భారీ స్థాయిలోనే నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఉంటాడా? అనే కోణంలో విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో ఎండీఎమ్ఏ తయారీ? సిద్దిఖ్ విచారణలో కొన్ని ఆందోళన కల్గించే అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముంబయికి చెందిన డ్రగ్స్ మాఫియా హైదరాబాద్లోని కొన్ని పారిశ్రామిక కంపెనీల్లో ఎండీఎమ్ఏ డ్రగ్ను తయారు చేయిస్తోందని, అక్కడి నుంచే గోవా, బెంగళూరు, ముంబయి ప్రాంతాలకు రవాణా అవుతోందని అతను వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సిద్దిఖ్ దగ్గరున్న వివరాల ఆధారంగా ముంబయి డ్రగ్స్ తయారీ మాఫియాను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. రంగంలోకి స్థానిక అధికారులు సిద్దిఖ్ హైదరాబాద్లో పుట్టి పెరగడం, నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఉండటం.. హైదరాబాద్ ఎన్సీబీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సిద్దిఖ్ నివాసం ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం, అతడితో కాంటాక్ట్లో ఉండి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని గుర్తించేందుకు ఇప్పటికే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఎండీఎమ్ఏ తయారీ అంశం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రధానంగా దీనిపైనే దృష్టి సారించి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గోవా నుంచే ఈవెంట్లకు డ్రగ్స్! హైదరాబాద్లో ఉన్న పరిచయాలు, బెంగళూరులో ఉన్న స్నేహితులు, ముంబయిలో ఉన్న డ్రగ్స్ మాఫియా ద్వారా సిద్దిఖ్ పలు ప్రత్యేక ఈవెంట్లకు ఎల్ఎస్డీ సరఫరా చేస్తున్నట్టు గోవా ఎన్సీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. పార్టీలకు పేరొందిన (మోస్ట్ హ్యాపెనింగ్) మెట్రో సిటీల్లో వీకెండ్ హంగామాకు అంతేలేదు. పబ్ కల్చర్ విపరీతంగా ఉన్న నగరాలు కావడం వరుసగా డ్రగ్ కేసులు వెలుగులోకి రావడం ఎన్సీబీని కలవరపెడుతోంది. గోవా కేంద్రంగా ఎల్ఎస్డీని ఈ మూడు ప్రాంతాలకు సిద్దిఖ్ చేరవేస్తున్నట్టు అనుమానిస్తోంది. -
బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడి ఇంటిపై సోదాలు, అరెస్ట్
సాక్షి, ముంబై: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన నివాసంలో ఎన్సీబీ దాడులు నిర్వహించింది. అనంతరం ఆగస్టు 30 వరకు ఎన్సీబీ కస్టడీకి తరలించారు. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో శనివారం కోహ్లీ నివాసంలో విస్తృత దాడులు జరిగాయి.ఈ దాడుల్లో కోహ్లీ ఇంటి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరింత సమాచాం కోసం ప్రశ్నించేందుకు ఆయనను ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. కాగా 2018లో చట్టవిరుద్ధంగా మద్యం నిల్వ చేశాడన్న ఆరోపణలపై కోహ్లీని ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసింది. బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గా ఉన్నాడు కోహ్లీ. -
బెంగళూరు టు ఆస్ట్రేలియా వయా హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: సింథటిక్ డ్రగ్స్గా పిలిచే యాంఫిటమైన్, సైడో ఎఫిడ్రిన్లను నగరం నుంచి ఆస్ట్రేలియాకు అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు రట్టు చేశారు. గత వారం బెంగళూరుతో పాటు నగరంలోని అక్బర్బాగ్ల్లో జరిపిన దాడుల్లో మొత్తం ముగ్గురిని పట్టుకున్నారు. వీరి నుంచి 3.9 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ను ఎన్సీబీకి చెందిన బెంగళూరు యూనిట్ చేపట్టింది. బెంగళూరుకు చెందిన సూత్రధారులు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో ఈ సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటిని ఆ దేశాలనికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికో సం ఈ గ్యాంగ్ పోలీసు, కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వివిధ మా ర్గాలను అనుసరిస్తోంది. తొలుత బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకు జిమ్ ఉపకరణాల మధ్యలో ఉంచి 2.5 కేజీల యాంఫిటమైన్ స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించింది. దీనిపై సమాచారం అందుకున్న ఎన్సీబీ బెంగళూరు యూనిట్ గత నెల 6న అక్కడి ఓ కొరియర్ సంస్థపై దాడి చేసింది. ఇస్మాయిల్ అనే నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ఆస్ట్రేలియాకు పార్శిల్ చేసిన డ్రగ్ను స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామంతో కంగుతిన్న స్మగ్లర్లు తమ ‘రూటు’ మార్చారు. హైదరాబాద్ నుంచి పార్శిల్ చేయాలని పథకం వేశారు. ఈ విషయాన్నీ గుర్తించిన ఎన్సీబీ టీమ్ గత వారం నగరానికి చేరుకుంది. చంచల్గూడ సమీపంలోని అక్బర్ బాగ్ ప్రాంతంలోని ఓ కొరియర్ కార్యాలయంపై కన్నేసి ఉంచింది. తమిళనాడుకు చెందిన ఎ.తాహెర్, ఆర్.మీరన్ను ఓ పార్శిల్తో అక్కడకు చేరుకున్నారు. ఎంబ్రాయిడరీ వస్తువుల పేరుతో ఆస్ట్రేలియాకు దాన్ని పంపాలని ప్రయత్నించారు. అక్కడే మాటు వేసి ఉన్న ఎన్సీబీ టీమ్ వారిని అదుపులోకి తీసుకుని పార్శిల్ను తనిఖీ చేసింది. అందులో 1.4 కేజీల సూడో ఎఫిడ్రిన్ పౌడర్ బయటపడింది. దీంతో ఆ ఇద్దరినీ అరెస్టు చేసిన అధికారులు బెంగళూరు తరలించి జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు. ఈ గ్యాంగ్కు సూత్రధారులుగా ఉన్న కర్ణాటక వాసుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. చదవండి : Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి -
రూ.2కోట్ల విలువైన ఆల్ప్రాజోలం స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మరో డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. రూ.2 కోట్ల విలువైన ఆల్ప్రాజోలం మత్తు పదార్థాన్ని వ్యానులో తీసుకెళ్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హైదరాబాద్–బెంగళూరు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో పట్టుకున్నారు. శుక్రవారం కర్ణాటకలోని బీదర్ శివారులో ఉన్న కోలార్ ప్రాంతంలో ఓ పరిశ్రమ ఉంది. దాన్ని హైదరాబాద్కు చెందిన ఎన్వీ రెడ్డి లీజుకు తీసుకున్నాడు. ఇందులో ప్రొడక్షన్ మేనేజర్ అమృత్, కెమిస్ట్వైవీ రెడ్డి, ఫైనాన్సియర్ భాస్కర్, అతడి అనుచరుడు మీనన్ గుట్టుచప్పుడు కాకుండా ఆల్ప్రాజోలం తయారుచేస్తున్నారు. బెంగళూరులో ఓ కేసు ద్వారా ఈ పరిశ్రమ గురించి బెంగళూరు ఎన్సీబీకి సమాచారం అందింది. బెంగళూరు నుంచి బీదర్కు చాలా దూరం కావడంతో హైదరాబాద్లోని ఎన్సీబీకి శుక్రవారం సమాచారం అందించారు. అదేరోజు రాత్రి హైదరాబాద్ ఎన్సీబీ అధికారులు బీదర్ వెళ్లి సదరు పరిశ్రమలో తనిఖీలు చేశారు. ట్రక్కులో సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన 91.5 కిలోల ఆల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.90 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పారిపోయేందుకు యత్నించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్లోని మియాపూర్లో నివాసముంటున్న పరిశ్రమ యజమాని ఎన్వీరెడ్డి ఇంట్లో తనిఖీలు చేసి రూ.62 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరి నెట్వర్క్ ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. మత్తు స్వభావం కలిగి ఉన్న ఈ మందును కృత్రిమ కల్లు తయారీలో వాడుతారు. -
నేను సారా అలి ఖాన్ కలిసి గంజాయ్ పీల్చాం: రియా
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి ఏడాది కావొస్తున్న ఇప్పటికి ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. అతడి మరణంతో బీ-టౌన్ డ్రగ్ వ్యవహరం బట్టబయలైంది. అలా సుశాంత్ సింగ్ కేసులో ఇప్పుడు ఎన్సీబీ, సీఐడీ ఇలా అనేక విభాగాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దీంతో ఏడాది నుంచి ఈ కేసు ఎన్నో మలుపు తిరుగుతూ వస్తోంది. ఇక ఎన్సీబీ కేసు విచారణ, దర్యాప్తు అంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాగా ఈ కేసులో అతడి ప్రియురాలు, నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్కు అత్యధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చిందని, ఆమెకు డ్రగ్ పెడ్లర్లతో సంబంధం ఉందని నిర్ధారణ కావడంతో ప్రధాన నిందితురాలిగా ఆమెపై ఎన్సీబీ కేసు నమోదు చేసింది. అనంతరం ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించింది. రియాతో పాటు ఆమె సోదరుడు, మరికొంతమందికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలడంతో వారిని కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం ఈ ఇద్దరికి బెయిల్ మంజూరైంది. అలా బయటకు వచ్చిన ఆమె కొద్ది రోజులు సైలెంట్గానే ఉన్నా.. తాజాగా ఎన్సీబీ విచారణలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సుశాంత్ సోదరి ప్రియాంక, ఆమె భర్త ఇద్దరూ కూడా డ్రగ్స్ వాడేవారని, సుశాంత్ డ్రగ్స్ వాడతారని ఇంట్లో వాళ్లకు తెలుసని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేగాక సుశాంత్ చనిపోయే ముందు అంటే ఓ నాలుగు రోజుల ముందు అంటే జూన్ 8వ తేదీన సుశాంత్ సోదరి ప్రియాంక డ్రగ్స్ కావాలని వాట్సప్ మెసేజ్ చేసిందని, తనకు 10 గ్రాముల లిబ్రియం, నెక్సిటో కావాలంటూ చాట్ చేసినట్లు తెలిపింది. అంతేగాక నటి సారా అలీ ఖాన్ కూడా ఇందులో భాగమైనట్లు వెల్లడించింది. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ల కూతురైన సారా తనకు పరిచయం ఉందని, ఆమెతో కలిసి గంజాయి పిల్చానని, పలుమార్లు, సారా తనకు గంజాయితో పాటు వోడ్కాను కూడా ఆఫర్ చేసినట్లు రియా తన వాంగ్మూలంలో వెల్లడించింది. మరో వారంలో సుశాంత్ తొలి వర్థంతి వస్తున్న నేపథ్యంలో రియా తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా గతేడాది జూన్ 14 సుశాంత్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్లో సుశాంత్ ఫ్లాట్మేట్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో నటుడి పీఆర్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని అరెస్టయ్యాడు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ)అధికారులు శుక్రవారం నాడు హైదరాబాద్లో సిద్ధార్థ్ను అరెస్ట్ చేశారు. అతడు గతంలో సుశాంత్ నివసించిన ఫ్లాట్లోనే మూడేళ్లపాటు ఉన్నాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా సిద్ధార్థ్తో మాట్లాడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ఇతడిపై విచారణ జరిపారు. అలాగే ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్ను పలుమార్లు విచారించారు. ఈ క్రమంలో సుశాంత్ మరణించి ఏడాది కావడానికి కొన్ని రోజుల ముందు సిద్ధార్థ్ అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. కాగా సిద్ధార్థ్ సుశాంత్కు పీఆర్ మేనేజర్గానూ పని చేశాడు. చదవండి: డ్రగ్స్ కేసు చార్జిషీట్: రియా చక్రవర్తి సహా 33 మంది.. సుశాంత్ చేజార్చుకున్న 7 హిట్ సినిమాలివే.. -
రూటుమార్చినా దొరికాడు!
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న కింగ్పిన్ బాబూ ఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పట్టుకుంది. చాలాకాలంగా బాబూ ఖాలే కోసం గాలిస్తున్న ఎన్సీబీ.. ఈసారి అత్యంత పకడ్బందీ ఆపరేషన్ చేపట్టి అతడిని అరెస్టు చేసింది. వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ఏరియాల్లో ఈ ఏడాది భారీగా గంజాయి సాగు చేశారు. లాక్డౌన్, విస్తారంగా కురిసిన వర్షాలు దానికి తోడయ్యాయి. లాక్డౌన్ ఎత్తేశాక మహారాష్ట్ర, బెంగళూరులో గంజాయి మార్కెట్, అక్రమ రవాణా పెరిగాయి. కొద్దినెలలుగా ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్కు గంజాయి గుట్టుగా తరలిపోతోందని ఎన్సీబీకి సమాచారం వచ్చింది. దానికితోడు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఈ ముఠాలు గంజాయిని వీలైనంత ఎక్కువగా రవాణా చేసే పనిలో పడ్డాయి. ఈ సమాచారంతో నాలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న గంజాయి రవాణాపై నిఘా పెంచారు. హైదరాబాద్, కర్ణాటక మీదుగా.. ఎన్సీబీ అధికారులు ఈ గంజాయి నెట్వర్క్ను పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. పార్సిళ్లు తరలివెళ్తున్న మార్గాలను గుర్తించారు. హైదరాబాద్, కర్ణాటక మీదుగా ఉస్మానాబాద్ చేరుకుంటున్న సమయంలో స్మగ్లర్లు రెండు రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. తొలుత ఏపీలోని సీలేరు, చింతపల్లి నుంచి తెలంగాణలోకి భద్రాచలం వరకు తెస్తున్నారు. ఎలాంటి ఇబ్బందీ లేదనుకుంటే ఖమ్మం–సూర్యాపేట మార్గం మీదుగా తరలిస్తున్నారు. నిఘా పెరిగిందనుకుంటే.. భద్రాచలం చేరుకున్నాక రూటు మార్చి.. ఖమ్మం–వరంగల్ మార్గంలో ఘట్కేసర్పై ఔటర్ రింగురోడ్డు ఎక్కుతారు. తర్వాత సంగారెడ్డి-జహీరాబాద్ రూట్లో కర్ణాటకలోని హుమ్నాబాద్, బసవకల్యాణ మీదుగా ఉస్మానాబాద్ చేరుకుంటున్నారు. కాపుకాసి.. పట్టుకుని.. గంజాయి రాకెట్ కోసం చాలాకాలంగా కాపుగాస్తున్న ఎన్సీబీ అధికారులు.. పెద్ద అంబర్పేట వద్ద మార్చి 31వ తేదీన బాబూఖాలేకు చెందిన బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని, రూ.65 లక్షల విలువైన 332 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను గట్టిగా విచారించగా.. బాబూ ఖాలే నెట్వర్క్పై అవగాహన వచ్చింది. దీంతో రెండో రూటులోనూ దృష్టిపెట్టి.. ఏప్రిల్ 4న ఘట్కేసర్ టోల్ ప్లాజా వద్ద ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక ఐషర్ ట్రక్కును పట్టుకున్నారు. ఐషర్ ట్రక్కు క్యాబిన్కు, ట్రాలీకి మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో 694 కిలోల గంజాయి బయటపడింది. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.4 కోట్లు ఉంటుంది. ఈ రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న ఐదుగురిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులోనే నెట్వర్క్ సూత్రధారి బాబూ ఖాలే కూడా ఉండటం విశేషం. అధికారులు అందరినీ అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ వ్యవహారం: కొద్ది రోజుల్లో పెళ్లి.. యువతి తల నరికి -
డ్రగ్స్ కేసులో వివాదాస్పద బాలీవుడ్ నటుడు అరెస్టు
సాక్షి,ముంబై: వివాదాస్పద బాలీవుడ్ నటుడు, బిగ్బాస్-7 ఫేమ్ అజాజ్ ఖాన్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) షాక్ ఇచ్చింది. రాజస్తాన్ నుంచి మంగళవారం ముంబైకు చేరిన ఖాన్ను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాల కేసులో అజాజ్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ అధికారి తెలిపారు. మాదకద్రవ్యాల పెడ్లర్ షాదాబ్ బటాటాను ప్రశ్నించినప్పుడు ఖాన్ పేరు వెలుగులోకి రావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నగరంలోని అంధేరి, లోఖండ్వాలా ప్రాంతాల్లో ఎన్సీబీ దాడులు చేపట్టింది. అనంతరం అజాజ్ను ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్సీబీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఖాన్ తనను ఎవరూ అదుపులోకి తీసుకోలేదని తానే అధికారులను కలవడానికి వచ్చానని పేర్కొన్నాడు. (ఆ ఒక్కమాటతో ఆఫర్ వచ్చింది.. మళ్లీ పనిచేయాలని ఉంది) తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఖాన్పై మాదకద్రవ్యాల ఆరోపణలు రావడం మొదటిసారి కాదు. డ్రగ్స్ కేసులో 2018లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు, నోటి దురుసుతో తరచూ చర్చల్లో నిలిచే ఖాన్ను జూలై 2019 లో అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేసినందుకు, 2020 ఏప్రిల్లో ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్ట్ను అప్లోడ్ చేసినందుకు అరెస్టు చేశారు. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అజాజ్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్-7 లోకి ఎంట్రీ ఇచ్చిన ఖాన్ సీజన్ 8లో కూడా కనిపించాడు. అనేక టీవీ షోలతోపాటు, శక్తి చరిత్రా, భోండు, అల్లాహ్ కే బండే, రక్త చరిత్రా 2, హై తుజే సలాం ఇండియా లాంటి సినిమాల్లోనూ నటించాడుఖాన్. -
రియాకు బెయిల్!: సుప్రీంకోర్టుకు ఎన్సీబీ
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని మత్తు పదార్థాల నియంత్రణా సంస్థ (ఎన్సీబీ) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో సీజేఐ బోబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఈ కేసును మార్చి 18న విచారించనుంది. రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు గతేడాది అక్టోబర్ 7న బెయిల్ ఇచ్చింది. రూ. లక్ష పూచీకత్తుగా ఇవ్వాలని, పాస్పోర్టు అధికారులకు సమర్పించాలని, ముంబై దాటి వెళ్లాల్సి వస్తే ఎన్సీబీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందిగా పలు నిబంధనలు పెట్టింది. రానున్న ఆరు నెలల పాటు ప్రతినెల 1న పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందిగా కూడా ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు మీదే ఎన్సీబీ సుప్రీంకోర్టును చేరింది. ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ దొరకలేదు. చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు: రియా చక్రవర్తి -
డ్రగ్స్ కేసు: 12 వేల పేజీల చార్జిషీట్
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. డ్రగ్స్కు, బాలీవుడ్కు ఏమైనా లింకులున్నాయా? అన్న కోణంలో ఎన్సీబీ ప్రత్యేక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. కొన్ని నెలలుగా విచారణ ముమ్మరం చేసిన ఎన్సీబీ శుక్రవారంనాడు ముంబైలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చార్జిషీటులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్తో పాటు 33 మంది నిందితుల పేర్లను ప్రస్తావించింది. 200 మంది సాక్ష్యుల నుంచి సేకరించిన సమాచారాన్ని జత చేస్తూ 12 వేల పేజీలకు పైగా ఉన్న చార్జిషీటును కోర్టుకు సమర్పించింది. కాగా గతేడాది జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడగా సెప్టెంబర్ 8న ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ను అరెస్ట్ చేశారు. తర్వాతి నెలలోనే వీళ్లిద్దరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ తర్వాత ఈ డ్రగ్స్ కేసుకు బీటౌన్లో లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు దీపిక పదుకునే, శ్రద్దా కపూర్, ఫిరోజ్ నదియావాలా సహా పలువురి పేర్లు తెర మీదకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది. చదవండి: సుశాంత్ వదిలేసుకున్న బ్లాక్బస్టర్ సినిమాలు! భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్ -
డ్రగ్స్ అడ్డాగా పాన్షాప్.. ప్రముఖులే కస్టమర్లు
ముంబై: హిందీ చిత్ర పరిశ్రమలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులతో పాటు ఇతర వ్యాపారులు, పలువురు ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది. తాజాగా శనివారం (జనవరి 9) ప్రముఖ పాన్ వ్యాపారి అరెస్టవడంతో కీలక మలుపు తీసుకుంది. మొత్తం మత్తు పదార్థాల ఆయన పాన్షాప్ నుంచి వెళ్తున్నాయని నార్కోటిక్స్ నియంత్రణ బోర్డు (ఎన్సీబీ) గుర్తించింది. దీంతో అతడికి ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. 1970లో దక్షిణ ముంబైలో మొదలైన పాన్షాప్ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తుందని పోలీస్ అధికారులు గుర్తించారు. ముచ్చడ్ పాన్వాలాగా గుర్తింపు పొందిన పాన్ వ్యాపారి మనోజ్ తివారీ తన ఇద్దరు సోదరులతో కలిసి ఈ పాన్షాప్ను ఏర్పాటుచేశాడు. ఆకులు చుట్టుకుంటు ఉన్న మనోజ్ తివారీ ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. ప్రముఖులతో సత్సంబంధాలు పెంచుకోవడంతో ఈ పాన్షాప్ ప్రజలతో కిటకిటలాడేది. అయితే పాన్షాప్పై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీస్ అధికారులు ఆ దుకాణంలో జరుగుతున్న వ్యవహారం గుర్తించి.. సుశాంత్ సింగ్ కేసుకు లింక్లు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం మనోజ్ తివారీతో పాటు మరో ఇద్దరు మహిళలు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు బ్రిటన్కు చెందిన కరణ్ సజ్నాని ఉన్నారు. శనివారం అరెస్ట్ చేసిన వారి వివరాలను సోమవారం ముంబై అధికారులు మీడియా ముఖంగా వెల్లడించారు. ముచ్చడ్ పాన్వాలాగా గుర్తింపు పొందిన మనోజ్ తివారీ వద్ద హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన వారితో పాటు వ్యాపారవేత్తలు, ఇతర పారిశ్రామికవేత్తలు కస్టమర్లుగా ఉన్నారు. అరెస్టయిన మహిళల్లో బ్రిటీష్ జాతీయురాలు కరణ్ సజనాని కాగా, మరొకరు రహీలా ఫర్నీచర్వాలా ఉన్నారు. రహీలా గతంలో ఓ బాలీవుడ్ హీరోయిన్కు మేనేజర్గా పని చేసింది. రహీలా సోదరి సైష్టా గతంలోనే డ్రగ్స్ కేసులో అరెస్టయ్యింది. మొత్తం 200 కిలోల వివిధ రకాల మత్తుపదార్థాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. విలువైన వాటిని కరణ్ సజాని తీసుకున్నారు. కరణ్ సజాని అత్యంత సంపన్నులకు డ్రగ్స్ సరఫరా చేస్తుండేది. వీటిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు నార్కోటిక్స్ ముంబై జోనల్ కమిషనర్ సమీర్ వాంఖడే తెలిపారు. వారి నుంచి మొత్తం 200 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు.. వారితో సంబంధం ఉన్న వారికి సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. -
కస్టడీ నుంచి తప్పించుకున్న టాలీవుడ్ నటి
ముంబై: ముంబైలో డ్రగ్స్ పెడ్లర్లతో పట్టుబడ్డ టాలీవుడ్ నటి శ్వేతా కుమారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీ నుంచి తప్పించుకుంది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న శ్వేతా కుమారికి మాఫియా డాన్ కరీం లాలాతో సంబంధాలున్నట్టు సమాచారం. కరీం లాలాతో కలిసి ఆమెకు డ్రగ్స్ వ్యాపారంలో వాటాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీం లాలా కోసం ఎన్సీబీ విసృతంగా గాలింపు మొదలుపెట్టింది. కరీం లాలా దేశం విడిచి వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను ఎన్సీబీ అప్రమత్తం చేసింది. కాగా, ముంబైలోని మీరా రోడ్లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్ చాంద్ పాషా, సప్లయర్ సయ్యద్తో శ్వేతా కుమారి శనివారం రాత్రి పట్టుబడిన సంగతి తెలిసిందే. చాంద్ పాషా నుంచి 400 గ్రాముల డ్రగ్స్ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో బాంద్రా, కుర్ల, అంధేరిలోనూ పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాద్కు చెందిన మహ్మద్ చాంద్, సయ్యద్తో టాలీవుడ్ నటికి ఉన్న సంబంధాలపై ఎన్సీబీ ఆరా తీసినట్టు తెలిసింది. నిందితురాలు తెలుగులో నాలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించినట్టుగా సమాచారం. (చదవండి: ముంబైలో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు..) అప్డేట్: ఎన్సీబీ కస్టడీలోని హోటల్ నుంచి సోమవారం ఉదయం పరారైన టాలీవుడ్ నటి శ్వేతా కుమారి మధ్యాహ్నం తిరిగి ప్రత్యక్షమైంది. ఎన్సీబీ విచారణకు ఆమె హాజరైనట్టు అధికారులు తెలిపారు. -
అర్జున్ ఇచ్చిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే..
ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో నటుడు అర్జున్ రాంపాల్కు ఇటీవల ఎన్సీబీ మరోసారి సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపురి విచారణకు అర్జున్ హజరవ్వాల్సిందిగా ఎన్సీబీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అర్జున్ సోమవారం మధ్యాహ్నం ఎన్సీబీ ఎదుట హజరయ్యాడు. అయితే ఈ విచారణలో అర్జున్ ఎన్సీబీకి ఇచ్చిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే అతడు అరెస్టు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగుచూసిన బాలీవుడ్ డ్రగ్ కేసును ముంబై పోలీసులు ఎన్సీబీకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో విచారణ చేపట్టి ఎన్సీబీ దర్యాప్తులో డ్రగ్ ప్లెడర్లతో అర్జున్కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గత నవంబర్ 9వ తేదిన అతడి ఇంటిలో దాడులు నిర్వహించిన ఎన్సీబీ కొన్ని అనుమానిత మందులతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను స్వాధీనం చేసుకుని సమన్లు అందజేశారు. (చదవండి: అర్జున్ రాంపాల్కు మరోసారి ఎన్సీబీ సమన్లు) అయితే నవంబర్ నెలలో జరిగిన మొదటి విచారణలో అర్జున్ తన ఇంట్లో దొరికిన మందులు డాక్టర్ల సలహా మేరకు తీసుకుంటున్నట్లు చెప్పి దానికి సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ను అధికారులకు ఇచ్చాడు. అయితే ఆ ప్రిస్క్రిప్షన్పై అనుమానం రావడంతో ఈ నెల 15న అర్జున్కు మరోసారి ఎన్సీబీ సమన్లు ఇచ్చి 16న విచారణకు హజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను 21న విచారణకు హజరవుతానంటూ ఎన్సీబీని 16న గడువు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్జున్ ఈ రోజు మధ్యాహ్నం ఎన్సీబీ కార్యాలయానికి విచారణకు హజరయ్యాడు. అయితే ఈ విచారణలో అది నకిలీ ప్రిస్క్రిప్షన్ అని తేలితే అర్జున్ తప్పనిసరిగా అరెస్టును ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎందుకంటే అర్జున్ ఇంట్లో దొరికిన అనుమానిత మందులను ఎన్సీబీ చట్టం ప్రకారం షెడ్యూల్లో చేర్చినవిగా ఎన్సీబీ గుర్తించింది. (చదవండి: మరోసారి ఎన్సీబీ సమన్లు.. గడువు కోరిన నటుడు) -
మరోసారి ఎన్సీబీ సమన్లు.. గడువు కోరిన నటుడు
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహరంలో సంబంధాలు ఉన్నట్లు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మరోసారి అర్జున్కు మంగళవారం సమన్లు అందజేసి తదుపరి విచారణకు ఇవాళ(డిసెంబర్ 16) ఎన్సీబీ కార్యాలయంలో హజరుకావల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ రోజు విచారణకు అర్జున్ హాజరకాలేదు. డిసెంబర్ 21వ తేదీ వరకు ఆయనకు గడువుకాలని ఎన్సీబీని కోరాడు. కాగా ఇప్పటికే ఈ కేసులో అర్జున్కు గత నవంబర్ 9న ఎన్సీబీ సమన్లు అందజేసి ఆయన ఇంటిపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొద్ది గంటలపాటు ఆయన ఇంటిలో తనిఖీ చేసిన ఎన్సీబీ అధికారులు కొన్నీ డాక్యుమెంట్స్తో పాటు పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను స్వాధీనం చేసుకుని 13న విచారించింది. ఆ తర్వాత ఆయన గర్ల్ఫ్రెండ్ గ్యాబ్రియోల్ డెమెట్రియేడ్స్కు కూడా సమన్లు అందజేసి విచారించారు. (చదవండి: అర్జున్ రాంపాల్కు మరోసారి సమన్లు) అయితే ఈ ఏడాది జూన్ 14న హీరో సుశాంత్ సింగ్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ డ్రగ్ వ్యవహరం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సుశాంత్కు డ్రగ్స్ ఇచ్చినట్లు ఆరోపణలు రుజువు కావడంతో వారిని పోలీసులు ఆరెస్టు చేశారు. విచారణలో రియా హీరోయిన్ దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ల పేర్లను వెల్లడించడంతో ఎన్సీబీ వారికి కూడా సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో అరెస్టెయిన రియా, ఆమె సోదరుడు షోవిక్లకు ఇటీవల బెయిల్ లభించగా సుశాంత్ ఇంటీ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్తో మరో ఇద్దరూ జైలులోనే ఉన్నారు. (చదవండి: సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం) -
అర్జున్ రాంపాల్కు మరోసారి సమన్లు
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్కు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మరోసారి సమన్లు ఇచ్చింది. సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసుపై ఎన్సీబీ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ డ్రగ్ ప్లెడర్లతో ఆర్జున్కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో గత నవంబర్లో ఎన్సీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 6 గంటల పాటు అర్జున్ విచారించి అధికారులు తాజాగా తదుపరి విచారణకు ఆదేశిస్తూ మరోసారి మంగళవారం సమన్లు అందజేసింది. రేపు(డిసెంబర్ 16) ఎన్సీబీకి కార్యాలయానికి విచారణకు హాజరకావాల్సిందిగా ఎన్సీబీ పేర్కొంది. (చదవండి: అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు) అంతేగాక గతనెలలోనే ఎన్సీబీ అధికారులు అర్జున్ ఇంటిలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటలపాటు అర్జున్ ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నవంబర్ 9న అర్జున్కు నోటీసులు అందజేస్తూ.. 11వ తేదీన విచారణకు హజరుకావాల్సిందిగా ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. అలాగే ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్కు కూడా అదే సమయంలో ఎన్సీబీ సమన్లు ఇచ్చి విచారించింది. (చదవండి: అర్జున్ను ఆరు గంటలు విచారించిన ఎన్సీబీ) -
డ్రగ్స్ కేసు: ఇద్దరు అధికారుల సస్పెండ్
ముంబై : బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో నిందితులకు సహాయం చేశారనే ఆరోపణలతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో( ఎన్సీబీ) ముంబై జోనల్ యూనిట్కి చెందిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. హాస్యనటి భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాలయాలు డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. నటి దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్పై కూడా డ్రస్ కేసుకి సంబంధించి కేసు నమోదైంది. అయితే వీరికి బెయిల్ లభించడంలో ఇద్దరు ఎన్సీబీ అధికారులు సహా ప్రాసిక్యూటర్ పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీపికా మేనేజర్ కరిష్మాకు సమన్లు అందించానా, గైర్హాజరు కావడంతో మరోసారి గతనెలలో ఆమెకు నోటీసులు జారీ చేశామని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.7 కిలోగ్రాముల చరాస్, మూడు సీసాల సీబీడీ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కరిష్మా ఎన్సీబీ విచారణకు హాజరుకాకుండా, ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. (సోవిక్ చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు) అయితే ఈ కేసు విచారణలో ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవడంతో ఎన్సీబీ నుంచి బలమైన వాదనలు వినిపించలేదు. దీంతో కోర్టు కరిష్మా సహా మిగతా ఇద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తుకు సహకరించాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 21న హస్య నటి భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాలు స్వయంగా తాము గంజాయి తీసుకుంటామని విచారణలో పేర్కొన్నారు. అయినప్పటికీ డ్రగ్స్ వ్యవహరంలో సంబంధం ఉన్న ఈ ముగ్గురికి బెయిల్ లభించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీరికి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ వాంఖడే సహా ఇద్దరు ఐఓఓలు సహకరించినట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. భారతీసింగ్ దంపతులకు ఇచ్చిన బెయిల్ను సవాలు చేస్తూ ఎన్బిపి కోర్టును ఆశ్రయించారు. కాగా ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిని విచారణకు పలిచిన ఎన్సీబీ ఆ తర్వాత వారికి డ్రగ్స్ ఎటువంటి సంబంధాలు లేవని క్లీన్చిట్ ఇచ్చింది. (గాబ్రియెల్లాను విచారించనున్న ఎన్సీబీ) -
కామెడీ క్వీన్కు ఎన్సీబీ సెగ
సాక్షి, ముంబై: బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్కు మరో షాక్ తగిలింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత మాదకద్రవ్యాల తుట్టె కదిలింది. బాలీవుడ్ ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించింది. తాజాగా నటి భారతీ సింగ్ ముంబై నివాసంపై శనివారం ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడి చేసింది. భారతి సింగ్తోపాటు, ఆమె భర్తపైనా నిషేధిత పదార్థాలు తీసుకున్న ఆరోపణలు వచ్చాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. డ్రగ్ పెడ్లర్ విచారణలో భారతి సింగ్ పేరు వెలుగులోకి రావడంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం ఈ దాడులు చేపట్టింది. కొద్దిమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ అధికారి తెలిపారు. దీంతో భారతి, ఆమె భర్త హర్ష్ లింబాచియాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు చేసింది. రాంపాల్, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్లో భాగమని రాంపాల్ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్
సాక్షి, ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, దీపికా పదుకొనేలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపిక టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్కి ఎన్సీబీ అధికారులు మంగళవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. బాలీవుడ్ డ్రగ్స్ దర్యాప్తు కేసులో అరెస్టయిన డ్రగ్ పెడ్లర్ను విచారించినప్పుడు కరిష్మా ప్రకాష్ పేరు వెలుగులోకి వచ్చిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. వెర్సోవాలోని కరిష్మా నివాసంలో మంగళవారం ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో 1.7 గ్రాముల హషీష్, సీబీడీ ఆయిల్ మూడు బాటిళ్లనిస్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెకు సమన్లు జారీ చేశారు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. (చదవండి: ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి) కరిష్మా ప్రకాష్కు డ్రగ్ పెడ్లర్తో సంబంధాలుండటం, ఆమె నివాసం నుంచి డ్రగ్స్ రికవరీ, ఎన్సీబీకి సహకరించకపోవడం, సమన్లు జారీ చేశాక విచారణకు హాజరుకాకపోవడం వంటి పనులు ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని.. ఎన్సీబీ ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కేసు విచారణలో ఎన్సీబీ అధికారులు కరిష్మా ప్రకాష్, దీపికా పదుకొనే మధ్య జరిగిన అనుమానాస్పద మెసేజ్లను గుర్తించారు. దీని ఆధారంగా ఈ ఇద్దరినీ గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాష్ మాత్రమే కాక, ఆమె సహోద్యోగి జయ సాహా, నటులు రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్లను కూడా గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేసింది. అతని స్నేహితురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఒక నెల జైలు శిక్ష తరువాత ఆమె బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. -
డ్రగ్స్ కేసులో ప్రముఖ టీవీ నటి అరెస్ట్
ముంబై : ప్రముఖ హిందీ సీరియల్స్ నటి ప్రీతికా చౌహాన్ (30) డ్రగ్స్ వినియోగం కేసులో అరెస్టయ్యారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం ఆమెతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వర్సోవా, మచ్చిమార్ కాలనీలోని ఓ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. గంజాయిని కొనుగోలు చేస్తున్న ప్రీతికా చౌహాన్, విక్రేత ఫైజల్లను అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 99 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆదివారం వారిద్దరిని కోర్టులో హాజరు పరిచారు. వీరికి నవంబర్ 8వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.(కిలాడీ లేడీ.. 30 ఏళ్లుగా..) కాగా, హిమాచల్ ప్రదేశ్కు చెందిన ప్రీతికా చౌహాన్ 2016లో విడుదలైన ‘జమీలా’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. దేవోకి దేవ్ మహదేవ్, సంకట్ మోచన్ మహాబలి హనుమాన్, మా వైష్టోదేవీ, సంతోషీ దేవీ, సీఐడీ, సావ్ధాన్ ఇండియా వంటి పలు హిందీ సీరియళ్లలో ఆమె నటించారు. -
డ్రగ్ కేసు: రియా రిమాండ్ పొడిగింపు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహారంలో అరెస్టైన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కస్టడిని ముంబై సెషన్స్ కోర్టు పొడిగించింది. రియా సుశాంత్కు డ్రగ్స్ సేకరిచిందనే ఆరోపణలు రుజువు కావడంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో సెప్టంబర్ 9 అరెస్టు చేసి ముంబైని బైకుల్లా మహిళ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో సహా మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కస్టడిని అక్టోబర్ 20 వరకు పోడిగిస్తున్నట్లు ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సెప్టెంబర్లో బెయిల్ కోరుతూ రియా ముంబై కోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది. కానీ కోర్టు తన పిటిషన్ రిజర్వులో ఉంచింది. అయితే దీనిపై తదుపరి ఉత్తర్వును బుధవాంర వెల్లడించే అవకావం ఉన్నట్లు సమాచారం. (చదవండి: సుశాంత్ది ఆత్మహత్యే.. హత్య కాదు!) అయితే డ్రగ్ కేసులో నేర నిరూపణ కావడంతో రియా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాలతో పాటు మరో ముగ్గురిని ముంబై సెషన్స్ కోర్టు అక్టోబర్ 6 వరకు జ్యూడిషియల్ కస్టడికి పంపించింది. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ రియా ఆమె సోదరుడు షోవిక్తో సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీబీ త్రీవంగా వ్యతిరేకించింది. వారి బెయిల్ విచారణ సమయంలో యువకులకు వారు మాదకద్రవ్యాలను సరఫరా చేయలేదన్న నేర ఆరోపణ నిర్థారణకు వచ్చే వరకు వారికి బెయిల్ మంజూరు చేయోద్దని కోర్టును ఎన్సీబీ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం డ్రగ్ వ్యవహారంలో డ్రగ్ సిండికెట్ క్రియాశీల సభ్యులు, సుశాంత్ మృతి కేసు సంబంధించిన ప్రారంభ దర్యాప్తును కూడా సమీక్షిస్తామని ఎన్సీబీ కోర్టుతో పేర్కొంది. (చదవండి: డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు!) చదవండి: అదో బోగస్ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి! -
దీపికను విచారించిన అధికారికి కోవిడ్
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ మరణంతో సంబంధముందని భావిస్తున్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి గత నెలలో దీపికా పదుకొనెను విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రాకు కరోనా పాజిటివ్ అని తేలింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్సీబీ ఇప్పటికే దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్లను విచారించింది. వీరంతా డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకించామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని విచారించాల్సి ఉండటంతో, వీరిని తిరిగి విచారణకు పిలిచే అవకాశాలుు ఉన్నాయని అధికారులు చెప్పారు. (మరిన్ని కోడ్ వర్డ్లు బయటపెట్టిన దీపికా!) -
సుశాంత్ది ఆత్మహత్యే.. హత్య కాదు!
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలాగా అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు, సీబీఐ, ఎన్సీబీ, ఈడీ దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టిననప్పటికీ అతనిది ఆత్మహత్యా, హత్యా అన్న విషయంలో స్పష్టత రాలేదు. బంధుప్రీతి, బాలీవుడ్ ప్రముఖుల విపరీత పోకడల అంశం చుట్టూ తిరిగిన ఈ కేసు డ్రగ్స్ వ్యవహారంతో మరో మలుపు తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ది హత్య కాదని, అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన డాక్టర్ల బృందం సీబీఐకు పేర్కొంది. చదవండి: సుశాంత్ కేసులో మరో మలుపు కాగా జూన్ 14న సుశాంత్ తన అపార్ట్మెంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముంబై పోలీసులు సుశాంత్ది ఆత్మహత్యేనని తెలిపారు. అయితే తన కొడుకు చావుకు గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమని, సుశాంత్ నుంచి అధిక మొత్తంలో డబ్బులు లాక్కొందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై రియా ప్రస్తుతం జైలులో ఉన్నారు. చదవండి: రియా బెయిల్ పిటిషన్: తీర్పు రిజర్వులో సుశాంత్కు విషం ఇచ్చారని, గొంతు నులిమి చంపారని చేసిన ఆరోపణలను ఏయిమ్స్ వైద్య బృందం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు తమ మెడికో లీగల్ ఒపీనియన్ను న సీబీఐకు సమర్పించారు. సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు. ఇది ఆత్మహత్య కేసే తప్ప, మర్డర్ కేసు కాదని ఘటనా స్థలం వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వెల్లడైందన్నారు. 45 రోజుల పాటు ఢిల్లీ ఎయిమ్స్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చెందిన నలుగురు డాక్టర్ల బృందం అనేక కోణాలలో దర్యాప్తు చేసి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో సుశాంత్ ఆత్మహత్య కేసు కోణంలో ఇక సీబీఐ దీన్ని దర్యాప్తు చేయనుంది. చదవండి: ప్లీజ్ ఆ వీడియో తొలగించండి: అంకిత -
మరిన్ని కోడ్ వర్డ్లు బయటపెట్టిన దీపికా!
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత బాలీవుడ్ను డ్రగ్స్ కేసు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి పలువురి పేర్లను వెలువరించింది. అందులో దీపికా పదుకొనే, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే వారిని ఎన్సీబీ అధికారులు ప్రశ్నించగా వారు సరదగా మాట్లాడుకొనే అనేక కోడ్ లాంగ్వేజ్ల గురించి వివరించారు. 2017లో వారి వాట్సాప్ చాట్ గురించి ప్రశ్నించగా వారు వీడ్, మాల్, డబ్ అనే పేర్లతో సిగరెట్లను పిలుచుకుంటామని తెలిపారు. ఇరువురిని వేరువేరుగా ప్రశ్నించగా వారిద్దరూ కూడా సరైన సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంకా ఏం ఏం కోడ్ భాషలో మాట్లాడుకుంటారు అని ప్రశ్నించగా తాము పన్నీర్, క్విక్కర్, మ్యారేజ్ అనే కోడ్లో మాట్లాడుకుంటామని దీపికా తెలిపింది. పన్నీర్ అనే పదాన్ని చాలా సన్నగా ఉండేవారి కోసం ఉపయోగిస్తామని, క్విక్కర్ అనే పదాన్ని షార్ట్ టర్మ్ రిలేషన్షిప్లో కోసం, మ్యారేజ్ అనే పదాన్ని లాంగ్టర్మ్ రిలేషన్షిప్లో ఉండే వారి కోసం ఉపయోగిస్తామని దీపికా తెలిపింది. అయితే వారి సమాధానాలతో ఎన్సీబీ అధికారులు తృప్తి చెందారని, వారికి త్వరలోనే ఈ డ్రగ్స్ కేసు నుంచి విముక్తి కలిగే అవకాశాలు ఉన్నాయని ఎన్సీబీ అధికారి ఒకరు వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్? -
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్?
సాక్షి, న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాల కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొంతమందిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకొని వారి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. విచారణలో రియా వెల్లడించిన కొన్ని విషయాల ఆధారంగా కొంతమంది హీరోయిన్లు రకుల్, దీపికా పదుకొణే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్ వంటివారికి ఎన్సీబీ బృందం విడివిడిగా విచారించడం మొదలుపెట్టింది. అయితే వీరిని విచారించిన అనంతరం బాలీవుడ్ భామలకు ఊరట లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ లకు ఎన్సీబీ దాదాపు క్లీన్ చిట్ ఇచ్చినట్టే అని ఎన్సీబీ అధికారి ఒకరు వెల్లడించారు. 2017 వాట్సప్ చాట్లో దీపికా, ఆమె మేనేజర్ వాల్, మాల్, వీడ్, హాష్, డూంబ్ అనే పదాలను ఉపయోగించారని ఎన్సీబీ విచారణలో వెల్లడయ్యింది. అయితే అవి వివిధ రకాల సిగరెట్ల కోసం సరాదాగా కోడ్తో పిలుచుకున్నామని దీపికా, ఆమె మేనేజర్ విచారణలో తెలిపినట్లు తెలిసింది. . స్లిమ్ సిగరెట్స్ కోడ్గా హ్యాష్, మందపాటి సిగరెట్లకు కోడ్గా వీడ్, తక్కువ నాణ్యత గల సిగరెట్లను మాల్ ఇలా పలు రకాలుగా వారు పిలుచుకునే వారని తెలిపారు. దీపికా, ప్రకాశ్లను వేర్వేరు గదులలో ఉంచి విచారించగా, వారి ఇచ్చిన సమాధానాలు ఒకేలా ఉన్నాయని వీటితో ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెందినట్లు ఒక అధికారి తెలిపారు. మరి కొద్ది రోజులలో వీరికి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందని చెప్పారు. అదే జరిగితే ఇక బాలీవుడ్ భామలకు డ్రగ్స్ కష్టాలు తప్పినట్లే. చదవండి: 3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు? -
సీబీడీ ఆయిల్ను లీగల్ చేయాలి: నటుడి భార్య
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన తరువాత నార్కోటిక్స్ డ్రగ్స్ పై తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా కన్నాబిడియోల్ లేదా సీబీడీ ఆయిల్ వినియోగం చట్టవిరుద్ధమా, కాదా అనే విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సికదర్ సంచలన విజ్ఞప్తి చేశారు. సీబీడీ ఆయిల్ను ఇండియాలో చట్టబద్ధం చేయాలనే హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ చికిత్స తీసుకున్న లండన్ ఆసుపత్రి ఫోటోను సుతాపా ఇన్స్టాగ్రామ్లో ఫోటో షేర్ చేశారు. దాదాపు రెండేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతూ ఇర్ఫాన్ ఈ ఏడాది ఏప్రిల్ 29న కన్ను మూశారు. మరోవైపు ఇప్పటికే గాయని సోనా మోహపాత్రా కూడీ సీబీడీ ఆయిల్ ప్రయోజనాలపై ఫేస్బుక్లోఒక పోస్ట్ పెట్టారు. గత ఏడాది తన సోదరి క్యాన్సర్ చికిత్స సందర్భంగా పలు, శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు నొప్పి నివారణకు, త్వరగా కోలుకోవటానికి ఈ డ్రగ్ మాజిక్ లా పనిచేసిందని పేర్కొనడం విశేషం. కాగా ఆన్ లైన్ ద్వారా నటి శ్రధ్ధాకపూర్ కి తానే సీబీడీ ఆయిల్ ఆర్డర్ చేశానని సుశాంత్ మాజీ మేనేజర్ జయాసాహా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో తెలిపారు. సుశాంత్ కి ఎలా ఇవ్వాలో రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా వివరంగా తెలియజేశానని వెల్లడించింది. సీబీడీ ఆయిల్ కోసం సాహాతో చాట్ చేసినట్లు ఆరోపణలు రావడంతో శ్రద్ధాను ఎన్సీబీ విచారిస్తోంది. దీంతోపాటు బాలీవుడ్ డ్రగ్గిస్టులపై అధికారులు కూపీ లాగుతున్నారు. (చదవండి: డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు!) సీబీడీ ఆయిల్ అంటే ఏమిటి ? సీబీడీ ఆయిల్ను గంజాయి ఆకుల నుంచి తయారు చేస్తారు. గంజాయి ఆకుల నుంచి పలు పదార్థాలను వెలికి తీసి వాటితో సీబీడీ ఆయిల్ను తయారు చేస్తారు. సీబీడీ ఆయిల్ను కన్నాబిడియోల్ అని కూడా పిలుస్తారు. గంజాయి మోతాదు 40 శాతం వరకు ఉంటుందట. అయితే ఇతర దేశాల్లో వైద్యులు పలువురు రోగులకు సీబీడీ ఆయిల్ను ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. మానసిక సమస్యలు, జాయింట్ పెయిన్స్, నిద్రలేమి, గుండె సంబంధ సమస్యలకు ఔషధంగా వాడతారు. ఇండియా సహా పలు దేశాల్లో ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి నిషేధం లేదు. అంతేకాదు దీన్ని ఎక్కువగా వినియోగించే దేశాలలో భారత్ కూడా ఒకటి. అమెజాన్ లాంటి ఆన్లైన్ సైట్ల ద్వారా దేశంలో అందుబాటులో ఉన్నట్టు సమాచారం. View this post on Instagram London revist looking at his hospital room from outside like everytime I did while he was there#walkingalone#wishyouwerethere#cancerpain#LegalizeCBDoilinindia A post shared by Sutapa Sikdar (@sikdarsutapa) on Sep 29, 2020 at 5:22am PDT -
రియా బెయిల్ పిటిషన్: తీర్పు రిజర్వులో
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిలు పిటిషన్పై బాంబే హైకోర్టు నేడు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. వీళ్లతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల అభ్యర్థనపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రిమాండ్లో ఉన్న రియా బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును హైకోర్టు రిజర్వ్లో ఉంచింది. ఇక గతంలో రియా బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడైనా ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అన్న విషయం ఆసక్తిని రేపుతోంది. (‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్ వస్తుందా?) కాగా సుశాంత్ సింగ్ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి.. డ్రగ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలతో సెప్టెంబరు 9న రియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను బైకుల్లా జైలుకు తరలించారు. రియా చెప్పిన వివరాల ఆధారంగా పలువురు సెలబ్రిటీల కదలికలపై అధికారులు నిఘా వేశారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాట్స్ బహిర్గతమైన నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. (3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?) -
ఉడ్తా బాలీవుడ్
-
సుశాంత్ కేసు క్లైమాక్స్కు చేరుకున్నట్లేనా?
సాక్షి, న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు ఇక క్లైమాక్స్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తిని విచారిస్తున్న సీబీఐకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం కొన్ని రిపోర్టులను అందించింది. సోమవారం ఉదయం 11గంటల సమయంలో ఎయిమ్స్కు చెందిన నలుగురు ఎయిమ్స్ వైద్యులు సీబీఐ అధికారులను కలిసి వారికి రిపోర్టులు అందించారు. వారి మధ్య దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. సుశాంత్ మరణించిన సమయంలో అతని ఇంటికి దగ్గరలో ఉన్న కూపర్ ఆసుపత్రిలో సుశాంత్ పంచనామా నిర్వహించారు. అనంతరం ఈ కేసును రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సీబీఐ పోస్ట్మార్టం రిపోర్టు విషయంలో సహకరించాలని ఎయిమ్స్ను కోరింది. దీంతో రంగంలోకి దిగిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం సుశాంత్ ఇంటిని కూడా పరిశీలించింది. సుశాంత్ మరణం వెనుక ఏదైనా కుట్రదాగుందా, ఇది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో ఎయిమ్స్ వైద్యులు రిపోర్టును, సుశాంత్ మరణించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీబీఐకి తన రిపోర్టును అందించారు. ఇక సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో సీబీఐతో పాటు ఎన్సీబీ కూడా రంగంలోకి దిగి పలువురును విచారిస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు, బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ -
‘కరణ్ పేరు పెట్టాలని ప్రసాద్ను ఒత్తిడి చేశారు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ధర్మప్రోడక్షన్ మాజీ సహా నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్ను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ సమయంలో కరణ్ జోహార్ పేరు పెట్టాలని ఎన్సీబీ ప్రసాద్ను ఒత్తిడి చేసినట్లు ఆయన తరపు న్యాయవాది సతీష్ మనెషిండె ఆరోపించారు. శనివారం ప్రసాద్ను అరెస్టు చేసిన ఎన్సీబీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి అక్టోబర్ 3 వరకు కస్టడి కోరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లాయర్ మనెషిండె మీడియాతో మాట్లాడుతూ.. 2020 సెప్టంబర్ 24 గురువారం రోజున ప్రసాద్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఎస్సీబీ అధికారి సింగ్ ఆయనకు ఫోన్ చేశారని, ముంబైలోని తన ఇంటిని తనిఖీ చేయాలని, స్టేట్మెంట్ తీసుకోవాలని ఎన్సీబీ సమాచారం ఇచ్చిందని మనెషిండె తెలిపారు. దీంతో సెప్టెంబర్ 25న ఉదయం 9 గంటలకు ముంబైకి తిరగి వచ్చి ఎన్సీబీ బృందం సమక్షంలోనే తన ఇంటిని తాళం తెరిచారని చెప్పారు. (చదవండి: డ్రగ్స్ కేసు: క్షితిజ్ రవి ప్రసాద్ కస్టడీ పొడిగింపు) (చదవండి: కరణ్ పార్టీకి డ్రగ్స్ కేసుకు సంబంధం లేదు) తర్వాత అధికారులు తనిఖీ నిర్వహించగా బాల్కానీలో పాత, పోడి సిగరెట్ పెట్టెను కనుగొన్నారని చెప్పారు. అయితే ఎన్సీబీ అధికారులు దీనిని జాయింట్ గంజాగా పేర్కొంటూ దానిని స్వాధీనం చేసుకున్నారని, అనంతరం 11:30 గంటలకు ప్రసాద్తో పాటు అతని ఇద్దరూ స్నేహితులు ఇషా, అనుభవ్లను కూడా ఎన్సీబీ కార్యాలయింలో విచారించినట్లు చెప్పారు. కాగా ఆయన స్నేహితులను విచారిస్తుండగానే ఎలాంటి సమాచారం లేకుండా ఎన్సీబీ ప్రసాద్ ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించినట్లు తెలిసిందని చెప్పారు. అయితే విచారణలో ప్రసాద్కు వ్యతిరేకంగా తన స్నేహితులు స్టేట్మెంట్ ఇస్తే వారిని వదిలేస్తామని ఎన్సీబీ వారితో చెప్పినట్లు ఆయన స్నేహితులు తెలిపారని మనెషిండె పేర్కొన్నారు. అయితే శనివారం ప్రసాద్ను అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు విచారణకు ముందు ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధింపులకు గురి చేశారని, బ్లాక్ మెయిల్ కూడా చేసినట్లు మనెషిండె ఆరోపించారు. (చదవండి: కరణ్ జోహార్కు మద్దతు తెలిపిన జావేద్ అక్తర్) -
డ్రగ్స్ కేసు: క్షితిజ్ రవి ప్రసాద్ కస్టడీ పొడిగింపు
ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో సంబంధముందని భావిస్తున్న నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్ కస్టడీని ముంబై హైకోర్టు పొడిగించింది. మరింత సమాచారం రాబట్టేందుకు, ఇప్పటి వరకూ వెల్లడించిన విషయాలను నిర్ధారించుకోవడానికి కస్టడీని పొడిగించాలంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోరింది. అందుకు కోర్టు అక్టోబర్ 3 వరకూ అనుమతి ఇచ్చింది. అయితే శనివారం ఎన్సీబీ అధికారులు నిర్మాత ప్రసాద్ను శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. (చదవండి: డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బడా ప్రొడ్యూసర్) అతడిని విచారించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్సీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. ఇటీవల పట్టుకున్న డ్రగ్స్ కేసులో నిందితుడైన అనుజ్ కేశ్వానితో ప్రసాద్కు పరోక్షంగా సంబంధం ఉందని ఎన్సీబీ చెప్పడంతో ఆయనకు కస్టడీ తప్పలేదు. నటుడు సుశాంత్ మరణంతో సంబంధం ఉన్న నిందితులతో కూడా ప్రసాద్కు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయని ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. ప్రసాద్ గతంలో సినీ నిర్మాత కరణ్ జోహార్ వద్ద పని చేశారు. అయితే ప్రసాద్ నుంచి స్టేట్మెంట్ కోసం అధికారులు వేధించారని, బ్లాక్మెయిల్ చేశారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ప్రసాద్ లాయర్ సతీష్ మనెషిండె కోర్టుకు తెలిపారు. (చదవండి: మీడియాపై ఆగ్రహం.. కరణ్కు మద్దతు) -
కరణ్ పార్టీకి డ్రగ్స్ కేసుకు సంబంధం లేదు
బాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుకు, నిర్మాత కరణ్ జోహార్ 2019లో నిర్వహించిన పార్టీకి సంబంధాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలో స్టార్ నటులు దీపికా పదుకొణె, షాహిదోద్ కపూర్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, జోయా అక్తర్ లాంటి ప్రముఖులు పాల్గొనగా.. వీరు డ్రగ్స్ స్వీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు వాళ్లు ఏదో మైకంలో ఉన్న వీడియో కూడా ఇటీవల తెగ వైరల్ అయింది. (చదవండి: డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!) ఈ క్రమంలో సుశాంత్ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంపై విచారణ చేపడుతోన్న ఎన్సీబీ తాజాగా ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అది అవాస్తవమని ఎన్సీబీ ఖండించింది. ప్రస్తుత కేసుకు, కరణ్ నివాసంలో జరిగిన పార్టీ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్త అశోక్ జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో గురించి ఎలాంటి వివరాలు సేకరించడం లేదని తెలిపారు. కాగా కరణ్ సైతం తన పార్టీలో డ్రగ్స్ వాడకం జరగలేదని పేర్కొన్న విషయం తెలిసిందే.. (చదవండి: నాకు డ్రగ్స్ అలవాటు లేదు) -
‘కేకేఆర్ పార్టీలో కొకైన్ వాడారు.. గుట్టు విప్పుతా’
ముంబై: గత కొంతకాలంగా బాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ ఉదంతం ఇప్పుడు క్రికెట్కు కూడా పాకినట్లుంది. కొంతమంది క్రికెటర్లు డ్రగ్స్ తీసుకున్నారంటూ బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుతం కేకేఆర్లో ఆడుతున్న ప్లేయర్లు.. ఆ జట్టు పార్టీ చేసుకునే క్రమంలో కొకైన్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఎప్పుడు తీసుకున్నారనేది ఆమె వెల్లడించలేదు. తాను ఐపీఎల్ మ్యాచ్ను చూడటానికి వెళ్లిన క్రమంలో కేకేఆర్ జట్టు పార్టీ చేసుకుందని, అందులో కొకైన్ కూడా ఉందన్నారు. (చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్జోన్స్ ఇకలేరు..) మ్యాచ్ సెలబ్రేషన్లో భాగంగా ఇది జరిగినట్లు షెర్లిన్ తెలిపారు. ఏబీపీ న్యూస్తో గురువారం మాట్లాడిన షెర్లిన్.. ఒకనాటి ఐపీఎల్ మ్యాచ్లో డ్రగ్స్ తీసుకున్న సంగతిని వెల్లడించారు. ‘కేకేఆర్ విజయోత్సవ సెలబ్రేషన్స్లో కొకైన్ తీసుకోవడం నేను చూశా. ఆ పార్టీకి పాపులర్ క్రికెటర్లతో పాటు వారి భార్యలు కూడా వచ్చారు. ఆ పార్టీకి నన్ను ఆహ్వానించారు. నేను ఆ పార్టీని ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారిగా షాకయ్యా. అందుకు కారణం వారు వాష్రూమ్లో కొకైన్ తీసుకోవడమే’ అని షెర్లిన్ తెలిపారు. కాకపోతే ఏ క్రికెటర్ తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడో అనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) తన సాయం కోరితే కచ్చితంగా వారికి తెలియజేస్తానని షెర్లిన్ తెలిపారు. -
మలుపులు తియుగుతున్న సుశాంత్ మృతి కేసు
-
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం
-
సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్కు సమన్లు..?
మంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు విచారణలో భాగంగా సారా అలీఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్లకు ఎన్సీబీ సమన్లు ఇవ్వనుంది. ఈ వారంలోనే ఎన్సీబీ వీరికి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. (నన్ను మీడియా వేధిస్తోంది: రకుల్ ప్రీత్) ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, సిమోన్ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరును బయటకు వెల్లడించడానికి ఎన్సీబీ నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం త్వరలో సమన్లు జారీచేయనున్నట్లు సమాచారం. (సుశాంత్కు అరుదైన నివాళి...) -
సుశాంత్ ఫామ్హౌస్లో తరచూ పార్టీలు
ముంబై: సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి తరచుగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫామ్హౌస్ లోనావాలాకు వస్తుండేవారని, ఫామ్హౌస్ మేనేజర్ రీస్ ఒక న్యూస్ ఏజెన్సీ జరిపిన ఇన్వెస్టిగేషన్లో తెలిపారు. రియా చక్రవర్తి, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ వంటి బాలీవుడ్ మిత్రులు సుశాంత్తో కలిసి ఫామ్హౌస్లోనే పార్టీలు చేసుకునేవారని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు సుశాంత్ వద్ద పనిచేసే జగదీష్ అనే వ్యక్తి తెలిపారు. డ్రగ్-పెడ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న జైద్ విలాత్రా తదితరులు పార్టీ చేసుకున్న వారిలో ఉన్నారని వెల్లడించారు. సుశాంత్ పార్టీలలో గంజా, మద్యం సర్వసాధారణమని ఫామ్హౌస్ మేనేజర్ రీస్ వ్యాఖ్యానించారు. దీంతో లోనవాలా ఫామ్హౌస్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రధాన అంశంగా మారింది. ఎన్సీబీ ప్రస్తుతం దీనిపై దృష్టి సారించింది. సెప్టెంబర్ 2018 నుంచి సుశాంత్ ఫామ్హౌస్లో రీస్ మేనేజర్గా పని చేస్తున్నారు. సారా ఆలీఖాన్, రియా చక్రవర్తి తరచూ ఆ ఫామ్ హౌస్ను సందర్శిస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. పార్టీల కోసం వారు స్మోక్ పేపర్లను కూడా ఆర్డర్ చేసేవారని, అయితే వాటిని ఎందుకు ఉపయోగించేవారో తనకు తెలియదని రీస్ పేర్కొన్నారు. లాక్డౌన్కు ముందు వారానికి ఒకటి, రెండుసార్లు రాజ్పుత్ ఈ ఫామ్హౌస్కు వచ్చేవారని రీస్ తెలిపారు. అతనితో పాటు ఎవరు ఉంటారు అని రిపోర్టర్ ప్రశ్నించగా, మొదట్లో సారా అలీఖాన్ వచ్చేవారు. అప్పుడు రియా కూడా వారితో కలిసి వచ్చేది అని చెప్పారు. గత ఏడాది జూలైలో రియా తన పుట్టిన రోజు వేడుకలను తల్లిదండ్రులు, తన సోదరుడు షోవిక్తో కలిసి ఆ ఫామ్ హౌస్లో జరుపుకుంది అని రీస్ తెలిపారు. పార్టీలలో స్మోక్ పేపర్ వాడేవారని, ఖరీదైన వోడ్కాను అందించేవారని వెల్లడించారు. లాక్డౌన్లో ఫామ్హౌస్లో గడపాలని సుశాంత్ కోరుకున్నారని అయితే ఏవో కారణాల వల్ల ఆయన రాలేకపోయాని తెలిపారు. చదవండి: జయా బచ్చన్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు -
డ్రగ్స్ కేసు: నాకేం బాధ లేదు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం బాలీవుడ్ను కుదిపేస్తోంది. ఈ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయగా.. ఆమె 25 మంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించారు. రియా ఇచ్చిన సమాచారం మేరకు వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు ఎన్సీబీ సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తుండటంతో టాలీవుడ్లో మరోసారి అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ "రకుల్ - మంచు -రానా - నవదీప్. ఇది మళ్లీ టాలీవుడ్కు యూటర్న్ తీసుకుంది. అన్నా మనకీ బాధలు తప్పేలా లేవు" అంటూ వెటకారంగా నవ్వుతున్న ఎమోజీలతో నటుడు నవదీప్కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన నవదీప్.. "నాకేం బాధ లేదు బద్రర్.. నువ్వు కూడా ఏ బాధా పడకు. పద, పనికొచ్చే పనులు చేసుకుందాం" అని నోరు మూయించాడు. (చదవండి: వికారాబాద్ అడవుల్లో రకుల్..) కాగా 2017లో హైదరాబాద్లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమను అతలాకుతలం చేసింది. అప్పట్లో ఈ కేసు విచారణ కోసం ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీ, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, తరుణ్, నవదీప్ సహా పలువురిని విచారించారు. ఆ తర్వాత వీరికి డోప్ టెస్ట్ కోసం శాంపిల్స్ కూడా సేకరించారు. (చదవండి: డ్రగ్స్ కేసులో రకుల్, సారా పేర్లు?) -
‘సుశాంత్ రోజుకు 5 సార్లు డ్రగ్స్ తీసుకునేవాడు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని, అతని తమ్ముడిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వద్ద రియా తమ్ముడు షోవిక్ చక్రవర్తి అనేక విషయాలు వెల్లడించాడు. తాను అనేక సార్లు సుశాంత్ సింగ్కు మరిజువానా, హాష్, వీడ్ సరఫరా చేసినట్లు పేర్కొన్నాడు. లాక్డౌన్కు ముందు, లాక్డౌన్లో కూడా ఇచ్చినట్లు తెలిపాడు. దానికి సంబంధించిన బిల్లులు అన్ని రియా కార్డు నుంచే చెల్లించినట్లు అధికారులకు తెలిపాడు. ఇప్పటికే ఎన్సీబీ అరెస్టు చేసిన డ్రగ్స్ పెడ్లర్లు బసిత్ పరిహార్, సూర్దీప్ మల్హోత్రా తనకు డ్రగ్స్ అందించేవారని షోవిక్ వెల్లడించాడు. సుశాంత్ డ్రగ్స్ వాడతాడని శ్యామ్యూల్ మిరండా, సిద్దార్థ్ పితానీ తనతో చెప్పారాని తెలిపాడు. రియా, బసిత్ పరిహార్ వాట్సప్ చాట్ను షోవిక్ నిర్ధారించారు. ‘నేను మార్చి 16, 2020లో సుశాంత్ తనతో డ్రగ్స్ గురించి మాట్లాడాడని చెప్పగా సుశాంత్ రోజుకు 5 సార్లు వీడ్ తీసుకుంటాడని రియా చెప్పింది. అందుకే తనకి నేను ఐదు గ్రాముల వీడ్ను ఏర్పాటు చేశాను. అది 20 సార్లు వాడొచ్చు. అప్పుడు నేను బసిత్ను కలిశాను’ అని తెలిపారు. చదవండి: ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి -
డ్రగ్స్ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్
-
డ్రగ్స్ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను ఎన్సీబీ నాలుగు రోజుల పాటు రియాను విచారించింది. విచారణలో ఆమె 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. (8 గంటలు ప్రశ్నల వర్షం) ఈ క్రమంలోనే విచారణను మరింత వేగవంత చేసిన ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్ను అరెస్టు చేశారు. రియా సూచనల మేరకు సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని షోవిక్ విచారణలో వెల్లడించాడు. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్, ల్యాప్ట్యాప్ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు. అలాగే డ్రగ్స్ స్మగ్లర్ బాసిత్ను ఐదు సార్లు కలిసినట్టు రియా అంగీకరించడంతో మంగళవారం అరెస్ట్ చేశారు. అయితే రియా డ్రగ్ కేసులో బాలీవుడ్కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్సీబీ అధికారులు సమీర్ వాంఖడే, కేపీఎస్ మల్హోత్రా ఆధ్వర్యంలో రియా విచారణ కొనసాగుతోంది. -
సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్
సాక్షి, ముంబై : సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. రియానే డ్రగ్స్ తీసుకురమ్మందని ఆమె సోదరుడు షోవిక్ అధికారులకు తెలిపాడు. ఇక ఈ కేసులో వచ్చిన మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ల పర్వం ప్రారంభమయ్యింది. శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండాను అరెస్ట్ చేశారు. అతడితో పాటు డ్రగ్ డీలర్లు జైద్ విలాత్ర, బిసిత్ పరిహార్లను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్సీబీ అధికారులు షోవిక్తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గంజాయి అమ్మకంలో భాగస్వాములని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఎన్సీబీ అధికారులు షోవిక్తో పాటు శ్యాముల్ మిరాండాల ఇళ్లలో ఏక కాలంలో దాడులు చేశారు. (చదవండి: ‘సుశాంత్కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’) ఇక ఇప్పటికే డ్రగ్ డీలర్ అబ్దుల్ బాసిత్ పరిహార్ను సెప్టెంబర్ 9 వరకు ఎన్సీబీ కస్టడీకి పంపారు. జైద్ విలాత్రా విచారణ ఆధారంగా బాసిత్ పరిహార్ను దర్యాప్తులో చేర్చిన సంగతి తెలిసిందే. బాసిత్, జైద్ ఇద్దరూ డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో పాల్గొన్నట్లు చెప్పారు. శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించాడని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్ను అదుపులోకి తీసుకున్నారు. -
సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది. ముంబై బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారులు మాట్లాడుతూ, ‘అతనికి శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉంది. షోవిక్ చక్రవర్తి (రియా చక్రవర్తి సోదరుడు) సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి’ అని తెలిపారు. శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించడాని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు రియా చక్రవర్తి తల్లిదండ్రులను బుధవారం విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా రియా తల్లిదండ్రులు సీబీఐ ముందు హాజరయ్యారు. ఇక గతవారం రియా తమ్ముడు షోవిక్ను కూడా విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ డబ్బును కాజేసి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు అంటూ సుశాంత్ కుటుంబసభ్యులు రియా కుటుంబ సభ్యులందరిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక రియాను సీబీఐ అధికారులు నాలుగు రోజులలో 35 గంటల పాటు విచారించారు. చదవండి: ‘సుశాంత్కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’ -
'డ్రగ్స్ లేనిదే టాలీవుడ్లో పార్టీలు జరగవు'
బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారంటూ సంచలన నటి కంగనా రనౌత్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సమర్థించారు. అంతేకాదు టాలీవుడ్లోనూ డ్రగ్స్ వ్యవహారం నడుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు డ్రగ్స్ లేనిదే కొన్నిసార్లు టాలీవుడ్లో పార్టీలు కూడా జరగవని చెప్పారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆదివారం పోస్టు పెట్టారు. "సుశాంత్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అడుగు పెట్టడం మంచిదే. బాలీవుడ్లో డ్రగ్స్ వాడకం బాగా ఉంది అన్నది నిజం. కానీ ఇదిగో అదిగో అని ఫైనల్గా తుస్సుమనిపిస్తారేమో అని నాకు అనుమానం. ఎందుకంటే అక్కడ అంతా బడా బాబులే కదా. అందులోను సినిమా రంగం ఇప్పటికే చెడ్డ పేరు అంటగట్టుకుంది. కానీ డ్రగ్స్ నేరం. ఒక పేదవాడికి అన్నం పెడతారో, లేదో కానీ మాదక ద్రవ్యాల కోసం వేలకు వేలు పెడతారు. సరే, అది వాళ్ళ ఇష్టం. (చదవండి: ఆ గేమ్లోకి వెళ్లను) భారత్లో అనుమతి ఉన్నవి తినండి, తాగండి. దేశానికి ఆదాయం పెంచుకుంటే పెంచుకోండి. కానీ ఇతర దేశాల మాదక ద్రవ్యాలు ఎందుకు? ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరూ బయట పెట్టరు. తెలంగాణ ఎన్సీబీ సార్లు.. మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. డ్రగ్స్ మన ఇండస్ట్రీలో బాగా వాడుకలో ఉంది. ఇక్కడ అది లేకుండా కొన్ని పార్టీలు జరగవు. 2009లో వచ్చారు, కానీ పొలిటికల్ అండతో వెనక్కి వెళ్లిపోయారు. పాపం.. డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి వేరే శాఖకు బదిలీ చేశారు. చట్టానికి చేతులు చాలా పెద్దవి. అందుకే అవి చాచితే విరగొడతారు. మత్తులో చాలా దారుణాలు జరుగుతున్నాయి. సినిమా వాళ్లు, పబ్స్, విద్యార్థులు వాటిని బాగా వాడుతూ మాదక ద్రవ్యాల వారికి భారీగా ఆదాయాన్ని పెంచుతున్నారు. కాస్త చూసి అదుపులో పెట్టండి." (చదవండి: సెలబ్రిటీల పెళ్లిపై మాధవీలత విసుర్లు) "అమ్మో నాకు భయంగా ఉంది. ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో? ఎవరు డ్రగ్స్ జోలికి పోరు. ఆ అధికారులు కూడా చూసీ చూడనట్లే ఉంటారు. నిజంగా పట్టుకుంటే వాళ్ళకి భయం. ఒకవేళ పట్టుకున్నా ప్రభుత్వాలు ఎలాగూ వదిలేయి అని ఆఫీసర్లను భయపెడతాయి కదా. సరేలే.. నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తుంది ఏమో.." అని టాలీవుడ్లో డ్రగ్స్ మాఫియాపై వ్యంగ్యంగా రాసుకొచ్చారు. (చదవండి: ‘రక్త పరీక్షలు నిర్వహిస్తే వారంతా జైలుకే’) -
‘2020లో ఇంత భారీగా.. ఇదే మొదటిసారి’
జైపూర్: రాజస్తాన్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు సుమారు 234 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే ప్రథమం. ఈ నెల 19న రాష్ట్రంలోని చిత్తోర్గఢ్ జిల్లాలోని షాది గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్సీబీ డిప్యూటి డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘జోధ్పూర్ జోనల్ యూనిట్కు చెందిన ఓ బృందం ఆర్ లాల్ అనే వ్యక్తి నివాసప్రాగంణంపై దాడి చేసి 233.97 కిలోగ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి భిల్వారా జిల్లాకు చెందిన ఎంకే ధాకాడ్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశాం. నిందితుల వద్ద నుంచి ఓ ఎస్యూవీని కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని వెల్లడించారు. (ఇది న్యాయమేనా?!) అంతేకాక ఈ ఏడాది ఇంత భారీ మొత్తంలో నల్లమందు పట్టుబడటం ఇదే ప్రథమం అన్నారు మల్హోత్రా. నిందితులు దీన్ని చిత్తోర్గఢ్లోని చట్టబద్దమైన సాగు ప్రాంతం నుంచి కొన్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి జోధ్పూర్కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నాం అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్కు చెందిన మాదకద్రవ్యాల వ్యాపారులు ఇందులో పాలు పంచుకున్నరని తెలిపారు. నల్లమందును గసగసాల నుంచి పొందిన ఎండిన రబ్బరు పాలతో తయారు చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గసగసాల సాగుకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో మధ్యవర్తులు, రైతుల దగ్గర నుంచి దీన్ని కొనుగోలు చేసి అక్రమమార్గల ద్వారా తరలించే ప్రయత్నం చేస్తూ పట్టబడ్డారు. ఈ నల్లమందు నుంచి హెరాయిన్ను తయారు చేస్తారు. -
హైదరాబాద్లో ‘సెక్స్ డ్రగ్’ కలకలం
సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలోని నాచారంలోని ఓ కర్మాగారంపై జరిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల దాడులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బెంగళూరులో బుధవారం చిక్కిన కేటమైన్ తయారీ, విక్రయ ద్వయం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ యూనిట్ అధికారులు గురువారం ఈ దాడులు చేశారు. నాచారంలోని ‘ఇంకెమ్’ సంస్థను సైతం సీజ్ చేసినట్లు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సెక్స్ డ్రగ్గానూ పిలిచే కేటమైన్ వాడకంతో గుర్రాలతో పాటు మనుషులకూ సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నాచారంలో సెక్స్ డ్రగ్ కంపెనీ సీజ్ చేశారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఇది కేవలం సెక్స్ డ్రగ్ మాత్రమే కాదని అధికారులు చెబుతున్నారు. బెంగళూరులోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యూనిట్కు మంగళవారం ఓ సమాచారం అందింది. ‘అక్కడి మెజిస్టిక్ థియేటర్ సమీపంలో ఓ ట్రాలీలో గన్నీ బ్యాగ్ ఉందని, అందులో నిషేధిత మాదక ద్రవ్యమైన కేటమైన్ను విక్రయిస్తున్నారనేది’ దాని సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం ఆ ప్రాంతంలో దాడి చేయగా దీనిని పసిగట్టిన విక్రేత, ఖరీదు చేసే వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. తన కారులో దూసుకుపోయిన విక్రేత అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎన్సీబీ అధికారులపై దాడికి సైతం వెనుకాడలేదు. కారు నంబర్తో పాటు వివిధ ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన ఎన్సీబీ అధికారులు నిందితుడిని బెంగళూరులోని కెంగేరి శాటిలైట్ టౌన్ ప్రాంతానికి చెందిన శివరాజ్గా గుర్తించారు. బుధవారం అతడి ఇంటిపై దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి ఇంట్లో ఉన్న 26 కేజీల కేటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే దీని తయారీ యంత్రం ఉండటాన్ని చూసిన ఎన్సీబీ అధికారులు కంగుతిన్నారు. సాధారణంగా ఎవరూ ఇలాంటి యంత్రాలను ఇళ్లల్లో ఉంచుకోరు. సైకోటోపిక్ సబ్స్టాన్సెస్ కేటగిరీలోకి వచ్చే కేటమైన్ను కొన్ని రసాయనాలను వినియోగించి తయారు చేస్తారు. మూసి ఉన్న గదిలో ఇలాంటి యంత్రాన్ని ఉంచి, రసాయనాలను ప్రాసెసింగ్ చేసి కేటమైన్ తయారు చేయడం రిస్క్తో కూడుకున్న విషయం. ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ విస్పోటనం జరిగే ప్రమాదం ఉంది. జనావాసాల మధ్య ఉన్న ఇలాంటి యూనిట్ను గుర్తించడం దేశంలో తొలిసారని ఎన్సీబీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే శివరాజ్కు దీని తయారీలో ఉన్న అనుభవం నేపథ్యంలోనే పకడ్బందీగా ఈ దందా చేస్తున్నాడని తేల్చారు. ఇతడిచ్చిన సమాచారంతో డ్రగ్ను హోల్సేల్గా ఖరీదు చేసుకుని వెళ్లడానికి వచ్చిన చెన్నైకు చెందిన జె.కన్నన్ను సైతం ఎన్సీబీ యూనిట్ పట్టుకుంది. మైసూర్కు చెందిన శివరాజ్ తన భార్య, కుమార్తెతో కలిసి మూడేళ్ల క్రితం బెంగళూరుకు వలసవచ్చాడు. కేటమైన్ తయారీ యూనిట్ ఉన్న ఇంట్లోనే వీరితో కలిసి ఉంటున్నాడు. ఇతడి విచారణలో హైదరాబాద్ లింకులు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని నాచారంలో ఉన్న ఇంకెమ్ సంస్థలోనూ ఇలాంటి మరో తయారీ యంత్రం ఉందని చెప్పడంతో బెంగళూరు అధికారులు హైదరాబాద్ యూనిట్కు సమాచారం అందించారు. హుటాహుటిన నాచారం వెళ్లిన హైదరాబాద్ టీమ్ ఇంకెమ్ సంస్థలో ఉన్న యంత్రాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు దాన్ని సీజ్ చేసింది. ఇంకెమ్ నిర్వాహకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తినీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. గుట్టుగా..ఐదేళ్లుగా.. మల్లాపూర్: నాచారం పారిశ్రామిక వాడలో ఇంకెమ్ కెమికల్ ల్యాబ్ పేరుతో వెంకటేష్ అనే వ్యక్తి ఏకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఐదేళ్లుగా గుట్టుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. ‘సెక్స్ డ్రగ్’గా పేర్కొనే ఈ ‘కెటామిన్’ మాదకద్రవ్యాన్ని బెంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ వాడిన వారు పైశాచిక ఆనందంతో మృగాళ్లాలా ప్రవర్తిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. బెంగళూరులో డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు కెటమిన్ డ్రగ్స్తో పట్టుబడ్డ ముఠా ఇచ్చిన సమాచారంతో కర్ణాటక పోలీసులు గురువారం రాత్రి నాచారం పోలీసులతో కలిసి ఇ–కెమ్ కెమికల్ ల్యాబ్ పరిశ్రమపై దాడి చేశారు. ఈ సందర్భంగా ముడి సరుకుతోపాటు, పలు కీలకపైన ఫార్ములాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిర్వాహకుడు వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
డ్రగ్స్ రాకెట్లో నలుగురు విద్యార్థుల అరెస్ట్
న్యూ ఢిల్లీ : న్యూ ఇయర్ వేడుకలకు ముందు దేశ రాజధానిలో డ్రగ్స్ రాకెట్ ముఠాతో సంబంధం ఉన్న నలుగురు విద్యార్థులను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబి) అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 1.14 కిలోల గంజాయితో పాటు ఎల్ఎస్డీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ పంపిణీ చేయబోతున్నట్టు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. ఎన్సీబి డిప్యూటీ జనరల్ డైరక్టర్ ఎస్కె జా మాట్లాడుతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం ఇటీవల ఎక్కువ అయిందని తెలిపారు. హిమచల్ ప్రదేశ్ నుంచి వీరికి డ్రగ్స్ సరఫర అవుతున్నాయన్నారు. హిందు కాలేజీకి చెందిన గౌరవ్ ఈ రాకెట్ని కింగ్పిన్ అనే కోడ్తో రన్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతని నుంచి మిగిలిన ముగ్గురికి(అనిరుధ్ మాథుర్, టెన్జిన్ ఫుంచోగ్, సామ్ మల్లిక్) డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, వారు చెప్పిన వివరాల ప్రకారం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
బంగారు భవితకు గేట్వే!
నేషనల్ కోఆర్డినేషన్ బోర్డు (ఎన్సీబీ)-గేట్ తరఫున గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఏడు ఐఐటీల ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన స్కోర్తో ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు)లతో పాటు ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఇటీవలి కాలంలో గేట్లో సాధించిన స్కోర్ ఆధారంగా ప్రభుత్వరంగ సంస్థలు ఎంట్రీ లెవల్ రిక్రూట్మెంట్స్ చేపడుతుండటంతో గేట్కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గేట్-2015 నిర్వహణ సంస్థగా ఐఐటీ- కాన్పూర్ వ్యవహరిస్తోంది.గేట్-2012కు 6,86,614 మంది, గేట్-2013కు 9,84,855 మంది హాజరయ్యారు. గేట్-2014 పరీక్షకు 8,89,156 మంది హాజరయ్యారు. అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్(10+2తర్వాత నాలుగేళ్లు)లలో బ్యాచిలర్ డిగ్రీ. లేదా మ్యాథ్స్/సైన్స్/ స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్ లేదా తత్సమాన విభాగంలో మాస్టర్ డిగ్రీ.చివరి సంవత్సరం విద్యార్థులు కూడా గేట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్/బీఆర్కలకు సమానమైన ప్రొఫెషనల్ సొసైటీ పరీక్షలలో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష విధానం: మొత్తం 22 పేపర్లకు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థి తన బ్రాంచ్/విభాగానికి అనుగుణంగా ఏదో ఒక పేపర్కు మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. మొత్తం 65 ప్రశ్నలకు మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. గేట్-2015 ప్రశ్నపత్రంలో మల్టిపుల్ చాయిస్ టైప్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ టైప్ ప్రశ్నలకు ఆప్షన్లు ఇస్తారు. అదే న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు. వర్చువల్ కీ ప్యాడ్ను ఉపయోగించి సమాధానం పూరించాలి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బయెటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ సెన్సైస్ తదితర పేపర్లలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ (దాదాపు 15 శాతం మార్కులు); జనరల్ ఆప్టిట్యూడ్ (15 శాతం మార్కులు); సబ్జెక్టు (70 శాతం మార్కులు)లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, కెమిస్ట్రీ, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, లైఫ్ సెన్సైస్ తదితర పేపర్లలో జనరల్ ఆప్టిట్యూడ్ (15 శాతం మార్కులు), సబ్జెక్టు (85 శాతం మార్కులు)లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.ఒక మార్కు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు; రెండు మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానికి 2/3 మార్కులు కోత విధిస్తారు. న్యూమరికల్ సమాధాన ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. స్కోర్ ప్రాధాన్యత, ఆర్థిక సహాయం: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ), ఇతర ప్రభుత్వ సంస్థల మద్దతుతో నడిచే ఇన్స్టిట్యూట్లలో ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఆర్థిక సహాయం అందుకోవడానికి గేట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటారు. కోర్సు చేస్తున్న సమయంలో నెలకు రూ.8 వేల వరకు ఉపకార వేతనం అందుతుంది. కొన్ని ప్రభుత్వ సంస్థలు సైంటిస్ట్/ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గేట్ స్కోర్ను తప్పనిసరి చేస్తున్నాయి. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (సింగపూర్), జర్మనీలోని కొన్ని సాంకేతిక విశ్వవిద్యాలయాలు.. మాస్టర్స్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల సందర్భంలో విద్యార్థి ప్రతిభను అంచనా వేసేందుకు గేట్ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (ఎన్ఐటీఐఈ-ముంబై).. గేట్ స్కోర్ ఆధారంగా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది.గేట్ స్కోర్ ఆధారంగా ఐఐఎంలలో ఫెలో ప్రోగ్రామ్ (మేనేజ్మెంట్)లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 1, 2014. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అక్టోబర్ 1, 2014. ఆన్లైన్లో అడ్మిట్ కార్డులు అందుబాటు: డిసెంబర్ 17, 2014. పరీక్ష తేదీలు: ఆన్లైన్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు జరుగుతాయి. జనవరి 31, 2015; ఫిబ్రవరి 1, 7, 8, 14 తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాల వెల్లడి: మార్చి 12, 2015. దరఖాస్తు రుసుం: పురుష అభ్యర్థులు(జనరల్/ఓబీసీ):రూ.1500. మహిళా అభ్యర్థులు: రూ.750 ఇతర అభ్యర్థులు (జనరల్/ఓబీసీ): రూ.1500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు: రూ.750. చెల్లింపు విధానం: ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్; ఎస్బీఐ ఐ-కలెక్ట్; యాక్సిస్ బ్యాంకు ఐ-కనెక్ట్; ఈ-చలాన్. దరఖాస్తు విధానం: గేట్-2015 నిర్వహణ సంస్థ ఐఐటీ కాన్పూర్ లేదా ఇతర జోనల్ గేట్ కార్యాలయాల వెబ్సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్తో అనుసంధానం కావొచ్చు. తర్వాత రిజిస్టర్ చేసుకొని, దరఖాస్తును పూరించాలి. ఈ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఫొటో, సంతకాన్ని, అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. వెబ్సైట్: www.iitk.ac.in గేట్ పేపర్లు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ బయెటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎకాలజీ, ఎవల్యూషన్ జియాలజీ అండ్ జియోఫిజిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ {పొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ ఇంజనీరింగ్ సెన్సైస్ లైఫ్ సెన్సైస్. ప్రధాన అంశాలు: గేట్ ప్రశ్నపత్రంలో బహుళైచ్చిక ప్రశ్నలతో పాటు సంఖ్యాపరమైన సమాధాన ప్రశ్నలు (ూఠఝ్ఛటజీఛ్చి ్చటఠ్ఛీట ్ఞఠ్ఛట్టజీౌట) ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు 20 నుంచి 25 వరకు వస్తాయి. అందువల్ల ఏ అంశాన్ని చదివినా కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కొన్ని అంశాలకు వెయిటేజీ ఏటా మారుతున్నట్లు గమనించవచ్చు. కొన్ని కోర్ అంశాలకు మాత్రం ఎప్పుడూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి వాటిపై నిర్లక్ష్యం చూపకుండా పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఉదాహరణకు థర్మోడైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ/మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అంశాలను చెప్పుకోవచ్చు. థర్మోడైనమిక్స్ నుంచి కనీసం 12 మార్కులకు ప్రశ్నలు రావొచ్చు. విశ్లేషణ: ఏ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ అయినా వందశాతం పూర్తిచేయడం కష్టం. ఎన్ని టాపిక్స్ను పూర్తిచేశామనే దానికన్నా ఎన్ని టాపిక్స్ను క్షుణ్నంగా, విశ్లేషణాత్మకంగా చదివామనేది ముఖ్యం. ఓ అంశంపై ప్రశ్న ఏ కోణంలో ఇచ్చినా సమాధానం గుర్తించేలా అధ్యయనం చేయాలి. సొంత నోట్స్: పరీక్షకు ఆర్నెల్లకు పైగా సమయం అందుబాటులో ఉంది కాబట్టి ఔత్సాహికులు సొంతంగా నోట్స్ను రూపొందించుకోవాలి. ముఖ్యమైన సూత్రాలను నోట్స్లో రాసుకోవడం వల్ల వీలైనన్ని ఎక్కువ సార్లు పునశ్చరణకు వీలవుతుంది. అన్ని అంశాల్లోని ప్రాథమిక భావనలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. వీటిలోని ముఖ్యమైన వాటిని నోట్స్లో పొందుపరచుకోవచ్చు. పుస్తకాలు: థర్మో డైనమిక్స్కు పి.కె.నాగ్; స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్కు రామామృతం పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. - అల్లూరి సునీల్వర్మ (గేట్-2014 మెకానికల్ 5వ ర్యాంకు). ప్రధాన అంశాలు: ఆన్లైన్లో పరీక్షలు జరుగుతుండటం వల్ల ముఖ్యమైన అంశాలు ఏమిటనేవి చెప్పలేకపోతున్నాం. ఒక్కో స్లాట్లో ఒక్కో దానికి ఎక్కువ వెయిటేజీ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు గేట్-2014లో నా స్లాట్లో అనలాగ్ సర్క్యూట్స్పై ఎక్కువ ప్రశ్నలు రాగా, తర్వాతి స్లాట్లో ఎలక్ట్రానిక్ డివెసైస్పై అధిక ప్రశ్నలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఔత్సాహికులు సొంత ప్రిపరేషన్ ప్రణాళికను అమలు చేసుకోవాలి. టెక్నికల్ సబ్జెక్టులు అన్నీ ముఖ్యమైనవేనని గుర్తించి, చక్కని సమయపాలనతో క్షుణ్నంగా చదవాలి. అన్ని ప్రశ్నలూ కాన్సెప్టు ఆధారితంగానే ఉంటున్నాయి కాబట్టి మొదట థియరీని బాగా చదివి, తర్వాత కాన్సెప్టులను బాగా ప్రాక్టీస్ చేయాలి. శిక్షణ: గేట్కు కోచింగ్ తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పొచ్చు. కాలేజీలో రోజువారీ తరగతుల్లో బోధన, అభ్యసన ఎక్కువగా అకడమిక్ పరంగా ఉంటుంది. దీంతో కొన్ని కాన్సెప్టులపై లోతుగా అవగాహన ఏర్పడదు. శిక్షణ కేంద్రంలో అయితే ప్రత్యేకంగా గేట్ కోణంలో బోధన ఉంటుంది. కాలేజీలో బీటెక్ స్థాయిలో చదివిన అంశాలపై అప్లికేషన్ కోణంలో శిక్షణ లభిస్తుంది కాబట్టి ప్రయోజనం ఉంటుంది. నమూనా పరీక్షలు: అన్ని సబ్జెక్టులకు ఆన్లైన్ మాక్టెస్ట్లకు హాజరవడం వల్ల ప్రిపరేషన్కు సంబంధించిన బలాలు, బలహీనతలు తెలుస్తాయి. అయితే సిలబస్ను పూర్తిచేసిన తర్వాత మాత్రమే ఈ టెస్ట్లు రాయాలి. అకడమిక్గా బీటెక్ స్థాయిలో చదివిన అంశాలను అప్లికేషన్ కోణంలో ప్రాక్టీస్ చేయాలి. - కె.కె.శ్రీనివాస్, (గేట్-2014 ఈసీఈ 4వ ర్యాంకు). ప్రధాన అంశాలు: గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏ అంశాల నుంచి అధిక ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అంశాలు చాలా ముఖ్యమైనవి. ఎక్కువగా సమస్య సాధన (ఞటౌఛ్ఛఝ టౌఠిజీజ) ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ప్రిపరేషన్లో ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రణాళిక: డిసెంబర్ నాటికి సిలబస్ను పూర్తిచేయాలి. అప్పటి నుంచి పరీక్ష తేదీ వరకు అందుబాటులో ఉన్న సమయాన్ని పునశ్చరణకు, ఆన్లైన్ మాక్ టెస్ట్లు రాయడానికి కేటాయించాలి. ఈ రెండింటికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్ని శిక్షణ సంస్థలు దేశవ్యాప్తంగా ఆన్లైన్ మాక్ టెస్ట్లను నిర్వహించి ఆలిండియా ర్యాంకులు ఇస్తోంది. సబ్జెక్టుల వారీగా కూడా మార్కులు ప్రకటిస్తోంది. దీనివల్ల అభ్యర్థులు తమను తాము అంచనా వేసుకొని, ప్రిపరేషన్ ప్రణాళికలో మార్పులు చేసుకునేందుకు వీలుంటుంది. నిర్దేశ సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం అలవడుతుంది. మొత్తం సిలబస్కు సంబంధించి 15-20 టెస్ట్లు రాయడం మంచిది. సొంత నోట్స్: ప్రతి సబ్జెక్టులోని ముఖ్య అంశాలు, సూత్రాలతో సొంతంగా నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్కు బాగా ఉపయోగపడుతుంది. - రాపోలు జయప్రకాశ్ (గేట్-2014 ఎలక్ట్రికల్ 9వ ర్యాంకు). ప్రిపరేషన్ వ్యూహాలు సిలబస్లోని కాన్సెప్ట్లను గుర్తించి వాటి ప్రాధాన్యాన్ని విశ్లేషించుకుంటూ చదవాలి. వివిధ వనరుల నుంచి రకరకాల ప్రశ్నలను సేకరించి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వివిధ సమస్యలకు తేలిగ్గా సమాధానం గుర్తించే మార్గాలను(షార్ట్కట్స్)ను సొంతంగా ఆవిష్కరించాలి. ఈ వి ధానం అభ్యర్థులను విజయం ముంగిటకు చేరుస్తుంది.గేట్ పరీక్ష ప్రధానంగా సంబంధిత బ్రాంచ్లో అభ్యర్థిలోని ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. సబ్జెక్ట్లోని బేసిక్స్, ఫండమెంటల్స్పై అవగాహన స్థాయిని తెలుసుకునే విధంగా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సరైన ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని చదవాలి. ఈసీఈ: నెట్వర్క్స్, ఎలక్ట్రానిక్ డివెసైస్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, సిగ్నల్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్స్ అంశాల భావనలపై పట్టు సాధిస్తే గేట్లో మంచి స్కోర్ సాధించవచ్చు. మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారికి ఈసీఈలోని అంశాలను ఒంటబట్టించుకోవడం తేలికవుతుంది. గేట్లో నెట్వర్క్స్పై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. దీనికి సంబంధించి ప్రామాణిక పుస్తకాల్లోని సమస్యలను సాధన చేయాలి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ignal to noise ratio of AM, FM; superheterodyne receiver, Fundamentals of information theory, PCM, CPCM, matched filter receiversË$ ముఖ్యమైన వాటిలో కొన్ని.డిజిటల్ సర్క్యూట్లలో లాజిక్ గేట్స్, లాజిక్ ఫ్యామిలీస్, కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్, మైక్రోప్రాసెసర్స్లోని సమస్యలను సాధన చేయాలి. సీఎస్ అండ్ ఐటీ: థియరీ ఆఫ్ కంప్యుటేషన్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సీ అండ్ డేటా స్ట్రక్చర్స్, డీబీఎంఎస్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ వంటి అంశాలపై పట్టు సాధిస్తే గేట్లో మంచి స్కోర్ సాధించడంతో పాటు సాఫ్ట్వేర్ పరిశ్రమలో రాణించడానికి ఉపయోగపడతాయి. మెకానికల్ ఇంజనీరింగ్: మెకానికల్ కోర్ సబ్జెక్టులైన థర్మోడైనమిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, డిజైన్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంశాలు మంచి స్కోర్ సాధించేందుకు కీలకమైనవి. వీటిలోని సమస్యల సాధనపై దృష్టిసారించాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: పవర్ సిస్టమ్స్, మెషీన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ తదితర అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వీటిలోని ఈక్వేషన్స్పై పట్టు సాధించాలి. ఆన్లైన్ మాక్ పరీక్షలు: ఆన్లైన్ మాక్ పరీక్షలకు హాజరు కావడం ద్వారా టైమ్ మేనేజ్మెంట్ అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతున్నారో తెలుస్తుంది. ప్రిపరేషన్ పరంగా బలాలు-బలహీనతలు తెలుస్తాయి. పరీక్ష విధానం అలవాటవుతుంది. శిక్షణ సంస్థలు కొంత మొత్తాన్ని వసూలు చేసి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్లను నిర్వహిస్తుంటాయి. వీటికి హాజరవ్వాలి. కొన్ని సంస్థలు స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్లు, గత ప్రశ్నపత్రాలు తదితరాలు అందుబాటులో ఉండే ట్యాబ్లను అందుబాటులోకి తెస్తున్నాయి. -
తువాళ్లలో కేటమైన్ రవాణా
ముంబై: నిషేధిత కేటమైన్ మాదకద్రవ్యాన్ని తువాళ్లలో నానబెట్టి కొరియర్ల ద్వారా ఆస్ట్రేలియాకు తరలించడానికి యత్నించిన ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్టు చేశామని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) శుక్రవారం ప్రకటించింది. కేటమైన్ను నానబెట్టిన 74 తువాళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. నిందితులు ఎమ్మాన్యుయేల్, క్రిస్టియన్ జీకర్, లారిండో రమోస్ను ముంబైలో గురువారం అరెస్టు చేశామని తెలియజేసింది. ఎమ్మాన్యుయేల్ దక్షిణ ముంబైలో నివాసముంటున్నాడని ఎన్సీబీ తెలిపింది. ఆపరేషన్ల సమయంలో రోగులకు మత్తు కలిగించడానికి డాక్టర్లు కేటమైన్ను ఉపయోగిస్తారు. దీనిని వినియోగించిన వారికి రకరకాల భ్రాంతులు కలుగుతాయి. అందుకే బార్లు, నైట్క్లబ్బుల్లో టీనేజ్ యువతి దీనిని వినియోగిస్తోందని ఎన్సీబీ తెలిపింది. ఇదిలా ఉంటే మరో రకం మాదకద్రవ్యం కొకైన్ను కలిగి ఉన్న కేసులో యశ్బిర్లా గ్రూపు ఉన్నతాధికారి ఆనంద్ వర్ధన్, మరో ఇద్దరిని కూడా ఎన్సీబీ అరెస్టు చేసింది. వీరికి కొకైన్ సరఫరా చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 11న ఈ ముగ్గురిని ముంబైలోని ఒక హోటల్లో అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా అరెస్టయిన ముగ్గురు ఆఫ్రికా జాతీయులకు స్థానిక కోర్టు ఈ నెల 20 వరకు ఎన్సీబీ కస్టడీ విధించింది. ‘భారత్లో వీళ్లు ఎక్కడి నుంచి కేటమైన్ తీసుకువచ్చారు.. ఇది వరకు ఎన్నిసార్లు దానిని విదేశాలకు రవాణా చేసేంది తెలుసుకునేందుకు నిందితులను ప్రశ్నిస్తాం’ అని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. -
రూ.40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు రూ. 40 కోట్ల విలువైన ఎనిమిది కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ఈ మాదకద్రవ్యాన్ని శుక్రవారం స్థానిక ఐదు నక్షత్రాల హోటల్లో స్వాధీనం చేసుకొని అమోబీ చిజిఓకే ఒబినికా అనే నైజీరియన్ను అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలో ఓ ఖరీదైన లాడ్జికి అమోబీ దీనిని తీసుకెళ్తుండగా అరెస్టు చేశామని ఎన్సీబీ తెలిపింది. వారి కథనం ప్రకారం.. ఈ ఏడాది ఇంత భారీగా కొకైన్ పట్టుబడడం ఇదే తొలిసారి. ఇది చాలా ప్రమాదకరమైన మాదకద్రవ్యం కావడంతో మత్తుమందుల వ్యవసపరులు దీనిని తీసుకోవడానికి చాలా ఇష్టపడుతారని ఎన్సీబీ డెరైక్టర్ జనరల్ ఆర్పీ సింగ్ తెలిపారు. అయితే ఈ నెల 26న ఢిల్లీకి వచ్చిన నిందితుడు కొకైన్ను తన వెంట తీసుకురాకుండా వేరే విమానంలో పార్సిల్ బుక్ చేశాడు. మరునాడు అది ఇతని హోటల్ గదికి కొరియర్లో రావాల్సి ఉంది. ఇతని కదలికలపై పక్కా సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు నిఘా వేశారు. హోటల్ లాబీలో ఇతడు కొరియర్ కోసం ఎదురుచూస్తుండగానే అరెస్టు చేశారు. అమోబీపై మాదకద్రవ్యాల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశామని, అయితే ఇది ఎవరి కోసం తీసుకొచ్చాడో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సింగ్ చెప్పారు. విద్యార్థులకు భారీగా డ్రగ్స్ అందుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో పటిష్ట నిఘా ఉంచామని తెలిపారు. అన్మోల్ సర్నా అనే ఎన్ఐఆర్ విద్యార్థి ఇటీవల మాదకద్రవ్యాలు వికటించడంతో హింసాత్మకంగా మారి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించడం తెలిసిందే.