Papikondalu
-
రాజమండ్రి : పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు)
-
మద్దిచెట్టు నుంచి నీటి ధార
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): దట్టమైన అటవీ ప్రాంతంలో మద్ది చెట్టు నుంచి ధారగా నీరు రావడం అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. పాపికొండలు నేషనల్ పార్క్లోని ఇందుకూరు రేంజ్ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. రంపచోడవరం డీఎఫ్వో నరేందిరన్ సిబ్బందితో కలిసి శనివారం కింటుకూరు అటవీ ప్రాంతానికి తనిఖీ నిమిత్తం వెళ్లారు. నల్లమద్ది చెట్టుకు బొడుపులు ఉన్నచోట కత్తితో గాటు పెట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు. దీంతో గాటు పెడుతుండగానే నీరు ధారలా బయటకు వచ్చింది. దీనిపై డీఎఫ్వో మాట్లాడుతూ నల్లమద్ది చెట్టులో నీరు నిల్వ చేసుకునే వ్యవస్ధ ఉందని, అందుకు తగ్గట్టుగా అవసరాలకు నీటిని చెట్టు తనలో దాచుకుందన్నారు. చెట్టు నుంచి సుమారు 20 లీటర్లు నీరు వచ్చినట్లు తెలిపారు. నీటిని రుచి చూసిన ఆయన తాగేందుకు ఉపయోగపడదని తెలిపారు. నల్లమద్ది చెట్టు బెరడు మొసలి చర్మంలా ఉండడంతో దీనిని క్రోకోడైల్ బర్క్ ట్రీ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. శాస్త్రీయ నామం టెర్మినేలియా టొమెంటోసా అని చెప్పారు. ఆయన వెంట రేంజ్ అధికారి దుర్గా కుమార్బాబు పాల్గొన్నారు. -
పాపికొండల్లో అరుదైన మిత్రుడు
కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని రంపచోడవరం జలపాతం వద్ద 2022 సెపె్టంబర్ 8న చనిపోయిన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ మృతదేహాన్ని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు దీపా జైస్వాల్, బి.భరత్, ఎం.కరుతాపాండి, శ్రీకాంత్ జాదవ్, కల్యాణి, కుంటేలు గుడ్డిపాము కళేబరాన్ని రసాయనాలతో హైదరాబాద్ జూలాజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి పరిశోధనలు చేసి చివరకు డీఎన్ఏ పరీక్ష ద్వారా దీనిని అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్గా నిర్ధారించారు. 1839లో జావా దీవుల్లో గుర్తింపు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ను 1839లో ఇండోనేషియాలోని జావా దీవుల్లో తొలిసారిగా గుర్తించారు. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త పియరి మోడర్డ్ డియార్డ్ గౌరవార్థం దీనికి డయార్ట్స్ అని నామకరణం చేశారు. ఆర్గిరోఫిస్ డయార్టి శాస్త్రీయ నామం కలిగిన ఇది టైఫ్లోపిడే కుటుంబంలో విషపూరితం కాని పాము జాతికి చెందినది. ఇవి అడుగు వరకు పొడవు పెరుగుతాయి. భారతదేశంలో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, అసోం, హరియాణా, బిహార్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో వీటి జాతి ఉంది. మొదటిసారి ఏపీలోని పాపికొండలు అభయారణ్య ప్రాంతమైన రంపచోడవరం జలపాతం వద్ద దీనిని కనుగొన్నారు. వానపాములు భూసారాన్ని పెంపొందించడంలో ఏ విధంగా సాయపడతాయో అంతకంటే ఎక్కువగా పర్యావరణాన్ని కాపాడటంలో గుడ్డిపాములు దోహదపడతాయి. ఐయూసీఎన్ ఆందోళన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తగ్గుతున్న జీవుల జాబితా అయిన రెడ్ లిస్ట్లో డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ను చేర్చింది. భారతీయ వన్యప్రాణి (రక్షణ) సవరణ చట్టంలో దీనిని చేర్చారు. చిత్తడిగా ఉండే అటవీ ప్రాంతం, పొదలు, గడ్డి భూముల్లో ఇవి నివసిస్తాయి. వీటితో పర్యావరణం పరిఢవిల్లుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. తూర్పు కనుమల ప్రాంతమైన తమిళనాడు, ఏపీ, ఒడిశా ప్రాంతాల్లో కేవలం పాపికొండలు వద్ద ఈ జాతిని గుర్తించడంతో ఈ ప్రాంతాల్లో మరింతగా వీటి జాడ ఉండే అవకాశం ఉంది. విషపూరితమైనవి కావు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ విషపూరితమైనవి కావు. క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వానపాములు ఏ విధంగా సంతానోత్పత్తి చేస్తాయో అదేవిధంగా వీటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. పంట పొలాల్లో రసాయనాలు అధిక వినియోగం వల్ల వీటి సంతతి నశిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. వీటిని పరిరక్షించుకోవాలి. – బి.భరత్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్ -
అడవిలో అమృతధార
బుట్టాయగూడెం: వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కోసం వన్య ప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన, వాహనాల కింద పడి మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రెండేళ్లుగా వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి దాహార్తి తీర్చేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో అటవీ శాఖ ఈ ఏడాది కూడా వేసవి ప్రణాళిక రూపొందించారు. పాపికొండల్లో 60 నీటికుంటలు పాపికొండలు అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేవిధంగా ఈ వేసవిలో 60 నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చెలమల్ని తవ్వి వన్య ప్రాణులకు నీటి సౌకర్యం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. అవికాకుండా 25 చెక్డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తొట్టెల్లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాటి పక్కన ఉప్పు ముద్దలను పెడుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుని ఉప్పు ముద్ద నాకుతాయని, తద్వారా వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కృషి పాపికొండలు అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటితొట్టెల్ని వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.50 లక్షలు వెచ్చిస్తోంది. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
పాపికొండల విహార యాత్రకు గ్రీన్ సిగ్నల్
దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరిలో పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు. బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారి పేరంటపల్లికి వెళ్లనున్నారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే -
పోలవరం అడవిలో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి
సాక్షి, ఏలూరు: అరుదైన జాతికి చెందని బంగారు బల్లి అంతరించిపోతున్న జీవుల్లో ముఖ్యమైనది. ఇప్పుడివి పోలవరం అడవిగా పిలిచే పాపికొండలు అభయారణ్యంలోని కొండ గుహల్లో సందడి చేస్తున్నాయి. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టి లోడస్ అరీస్. సాధారణంగా ఇవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు.. లేత పసుపు రంగులో 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో మాత్రమే సంచరిస్తాయి. రాతి గుహలు, వాటి సందు మధ్య ఉండే తేమ ప్రాంతాలంటే బంగారు బల్లులకు మహా ఇష్టం. 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయి ఇవి ఒకేసారి సుమారు 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయ. ఇవి గుడ్లను విచిత్రంగా కిందకి వేలాడే విధంగా పెడతాయి. ఈ గుడ్లను పాములు, క్రిమికీటకాలు తినేస్తుండటంతో ఇవి అంతరించిపోయే జాతుల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. పాపికొండలు అభయారణ్య గోదావరి పరీవాహక రాతి ప్రాంతాల్లో సుమారు 250 వరకు బంగారు బల్లులు ఉన్నట్టు అటవీ శాఖ అంచనా వేశారు. బంగారు బల్లుల్లోనూ రెండు జాతులుగా ఉన్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. వాటిలో ఒకటి కాలొడాక్టి లోడస్ అరీస్. ఇవి సాధారణ బల్లుల కంటే పెద్దగా అరుస్తూ వింత శబ్దం చేస్తాయని చెబుతున్నారు. పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల సంచారం ఉంది పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల జాడ ఉంది. రెండేళ్ల క్రితం నేను, విశాఖపట్నానికి చెందిన శాస్త్రవేత్త కలిసి పోలవరం మండలం సిరివాక గ్రామంలోని గోదావరి సమీపంలో గల రాతి ప్రదేశాల్లో అధిక సంఖ్యలో బంగారు బల్లులు పెట్టిన గుడ్లు గుర్తించాం. 250కి పైగా బంగారు బల్లులు ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. – దావీదురాజు నాయుడు, ఇన్చార్జి ఫారెస్ట్ అధికారి, పోలవరం ఫొటోలు తీశా పాపికొండలు అభయారణ్యంలో అరుదైన పక్షులను, జంతువులను ఫొటోలు తీశాను. బంగారు బల్లి కూడా నా కెమెరాకు చిక్కింది. అభయారణ్యం రాతి ప్రాంతాల్లో ఈ బల్లుల సంచారం ఉంది. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. – కె.బాలాజీ, ఫొటోగ్రాఫర్, రాజమండ్రి చదవండి: పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’ -
మూషిక జింక.. లగెత్తడమే ఇక.. ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి
బుట్టాయగూడెం: ఒకప్పుడు మూషిక మొహం.. జింక దేహంతో అలరారిన పురాతన కాలం నాటి అతి చిన్న మూషిక జింకలు (మౌస్ డీర్) పాపికొండలు అభయారణ్యంలో సందడి చేస్తున్నాయి. అంతరించిన జంతువుల జాబితాలో కలిసిపోయిన ఆ బుల్లి ప్రాణులు ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదట. అందుకే వీటిని సజీవ శిలాజంగా పరిగణిస్తారు. భారత ఉప ఖండంలో మాత్రమే కనిపించే మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలోనూ ఉన్నట్టు వైల్డ్లైఫ్ అధికారులు గుర్తించారు. జానెడు పొడవు.. రెండు నుంచి మూడు కిలోల బరువుండే మూషిక జింకల సంరక్షణకు ఫారెస్ట్, వైల్డ్లైఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శబ్దం వినబడితే ప్రాణం హరీ! మూషిక జింకలను స్థానిక గిరిజనులు వెదురు ఎలుకలని పిలుస్తారు. వీటికి భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు విన్నా.. ఏవైనా జంతువులు దాడి చేసేందుకు వచ్చి నా.. ఎవరైనా వీటిని పట్టుకున్నా భయంతో గుండె పగిలి మరణిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే మూషిక జింకలు రాత్రి వేళల్లో మాత్రమే అడవిలో సంచరిస్తాయని పేర్కొంటున్నారు. ఇవి ఎక్కువగా వెదురు కూపుల్లోనే నివసిస్తుంటాయి. అడవిలో రాలిన పువ్వులు, పండ్లు, ఆకుల్ని తింటాయి. ఉసిరి, మంగ కాయలు, పుట్ట గొడుగులు, పొదల్లోని లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింకల గర్భధారణ కాలం ఆరు నెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. మళ్లీ వెంటనే సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. చిరుతలు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, గద్దలు ఈ మూషిక జింకలను వేటాడుతూ ఉంటాయి. వీటికి తోడు అడవుల నరికివేత, అడవిలో కార్చిచ్చు, వేటగాళ్ల ముప్పు వంటివి మూషిక జింకల ఉనికికి ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. పాపికొండల్లో వీటి సంఖ్య 500 పైనే అరుదైన మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలో ఎక్కువగానే ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దట్టమైన అరణ్యం ఉండటం.. వెదురు కూపులు ఎక్కువగా ఉండటంతో 500కు పైగా మూషిక జింకలు ఇక్కడ నివసిస్తున్నట్టు అంచనా. అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు మూషిక జింకల జాడ చిక్కినట్టు చెప్పారు. సంతతి పెరుగుతోంది అరుదైన మూషిక జింకలు పాపికొండలు అభయారణ్యంలో ఉన్నాయి. ఇవి ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయే జీవులుగా ఉన్నా.. వీటి సంతతి ఇక్కడ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ట్రాప్ కెమెరాల్లో కూడా ఈ మూషిక జింకలు చిక్కాయి. ఇవి సంచరించే ప్రాంతాల్లో జన సంచారం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీంతో వీటి ఉనికి బాగా పెరుగు తున్నట్టు గుర్తించాం. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా -
సీతాకోక చిలుకల హరివిల్లు
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): ఎన్నెన్నో అందాలు.. అన్నింటా అందాలు.., సీతాకోక చిలుకకు చీరలెందుకు.. అని కవులు సీతాకోక చిలుక అందాలను అభివర్ణించారు. సప్తవర్ణ శోభితమైన వాటి సోయగాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటున్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండల అభయారణ్యం జీవవైవిధ్యంతో అలరారుతోంది. అరుదైన రకాల సీతాకోక చిలుకలకు ఆలవాలంగా నిలుస్తోంది. జాతీయస్థాయి విజేత ఓకలీఫ్ పాపికొండల అభయారణ్యంలో జంతువులు, వృక్షాలే కాక అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గతేడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండల నేషనల్ పార్క్లో ఉన్న 3 రకాల సీతాకోక చిలుకలు పోటీపడ్డాయి. తుది పోరులో దేశవ్యాప్తంగా 7 రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా వీటిలో పాపికొండల అభయారణ్యంకు చెందిన 3 రకాల ఉన్నాయి. వీటిలో ఆరెంజ్ ఓకలీఫ్ జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికయ్యింది. ఇవి వర్షాకాలం, శీతాకాలం సమయంలో గుంపులుగా తిరుగుతూ చూపరులను ఆకట్టుకుంటాయి. పచ్చని చెట్ల మధ్య సీతాకోక చిలుకలు ఎగురుతుండటం ఆహ్లాదంగా అనిపిస్తుంది. అరుదైన సీతాకోక చిలుకలు పాపికొండల అభయారణ్యంలో కనిపిస్తున్నాయి. 1,045 రకాల జంతువులు పాపికొండల అభయారణ్యం ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా 2008 నవంబర్ 4న ప్రకటించింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో గోదావరికి ఇరువైపులా 1,01,200 హెక్టార్ల పరిధిలో పాపికొండల అభయారణ్యం విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోని రిజర్వ్ ఫారెస్ట్గా ఉండేది. జాతీయ పార్క్గా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడి జంతుజాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు అంటున్నారు. పెద్ద పులులు, చిరుతలు, అలుగులు, గిరినాగులతో పాటు పలురకాల జంతువులకు నిలయంగా అభయారణ్యం మారింది. అరుదైన జీవజాలం అరుదైన జీవజాలానికి నిలయంగా పాపికొండల అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అలాగే వృక్ష సంపద ఉంది. వీటితోపాటు పలురకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. 2021లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కామన్ జెజెబెల్, కామన్ నవాబ్, ఆరెంజ్ ఓకలీఫ్ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఆరెంజ్ ఓకలీఫ్ అనే సీతాకోక చిలుక జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికయ్యింది. ఈ అభయారణ్యంలో 130 రకాల రంగుల సీతాకోక చిలుకలు ఉన్నాయి. – జి.వేణుగోపాల్, వైల్డ్లైఫ్ డిప్యూటీ రేంజర్, పోలవరం -
‘పాపికొండల’ ప్రత్యేక ప్యాకేజీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది. ఆ ప్యాకేజీ వివరాలను ఏపీటీడీసీ కాకినాడ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. రాజమండ్రి, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 98486 29341, 98488 83091 నంబర్లలో, పోచవరం నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 63037 69675 నంబర్లో సంప్రదించాలని కోరారు. రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. రాజమండ్రి నుంచి 2 రోజుల పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి ఒక రోజు పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి 2 రోజుల పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తిరిగి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. గండి పోచమ్మ నుంచి ఒక రోజు పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. గండి పోచమ్మ నుంచి 2 రోజుల పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి రెండు నాన్వెజ్ కూరలతో భోజనం. 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. -
పాపికొండలు పోదాం పద!
గోదారమ్మ పరవళ్లు..ప్రకృతి అందాలు..ఎత్తయిన కొండలు..పున్నమి వెన్నెల్లో ఇసుక తిన్నెలు..నైట్ హాల్ట్లు.. ఇలా పాపికొండలు విహారయాత్ర ఇచ్చే మజాయే వేరంటారు పర్యాటకులు. అలాంటి మధురానుభూతి జీవితంలో ఒక్కసారైనా పొందాలనుకుంటారు సందర్శకులు. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ విహార యాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో ఆదివారం నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పాపికొండలు విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, బోట్ల యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు ఆధారపడ్డాయి. గోదావరికి వరదలు రావడంతో గత నాలుగు నెలలుగా పాపికొండలు పర్యాటకం నిలిచిపోయింది. ఈనేపథ్యంలో నీటిమట్టం అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం పాపికొండలు విహారయాత్ర బోట్లకు శనివారం అనుమతి ఇచ్చింది. దీంతో పర్యాటకశాఖ అధికారులు పాపికొండలు విహార యాత్రకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలి రోజు ఒక్క బోటు మాత్రమే.. పాపికొండల విహారయాత్రకు తొలి రోజు ఆదివారం ఒక్క బోటుమాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించి ఏపీ టూరిజం, ప్రైవేట్ టూరిజం శనివారం నుంచి టికెట్లను అందుబాటులోకి తెచ్చాయి. విహారయాత్రకు బోట్లు బయలుదేరేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా పోశమ్మగండి వద్ద బోట్ పాయింట్, కంట్రోల్ రూమ్లో రెవెన్యూ, పోలీసు, పర్యాటక, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. బోట్ పాయింట్ వద్ద ఉన్న అన్ని బోట్లలో భద్రతా చర్యలను వారు పరిశీలించారు. పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనుమతులు మంజూరు చేసింది. పోశమ్మగండి బోట్ పాయింట్ నుంచి పర్యాటకులతో టూరిజం బోటు బయలుదేరడానికి ముందే పైలెట్ బోట్ వెళ్తుంది. ఇందులో శాటిలైట్ ఫోన్తోపాటు పర్యాటక సిబ్బంది ఒకరు, గజ ఈతగాడు ఉంటారు. వీరి వద్ద కూడా వాకీ టాకీ ఉంటుంది. పైలెట్ బోటు.. టూరిజం బోటు కంటే ముందుగా వెళ్తూ గోదావరిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్తోపాటు వెనుక వస్తున్న బోటుకు వాకీ టాకీలో సమాచారం అందిస్తారు. ఇలా చేరుకోవాలి: ముందుగా ఏపీ పర్యాటక శాఖ వెబ్సైట్.. https:// tourism.ap.gov.in/లో పాపికొండలు విహారయాత్రకు టికెట్లు బుక్ చేసుకోవాలి. రూ.1,250 టికెట్ బుక్ చేసుకున్నవారు నేరుగా రాజమండ్రి చేరుకోవాలి. అక్కడ గోదావరి గట్టున ఉన్న పర్యాటక శాఖ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ నుంచి బస్సులో పోశమ్మ గండి బోట్ పాయింట్ వరకు పర్యాటక శాఖ సిబ్బంది తీసుకొస్తారు. యాత్ర ముగిశాక మళ్లీ రాజమండ్రికి తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇక రూ.1000 టికెట్ తీసుకున్నవారు నేరుగా బోట్లు బయలుదేరే అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండికి చేరుకోవాల్సి ఉంటుంది. రెండు బోట్ పాయింట్ల వద్ద ఏర్పాట్లు పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద మొత్తం 15 బోట్లు ఉండగా, వీటిలో ఎనిమిది బోట్లకు అనుమతి మంజూరు చేశారు. మరో ఏడు బోట్లకు ఫిట్నెస్ పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వీఆర్ పురం మండలం పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లు ఉండగా వీటిలో 13 బోట్లకు ఫిట్నెస్ అనుమతి ఇచ్చారు. మరో నాలుగు బోట్లకు అనుమతి రావాల్సి ఉంది. -
పాపికొండల యాత్రకు పచ్చజెండా.
భద్రాచలం: పాపికొండల విహార యాత్రకు తిరిగి రంగం సిద్ధం అవుతోంది. భారీ వర్షాలు, గోదావరి వరదల నేపథ్యంలో జూన్ మొదటి వారంలో నిలిచిపోయిన యాత్ర సోమవారం పునఃప్రారంభం కానుంది. పాపికొండలు యాత్రను ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనే సమాచారంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జూన్ 4న నిలిచిన యాత్ర.. ఏపీలోని కచ్చలూరు వద్ద 2019లో జరిగిన ప్రమాదంతో నిలిచిపోయిన పాపికొండల యాత్ర గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైంది. సందడిగా మారిన గోదావరి తీరం.. వరదల నేపథ్యంలో జూన్ 4న ఆగిపోయింది. సెప్టెంబర్ వరకూ వరదల భయం వీడలేదు. దీంతో యాత్ర ముందుకు సాగలేదు. దీంతో భద్రాచలంలో కొంతకాలంగా వ్యాపారాలన్నీ నిస్తేజంగా మారాయి. పాపికొండల యాత్ర పునఃప్రారంభం అవుతుండడంతో వ్యాపారులు, లాడ్జీలు, హోటళ్లు, ట్రావెల్ వాహనాల యజమానుల్లో హర్షం వెల్లువెత్తుతోంది. భద్రాచలం పరిసర ప్రాంతాలు మళ్లీ సందడిగా మారనున్నాయి. పర్యాటకులకు కనువిందు.. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. పూర్తిగా గోదావరి నదిపై సాగే లాంచీ ప్రయాణం, ఆ లాంచీలోనే ఆటపాటలు, నృత్యాలు, రుచికరమైన భోజనం, గిరిజనులు తయారు చేసే వెదురు బొమ్మలు, వస్తువులతో పాటుగా అక్కడ మాత్రమే దొరికే ‘బొంగు చికెన్’ వంటివి ప్రత్యేకం. పోచవరం నుంచి పాపికొండలు వెళ్లి, తిరిగి వచ్చేంతవరకు ‘సెల్ ఫోన్ సిగ్నల్స్’ లేని ప్రశాంతమైన యాత్ర ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదు! కార్తీక మాసం సీజన్ కావడంతో భద్రాచలానికి యాత్రికులు, భక్తులు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా వారాంతపు సెలవులు, ప్రత్యేక రోజుల్లో భారీగా పోటెత్తుతారు. ఇలా చేరుకోవచ్చు.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్, దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఫెర్రీ పాయింట్ వద్ద నుంచి బోటింగ్ ఉంటుంది. సోమవారం ఈ రెండు ప్రాంతాల నుంచి ఏపీ టూరిజం లాంచీలు ప్రారంభం కానున్నాయి. రెండు, మూడు రోజుల్లో మరికొన్ని లాంచీలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలనుంచి, హైదరాబాద్ నుంచి పాపికొండలకు వెళ్లాలనుకునేవాళ్లు.. అక్కడ రాత్రి బయలుదేరితే తెల్లవారి ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. రైలు ద్వారానైతే కొత్తగూడెం వరకు వచ్చి, అక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో భద్రాచలానికి చేరుకోవచ్చు. ఉదయం 8గంటల లోపు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకుని పాపికొండల యాత్రకు వెళ్లవచ్చు. యాత్ర ప్రారంభమయ్యే పోచవరం.. భద్రాచలానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లవచ్చు. పోచవరం పాయింట్ నుంచి ఉదయం 9.30 – 10.30 గంటల మధ్య ‘జలవిహారం’ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 – 5 గంటల వరకు తిరిగి పోచవరానికి చేరుకుంటుంది. పాపికొండల ప్యాకేజీ... పోచవరం నుంచి పాపికొండల యాత్రకు టికెట్ ధర పెద్దలకు రూ.930, పిల్లలకు రూ.730 ఉంటుంది. కళాశాల విద్యార్థులు గ్రూç³#గా టూర్కు వస్తే వారికి రూ.830 చొప్పున వసూలు చేస్తారు. ఈ టికెట్లు భద్రాచలంలో లభిస్తాయి. తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులో సాగే ఈ ప్యాకేజీలో భద్రాచలం, పర్ణశాల రామచంద్రస్వామి దర్శనం, పాపికొండల యాత్ర ఉంటాయి. వసతి, భోజన సదుపాయం ఉంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3999గా నిర్ణయించారు. టికెట్లు టూరిజం శాఖ వెబ్సైట్లో లభిస్తాయి. కాగా.. టూరిజం అధికారులు ఈ సీజన్లో అ«ధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సంతోషిస్తున్నాం.. పాపికొండల యాత్రికులపైనే ఆధారపడి జీవిస్తున్నాం. గోదావరి వరదల కారణంగా ఐదు నెలలుగా ఉపాధిని కోల్పోయాం. మళ్లీ బోటింగ్ ప్రారంభానికి అధికారులు ఒప్పుకున్నారని తెలిసి సంతోషిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టికెట్లు విక్రయిస్తాం. – పఠాన్ హుస్సేన్ ఖాన్, టికెట్ విక్రయ కేంద్రం, భద్రాచలం లాంచీలన్నీ సిద్ధంగా ఉంచాం లాంచీలను పోచవరం ఫెర్రీ పాయింట్ వద్ద సిద్ధంగా ఉంచాం. పర్యాటకుల భద్రత మా ప్రధాన బాధ్యత. అందుకు అనుగుణంగా పలు రకాల రక్షణ సామగ్రి ఏర్పాటు చేశాం. – పూనెం కృష్ణ, లాంచీల నిర్వాహకుడు -
అడవి పిలుస్తోంది!
సాక్షి,అమరావతి: ప్రకృతి ఒడిలో సేద తీరాలని.. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొద్ది రోజులపాటు దూరంగా, ప్రశాంతంగా గడపాలనుకునేవారికి అడవి ఆహ్వానం పలుకుతోంది. ఇందుకోసం అటవీ ప్రేమికులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు అటవీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. తూర్పు కనుమల్లో నల్లమల, శేషాచలం, ఎర్రమల, పాపికొండలు ఇలా పలు అడవులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ అడవుల్లోని కొత్త ప్రదేశాలు, కొండలు, లోయల సందర్శనలు, ట్రెక్కింగ్ పట్ల పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. విభిన్న వృక్ష, జంతుజాలానికి ఆలవాలం.. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం.. 1.64 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో 36,914 చదరపు కిలోమీటర్లలో (22.46 శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులో 8,139 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం రిజర్వు అటవీ ప్రాంతం. శ్రీశైలం–నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు, రాయల్ ఎలిఫెంట్ రిజర్వు, శేషాచలం బయోస్పియర్.. ఇవి కాకుండా 3 జాతీయ పార్కులు, 13 వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. ఇవన్నీ విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలు, గొప్ప జీవవైవిధ్యం, ప్రత్యేకమైన వృక్ష, జంతుజాలంతో విలసిల్లుతున్నాయి. 30కి పైగా ప్రదేశాలు.. తలకోన, ఉబ్బలమడుగు, నేలపట్టు, పులికాట్, పెంచలకోన, బైర్లూటి, పెచ్చర్ల, మారేడుమిల్లి, కంబాలకొండ, తెలినీలాపురం, చొల్లంగి, వంటి 30కిపైగా పర్యావరణ పర్యాటక ప్రదేశాలను ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఈ సంవత్సరం తలకోన ప్రాంతాన్ని 2 లక్షల మంది సందర్శించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉబ్బలమడుగు, మారేడుమిల్లి, చొల్లంగి ప్రాంతాలకూ లక్షల మంది వస్తున్నారు. వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసి ప్రజలకు చేరువ చేసేందుకు అటవీ శాఖ ప్రణాళిక రూపొందించింది. థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు.. ప్రతి జిల్లాలో కొత్తగా నగర వనాలు, వనమిత్ర, జూపార్కులకు అనువైన ప్రదేశాలను అధికారులు గుర్తించనున్నారు. అలాగే ఉన్నవాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్కడకు వచ్చిన పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా ఏర్పాట్లు, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, అవుట్డోర్ జిమ్ వంటివి నెలకొల్పనున్నారు. తద్వారా అన్ని వయసుల వారిని ఆకర్షించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే అటవీ, స్థానిక గిరిజన సంఘాలు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను అక్కడ విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాశి వనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం వంటి థీమ్ పార్కులు సృష్టించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం కడపలో ఉన్న నగర వనం మోడల్లో అన్ని నగర వనాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి ఈ ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించే యత్నాలు ఊపందుకుంటున్నాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్ట్, ఇతర అడవుల సందర్శనకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నారు. కర్ణాటక తరహాలో జంగిల్ లాడ్జిలు, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో పర్యాటక అద్భుతాలు అటవీ సందర్శనలు, ప్రకృతి పర్యటనలకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే తలకోన, బైర్లూటి వంటి ఎన్నో అందమైన పర్యావరణ పర్యాటక ప్రాంతాలున్నాయి. శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాలున్నాయి. ప్రజలు అక్కడికి వెళ్లి ఆహ్లాదంగా గడపొచ్చు. ఇలాంటి పర్యటనల ద్వారా ప్రజలు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగించకుండా, వన్యప్రాణులు, మొక్కలకు నష్టం కలిగించకుండా పర్యాటకులు నడుచుకోవాలి. రాష్ట్రంలో కొత్త తరహా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు ఇందులో భాగమవ్వాలి. – మధుసూదన్రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
Papikondalu Tour: పాపికొండలు.. షికారుకు సిద్ధం
రంపచోడవరం: గోదావరి వరదలతో గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకానికి కొద్దిరోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుంది. గోదావరికి వరద తగ్గుతుండడంతో పాపికొండలు పర్యాటకాన్ని పట్టలెక్కిచేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం ఆధారంగా పాపికొండలు వెళ్లేందుకు పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నారు. గతంలో చాలాకాలం పాటు నిలిచిపోయిన పాపికొండలు పర్యాటకం తిరిగి ప్రారంభమైన తరువాత ఆంధ్రా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించేందుకు వస్తుంటారు. గోదావరిలో పర్యాటక బోట్లు తిప్పేందుకు ఏపీ టూరిజం, ఇతర శాఖల తనిఖీలు పూర్తయ్యాయి. కొంతకాలం పాపికొండల పర్యాటకం నిలిచిపోయిన తరువాత గత ఏడాది డిసెంబర్ 18న అధికారికంగా పర్యాటకానికి అనుమతులు ఇచ్చారు. పోలవరం కాపర్ డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగుల దిగువన ఉన్నంత వరకూ మాత్రమే నదిలో పర్యాటక బోట్లు రవాణాకు అనుమతి ఉంటుంది. నీటిమట్టం అంతకన్నా మించితే పర్యాటకాన్ని నిలిపివేస్తుంటారు. ► ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద పర్యాటక బోట్లు గోదావరిలో తిరిగేందుకు అనుకూలమైన నీటిమట్టం ఉంది. ►జూన్ నెలలోనే కాపర్డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగులకు మించి ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పర్యాటకాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి వరదలు, వర్షాల ప్రభావంతో బోట్లకు అనుమతి లభించలేదు. ఉపాధిపై ప్రభావం పర్యాటకంపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. పర్యాటక బోట్ల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో బోట్ల యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి పట్టాలెక్కనుండటంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. బోట్లకు ఎన్వోసీ జారీ రాష్ట్ర పర్యాటకశాఖ జీఎం నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద 12 బోట్లను, వీఆర్పురం మండలంలోని పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లను తనిఖీ చేశారు. వీటికి ఎన్వోసీలను కూడా ఇటీవల జారీ చేశారు. 32 అడుగులకు అనుమతి ఇవ్వాలి గోదావరిలో నీటి మట్టం 32 అడుగుల లోపు వరకు పర్యాటక బోట్లు నదిలోకి తిరిగేందుకు అనుమతి ఇవ్వాలి. ఈమేరకు ఇరిగేషన్ అధికారులను కోరాం. 30 అడుగుల వరకు అనుమతి ఇచ్చేందుకు వారు సానుకూలంగా ఉన్నారు. మరో కొద్దిరోజుల్లో పాపికొండల పర్యాటకానికి అధికారికంగా అనుమతులు వచ్చే అవకాశం ఉంది. –కొత్తా రామ్మోహన్రావు, బోట్ యజమానుల సంఘ ప్రతినిధి అనుకూలంగా నీటిమట్టం గత మూడు నెలలుగా నిలిచిన పాపికొండలు పర్యాటకం మరో వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనమతులు మాత్రమే రావాల్సి ఉంది. పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద పర్యాటకులు బోట్ ఎక్కేందుకు అనువుగా ఉంటే సరిపోతుంది. కాపర్ డ్యామ్ వద్ద బోట్లు తిరిగేందుకు అనుకూలంగా ఉంది. –పి నాగరాజు, ఇన్చార్జి, టూరిజం కంట్రోల్ రూమ్ -
పాపికొండల్లో పెద్ద పులులు
బుట్టాయగూడెం: ఉభయగోదావరి జిల్లాల్లో విస్తరించిన పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులి జాడలు కనిపించాయి. చిరుతల సందడిని గుర్తించారు. సుమారు 90 రోజులపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో వైల్డ్లైఫ్ అధికారులు పులుల గణన నిర్వహించారు. ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయనే సమాచారాన్ని రాబట్టారు. ఈ అభయారణ్యం పరిధిలో పెద్దపులి జాడలు కనిపించడం ఈసారి సాధించిన విజయం. ఈ సారి గణనలో అత్యంత విషపూరితమైన 30 అడుగుల గిరినాగు కూడా కంటపడింది. ఈ అభయారణ్యంలో కొండగొర్రెలు, పాంథర్, కొండచిలువలు, దుప్పులు, సాంబాలు, నక్కలు, ముళ్ల పందులు, ముంగిసలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవికుక్కలు, కుందేళ్లు, లేళ్లు, కనుజులు, అడవిపందులు తిరుగుతున్నట్లు గుర్తించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1012.858 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న అటవీప్రాంతాన్ని 2008లో కేంద్ర ప్రభుత్వం పాపికొండల అభయారణ్యంగా ప్రకటించింది. అప్పటి నుంచి అటవీప్రాంతంలోని జంతు సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే రెండుసార్లు పాపికొండల అభయారణ్యంలో పులుల గణన కార్యక్రమాన్ని వైల్డ్లైఫ్ అధికారులు నిర్వహించారు. మొదట్లో నిర్వహించిన సర్వేలో పులులు ఉన్నప్పటికీ కెమెరాకు చిక్కలేదు. ఈ సారి నిర్వహించిన సర్వేలో పులులు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. రెండు దశల్లో సర్వే పాపికొండల అభయారణ్యంలో పులుల గణనకు సంబంధించిన సర్వేను వైల్డ్లైఫ్ అధికారులు రెండు దశల్లో నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల్లో 90 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 232 పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల్ని గుర్తించారు. మొదటి దశలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న అటవీప్రాంతంలోని 71 చోట్ల 142 కెమెరాలను ఏర్పాటు చేసి 45 రోజుల పాటు సర్వే నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 45 ప్రాంతాల్లో 90 కెమెరాలు ఏర్పాటు చేసి 45 రోజుల పాటు సర్వే నిర్వహించారు. ట్రాప్ కెమెరాలో పులుల జాడ 2018లో నిర్వహించిన పులుల గణన సర్వేలో ఈ ప్రాంతంలో పులులు ఉన్నా ట్రాప్ కెమెరాకు చిక్కలేదు. ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో పులుల జాడ స్పష్టంగా కెమెరాకు చిక్కాయి. పూర్తి స్థాయిలో పులుల గణన వివరాలు జులై 29న వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో జరిగిన గణన వివరాల నివేదికను జాతీయ పులుల సంరక్షణ విభాగం(ఎన్టీసీఏ) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ వివరాలను ప్రపంచ పులుల దినోత్సవం రోజైన జులై 29న పూర్తి స్థాయిలో ప్రకటిస్తారని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. 230 పక్షుల రకాల్ని గుర్తించాం పాపికొండల అభయారణ్యంలో పులుల గణన పూర్తయ్యింది. సుమారు 90 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో పులులు, చిరుతలతో పాటు 230 రకాల పక్షులు, 14 రకాల జాతుల ఉభయచర జీవులు ఉన్నట్లు ట్రాప్ కెమెరాలు గుర్తించాయి. ఇక్కడ నిర్వహించిన సర్వే నివేదికను జాతీయ పులుల సంరక్షణ విభాగానికి పంపిస్తాం. – సి.సెల్వమ్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ 116 ప్రాంతాల్లో సర్వే పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ సర్వేలో ఏనుగు, సింహం తప్ప అన్ని రకాల జంతువులు, పక్షులు, ఉభయచర జీవులను గుర్తించాం. జంతువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, వైల్డ్లైఫ్ మేనేజ్మెంట్ అధికారి. పాపికొండలు -
పాపికొండల సోయగాలు.. నదీ విహారం
సాక్షి, అమరావతి: గోదావరిలో పాపికొండల సోయగాలు.. గోదావరి ఇసుక తిన్నెల్లో వెన్నెల రాత్రులు.. పోచవరం నుంచి భద్రాచలానికి హాయిహాయిగా ప్రయాణం.. కృష్ణా నదిలో భవానీ ద్వీపంలో ఆట పాటలు.. నాగార్జున సాగర్లో చల్ల గాలుల మధ్య విహారం.. ఇలా ఎన్నో ప్రకృతి అందాల మధ్య ప్రపంచాన్ని మరిచి ప్రయాణం చేస్తారా.. అందుకు మీరు సిద్ధమేనా అంటోంది రాష్ట్ర పర్యాటక శాఖ. రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆధునిక బోట్లను అందుబాటులోకి తెస్తోంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటుండంతో డిమాండ్కు అనుగుణంగా ఆధునిక బోట్ల సంఖ్యను పెంచుతోంది. నిలిచిపోయిన బోట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతోంది. ప్రస్తుతం పాపికొండలకు వారాంతంలో 45 మంది ప్రయాణికుల సామర్థ్యంతో పర్యాటక శాఖ బోటు నడుపుతుండగా 95 మంది సామర్థ్యంతో మరో హరిత బోటును అందుబాటులోకి తేనుంది. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటును తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సాగర్–శ్రీశైలం ప్రయాణానికి సంతశ్రీ బోటును రూ.35 లక్షలతో మరమ్మతులు చేపట్టి సంక్రాంతి నాటికి తీసుకురానుంది. చాలా కాలం తర్వాత విజయవాడలోని భవానీ ద్వీపంలో బోధిశ్రీ బోటు సేవలకు సిద్ధమైంది. రాబడి పెంచుకునేందుకు యత్నాలు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పాపికొండలకు నిత్యం రెండు బోట్లు (ప్రైవేటు) తిరుగుతున్నాయి. వారాంతాల్లో పర్యాటక శాఖ బోట్లతో కలిపి ఐదు సేవలందిస్తున్నాయి. సగటున రోజుకు 300 మంది ప్రయాణిస్తున్నారు. భవానీ ద్వీపంలో బోటింగ్ ద్వారా రోజుకు సగటున రూ.40 వేలు, వారాంతాల్లో రూ.2.50 లక్షల ఆదాయం వస్తుండటం విశేషం. ఇక్కడ వారాంతంలో సుమారు 1,500 మంది బోట్లలో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా 12 ప్రదేశాల్లో పర్యాటక శాఖకు చెందిన 48 బోట్లు, వందకు పైగా ప్రైవేటు బోట్లు సేవలందిస్తున్నాయి. గతంలో కేవలం బోటింగ్ ద్వారా రూ.7 కోట్లకు పైగా ఆదాయం రాగా ప్రస్తుతం అది రూ.కోటికి పడిపోయింది. డిసెంబర్ నుంచి మార్చి వరకు సమయం ఉండటంతో రాబడి పెంచుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాపికొండల నైట్ ప్యాకేజీలు ఇలా.. పర్యాటక శాఖ పాపికొండలకు రెండు రోజుల (నైట్) ప్యాకేజీలను అందిస్తోంది. గండిపోచమ్మ – పేరంటాళ్లపల్లి ప్రయాణానికి చార్జి సాధారణ రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) పెద్దలకు రూ.3,200, పిల్లలకు 2,300, వారాంతాల్లో (శుక్రవారం నుంచి ఆదివారం) పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,500గా నిర్ణయించారు. రాజమండ్రి–గండిపోచమ్మ– పేరంటాళ్లపల్లి ప్యాకేజీలో సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.3,000, వారాంతాల్లో పెద్దలకు రూ.4,300, పిల్లలకు రూ.3,300 టికెట్ ధర ఖరారు చేశారు. ఇందులో రాజమండ్రి నుంచి పర్యాటక శాఖ బస్సులో ప్రయాణికులను బోటింగ్ పాయింట్కు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రయాణం మొదలై మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు ముగుస్తుంది. పేరంటాళ్లపల్లి నుంచి తిరుగు ప్రయాణంలో కొల్లూరు, కొరుటూరులోని గిరిజన సంప్రదాయ తరహా బ్యాంబూ హట్స్లో (వెదురుతో చేసిన గుడిసెలు) రాత్రి బసను ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు ఆటవిడుపుగా వాలీబాల్, కబడ్డీ, ట్రెక్కింగ్, జంగిల్ వాక్ సౌకర్యాలను మెరుగుపరిచారు. బోట్ల సంఖ్యను పెంచుతున్నాం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక కారణాలతో బోట్లు చాలా కాలంపాటు నిలిచిపోయాయి. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని వాడుకలోకి తెచ్చేందుకు మరమ్మతులు చేయిస్తున్నాం. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటు తిప్పేందుకు ఆలోచిస్తున్నాం. పోలవరానికి ప్రత్యేక నైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టూరిజం కార్పొరేషన్ రాబడి పెంపుపై దృష్టి రాష్ట్రంలో జల పర్యాటకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పర్యాటకుల డిమాండ్కు అనుగుణంగా బోట్ల సంఖ్యను పెంచి రాబడి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బోట్లకు మరమ్మతులు చేపడుతున్నాం. త్వరలోనే పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని వాటిని నీటిలోకి ప్రవేశపెడతాం. – ఆరిమండ వరప్రసాద్రెడ్డి, చైర్మన్, ఏపీ టూరిజం కార్పొరేషన్ -
Tourism: భద్రాచలం, పాపికొండలు చూసొద్దాం రండి..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి భద్రాచలం.. అక్కడి నుంచి పాపికొండలకు కొత్త ప్యాకేజీని ప్రారంభించనున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ ప్యాకేజీకి ప్రభుత్వం నుంచి శనివారమే అనుమతి లభించిందన్నారు. వచ్చేవారం నుంచి పర్యటన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటన ప్యాకేజీ పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999 చొప్పున ఉంటుంది. చదవండి: Medak CSI Church: మెతుకు పంచిన కోవెల.. ప్రత్యేకతలకు నిలయం.. పర్యటన ఇలా... మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు పర్యాటక భవన్ నుంచి రాత్రి 8 గంటలకు బషీర్బాగ్ లోని పర్యాటక కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 5 గంటలకు భద్రాచలంలోని హరిత హోటల్కు, 7.30కు పోచారం బోటింగ్ పాయింట్కు చేరుకుంటారు. 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాపికొండలు, పేరంటాళ్లపల్లికి బోటింగ్. ఈ సమయంలోనే భోజనం, స్నాక్స్ అందజేస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. మూడో రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఆలయ దర్శనం. 11.30 గంటల వరకు పర్ణశాల సందర్శన, అనంతరం తిరిగి హరిత హోటల్కు చేరుకుంటారు, మధ్యాహ్నం భోజనం అనంతరం 2.30 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. -
మంచి సౌకర్యాలతో మెరుగైన ఆదాయం
సాక్షి, అమరావతి: భద్రాచలం నుంచి పాపికొండలకు వచ్చే పర్యాటకులకు వీలుగా పోచవరంలో ఈ నెల 14 నుంచి బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు. పర్యాటకులకు రాత్రి బస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 20వ తేదీలోగా పోలవరం నుంచి పాపికొండలకు కొత్త బోటింగ్ పాయింట్ను ప్రారంభించాలని, వారంలోగా నాగార్జునసాగర్లో బోట్ సర్వీసు నడపాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే హరిత రెస్టారెంట్ల్ల ఆదాయం మెరుగుపడుతోందని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 69.57 కోట్లు వచ్చిందని తెలిపారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు పర్యాటకానికి మంచి సీజన్ అని, రెస్టారెంట్లలో పూర్తిస్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ, నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఆక్యుపెన్సీని పెంచాలని అధికారులను ఆదేశించారు. గండికోటలో రూ.4.50 కోట్లతో రోప్ వే, బొర్రా గుహల్లో రూ. 2.70 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, మారేడుమిల్లిలో రూ.1.15 కోట్లతో కాటేజీలు, అడ్వంచర్ స్పోర్ట్స్ పనులు వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. లంబసింగికి వచ్చే పర్యాటకుల కోసం తాత్కాలికంగా చేపట్టిన రెస్టారెంట్, టాయిలెట్స్ పనులు వారంలోగా పూర్తి చేస్తామన్నారు. పాండ్రంగిలో అల్లూరి మ్యూజియం, కృష్ణ్ణదేవిపేటలో ఆయన సమాధి అభివృద్ధి పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు, ఉత్తమ క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పూర్తయిందని, ఈ నెల 11, 12 తేదీల్లో విజయనగరంలో కొనసాగుతుందన్నారు. మార్చిలో రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహించి సీఎం చేతులమీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు. -
Papikondalu: అడవి తల్లికి గూర్ఖాలుగా బేస్ క్యాంప్ సిబ్బంది
బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి జిల్లా): అరణ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ నిత్యం సవాళ్లతో సావాసం చేసే అడవి తల్లి బిడ్డలు వారు. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ అడవిలో వణ్య ప్రాణుల సంరక్షణ, వేటగాళ్ల నుంచి విలువైన వృక్ష సంపదను రక్షించడమే వారి పని. పాపికొండల అభయారణ్యంలోని అణువణువూ జల్లెడ పట్టే బేస్ క్యాంప్ సిబ్బంది కుటుంబాలకు దూరంగా.. అడవి తల్లికి గూర్ఖాలుగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిసున్న బేస్క్యాంప్ సిబ్బందిపై ప్రత్యేక కథనం.. ఐదు బేస్ క్యాంప్లు ఏర్పాటు పాపికొండల అభయారణ్యం ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1,012.86 చదరపు కిలోమీట్ల మేర విస్తరించింది. మొత్తం 1,01,200 హెక్టార్ల అటవీప్రాంతాన్ని 2008లో కేంద్రప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మగుడి సమీపంలో ఒకటి, పోలవరం మండలం టేకూరు ప్రాంతంలో, గడ్డపల్లి సమీపంలో, పాపికొండల అభయారణ్య శివారు ప్రాంతంలో మరో రెండు బేస్ క్యాంప్లు ఏర్పాటు చేసి వాటిలో 25 మంది సిబ్బందిని నియమించారు. వీరంతా అటవీ, వన్యప్రాణి సంరక్షణ కోసం పగలూ రాత్రీ తేడాలేకుండా శ్రమిస్తున్నారు. తగ్గిన స్మగ్లింగ్ బేస్ క్యాంప్ల ఏర్పాటుతో అటవీప్రాంతంలో స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టింది. గతంలో స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా అటవీసంపదను తరలించేవారు. ప్రస్తుతం బేస్క్యాంప్లు ఏర్పాటు చేయడం వల్ల అక్రమ రవాణా అరికట్టారు. బేస్ క్యాంప్ సిబ్బంది రాత్రీ, పగలూ గస్తీ కాయడం వల్ల వన్యప్రాణులకు రక్షణ పెరిగిందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. రాత్రి వరకూ అడవిలో గస్తీ బేస్క్యాంప్ సిబ్బంది అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన మంచె లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇళ్లల్లో ఉంటారు. వంట వార్పు మొత్తం అక్కడే. అప్పుడప్పుడు ఇళ్లకు వెళ్లడం తప్ప అడవే వారికి ప్రపంచం. అడవితల్లికి అండగా ఉంటూ చెట్లు నరికివేతకు గురికాకుండా, వన్యప్రాణుల్ని సంరక్షిస్తుంటారు. ఉదయం 6 గంటలకే నిద్రలేచి వంటావార్పూ సిద్ధం చేసుకుని అడవిలోకి బయల్దేరతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అటవీప్రాంతంలో తిరుగుతూ జంతువుల కదలికలను గుర్తిస్తారు. ఒక్కోసారి రాత్రి వరకూ అటవీప్రాంతంలోనే ఉంటారు. అడవిని నరుకుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి స్మగ్లర్ల ఆటకట్టిస్తారు. అడవిలో సాయంత్రం కాగానే పూర్తిగా నిర్మానుష్యంగా మారుతుంది. చీకటి పడగానే చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు పలు జంతువుల అరుపులు వినిపిస్తుంటాయి. ఒక్కోసారి అవి పక్కనుంచి వెళ్తుంటాయి. రోజూ ఎన్నో జంతువులు కనిపిస్తాయి. అయినా వాటి మధ్య ధైర్యంగా బేస్క్యాంప్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. బేస్క్యాంప్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమిస్తారు. 25 కిలోమీట్ల వాకింగ్ టెస్ట్, హెల్త్ఫిట్నెస్ టెస్ట్ ద్వారా నియమిస్తారు. అడవి సింహాల్లా.. అటవీ ప్రాంతంలో బేస్ క్యాంప్ సిబ్బంది వన్యప్రాణుల మధ్య అడవి సింహాల్లా తిరుగుతుంటారు. ఒక్కోసారి రాత్రిపూట కూడా అడవికి కాపలా కాస్తారు. దీంతో స్మగ్లింగ్ తగ్గింది. పాపికొండల అభయారణ్యంలో ప్రస్తుతం 25 మంది బేస్క్యాంప్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, పాపికొండల వైల్డ్లైఫ్ మేనేజ్మెంట్ అధికారి జంతువులు కనిపిస్తే దాక్కుంటాం మేము దట్టమైన అటవీప్రాంతంలో తిరుగుతున్న సమయంలో మాకు అనేక అడవి జంతువులు కనిపిస్తాయి. ఆ సమయంలో అవి వెళ్ళిపోయే వరకూ చాటున దాక్కుంటాం. గొర్రగేదెలు, లేళ్లు, ఎలుగుబంట్లు వంటివి మాకు కనిపిస్తుంటాయి. వాటి సంరక్షణ మా బాధ్యత కనుక వాటికి కనిపించకుండా పహారా కాస్తాం. – సోయం వెంకటేశ్వరరావు, బేస్ క్యాంప్ సిబ్బంది, కొరుటూరు చేతి కర్ర, కత్తే ఆయుధం దట్టమైన అటవీప్రాంతంలో పహారా కాసే సమయంలో మా చేతిలో కర్ర, కత్తి మాత్రమే ఉంటాయి. అవే ఆయుధాలు. అవి కూడా ముళ్ల చెట్లు తొలగించడానికే తప్ప జంతువులకు హాని చేయడానికి కాదు. రాత్రీ, పగలూ తేడా లేకుండా కర్రతో శబ్దం చేస్తూ తిరుగుతుంటాం. – యండపల్లి బుచ్చన్న దొర బేస్ క్యాంప్ సిబ్బంది, సరుగుడు కష్టానికి తగ్గ జీతం ఇవ్వాలి మాలో డిగ్రీ వరకూ చదివిన వారు కూడా ఉన్నారు. మా గ్రామాలు అటవీప్రాంతంలో ఉండటం వల్ల బేస్ క్యాంప్లో చేరాం. ప్రస్తుతం మాకు జీతం, భోజన ఖర్చులు కలిపి నెలకు రూ. 10 వేల వరకూ ఇస్తున్నారు. మా కష్టానికి తగ్గట్లు జీతాలు పెంచాలి. అడవిలో ఉంటున్న రోజుల్లో మా భోజనానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. – కొండ్ల సుధీర్, బేస్ క్యాంప్ సిబ్బంది, పోలవరం -
పాపికొండలకు చలోచలో
రంపచోడవరం: గోదావరి నదీ జలాల్లో పాపికొండల విహార యాత్రను రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 114 మంది పర్యాటకులతో రెండు బోట్లు ఆదివారం పాపికొండల విహారానికి వెళ్లాయి. ఈ యాత్రను తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రారంభించారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వేసుకోవాలని పర్యాటకులకు సూచించారు. పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 9 కమాండ్ కంట్రోల్ రూముల పర్యవేక్షణలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పర్యాటక శాఖల అనుసంధానంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని విహార యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. శాటిలైట్ సిస్టమ్ ద్వారా బోట్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పర్యాటకుల బోట్లు బయలుదేరడానికి ముందు ఎస్కార్ట్ బోటు వెళ్తుందని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా.. వెనుక వచ్చే పర్యాటక బోట్లకు సమాచారమిస్తారని తెలిపారు. ఏపీ టూరిజం వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని, దీనివల్ల పర్యాటక బోట్లలో ఎంతమంది వెళ్తున్నారనే లెక్క పక్కాగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం 11 బోట్లకు అనుమతులిచ్చామని, వీటిలో ఏపీ టూరిజం బోట్లు 2, ప్రైవేట్ బోట్లు 9 ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్, ఎంపీపీ కుంజం మురళి, జెడ్పీటీసీ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. గోదావరిపై ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభం రాజమహేంద్రవరం సిటీ: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో గోదావరి జలాలపై తేలియాడేలా తీర్చిదిద్దిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. రెండు స్టీల్ పంటులపై ఏర్పాటు చేసిన ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్లో 95 మంది ప్రయాణించవచ్చు. ఈ రెస్టారెంట్కు పద్మావతి ఘాట్ నుంచి వెళ్లవచ్చు. 15 రోజుల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. వివాహ విందులు, పుట్టిన రోజు, కిట్టీ పార్టీల వంటివి నిర్వహించుకునేందుకు వీలుగా దీనిని అధికారులు సిద్ధం చేయనున్నారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ ఎ.వరప్రసాద్రెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు. -
పాపికొండల యాత్రను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్
-
లాహిరి..లాహిరి..లాహిరిలో..
ఓ వైపు వంపులు తిరుగుతూ సుందరంగా ప్రవహించే గోదావరి.. మరోవైపు అటు కొండ.. ఇటు కొండ.. నట్టనడుమ ఉరకలు పెట్టే గోదావరి.. ఆ వంక గిరిజనుల జీవన సౌందర్యం.. ఈ వంక పచ్చటి ప్రకృతి.. ఇలా భిన్న దృశ్యాలను తిలకిస్తూ సేద తీరాలంటే పాపికొండలను బోటులో చుట్టిరావాల్సిందే. ఈ అద్భుత ప్రయాణానికి నేటి నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత పాపికొండలకు బోట్లు నిలిచిపోయాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత బోట్లు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలతో అనుమతులు మంజూరు చేసింది. దీంతో పర్యాటకులు పాపికొండల యాత్రకు ఉవ్విళ్లూరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం ఆన్లైన్ బుకింగ్కు అవకాశం.. ఉభయ గోదావరి జిల్లాలకు నడుమ సుమారు 40 కిలోమీటర్ల పొడవునా గోదావరి నదికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. సెలవులు వస్తే చాలు.. పర్యాటకులు జలవిహారం చేస్తూ పాపికొండలను చుట్టేస్తారు. సకుటుంబ సపరివారసమేతంగా వచ్చి పాపికొండల్లోని సుందర ప్రకృతి దృశ్యాలను.. బోటు ప్రయాణంలో ఆహ్లాదాన్ని.. వంపులు తిరుగుతూ హొయలు ఒలకబోసే గోదావరిని చూసి పరవశిస్తారు. బుకింగ్కు ఆన్లైన్ సౌకర్యం ( www. aptdc. gov. in) కూడా ఉంది. దీంతో వివిధ రాష్ట్రాల పర్యాటకులు కూడా బోటు షికారు కోసం రెక్కలు కట్టుకుని మరీ వచ్చేస్తున్నారు. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు రాజమమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుకోవాలి. ముఖ్యమంత్రి ఆదేశాలతో పటిష్ట భద్రత పాపికొండల జలవిహార యాత్రలో పర్యాటకుల రక్షణ, భద్రత అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా కచ్చులూరు ప్రమాదం తర్వాత ప్రభుత్వం నూతన విధానాలను రూపొందించింది. ప్రమాదం అనంతరం అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమహేంద్రవరంలో సమీక్ష నిర్వహించారు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాకే బోట్లను అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. బోట్ల ఫిట్నెస్ పరిశీలించాకే అనుమతులు పాపికొండల జలవిహార యాత్రకు ప్రైవేట్ బోట్లతోపాటు ఏపీ టూరిజం బోట్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన 16 బోట్లకు ఏపీ మారిటైమ్ బోర్డు అనుమతి ఇచ్చింది. పోచమ్మగండి బోట్ పాయింట్ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్ పాయింట్ నుంచి 5 బోట్లకు అనుమతులు లభించాయి. వీటిలో తొలి విడతలో పోచమ్మగండి నుంచి ఆదివారం బోట్లు బయలుదేరనున్నాయి. ట్రయల్ రన్ సక్సెస్.. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ ఆదేశాలతో శనివారం పోచమ్మగండి వద్ద పర్యాటక బోట్లకు ట్రయిల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. పైలెట్ బోటు ముందు రాగా వెనుక లాంచీలు పేరంటాలపల్లి లాంచీల రేవు నుంచి బయలుదేరాయి. ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవే.. ► పర్యాటకుల రక్షణ, భద్రత కోసం రెవెన్యూ, పోలీసు, పర్యాటక, జలవనరుల శాఖలతో ఐదు చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు ► కంట్రోల్ రూమ్ మేనేజర్గా డిప్యూటీ తహసీల్దార్. ► పర్యాటక, జలవనరులు, పోలీసు అధికారులు కంట్రోల్ రూముల వద్ద పర్యాటకుల రక్షణ భద్రత అంశాలపై మూడు రకాల చెకప్లు చేపడతారు. మేనేజర్ వీటిని పరిగణనలోనికి తీసుకొని బోటు ప్రయాణానికి అనుమతిస్తారు. ► పైలెట్ స్పీడ్ బోటు గజ ఈతగాళ్లతో కూడిన రెస్క్యూ టీమ్తో బయలుదేరాలి. దీని వెనుక మరో 3 లేదా 5 బోట్లు ప్రయాణించాలి. ► చివర ఎస్కార్ట్ బోటులో శాటిలైట్ ఫోన్ అందుబాటులో ఉంచారు. ► ప్రతి పాయింట్ దాటాక శాటిలైట్ ఫోన్లో కంట్రోల్ రూమ్కు సమాచారాన్ని అందించాలి. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్కు తెలపాలి. ► పైలెట్ బోటు లేనిదే జలవిహార యాత్ర నిర్వహించరాదు. ► ప్రయాణించే లాంచీని లైసెన్స్ ఉన్న డ్రైవర్ మాత్రమే నడపాలి. ► జలవనరుల శాఖ ధవళేశ్వరం వద్ద 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న సమయంలోనే విహార యాత్రకు అనుమతి ► నిర్వాహకుల నుంచి అఫిడవిట్లపై సంతకాలు తీసుకున్నాకే బోట్లకు అనుమతి ► నిర్దేశిత సామర్థ్యాన్ని మించి పర్యాటకులను ఎక్కించరాదు. జాగ్రత్తలు తీసుకునే అనుమతి గోదావరిలో పాపికొండల పర్యాటకానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. గత ఘటనలు పునరావృతం కానివ్వకుండా పర్యాటకుల భద్రతే ప్రథమ లక్ష్యంగా ఏర్పాట్లు చేశాం. బోటులో పరిమితిని బట్టి 70 నుంచి 90 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతిస్తున్నాం. –జి.రాఘవరావు, కాకినాడ పోర్టు అధికారి నిర్వాహకులకు మంచి రోజులు గోదావరిలో జలవిహారం ప్రారంభమవ్వడంతో బోటు నిర్వాహకులతోపాటు దానిపై ఆధారపడేవారికి మంచి రోజులు వచ్చినట్టే. బోటు షికారు నిలిచిపోవడంతో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడతాం. –మాదిరెడ్డి సత్తిబాబు, బోట్ యజమాని పర్యాటకులు ఇలా చేరుకోవాలి.. తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల నుంచి బోట్లు బయలుదేరతాయి. అవి.. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు ముందుగా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్కు చేరుకోవాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కార్యాలయానికి చేరుకుని టికెట్లు కొనుగోలు చేయాలి.. లేదా ఏపీటీడీసీ వెబ్సైట్లోనూ బుక్ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి రూ.1,250 చెల్లించాలి. ఏపీటీడీసీనే పర్యాటకులను రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం నుంచి పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుస్తుంది. రాజమహేంద్రవరం నుంచి పోచమ్మగండికి దాదాపు 42 కి.మీ. దూరం. పోచమ్మగండిలో ఉదయం 10 గంటలకు బోటు బయలుదేరుతుంది. బోటులో పర్యాటకులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం), సాయంత్రం స్నాక్స్, టీ అందిస్తారు. ఇవన్నీ రూ.1,250 లోనే కలిపి ఉంటాయి. పర్యాటకులు నేరుగా పోచమ్మగండికి కూడా చేరుకుని కూడా టికెట్లు కొనుగోలు చేసి బోటు ఎక్కొచ్చు. పోచమ్మగండి నుంచి ఒక్కో వ్యక్తికి రూ.1,000. తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకులు తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం చేరుకోవాలి. అయితే ఇక్కడ నుంచి బోట్లు బయలుదేరడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా టికెట్ రేట్లు కూడా నిర్ణయించలేదు. -
పర్యాటకానికి 'జల'సత్వం
సాక్షి, అమరావతి: మరికొద్ది రోజుల్లో పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల్లో జలవిహారాన్ని పునఃప్రారంభించేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆగస్టులో ఈ రెండు నదుల్లో వరద ఉధృతి పెరగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా బోటింగ్ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతోపాటు కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో నవంబర్ 7 నుంచి గోదావరిలో పాపికొండలుకు బోట్లను తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పోశమ్మగండి నుంచే బోట్లు బయల్దేరుతాయి. కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని సింగనపల్లి బోటు పాయింట్ నీటిలో మునిగిపోయింది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ బోటింగ్ పాయింట్ను అన్వేషిస్తున్నారు. మరోవైపు.. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిన వెంటనే ఇక్కడా బోట్లు తిప్పనున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతులు రాష్ట్రంలో 300లకు పైగా బోట్లు ఉండగా.. ఇందులో పర్యాటక శాఖకు చెందినవి 48 ఉన్నాయి. వీటిలో మూడు మినహా మిగిలినవి అన్ని అనుమతులతో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు.. ప్రభుత్వ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం.. ప్రైవేటు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీచేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ బెరం పార్కులలో జల విహారానికి 50 సీట్ల సామర్థ్యం ఉన్న బోట్లను తిప్పుతున్నారు. అలాగే, రిషికొండ, రాజమండ్రి, దిండి ప్రాంతాల్లో చిన్నబోట్లు, జెట్ స్కీలను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి పాపికొండలు మార్గంలో ఏపీ టూరిజం బోట్లతో పాటు దాదాపు 80 వరకు ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించేవి. ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడంతో కేవలం 23 బోట్లకు మాత్రమే అనుమతులు లభించాయి. నిరంతరం బోటింగ్ పర్యవేక్షణ రెండేళ్ల కిందట పాపికొండలు మార్గంలో కచ్చులూరు వద్ద సంభవించిన బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వ సూచనలతో బోట్ల రక్షణ, మార్పుల విషయంలో కాకినాడ పోర్టు అధికారులు ప్రత్యేక నివేదికను సమర్పించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఓపీని రూపొందించింది. దీని ప్రకారం.. ► బోట్ల రూట్ పర్మిట్, పర్యాటక, జలవనరుల శాఖ నుంచి లైసెన్సులు పొందితేనే బోటును నడుపుకునేందుకు ఎన్ఓసీ జారీచేస్తున్నారు. ► గండిపోచమ్మ, పేరంటాలపల్లి, పోచవరం, రాజమండ్రి, రుషికొండ, నాగార్జునసాగర్, శ్రీశైలం, విజయవాడ బెరం పార్కులలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటుచేశారు. ► పోలీసు, రెవెన్యూ, జలవనరులు, పర్యాటక శాఖాధికారులు సమన్వయంతో వీటి ద్వారా బోటింగ్ను నిరంతరం పర్యవేక్షిస్తారు. ► లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు బోట్లను తనిఖీ చేస్తున్నారు. ► బోటు బయలుదేరే ప్రదేశంతోపాటు గమ్యస్థానం వద్ద కూడా సీసీ కెమెరాలు, అలారంలను ఏర్పాటుచేశారు. ► ప్రైవేటు బోట్లలో సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించకుండా చర్యలు చేపడుతున్నారు. భద్రతా ప్రమాణాలతో సేవలు ఇక పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని బోట్లను సముద్ర యానానికి కూడా అనువైనవిగా తీర్చిదిద్దారు. 8 ఎంఎం స్టీల్ బాడీతో, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) నిర్దేశిత భద్రతా ప్రమాణాలతో ఇవి సేవలందిస్తున్నాయి. ఈ బోట్లలో సమాచారాన్ని వేగంగా అందించేలా శాటిలైట్ ఫోన్లను ప్రవేశపెట్టారు. పాపికొండల మార్గంలో వీటిని వినియోగిస్తారు. ప్రయాణించే బోటుతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్, పేరంటాలపల్లిలోని రిమోట్ కంట్రోల్ రూమ్లో వీటిని అందుబాటులో ఉంచారు. పాపికొండలుకు వెళ్లే బోట్లకు రక్షణగా ప్రత్యేక పైలట్ బోటుతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. నావిగేషన్ వ్యవస్థతోపాటు కమ్యూనికేషన్ కోసం వెరీ హై ఫ్రీక్వెన్సీ (వీహెచ్ఎఫ్) రేడియోలతో బోట్లను నడపనున్నారు. పాపికొండలుకు విహారయాత్ర గోదావరి, కృష్ణాలో బోటు షికారుకు ఏర్పాట్లుచేస్తున్నాం. పర్యాటక శాఖకు చెందిన 45 బోట్లకు పోర్టు అనుమతులున్నాయి. కార్తీక మాసంలో పర్యాటకుల సందడిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7 నుంచి పాపికొండల విహార యాత్రను అన్ని జాగ్రత్తలతో ప్రారంభిస్తున్నాం. అదే రోజున కృష్ణాలో కూడా బోట్లు తిప్పేందుకు జలవనరుల శాఖ అధికారులతో చర్చిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ -
పాపికొండల టూర్.. నదీ అందాలు తిలకిస్తూ విహారం
రంపచోడవరం: పాపికొండలు అందాలు చూసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రెండేళ్ల విరామం తరువాత నవంబరు 7 నుంచి పర్యాటక బోటులు పాపికొండల విహారానికి బయలుదేరానున్నాయి. దీంతో పర్యాటకుల్లో ఆసక్తి.. ఆనందం నెలకొన్నాయి. శీతాకాలం గోదావరిపై మంచు తెమ్మరల మధ్య పాపికొండల పర్యటన మధురానుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్య సుమారు 40 కిలో మీటర్ల పొడవుల గోదావరికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. టూరిజమ్ బోట్లపై ప్రయాణించే పర్యాటకులు పాపికొండలు, గోవావరి వెంబడి ఎత్తున కొండలు, పచ్చని వృక్షాలు ప్రాంతాన్ని వీక్షించేందుకు ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి సందర్శిస్తున్నారు. వీఆర్పురం మండలం పోచవరం బోట్ పాయింట్ నుంచి రోజు సుమారు 300 మంది ,సెలవు రోజుల్లో వెయ్యి మందికి పైగా పర్యాటకులు పాపికొండల సందర్శనకు వచ్చేవారు. ఎలా వెళ్తారంటే.. ► భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నాక 75 కిలో మీటర్ల దూరంలోని పోచవరం బోట్ పాయింట్కు రోడ్డు మార్గం గుండా చేరుకుంటారు. అక్కడి నుంచి గోదావరి నదిలో బోట్లో ప్రయాణిస్తారు. ► తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహార యాత్రకు బయలుదేరతారు. ► రాజమమహేంద్రవరం నుంచి కూడా వాహనంలో పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మగండికి చేరుకుంటారు. భద్రతకు పెద్దపీట 2019లో జరిగిన కచ్చులూరు సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంది.. గోదావరి నీటి మట్టం ఆధారంగా బోటులు గోదావరిపై నడిపేందుకు అనుమతి ఇస్తోందిరు. పోలవరం ప్రాజెక్టు ఎర్త్డ్యామ్ వద్ద నీటి మట్టం 27 మీటర్లు ఉంటే బోట్లు తిరిగేందుకు అనుమతి లభిస్తుంది. అంతకు మించి నీటి మట్టం పెరిగే బోటులను నిలిపివేస్తారు. 23 పర్యాటక బోట్లుకు అనుమతి పాపికొండలు అందాలను చూపించేందుకు ప్రైవేట్ బోట్లుతో పాటు, ఏపీ టూరిజం బోట్లు కూడా నడుస్తాయి. కొద్ది రోజులు పాపికొండలు పర్యాటకం నిలిచిపోయిన తరువాత టూరిజం బోట్లు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. తాజా నిర్ణయంతో బోట్ల ఫిట్నేస్ పరిశీలించి టెక్నికల్ అధికారులు తొలివిడతగా నిబంధనలకు అనుగుణంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే 23 బోట్లకు అనుమతి లభించింది. పోచమ్మగండి బోట్పాయింట్ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్ పాయింట్ నుంచి 12 బోట్లకు అనుమతులు లభించించాయి. (చదవండి: రాజమండ్రి నుంచి టికెట్ ధర రూ.1,250) అనేక మందికి ఉపాధి ► పాపికొండల పర్యాటకంతో అనేక మంది ఉపాధి లభిస్తుంది. టికెట్ కౌంటర్లలో పనిచేసే వర్కర్లు,లాడ్జీల నిర్వహకులు,మార్గం మధ్యలోని కూనవరం ,వీఆర్పురం మండలాల్లోని హోటళ్లు, ఇతర వ్యాపారాలతో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. ► పోచవరం బోట్ పాయింట్ వద్ద వ్యాపారస్తులతో పాటు బోట్ల యజమానులు, గుమస్తాలు, బోట్ల వర్కర్లు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటో గ్రాఫర్లు, నృత్యకళాకారులకూ ఈ టూర్ ఉపాధిగా నిలుస్తోంది. ► పేరంటాలపల్లిలో వెదురు కళాకృతులు విక్రయించే కొండరెడ్డి గిరిజనులు,కొల్లూరు ఇసుక తెన్నెల్లో బొంగు చికెన్ విక్రయించే గిరిజనులతో పాటు ఐస్లు విక్రయించే వారు ఇలా సుమారులు ఐదు వేలమందికి పైగా దీనిపై ఆధారపడుతుంటారు. పోశమ్మ గండి బోట్ పాయింట్ పోశమ్మ గండి బోట్ పాయింట్ నుంచి టూరిజమ్ బోట్లు పాపికొండలు పర్యాటానికి బయలుదేరతాయి. బోట్లుల్లో అన్ని సురక్షిత ఏర్పాట్లు మధ్య పాపికొండకు బోటులను పంపండం జరుగుతుంది. బోట్ పాయింట్ వద్ద పర్యాటక సిబ్బంది ఉంటారు. –వీరనారాయణ, టూరిజం అధికారి, రాజమహేంద్రవరం -
పర్యాటకులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: పాపికొండలు బోటు విహార యాత్రను వచ్చే నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బోటు ఆపరేటర్లతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బోటు ఆపరేటర్లు తమ జీవనోపాధిపై మాత్రమే కాకుండా పర్యాటకుల భద్రతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధరను రూ.1,250 (రవాణా, భోజన వసతి)గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. భవిష్యత్లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ టూరిస్ట్ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. గత ఏడాది గోదావరిలో బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు. గోదావరి, కృష్ణా నదుల పర్యాటక బోటింగ్ ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోటు ఆపరేటర్లు మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి కూడా పాపికొండలుకు బోట్లును నడపాలని కోరారు. -
పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు
బెంగాల్ పులులున్నాయ్.. బంగారు బల్లులూ తిరుగుతున్నాయ్.. గిరి నాగులు చెట్టంత ఎత్తున తోకపై నిలబడి ఈలలేస్తున్నాయ్.. అలుగులు అలరారుతున్నాయ్.. కొమ్ము కత్తిరి పక్షులు కిలకిలరావాలు ఆలపిస్తున్నాయ్.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆరంజ్ ఓకలీఫ్ సీతాకోక చిలుకలు సందడి చేస్తున్నాయ్. ఇలాంటి ఎన్నో.. ఎన్నెన్నో అరుదైన జీవజాలానికి పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన పాపికొండలు అభయారణ్యం నిలయంగా నిలుస్తోంది. జాతీయ పార్కుకు వన్నె తెస్తోంది. బుట్టాయగూడెం: ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండలు అభయారణ్యం జీవ వైవిధ్యంతో అలరారుతోంది. పాపికొండలు అభయారణ్య ప్రాంతాన్ని 2008 నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతం మధ్య గలగల పారే గోదావరి నదికి ఇరువైపులా సుమారు 1,01,200 హెక్టార్ల పరిధిలో ఇది విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే రిజర్వు ఫారెస్ట్గా ఉండేది. జాతీయ పార్కుగా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడ జంతు జాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులున్నట్టు గుర్తించారు. వీటిలో 4 పెద్ద (బెంగాల్) పులులు, 6 చిరుత పులులు, 30 అలుగులు (పాంగోలిన్), 4 గిరి నాగులు (కింగ్ కోబ్రా) ఉన్నట్టు గణించారు. చదవండి: సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి అభయారణ్యంలో అరుదైన కొమ్ము కత్తిరి పక్షి జింకలు.. చుక్కల దుప్పులు ఇక్కడ ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, అడవి గొర్రెలు, ముళ్ల పందులు, అడవి కుక్కలు, కుందేళ్లు, ముంగిసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్టు వన్యప్రాణి విభాగం సర్వేల్లో తేలింది. వీటితో పాటు నెమలి, గద్ద, చిలకలు, పావురాలు, కోకిల, వడ్రంగి పిట్ట, గుడ్లగూబ, కొమ్ము కత్తిరి తదితర పక్షులూ ఉన్నాయి. అభయారణ్యంలో విలువైన వృక్ష సంపద ఎంతో ఉంది. ముఖ్యంగా వేగిస, మద్ది, బండారు, తబిస, సోమి, తాని, బెన్నంగి, గరుగుడు, గుంపెన, బిల్లుడు, తునికి, మారేడు తదితర వృక్ష సంపద ఉంది. ఇవిగాక విలువైన వెదురు వనాలు విరివిగా ఉన్నాయి. నేషనల్ విన్నర్ ‘ఆరంజ్ ఓకలీఫ్’ ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గత ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండలు నేషనల్ పార్క్లో ఉన్న మూడు రకాల సీతాకోక చిలుకలు పోటీ పడ్డాయి. ఫైనల్స్లో దేశవ్యాప్తంగా ఏడు రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా.. ఈ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఆరంజ్ ఓకలీఫ్ జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికైన ఆరెంజ్ ఓకలీఫ్ అభయారణ్యంలో అలుగులు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో అరుదైన వన్యప్రాణులైన అలుగులు (పాంగోలిన్లు) ఉన్నాయి. వీటి మూతి మొసలిని పోలి ఉంటుంది. వీటి జీవిత కాలం 20 సంవత్సరాలు. ఈ అరుదైన వన్యప్రాణులు ఇక్కడ 30కి పైగా ఉన్నట్టు గుర్తించారు. ట్రాప్ కెమెరాకు చిక్కిన ఎలుగుబంటి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా అభయారణ్య పరిధిలోని పశ్చిమ అటవీ ప్రాంతంలో అనేక సర్ప జాతులు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది కింగ్ కోబ్రా (గిరి నాగు). దట్టమైన అడవిలో గల జలతారు వాగు ప్రాంతంలో సుమారు 30 అడుగుల గిరినాగు తిరుగుతున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. పగటిపూట చెట్లపై మాత్రమే ఉండే గిరి నాగులు రాత్రివేళ తోకపై నిటారుగా చెట్టు మాదిరిగా నిలబడి ఈల వేసినట్టుగా శబ్దాలు చేస్తుంటాయని గిరిజనులు చెబుతుంటారు. చదవండి: Raksha Bandhan: ఆవుపేడతో అందమైన రాఖీలు -
అడవి 'పులి'కిస్తోంది
సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: పెరుగుతున్న పులి గాండ్రిపులతో అడవి పులకిస్తోంది. జీవ వైవిధ్యం పరిమళిస్తోంది. నడకలో రాజసం.. వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వెరసి పెద్ద పులులు ఊపిరి తీసుకుంటూ సంతానాన్ని పెంచుకుంటున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ వాటి కదలికలు మెరుగుపడ్డాయి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,900 పులులు మాత్రమే మిగిలి ఉండగా.. మన దేశంలో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని 80 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయి. వాటి సంఖ్య మన రాష్ట్రంలో క్రమంగా పెరుగుతుండటం విశేషం. నల్లమలలో రెట్టింపైన వ్యాఘ్రాలు మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశంలోనే అతి పెద్దది. ప్రస్తుతం ఇక్కడ 63 పులులను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించారు. దీనిని బట్టి వీటి సంఖ్య 80 వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2014లో కేవలం 40 పులులు మాత్రమే ఉండగా.. ఏడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకు పులులు విస్తరించాయి. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు భద్రాచలం వరకు విస్తరించి ఉన్న పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ పులుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతంలో నాలుగు పులులు, ఐదు చిరుత పులులను అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు పెరగడంతో.. కేంద్ర ప్రభుత్వం 1973 నుంచి ‘ప్రాజెక్ట్ టైగర్’ పేరుతో వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టింది. ఫలితంగానే దేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న పులులకు మన రాష్ట్రంలోని పాపికొండల అభయారణ్యం ఆవాసంగా మారింది. అభయారణ్యం పరిధిలోని ఉభయ గోదావరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలో 1,012.86 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 1,01,200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని అభయారణ్యంగా 2008లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మరోవైపు వన్యప్రాణుల సంరక్షణపై అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలోని గోగులపూడి, పోలవరం మండలం టేకూరు ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. అభయారణ్యం సంరక్షణ, జంతువుల జాడ కోసం ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవగాహన పెంచుకోవాలి పులుల సంరక్షణ అందరి బాధ్యత. పర్యావరణానికి అవి ఎంతో మేలు చేస్తాయి. వాటిపై అవగాహన పెంచుకుని పరిరక్షణకు నడుం బిగించాలి. మన రాష్ట్రంలో పులుల సంఖ్య బాగా పెరుగుతోంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వాటికి బాగా అనుకూలంగా ఉంది. అందుకే పులుల ఆవాసాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. – రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) పులులను రక్షించాలి పర్యావరణ పిరమిడ్లో అగ్రసూచిగా ఉండేది పెద్ద పులి. ఆ తర్వాత చిరుత పులులు వంటి టాప్ కార్నివోర్స్ జీవ వైవిధ్యాన్ని కాపాడే గురుతర బాధ్యతతో ఉంటాయి. వాటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం. వన్య ప్రాణులు కనిపిస్తే అటవీ శాఖ దృష్టికి తీసుకు రావాలి. పులులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – సి.సెల్వమ్, వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, రాజమండ్రి ట్రాప్ కెమెరాల్లో పులుల జాడ పాపికొండల అభయారణ్యంలో పులుల సంచారం బాగుంది. మేం గ్రామాల్లో పర్యటించిన సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు పులుల గాండ్రింపులు విన్నట్టు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. గత నెల, ఈ నెలలో చిరుత పులులు, ఇతర జంతువుల జాడ కెమెరాకు చిక్కింది. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, పాపికొండలు వైల్డ్లైఫ్ మేనేజ్మెంట్ అధికారి -
పాపికొండలు పర్యాటకానికి పచ్చజెండా
బుట్టాయగూడెం: గోదావరి నదికి ఇరువైపులా కొండల మధ్య పచ్చదనం పరుచుకున్న ప్రకృతి కాంత కనువిందు చేస్తోంది. పర్యాటకులకు మధురానుభూతినిచ్చే పాపికొండలు బోటు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి గత నెలలోనే బోటు ప్రయాణాలను ప్రారంభించేలా అధికారులు ఏప్రిల్ 15న బోటు ట్రయల్ రన్ నిర్వహించారు. కోవిడ్ రెండో దశ విజృంభించడంతో బోటు ప్రయాణాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పడుతుండటంతో జూన్ నెలాఖరు నుంచి బోటు సర్వీసులు నడిపేందుకు పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పడితే.. కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం తర్వాత సుమారు 19 నెలల పాటు ఆగిపోయిన బోటు సర్వీసులు తిరిగి మొదలవుతాయి. ప్రయాణం ఇక భద్రం కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. బోటు ప్రయాణాలు భద్రంగా సాగేలా పోలవరం మండలం సింగన్నపల్లి, వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ఒక్కొక్క కంట్రోల్ రూమ్కు రూ.22 లక్షల నిధులను కేటాయించారు. బోటు ప్రయాణాలను పర్యవేక్షించేలా పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన సిబ్బందిని నియమించింది. ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు సమకూర్చడంతో పాటు ప్రయాణ అనుకూల పరిస్థితి, బోటు కండిషన్ తదితర అంశాలను వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసింది. గోదావరి నదిపై ప్రయాణించే బోట్లకు విధిగా సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకుంది. బోటు ప్రయాణించే లొకేషన్ను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకునేలా జీపీఎస్ అమర్చే ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లు చేస్తున్నాం కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నెలాఖరుకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా బోటు సర్వీసులను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. – ఏఎల్ మల్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ టూరిజం -
19 నెలల తర్వాత తెరచుకోనున్న ‘పాపికొండలు’
పోలవరం: ఘోర ప్రమాదం జరిగిన 19 నెలల తర్వాత పాపికొండలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. ఆ ప్రమాదం అనంతరం పాపికొండల పర్యటన ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా తిరిగి పాపికొండల సందర్శనకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో త్వరలోనే పాపికొండలు సందర్శించేందుకు ప్రయాణికులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. పాపికొండలను వీక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి పేరంటాలపల్లి వరకూ ఏపీ పర్యాటక శాఖ బోటులో ట్రయల్ రన్ నిర్వహించారు. పర్యాటక, పోలీస్, సాగునీటి, రెవెన్యూ అధికారులు ట్రయల్ రన్ను పర్యవేక్షించారు. కచ్చులూరు బోటు ప్రమాదంతో పాపికొండల విహారయాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. దాదాపు 19 నెలల తర్వాత పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ప్రయాణికుల భద్రతే పరమావధిగా విహార యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ట్రయల్ రన్పై నివేదికను ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని, త్వరలో టూరిజం మంత్రి అనుమతితో పాపికొండలు విహార యాత్ర ప్రారంభమవుతుంది అని ఏపీ టూరిజం జనరల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో ఇప్పట్లో సందర్శకులను అనుమతించే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. -
పాపికొండల పర్యాటకానికి గ్రీన్ సిగ్నల్
వీఆర్పురం: అలలతో సయ్యాటలాడుతూ.. ఆ తుంపర్లలో హాయిగా తడుస్తూ.. రివ్వున తాకే చల్లని గాలులలకు సేద తీరుతూ.. ఆనందంగా కేరింతలు కొడుతూ.. తల్లి గోదావరి ఒడిలో ప్రయాణించే రోజులు మళ్లీ వచ్చేశాయి. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న పాపికొండల పర్యాటకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరో రెండు రోజుల్లోనే ఇది ప్రారంభం కానుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర కిందట దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో దాదాపు 50 మంది జలసమాధి అయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘోర ప్రమాదం అనంతరం పాపికొండల పర్యాటకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. గోదావరిలో అన్ని మోటార్ బోట్లనూ నిషేధించింది. పర్యాటకుల ప్రాణాలకు భద్రతనిచ్చే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకున్న తరువాతే నదీ పర్యాటకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించింది. గోదావరిలో రాజమహేంద్రవరం నుంచి 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు నడిచేవి. అలాగే భద్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు రాకపోకలు సాగించేవి. కాకినాడ పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఇప్పటి వరకూ ఒక్క ప్రైవేటు లగ్జరీ బోటుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన హరిత ఏసీ లగ్జరీ బోటుకు మాత్రం పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చింది. ఈ బోటుతోనే పాపికొండల పర్యాటకం ఈ నెల 15 నుంచి పునఃప్రారంభం కానుంది. మొత్తంమీద అనేక జాగ్రత్తల నడుమ పాపికొండల పర్యాటకాన్ని తిరిగి ప్రారంభిస్తుండడంపై అటు పర్యాటకులు, ఇటు ఈ పర్యాటకంపై ఆధారపడిన కుటుంబాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా పర్యాటకులు ఏజెన్సీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ సుమారు 40 కిలోమీటర్ల పొడవున గోదావరికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండల అందాలను, ఇక్కడి అటవీ ప్రాంతాన్ని, కొండల నడుమ వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరి సోయగాన్ని బోట్లలో ప్రయాణిస్తూ వీక్షించేందుకు ఏటా దేశవ్యాప్తంగా వేలాదిగా పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలివచ్చేవారు. ఫలితంగా పాపికొండల పర్యాటకం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. దీంతో ఇక్కడి గ్రామాల్లో నివసించే కొండరెడ్డి గిరిజన ప్రజలతో పాటు సమీప గ్రామాల గిరిజనేతరులకు కూడా ఇది ఉపాధి మార్గంగా మారింది. వీఆర్పురం మండలం పోచవరం బోట్ పాయింట్ నుంచి రోజు సుమారు 300 మంది, సెలవు రోజుల్లో వెయ్యి మందికి పైగా పర్యాటకులు పాపికొండల సందర్శనకు వచ్చేవారు. వీరు 15 నుంచి 20 బోట్లలో పాపికొండలు వెళ్లేవారు. పర్యాటకం నిలిచిపోయే సమయానికి బోటుకు పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.400 చొప్పున టిక్కెట్టు ఉండేది. ఏసీ బోట్లకు మరో రూ.100 అదనంగా వసూలు చేసేవారు. టిక్కెట్టు చార్జీలోనే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా కలిపి ఉండేవి. భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు, పర్యాటకులు 75 కిలోమీటర్ల దూరంలోని పోచవరం బోట్ పాయింట్కు రోడ్డు మార్గంలో చేరుకొనేవారు. అక్కడి నుంచి గోదావరి నదిలో బోట్ ద్వారా పాపికొండల సందర్శనకు వెళ్లేవారు. అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా వైపు పేరంటపల్లిలో ఎత్తయిన కొండల నడుమ, గలగల పారే సెలయేటిని ఆనుకుని ఉన్న పురాతన శివాలయాన్ని దర్శించుకుని భక్తిపరవశులయ్యేవారు. అనంతరం తిరుగుపయనమయ్యేవారు. వేల కుటుంబాలకు ఉపాధి పాపికొండల పర్యాటకంపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. భద్రాచలంలో పర్యాటకులను తరలించే మినీ వ్యాన్ల డ్రైవర్లు మొదలుకొని అక్కడి టిక్కెట్టు కౌంటర్లలో పని చేసే వర్కర్లు, లాడ్జీల నిర్వాహకులు, మార్గం మధ్యలోని కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని హోటళ్లు, ఇతర వ్యాపారాలు చేసేవారు పాపికొండలు పర్యాటకులపై ఆధారపడి జీవించేవారు. అలాగే పోచవరం బోట్ పాయింట్ వద్ద వ్యాపారులు, బోట్ల యజమానులు, గుమస్తాలు, బోట్ల వర్కర్లు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, బోట్లలో పర్యాటకులకు వినోదాన్ని పంచే డ్యాన్సర్లు, పేరంటపల్లిలో వెదురు కళాకృతులు విక్రయించే కొండరెడ్డి గిరిజనులు, కొల్లూరు ఇసుక తిన్నెల్లో బొంగు చికెన్ విక్రయించే గిరిజనులతో పాటు ఐస్లు విక్రయించే వారు ఇలా సుమారు 5 వేల మందికి పైగా ప్రజలు ఈ పర్యాటకాన్ని నమ్ముకొని జీవనం సాగించేవారు. ఇన్నాళ్లుగా పాపికొండల విహార యాత్రలు నిలిచిపోవడంతో వారందరి జీవనానికి బ్రేకులు పడ్డాయి. పాపికొండల పర్యాటకం పూర్వ వైభవం సంతరించుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. లాంచీకి కాపలా కాస్తున్నా అసలు నేను లాంచీ డ్రైవర్ను. పాపికొండలకు బోట్లు నిలిచిపోవడంతో బోట్లలో సిబ్బందిని కుదించారు. గతిలేక నేను నడిపిన లాంచీకి ఇప్పుడు కాపలాదారుగా ఉంటున్నాను. పాపికొండల పర్యాటకం మళ్లీ ప్రారంభం కాబోతోందంటే ఆనందంగా ఉంది. – పి.సూర్యనారాయణ, లాంచీ డ్రైవర్ ఆశలు చిగురిస్తున్నాయి పర్యాటకంపై ఆధారపడి ఎంతోమంది గిరిజన, గిరిజనేతర కుటుంబాలు ఉపాధి పొందేవి. పర్యాటకం నిలిచిపోవడంతో పూట గడవని స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని మాలాంటి కొండరెడ్డి కుటుంబాల వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వెదురు కళాకృతులు విక్రయించి జీవనం సాగించేవారు. ఇప్పుడు చేద్దామంటే పని దొరకక పూట గడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మాలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. – కోపాల రాంబాబురెడ్డి, వెదురు కళాకృతుల విక్రయదారు, పేరంటపల్లి ఆశగా ఎదురుచూస్తున్నాం బోట్లో గుమస్తాలుగా చేసే మాలాంటి ఎంతో మందికి బోట్ యూనియన్ నుంచి నెలవారీ జీతాలు వచ్చేవి. పర్యాటకం నిలిచిపోవడంతో ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంకొన్ని రోజులకైనా పర్యాటకం మొదలవుతుందని, వేరే పనికి వెళ్లకుండా ఆశగా ఎదురు చూస్తున్నాం. – నందికొండ నరసింహరావు, బోట్ గుమస్తా పర్యాటకం ప్రారంభమైతేనే.. పర్యాటకం నిలిచిపోవడంతో కనీసం బోట్లలో పని చేసే వర్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. పర్యాటకం ప్రారంభమైతేనే ఈ గండం నుంచి గట్టెక్కగలుగుతాం. పోచవరం బోట్ పాయింట్ వద్ద పర్యాటక బోట్లను పోర్ట్ అధికారులు పలుమార్లు తనిఖీ చేశారు. కొన్ని బోట్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల మంజూరుకు సిఫారసు కూడా చేశారు. త్వరలోనే పర్యాటకం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం. – మామిడి వెంకటరమణ, బోట్ యజమాని చదవండి: చంద్రబాబు సభ: ఆ రాయి ఎలా వచ్చింది? మందుబాబులు నాకే ఓటు వేయాలి -
ఇక తనివి తీరా... పాపికొండల అందాల వీక్షణ
రాజమహేంద్రవరం సిటీ: దాదాపు పద్దెనిమిది నెలల విరామం అనంతరం గోదావరి నది పాపికొండల అందాలను వీక్షించే అవకాశం లభించనుండడంతో పర్యాటక ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 2019 సెప్టెంబర్ 15న తూర్పు గోదావరిజిల్లా కచ్చులూరు వద్ద ఘోర లాంచీ ప్రమాదం చోటు చేసుకుని ప్రాణనష్టం సంభవించడంతో.. గోదావరి నదిలో తిరిగే అన్ని రకాల మోటార్ బోట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే పర్యాటక ప్రేమికుల కోరిక మేరకు పాపికొండల అందాలను వీక్షించే భాగ్యాన్ని కల్పిస్తూ.. ఇటీవల ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏసీ లగ్జరీ బోటు నడపనున్నారు. కాగా, రాజమహేంద్ర వరానికి చెందిన 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు గతంలో నడిచేవి. అలాగే భధ్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు పర్యాటకులను పాపికొండల విహారానికి తీసుకొచ్చేవి. అయితే కచ్చులూరు ప్రమాద ఘటన జరిగిన వెంటనే గోదావరిలో నడిచే అన్ని రకాల బోట్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని కాకినాడ పోర్ట్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తగిన ప్రమాణాలు పాటించిన ఏసీ లగ్జరీ బోట్లను మాత్రమే.. అదికూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన అనంతరమే విహారానికి అనుమతించాలని సూచించింది. అయితే పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేటు లగ్జరీ బోట్లు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒక్కదానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తాజాగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరిత ఏసీ లగ్జరీ బోటుకు పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. దీంతో 18 నెలల విరామం అనంతరం పటిష్టమైన ప్రణాళిక, రక్షణ చర్యల మధ్య పాపికొండల విహారానికి పర్యాటక అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి పాపికొండల విహారానికి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలోని సింగన్నపల్లి రేవు నుంచి లగ్జరీ బోటు నడిపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని టూరిజం శాఖ అధికారి టి.వీరనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.750 చార్జీగా నిర్ణయించాలని యోచిస్తున్నామన్నారు. కేవలం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాత్రమే ఒక బోటు నడుస్తుందని, ప్రైవేట్ ఆపరేటర్ల బోట్లకు ఇంకా అనుమతులు మంజూరు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఏపీటీడీసీ’ వెబ్సైట్లోకెళ్లి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. -
అందాల పోటీలో ఆంధ్రా సీతాకోకచిలుకలు
బుట్టాయగూడెం: జాతీయ స్థాయి ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేయడానికి జరుగుతోన్న ఫైనల్ పోటీలో మొత్తం 7 రకాలు ఎంపిక కాగా, వాటిలో పాపికొండల అభయారణ్యంలో ఉండే మూడు రకాల సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి. 2021 సంవత్సరానికి కొనసాగుతోన్న ఈ పోటీలో పశ్చిమగోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలోని కామన్ జేజేబెల్, కామన్ నవాబ్, ఆరెంజ్ ఓకలీఫ్ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేసేందుకు ఆన్లైన్ ఓటింగ్ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 8 వరకూ ఆన్లైన్ ఓటింగ్లో ఎవరైనా పాల్గొనవచ్చని వైల్డ్లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సి.సెల్వమ్ తెలిపారు. ► పాపికొండల అభయారణ్యంలో సుమారు 130 రకాల రంగురంగుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. ముఖ్యంగా కొలనులు, చెరువులు, వాగుల సమీపాల్లో రకరకాల సీతాకోకచిలుకలు గుంపులుగా ఏర్పడి అలికిడైన సమయంలో ఒక్కసారిగా ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి. ► ఇక్కడున్న వాటిల్లో తుది జాబితాకు ఎంపికైనవి అరుదైన రకాలని వైల్డ్లైఫ్ శాస్త్రవేత్త కె.బాలాజీ తెలిపారు. దాదాపు 9 నెలలపాటు కష్టపడి ఫోటోలు సేకరించి పోటీల్లో వాటిని పెట్టినట్లు చెప్పారు. ఇక్కడి సీతాకోకచిలుక జాతీయ స్థాయిలో ఎంపికైతే ఈ ప్రాంతానికి మరింత పేరు వస్తుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. ► ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత జాతీయ సీతాకోకచిలుకను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటిస్తారని వైల్డ్లైఫ్ అధికారులు తెలిపారు. -
బోట్ వెలికితీతతో బయటపడ్డ మృతదేహాలు
-
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు
సాక్షి, రాజమండ్రి: రాయల్ వశిష్ట బోటు ప్రమాద బాధితుల కోసం హెల్ప్ డెస్క్ఏర్పాటు చేశారు. పోలీసులు...బాధిత కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో బంధువులకు సమాచారం ఇచ్చారు. బాధితులకు సమాచారం అందించడంతో వారంతా తమవారిని గుర్తించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ తల్లిదండ్రుల ఆవేదన నిలువరించడం ఎవరి తరం కావడం లేదు. అలాగే నల్గొండకు చెందిన రవీందర్రెడ్డి తల్లిదండ్రులు కూడా మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆరు మృతదేహాలను వారి బంధువులు గుర్తించారు. కాగా 41వ రోజుల అనంతరం మునిగిపోయిన బోటును ఎట్టకేలకు గోదావరి నుంచి బయటకు తీశారు. బోటు వెలికితీసిన అనంతరం అందులో 8 మృతదేహాలు దొరికాయి. ఆ మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మార్చరీలో భద్రపరిచారు. మృతేహాలు బోటులోని ఓ గదిలో ఉండిపోవడంతో గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. అయితే వరంగల్కు చెందిన కొమ్ముల రవి ఆధార్ కార్డు లభించడంతో మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. వరంగల్ కు చెందిన బస్కే ధర్మరాజును గుర్తించారు. అలాగే రాయలు వశిష్ట బోటు డ్రైవర్లు పోతా బత్తుల సత్యనారాయణ, సంగాడి నూకరాజు, నల్గొండకు చెందిన సురభి రవీందర్, బోట్ హెల్పర్ పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ మృతదేహాలను కూడా కుటుంబీకులు గుర్తుపట్టారు. పోస్ట్మార్టం అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాలను అప్పగిస్తారు. సెప్టెంబర్ 15న కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బోటులో 77మంది ఉన్నారు. వారిలో 26మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడగా, 46మంది మృతి చెందారు. మరో అయిదుగురు గల్లంతు అయ్యారు. మరోవైపు ఇంకా లభించాల్సిన అయిదు మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారు. ధర్మాడి సత్యం బృందం తిరుగు పయనం ఆపరేషన్ రాయల్ వశిష్టను పూర్తి చేసుకుని ధర్మాడి సత్యం బృందం తిరుగుపయనం అయింది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితులు ఉన్నా...తీవ్రంగా శ్రమించి బోటును ఒడ్డుకు చేర్చామన్నారు. గతంలో చాలా బోట్లు వెలికి తీశామని, అయితే రాయల్ వశిష్ట బోటు వెలికితీయడం చాలా కష్టంతో కూడుకుందని అన్నారు. ప్రవాహంతో ఉన్న నదిలో నుండి బోటును ఒడ్డుకు తీయడం మాటలు కాదని, రెండు గంటల్లో మునిగిపోయిన బోటునుఒడ్డుకు తీసేస్తానని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ చెప్పిన మాటలకు మీడియా విస్తృత ప్రచారం కల్పించడం విచారకరమన్నారు. అతని వద్ద ఓ తాడు లేదు... సిబ్బంది లేరని ధర్మాడి సత్యం పేర్కొన్నారు. లాంచీలోనే పడుకుని ఉదయం ఆరు గంటలకు లేచి, సాయంత్రం వరకూ బోటు వెలికితీతకు శ్రమించినట్లు చెప్పారు. -
కచ్చులూరు బయల్దేరిన బాలాజీ మెరైన్స్..
సాక్షి, కాకినాడ: రెండు వారాల క్రిందట గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు ఆదివారం నుండి ఆపరేషన్ ప్రారంభమైంది. కాకినాడ నుండి కచ్చులూరుకు సరంజామా తీసుకుని బాలాజీ మెరైన్ సంస్ధ బయలు దేరింది. మూడు రోజుల్లో బోటును వెలికి తీస్తామని బాలజీ మెరైన్ యాజమాని ధర్మాడి సత్యం తెలిపాడు. గత పది రోజులుగా కచ్చులూరులో గోదావరి ఒరవడిపై అవగాహన వచ్చిందన్న అతడు....బోటుకి యాంకర్ తగిలించి తాళ్ల సాయంతో జేసీబీతో లాగుతామని, 25మంది బృందంతో ఆపరేషన్ చేపడుతున్నట్లు సత్యం పేర్కొన్నాడు. కాగా రాయల్ వశిష్ట పున్నమి బోటు, గల్లంతు అయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో దేవీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి యథావిధిగా బోటులో బయల్దేరి ప్రమాద స్థలం వద్ద గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77మంది ఉండగా 26 మంది సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఇప్పటివరకూ బోటు ప్రమాదానికి సంబంధించి 38 మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన 13మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. -
బోటు ప్రమాదం; మృతుల కుటుంబాలకు బీమా
సాక్షి, రాజమహేంద్రవరం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన లాంచీని వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ హష్మి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 77 మంది ప్రయాణించారని తెలిపారు. 26 మంది సురక్షితంగా బయటకు వచ్చారని, 36 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. మరో 15 మృతదేహల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. లైఫ్ జాకెట్స్ వేసుకున్నారా లేదా తనిఖీలు చేసిన తరువాతే బోటు ప్రయాణానికి అనుమతిచ్చారని వెల్లడించారు. సహాయక చర్యలు ముగిసే వరకు దేవీపట్నంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిహారంతో దీనికి సంబంధం లేదన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మృతుల బంధువులు నేరుగా ఇక్కడకు వచ్చి సంబంధిత పత్రాలు సమర్పించి బీమా డబ్బు పొందవచ్చన్నారు. న్సూరెన్స్ కంపెనీ సిబ్బంది, పోలీసు సిబ్బంది సహకరిస్తారని ఎస్పీ తెలిపారు. బీమాకు సంబంధించిన సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించవచ్చు ♦ రజనీకుమార్ సిఐ: 9440796395 ♦ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ప్రకాష్: 9700001818 ♦ ల్యాండ్ లైన్ నెంబరు: 08854 254073 ఇన్సూరెన్స్ కోసం సమర్పించాల్సిన పత్రాలు ♦ ఎఫ్ఐఆర్ కాపీ ♦ మరణ ధ్రువీకరణ పత్రం ♦ పోస్ట్మార్టమ్ నివేదిక ♦ బ్యాంకు ఖాతా వివరాలు ♦ వారసుల సర్టిఫికెట్ -
లైఫ్ జాకెట్లు తీసేయడం వల్లే ప్రాణగండం
‘సాక్షి’ ప్రతినిధి బృందం, రాజమహేంద్రవరం/ఐ.పోలవరం(రంపచోడవరం): గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటులో టూరిస్టులు లైఫ్ జాకెట్లు తీసేయడం వల్లే భారీగా ప్రాణ నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరగడానికి ముందు బోటులో ఉన్న వారంతా లైఫ్జాకెట్లు వేసుకున్న ఫొటోను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 15న బోటు పోశమ్మగండి వద్ద బయలుదేరి దేవీపట్నం పోలీసు స్టేషన్ దాటి ముందుకు వెళ్లిపోయింది. బోటు వెళ్లిపోతున్న విషయాన్ని గుర్తించి అక్కడి ఎస్ఐ నాగదుర్గాప్రసాద్ వెనక్కు తీసుకొచ్చి తనిఖీ చేశారు. ఆ సమయంలో బోటులో ఉన్న ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా లైఫ్జాకెట్లు ధరించే ఉన్నారు. బోటుకు అనుమతి ఉందని బోటు పర్యవేక్షకుడు ఉత్తర్వులు చూపించడంతో మిగిలిన వారు లైఫ్ జాకెట్లు వేసుకోవాలని చెప్పి ఎస్ఐ స్టేషన్కు వచ్చేశారు. తనిఖీ పూర్తయిన అరగంటలోనే బోటు కచ్చులూరు మందం వద్దకు వెళ్లేసరికి సుడిగుండంలో మునిగిపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. తనిఖీ అనంతరం టూరిస్టుల్లో సగం మందికి పైగానే లైఫ్జాకెట్లు తీసేశారని ప్రమాదం నుంచి బయటపడ్డ వారు ఆరోజే చెప్పారు. బోటులో డ్యాన్స్ ప్రోగ్రాంను ఆస్వాదించేందుకు లైఫ్ జాకెట్లు తీసేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 15 మంది ఆచూకీ కోసం గాలింపు బోటు ప్రమాదం జరిగిన కచ్చులూరు మందం సమీపంలో ఆదివారం మరో మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ బోటులో మొత్తం 77 మంది ప్రయాణించినట్టు అధికారులు నిర్ధారించారు. వీరిలో 26 మంది బయటపడగా, గత వారం రోజుల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 36 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా మరో 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. పోలవరం మండలం ఎదుర్లంక వద్ద ఆదివారం గోదావరిలో లభ్యమైన మరో పురుషుని మృతదేహాన్ని పోలీసులు బోటు ప్రమాదానికి సంబంధించినదై ఉంటుందనే అనుమానంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మృతదేహంపై వెంట్రుకలన్నీ పూర్తిగా ఊడిపోయాయి. శరీరంపై డ్రాయర్ మాత్రమే ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో గుర్తించలేని 2 మృతదేహాలున్నాయి. బోటు వెలికితీత ప్రక్రియ నిలిచిపోయిందంటూ పలు పత్రికల్లో (సాక్షి కాదు) వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్రెడ్డి స్పష్టం చేశారు. హర్షకుమార్కు నోటీసు మాజీ ఎంపీ హర్షకుమార్కు రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ శనివారం నోటీసు జారీ చేశారు. బోటు ప్రమాదానికి సంబంధించి మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే వాటితో రంపచోడవరం వచ్చి అందజేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
బోటు ప్రమాదంపై కిషన్రెడ్డి సమీక్ష
సాక్షి, తూర్పు గోదావరి: కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విపత్తు నివారణ కమిటీతో సమావేశమయ్యారు. ఆదివారం రాజమండ్రిలో ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తుఫాన్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయని, ముందుగా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ బోట్లయినా సరే నిబంధనలు కచ్చితంగా పాటించేలా కఠినమైన చట్టాలు అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రమాదానికి గురైన బోటును గుర్తించేందుకు నేవీ అధికారులను సంప్రదించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లిన తరువాత నిపుణులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో త్వరలోనే ఒక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. కచ్చులూరు వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి బోటు బయటకు తీసే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఏం సహాయం కావాలన్నా అందించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించి బోటును బయటకు తీయడానికి ప్రయత్నిస్తాన్నారు. బోటు ప్రమాదానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని అధికారులను కిషన్రెడ్డి ఆదేశించారు. -
బోటు యజమాని.. జనసేనాని!
సాక్షి, విశాఖ సిటీ: గోదావరి నదిలో కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణపై గతంలోనూ అనేక కేసులున్న విషయం వెలుగుచూసింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ తొలి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేవాడు. ముఖ్యంగా స్వగ్రామంలో భూ దందాలకు సంబంధించి 2009 నుంచి 2017 వరకు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సరిపల్లి గ్రామంలో సర్వేనం. 148/15లో 400 గజాల స్థలంపై తప్పుడు పత్రాలు సృష్టించి ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తులకు అమ్మిన ఘటనపై పెందుర్తి పోలీస్స్టేషన్లో 308/2017 చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. అలాగే 238/2009లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో కొట్లాట కేసు నమోదు కాగా 2013 మే నెలలో కోర్టులో రాజీ పడ్డారు. గ్రామంలో సర్వే నెంబర్ 267లోని ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నారన్న ఆరోపణలపై 117/2011లో పెందుర్తి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా మరో కేసులో ఇదే పోలీస్స్టేషన్లో 147/2019 ద్వారా వెంకటరమణతో పాటు మరి కొందరిపై బైండోవర్ నమోదుచేశారు. నిబంధనలంటే లెక్కలేదు.. 2012 నుంచి రాజమండ్రిలో బోటు ద్వారా జలరవాణా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వెంకటరమణ కొద్దిరోజులకే కుటుంబంతో సహా అక్కడికి మకాం మార్చాడు. గోదావరి నదిలో కేవీఆర్ ట్రావెల్స్ పేరుతో రెండు లాంచీలు నడుపుతున్నాడు. అయితే రెండింటికీ ప్రభుత్వ శాఖల తరపున ఎలాంటి అనుమతులూ లేవు. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో అంటకాగడంతో వెంకటరమణ వ్యాపారానికి అడ్డే లేకుండా పోయింది. కాగా గత ఎన్నికల్లో జనసేన క్రియాశీల సభ్యుడిగా వెంకటరమణ ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. రాజమండ్రితో పాటు సొంత ప్రాంతం విశాఖలో కూడా జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సంబంధిత కథనాలు : నిండు గోదారిలో మృత్యు ఘోష 30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత కన్నీరు మున్నీరు అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే కృష్ణా నదిలో బోట్లు నడిపితే కఠిన చర్యలు -
సుడులతో పోరాడి ప్రాణాలను పట్టుకొచ్చారు!
అంతటి గోదావరి సుడిలో దిగితే ఏటికి ఎదురీదినట్టే! అక్కడి లోతు 300 అడుగుల పైనే ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంతటి గజ ఈతగాడికైనా ప్రాణాలు నీట కలిసిపోతాయి. కానీ ఆ గిరిజనులు గోదావరి సుడిని, లోతును చూసుకోలేదు. కళ్లెదుట మునిగిపోతోన్న బోటు, అందులో ఆర్తనాదాలు చేస్తోన్న పర్యాటకులు మాత్రమే వారికి కనిపించారు. ఆ క్షణాన వారికి వేరే ఏమీ గుర్తుకు రాలేదు. అందరిదీ ఒకటే లక్ష్యం. బోటులో మునిగిపోతున్న వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడం. అనుకున్నదే తడువుగా కచ్చులూరు గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు మూడు బోట్లలో ఒక్క ఉదుటున గోదావరి వడిని లెక్క చేయకుండా ముందుకు కదిలారు. మునిగిపోతున్న రాయల్ వశిష్ట పున్నమి బోటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే నదిలో పడిపోయి కొట్టుకుపోతోన్న వారిని ఒడిసి పట్టుకుని బోట్లలో వేసుకుని ఒడ్డుకు చేర్చారు. ఒక్కో బోటులో ఆరుగురు వంతున మూడు బోట్లలో వెళ్లిన పద్దెనిమిది మంది గిరిజనులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, చేతికి అందినవారిని అందినట్లుగా బయటకు తీసుకువచ్చారు. అలా మొత్తం 24 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. – సాక్షి ప్రతినిధి బృందం, దేవీపట్నం తెలిసినా తెగించాం కచ్చులూరు వద్ద గోదావరి ఒడ్డున ర్యాంపు ఉంది. బోటు ప్రమాదం జరిగే సమయంలో సుమారు ముప్ఫై మందిమి ఒడ్డున కూర్చొని ఉన్నాం. ఆ సమయంలో బోటు ఒక పక్కకు ఒరిగిపోవడం గమనించాం. చూస్తుండగానే కళ్లెదుటే బోటు మునిగిపోతోంది. మునిగిపోతున్న వారిని రక్షించాలని ప్రాణాలు లెక్కచెయ్యకుండా వెళ్లాం. ప్రమాదకరమని తెలిసినా వారి ప్రాణాలు కాపాడాలనే అనుకున్నాం. – నేసిక లక్ష్మణ్రావు కొందరినే రక్షించగలిగాం నదిలో తేలుతున్న వారు రక్షించాలంటూ కేకలు వేశారు. మా ప్రాణాలు ఫణంగా పెట్టయినా వారిని రక్షించాలని అనుకున్నాం. వెంటనే బోట్లు తీసుకుని ప్రమాద స్థలానికి వెళ్లాం. అయితే నీటిపై తేలుతున్న వారిని మాత్రమే రక్షించగలిగాం. బోటు గోదావరిలోకి మునిగిపోయినప్పుడు లైఫ్ జాకెట్లు వేసుకోని వాళ్లు నీటిలో మునిగిపోయారు. ఉన్నవారిని రక్షించలేకపోయాం. – కొణతల బాబూరావు ఉండలేక లోపలికి వెళ్లాం బోటు ప్రమాదం జరిగే సమయంలో గోదావరి సుడులు తిరుగుతోంది. ఆ సమయంలో గోదావరిలోకి వెళ్లడం చాలా ప్రమాదకరం. అయినప్పటికీ నదిలో కొట్టుకుపోతున్న వారిని రక్షించాలనే తపనతో లోపలికి వెళ్లాం. నదిపై తేలుతున్న వారిని కాపాడటానికి చాలా సాహసం చేశాం. – నెరం కృష్ణ చాలా కష్టపడాల్సి వచ్చింది వారు మాకేమీ రక్తసంబంధీకులు కారు. వారెక్కడి వారో అసలు తెలియనే తెలియదు. ఆ క్షణాన వారి ఆర్తనాదాలే మమ్మల్ని కదిలించాయి. బోటు ప్రమాదం జరిగిన పావుగంటలోనే గోదావరిలోకి బయలుదేరి వెళ్లాం. నది ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. అయినా ప్రాణాలకు తెగించాం. కొట్టుకుపోతున్న వారిని రక్షించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మేము వెళ్లిన బోటులో ఆరుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చాం. – నేసిక చినబాబు మనసుకు బాధేసింది మా గ్రామం గోదావరి నది ఒడ్డునే కావడంతో చిన్నప్పటి నుంచి గోదావరిలో ఈత కొట్టడం అలవాటు. ఈత రావడంతో బోటు ప్రమాదం జరిగిన వెంటనే బోటులో వెళ్లి గోదావరిలో కొట్టుకుపోతున్న వారిని రక్షించేందుకు నా వంతు ప్రయత్నించాను. కొందరైతే కళ్లెదుటే కొట్టుకుపోయారు. అప్పుడు మనసుకు బాధేసింది. కానీ ఏమీ చేయలేకపోయాను. నేను లైఫ్ జాకెట్లు వేసుకున్న ఇద్దర్ని మాత్రమే ఒడ్డుకు చేర్చాను. నాతో పాటు వచ్చిన వారు కూడా కొట్టుకుపోతున్న వారిని రక్షించడం చూసి మనసు కుదుటపడింది. – కానెం నాగార్జున కళ్ల ముందే ఒరిగిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది. అప్పుడే భోజనాలు చేసి ఎప్పటి మాదిరిగానే గోదావరి ఒడ్డుకు చేరి కబుర్లు చెప్పుకుంటున్నాం. పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా గోదావరిలో ఏదో బోటు వెళుతుండటం చూస్తున్నాం. ఇంతలోనే బోటులో హాహాకారాలు వినిపించాయి. అప్పటి వరకూ గ్రామంలో కార్యక్రమాల గురించి చెప్పుకుంటున్న మేమంతా ఒక్కసారిగా గోదావరి వెంట పరుగుపెట్టి మెకనైజ్డ్ బోట్లు తీసుకుని బయలుదేరాం. చూస్తుండగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి బోటు ఒక పక్కకు ఒరిగిపోయింది. వెంటనే మా వద్ద ఉన్న మూడు ఇంజిన్ బోట్లలో గోదావరిలోకి వెళ్లాం. లైఫ్ జాకెట్లు వేసుకుని పైకి తేలుతున్న వారందరినీ రక్షించి ఒడ్డుకు చేర్చాం. – కానెం రామస్వామి మరిచిపోలేని రోజు ఎన్నో ఏళ్లుగా ఆ నది గట్టున కూర్చుంటున్నాం. కానీ ఏనాడూ ఇటువంటి సంఘటన చూస్తామని, మా చేతులతో ఇంతమంది ప్రాణాలు కాపాడతామని అనుకోలేదు. కచ్చులూరు మందంలో బోటు ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఇక్కడ గోదావరి నది లోతు సుమారు మూడొందల అడుగులు ఉంటుంది. బోటు డ్రైవర్లు ఇక్కడకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంటారు. దురదృష్టవశాత్తూ బోటు ప్రమాదం జరిగింది. కొందరినైనా రక్షించగలిగాం. మా జీవితంలో మరిచిపోలేని రోజు అది. – నేసిక చినలక్ష్మణ్రావు మా ప్రాణాల కంటే ముఖ్యమనుకున్నాం బోటు ప్రమాదం జరిగిన తరువాత గోదావరి నదిలో మునిగిపోతున్న వారు రక్షించాలంటూ కేకలు వేశారు. ప్రమాద సమయంలో గోదావరిలో నీరు ఉద్ధృతంగా ఉంది. ప్రమాద స్థలంలో నీరు సుడులు తిరుగుతోంది. నదిలో కొట్టుకుపోతున్న వారిని కాపాడాలని తెగించి మూడు బోట్లు తీసుకుని నదిలోకి వెళ్లాం. కొంత మందిని రక్షించి ఒడ్డుకు చేర్చాం. నదిలో కొట్టుకుపోతున్న ఓ మహిళను చెయ్యి పట్టుకుని కాపాడి బోటులోకి చేర్చాను. – సంగాని శ్రీనివాస్ -
బోటును ఒడ్డుకు తీసుకురాలేం: కలెక్టర్
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన బోటును బయటకు తీసేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోందని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఇక గోదావరిలో మునిగిపోయిన లాంచీని బయటకు తీసేందుకు..రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గతంలో బలిమెల రిజర్వాయర్తో పాటు నాగార్జున సాగర్లో మునిగిపోయిన బోటును వెలికి తీసిన టీమ్ను ఇందుకోసం రప్పించారు. ముంబై నుంచి వచ్చిన నిపుణుల బృందం అదే పనిలో ఉన్నట్లు చెప్పారు. బరువు అధికంగా ఉండటంతో బోటును ఒడ్డుకు తీసుకు రాలేమని, ఏదైనా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో 700మంది సిబ్బంది పని చేస్తున్నారని, ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. ప్రమాదానికి గురైన ప్రైవేట్ పర్యాటక బోటు రాయల్ వశిష్ట పున్నమి-2 ఆచూకీ లభించింది. కచ్చులూరు మందం గ్రామం వద్ద గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. కాగా మునిగిపోయిన బోటులో మొత్తం 73మంది ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన రోజే బోటు నుంచి 26మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మరోవైపు లాంచీ ప్రమాద ఘటనలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, నేవీ బృందాలు గోదావరిని జల్లెడ పడుతున్నాయి. బుధవారం ఆరు మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. సహాయక చర్యలపై సీఎం జగన్ ఆరా రెస్క్యూ ఆపరేషన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నారని మంత్రి విశ్వరూప్ తెలిపారు. ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయని, గల్లంతు అయిన 13మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. గుర్తుపట్టలేని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించైనా సంబంధిత కుటుంబీకులకు అప్పగిస్తామని మంత్రి పేర్కొన్నారు. -
మూడవ రోజు 20 మృతదేహాలు లభ్యం
దేవీపట్నం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి బృందం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో మృతదేహాల వెలికితీత ఓ కొలిక్కి వస్తోంది. బోటును వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ కొనసాగిస్తోంది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తోంది. ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకోగా మూడో రోజు మంగళవారం గోదావరి పరివాహక ప్రాంతాల్లో 20 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొదటి రోజు ఆదివారం సాయంత్రానికే 8 మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. విశాఖపట్నం నావికాదళం, డైరెక్టరేట్ ఆఫ్ కాకినాడ పోర్టు సాంకేతిక సిబ్బంది కూడా గోదావరి పరివాహక ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. గల్లంతైన మరో 18 మంది ఎక్కడున్నారో? మునిగిపోయిన బోటులో మొత్తం 72 మంది ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన జరిగిన రోజే బోటు నుంచి 26 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మంగళవారం దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 14 మృతదేహాలు, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పరివాహక ప్రాంతంలో 3 మృతదేహాలు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటి, ఆత్రేయపురం పరిధిలోని ర్యాలీ బ్యారేజీ వద్ద ఒకటి, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందినవారు 11 మంది, తెలంగాణకు చెందినవారు 8 మంది ఉన్నారు. యానాం వద్ద లభించిన బాలిక మృతదేహం ఎవరిది అనేది గుర్తించాల్సి ఉంది. ఇప్పటిదాకా లభ్యమైన మృతదేహాల సంఖ్య 28కు చేరుకుంది. గల్లంతైన మరో 18 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. మృతదేహాలకు పోస్టుమార్టం.. బంధువులకు అప్పగింత బోటు ప్రమాదంలో మొదటి రోజు లభ్యమైన 8 మృతదేహాలకు ఇప్పటికే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం లభ్యమైన 20 మృతదేహాల్లో 18 మృతదేహాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మృతదేహాలు ఒకేసారి రావడంతో వారి బంధువులు ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం, స్వస్థలాలకు తరలించే ప్రక్రియను ఏమాత్రం జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రెవెన్యూ, పోలీసు శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాల పోస్టుమార్టం వేగంగా పూర్తి చేశారు. వెంటనే మృతదేహాలు వారి బంధువులకు అప్పగించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆస్పత్రి వద్దనే ఉండి అధికారులకు సహకరించారు. 214 అడుగుల లోతున బోటు ప్రమాదానికి గురైన ప్రైవేట్ పర్యాటక బోటు రాయల్ వశిష్ట పున్నమి–2 ఆచూకీ లభించింది. కచ్చులూరు మందం గ్రామం వద్ద గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. బోటు ఉన్న ప్రాంతం చుట్టూ గోదావరి నీటిపై వలయాకారాలతో కూడిన రంగుల రబ్బర్ ట్యూబులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. బోటు లోపలి పరిస్థితిని తెలుసుకునేందుకు ఉత్తరాఖండ్ నుంచి రప్పించిన ఆల్కార్ స్కానర్ కెమెరాను గోదావరి అడుగు వరకూ తీసుకెళ్లారు. కెమెరా చిత్రీకరించిన దృశ్యాలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందం ద్వారా ఉత్తరాఖండ్కు పంపించారు. మంగళవారం లభించిన మృతదేహాల వివరాలు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 1) వలవల రఘురామ్(39), నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా 2) గన్నాబత్తుల ఫణికుమార్(28), నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా 3) అబ్దుల్ సలీమ్(24), వీలేరు, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా 4) భూసాల పూర్ణ(11), గోపాలపురం, అనకాపల్లి మండలం, విశాఖ జిల్లా 5) బాచిరెడ్డి హాసికారెడ్డి(4), నంద్యాల, కర్నూలు(ప్రస్తుతం విశాఖపట్నం గాజువాక) 6) దుర్గం సుబ్రహ్మణ్యం(51), వేపనపల్లి గ్రామం, తిరుపతి, చిత్తూరు జిల్లా 7) మధుపాటి రమణబాబు(34), విశాఖపట్నం 8) బొండా పుష్ప(13), వేపగుంట, విశాఖ జిల్లా 9) మూల వీసాల వెంకట సీతారామరాజు(51), బాజీ జంక్షన్, విశాఖపట్నం 10) బాచిరెడ్డి స్వాతిరెడ్డి(32), నంద్యాల, కర్నూలు(ప్రస్తుతం విశాఖపట్నం గాజువాక) 11) భూసాల సుస్మిత(4), గోపాలపురం, విశాఖ జిల్లా 12) గుర్తు తెలియని బాలిక(యానాం వద్ద లభ్యం) తెలంగాణకు చెందిన వారు 1) గెడ్డమీద సునీల్(29), చినపెండ్యాల, జనగాం జిల్లా 2) వీరం సాయికుమార్(24), మాదాపూర్, హైదరాబాద్ 3) బసికి వెంకట్రామయ్య(65), ఖాజీపేట, వరంగల్ జిల్లా 4) గొర్రె రాజేంద్రప్రసాద్(55), కడిపికొండ, ఖాజీపేట మండలం, వరంగల్ జిల్లా 5) పాడి భరణికుమార్(25), హయత్నగర్, పోచయ్య బస్తీ, రంగారెడ్డి జిల్లా 6) పాసం తరుణ్కుమార్రెడ్డి(36), రామడుగు, నల్లగొండ జిల్లా 7) కోదండ విశాల్(23), హయత్నగర్, పోచయ్య బస్తీ, రంగారెడ్డి జిల్లా 8) లేపాకుల విష్ణుకుమార్(32), నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా మొదటి రోజు ఆదివారం ఆచూకీ లభించిన మృతులు 1) మందపాక కృష్ణకిశోర్(30) నులకపేట, తాడేపల్లి మండలం, గుంటూరు 2) తటారి అప్పల నరసమ్మ(45), ఆరిలోవా, విశాఖపట్నం 3) బొండా లక్ష్మి(35) వేపగుంట, విశాఖపట్నం 4) అంకెం శివజ్యోతి(48) స్వరూప్ నగర్, హైదరాబాద్ 5) దుర్గం హాసినీ(21), తిరుపతి 6) బసిక ఆవినాశ్(21) కడిసికోన, ఖాజీపేట 7) బసికి రాజేంద్ర(55) కడిసికోన, ఖాజీపేట 8) బొడ్డు లక్ష్మణ్(26) కర్రలమామాడి, మంచిర్యాల జిల్లా -
బోటు ప్రమాదం : 26 మృతదేహాలు లభ్యం
సాక్షి, దేవీపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంలో గల్లంతైన మృతదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 26 మృతదేహాలను సిబ్బంది వెలికితీసింది. వాటిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో 8, ధవలేశ్వరం వద్ద నాలుగు పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. లభించిన 26 మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో 23 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఏడు మృత దేహాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన మూడు మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. (చదవండి : మరో 14 మృతదేహాలు లభ్యం) మృతుల వివరాలు మూలవెంకట సీతారామరాజు(బాజీ జంక్షన్-విశాఖపట్నం), అబ్దుల్ సలీమ్ (బాపులపాడు మం. పీలేరు, కృష్ణా జిల్లా), బండ పుష్ప(విశాఖ, వేపకొండ), గన్నాబత్తుల బాపిరాజు(నరసాపురం, పశ్చిమగోదావరి), కుసాల పూర్ణ(గోపాలపురం, విశాఖ), మీసాల సుస్మిత(గోపాలపురం, విశాఖ), దుర్గం సుబ్రహ్మణ్యం(తిరుపతి), మధుపాడ రమణబాబు(మహారాణిపేట, విశాఖ), గడ్డమీద సునీల్( చినపెండ్యాల, జనగామ), బస్కి వెంకటయ్య(ఖాజీపేట, వరంగల్), పాశం తరుణ్కుమార్ రెడ్డి( రామడుగు, నల్లగొండ), వీరం సాయికుమార్(హైదరాబాద్), గొర్రె రాజేంద్రప్రసాద్(ఖాజీపేట, వరంగల్), రేపకూరి విష్ణు కుమార్ (నేలకొండపల్లి, ఖమ్మం), పాడి ధరణి కుమార్(హయత్నగర్, రంగారెడ్డి) -
గోదారి ఘటన:మరో 12 మృతదేహాలు లభ్యం
-
బోటు ప్రమాదం: జీవో అమలు చేసి ఉంటే
సాక్షి, అమరావతి : పడవ ప్రమాదాలు ఎన్ని జరిగినా, ఎందరి ప్రాణాలు నీటిలో కలిసినా గత సర్కారు కనీస జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద 2017 నవంబరులో కృష్ణా నదిలో బోటు బోల్తా పడిన సంఘటనలో 26 మంది మృత్యువాత పడ్డారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందునే ఈ ప్రమాదం జరిగిందని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. బోటు ఆపరేటింగ్ నిబంధనలను మార్చుతూ 2018 జూన్ 8న జీవోఎంఎస్ నంబరు 14 జారీ చేసింది. బోటు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలో సూచించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సులు, జీఓ అమలుపై గత ఏడాది ఆగస్టు 9వ తేదీన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమీక్షించారు. పలు ఫెర్రీల్లో స్థానికులు ఏమాత్రం సురక్షితం కాని బోట్లు నడుపుతున్నారని గుర్తించారు. లైఫ్ జాకెట్లు లాంటి రక్షణ సామగ్రి లేదని అభిప్రాయపడ్డారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదం ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడం కోసం బోట్లు నడిపే వారికి తగిన శిక్షణ, ఒకవేళ ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో తెలియజేసేలా ప్రయాణికులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఏమి చేయవచ్చో, ఏమి చేయరాదనే అంశాలపై అవగాహన కోసం ఫెర్రీ పాయింట్లలో బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా తీర్మానించారు. బోట్లలో ప్రయాణికుల సంఖ్యకు సరిపడా లైఫ్ జాకెట్లు కచ్చితంగా సిద్ధంగా ఉంచాలని, ఫెర్రీల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి : భద్రతా నియమాలకు అనుగుణంగా ఉన్న బోట్లను మాత్రమే అదీ రిజిస్ట్రేషన్ ఉన్న వాటినే అనుమతించాలని 2018 జూన్ 8న ఇచ్చిన జీవోలో స్పష్టంగా ఉంది. గోదావరి, కృష్ణా నదుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో భద్రత చర్యల నిమిత్తం బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, నిఘా, పటిష్ట రక్షణ చర్యల అమలు బాధ్యతను ఒకే నోడల్ ఏజెన్సీకి అప్పగించాలని కూడా జీవోలో ఉంది. అయితే గత ప్రభుత్వం వేటినీ పాటించలేదు. జీవో జారీ చేసి గాలికొదిలేసిందని మాత్రం స్పష్టమైంది. -
లాంచీ ప్రమాదంలో మరో కుటుంబం!
సాక్షి, విశాఖపట్నం : గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో విశాఖపట్నంకు చెందిన మరో కుటుంబం గల్లంతయినట్టు వెల్లడైంది. లాంచీ నిర్వాహకుల వద్ద లభించిన జాబితాలో ‘మహేశ్వరరెడ్డి (త్రీ ప్లస్ జీరో), హైదరాబాద్’ అనే ఉండేసరికి అంతా తెలంగాణకు చెందిన కుటుంబంగా భావించారు. అయితే.. విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు సోమవారం సాయంత్రం రాజేశ్వరమ్మ అనే మహిళ ఫోన్ చేయడంతో బోటు ప్రమాదంలో విశాఖకు చెందిన మరో కుటుంబం గల్లంతు అయ్యిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి (35) విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలోనున్న లూఫిన్ ఫార్మాలో పనిచేస్తున్నారు. స్వస్థలానికి వెళ్లేందుకు మహేశ్వరరెడ్డి, ఆయన భార్య స్వాతి (30), పిల్లలు విఖ్యాత్రెడ్డి (6), హన్సిక (4)ను వెళ్లారు. వారి కారులోనే విశాఖలోని బుచిరాజుపాలేనికి చెందిన ఎంవీ సీతారామరాజు (52) కూడా ఉన్నారు. వారంతా రాజమహేంద్రవరంలో ఆగి పాపికొండలకు వెళ్లడానికి లాంచీ ఎక్కారు. గోదావరిలో బోటు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని ఆందోళన చెందిన మహేశ్వరరెడ్డి సోదరి రాజేశ్వరమ్మ సోమవారం విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశారు. -
మరో 12 మృతదేహాలు లభ్యం
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో గల్లంతయిన మృతదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో 8, ధవలేశ్వరం వద్ద నాలుగు పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, నేవీ, విపత్తు నివారణ బృందాల గోదావరిని జల్లెడ పడుతున్నాయి. గాలింపు కోసం చత్తీస్గఢ్, గుజరాత్ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. ఇప్పటి వరకు లభించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలన్నీ బోట్కు దిగువన లేదా బోట్ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 22 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. కచ్చులూరు మందం వద్ద ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మరోవైపు ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో బోటును వెలికి తీయడానికి ఉపయోగించే క్రేన్లను అక్కడకు తరలించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బోట్ల సహాయంతోనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. కాగా లాంచీలోని మొత్తం 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటకురాగా 46 మంది గల్లంతయిన విషయం తెలిసిందే. -
అంతులేని విషాదం
-
ముమ్మరంగా గాలింపుచర్యలు
-
315 అడుగుల లోతులో బోటు
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: కచ్చులూరు మందం వద్ద ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మరోవైపు ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో బోటును వెలికి తీయడానికి ఉపయోగించే క్రేన్లను అక్కడకు తరలించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బోట్ల సహాయంతోనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగి 36 గంటలు కావస్తున్నా మొదట దొరికిన ఎనిమిది మినహా ఒక్క మృతదేహం కూడా బయట పడలేదు. మృతదేహాలన్నీ బోట్కు దిగువన లేదా బోట్ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ విశాఖ, మంగళగిరి ప్రాంతాల నుంచి 60 మంది, విశాఖ, కాకినాడ నుంచి 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఓఎన్జీసీ హెలికాప్టర్, 8 రకాల బోట్లు, 12 ఆస్కా లైట్లు, ఆ ప్రాంతాలకు చెందిన ఈతగాళ్లు గాలించినా ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. ప్రమాదానికి గురైన బోటు జాడను గుర్తించేందుకు గజ ఈతగాళ్లు, నేవీ డైవర్లు నీటి ప్రవాహంలోనే వెతుకుతున్నారు. వారు కూడా కేవలం 60 అడుగులు లోతు వరకే వెళ్లగలుగుతారు. ఈ పరిస్థితుల్లో 315 అడుగుల లోతులో బోటు ఎక్కడ ఉందనేది గుర్తించడం కష్టమేనంటున్నారు. బోటును గుర్తించేందుకు ‘సైడ్ స్కాన్ సోనార్’: నేవీకి చెందిన డీప్ డైవర్స్తో కూడిన బృందం తోపాటు ఉత్తరాఖండ్కు చెందిన నిపుణుల బృందం కూడా చేరుకుంది. వీరి వద్ద ఉన్న ‘సైడ్ స్కాన్ సోనార్’ ద్వారా బోటు కచ్చితంగా ఎక్కడ ఉందనేది గుర్తిస్తారు. తర్వాత బోటును బయటకు తీసే అవకాశాల్ని పరిశీలిస్తారు. ధవళేశ్వరం వద్ద 175 గేట్లు మూసివేత ఉభయ గోదావరి జిల్లాల్లోని సరిహద్దుల వెంబడి గాలింపు చర్యలు రాత్రి వేళ కూడా కొనసాగుతున్నాయి. మృతదేహాలు ఎగువ నుంచి నదిలో కొట్టుకు రావచ్చన్న సమాచారంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను పూర్తిగా కిందకు దించేసి బలమైన నైలాన్ వలలను ఏర్పాటు చేశారు. అక్కడ లైటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. -
ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ
బోటు ప్రమాద స్థలి నుంచి సాక్షి బృందం: గోదావరిలో ప్రైవేట్ బోటు మునిగిన ఘటనలో గల్లంతైన వారి కోసం వారి బంధువులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఓ వైపు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరో వైపు బోటులో ప్రయాణించిన వారి బంధువులు ఘటన స్థలికి చేరుకుని తమ వారితో మాట్లాడిన చివరి మాటలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. వెళ్లొస్తానని.. ఇలా వెళ్లావా తల్లీ.. ‘కోరుకున్న ఉద్యోగం సాధించావు.. మొదటి జీతాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెట్టావు.. నిమజ్జనం రోజు బంధువులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపావు. స్నేహితులతో పాపికొండలు చూసొస్తా నాన్నా అంటే.. నా కూతురు సంతోషంగా గడపాలని పంపిస్తే.. ఆచూకీ కూడా తెలియని యాత్రకు పోతావని కలలో కూడా అనుకోలేదు కదా తల్లీ..’ అని బోటు ప్రమాదంలో గల్లంతైన ఇంజనీర్ రమ్య తండ్రి సుదర్శన్ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తన కుమార్తె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రమాద స్థలానికి వచ్చిన ఆ తండ్రి ఒక్కసారిగా ఉద్వేగానికి గురై కుప్పకూలిపోయాడు. చివరకు బంధువులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరుకు చెందిన కారుకూరి రమ్య (24) బోటు ప్రమాదంలో గల్లంతయింది. తండ్రి సుదర్శన్ విద్యుత్తు సబ్స్టేషన్లో ఆపరేటర్ కావడంతో ఆదే శాఖలో ఆమె ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనుకుంది. కష్టపడి చదివి ఇటీవల విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించింది. ఇటీవల గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే కనపడకుండా పోవడంతో వారి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రమ్య ఆచూకీ కోసం వచ్చిన ఆమె మామయ్య రామచంద్రయ్య ఈ విషయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నేనొక్కడినే బయటపడ్డా.. తాలిబ్ పటేల్, సాయికుమార్, నేను స్నేహితులం. పాపికొండల అందాలను తిలకించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చాం. ఆదివారం బోటులో ఎక్కాం. మధ్యాహ్నం భోజనం చేద్దామని బోటు కింది అంతస్తుకు చేరుకున్నాం. ఒక్కసారిగా బోటు తిరగబడింది. ఉన్నట్టుండి బోటు డ్రైవర్ గోదావరిలో దూకేశాడు, అతని వెనుకనే నేనూ దూకేశా. మా వాళ్లు లోపల ఉండిపోయారు. గిరిజనులు పడవలు వేసుకొచ్చి నన్ను ఒడ్డుకు చేర్చి కాపాడారు. మా వాళ్లు ఎక్కడున్నారో? తెలియడం లేదు. – తాలిబ్ మజర్ఖాన్ జీవితంలో స్థిరపడ్డాడనుకున్నాం.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. ఇంకేముందిలే జీవితంలో స్థిరపడ్డాడనుకున్నాం.. ఆదివారం కదా.. అని పాపికొండల అందాలను చూసేందుకు మా అన్న కుమారుడు విష్ణుకుమార్ వచ్చాడు. ప్రమాద విషయం తెలిసి నేను ఇక్కడకు వచ్చాను. ఏ వైపు నుంచి అయినా వస్తాడేమోనని ఎదురు చూస్తున్నా. – వేపాకులు నాగేశ్వరరావు,నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా చివరి నిమిషం వరకూ సహాయక చర్యలు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి వచ్చే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తాం. ఘటన స్థలాన్ని పరిశీలించాం. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ కమిషనర్ అనురాధ తొలుత బోటు బయటికి తీస్తే అందులో ఎంత మంది ఉన్నారు? అనే అంశంపై స్పష్టత వస్తుంది. బోటు 300 అడుగుల కంటే లోతులో ఉండటంతో బయటకు తీయడం శ్రమతో కూడుకున్న పని. ఇందుకోసం మరో రెండు, మూడు రోజులు పట్టొచ్చు. అప్పుడే మరికొందరి ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. గోదావరి ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రమాద ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించాల్సి ఉండటం కష్టంగా ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు.. సమన్వయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నేవీ హెలికాఫ్టర్లు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ప్రత్యేక బందాన్ని రంగంలోకి దింపాం. – అనురాధ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ -
బోటు ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ
-
బోటు ప్రమాదానికి ముందు..
-
గోదారి నా కొడుకును మింగేసింది
సాక్షి, గన్నవరం (కృష్ణా జిల్లా): ‘పిల్లల చిన్నతనంలోనే వారి తండ్రి మరణించాడు.. ఇద్దరు కొడుకులను కష్టపడి చదివించా.. పెద్దకొడుకు ప్రయోజకుడై చేతి పని నేర్చుకొని కుటుంబాన్ని ఆదుకుంటున్న సమయంలో గోదావరి నా కొడుకును మింగేసింది’ అంటూ బోరున విలపిస్తుంది బోటు ప్రమాదంలో గల్లంతైన అబ్దుల్ సలీమ్ తల్లి గౌసియా బేగం. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరుకు చెందిన అబ్దుల్ సలీమ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఇంతవరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా సలీమ్ తల్లి గౌసియా మాట్లాడుతూ.. ‘నా కొడుకు ఇప్పటికే ఎన్నో పర్యాటక ప్రదేశాలు తిరిగాడు. పాపి కొండలు చూడాలనే కోరికతో తన స్నేహితులతో కలిసి బయలు దేరాడు. హనుమాన్ జంక్షన్ నుంచి ఐదుగురు స్నేహితులతో కలిసి పాపికొండలు చూడ్డానికి వెళ్లిన అబ్దుల్ సలీమ్ నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో గల్లంతైనాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సలీమ్ మేనమామ, పెద్దనాన్న సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇంతవరకు నా బిడ్డ ఆచూకీ తెలయలేదు’ అంటూ సలీమ్ తల్లి గౌసియా కన్నీరుమున్నీరుగా విలపించింది. ‘మా అన్నకు చిన్నప్పటి నుంచి ప్రకృతి అందాలు చూడాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే స్నేహితులతో కలిసి ఎన్నో ప్రదేశాల్లో తిరిగాడు. ఇప్పుడు పాపి కొండలు చూడ్డానికి వెళ్లి గల్లంతైనాడు. గోదావరి పర్యటన అంటే మా అమ్మ ఒప్పుకోదని.. రాజమండ్రిలో స్నేహితుడి పెళ్లి అని చెప్పి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు’ అంటూ సలీమ్ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశాడు -
27 మంది బయటపడ్డారు: ఏపీఎస్డీఎమ్ఏ
సాక్షి, అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపిన కచ్చలూరు బోటు ప్రమాద ఘటన ప్రస్తుత పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ప్రకృతి విపత్తుల నివారణ శాఖ(ఏపీఎస్డీఎమ్ఏ)పత్రికా ప్రకటన విడుదల చేసింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద పడవ ప్రమాదానికి గురైన సమయంలో... అందులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపింది. ఈ ఘటనలో 27 మంది సురక్షితంగా బయటపడగా... గల్లంతైన మరో 24 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇక ఇప్పటివరకు తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించింది. ఈ మేరకు దేవీపట్నం తహసీల్దార్, ఐటీడీఏ ఏపీవో నుంచి వివరాలు అందినట్లు తెలిపింది. అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆరు ఫైర్ టీమ్లతో పాటు, ఎనిమిది ఐఆర్ బోట్లు, 13 ఆస్కా లైట్లు, ఒక సాటిలైట్ ఫోన్ ఆధారంగా గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఏపీఎస్డీఎమ్ఏ పేర్కొంది. ఈ బృందాలతో పాటు 2 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపడుతున్నాయని వెల్లడించింది. అదే విధంగా గజ ఈతగాళ్ల బృందం, నావికా దళ అధికారులు కూడా రక్షణ చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపింది. గల్లంతైన వారి ఆచూకీని త్వరగా కనిపెట్టేందుకు ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక సైడ్ స్కానర్ ఎక్విప్మెంట్ను తీసుకువచ్చామని, దీంతో పాటు ఉత్తరాఖండ్ నుంచి ఆరుగురితో కూడిన నిపుణుల బృందం కూడా కచ్చలూరుకు చేరుకుందని పేర్కొంది. ఇక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 27 మందిలో 16 మందికి రంపచోడవరంలోని ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స జరిగిందని..అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని రాజమండ్రి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఏపీఎస్డీఎమ్ఏ తెలిపింది. వెలికితీసిన తొమ్మిది మృతదేహాలకు రాజమండ్రి ఆస్పత్రిలో వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించినట్లు వెల్లడించింది. -
బోటు నిర్వాహకుడిపై కేసు నమోదు
సాక్షి, దేవీపట్నం : నిబంధనలకు విరుద్ధంగా బోటు నడిపి.. ప్రమాదానికి కారణమైన ప్రయివేటు టూరిజానికి చెందిన రాయల్ వశిష్ట పున్నమి బోటు నిర్వాహకుడు కోడిగుడ్ల వెంకటరమణపై దేవీపట్నం పోలీస్స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. నిబంధనలు పాటించకుండా బోటు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని విశాఖపట్నానికి చెందిన వెంకటరమణపై దేవీపట్నం తహసీల్దార్ మహబూబ్అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. రంపచోడవరం సీఐ వెంకటేశ్వరరావు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిబంధల ప్రకారం బోటులో 60 మంది పర్యటకులతో పాటు 5 మంది సిబ్బంది ప్రయాణించాల్సి ఉండగా.. 71 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. బోటు తరిఖీ జరిగే దేవీపట్నం పోలీస్స్టేషన్ వద్దకు రాగానే పర్యటకులు అందరూ లైఫ్జాకెట్లు ధరించి ఉన్నారు. స్టేషన్ దాటాక వాటిని తీసేశారు. ఇక్కడే సిబ్బంది పర్యాటకులను కట్టడిచేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని నిర్థారించారు. సంబంధిత కథనాలు : నిండు గోదారిలో మృత్యు ఘోష ముమ్మరంగా సహాయక చర్యలు 30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి -
బోటు ప్రమాదానికి 5 నిమిషాల ముందు..
సాక్షి, దేవీపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మృత దేహాలను వెలికితీశారు. బోటు 315 అడుగుల లోతుకు మునిగిపోయినట్లుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే ప్రమాదానికి 5 నిమిషాల ముందు పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా తీసుకున్న వీడియో ఒకటి ఇప్పడు బయటకు వచ్చింది. ప్రమాదాన్ని ఊహించని వారంతా సరదాగా డాన్స్ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. అంతలోనే బోటు ఒక్కసారిగా కుదుపునకు గురై మునిగిపోయింది. క్షణాల్లో ఊహించని పరిణామం ఎదురై వారి ఆనంద క్షణాలను నీటిలో కలిపేశాయి. -
విహారం.. విషాదం
సాక్షి, మంచిర్యాల (హాజీపూర్): విహారయాత్ర తీవ్ర విషాదం నింపింది. విద్యుత్శాఖలో జరిగిన సమావేశానికి వరంగల్కు వెళ్లిన జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఇంజనీర్లు అటు నుంచి అటే స్నేహితులతో కలిసి పశ్చిమగోదావరి జిల్లాలోని పాపికొండల యాత్రకు వెళ్లారు. అక్కడ పడవ మునిగిపోవడంతో వీరూ గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూర్ గ్రామానికి చెందిన విద్యుత్ ఉద్యోగి కారుకూరి సుదర్శన్–భూమక్క దంపతుల కుమార్తె రమ్య, కర్ణమామిడి గ్రామానికి చెందిన బొడ్డు రామయ్య–శాంతమ్మ కుమారుడు లక్ష్మణ్ ఇటీవల విద్యుత్శాఖలో సబ్ æఇంజినీర్లుగా ఉద్యోగాలు సాధించారు. ఆదివారం వరంగల్లో ఇతర స్నేహితులతో కలిసి పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనలో విహార యాత్ర సాగిస్తున్న పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. చదువులో ఆదర్శం రమ్య నంనూర్ గ్రామానికి చెందిన కారుకూరి రమ్య తండ్రి సుదర్శన్ పాతమంచిర్యాల సబ్స్టేషన్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చదువులో చిన్ననాటి నుంచి రాణిస్తూ తోటి స్నేహితులకు చదువులో సహకరిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండేది. తండ్రి విద్యుత్శాఖలో ఉద్యోగం చేస్తుండటంతో తానూ విద్యుత్ శాఖలోనే కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కొత్తగా విద్యుత్శాఖలో జరిగిన నియామకాల్లో ఉద్యోగం సాధించిన రమ్య కుమురంభీం జిల్లాలో సబ్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ తనదైన ముద్రతో ముందుకెళ్తున్న రమ్య నెలరోజుల్లోనే తగిన గుర్తింపు సాధించింది. మొదటి నెల వేతనం కూడా అందుకుంది. దీంతో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాతగా వినాయక విగ్రహాన్ని అందజేసి వినాయక పూజల్లో పాల్గొనడమే కాకుండా నిమజ్జన ఉత్సవంలో పాల్గొని స్థానికులతో కలిసి ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడింది. రమ్యకు ఒక సోదరుడు రఘు ఉన్నాడు. బీటెక్ పూర్తి చేసిన రఘు ఢిల్లీలో సివిల్స్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇరవై మూడేళ్ల తన సోదరి రమ్య గల్లంతు సమాచారంతో రఘు హుటాహుటినా బయలుదేరాడు. కష్టపడి ఉద్యోగం సాధించి... హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మణ్ తండ్రి రామయ్య సింగరేణి ఉద్యోగి కాగా పదేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లి శంకమ్మతోపాటు మొత్తంగా ముగ్గురు సంతానం కాగా పెద్ద సోదరుడు తిరుపతి సింగరేణిలో ఉద్యోగం చేస్తుండగా ఇద్దరు కవలలు ఉన్నారు. కవలలు అయిన రామ్–లక్ష్మణ్లలో రామ్ ప్రభుత్వ ఉద్యోగి కాగా ఇరవై ఆరేళ్ల లక్ష్మణ్ ఇటీవల విద్యుత్శాఖలో సబ్ ఇంజినీర్గా ఉద్యోగం సాధించి నిర్మల్ జిల్లా భైంసాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. లక్ష్మణ్ మృతదేహం ఆచూకీ లభ్యం బొడ్డు లక్ష్మణ్(26) మృతదేహం ఆచూకీ లభించింది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని గోదావరి తీరంలో గజ ఈతగాళ్ల గాలింపు చర్యలో భాగంగా ఈయన దేహం లభించినట్లు తెలుస్తోంది. క్షేమంగా వస్తాడు అనుకున్న గ్రామస్తులు, సభ్యులకు లక్ష్మణ్ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకోగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామాల్లో విషాదచాయలు నంనూర్ గ్రామానికి చెందిన రమ్య, కర్ణమామిడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ పడవ ప్రమాదంలో గల్లంతు కావడంతో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. రాత్రి వరకు గల్లంతైన ఇరువురి ఆచూకీ లభించకపోవడంతో గ్రామాల్లో వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. గల్లంతైన ఇరువురు ప్రాణాలతో బయటపడాలని గ్రామాల్లో పూజలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పడవ మునక సమాచారం తెలిసిన వెంటనే భద్రాచలం బయలుదేరి వెళ్లారు. గ్రామాల్లో బంధువులు, స్నేహితులు కంట్రోల్రూంకు పదేపదే ఫోన్ చేస్తూ వారి ఆచూకీ గురించి తెలుసుకుంటున్నారు. -
సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే
-
నేనెవరికోసం బతకాలి ?
-
రెస్క్యూ ఆపరేషన్ను పూర్తి స్థాయిలో చేపట్టాం
-
కచ్చులూరుకు బయలు దేరిన సీఎం జగన్
-
బోటు ప్రమాదం: గోదావరికి భారీగా వరద ఉధృతి
సాక్షి, తూర్పుగోదావరి : బోటు ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న క్రమంలో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో సహాయ బృందాలకు తీవ్ర ఆటంకం ఏర్పడి, బోటు వెలికితీతకు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 8 మృతదేహాలను వెలికి తీసి ఆరు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అయితే ఇంకా 38 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా 315 అడుగుల లోతులో మునిగిపోయిన బోటును ఎన్డీఆర్ఎఫ్ గుర్తించింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టగా, వరద ఉధృతి పెరగడంతో మంగళవారం కొనసాగించనున్నారు. ఈ ఘటననపై కొనసాగుతున్న సహాయక చర్యలపై సీఎం జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లైంతైన వారిలో అధికశాతం లాంచీలోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కంట్రోల్ రూమ్ల ఏర్పాటుకు సీఎం జగన్ ఆదేశం: కన్నబాబు గతంలో జరిగిన తప్పిదాలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. దీనికి తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, వీటి ఏర్పాటులో పోలీస్, ఇరిగేషన్, టూరిజం విభాగాలు భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. కచులూరు సమీపంలో జరిగిన బోటు ప్రమాదంపై మంత్రి కురసాల కన్నబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనపై చలించిపోయిన సీఎం జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి, సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. బోటు నిర్వహణపై జీవో ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం.. బాధ్యులను గుర్తించలేదని కన్నబాబు మండిపడ్డారు. బోట్లకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలో ఇరిగేషన్ అధికారులు గుర్తించాలని, ప్రతి నెల ఫిట్నెస్ తనిఖీలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పర్యాటక బోట్ల స్థితిగుతలపై సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ ఘటన అనంతరం ఆదివారం నుంచి రాష్ట్రంలో లాంచీల అనుమతులు రద్దు చేస్తున్నట్లు, ఫిట్నెస్ అనుమతులు తీసుకున్నాకే వాటిని అనుమతించనున్నట్లు మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. బోటు నిర్వాహకుడు వెంకటరమణపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదమే కారణం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో జరిగిన బోటు దుర్ఘటనపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవేటు బోట్లపై ప్రభుత్వానికి ఆజమాయిషీ లేకుండా టీడీపీ ప్రభుత్వం జీవో ఎలా జారీ చేసిందని ప్రశ్నించారు. ప్రమాదానికి నూరు శాతం గత ప్రభుత్వ తప్పిదమే అని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం తప్పుడు జీవో ఇవ్వడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని, ఈ పాపమంతా గత ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరించిందని, అన్ని శాఖల అధికారులు బాగా పనిచేశారని మంత్రి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా 33మందిని గుర్తించాల్సి ఉంది: పిల్లి సుభాష్ చంద్రబోస్ కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైనవారిలో ఇంకా 33 మందిని గుర్తించాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన సీఎం జగన్..ఇక మీదట ప్రతినెల బోటు ఫిట్నెస్ చేయాలని ఆదేశించారన్నారు. భవిష్యత్తులో జరిగే ప్రమాదాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. 2017 నవంబర్ 16న టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో లోపభూయిష్టంగా ఉందని పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. గత ప్రభుత్వం ఫిట్నెస్ పోర్ట్ట్రస్ట్కు ఇచ్చి, బోటు అనుమతులు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించలేదని పిల్లి చంద్రబోస్ మండిపడ్డారు. బోటు ప్రమాదంపై సీఎం జగన్ సీరియస్ బోటు ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. గల్లంతైన వివరాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై రాజమండ్రి సబ్ కలెక్డర్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. లాంచీ ప్రమాద ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ఏం చర్యలు తీసుకున్నారని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. లాంచీ ప్రమాదం ఎలా జరిగిందని, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. గోదావరి నది లోపల 300 అడుగుల లోతులో లాంచీ మునిగిందని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. మునిగిన లాంచీని వెంటనే వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ప్రకృతి విపత్తుల నివారణ శాఖ పేర్కొంది. బోటు ప్రమాద ఘటనపై ప్రభుత్వానికి ప్రకృతి విపత్తుల నివారణ శాఖ అధికారులు నివేదిక అందించారు. ఇప్పటి వరకు 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని, మిగిలినవారి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని తెలిపారు. ‘బోటులో 60 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఇప్పటి వరకు 9 మృతదేహాలు దొరికాయి. 24 మంది గల్లంతయ్యారు. 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. గల్లంతైనవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 6 ఫైర్ టీంలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. శాటిలైట్ ఫోన్, 12 ఆస్కాలైట్లు, 8 బోట్లను ఉపయోగిస్తున్నాం. రెండు ఎన్డీఆర్ఎప్ బృందాలు, మూడు రాష్ట్ర బృందాలు పని చేస్తున్నాయి. ఇండియన్ నేవీ నుంచి ఒక డీప్ డైవర్స్ బృందం పని చేస్తోంది. రెండు నేవీ హెలికాప్టర్లు, ఒక ఓఎన్జీసీ ఛాపర్ను వాడుతున్నాం’ అని ప్రకృతి విపత్తుల నివారణ శాఖ పెర్కొంది. బాధితులకు సీఎం జగన్ పరామర్శ బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఒక్కొక్క బాధితుడి దగ్గరకు స్వయంగా వెళ్లి ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, తదితరులు ఉన్నారు. 315 అడుగుల లోతులో లాంచీ గోదావరిలో మునిగిన బోటును ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కనుగొంది. లాంచీ 315 అడుగుల లోతుకు మునిగిపోయినట్లుగా గుర్తించారు. ఎక్కువ లోతు, ప్రవాహం ఉధృతంగా ఉండడంతో లాంచీ వెలికి తీసేందుకు ఎక్కువ సమయం పడుతుందని ఎన్డీఆర్ఎఫ్ బృందం తెలిపింది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది లాంచీలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. సీఎం జగన్ ఏరియల్ సర్వే బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. మరో నాలుగు మృతదేహాలు వెలికితీత ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మరో నాలుగు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12 కి చేరింది. తాజాగా వెలికి తీసిన మృతదేహాల్లో నెలల వయస్సున్న చిన్నారి కూడా ఉండటం పలువురిని కలిచివేస్తోంది. గల్లంతైన మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బోట్లతో విస్రృతంగా గాలిస్తున్నారు. సహాయక చర్యలను సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాల తరలింపుకు అంబులెన్స్ల ఏర్పాటు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద అంబులెన్స్లను ఏర్పాటు చేశామని మంత్రి కన్నాబాబు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి బోటు ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘గోదావరిలో దేవీపట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకర ఘటన. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలు రూపొందించి అమలు చేయాలి’అని పేర్కొన్నారు. కచ్చులూరుకు సీఎం జగన్ అమరావతి: సోమవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి బయలుదేరారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శిస్తారు.సీఎం జగన్ వెంట మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, సుచరిత ఉన్నారు. ధవళేశ్వరం వద్ద కుండపోత వర్షం ధవళేశ్వరం వద్ద గేట్లు మూసివేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మత్స్యకారులు బోట్లతో గోదావరిలో గాలింపు జరుపుతున్నారు. లాంచీ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తుల ఆచూకీ కోసం కాటన్ బ్రిడ్జి వద్ద వలల వేయించారు. మరోవైపు ధవళేశ్వరం వద్ద కుండ పోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాద ప్రాంతాన్ని టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులపల్లి ధనలక్ష్మీ, వైఎస్సార్సీపీ నేత ఉదయ భాస్కర్ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ను పూర్తి స్థాయిలో చేపట్టామని మంత్రి అవంతి తెలిపారు. ముమ్మరంగా సహాయక చర్యలు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే 8 ఈఆర్ బృందాలు, 12 ప్రత్యేక గజ ఈతగాళ్ల బృందాలు, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక నావీ చాప్టర్, ఓఎన్జీసీ చాప్టర్ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. సంబంధిత కథనాలు నిండు గోదారిలో మృత్యు ఘోష ముమ్మరంగా సహాయక చర్యలు 30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి -
సుడిగుండాల వల్లే లాంచీ ప్రమాదం..?
-
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండల వద్ద జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల్లో తెలంగాణవాసులు ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పడవ ప్రమాదంపై గవర్నర్ విచారం సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిలో పడవ ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాగర్–శ్రీశైలం బోటు టూరు రద్దు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో నాగార్జున సాగర్–శ్రీశైలం మధ్య నిర్వహించే బోటు టూర్ ను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో నీటి ప్రవాహ వేగం పెరగటంతో శని,ఆదివారాల్లో నిర్వహించే బోటు టూర్ను రద్దు చేసుకుంది. -
గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం
సాక్షి నెట్వర్క్: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపాన గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదం మన రాష్ట్రంలోని పలు కుటుంబాల్లో విషాదం నింపింది. హైదరాబాద్తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు విహారయాత్రకు వెళ్లి ఈ ప్రమాదం బారిన పడ్డారు. గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికంగా ఉన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు హైదరాబాద్కు చెందిన 21 మంది గల్లంతు కాగా, తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన 9 మంది గల్లంతైనట్టు సమాచారం. కడిపికొండ గ్రామానికి చెందిన 14 మంది విహారయాత్రకు వెళ్లగా.. వీరిలో ఐదుగురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ బోడుప్పల్ శ్రీనివాసకాలనీ రైల్వే మాజీ ఉద్యోగి జానకిరామారావు భార్య జ్యోతి నీటమునిగి కన్నుమూయడంతో ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. అలాగే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువ ఇంజనీర్లు రమ్య (23), లక్ష్మణ్ (26) గల్లంతైనట్టు సమాచారం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రేపాకుల విష్ణుకుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆచూకీ లభ్యం కాలేదు. తాలీబ్ పటేల్ డబ్బుల్లేక.... బతికిపోయా! మాదంతా వాకింగ్ టీమ్. వాకింగ్ చేసే క్రమంలోనే ఆహ్లాదంగా గడిపేందుకు పాపికొండలు వెళ్లాలని టూర్ వేశాం. అయితే, అందరూ వెళ్లే సమయానికి నాకు డబ్బులు అందలేదు. దీంతో నేను మా స్నేహితులతో కలసి వెళ్లలేకపోయాను. అయితే, అక్కడి ప్రమాదం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. –బస్కే శంకర్, కడిపికొండ చూస్తుండగానే మునిగిపోయింది.. పాపికొండలు చూసేందుకు కడిపికొండ నుంచి ఆనందంగా బయలుదేరాం. ఆదివారం ఉదయం బోట్ ఎక్కగానే లైఫ్ జాకెట్లు ఇచ్చారు. చూస్తుండగానే గోదావరి నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. బోటు ఒక్కసారిగా ఒకవైపు ఒరిగి మునిగిపోయింది. లైఫ్ జాకెట్స్ ఉండటంతో బయటపడ్డాం. మా స్నేహితులు మాత్రం కళ్లెదుటే మునిగిపోయారు. –ఆరెపల్లి యాదగిరి, ప్రమాదం నుంచి బయపడిన వ్యక్తి పవన్కుమార్, వసుంధర - రామారావు,శివ జ్యోతి దంపతులు అంకుల్.. మా డాడీ రేపు వస్తాడా.. అంకుల్ మా డాడీ రేపు వస్తాడా అంటూ బస్కే రాజేంద్ర ప్రసాద్ కుమారుడు కృపాకర్ అందరినీ అడుగుతుండటం కంటతడి పెట్టించింది. అరుణోదయ కంప్యూటర్ సెంటర్లో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్కు భార్య, కుమార్తె, కుమారుడున్నారు. గ్రామానికి వెళ్లిన పలువురితో కృపాకర్ మాట్లాడుతూ.. ‘మా నాన్న ఆదివారం ఉదయం కాల్ చేశాడు. పాపికొండలకు వెళ్తున్నా అక్కడ సిగ్నల్స్ ఉండవు.. మళ్లీ ఫోన్ చేస్తా అన్నాడు.. ఇప్పుడు అందరూ ఇంటికి వస్తున్నారు.. ఏమైంది?’ అంటూ ఆ బాలుడు అమాయకంగా అడుగుతుండటం అందరినీ కన్నీళ్లు పెట్టించింది. –కృపాకర్, గొర్రె రాజేంద్రప్రసాద్ కుమారుడు భరణి కుమార్, సుశీల్ కుమార్ మాతో మాట్లాడందే ఉండలేడు.. ’విహారయాత్ర చాలా బాగా సాగుతోంది.. రేపు ఇంటికి వస్తాను.’ అని మా ఆయన శనివారం రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. నాతో పాటు బిడ్డా, కొడుకుతో రోజూ మాట్లాడనిదే ఉండలేడు. పెయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నా భర్తకు ఏమీ కావొద్దని దేవుడిని వేడుకుంటున్నా. –రేణుక, బస్కే ధర్మరాజు భార్య -
గతంలో ఉదయ్ భాస్కర్, ఝాన్సీరాణి కూడా..
సాక్షి, దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద రాయల్ వశిష్ట బోటు మునక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదం జరగటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 1960లో ఉదయ్ భాస్కర్ అనే బోటు మునిగిపోవడంతో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఝాన్సీరాణి అనే బోటు మునిగిపోవడంతో 8మంది మృతి చెందారు. కచులూరు మందం ప్రాంతంలో బోటు ఎగువవైపునకు వెళ్లే చోట బలమైన రాయి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బోటు ఎగువకు వెళ్లే చోట బలమైన రాయితో పాటు నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా 2017లో విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం వద్ద బోటు బోల్తా పడిన దుర్ఘటనలో 22మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. చదవండి: గోదావరిలో ప్రమాద సుడిగుండాలు బోట్లలో భద్రత ప్రశ్నార్థకం నాటు పడవలే ఆధారం.. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో గౌతమి, వృద్ధగౌతమీ, వైనతేయ, వశిష్ట గోదావరి నదీపాయల తీరం వెంబడి ఉన్న పలు గ్రామాలకు నాటు పడవలే ఆధారం. వాటిమీదే ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ప్రమాదాల మధ్యే జీవన యానం సాగిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలోపట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సరైన రహదారి వసతులు లేక తప్పనిసరి పరిస్దితుల్లో పడవలను ఆశ్రయించి ఎందరో లంక గ్రామాల ప్రజలు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది (2018) జూలై 14న ఐ.పోలవరం మండలం పశువుల్లంక రేవులో జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే దేవీపట్నం మండలంలో జరిగిన పర్యటక బోటు ప్రమాదం జిల్లా వాసులను కలచి వేసింది. చదవండి: 8 మంది మృతి, 25మంది గల్లంతు! శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు... క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి బోటులో ఎక్కువమంది తెలంగాణవారే! బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్ రాయల్ వశిష్టకు అనుమతి లేదు... పడవ బోల్తాపై ఆరా తీసిన సీఎం జగన్ పాపికొండలు విహార యాత్రలో విషాదం! -
పడవ బోల్తాపై ఆరా తీసిన సీఎం జగన్
సాక్షి, రాజమండ్రి : గోదావరిలో పడవ బోల్తా సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. తూరు గోదావరి జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా జిల్లాకు చెందిన మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు సహాయక చర్యల నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్ను రాజమండ్రి నుంచి తరలించారు. అలాగే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా అధికారులతో మాట్లాడారు. చదవండి: బ్రేకింగ్ : గోదావరిలో పడవ మునక అలాగే గోదావరి బోటు ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం విశాఖ, మంగళగిరి నుంచి ఎన్డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగాయి. అలాగే జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ కూడా సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఘటనా స్థలానికి బయల్దేరారు. కాగా బోటు ప్రమాదంలో దాదాపు ఇరవైమంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఘటన జరిగిన ప్రదేశం వద్ద సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో సమాచారం అందడంలో జాప్యం జరుగుతోందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. దేవీపట్నం మండలం కచ్చనూరు సమీపంలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటులో 61మంది ఉన్నారు. ప్రమాద ఘటన దురదృష్టకరం: మంత్రి కన్నబాబు గోదావరిలో బోటు ప్రమాదం దురదృష్టకరమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రాయల్ వశిష్ట లాంచీ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఉందని, ఘటనా స్థలానికి విశాఖ, మంగళగిరి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు తెలిపారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారని, ప్రభుత్వ పరంగా అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విశాఖ నుంచి రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గోదావరిలో గల్లంత అయిన వారి ఆచూకీ కోసం విశాఖ నుంచి 60మందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. సమాచారం అందిన వెంటనే విపత్తలు నిర్వహణ శాఖ కమిషనర్...బృందాలను సంఘటనా స్థలానికి పంపారు. ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందంలో 30మంది, మరో బృందంలో 40మంది సభ్యులు ఉన్నారు. -
అందం అలరించే..!
గోదావరి అలలపై తేలియాడే పడవలు.. పాపి కొండల నడుమ గలగల నీటి సవ్వడులు.. కొండలతో దోబూచులాడే దట్టమైన మేఘాలు.. ఇలా పశ్చిమ ఏజెన్సీలో గోదావరి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.. ప్రస్తుతం జిల్లాలో వరద నీటికి పరవళ్లు తొక్కుతోన్న గోదావరి ఓ పక్క భయపెడుతూనే.. మరో పక్క ఇదిగో ఇలా తన అందాలతో అలరిస్తోంది. -
ప్రమాదంలో పర్యాటకం
-
గోదావరిలో పర్యాటక బోటు దగ్ధం
వారంతా గోదావరి నది అందాలను వీక్షిస్తూ.. పాపికొండలు చూడాలని తరలివచ్చారు. మొత్తం 120 మందితో బయలుదేరిన ఆ బోటు అగ్నికీలల్లో చిక్కుకుంది. బోటును అలాగే ఒడ్డుకు చేర్చడంతో పర్యాటకులంతా ఇసుక తిన్నెలపైకి దూకేశారు. కొంతమంది ప్రాణభయంతో తమ బిడ్డలను ముందుగానే ఇసుకలోకి విసిరేశారు. ఈ సంఘటనలో బోటు మొత్తం కాలిపోగా పలువురికి గాయాలయ్యాయి. తృటిలో పెనుప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం/దేవీపట్నం/రంపచోడవరం: పాపికొండల విహారానికి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు రాయల్ గోదావరి బోటు బయలుదేరింది. ఇందులో 90 మంది పెద్దలు కాగా.. 30 మంది పిల్లలున్నారు. వీరంతా బోటు ఎక్కాక గోదావరిలో 2 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేశాక పూడిపల్లి, వీరవరం లంక గ్రామాల మధ్యకు చేరేసరికి బోటులో మంటలు వ్యాపించాయి. కిచెన్ నుంచి మంటలు రావడం గమనించిన సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ సమయంలో బోటు ఇసుక తిన్నెకు దగ్గరగా ప్రయాణిస్తుండడంతో డ్రైవర్ అటువైపునకు బోటును తరలించాడు. దీంతో పర్యాటకులు పసిబిడ్డలను ఇసుకలోకి విసిరేసి తర్వాత తామూ దూకేశారు. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బోటు మొత్తం దగ్ధమవడంతో కొందరి లగేజీ, నగదు, తదితర సామాగ్రి కాలిపోయాయి. గ్యాస్ సిలిండర్ వల్లే ప్రమాదం సంభవించిందని పర్యాటకులు చెబుతుండగా.. బోటు సిబ్బంది, నిర్వాహకులు, అధికారులు మాత్రం జనరేటర్లో ఏర్పడ్డ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. పర్యాటకులందరినీ దేవీపట్నం పోలీస్స్టేషన్కు తరలించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ డా.జి.వినోద్కుమార్ పోలీస్స్టేషన్కు చేరుకుని పర్యాటకులను రాజమహేంద్రవరం పంపించారు. నిర్లక్ష్యమే శాపం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. అనుమతుల్లేని లేదా పునరుద్ధరించుకోని బోట్లకు అనుమతిలిచ్చేస్తున్నారు. తాజాగా రాయల్ గోదావరి టూరిజం బోట్లో కేవలం 10 నిమిషాల్లో మంటలు వ్యాపించాయి. బోటు దేవీపట్నం వైపు ఉన్నా, ఒడ్డులేని ప్రాంతంలో ఉన్నా పెను ప్రమాదం జరిగేది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన 70 బోట్లు పర్యాటకులను తీసుకెళుతున్నాయి. ఏడాది కాలానికి బోటుకి ఫిట్నెస్ సర్టిఫికెట్, బోటు డ్రైవర్లకు లైసెన్సులు, గజ ఈతగాళ్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది ఏప్రిల్ 30తో అనుమతుల గడువు ముగిసింది. అయితే నిర్ణీత గడువులోపు 70 బోట్లకుగాను ఒక్క బోటుకే అనుమతి ఉంది. మిగిలిన 69 బోట్ల యజమానులు అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని రంపచోడవరం ఐటీడీఏ పీవో నిషాంత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో చాంబర్లో శుక్రవారం సాయంత్రం సబ్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఏఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి ఆయన మాట్లాడారు. సంఘటన తెలిసిన వెంటనే పోలీస్, రెవెన్యూ, అటవీ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఏఎస్పీ అజిత చెప్పారు. పూర్తిగా దగ్ధమైన బోటు -
పాపికొండలు యాత్ర: పడవలో మంటలు
-
పాపికొండలు విహారయాత్రలో ప్రమాదం
సాక్షి, రాజమహేంద్రవరం: పాపికొండలు విహారయాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. పాపికొండలు యాత్రకు పర్యాటకులతో బయల్దేరిన ఓ బోటులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. బోటులో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. విహారయాత్రకు వినియోగించిన బోటు పాతది కావడం వల్ల ఇంజన్ హీట్ ఎక్కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో 80 మంది పర్యాటకులు ఉన్నారు. ఘటన గురించి తెలుసుకున్న వీరవరపులంక వాసులు పలువురు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. స్థానికుల సాయంతో మిగతావారిని కూడా రక్షించారు. మంటల ధాటికి పడవ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ప్రయాణికులను అక్కడి నుంచి తరలించి వైద్య సేవలు అందించారు. చంద్రబాబు ఆరా పాపికొండలు యాత్రకు వెళ్లిన పడవ ప్రమాదానికి గురైన ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ప్రయాణికుల క్షేమ సమాచారంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. -
ఇదేం పాపం !
భద్రాచలం : పాపికొండల విహార యాత్ర పేరుతో కొందరు చేస్తున్న వ్యాపారం పర్యాటకులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఎలాంటి భద్రత, రవాణా వ్యవస్థ అందుబాటులో లేని చోట పర్యాటకులు చేస్తున్న రాత్రి బస ఒక్కోసారి వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. పాపికొండల వద్ద కొల్లూరు ఇసుక తిన్నెల్లో సోమవారం జరిగిన సంఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనం. భోజనం విషయంలో నిర్వాహకులు, పర్యాటకులకు మధ్య జరిగిన మాటల యుద్ధం చివరకు ఘర్షణకు దారితీసింది. కొల్లూరు హట్స్ నిర్వాహకులు విచక్షణారహితంగా తమపై దాడి చేశారని బాధిత పర్యాటకులు భద్రాచలంలో విలేకరుల వద్ద వెల్లడించారు. ఖమ్మానికి చెందిన దంతవైద్య నిపుణులు పి. కిశోర్ కుటుంబంతో పాటు, హైదరాబాద్కు చెందిన బంధువులతో కలసి మొత్తం 21 మంది ఆదివారం పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. ఇందులో పదేళ్ల లోపు వారు 8 మంది ఉన్నారు. వీరంతా ఆదివారం రాత్రి పాపికొండల వద్ద గల కొల్లూరు ఇసుక తిన్నెలపై ఉన్న హట్స్లో బస చేశారు. సోమవారం తిరుగు ప్రయాణ సమయంలో మధ్యాహ్న భోజనం చేసేచోట నిర్వాహకులతో కొంతమంది వాగ్వాదానికి దిగారు. భోజనం బాగాలేదని నిలదీయగా, నిర్వాహకులు తమపై దాడి చేశారని డాక్టర్ కిశోర్ తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి వచ్చామని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్ లేక ఎవరికీ చెప్పుకోలేకపోయామని, భయంతో తిరుగుముఖం పట్టామని డాక్టర్ కిశోర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరుగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్వాహకుల ఇష్టారాజ్యం... పాపికొండల విహార యాత్రపై ప్రైవేటు పెత్తనం సాగుతోంది. ప్రకృతి అందాలతో కొంతమంది బడాబాబులు చేస్తున్న దోపిడీ వ్యాపారానికి అడ్డకట్ట వేయడంపై అధికారులు దృష్టి సారించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రకృతి అందాలు కనుమరుగవుతాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. -
పాపికొండలు విహార యాత్రలో విషాదం
సాక్షి, వి.ఆర్.పురం: పాపికొండల విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. విహార యాత్రకు వచ్చిన హైదరాబాద్కు చెందిన బ్యాంకు ఉద్యోగి ఇక్కడి కొల్లురు బ్యాంబో హట్స్లొ బస చేశారు. అయితే అతనికి గుండెపోటు రావడంతో హుటాహుటిని తూర్పుగోదావరిజిల్లా వి.ఆర్.పురం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన అప్పటికే మృతిచెంది నట్లు వైద్యులు నిర్ధారించారు. -
పాపికొండలకు మళ్లీ కళ
సాక్షి, వీఆర్ పురం: పాపికొండలకు మళ్లీ పర్యాటక కళ వచ్చింది. విజయవాడ బోటు ప్రమాదం నేపథ్యంలో పర్యాటక బోట్లను రెండు వారాలుగా నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో పాపికొండల ప్రాంతం కళ తప్పింది. పూర్తి స్థాయిలో తనిఖీల అనంతరం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న లాంచీలు, బోట్లకు అధికారులు దఫదఫాలుగా అనుమతులు ఇచ్చారు. దీంతో పర్యాటకుల రాక తిరిగి ప్రారంభమైంది. శని, ఆదివారాల్లో వెయ్యిమందికి పైగా పర్యాటకులు రావడంతో తూర్పుగోదావరి జిల్లాలోని పోచవరం బోట్ పాయింట్, పేరంటపల్లి శివాలయం, కొల్లూరు ఇసుకతిన్నెల్లో సందడి వాతావరణం నెలకొంది. -
పాపికొండల విహారయాత్రకు బ్రేక్
సాక్షి, రాజమండ్రి: పాపికొండలు విహారయాత్రకు అధికారులు బ్రేక్ వేశారు. యాత్రకు వెళ్లే పలు బోట్లను అధికారులు నిలిపివేశారు. అదేవిధంగా మరో రెండు బోట్లను సీజ్ చేశారు. కృష్ణా జిల్లాలో మూడు రోజుల క్రితం బోటు బోల్తా పడి 21 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ఆయా పర్యాటక ప్రదేశాలకు వెళ్లే బోట్లను రెవెన్యూ, పోలీస్, పర్యాటక శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను తనిఖీ చేసి పలు బోట్లను నిలిపివేశారు. అందులో నిబంధనలకు విరుద్దంగా ఉన్న రెండు బోట్లను అధికారులు సీజ్ చేశారు. -
బోటు బోల్తా ఘటనతోనూ మారని ప్రభుత్వ వైఖరి
-
పాపికొండల్లో చెర్రీ విహారం
-
గోదావరి మధ్యలో నిలిచిన బోటు
దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన బోటు గోదావరి మధ్యలోనే నిలిచి పోయింది. వివరాలివీ.. గురువారం ఉదయం సుమారు 150 మంది యాత్రికులు సాయిగాయత్రి బోట్లో పురుషోత్తపట్నం నుంచి పాపికొండల వైపు బయలు దేరారు. బోట్ స్టీరింగ్లో సాంకేతిక లోపం తలెత్తటంతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వీరవరం లంక వద్ద నది మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో నిర్వాహకులు అధికారులకు సమాచారం అందించారు. ప్రయాణికులను మరో బోట్ ద్వారా గమ్యానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే, ఈ హఠాత్ పరిణామంతో పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
లాహిరి లాహిరికి.. బ్రేక్
నిలిచిన పాపికొండల విహారం నిబంధనల ప్రకారం లేని బోట్లు రోజుకు రూ.3 లక్షల నష్టం సాక్షి, రాజమహేంద్రవరం : నిబంధనల ప్రకారం లేవని పాపికొండల పర్యాటక బోట్లను అధికారులు కొద్ది రోజులుగా నిలిపివేశారు. దీంతో పాపికొండలు పర్యాటక ప్రాంతానికి వెళ్లేవారి ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టయింది. పక్షం రోజుల క్రితం దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద ఓ లగ్జరీ బోటుకు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో బోటుకు కన్నం పడి అందులోకి నీరు చేరింది. నది ఒడ్డుకు చేరువలోనే ఈ ప్రమాదం జరగడంతో పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనతో గోదావరిలో పాపికొండల పర్యటనకు వెళ్లే లగ్జరీ ఏసీ బోట్లు, లాంచీలను అధికారులు నిలిపివేశారు. నిబంధనల ప్రకారం బోటులో పర్యాటకుల రక్షణకు సంబంధించి అన్ని ప్రమాణాలూ ఉంటేనే అనుమతివ్వాలని నిర్ణయించారు. ప్రతి బోటులో రెండు ఇంజన్లు, లైఫ్ జాకెట్లు, బోటు, పర్యాటకులకు బీమా, నది లోతును కొలిచే యంత్రం, మత్స్యశాఖ ఇచ్చే సర్టిఫికెట్ ఉన్న డ్రైవర్ ఉండి తీరాలని అధికారులు నిబంధనలు విధించారు. ఈ నేపథ్యంలో పర్యాటక బోట్లకు బ్రేక్ పడింది. ఆర్థిక స్తోమతనుబట్టి బోట్ల నిర్మాణం పాపికొండల పర్యాటకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ నిర్దిష్టమైన నిబంధనలేవీ లేకుండానే పలువురు తమ ఆర్థిక స్తోమతనుబట్టి లగ్జరీ బోట్లను నిర్మించుకున్నారు. ప్రస్తుతం గోదావరిలో 53 బోట్లు పాపికొండల పర్యాటకానికి వెళుతున్నాయి. ఇందులో మూడు మాత్రమే రెండు ఇంజన్లు ఉన్న బోట్లు ఉన్నాయి. మిగతా వాటికి రెండో ఇంజన్ ఏర్పాటు చేసుకోవడం, ఇతర అనుమతులు లభించాలంటే మరో 20 రోజులు సమయం పట్టనుంది. పర్యాటకంపై ప్రభావం.. పర్యాటకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిబంధనలు విధించడం హర్షించదగ్గ పరిణామమే అయినా.. అన్ని బోట్లనూ నిలిపివేయడంతో పర్యాటకం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో ప్రతి రోజూ సుమారు 500 మంది పర్యాటకులు పాపికొండల పర్యాటకానికి వెళుతున్నారు. బోట్లను నిలిపివేయడంతో తమకు ప్రతి రోజూ రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లుతోందని బోట్ల యజమానులు వాపోతున్నారు. ఇదే సీజన్లో అయితే నాలుగు రెట్లు ఉంటుందని అంటున్నారు. బోట్లు నిలిచిపోవడంతో వాటిల్లో పని చేస్తున్న సిబ్బందికి, పర్యాటకులను రాజమహేంద్రవరం నుంచి పట్టిసీమ, పోలవరం, పురుషోత్తపట్నం తరలించే వాహనదారుల ఉపాధికి కూడా గండిపడింది. పాపికొండల విహారానికి వచ్చే పర్యాటకులు బోట్లు అందుబాటులో లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. బోట్లను రద్దు చేసిన అధికారులు ప్రత్యామ్నాయంగా ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉన్న పెద్ద బోటును ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. డైలమాలో లాంచీల యజమానులు పాపికొండల పర్యటనకు వెళ్లే లాంచీలకు, బోట్లకు ఒకే విధానం ప్రకటించడంతో లాంచీల యజమానులు డైలమాలో పడిపోయారు. అసలే చిన్న లాంచీలు కావడం వాటిలో రెండో ఇంజను ఏర్పాటు చేయడంలో సాధ్యసాధ్యాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. నిబంధనల ప్రకారం బోటును సిద్ధం చేయాలంటే ఒక్కోదానికి రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారు. పర్యాటకుల భద్రత కోసమే.. ఉభయ గోదావరి జిల్లాల్లో పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లు 53 ఉన్నాయి. ఇందులో మూడు బోట్లు మాత్రమే నిబంధనల ప్రకారం ఉన్నాయి. రెండో ఇంజన్ బోటు బయటవైపు ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. పర్యాటకుల భద్రత కోసమే ఈ నిబంధనలు పెట్టాం. ప్రధాన ఇంజన్ మరమ్మతులకు గురై నది మధ్యలో బోటు ఆగిపోతే రెండో ఇంజన్ ఉపయోగపడుతుంది. భవిష్యత్లో నిర్మించే బోట్లకు రెండు ఇంజన్లు ఉంటేనే అనుమతిస్తాం. ఎస్కార్ట్ పెట్టుకుంటామని బోట్ల యజమానాలు విన్నవిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – జి.భీమశంకరరావు, ప్రత్యేక అధికారి, అఖండ గోదావరి ప్రాజెక్టు === 08ఆర్జేసీ1001 : పర్యాటక బోటు