Ritu Varma
-
నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది.. మజాకా హీరోయిన్ రీతూ వర్మ (ఫోటోలు)
-
ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు: రీతూ వర్మ
‘మజాకా’(Mazaka)లో యంగ్ కాలేజ్ గర్ల్ పాత్రలో నటించాడు.బాల్యంలో ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ వలన తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా పాత్రను కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రను చేయలేదు. ఆడియన్స్కి కచ్చితంగా నచ్చుతుంది’అని అన్నారు రీతూ వర్మ. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రీతూ వర్మ(Ritu Varma) మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ప్రసన్న ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. అదే సమయంలో కథ హై ఎమోషనల్ కోషేంట్ గా ఉంది. రెండు ఫీమేల్ క్యారెక్టర్స్ కి కథ లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. నరేషన్ చాలా నచ్చింది.→ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో నాకు రావు రమేష్ గారికి ఓ సింగిల్ టేక్ సీన్ ఉంది. ఆ రోజు షూట్ చేసినప్పుడు అవుట్ పుట్ విషయంలో అందరూ చాలా హ్యాపీ అయ్యారు. సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. రావు రమేష్ గారు డబ్బింగ్ పూర్తి చేసి ఫోన్ చేశారు. ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. 'చాలా అద్భుతంగా చేశావ్ అమ్మా..16 నా ఏళ్ల కెరీర్ లో అలాంటి సీన్ చూడాలేదు'అని ఆయన చెప్పడం నాకు చాలా మెమరబుల్.→ ఈ సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. సెట్స్ లో అందరూ ఎనర్జిటిక్ గా వుండేవారు. అదే ఎనర్జీ ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తుంది. బాటిల్ రీల్ కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది→ త్రినాథ్ రావు గత సినిమాల మాదిరే మజాక కూడా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతోంది. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. టీజర్ అందరికీ నచ్చింది.→ సందీప్ గారు చాలా పాజిటివ్ పర్శన్. లవ్లీ కోస్టార్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అన్షు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఈ సినిమా కోసం తెలుగు క్లాసులు కూడా తీసుకుంది.→ డైరెక్టర్ త్రినాధ్ రావు చాలా జోవియల్ పర్శన్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. అందరినీ అదే ఎనర్జీతో ఉంచుతారు. టీం అంతా చాలా పాజిటివ్ గా ఉంటారు.త్రినాధ్ రావు, ప్రసన్న వెరీ గుడ్ కాంబో. ప్రసన్న గారు ప్రతి రోజు సెట్ కి వచ్చేవారు. కామిక్ టైనింగ్ లో ఆయన చాలా పర్టిక్యులర్.→ నా సీనీ జర్నీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. నటిగా చాలా మంచి సినిమాలు పాత్రలు చేశాను. అందులో గుర్తు పెట్టుకునే కొన్ని పాత్రలు వుండటం ఆనందాన్ని ఇస్తుంది. నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది. అలాగే కామెడీ కూడా చేయడం నాకు చాలా ఇష్టం. ఫుల్ లెంత్ పీరియడ్ సినిమా చేయాలని ఉంది.→ ప్రస్తుతం తెలుగులో ఓ మల్టీ స్టారర్ సైన్ చేశాను. అలాగే ఓ వెబ్ సిరిస్ చేశాను. అది హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. -
‘మజాకా’ చిత్రం లైవ్ సాంగ్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్ (ఫొటోలు)
-
బీమా జ్యువెలరీ షోరూం ప్రారంభించిన రీతూ వర్మ
-
ఫారిన్ ట్రిప్లో చిల్ అవుతున్న రీతూ వర్మ.. ఫోటోలు వైరల్
-
Swag Movie Review: ‘శ్వాగ్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘శ్వాగ్’ నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్రచన-దర్శకత్వం: హసిత్ గోలిసంగీతం: వివేక్ సాగర్సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్ఎడిటర్: విప్లవ్ నైషధంవిడుదల తేది: అక్టోబర్ 04, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాది మార్చిలో ఓం భీమ్ బుష్ సినిమాతో సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ‘శ్వాగ్’ అంటూ మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణువుతో డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించిన రెండో చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 4)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణువు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. దివాకర్ పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవనభూతి(శ్రీవిష్ణు) రిటైర్మెంట్ రోజు అతనికి ఒక లెటర్ వస్తుంది. అందులో తనది శ్వాగనిక వంశం అని.. వంశ వృక్ష నిలయంలో పూర్వికుల ఆస్తి ఉందని ఉంటుంది. ఎలాగైన ఆ ఆస్తినికి కొట్టేయాలని భవనభూతి అక్కడికి వెళ్తాడు. ఆ ఆస్తికి రక్షగా నిలుస్తున్న మరో వంశం వ్యక్తి(గోపరాజు రమణ).. పూర్వికుల ఇచ్చిన పలక తీసుకొని వస్తేనే ఆస్తి దక్కుతుందని చెబుతాడు. భవనభూతి దాని వెతుకుతుండగా..మరో యువతి అనుభూతి(రీతువర్మ) ఆ పలకతో వంశవృక్ష నిలయానికి వస్తుంది. శ్వాగనిక వంశం తనదే అంటే తనదే అంటూ ఇద్దరు గొడవపడుతుంటారు. మరోవైపు యూట్యూబర్ సింగ(శ్రీవిష్ణువు) కూడా స్వాగనిక వంశం వాడేనని తెలుస్తుంది. ఆయన కూడా ఆస్తికోసం వంశ వృక్ష నిలయానికి వస్తాడు. అసలు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధ ఏంటి? వీరికి లేఖలు రాస్తున్నదెవరు? ఎందుకు రాశారు? 1550లో మాతృస్వామ్య పాలన సాగిస్తున్న వింజారమ వంశపు స్త్రీ (రితూ వర్మ) నుంచి స్వాగనిక వంశ మూలపురుషుడు భవభూతి(శ్రీవిష్ణు) అధికారాన్ని ఎలా దక్కించుకున్నాడు? మాతృస్వామ్య పాలనకు ముగింపు పలికి పితృస్వామ్య పాలన ఎప్పటికి కొనసాగించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పైన రాసిన కథ చదివితేనే కాస్త గందరగోళంగా అనిసిస్తుంది కదా?. మరి దాన్ని తెరపై అర్థమయ్యేలా చూపించడం చాలా కష్టమైన పని. ఈ విషయంలో డైరెక్టర్ హసిత్ గోలి కొంతమేర సక్సెస్ అయ్యాడు. విభిన్న టైమ్లైన్లలో సెట్ చేయబడిన కథ ఇది. ప్రారంభంలో కాస్త గందరగోళానికి గురైనా.. కాసేపటి తర్వాత అందరూ పాత్రలతో మూవ్ అవుతుంటారు. 1550ల నాటి కథకి ఇప్పటి వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి అనేది బుర్రపెట్టి చూస్తే తప్ప అర్థం కాదు. అయితే ఉన్న కొద్ది సమయంలో దర్శకుడు అందరికి అర్థమయ్యేలా కథను చెప్పాలనుకున్నాడు. కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం అది కాస్త గందరగోళానికి గురిచేస్తుంది. పెద్ద కథ కాబట్టి అన్ని విడమర్చి చెప్పడానికి సమయం లేకపోవడంతో సింపుల్గా ఒక్కొ సీన్తో ముగించేశారు.1550 ల సమయంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ల మధ్య ఆడవాళ్ళ ఆధిపత్య పోరు జరుగుతున్న సీన్తో కథ ప్రారంభం అవుతుంది. అప్పట్లో స్త్రీలే పరిపాలన చేసేవారని, మగవారు ముసుగు ధరించి ఇంట్లోనే ఉండేవారని చూపించారు. ఆ తర్వాత కథ ప్రస్తుతానికి చేరుతుంది. ఎస్సై భవనభూతి భార్య రేవతి(మీరా జాస్మిన్) ఎందుకు అతన్ని వదిలి వెళ్లిపోయింది అనేది ఆసక్తికరంగా చూపించారు. ఫస్టాఫ్లోనే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి.. ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. అయితే మొదటి 30 నిమిషాలు మాత్రం కథనం రొటీన్గానే సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్లో పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని రివీల్ చేస్తూనే ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న ఓ ప్రధానమైన సమస్యపై సీరియస్గా చర్చించారు. ముఖ్యంగా విభూతి(శ్రీవిష్ణువు) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మొత్తం ఎమోషనల్గా సాగుతుంది. కామెడీతో మొదలైన సినిమా.. చివరకు ఎమోషనల్గా ముగుస్తుంది. అయితే ముందుగా చెప్పినట్లు కాస్త బుర్రపెట్టి చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. కంటెంట్ కింగ్ అనే బిరుదుకు శ్రీవిష్ణువు మరోసారి న్యాయం చేశాడు. మంచి కథను ఎంచుకోవడమే కాకుండా తనదైన నటనతో ఆ కథకు పూర్తి న్యాయం చేశాడు. విభిన్నమైన ఐదు పాత్రల్లో నటిస్తూ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విభూతి పాత్ర అయితే సినిమాకే హైలెట్. ఆ పాత్రతో శ్రీవిష్ణు నటన అద్భుతం. ఈ పాత్ర గురించి ఎక్కువగా చెబితే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక రీతూ వర్మ రెండు పాత్రల్లో కనిపించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తెరపై కనిపించేంది కాసేపే అయితే..ఉన్నంతలో బాగానే చేసింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. సునీల్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -Rating: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను: శ్రీవిష్ణు
‘‘తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్లే మేం గెలుస్తుంటాం. ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను. దాని కోసం ఎంతో కష్టపడ్డాం. నిజంగా మీకు మా ‘శ్వాగ్’ సినిమా నచ్చితే అభినందిస్తూ రెండు చప్పట్లు కొట్టండి చాలు. ఈ నెల 4న థియేటర్స్కి వచ్చి మీరు గెలిచి, నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘శ్వాగ్’. మీరా జాస్మిన్, దక్షా నగార్కర్ కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్కి ‘గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ 2’ సినిమాలు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ‘శ్వాగ్’ కూడా అలాంటి సక్సెస్ ఇస్తుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు నటన చూశాక కమల్హాన్గారితో ΄ోల్చుతారు’’ అని తెలి΄ారు. ‘‘శ్రీ విష్ణు, వివేక్ ఆత్రేయ స΄ోర్ట్తోనే ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాను. ‘రాజ రాజ చోర’ సినిమా తర్వాత రెండో సినిమా ‘శ్వాగ్’ని విశ్వప్రసాద్గారి నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు హసిత్ గోలి. -
శ్రీ విష్ణు స్వాగ్ ’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహారాణి రుక్మిణీదేవిగా రీతు వర్మ
అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు రీతు వర్మ. పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతు వర్మ. ఫిలింమేకర్స్ లో ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్ గా పేరు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది రీతు వర్మ. ఆమె అప్ కమింగ్ రిలీజ్ స్వాగ్ తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతోంది.స్వాగ్ సినిమాలో వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో రీతు వర్మ కనిపించనుంది. మహారాణి రుక్మిణీదేవి పాత్రతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్వాగ్ లో రీతు వర్మ క్యారెక్టర్ హైలైట్ కానుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడే రీతు వర్మ..మహారాణి రుక్మిణీదేవి పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్దమైంది. ఆమె ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపించబోతోంది.ప్రస్తుతం రీతు వర్మ తెలుగుతో పాటు తమిళంలోనూ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రీతు వర్మకు ఈ సిరీస్ డిజిటల్ డెబ్యూ కానుంది. శ్రీ విష్ణు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు హసిత్ గోలి రూపొందించిన స్వాగ్ మూవీ అక్టోబర్ 4న థియేటర్స్ లోకి రానుంది. -
శ్రీవిష్ణు 'శ్వాగ్' టీజర్.. హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడే
‘రాజ రాజ చోర’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఎంతో వినోదాత్మకంగానే కాకుండా ఆసక్తిగా కూడా ఈ టీజర్ మెప్పిస్తుంది. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.తాజాగా విడుదలైన టీజర్ను బట్టి చూస్తే సినిమాపై మంచి అంచనాలు పెట్టుకోవచ్చు. సినిమా కాన్సెప్ట్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది. శ్వాగణిక వంశానికి చెందిన వాడిగా శ్రీవిష్ణు విభన్న గెటప్పులతో అలరించాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత ‘శ్వాగ్’తో శ్రీవిష్ణు హ్యాట్రిక్ హిట్ అందుకునేలా ఉన్నాడు. -
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి నెటిజన్స్కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
పెళ్లిచూపులు హీరోయిన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు..
-
షూటింగ్లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు
తెలుగు యంగ్ హీరో శ్రీవిష్ణుకు కొందరు కూలీలు షాకిచ్చారు. కొత్త సినిమా షూటింగ్లో భాగంగా అనుకోని సంఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేందుకు కోసం కొందరు కూలీలని చిత్రబృందం తీసుకొచ్చింది. అయితే పూర్తయిన తర్వాత వాళ్లకు వేతనం ఇచ్చే విషయం కాస్త ఆలస్యమైంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) ఈ క్రమంలోనే తమకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని దాదాపు 400 మంది కూలీలు.. షూటింగ్ లొకేషన్లో ఆందోళన చేశారు. అటుగా వెళ్తున్న హీరో కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. కూలీలకు సర్దిచెప్పారు. హీరోకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అతడు కారుని పోనిచ్చారు. ఆ తర్వాత వివాదం కూడా సద్దుమణిగింది. గతేడాది 'సామజవరగమన' సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగమ్మాయి రీతూవర్మ కూడా గతేడాది 'మార్క్ ఆంటోని', 'ధృవ నక్షత్రం' లాంటి మూవీస్తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూవీకే తాజాగా సమస్య ఎదురైంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) -
పెళ్లి చూపులు భామ ధరించిన గూలబీ రంగు చీర ఎంతంటే..
రితు వర్మకు నటన ఒక ప్యాషన్. అందుకే రాశి కన్నా వాసికే విలువ ఇస్తుంది. మంచి పాత్రలతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ విషయంలో కూడా స్టయిల్ కన్నా సౌకర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్నామంటే మన లుక్ను పర్ఫెక్ట్గా మెయిన్టేన్ చేయాల్సిందే! అలాగయితేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలం అంటోంది రితు వర్మ. ఇక ఆమె కంఫర్ట్గా ఫీలయ్యే బ్రాండ్స్లో ఓ రెండిటి గురించి.. మద్దిన్ మధురిత దత్తా, స్తాంజిన్ డాజిస్.. బిజినెస్ పార్ట్నర్సే కాదు మంచి స్నేహితులు కూడా! ఫ్యాషన్ పై వారికి ఉన్న అభిరుచి, ఆలోచనలు ఏకమవడంతో ఇద్దరూ కలసి కెరీర్ను స్టార్ట్ చేశారు. ముంబైలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2012లో తమ ఇద్దరి పేరుతోనే ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్నే ఉపయోగిస్తారు. ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన, సంప్రదాయ డిజైన్స్లో వీరిది పెట్టింది పేరు. ఈ బ్రాండ్ వేర్ ధర కాస్త ఎక్కువే. ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటుంది. శీతల్ జవేరి జ్యూయెల్స్.. నాటి.. ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్లో శీతల్ జవేరి జ్యూయెల్స్ ఒకటి. నాణ్యత, నైపుణ్యమే దీని బ్రాండ్ వాల్యూ. సంప్రదాయ నగలతోపాటు మోడర్న్ డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర క్వాలిటీ, డిజైన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్లోనూ లభ్యం. ఈ శీతల్ జవేరి జ్యూయెల్స్ బ్రాండ్ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: క్యూట్లుక్తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..) -
మెగా హీరోతో రిలేషన్లో రీతూ వర్మ.. క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్!
మెగా ఫ్యామిలీ ఇంట ఏ సెలబ్రేషన్స్ జరిగినా అక్కడ వాలిపోయేది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. నిహారిక స్నేహితురాలిగా తరచూ వారి ఇంటి వేడుకల్లో కనిపించేది. కానీ జనాలు మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందని అనుమానపడ్డారు. అన్నట్లుగా వరుణ్-లావణ్య షికార్లకు వెళ్లడం, వీరిద్దరి మధ్య లవ్వాయణం నడుస్తోందని ప్రచారం జరగడం.. చివరకు అదే నిజమంటూ పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయింది. అయితే ఆ మధ్య వరుణ్-లావణ్యల పెళ్లికి అల్లు అర్జున్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ కూడా ఉంది. దీంతో ఆమె మెగా హీరోతో రిలేషన్లో ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు. రీతూ వర్మ.. లావణ్య స్నేహితురాలు.. అందుకనే పార్టీకి వచ్చింది. పెళ్లి వేడుకల్లోనూ సందడి చేసింది. అంతకుమించి ఏమీ లేదు అని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్. కాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆదికేశవ. శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమా నవంబర్ 10న విడుదల కావాల్సింది. కానీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: సినిమాలకు గుడ్బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్? -
ఆకట్టుకుంటున్న విక్రమ్- రీతూవర్మ 'కరిచే కళ్లే’ సాంగ్
చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ధృవ నక్షత్రం’. రితూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ.. రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ "ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధకాండం" ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. "ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం’ నుంచి 'కరిచే కళ్లే..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హ్యారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ రాయగా..శ్రీలేఖ పార్థసారధి పాడారు. 'కరిచే కళ్లే చూసి కుదేలయ్యానయ్యా...గరుకు ఒళ్లే నన్ను లాగెనురా బాయ్యా...వయసిక ఆగనంది అట్టా ఇట్టాగుంది..యెంటనే తాంబూలాలు మార్చేసుకోమంది...' అంటూ హీరోయిన్ లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగుతుందీ పాట. బ్యూటిఫుల్ మెలొడీగా హ్యారీస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ పాట అమ్మాయిల లవ్ ఆంథెమ్ కానుంది. -
Mark Antony Movie Review: ‘మార్క్ ఆంటోని’ మూవీ రివ్యూ
టైటిల్: మార్క్ ఆంటోని నటీనటుటు: విశాల్, ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతువర్మ, అభినయ తదితరులు నిర్మాత: ఎస్ వినోద్ కుమార్ రచన-దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్ సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం ఎడిటర్: విజయ్ వేలుకుట్టి విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథ 1975-1995 మధ్య కాలంలో జరుగుతుంది. సైంటిస్ట్ చిరంజీవి(సెల్వ రాఘవన్) టైమ్ ట్రావెల్లో గతంలోకి వెళ్లే టెలిఫోన్ని కనిపెడతాడు. దానికి కొన్ని కండీషన్స్ ఉంటాయి. అయితే అది కనిపెట్టిన కొద్ది రోజులకే అతను చనిపోతాడు. మరోవైపు గ్యాంగ్స్టర్ ఆంటోనీ(విశాల్) మరణించడంతో కొడుకు మార్క్(విశాల్)ని అతని ప్రాణ స్నేహితుడు జాకీ మార్తాండ(ఎస్జే సూర్య) సొంత కొడుకులా పెంచుతాడు. మార్క్కి తండ్రి ఆంటోనీ అంటే ద్వేషం. తన తల్లిని అతనే చంపాడని భావిస్తాడు. తండ్రిలా తాను రౌడీ కావొద్దని, కత్తులకు, తుపాలకు దూరంగా ఉంటూ మెకానిక్గా పని చేసుకుంటాడు. 1975లో చిరంజీవి కనిపెట్టిన టైమ్ ట్రావెల్ టెలిఫోన్ మార్క్ చెంతకు వస్తుంది. ఆ ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజమేంటి? ఆంటోనీ ఎలా మరణించాడు? మరణించిన తండ్రిని మార్క్ ఎలా బతికించుకున్నాడు? మార్క్ తల్లిని హత్య చేసిందెవరు? ఈ కథలో ఏకాంబరం(సునీల్) పాత్ర ఏంటి? రమ్య(రీతూ వర్మ)తో మార్క్ ప్రేమాయణం ఎక్కడికి దారి తీసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. 'ఆదిత్య 369' మొదలు మొన్నటి 'బింబిసార', 'ఒకే ఒక జీవితం' లాంటి చిత్రాలన్ని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ అనిపించుకున్నాయి. అలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే మార్క్ ఆంటోనీ. గ్యాంగ్స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరెక్కించాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. టైమ్ ట్రావెల్ టెలిఫోన్ సహాయంతో గతంలోకి వెళ్లిన తర్వాత ఎస్ జే సూర్య పండించే కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఎలాంటి సాగదీత లేకుండా కథ స్పీడ్గా ముందుకు సాగుతుంది. సైంటిస్ట్ చిరంజీవి 1975లో గతంలోకి వెళ్లే టెలిఫోన్ని కనిపెట్టే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ 1995కి షిఫ్ట్ అవుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎస్జే సూర్య కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఆంటోని, జాకీ మార్తండ, మార్క్, మదన్ మార్తండ పాత్రలు పండించే కామెడీ, డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. అయితే టైమ్ ట్రావెల్ మిషన్తో ప్రతిసారి గతంలోకి వెళ్లడం..మళ్లీ ప్రస్తుత కాలంలోకి రావడం.. కొన్ని చోట్ల ఆడియన్స్ కాస్త గందరగోళానికి గురవుతారు. ఇంటర్వెల్ వరకు కథ యమ స్పీడ్గా ముందుకు వెళ్తుంది. ఇక సెంకడాఫ్లో కథ నెమ్మదిగా సాగుతుంది. రిపీట్ సీన్స్ కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తాయి. సిల్క్ స్మిత ఎపిసోడ్, ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. టెలిఫోన్ని ఉపయోగించి చనిపోయిన వారిని బతికించుకోవడం కొంతవరకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది కానీ ప్రతిసారి ఆ తరహా సన్నివేశాలే రిపీట్ కావడం ఇబ్బందిగా, గందరగోళంగా అనిపిస్తుంది. క్లైమాక్స్కి ముందు వచ్చే అనకొండ(మిషన్ గన్) ఫైట్ సీన్ అయితే హైలైట్. ఈ సన్నివేశంలో విశాల్ ఎంట్రీ, గెటప్ అదిరిపోతుంది. ఓవరాల్గా ఎలాంటి లాజిక్కులు వెతక్కుండా వెళ్తే ‘మార్క్ ఆంటోనీ’ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాటు ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేయడం విశాల్కు అలవాటు. మార్క్ ఆంటోనిలో కూడా వైవిధ్యమైన పాత్రనే పోషించాడు. రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రలకు తనదైన నటనతో న్యాయం చేశాడు. లుక్ పరంగానూ వ్యత్యాసం చూపించాడు. ఇక క్లైమాక్స్లో గుండుతో కనిపించి షాకిచ్చాడు. ఈ సినిమాలో బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. జాకీ మార్తాండగా, అతని కొడుకు మార్తాండ్గా రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయాడు. తెరపై ఆయన పండించిన కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయింది. విశాల్, సూర్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి నటించారు. ఇక గ్యాంగ్స్టర్ ఏకాంబరం పాత్రకు సునీల్ న్యాయం చేశాడు. టైమ్ ట్రావెల్ చేయగల ఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త చిరంజీవి పాత్రలో సెల్వ రాఘవన్ తన పరిధిమేర చక్కగా నటించాడు. రీతూ వర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో చక్కగా నటించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
టీజర్.. ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి
‘‘మార్క్ ఆంటోనీ’ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ చిత్రంతో విశాల్ మరో స్థాయికి వెళ్లాలి’’ అని హీరో నితిన్ అన్నారు. విశాల్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఎస్జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్ కీలక ΄ాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘మార్క్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హీరో నితిన్. విశాల్ మాట్లాడుతూ–‘‘నా మొదటి చిత్రం ‘చెల్లమే’ (ప్రేమ చదరంగం) విడుదలై సెప్టెంబర్ 10కి 19 ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు టికెట్ కొని నా సినిమాలు చూస్తున్నారు. ఆ డబ్బుతో నేను, నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలనుకోను. ఆ డబ్బు అందరికీ ఉపయోగపడాలనుకుంటాను. ‘మార్క్ ఆంటోనీ’ని తెలుగులో వేణుగారు రిలీజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇది తండ్రీ కొడుకుల కథ’’ అన్నారు అధిక్. ‘‘నా లైఫ్లో తమిళ సినిమా చేస్తాననుకోలేదు. నాకు రెండో అవకాశం ఇచ్చాడు అధిక్’’ అన్నారు నటుడు సునీల్. -
స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో రీతూ వర్మ బ్యూటీఫుల్ (ఫొటోలు)
-
ఐదేళ్ల తర్వాత విక్రమ్ సినిమాకు మళ్లీ మోక్షం.. సంతోషంలో ఫ్యాన్స్
నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువనక్షత్రం. నటి రీతూ వర్మ నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తీపన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, ఐశ్వర్య రాజేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం 2017లోనే ప్రారంభం అయ్యింది. షూటింగ్ కొంత భాగం లండన్లో జరుపుకుంది. (ఇదీ చదవండి: మిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వెళ్లే వాళ్లం) ఇందులో నటుడు విక్రమ్ జాన్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించారు. 2018లో విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల కాలేదు. ఈ చిత్రం విడుదల గురించి పలుమార్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఐదేళ్లు దాటినా ధ్రువనక్షత్రం ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. ఇంతకు ముందే చిత్రం లోని ఒక పాటను విడుదల చేశారు. తాజాగా రెండో పాటను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో త్వరలోనే జాన్ను చూస్తారు అని పేర్కొన్నారు. దీంతో ధ్రువనక్షత్రం చిత్రానికి త్వరలోనే మోక్షం లభిస్తుందని తెలుస్తోంది. దీంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం తర్వాత ధ్రువనక్షత్రం రాబోతోందని విక్రమ్ అభిమానులు ఆనందంతో ఎదురు చూస్తున్నారు. (ఇదీ చదవండి: త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్) -
క్యూట్గా కనిపించే రీతూ వర్మ కూడా డోసు పెంచిందే! (ఫోటోలు)
-
కూకట్పల్లిలో రీతూ వర్మ సందడి (ఫొటోలు)
-
అరేంజ్ మ్యారేజ్ నాకు సెట్ కాదు : నటుడు
తమిళసినిమా: కోలీవుడ్లో కథానాయకుడిగా ఎదుగుతున్న నటుడు అశోక్ సెల్వన్. ఓ మై కడవులే వంటి హిట్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన త్వరలో తెలుగు చిత్ర, పరిశ్రమలోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కాగా తాజాగా ఈయన నాలుగు పాత్రల్లో నటించిన చిత్రం నిత్తం ఒరువానం. నటి రీతువర్మ, అపర్ణా బాలమురళి, శివాత్మిక మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటించిన ఈ చిత్రాన్ని ఆర్.కార్తీక్ దర్శకత్వంలో వైకామ్ 18 స్టూడియోస్, ఈస్ట్ రైజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గత 4వ తేదీన విడుదలై మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా నటుడు అశోక్ సెల్వన్ గురువారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ నిత్తం ఒరువానం తన ఫేవరెట్ చిత్రం అన్నారు. ఇందులో భిన్నమైన నాలుగు పాత్రలు పోషించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. కాగా ఇందులో ముగ్గురు హీరోయిన్లతో నటించడం గురించి అడుగుతున్నారని చెప్పారు. చిత్రంలో కథానాయికల ఎంపిక అన్నది దర్శకుడిదేనన్నారు. అలాగే తనతో కలిసి నటించిన హీరోయిన్లలో నచ్చిన నటి ఎవరిని అడిగితే ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన టాలెంట్ ఉంటుందన్నారు. అదే విధంగా మంచీ చెడూ ఉంటాయన్నారు. తనకు అందరూ నచ్చిన వారేనని చెప్పారు. పెళ్లెప్పుడన్న ప్రశ్నకు కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయం ఇదనీ, తాను సినీ నేపథ్యం నుంచి గానీ, ఉన్నత కుటుంబం నుంచి గానీ రాలేదన్నారు. శ్రమించి స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. కాబట్టి ఆసమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని అన్నారు. ప్రేమలో ఉన్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, అయితే తన మనస్తత్వానికి పెద్దలు నిశ్చయించిన పెళ్లి సెట్ కాదని చెప్పారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో మన్మధలీల చిత్రంలో నటించిన వినూత్న అనుభవంగా పేర్కొన్నారు. మంచి హ్యూమరస్ కథాంశంతో రూపొందిన ఆ చిత్రం ప్రేక్షకుల్లోకి వేరే మాదిరిగా వెళ్లిందన్నారు. అన్ని రకాల పాత్రలో నటించాలని ఆశిస్తున్నానని, ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో శరత్కుమార్తో కలిసి నటిస్తున్న యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రం తదుపరి విడుదల కానుందనీ చెప్పారు. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టే అవకాశం ఉందని అశోక్ సెల్వన్ చెప్పారు. -
ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది
‘‘థియేటర్స్లో ‘ఒకే ఒక జీవితం’ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. ఈ సినిమా ఇంకెంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది? అనే అంశాలను అటుంచితే థియేటర్స్లో ప్రేక్షకుల చప్పట్లను వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమను ఇచ్చారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). రీతూ వర్మ హీరోయిన్గా కీలక పాత్రల్లో అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి నటించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘గొప్ప కథ రాసి, విజయానికి కారణమైన దర్శకుడు శ్రీ కార్తీక్కు ధన్యవాదాలు. థియేటర్స్ స్క్రీన్పై అమలగారు కనిపించినప్పుడు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమలగారు ఇంకా మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ఆర్ ప్రభుగారు అభిరుచిగల నిర్మాత. మౌత్ టాక్తో ప్రేక్షకులు మా సినిమాను ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుతున్నాను’’ అన్నారు. ‘‘యువత ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొని విజయం సాధించేందుకు మార్గం చూపే చిత్రం ఇది. ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు. శర్వానంద్ పరిపూర్ణ నటుడు’’ అన్నారు అమల. ‘‘శర్వానంద్–అమలగార్లు స్క్రీన్పై తల్లీకొడుకు లుగా ప్రేక్షకుల మనసును హత్తుకున్నారు. ఈ సినిమా అందరికీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. నటుడు ‘వెన్నెల’ కిశోర్, ఈ చిత్రం కెమెరామేన్ సుజిత్ పాల్గొన్నారు. -
‘ఒకే ఒక జీవితం’ మూవీ స్టిల్స్
-
‘ఒకే ఒక జీవితం’ మూవీ రివ్యూ
టైటిల్: ఒకే ఒక జీవితం నటీనటులు: శర్వానంద్, రీతూవర్మ, అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నిర్మాతలు : ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు డైలాగ్స్: తరుణ్ భాస్కర్ సంగీతం : జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ విడుదల తేది: సెప్టెంబర్ 9, 2022 కథేంటంటే.. ఆది(శర్వానంద్), శ్రీను(వెన్నెల కిశోర్), చైతూ(ప్రియదర్శి) ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆది మంచి గిటారిస్ట్ కానీ స్టేజ్పై పాడాలంటే భయం. ప్రియురాలు వైష్ణవి(రీతూ వర్మ) ఎంత ఎంకరేజ్ చేసినా.. ఆది సక్సెస్ కాలేకపోతాడు. కళ్ల ముందు అమ్మ (అమల) ఉంటే బాగుండేది అనుకుంటారు. ఇరవేళ్ల క్రితం(మార్చి 28,1998) రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి ఆదికి స్టేజ్ ఫిగర్ ఇంకా ఎక్కువతుంది. ఇక శ్రీను చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేక హౌస్ బ్రోకర్గా మారుతాడు. ఇంగ్లీష్ అస్సలు రాదు. చిన్నప్పుడు మంచిగా చదువుకొని ఉంటే బాగుండేది కదా అని బాధ పడుతుంటాడు. ఇక మూడో వ్యక్తి చైతూకి పెళ్లి సమస్య. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలకుంటాడు. కానీ ఏ అమ్మాయి నచ్చదు. చిన్నప్పుడు తనను ఇష్టపడిన సీతను ఎందుకు ప్రేమించలేదని ప్రతి క్షణం బాధపడుతుంటాడు. ఇలా బాధపడుతున్న ఈ ముగ్గురు స్నేహితుల జీవితంలోకి సైంటిస్ట్ రంగీ కుట్టా పాల్ అలియాస్ పాల్ (నాజర్) ప్రవేశిస్తాడు. అతను టైమ్ మిషన్ కనిపెట్టడానికి 20 ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉంటాడు. చివరకు తను టైమ్ మిషన్ని కనిపెడతాడు. ఆ మిషన్తో ఆది,శ్రీను, చైతూలను భూత కాలంలోకి పంపుతానని చెబుతాడు. వారు కూడా తాము చేసిన తప్పులను సవరించుకోవాలని భావించి గత కాలంలోకి వెళ్లేందుకు రెడీ అవుతారు. మరి ఆది వెనక్కి వెళ్లి రోడ్డు ప్రమాదం బారిన పడకుండా తన తల్లిని కాపాడుకున్నాడా? శ్రీను, చైతూలు పాత తప్పుల్ని సరిదిద్దుకున్నారా? లేదా? భూతకాలంలో ఈ ముగ్గురికి ఎదురైన వింత సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా ఆదిత్య 369. ఆ మధ్య వచ్చిన ‘24’తో పాటు రీసెంట్గా విడుదలైన ‘బింబిసార’కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రాలే. అలాంటి కాన్సెప్ట్తో రూపొందిన చిత్రమే ‘ఒకే ఒక జీవితం’. అయితే ఆ సినిమాలతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది టైమ్ ట్రావెల్ చిత్రమే అయినప్పటికీ..ఇందులో ‘అమ్మ’ కథ దాగి ఉంది. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్ని ఆసక్తికరంగా చూపించాడు. టైమ్ మిషన్లోకి వెళ్లేంత వరకు కథ నెమ్మదిగా సాగుతుంది..కానీ ఒక్కసారి భవిష్యత్తులోకి వెళ్లాక వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముగ్గురు యువకులు.. చిన్నప్పుడు తామెలా ఉన్నామో చూసుకునేందుకు వెళ్లడం..తాము చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం..ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శర్వానంద్, అమల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎమోషనల్గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్పై క్యూరియాసిటీని పెంచుతుంది. వెన్నెల కిశోర్ పాత్ర సినిమాకు మరో ప్రధాన బలం. ఆ పాత్ర పండించిన కామెడీ థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. ప్రియదర్శి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చి దిద్దితే బాగుండేది. భూతకాలంలోకి వెళ్లిన శ్రీను, చైతూలను కూడా తమ ఫ్యామిలీలతో కలిసేలా చూపిస్తే.. కథ ఇంకాస్త ఎమోషనల్గా సాగేదేమో. క్లైమాక్స్ కూడా ఊహకి అందేలా ఉంటుంది. టైమ్ ట్రావెల్ సీన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. స్లో నెరేషన్ కూడా సినిమాకు కాస్త మైనస్. సైన్స్ గొప్పదని చెప్తూనే.. విధిని ఎవరు మార్చలేరనే విషయాన్ని బలంగా చూపించిన దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. శర్వానంద్ని నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఆది పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా చక్కగా నటించాడు. రొటీన్ కమర్షియల్ హీరో పాత్రలకు భిన్నమైన పాత్ర తనది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం వెన్నెల కిశోర్ పాత్ర. బ్రోకర్ శ్రీనుగా వెన్నెల కిశోర్ తనదైన కామెడీతో నవ్వించాడు. అదే సమయంలో కొన్ని చోట్ల అతను చెప్పే డైలాగ్స్ ఎమోషనల్కు గురిచేస్తాయి. చైతూ పాత్రకి ప్రియదర్శి న్యాయం చేశాడు. తన పాత్రని ఇంకాస్త బలంగా డిజైన్ చేస్తే బాగుండేది. ఇక ఈ సినిమాకు అమల పాత్ర మరో ప్లస్ పాయింట్. అమ్మ పాత్రకు చాలా బాగా సూట్ అయ్యారు. శర్వానంద్, అమల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ఇక ఆది లవర్ వైష్ణవిగా రీతూ వర్మ మెప్పించింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. సైంటిస్ట్ పాల్గా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇలాంటి సీరియస్ పాత్రలు చేయడం నాజర్కి కొత్తేమి కాదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం బాగుంది. ఈ చిత్రంలో హీరో గిటారిస్ట్. కాబట్టి సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా గుర్తిండిపోయే పాటలు లేకపోవడం మైనస్. ‘అమ్మ’పాట మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. కానీ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆ పాటని మర్చిపోతాం. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
'ఒకే ఒక జీవితం' చూసి ఎమోషనల్ అయిన నాగార్జున, అఖిల్!
శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో సెలబ్రిటీ ప్రీమియర్ షో వేసింది చిత్రబృందం. ఈ షోకి అక్కినేని నాగార్జున, అఖిల్, దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి తదితరులు హాజరయ్యారు. సినిమా చూసి నాగార్జున, అఖిల్ ఎమోషనల్కు గురయ్యారు. ముఖ్యంగా తల్లికొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ నాగ్ని కంటతడి పెట్టించాయట. ఇంత గొప్ప కథను తెరకెక్కించిన దర్శకుడి కార్తీక్ని, అద్భుతంగా నటించిన శర్వానంద్ని అక్కినేని హీరోలు అభినందించారు. ఓకే ఒక జీవితం అద్భుతమైన సినిమా అని, ఇప్పటి వరకు వచ్చిన టైమ్ ట్రావెల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉందని దర్శకులు హనురాఘవ పూడి, చందూ మొండేటి అన్నారు. గతంలోకి వెళ్లి మనల్ని మనం సరిచేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ని కార్తీక్ తెరపై చక్కగా చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా... సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య సాహిత్యం అందించారు. తెలుగులో తరుణ్ భాస్కర్ డైలాగులు రాశారు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే) -
‘ఒకే ఒక జీవితం’ ప్రెస్మీట్ (ఫోటోలు)
-
అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
‘‘గతం తాలూకు ఆలోచనలతో మనం దిగాలుగా ఉంటే అది బాధ. భవిష్యత్ గురించి ఆలోచిçస్తుంటే అది ఆశ. కానీ ఆలోచనలతో ఈ వర్తమాన క్షణాలను ఆస్వాదించడం మనం మర్చిపోతున్నాం. అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఈ విషయాన్నే శ్రీ కార్తీక్ ‘ఒకే ఒక జీవితం’తో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అనేది ఒక భాగం మాత్రమే. నా పాత్ర, వెన్నెల కిశోర్, ప్రియదర్శి.. ఇలా ఏదో ఒక క్యారెక్టర్తో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించాను. పదేళ్ల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమాతో నాకు శర్వానంద్ మూడో కొడుకు అయ్యారు (నవ్వుతూ). ఈ సినిమాలో ముగ్గురి జర్నీ చూస్తారు. ఈ ముగ్గురూ కాలంతో ఆడుకుని ఓ అంశాన్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు విధి మాత్రం మారదు. ఎందుకనేది థియేటర్స్లో చూడాలి’’ అన్నారు అమల. ‘‘నేను తెలుగువాడినే. మా అమ్మగారి మాతృభాష తెలుగు. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా అమ్మ గురించి తీసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘అమ్మ’ పాట చిరకాలం నిలిచిపోతుంది’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘మా బ్యానర్ నుంచి వచ్చిన ‘ఖాకీ’, ‘ఖైదీ’ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ నమ్మకంతోనే తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఒకే ఒక జీవితం’ చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. ‘‘అమలగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రీతూ వర్మ. -
గ్రీన్ కలర్ శారీలో ఏంజెల్లా మెరిసిపోతున్న రీతూ వర్మ (ఫోటోలు)
-
పెద్ద స్టార్ అవ్వాలంటే అన్ని హిట్లు కావాలి: నాగశౌర్య
‘‘ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను. నాకు ఇక్కడ మంచి సపోర్ట్ దక్కింది. ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ వేడుకలో బన్నీగారు (అల్లు అర్జున్) నా గురించి మాట్లాడటం సంతోషంగా అనిపించింది. నేనింకా కష్టపడాలి అనే స్ఫూర్తిని ఆయన మాటలు ఇచ్చాయి’’ అని నాగశౌర్య అన్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. లక్ష్మీ సౌజన్య అక్క ‘వరుడు కావలెను’ కథ చెప్పినప్పుడు బావుందనిపించింది.. ఫైనల్ అవుట్పుట్ చూశాక బ్లాక్బస్టర్ అని అర్థమైంది. ఈ సినిమా రిజల్ట్లో ఏదన్నా డౌట్గా ఉంటే నా ముఖంలో తెలిసిపోతుంది. నేను సినిమాల్లోనే నటించగలను.. బయట కాదు. 30 ఏళ్లు దాటిన అబ్బాయి, అమ్మాయిలను పెళ్లెప్పుడు? అని ఇంట్లో వాళ్లు అడుగుతుంటారు. అబ్బాయి, అమ్మాయిలు పెళ్లికి ఎంతవరకూ రెడీగా ఉన్నారన్నది ఆలోచించరు.. ఇలాంటి పాయింట్ జనాలకు బాగా రీచ్ అవుతుందని ఈ సినిమా చేశాను. మెచ్యూర్డ్ లవ్స్టోరీ. ఈ సినిమా కోసం త్రివిక్రమ్గారు ఓ సీన్ రాశారు. అందులో నటించడం, డైలాగులు చెప్పడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాని నా కుటుంబ సభ్యులకు చూపించమని చినబాబుగారు చెప్పారు. ‘సినిమా మీద డౌట్ ఉంటే చూపించొచ్చు.. డౌట్ లేనప్పుడు జనాలతో కలిసి చూస్తేనే బావుంటుంది’ అని చెప్పాను. ఆయన లాంటి నిర్మాతలు అవసరం. నాగవంశీ కూడా ఈ సినిమా విషయంలో రాజీ పడలేదు. గతంలో నేను నందినీ రెడ్డిగారితో పని చేశాను.. ఇప్పుడు లక్ష్మీ సౌజన్య అక్కతో చేశా. మేల్ డైరెక్టర్స్తో పోలిస్తే మహిళా దర్శకులకు ఓపిక ఎక్కువ.. అది మనకు అడ్వాంటేజ్. u పెద్ద స్టార్ కావడానికి ఐదు హిట్లు కావాలి. నాకు ‘ఛలో’ పెద్ద హిట్. ‘వరుడు కావలెను’ రెండో పెద్ద హిట్. మరో మూడు హిట్స్ కావాలి. ఒకే రోజు ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం బెటర్. ‘నర్తనశాల’ ఫ్లాప్ తర్వాత కూడా నాకు బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమా ‘అశ్వథ్థామ’. హిట్, ఫ్లాప్ శాశ్వతం కాదు.. వాటి గురించి ఆలోచించను. నా పెళ్లి విషయంలో ప్లాన్స్ లేవు. టైమ్ వచ్చినప్పుడు జరుగుతుంది. నేను చేసిన ‘లక్ష్య’ చిత్రం నవంబర్లో విడుదలవుతుంది. అనీష్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 90 శాతం పూర్తయింది. అవసరాల శ్రీనివాస్తో చేస్తున్న ‘ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి’ డ్రీమ్ ప్రాజెక్ట్లాంటిది. ఇందులో ఏడు రకాలుగా కనిపిస్తాను. చదవండి: పలు వివాహ వేడుకల్లో ‘వరుడు కావలెను’ నటులు.. సర్ప్రైజ్లో వధూవరులు -
‘వరుడు కావలెను’ మూవీ ట్విటర్ రివ్యూ
యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పక్క ప్లానింగ్తో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో నాగ శౌర్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘వరుడు కావలెను’ ఈ శుక్రవారం(అక్టోబర్ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. #VaruduKaavalenu - Flashback episode is the biggest asset 👉#VaruduKavalenu 15 Minutes flashback in the film which is quite key and will impress everyone with its emotions and story 👉The film has mature emotions which will really impress today's youth#NagaShaurya #RituVarma — PaniPuri (@THEPANIPURI) October 28, 2021 సినిమా ప్లాష్బ్యాక్లో వచ్చే సీన్స్ హైలెట్ అని చెబుతున్నారు. 15 నిమిషాల పాటు సాగే ప్లాష్బ్యాక్ ఎపిసోడ్ సినిమా స్థాయిని పెంచినట్లు ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #VaruduKaavalenu Decent ga bane undi movie.....2nd hf kastha slow..... but overall not bad... plot could have been better...Lead pair was good pic.twitter.com/w5PegX8kwU — CineManiac (@sreekar08) October 29, 2021 వరుడు కావలెను యావరేజ్ మూవీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బలహీనమైన కథ, నెరేషన్ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేకపోయింది. కిషోర్, ప్రవీణ్ కామెడీ, ఫ్లాష్ బ్యాక్ లో సత్య, వెడ్డింగ్ సన్నివేశాలలో సప్తగిరి కామెడీ నవ్వులు పూయిస్తుందట. Outdated to the core, first half 👎👎 #VaruduKaavalenu — SADDY (@king_sadashiva) October 29, 2021 #VaruduKaavalenu Overall an Average Timepass Watch! Music, production values, and a few well written scenes are the highlights. On the flipside, there was very little emotional connect and the narravite and plot was age-old. Rating: 2.5/5 — Venky Reviews (@venkyreviews) October 29, 2021 #VaruduKaavalenu Below Average Movie. Routine stuff and entertaining ga kuda emi ledu🙏🙄 — Shiva (@NTR_Cultt) October 29, 2021 End credits scene ki cut cheppadam marchinattu unnaru. Adhi ayipoyesariki Theatre lo evaduu undadu. Lite. Outdated affair. Neither entertaining nor interesting. #VaruduKaavalenu — Silent GuaRRRdian (@Kamal_Tweetz) October 29, 2021 -
హీరోయిన్ రీతూ వర్మ మూవీ టైటిల్స్పై త్రివిక్రమ్ సెటైర్లు
Trivikram Srinivas Satires On Ritu Varma Movie Titles: నాగ శౌర్య, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల29న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం(అక్టోబర్28)న హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ హీరోయిన్ రీతూవర్మ సినిమా టైటిళ్లపై సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. 'వరుడు కావలెను సినిమాను నేను చూశాను. చాలా రోజుల తర్వాత సినిమా మొత్తం చీరకట్టిన హీరోయిన్ను చూశాను. ఆమె సినిమాలన్నీ చూస్తే...పెళ్లిచూపులు, కనులు కనులు దోచాయంటే.. ఇప్పుడు వరుడు కావలెను. తర్వాత షామినా, కేటరింగ్, లాజిస్టిక్ సర్వీసెస్.. ఇలాంటి సినిమాలు తీస్తారేమో. అసలే సినిమావాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి మిగతావాళ్లు కూడా నీతో ఇలాంటి సినిమాలు తీస్తారు' అంటూ రీతూ సినిమా టైటిళ్లపై సెటైర్లు వేశారు. త్రివిక్రమ్ కౌంటర్లతో హీరోయిన్ రీతూ సిగ్గుతో తలపట్టుకుంది. -
ప్రేమలో పడ్డానంటున్న ‘లవ్లీ’ బ్యూటీ, ఎప్పటికీ డిలిట్ చేయనంటున్న దీపికా
► ‘నేను చెప్పేది పూర్తిగా వినే ఓపిక లేకుంటే వెళ్లిపోండి, ఎందుకంటే నేను పెద్ద పెద్ద ప్యారగ్రాప్లు రాస్తాను, ఒక్క వ్యాఖ్యంలో చెప్పడం రాదు’ అంటున్న కాజోల్ ► గత జ్ఞాపకాలతో లవ్లో పడ్డానంటున్న లవ్వీ బ్యూటీ శాన్వి శ్రీవాత్సవ ► క్యూట్గా ఉంది, ఎప్పటికీ డిలీట్ చేయనంటున్న దీపిక పదుకొనె ► తీర్థ యాత్రలు అయిపోయాయి, పెయింటింగ్తో బిజీ అయిపోయిన సమంత View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shanvi sri (@shanvisri) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Mishti Chakravarty (@mishtichakravarty) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) -
అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: రీతూ వర్మ
‘‘వరుడు కావలెను’ చిత్రం టీజర్, ట్రైలర్ చూసి కొందరు ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. మంచి భావోద్వేగాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ఎంటర్టైనర్’’ అని రీతూ వర్మ అన్నారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. చదవండి: Vijay Devarakonda: విజయ్కి 40 నుంచి 50 వరకు రిలేషన్షిప్స్ ఉండేవి: ఆనంద్ ఈ సంద ర్భంగా రీతూ వర్మ మాట్లాడుతూ..‘‘లక్ష్మీ సౌజన్యగారు ఈ సినిమా కథ చెప్పగానే బాగా నచ్చేసింది. నాకు ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ఈ మూవీలో నేను చేసిన భూమి పాత్ర అలాంటిదే.. నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచిపోతుంది. సెట్స్లో అడుగుపెట్టాక మేల్ డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్ అనే తేడా ఉండదు.. అందరితో సౌకర్యంగా పని చేస్తాను. మా జంట (నాగశౌర్య–రీతూ) బాగుందని చాలామంది చెబుతుంటే రిలీజ్కి ముందే సగం రిజల్ట్ వచ్చేసినట్టుంది. చదవండి: ‘హరిహర వీరమల్లు’లో అకీరా?, తండ్రితో కలిసి పలు సీన్స్లో సందడి.. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇప్పటివరకు నాకు డ్యాన్స్ చేసే సాంగ్స్ పడలేదు. ఈ సినిమాలో ‘దిగు దిగు...’ అనే మాస్ సాంగ్ చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం శర్వానంద్తో ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తున్నాను. తమిళ్లో ఓ సినిమా, ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అన్నారు. పెళ్లెప్పుడు అని అడగ్గా.. ‘‘ఇంకా రెండు మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి నిర్ణయాన్ని మా ఇంట్లో నాకే వదిలేశారు. అయినా అప్పుడప్పుడూ పెళ్లి మాట ఎత్తకుండా ఉండరు (నవ్వుతూ)’’ అన్నారు రీతూ వర్మ. -
‘వరుడు కావలెను' ముందు నాగచైతన్యకు చెప్పా: డైరెక్టర్
‘‘సినిమాలు, అందులోని క్యారెక్టరైజేషన్స్ చూసి చాలామంది స్ఫూర్తి పొందుతారు. కాబట్టి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించకూడదు. పదిమందిని బాగుచేయకపోయినా పర్లేదు కానీ ఒక్కర్ని కూడా చెడగొట్టకూడదు. దర్శకత్వాన్ని నేనో బాధ్యతగా స్వీకరించాను. నేను ఏ సినిమా చేసినా చూసినవారు హ్యాపీగా ఉండేలా, ఒక మంచి విషయం నేర్చుకునేలా తీయాలనుకుంటాను’’ అన్నారు దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీ సౌజన్య చెప్పిన విశేషాలు. కర్నూలు జిల్లాలో పుట్టాను. గుంటూరులో పెరిగాను. సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ ఇండస్ట్రీని ఎంచుకున్నాను. దర్శకులు తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, ప్రకాశ్ కొవెలమూడి, మంజుల... 15 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఇక ఇలాగే ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోతానేమోనని ‘వరుడు కావలెను’ కథ రాసుకుని దర్శకురాలిగా మారాను. ∙2017లో ‘వరడు కావలెను’ సినిమా స్టోరీలైన్ను నిర్మాత చినబాబుకు చెప్పాను. ఆయనకు నచ్చింది. ఆ తర్వాత పూర్తి కథ తయారు చేశాను.. ఓకే అన్నారు. కానీ అనుకోకుండా మా నాన్నగారు దూరం కావడం, కరోనా, లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ముందు ఈ కథను నాగచైతన్యకు చెప్పాను. కానీ ప్రాజెక్ట్ కుదర్లేదు. ఆ తర్వాత నాగశౌర్య ఓకే అయ్యారు. ∙ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి తనకు కాబోయే వరుడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని ఆశపడుతుందో అదే ‘వరుడు కావలెను’ సినిమా. ఇందులో ఆర్కిటెక్చర్ ఆకాశ్ పాత్రలో నాగశౌర్య, ఎకో–ఫ్రెండ్లీ బిజినెస్ ఉమెన్ భూమి పాత్రలో రీతూ వర్మ కనిపిస్తారు. ఇద్దరూ బాగా చేశారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మంచి సంగీతం అందించారు. మాస్ సాంగ్స్ కోసం తమన్ని తీసుకున్నాం. నిర్మాత చినబాబుగారు ఈ సినిమాకు హీరో. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్టే లేదు. ఓ పెద్ద నిర్మాణసంస్థ ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అయితే రిలీజ్ టెన్షన్ ఉంది. కానీ సినిమా చూసిన ప్రతి అబ్బాయి, అమ్మాయి మా ‘వరుడు కావలెను’ సినిమాకు కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది. సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి రంగంలోనూ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇప్పుడు సమానమైన అవకాశాలు ఉంటున్నాయి. ఎవరైనా రన్నింగ్ రేస్లో పరిగెత్తాల్సిందే. పరిగెత్తగలిగితేనే రావాలి. నేను అమ్మాయిని కాబట్టి రిజర్వేషన్ ఇవ్వండి అంటే కుదరదు. ప్రతిభ ఉన్నప్పుడు ఎవరికైనా ప్రోత్సాహం లభిస్తుంది. నా దగ్గర కథలు ఉన్నాయి. ఐడెంటిటీ క్రైసిస్పై (గుర్తింపు కోసం తపన) ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. -
వివాహ వేడుకల్లో ‘వరుడు కావలెను’ నటులు.. సర్ప్రైజ్లో వధూవరులు
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఇందులో వారు ఆకాశ్, భూమి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 29న థియేటర్స్లో విడుదల కానుంది. దీంతో ఈ మూవీని ప్రమోషన్ చేసే పనిలో పడింది చిత్ర బృందం. మూవీ ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన పలు వివాహ వేడుకలకి హాజరయ్యారు హీరో హీరోయిన్లు నాగశౌర్య, రీతూ వర్మ. ఇలా సెలబ్రిటీలు తమ వివాహ వేడుకకి రావడంతో వధూవరులతో పాటు ఫంక్షన్కి వచ్చిన అతిథులు సైతం ఎంతో సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా వారితో కలిసి ఫోటోలు దిగారు ఈ నటీనటులు. వీటికి సంబంధించిన ఈ పిక్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చదవండి: మనసుకు హత్తుకునేలా ‘మనసులోనే నిలిచిపోకే’ మెలోడీ Aakash @IamNagashaurya & Bhoomi @riturv made a surprise visit to a few marriages that happened in Hyderabad. #VaruduKaavalenu In Theatres from 29th Oct 2021! ✨@LakshmiSowG @vamsi84 @Composer_Vishal @ganeshravuri @vamsi84 @vamsi_p1988 @NavinNooli @adityamusic @SitharaEnts pic.twitter.com/MP0PwMTVyA — BA Raju's Team (@baraju_SuperHit) October 25, 2021 -
Varudu Kavalenu:పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చని అమ్మాయిని ప్రేమిస్తే..?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ఫేమ్ రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’.లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్తో పాటు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ని దగ్గుబాటి రానా విడుదల చేస్తూ.. చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపాడు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘పెళ్లి చూపుల కాన్సెప్టే మా అమ్మాయికి పడదు’ అనిహీరోయిన్ తల్లి చెప్పిన డైలాగ్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పెళ్లి చూపులు కాన్సెప్ట్ అంటేనే ఇష్టంలేని భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆకాశ్. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ప్రయత్నం ఫలించి.. భూమి ప్రేమను పొందుతాడు. కట్ చేస్తే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. మరి ఆ విభేధాలకు గల కారణాలు ఏంటో తెలియాలంటే.. అక్టోబర్ 29న థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. -
లేడీ బాస్గా రీతూ వర్మ, మూతి ముడుచుకున్న నిహారిక
నలుపు అంటే ఇష్టం అంటున్న ఐశ్వర్య రాజేశ్ చీరకట్టులో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా తండ్రి కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్తో శుృతి హాసన్ View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Madonna Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న మరో ఫోక్సాంగ్
ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్కి మంచి ఆధరణ లభిస్తుంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాల్లో కశ్చితంగా ఒక ఫోక్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇటీవలె విడుదలైన సారంగదరియా, బుల్లెట్ బండి వంటి పాటలు ఎంతలా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ‘వరుడు కావలెను’సినిమా నుంచి రిలీజైన “దిగు దిగు నాగ” అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ పాటకు 20 మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయి. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను శ్రేయా గోషల్ ఆలపించింది. థమన్ సంగీతం అందించారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానుంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ప్రమోషన్స్ను మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 20M+ Views for Folk Sensation #DiguDiguDiguNaaga💥🥁 ▶️https://t.co/U7F59YlUAV 🎵 @MusicThaman 🎤 @shreyaghoshal ✍️ #AnanthaSriram#VaruduKaavalenu @IamNagashaurya @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @SitharaEnts @adityamusic pic.twitter.com/MByedtS4Nc — Aditya Music (@adityamusic) October 11, 2021 -
వరుడు కావలెను నుంచి 'వడ్డాణం' సాంగ్ రిలీజ్
Vaddaanam Song From Varudu Kaavalenu: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘దిగు దిగు దిగు నాగ, మనసులోనే నిలచిపోకే పాటలు సూపర్హిట్గా నిలిచాయి. తాజాగా 'వడ్డాణం' అనే ఫన్ అండ్ పెప్పీ సాంగ్ను రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ ఈ పాటను సంగీతం అందించారు. 'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు..వయ్యారం చిందేసే అందాల బొమ్మలు'..అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. రిలీజ్ అయిన కాసేపటికే వ్యూస్ పరంగా దూసుకెళ్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
దసరా రేసులో 'వరుడు కావలెను' మూవీ
Varudu Kaavalenu Movie Release Date: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఇప్పటికే దసరా రేసులో పలు చిత్రాలు ఉన్నాయి. తాజాగా వరుడు కావలెను చిత్ర బృందం కూడా దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ సినిమాపై పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Love, Fun & Emotions packed & ready to entertain you! Our #VaruduKaavalenu coming to theatres near you from 15th October, 2021.#VaruduKaavalenuFrom15thOct @IamNagashaurya @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @ganeshravuri @vamsi84 @NavinNooli @adityamusic pic.twitter.com/xNhgrKh2ci — Sithara Entertainments (@SitharaEnts) September 25, 2021 -
మనసుకు హత్తుకునేలా ‘మనసులోనే నిలిచిపోకే’ మెలోడీ
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్, టీజర్తో పాటు విడుదలైన ‘కోలా కల్లే ఇలా’, ‘దిగు దిగు’ పాటలు సైతం ప్రేక్షకాదరణని పొందాయి. తాజాగా ఆ సినిమా మూడో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. ‘మనసులోనే నిలిచిపోకే.. మైమరుపులా మధురిమ’ అంటూ పల్లవితో సాగే ఈ మెలోడీ మనసుకు హత్తుకునేలా ఉంది. పాట తీసిన లోకేషన్స్ ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. పాటలో హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి. నాగ శౌర్య, రీతూ వర్మ జంట అందంగా, చూడముచ్చటగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ‘మనసులోనే నిలిచిపోకే’ పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, గాయనీ చిన్మయి మనసుకు హత్తుకునేలా ఈ పాటను ఆలపించిందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. చదవండి: ‘వరుడు కావలెను’ టీజర్ వచ్చేసింది -
హ్యాపీ బర్త్డే చెప్పిన ఖుష్భు, నవ్విన బిగ్బాస్ బ్యూటీ
ఆమె నమ్మిందే చేస్తుందంటూ చీర ఫొటో షేర్ చేసిన జెనిలియా ‘శివగామి’కి హ్యాపీ బర్త్డే చెప్పిన ఖుష్భు బ్లాక్ అండ్ వైట్లో ఇలియానా, ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా.. ఇంకా ఎటిఎమ్కు వెళుతున్నారా అంటూ వీడియో షేర్ చేసిన శ్రీముఖి View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sushma kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
టక్ జగదీష్ టీం తో ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ
-
‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ
టైటిల్ : టక్ జగదీష్ నటీనటులు : నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, నాజర్, జగపతి బాబు, రావు రమేశ్, నరేశ్ తదితరులు నిర్మాణ సంస్థ : షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది దర్శకత్వం : శివ నిర్వాణ సంగీతం : తమన్ నేపథ్య సంగీతం: గోపీసుందర్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తొలి సినిమా 'అష్టా చమ్మా' మొదలు గత ఏడాదిలో విడుదలైన ‘వి’వరకు ప్రతి సినిమాలోనూ కొత్తదనం, కొత్త తరహా పాత్రలు పోషిస్తూ, తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేచురల్ స్టార్ నటించిన తాజా చిత్రం ‘టక్ జగదీష్’. తరచూ ప్రేమ కథా చిత్రాలతో అలరించే నాని.. తొలిసారి తెలుగింటి కుటుంబ కథను ఎంచుకున్నాడు. నానికి ‘నిన్నుకోరి’ లాంటి సూపర్ హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయకచవితి సందర్భంగా శుక్రవారం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. . టీజర్, ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ఈ ‘టక్ జగదీష్’ ఏ మేరకు అందుకున్నాడో రివ్యూలో చూద్దాం. టక్ జగదీష్ కథేంటంటే భూదేవిపురం గ్రామానికి చెందిన టక్ జగదీష్ అలియాస్ జగదీష్ నాయుడుకి కుటుంబం అంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్)అంటే జగదీష్కి ప్రాణం. తన తండ్రి ఆదిశేషు హఠాన్మరణం చెందడంతో ఇంటి బాధ్యలతను అన్నయ్య బోసు (జగపతి బాబు)కి అప్పగించి పై చదువుల కోసం పట్నానికి వెళ్తాడు జగదీష్. అయితే తనకు తెలియకుండా వేరే వ్యక్తితో మేనకోడలు పెళ్లి చేస్తారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసకోని జగదీష్ గ్రామానికి వస్తాడు. ఈ లోగా తన కుటుంబంలో సమస్యలు వచ్చి అందరూ విడిపోతారు. గ్రామ ప్రజలు కూడా జగదీష్ కుటుంబంపై ద్వేషం పెంచుకుంటారు. అసలు తన కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారు? అమితంగా ఇష్టపడే మేన కోడలు పెళ్లి జగదీష్కు తెలియకుండా ఎవరితో, ఎందుకు చేశారు? పదిమందికి ఆదర్శంగా ఉండే ఆదిశేషు కుటుంబంలో వచ్చిన సమస్య ఏంటి? దాన్ని జగదీష్ ఎలా పరిష్కరించాడు? ఇందులో రీతు వర్మ పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. జగదీష్ నాయుడు అనే బరువైన పాత్రని అవలీలగా పోషించేశాడు. ముఖ్యంగా ఎమ్మార్వో జగదీష్ నాయుడిగా అదరగొట్టేశాడు. హీరో అన్నయ్య బోసు పాత్రలో జగపతి బాబు జీవించేశాడు. చాలా కాలం తర్వాత జగపతి బాబు అన్నయ్య పాత్రను పోషంచి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో తండ్రి ఆదిశేషు నాయుడిగా నాజర్ తనదైన నటనతో మెప్పించాడు. వీఆర్వో గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో రీతూవర్మ చక్కగా ఒదిగిపోయింది. హీరో మేనకోడలు చంద్ర పాత్రలో ఐశ్యర్య రాజేశ్ పర్వాలేదనిపించింది. అలాగే రావు రమేశ్, నరేశ్, మాలపార్వతి, రోహిని, దేవదర్శిని తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబం కథతో తెరకెక్కిన చిత్రమే ‘టక్ జగదీష్’. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు శివ నిర్వాణ. ఇప్పుడు టక్ జగదీష్తో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రుచి చూపించాడు. కుటుంబం, ఆస్తి తగాదాలు, ఊర్లో భూ గొడవలు కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఇలాంటి నేపథ్యం ఉన్న చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. టక్ జగదీష్లో కొత్తగా చూపించిదేమి లేదు. పైగా మేనకోడలు బాధ్యత, ఎమ్మార్వో ఉద్యోగం, హీరోకి ఓ ప్రేమ కథ.. అంటూ చాలా పెద్ద స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు. రెండున్నర గంటల్లో ఇంత పెద్ద కథను తెరపై చూపించడం కొంచెం కష్టమే. అయినప్పటికీ.. కథలోని ప్రతి పాత్రకు ఓ జస్టిఫికేష్ ఇస్తూ చాలా క్లారిటీగా చేప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడనే చెప్పాలి. కానీ కమర్షియల్ కంటెంట్ లేకపోవడం సినిమాకు కాస్త మైనస్. ‘అయినోళ్లకంటే ఆస్తులు పొలాలు ఎక్కువకాదు..రక్త సంబంధం విలువ తెలుసుకో’, ‘మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు’ లాంటి డైలాగ్స్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక సాంకేతిక విషయాకొస్తే.. తమన్ పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా.. గోపీసుందర్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రావడం ప్లస్ పాయింటనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఫ్యామిలీ డ్రామాలు వచ్చి చాలా కాలమైంది. పైగా ఓటీటీలో సినిమా అందుబాటులో ఉండడం.. ‘టక్ జగదీష్’కి కలిసొస్తుందనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
నానిలోనాకు బాగా నచ్చిన విషయం అదే : రీతూ వర్మ
‘టక్ జగదీష్’కచ్చితంగా థియేటర్ సినిమానే. బిగ్ స్క్రీన్లో చూసిన ఎక్స్ పీరియన్స్ వేరేలా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఓటీటీ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ కచ్చితంగా థియేటర్లో చూసిన ఫీలింగ్ను మాత్రం మిస్ అవుతాం’అన్నారు హీరోయిన్ రీతూ వర్మ. నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రీతూ వర్మ చెప్పిన విశేషాలు.. ► ఇప్పటి వరకు చేసిన పాత్రలు, సినిమాల్లో కెల్లా ఇది ప్రత్యేకం. పూర్తిగా కమర్షియల్ సినిమాలో నటించాను. ప్రభుత్వాధికారిగా గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో నటించాను. గవర్నమెంట్ ఆఫీసర్గా తన అధికారాన్ని చూపించే పాత్ర అది. పాత్రలో చాలా అమాయకత్వం కూడా ఉంటుంది. మనసులో ఏముంటే అదే మాట్లాడే అమ్మాయి. ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి.. తాను కరెక్ట్ అనుకునే దాని కోసం పోరాడే పాత్రలో నటించాను. ► ఇది కచ్చితంగా థియేటర్ సినిమానే. బిగ్ స్క్రీన్లో చూసిన ఎక్స్ పీరియన్స్ వేరేలా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ కచ్చితంగా థియేటర్లో చూసిన ఫీలింగ్ను మాత్రం మిస్ అవుతాం. ఇప్పుడు ఓటీటీ కూడా మంచి ఫాంలో ఉంది. లాక్డౌన్ సమయంలో ఓటీటీ మీద మనం ఆధారపడ్డాం. అదే మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో టక్ జగదీష్ సినిమా విడుదలవుతుండటంతో ఒకేసారి ఎంతో మంది చూసే అవకాశం ఉంది. ► సాధారణంగా సిటీ అమ్మాయిని. ఎప్పుడూ కూడా గ్రామాల్లోకి వెళ్లలేదు. ఉండలేదు. కానీ నేను మనుషులను ఎక్కువగా గమనిస్తుంటాను. ఎక్కడో చూసిన విషయాలు అలా గుర్తుండిపోతాయి. పైగా నేను దర్శకుడు చెప్పింది చేసే నటిని. ఈ పాత్ర కోసం శివ నిర్వాణ గారే ఇన్ పుట్స్ ఇచ్చేశారు. ఆ పాత్రకు సంబంధించిన క్యాస్టూమ్ ధరించగానే పాత్రలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. ► నానితో ఇది రెండో సారి నటించడం. మొదటగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించాను. కానీ అందులో నాది చిన్న పాత్ర. అంతగా ఇంటరాక్షన్ అవ్వలేదు. నేను కూడా అప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఈ సారి మాత్రం నానితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. ఎంతో నేర్చుకున్నాను. సినిమా, జీవితం వంటి వాటి మీద నానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. నాని మాట్లాడితే అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. అయనెంతో సపోర్ట్ చేశారు. ► నాని సెల్ప్ మేడ్ స్టార్. ఆయన గ్రాఫ్ అలా పెరుగుతూనే వస్తోంది. ప్రతీ సినిమాతో ప్రేక్షకుడికి ఏదో ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. నానిలో నచ్చిన విషయం అదే. ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని, టక్ జగదీష్లో నానికి ఉన్న వ్యత్యాసం చెప్పేంత స్థాయి నాకు లేదు. నాని నటన అంటే ఇష్టం, ఆయన ఎంచుకునే కథలు ఇష్టం. మరోసారి ఆయనతో కలిసి నటించాలని ఉంది. ► టక్ జగదీష్ కమర్షియల్ సినిమా అయినా కూడా రియలిస్టిక్గా ఉంటుంది. ఓవర్ యాక్షన్, డ్రామా సీన్లు ఉండవు. సటిల్ యాక్షన్ ఉంటుంది. ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ప్రతీ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. యూనిక్గా ఉంటుంది. కచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ► శివ నిర్వాణ సినిమా అంటే ఎమోషన్స్ కచ్చితంగా ఉంటాయి. నిన్నుకోరి, మజిలి సినిమాలు చూసినప్పుడు శివ నిర్వాణ గారితో పని చేయాలని అనుకున్నాను. నాకు డ్రామా ఎమోషనల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ► టక్ జగదీష్లో కామెడీ కూడా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నానికి, నాకు ఉన్న సీన్స్లోనూ చిరునవ్వును తీసుకొస్తుంది. టక్ జగదీష్ తరువాత ఇంకా మంచి ఆఫర్లు వస్తాయని ఆశిస్తున్నాను. ఈ మూవీతో ఓ వర్గం ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాను. నేను ఎక్కువగా అర్బన్ ఫిల్మ్స్, మల్టీ ప్లెక్స్ సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్కు మరింత దగ్గరవుతాను. ►ఓ నటిగా నేను భిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటాను. అయితే నా పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉందని చూస్తాను.. నా పాత్ర కథకు బలమైందిగా ఉందా? లేదా? అని ఆలోచిస్తాను. అంతే కానీ నేను పలాన పాత్రలను చేయను అని ఏమీ లేదు. అన్ని రకాల పాత్రలను చేసేందుకు నేను సిద్దంగానే ఉన్నాను. ►వరుడు కావలెను అక్టోబర్లో రిలీజ్ కానుంది. ఆ తరువాత ద్విభాష చిత్రం ఒకే ఒక జీవితం, మరో తమిళ సినిమాకు సైన్ చేశాను. వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుగుతున్నాయి. నాకు డ్యాన్సులు చేయడం, పాటలు పాడటం, ఎంజాయ్ చేసే పాత్రలను పోషించడం అంటే ఇష్టం. కానీ నాకు ఎక్కువగా అలాంటి అవకాశాలు రాలేదు. కానీ వరుడు కావలెనులో వచ్చింది. ►ప్రస్తుతానికి అయితే నటన మీదే దృష్టి పెట్టాను. కానీ నాకు సినిమాలు తీయాలని ఉంది. ఓటీటీ కోసం చిన్న సినిమాలను తీయాలని అనుకుంటున్నాను. కో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. ►తినడం ఇష్టం. వంటలు వండటం కూడా ఇష్టం. కానీ అప్పుడప్పుడే వండుతాను. అమ్మ మాంసాహారి, నాన్న శాకాహారి. నేను రెస్టారెంట్లకు ఎక్కువగా వెళ్తాను.. వెరైటీ ఫుడ్లను టేస్ట్ చేస్తుంటాను. -
దుమ్మురేపుతున్న ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్తో పాటు ఓ మెలోడీ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. ‘దిగు దిగు దిగు నాగ’అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా… శ్రేయ ఘోషల్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. తెలంగాణలో చాలా పాపులర్ అయిన ఫోక్ సాంగ్ దిగు దిగు దిగు నాగ’మాదిరి, చాలా హుషారుగా సాగే పాట ఇది. 'కొంపకొచ్చిపోరో కోడెనాగ .. కొంప ముంచుతాందోయ్ ఈడు బాగా' వంటి పదప్రయోగాలు బాగున్నాయి. మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే పాట ఇది. -
టక్ జగదీశ్: త్వరలోనే రిలీజ్ డేట్..
నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీశ్. షూటింగ్ను పూర్తి చేసుకుని ఏప్రిల్లో విడుదలకు సిద్దమైన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉండగా మేకర్స్ త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి వస్తుండటంతో త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో వీలైనంత త్వరలోనే టక్ జగదీశ్ మూవీని విడుదలకు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్తో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ విడుదల ఎప్పడేప్పుడా అని అభిమాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుచేత థియేటర్లు తెరుచుకోగానే తొలి చిత్రంగా టక్ జగదీశ్ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారుట. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్, టీజర్, పాటలకు విశేష స్పంది వచ్చిన సంగతి తెలిసిందే. షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం నానికి అన్నయ్యగా విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. -
సరికొత్తగా శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్లుక్
నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ 30వ చిత్రంగా ‘ఒకే ఒక జీవితం’ తెరకెక్కతుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ఫ్రభులు నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్లుక్ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీకి ఒకే ఒక లోకం అనే టైటిల్ను మేకర్స్ చేశారు. శర్వానంద్ గిటార్తో దర్శనం ఇచ్చాడు. సైన్స్ఫిక్షన్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతుంది. ఇక సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫస్ట్లుక్లో పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరోవైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్స్తో ఉన్న ఈ పోస్టర్ను చూస్తుంటే ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఈ మూవీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఇందులో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి సహానటులుగా కాగా అక్కినేని అమల ఒక కీలక పాత్ర పోషించనుండటం విశేషం. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీకి జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. -
వరుడు.. నరుడు...ఆన్ సెట్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు సినిమాల చిత్రీకరణలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేయడంతో తిరిగి సినిమాల షూటింగ్లు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘వరుడు కావలెను’, ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాల షూటింగ్లు కూడా గురువారం పునఃప్రారంభమయ్యాయి. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా చివరి షెడ్యూల్ను ప్రారంభించారు. హీరో, హీరోయిన్లపై శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. కాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్గా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరుడి బ్రతుకు నటన’ షూటింగ్ కూడా ప్రారంభమైంది. -
సోషల్ హల్చల్: వీడియోలు షేర్ చేసిన ముద్దుగుమ్మలు
► కీర్తి సురేశ్తో సిటప్స్ చేయించిన డైరెక్టర్ ► అమ్మకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన అనుపమ పరమేశ్వరన్ ► జున్నుకు బర్త్డే విషెస్ తెలిపిన యాంకర్ లాస్య ► అప్పుడలా, ఇప్పుడిలా అంటూ వీడియో షేర్ చేసిన దీప్తి సునయన ► ర్యాండమ్ వీడియో షేర్ చేసిన శృతిహాసన్ ► బీచ్ అందాలను ఆస్వాదిస్తోన్న శ్రద్ధా కపూర్ ► టక్ జగదీష్ ప్రమోషన్స్ సందడి ఇప్పుడే మొదలైందటున్న రీతూ వర్మ ► గాగ్రాలో జిగేల్మంటున్న మెహరీన్ ► నీళ్లలా జారిపోతానంటున్న పాయల్ రాజ్పుత్ ► అడవి అందాలను ఎంజాయ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
‘రీతు వర్మ’ బర్త్ డే స్పెషల్ ఫోటోలు మీకోసం...
-
అలా మొదలైంది అంత హిట్టవ్వాలి
అశోక్ సెల్వన్ హీరోగా, నిత్యామీనన్, రీతూవర్మ హీరోయిన్లుగా అని ఐ.వి.శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి సమర్పణలో బీవీఎస్ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న జీ ప్లెక్స్లో విడుదలవుతోంది. అని ఐ.వి.శశి మాట్లాడుతూ– ‘‘స్నేహితులందరూ కలిసి చేసిన సినిమా ఇది. సినిమా చూస్తున్నంతసేపూ చిరునవ్వుతో ఉంటారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాజర్గారు, నిత్యామీనన్, అశోక్ సెల్వన్తో నటించడం హ్యాపీ’’ అన్నారు రీతూవర్మ. ‘‘నా ‘అలా మొదలైంది’ ఎంత బాగా హిట్ అయ్యిందో ‘నిన్నిలా నిన్నిలా’ కూడా అంత బాగా హిట్ కావాలి’’ అన్నారు నిత్యామీనన్. ‘‘లవ్ అండ్ ఎమోషన్గా తెరకెక్కిన చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’’ అన్నారు బీవీఎస్ఎన్. ప్రసాద్. అశోక్ సెల్వన్, సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి, మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్ మురుగేశన్ మాట్లాడారు. -
కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా ..
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా.. నీలి మబ్బుల్లో నేనే తేలేతంలా’ అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. -
జోరుగా.. హుషారుగా...
నాగశౌర్య, రీతూ వర్మ జోరుగా హుషారుగా షూటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. నాగశౌర్య, రీతూ వర్మ తదితర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
దూసుకుపోతున్న ‘కనులు కనులను దోచాయంటే’
పెద్ద చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకూ... కొన్నేళ్లుగా నిర్మాతలు అనుసరించే సూత్రం ఒక్కటే! వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసి, తొలి వారంలో వీలైనన్ని వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్నారంతా!! రెండో వారానికి థియేటర్ల సంఖ్యను తగ్గిస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ, ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మాత్రం ఈ పరిస్థితికి అతీతమని చెప్పాలి. రెండో వారంలో ఈ సినిమా థియేటర్లు పెరిగాయి. (‘కనులు కనులను దోచాయంటే’ మూవీ రివ్యూ) దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. దేసింగ్ పెరియసామి దర్శకుడు. వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'కెఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్' విడుదల చేసింది. ఫిబ్రవరి 28న విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాదు, ప్రేక్షకుల డిమాండ్ మేరకు శనివారం నుండి 40 థియేటర్లను పెంచుతున్నట్టు నిర్మాతలు తెలిపారు. 'కెఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్' నుండి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డిమాండ్ మేరకు ఈ రోజు నుండి మేం 40 స్క్రీన్స్ యాడ్ చేశాం. అశేష ప్రేక్షకాదరణతో రెండో వారంలోనూ సినిమా థియేటర్లలో బలంగా నిలబడడమే కాదు, మంచి వసూళ్లను రాబడుతోంది’ అని అన్నారు. -
‘కనులు కనులను దోచాయంటే’ రివ్యూ
టైటిల్: కనులు కనులను దోచాయంటే జానర్: లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు: దుల్కర్ సల్మాన్, రీతు వర్మ, నిరంజని, రక్షణ్, గౌతమ్ మీనన్ సంగీతం: మాసాల కేఫ్ దర్శకత్వం: దేసింగ్ పెరియసామి నిర్మాత: ఆంటోనీ జోసెఫ్ నిడివి: 162.10 నిమిషాలు దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నూతన దర్శకుడు దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఓకే బంగారం, మహానటి వంటి సినిమాలతో టాలీవుడ్లో అభిమానులను సొంతం చేసుకున్న దుల్కర్ తన 25వ చిత్రానికి పూర్తిగా డిఫరెంట్ కథను ఎంచుకున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆంటోని జోసెఫ్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో దుల్కర్ దక్షిణాదిలో సెటిల్ అయినట్టేనా? ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో మన రివ్యూలో తెలుసుకుందాం కథ: ఆరేళ్లుగా సిద్ధార్థ్ (దుల్కర్ సల్మాన్), కల్లీస్ (రక్షణ్) మంచి స్నేహితులు. సిద్ధార్థ్ యాప్ డెవలపర్గా, కల్లీస్ యానిమేటర్గా పనిచేస్తూ రిచ్ లైఫ్ను అనుభవిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరూ మీరా (రీతు వర్మ), శ్రేయా (నిరంజని)లతో తొలి చూపులోనే ప్రేమలో పడతారు. వారి వెంటపడి వారి ప్రేమను పొందుతారు. అయితే మరోవైపు నగరంలో ఆన్లైన్ క్రైంతో పాటు ఖరీదైన కార్లలోని ఖరీదైన వస్తువులను దొంగతనాలకు గురవుతాయి. అయితే ఈ కేసులతో పాటు మరో కీలక కేసును అనఫిషియల్గా డీల్ చేస్తుంటాడు పోలీస్ కమిషనర్ ప్రతాప్ సింహా (గౌతమ్ మీనన్). మరోవైపు లవ్, పెళ్లి, ఎంజాయ్ అని సిద్దార్థ్, కల్లీస్, మీరా, శ్రేయాలు గోవాకు వెళతారు. అయితే అక్కడ మీరా గురించి సిద్ధార్థ్కు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఇంతకి ఆ షాకింగ్ న్యూస్ ఏంటి? ప్రతాప్ వెతుకుతున్న ఆ మోసగాళ్లు ఎవరు? సిద్ధార్థ్, మీరాల ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? తెలసుకోవాలంటే ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా చూడాల్సిందే. నటీనటులు: ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో మెప్పించిన దుల్కర్.. ఈ సినిమాలో సిద్దార్థ్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. అయితే అతడి పాత్రను తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అయితే ఎమోషన్ పండించడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. ఇక తెలుగమ్మాయి రీతు వర్మకు ఈ సినిమాలో మంచి క్యారెక్టరే లభించింది. డిఫరెంట్ షేడ్స్లో కనిపించి మెప్పిస్తుంది. రక్షణ్, నిరంజనిల మధ్య వచ్చే కొన్ని సీన్లు నవ్వులు తెప్పిస్తాయి. గౌతమ్ మీనన్ మొదట్లో సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి చివరికి కమెడియన్ అయిపోతాడు. అనీష్ కురువులకు సైతం ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: కథ, కథనం కొత్తగా, డిఫరెంట్గా ఉంది. కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. అన్లైన్ మోసాలు, దొంగతనాలు, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, పోలీస్ కమిషనర్ ఎంట్రీతో ఇంటర్వెల్ ముందువరకు సాదాసీదాగా సాగిపోతుంది. దీంతో అందరూ రొటీన్ స్టోరీ అనుకుంటారు. కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్తో ఆడియన్స్ అంచనాలతో పాటు సినిమా మొత్తం టర్న్ అవుతుంది. దీంతో సెకండాఫ్ ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. అయితే రెండో అర్థభాగాన్ని కూడా దర్శకుడు చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఫస్టాప్లో ఇచ్చిన ట్విస్టులను సెకండాఫ్లో ఒక్కొక్కటి రివీల్ చేస్తూనే ఆడియన్స్ను కట్టిపడేసేందుకు సస్పెన్స్ సీన్లను జోడించాడు. దీంతో క్రైమాక్స్ వరకు ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురుచూస్తాడు. మధ్యమధ్యలో కామెడీ పండించాలని దర్శకుడు ప్లాన్ చేసినా అంతగా వర్కౌట్ కాదు. కానీ క్రైమ్ సీన్స్ చాలా ఇంట్రెస్ట్గా,కొత్తగా ఉంటాయి. ఓ సందర్భంలో ఇంత సులువుగా క్రైమ్ చేసి, విలాసవంతంగా బతకొచ్చా అనే అనుమానం కలుగుతుంది. కానీ రియలస్టిక్గా సాధ్యం కాదు. అయితే క్రైమ్ సీన్లు చేయడానికి ఏదో బలమైన కారణం ఉంటుందని సగటు అభిమాని ఆశిస్తే నిరాశ తప్పదు. ఎందుకంటే క్రైమ్ సీన్ల వెనక ఏదో బలమైన కారణం ఉంటే రెగ్యులర్ సినిమా అవుతుందని భావించిన డైరెక్టర్ విభిన్నంగా ఆలోచించి సింపుల్గా తెగ్గొట్టేశాడు. ఇక సాంకేతిక విషయానికి వస్తే పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతమే అక్కడక్కడా విసుగుతెప్పిస్తుంది. లిరిక్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకు రిచ్ లుక్ను తీసుకొచ్చారు. సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా స్క్రీన్ప్లే ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్: డిఫరెంట్ కాన్సెప్ట్ క్రైమ్ సీన్స్ మైనస్ పాయింట్స్: స్లో నెరేషన్ నిడివి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం -సంతోష్ యాంసాని, సాక్షి వెబ్డెస్క్ -
‘మేం చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం’
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన మలయాళీ రొమాంటిక్ థ్రిల్లర్ 'కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్లైయాడిత్తాల్'. తెలుగులో 'కనులు కనులను దోచాయంటే' పేరుతో విడుదలవుతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించారు. దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో వయాకం 18 స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. కెఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్ తెలుగు హక్కులను దక్కించుకుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, పాటలు, తమిళ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా విడుదలయిన ట్రైలర్ మరింత ఆకట్టుకునేలా ఉంది. (చదవండి : ‘గుండె గిల్లి ప్రాణం తీయొద్దే’) హీరో, అతని స్నేహితుడు లగ్జరీ లైఫ్ స్టైల్కు అలవాటుపడిన యువకులని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. లగ్జరీ లైఫ్ కోసం వాళ్లు చేసిన పనులు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టాయి. దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ ద్వారా చూపించారు. ‘ఇండియాలో ఆన్లైన్ ట్రేడ్కి వన్ ఇయర్ వర్త్ ఎంతో తెలుసా? రెండు లక్షల కోట్లు. సుమారు 10 కోట్లమంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. మనం వెతికేవాడు ఆ పది కోట్లలో ఒక్కడు’ హీరో చెప్పే డైలాగ్లో ట్రైలర్ మొదలైంది. ‘మేం చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం’, ‘ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా.. గోవిందా’ అని హీరో, అతని స్నేహితులు చెప్పే కామెడీ డైలాగులలో ట్రైలర్ ముగిసింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కనులు కనులను దోచాయంటే’ ట్రైలర్ -
‘గుండె గిల్లి ప్రాణం తీయొద్దే’
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతువర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘‘కన్నుం కన్నుం కొలైయడిత్తాల్’. ఇదే చిత్రాన్ని ‘కనులు కనులను దోచాయంటే’ టైటిల్తో తెలుగులో విడుదల చేస్తున్నారు. దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో వయాకం 18 స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఈ సినిమాలోని ‘గుండె గిల్లి ప్రాణం తీయొద్దే’ అంటూ సాగే ప్రేమ పాటను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. మసాల కాఫీ మ్యూజిక్ బ్యాండ్ ఈ పాటను కంపోజ్ చేయగా రోహిత్ పరటాల ఆలపించాడు. సామ్రాట్ నాయుడు, పూర్ణచారి చల్లూరి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాట యూత్ను ముఖ్యంగా లవర్స్కు బాగా కనెక్ట్ అయింది. అంతేకాకుండా విజువల్ పరంగా కూడా చాలా అందంగా ఉండటంతో నెటిజన్లను తీవ్రంగా ఆకర్షించింది. దీంతో ప్రస్తుతం ‘గుండె గిల్లి’ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘మహానటి’ చిత్రం తర్వాత దుల్కర్కు టాలీవుడ్లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. చదవండి: రాఖీ బాయ్తో కురుప్.. పవన్ కల్యాణ్ ఎంట్రీకి భారీ ప్లాన్! -
కొత్త ప్రయాణం ప్రారంభం
‘అశ్వథ్థామ’ విజయంతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు నాగశౌర్య. తాజాగా ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ సినిమా తెరకెక్కించనున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాకు కెమెరా: వంశీ పచ్చి పులుసుల, సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
నా పేరు జగదీష్..కానీ అందరూ
అతని పేరు జగదీష్, కానీ అందరూ ‘టక్ జగదీష్’ అని పిలుస్తారు. మరి ఆ పేరు వెనక స్టోరీ ఏంటి? అంటే జగదీషే చెప్పాలి. ‘నిన్ను కోరి’ సినిమా తర్వాత దర్శకుడు శివ నిర్వాణ, హీరో నాని మరో సినిమా కోసం కలిశారు. ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం టైటిల్ను మంగళవారం ప్రకటించారు. హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ‘‘నా తొలి హీరోతో మళ్లీ కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు శివ నిర్వాణ. నానీతో తెరకెక్కించిన ‘నిన్ను కోరి’ దర్శకుడిగా శివ నిర్వాణకు తొలి సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
శర్వానంద్ కొత్త సినిమా మొదలైంది!
ఇటీవల రణరంగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాను డ్రీమ్వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా బుధవారం చెన్నైలో లాంచనంగా ప్రారంభమైంది. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ రీతూవర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. నాజర్, వెన్నెలకిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విడదీయలేని స్నేహం, ప్రేమ అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలు రాయటం విశేషం. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాను 2020 వేసవిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. -
రీతూకు మరో చాన్స్!
తమిళసినిమా: యువ నటి రీతూవర్మకు ప్రస్తుతం కోలీవుడ్లోనే ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. ఈ తెలంగాణ జాణకు పెళ్లిచూపులు చిత్రం పెద్ద విజయాన్నే అందించింది. అంతే కాదు, పలు అవార్డులను తెచ్చిపెట్టింది. తాజాగా అదే పెళ్లిచూపులు చిత్రానికిగాను ఆంధ్ర రాష్ట్రం ఈ బ్యూటీకి నంది అవార్డును కూడా ప్రకటించేసింది. అయితే అక్కడ అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. అదృష్టం ఏమిటంటే కోలీవుడ్లో అవకాశాలను రాబట్టుకుంటోంది. ఇప్పటికే గౌతమ్మీనన్ దృష్టిలో పడి విక్రమ్కు జంటగా ధ్రువనక్షత్రం చిత్రంలో నటిస్తున్న రీతూవర్మ చేతిలో చిన్నా అనే మరో తమిళసినిమా ఉంది. తాజాగా యువ నటుడు, మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్సల్మాన్తో జతకట్టే అవకాశాన్ని దక్కించుకుంది. వాయె మూడి పేసవుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్కు రంగప్రవేశం చేసిన దుల్కర్సల్మాన్ ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో కాదల్ కణ్మణి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలా చాలా సెలెక్టివ్ చిత్రాలనే కోలీవుడ్లో చేస్తున్న ఈయన తాజాగా నవ దర్శకుడు దేసింగ్ పెరియస్వామి చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఈ దర్శకుడు గోలీసోడా, పత్తు ఎండ్రదుక్కుళ్ చిత్రాలకు సహాయదర్శకుడిగా పనిచేశారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో ఇంజినీర్గా నటిస్తున్న దుల్కర్సల్మాన్కు జంటగా నటి రీతూవర్మను ఎంచుకున్నారు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమై చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇది ప్రేమ, యాక్షన్ కలగలిపిన కమర్శియల్ కథా చిత్రంగా ఉంటుందట. -
‘మంత్ర’ మాల్లో ‘కేశవ’
-
‘కేశవ’ వర్కింగ్ స్టిల్స్
-
‘గూఢచారి’ ఆఫర్ వదులుకున్న హీరోయిన్
హైదరాబాద్: ‘పెళ్లి చూపులు’ హీరోయిన్ రీతూవర్మ ‘గూఢచారి’ ఆఫర్ను తిరస్కరించించింది. అడవి శేష్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించనున్న ‘గూఢచారి’లో హీరోయిన్గా రీతూ వర్మకి అవకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని ఆమె వదులుకుంది. నిఖిల్ సినిమా కారణంగా ఆమె ఈ ఆఫర్ ను తిరస్కరించినట్టు సమాచారం. ‘స్వామి రారా’ తో ఆకట్టుకున్న నిఖిల్- సుధీర్ వర్మ కాంబినేషన్ వైపే ఆమె మొగ్గు చూపింది. అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది. సెప్టెంబర్ 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. చిత్రీకరణ అంతా కాకినాడ టు విశాఖ తీరప్రాంతంలోనే జరుగుతుందని దర్శకుడు సుధీర్వర్మ తెలిపారు. -
ఎవరిపై పగ?
‘స్వామి రారా’తో తెలుగులో మళ్లీ క్రైమ్ కామెడీ సినిమాలకు కొత్త ఊపిరి అందించిన హీరో నిఖిల్, దర్శకుడు సుధీర్ వర్మ కలయికలో అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సినిమా హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత అభిషేక్ నామా క్లాప్ ఇవ్వగా, నామా మధుసూదన రావు కెమేరా స్విచాన్ చేశారు. ‘‘పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ రివెంజ్ డ్రామాలో ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుంది. చిత్రీకరణ అంతా కాకినాడ టు విశాఖ తీరప్రాంతంలోనే జరుగుతుంది’’ అని సుధీర్వర్మ తెలిపారు. ‘‘సెప్టెంబర్ 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాత. ఇందులో రీతూ వర్మ హీరోయిన్. -
గూఢచారితో...
రీతూ వర్మ... ‘పెళ్లి చూపులు’తో ఈ హైదరాబాదీ అమ్మాయికి మంచి పేరొచ్చింది. అంతకు ముందు ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నా రాకుమారుడు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ వంటి సినిమాల్లో రీతు నటించారు. కానీ, ‘పెళ్లి చూపులు’ సినిమా ఇటు పరిశ్రమ వర్గాలు, అటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ విజయం రీతూ వర్మకి మంచి అవకాశాలను తీసుకొస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అడవి శేష్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించనున్న ‘గూఢచారి’లో హీరోయిన్గా రీతూ వర్మకి అవకాశం లభించింది. శశి తిక్క, రాహుల్ ద్వయం దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ‘క్షణం’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత అడవి శేష్ హీరోగా నటించనున్న సినిమా ఇది. భారీ బడ్జెట్తో అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. -
'గూడచారి' హీరోయిన్ రీతూ వర్మ
'పెళ్లిచూపులు' సినిమాలో స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా ప్రేక్షకులను మెప్పించిన రీతూ వర్మ తన తదుపరి చిత్రానికి సైన్ చేసింది. పెళ్లిచూపుల్లో చిత్రగా చక్కటి అభినయాన్ని కనబరిచిన ఈ అమ్మాయి అందరి ప్రశంసలు అందుకుంటుంది. 'క్షణం' సినిమాతో టాలీవుడ్కి తన టాలెంట్ను చూపించిన అడవి శేష్ తదుపరి చిత్రం 'గూడచారి'లో రీతూ హీరోయిన్గా ఎంపికైంది. అక్టోబర్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. పెళ్లిచూపులు సినిమాలో రీతూ నటనను చూసి ఇంప్రెస్ అయిన చిత్ర యూనిట్.. వెంటనే ఆమెను సంప్రదించినట్లు తెలుస్తుంది. రాహుల్ పాకాల,శశికిరణ్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పేరుకి తగ్గట్టుగా సస్పెన్స్ థ్రిల్లర్గా అలరించనుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్ ఇతర నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
పెళ్లికి ముందు.. ఆ తర్వాత
అభిజిత్, రీతూవర్మ జంటగా విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆళ్ల నౌరోజీరెడ్డి, ఎ.శోభారాణి కలిసి నిర్మిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్లో డి.రామానాయుడు చేతుల మీదుగా మొదలైంది. పెళ్లి తర్వాత ఓ ప్రేమజంట ప్రేమలో వచ్చే మార్పే ప్రధానాంశంగా ఈ చిత్రం ఉంటుందని, కొమ్మనాపల్లి గణపతిరావు సంభాషణలు, కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలని నిర్మాతల్లో ఒకరైన నౌరోజిరెడ్డి చెప్పారు. ఇరవైఏళ్లుగా దర్శకత్వశాఖలో పనిచేస్తున్నానని, ఓ మంచి కథ ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందని విజయ్ శ్రీనివాస్ అన్నారు. అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్రలను ఇందులో చేస్తున్నామని హీరోహీరోయిన్లు చెప్పారు. ఈ చిత్రానికి కథ: శ్రీచరణ్ కార్తీకేయ మూవీస్, కెమెరా: కె.చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వై.శ్రీనివాస్. -
రొమాంటిక్ రాకుమారుడు
నవీన్చంద్ర, రీతూవర్మ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నా రాకుమారుడు’. సత్య దర్శకుడు. వజ్రంగ్ నిర్మాత. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం టీమ్ హైదరాబాద్ ఐమ్యాక్స్ థియేటర్లో హంగామా చేశారు. ప్రేమకు సంబంధించి ఓ కాంటెస్ట్ని నిర్వహించి, విజేతలకు బహుమతులందజేశారు. ఈ సందర్భంగా నవీన్చంద్ర మాట్లాడుతూ- ‘‘సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమను మించింది ఏదీ లేదు. నిజజీవితంలో కూడా నేను నమ్మేది ఇదే. అలాంటి పాత్రనే ఈ సినిమాలో పోషించాను. ప్రేమికుల రోజున ప్రేక్షకుల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. రొమాంటిక్ ప్రేమకథ ఇది. చక్కని సందేశం కూడా ఉంటుంది. నా ‘అందాలరాక్షసి’ని ఆదరించినట్లుగానే... ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నా నమ్మకం’’ అని చెప్పారు. ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుందని రీతూవర్మ చెప్పారు. ప్రణయం, హాస్యం మేళవింపైన ఈ చిత్రం యువతరాన్ని తప్పక అలరిస్తుందని దర్శకుడు అన్నారు. -
అనుకోకుండా అవకాశం వచ్చింది
‘హేమమాలిని, శ్రీదేవి, మాధురీ దీక్షిత్ అంటే నాకు చాలా ఇష్టం. వారిలానే విభిన్న పాత్రలు చేసి, నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తా’’ అంటున్నారు రీతూవర్మ. ‘అనుకోకుండా’ అనే లఘుచిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారామె. త్వరలో విడుదల కానున్న ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నా రాకుమారుడు’ చిత్రాల్లో కథానాయికగా నటించారు ఈ బ్యూటీ. ఈ రెండు చిత్రాల్లో మంచి పాత్రలు చేశానని రీతు చెబుతూ - ‘‘ప్రేమ ఇష్క్...లో ఆధునిక యువత మనోభావాలను ప్రతిబింబించే పాత్ర చేశాను. ‘నా రాకుమారుడు’లో నేటి తరం అమ్మాయిల మనసులకు అద్దంపట్టే బబ్లీగాళ్ పాత్ర చేశాను. ఇక, నా కెరీర్ విషయానికొస్తే.. డెరైక్టర్ తరుణ్భాస్కర్ నాకు మంచి ఫ్రెండ్. తను అడిగిన మీదట ‘అనుకోకుండా’లో యాక్ట్ చేశాను. ఆ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. నాకు ఉత్తగా నటి అవార్డుని కూడా తెచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ సినిమా అవకాశం నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. ప్రస్తుతం చేసిన రెండు చిత్రాల ద్వారా కూడా నాకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. తెలుగు పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు మంచి నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నదే నా ఆశయం’’ అన్నారు. -
నా రాకుమారుడు వస్తున్నాడు
అబ్బాయిలకు డ్రీమ్గాళ్స్ ఉన్నట్టుగానే, అమ్మాయిలకు డ్రీమ్బాయ్స్ ఉంటారు. అలాంటి ఓ డ్రీమ్బాయ్ కథే ‘నా రాకుమారుడు’. ఇందులో ‘అందాల రాక్షసి’ఫేం నవీన్చంద్ర హీరో. రీతువర్మ కథానాయిక. పూరి జగన్నాథ్ శిష్యుడు సత్య దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత వజ్రంగ్ మాట్లాడుతూ -‘‘ఇదొక భిన్నమైన కథ. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు ఓ పెయింటింగ్లా సినిమాను మలిచాడు. నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసి ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: కుమారస్వామి, కూర్పు: ప్రవీణ్పూడి, కళ: ఉపేంద్రరెడ్డి.