sridhar reddy
-
పెట్టుబడులపై రేవంత్ మంత్రి వర్గంలోనే భిన్నాభిప్రాయాలా?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దావోస్ పెట్టుబడులను పెద్ద విజయంగా సీఎం చెబుతుంటే మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఇది పెద్ద విజయం ఏమీ కాదన్నారు. ఉపాది అవకాశాలు పెరిగినపుడే పెట్టుబడులను విజయంగా భావిస్తామని శ్రీధర్ బాబు అన్నారు. రేవంత్ మంత్రి వర్గంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి’’ అంటూ పొన్నాల వ్యాఖ్యానించారు.‘‘సీఎం మొహం చూసి ఎవ్వరూ పెట్టుబడులు పెట్టలేదు. పెట్టుబడులు అనేవి నిరంతర ప్రక్రియ. పదేళ్ల కేసీఆర్ విధానాల ఫలితంగానే ఈ పెట్టుబడులు. మహారాష్ట్రకు 18 లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయంటే ఫడ్నవీస్ గొప్పతనం చూసి రాలేదు. అక్కడ ప్రభుత్వం మారి ఆరునెలలు కూడా కాలేదు. ప్రపంచ దేశాలతో పోటీ పడతా అని రేవంత్ అంటున్నారు. దేశాలతో కాదు.. మహారాష్ట్రతో రేవంత్ పోటీ పడాలి. ఈ పెట్టుబడులు ఎందుకు వచ్చాయో వివరించడానికి సీఎం మంత్రులతో చర్చకు సిద్ధం’’ అని పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు.‘‘2014, 2023 మధ్య 2 వేల స్టార్ట్అప్ కంపెనీలు వచ్చాయి. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ కేసీఆర్ హయాంలో 7 లక్షలు స్క్వేర్ ఫీట్ లకు పెరిగింది. ఐటీ ఇన్నోవేషన్లో కేసీఆర్ హయాం లో తెలంగాణ నాలుగు శాతానికి పెరిగింది. 2014లో 3 లక్షలు ఐటీ ఉద్యోగాలు ఉంటే అది కేసీఆర్ విధానాల ఫలితంగా తొమ్మిది లక్షలకు పెరిగింది. ఏ రకంగా చూసినా కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగంలో భారీ పురోగతి సాధించింది...వాస్తవాలను సీఎం రేవంత్ వక్రీకరిస్తున్నారు. అప్పుడు వేసిన విత్తనాలకు ఇపుడు కాయలు కాస్తుంటే రేవంత్ తన గొప్ప అని చెప్పుకుంటే ఎట్లా?.స్కిల్ డెవెలప్మెంట్ అనేది వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని అవకాశాలున్నా రేవంత్ ఎందుకు చదువుకోలేదు? ఎందుకు విజ్ఞానవంతుడిగా కాలేక పోయారు?. రేవంత్ భాష, స్వభావం అలా ఉండటానికి దేశంలో విద్యావకాశాలు లేక కాదు. కేసీఆర్ గురుకులాలు స్థాపించి అందరికీ ఉన్నత అవకాశాలు కల్పించారు’’ అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. -
అడ్డదారిలో వైకుంఠం టిక్కెట్లు.. నిజాలు బయటపెట్టిన అవుతు శ్రీధర్ రెడ్డి
-
ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపితే భయంతో కేసులు పెడుతున్నారు
-
వరుడిని ఆశీర్వదించిన వైఎస్ భారతిరెడ్డి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో ఆర్అండ్బీ డీఈగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి, వైఎస్ మెమోరియల్ బాలికల కళాశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్న అనితమ్మల కుమారుడు యశ్వంత్ రెడ్డి వివాహం కాకినాడకు చెందిన శ్రీనిజతో ఆదివారం రాత్రి జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఆమె తల్లి ఈసీ సుగుణమ్మలతో పాటు మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకర్గ ఇన్చార్జి దుష్యంత్రెడ్డి, ఆయన సతీమణి శిల్పతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ జోసఫ్రెడ్డి తదితరులు శనివారం నూతన వరుడిని ఆశీర్వదించారు. -
పోలవరం డాక్యుమెంట్ల వెనక చంద్రబాబు కుట్ర..!
-
ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటుపరం వెనుక అసలు నిజం
-
కొల్లాపూర్ ఘటనపై జూపల్లి రియాక్షన్
-
కరువు, చంద్రబాబు కవలపిల్లలు
పుట్టపర్తి: కరువు, చంద్రబాబు కవలపిల్లలని, ఆయన హయాం మొత్తం కరువు రాజ్యమేలిందని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపే పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన తొమ్మిది రోజులపాటు చేపట్టిన ‘వైఎస్సార్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర’ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా పుట్టపర్తి మండలం చెర్లోపల్లి వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ముగింపు సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో తీవ్ర దుర్భిక్షంతో పంటలు ఎండిపోయి రైతులు అల్లాడిపోయారన్నారు. వైఎస్సార్ చలువతో హంద్రీ–నీవా కాలువ తవ్వడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం అనేక చెరువులకు నీరందుతుండడంతో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులను నింపితే రెండు లక్షల ఎకరాలు సాగులోకి రావడమే కాకుండా సుమారు రెండు లక్షల జనాభాకు తాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రైతులకు అన్ని విధాలా మేలు జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. -
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మన్నెం రంజిత్యాదవ్?
మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనుంది. పార్లమెంటులో అడుగుపెట్టడానికి తెలంగాణ రాష్ట్రము నుంచి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రధానంగా ఢిల్లీ పీఠం 2024 లో బీజేపీకె చెందుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రము నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది విజయం సాధించారు. అదేవిదంగా 2019 ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులు నలుగురు పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులుగా పార్లమెంట్ కు పోటీచేయడానికి రాష్ట్రము నుంచి పోటీ ఎక్కువగానే కనపడుతోంది. ప్రధానంగా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి మన్నెం రంజిత్ యాదవ్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రంజిత్ యాదవ్ ఇప్పటి నుంచే నల్ల గొండ నుంచి పావులు కదుపుతున్నారు. పార్టీలో కొత్తగ చేరినప్పటికీ, ఆయనకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు స్నేహపూర్వక వాతావరణం ఉంది. కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి...! నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు.. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత రెండు మూడు ఎన్నికల నుండి మిర్యాలగూడ.. నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న రఘువీర్ రెడ్డికి కాలం కలిసి రాకపోవడంతో పాటు రాజకీయ సమీకరణలు అనుకూలించకపోవడంతో పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే ఈసారి పరిస్థితులన్నీ ఆయనకు అనుకూలంగా మారిన క్రమంలో నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు రఘువీర్ రెడ్డి. బరాబర్ సిద్ధమై ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ తేరా చిన్నపరెడ్డి...! నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త.. మాజీ శాసనమండలి సభ్యులు డాక్టర్ తేరా చిన్నపరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎందుకంటే గతంలోనూ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉండటంతో పాటు కుందూరు జానారెడ్డి కుటుంబంతో పోటీ అనగానే వాళ్లని ఎదుర్కొనే సత్తా... తేరా చిన్నపరెడ్డికి మాత్రమే ఉందనే రాజకీయ ఎత్తుగడలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అట్లనే గత సాగర్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తేరా చిన్నపరెడ్డి పేరును పరిశీలించడంతో పాటు ఎమ్మెల్సీ గానూ మరోసారి అవకాశం ఇవ్వకపోవడం వంటిపరిస్థితుల్లో తేరా చిన్నపరెడ్డికి ఈసారి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తుందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఈయనతో పాటు ట్రైకార్ రాష్ట్ర మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి రంజిత్ యాదవ్..! నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉండి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నిడమనూరు మండలానికి చెందిన మన్నెం రంజిత్ యాదవ్.. బీజేపీ పక్షాన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన రంజిత్ యాదవ్.. ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన రంజిత్ యాదవ్ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో... జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన నల్లగొండ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలో పరిస్థితులన్నీ కలిసి వస్తే జరగబోయే నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన వాళ్లే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అట్లనే టికెట్ సాధించి బరిలో నిలిచే గెలిచే అభ్యర్థులు ఎవరో.. అదృష్టం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది. -
ఒక్కసారిగా చిదిమిన జీవితాలు.. ఆ గ్రామంలో విషాదఛాయలు..
సాక్షి, ఖమ్మం: అశ్వాపురంమండలంలోని మల్లెలమడుగు గ్రామంలో హైస్కూల్ సమీపంలో మొండికుంట – భద్రాచలం రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మొండికుంట గ్రామానికి చెందిన యువకులు ఎడ్ల సంతోష్రెడ్డి (32), మీ సేవ కేంద్రం నిర్వాహకుడు కందిమళ్ల శ్రీధర్రెడ్డి (37) మృతి చెందారు. సంతోష్రెడ్డి, శ్రీధర్రెడ్డి బైక్పై మొండికుంట నుంచి భద్రాచలం వెళ్తుండగా హైస్కూల్ సమీపంలో మొండికుంట వైపు వెళ్తున్న ట్రాక్టర్ లైట్లు లేకుండా అతి వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో ఎడ్ల సంతోష్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీధర్రెడ్డిని 108 ద్వారా భద్రాచలం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంతోష్రెడ్డి పాల్వంచ కేటీపీఎస్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు గతంలో వివాహం జరగగా దంపతులు విడిపోయారు. మరో పది రోజుల్లో మరో యువతితో వివాహం జరగనుంది. వివాహానికి సంబంధించిన పనులపై శ్రీధర్రెడ్డితో కలిసి బైక్పై భద్రాచలం వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శ్రీధర్రెడ్డి మొండికుంట గ్రామంలో ఎన్నో ఏళ్లుగా మీ సేవ కేంద్రం నిర్వహిస్తూ ఓ దినపత్రిక రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేశ్కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇవి చదవండి: 'నన్ను మోసం చేశాడంటూ..' యువకుడి ఇంటి ముందే.. యువతి -
కేబుల్రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. -
రాష్ట్రంలో 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధర, పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎస్ఎఫ్పీఎస్) సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. దీంతో రూ. 84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సోమవారం విజయవాడలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్రెడ్డి, బీవోబీ డీజీఎం చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.1.68 లక్షలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 35 శాతం (రూ.29.40కోట్లు) సబ్సిడీగా భరిస్తుందని, లబ్ధిదారులు 10 శాతం (రూ.8.40 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందన్నారు.మిగిలిన 55 శాతం (రూ.46.20 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, గ్రామీణ మహిళా సాధికారత ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలన్నారు. కర్నూలులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా ఒక్కో మహిళ సగటున రూ.12 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని చెప్పారు. బి, సి గ్రేడ్ ఉల్లి, టమాటాలకు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో 3,500 యూనిట్లు, మిగిలిన జిల్లాల్లో మరో 1,500 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్ డీజీఎం చందన్ సాహూ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులకు ఆర్థి క చేయూతనిచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎఫ్పీఎస్ స్టేట్ లీడ్ సుభాష్ కిరణ్ కే, మేనేజర్ సీహెచ్ సాయి శ్రీనివాస్, బ్యాంక్ రీజనల్ మేనేజర్లు కె.విజయరాజు, పి.అమర్నాథ్రెడ్డి, ఎంవీ శేషగిరి, ఎంపీ సుధాకర్, రీజనల్ ఇన్చార్జి డి. రాజాప్రదీప్, డీఆర్ఎం ఏవీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎందుకంటోంది..?
-
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, నాటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నేత ఎం.శ్రీధర్రెడ్డి (77) కన్నుమూశా రు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో శ్రీధర్రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థి నేతగా ఉద్యమంలోకి.. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాడారు. ఆ సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్న శ్రీధర్రెడ్డి.. ఉవ్వెత్తున ఉద్యమాన్ని రేపి, ముందుండి నడిపించారు. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేసిన సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి (ఎస్టీపీఎస్)కు పోటీగా తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్)ని ఏర్పాటు చేశారు. జనతాపార్టీ ఆవిర్భావం తర్వాత అందులో చేరి ఆలిండియా యువ జనతా విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్.జనార్ధనరెడ్డి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఏపీ స్పోర్ట్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రముఖుల దిగ్భ్రాంతి.. శ్రీధర్రెడ్డి మృతి తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆయన నాయకత్వ లక్షణాలున్న గొప్ప నేత అని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పారు. శ్రీధర్రెడ్డి మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మహేశ్కుమార్గౌడ్, వీహెచ్, నిరంజన్, కోటూరి మానవతారాయ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీధర్రెడ్డి నిఖార్సయిన తెలంగాణ పోరాట యోధుడని.. ఆయన మరణం రాష్ట్రానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకు డిగా రాజీలేని పోరాటం చేసిన శ్రీధర్రెడ్డి మర ణం తెలంగాణకు తీరని లోటు అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. విలువల కోసం కట్టుబడిన శ్రీధర్రెడ్డి: సీఎం తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో శ్రీధర్రెడ్డి చేసిన కృషిని స్మరించుకున్నారు. 1969 నాటి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన శ్రీధర్రెడ్డి.. తాను నమ్మిన విలువలకు కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్రీధర్రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మ¯Œ వినోద్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. -
రైతులకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని బట్టబయలు చేశారని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి తెలిపారు. కేసీఆర్ తెలంగాణ గోబెల్స్గా మారిపోయి వానాకాలం వడ్లను కొనకుండా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరో పించారు. శనివారం జరిగిన కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో శ్రీధర్రెడ్డి మాట్లాడారు. ఎఫ్సీఐతో ఒప్పందం చేసుకున్న బియ్యాన్నే ఇంతదాకా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేక పోయిందనే విషయాన్ని పీయూష్ తేటతెల్లం చేశారన్నారు. రైతులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కేసీఆర్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పా లన్నారు. వడ్లను కొనుగోలు చేయకపోతే ఆం దోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలన్నార -
నిర్మాత శ్రీధర్ రెడ్డి కన్నుమూత
‘సోగ్గాడి కాపురం, ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రాల నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి ఇకలేరు. అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి ఆయన మరణించారు. శ్రీధర్ రెడ్డి స్వస్థలం నెల్లూరు. సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో చెన్నై వెళ్లారు. శోభన్బాబు, జయసుధ జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడి కాపురం’ సినిమా నిర్మించారాయన. ఆ తర్వాత సుమన్, సౌందర్య హీరో హీరోయిన్లుగా వై. నాగేశ్వరావు దర్శకత్వంలో ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రం నిర్మించారు. శ్రీధర్ రెడ్డి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఆపరేషన్ బ్లూస్టార్ హీరో న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’దుర్ఘటనకు నేటి(గురువారం)తో ఏడాది పూర్తయింది. వైద్యురాలైన దిశను శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి గేటు వద్ద లారీ డ్రైవర్లు, క్లీనర్లు అపహరించి, లైంగికదాడి జరిపి దారుణంగా హతమార్చి, దహనం చేసిన ఘటనపై దేశం భగ్గుమంది. తర్వాత దిశను దహనం చేసిన షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి బ్రిడ్జి వద్దనే పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించిన సంగతి తెలిసిందే. దిశ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆమె జీవితంలో జరిగిన అత్యంత విషాద క్షణాలను సినిమాగా తీయడంపై ఆమె తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను చట్టపరంగా ఆపేందుకు న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. రిజర్వ్ ఫోర్స్లో సేవలు! న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో దిశ తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్రెడ్డితో ‘సాక్షి’మాట్లాడింది. 1981 నుంచి 1987 వరకు శ్రీధర్రెడ్డి సైన్యంలో పనిచేశారు. పంజాబ్ కపుర్తలాలోని 12 ఆర్మ్డ్ రెజిమెంట్లో ఆయన విధులు నిర్వహించారు. 1984లో అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టింది. ఈ పోరులో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఓ వైపు యుద్ధం జరుగుతుండగానే రిజర్వ్ ఫోర్స్ కింద 12వ ఆర్మ్డ్ రెజిమెంట్ పనిచేసింది. నేరుగా యుద్ధక్షేత్రంలోకి వెళ్లకపోయినా ఆ క్షణంలో అవసరమైతే ప్రాణాలర్పించేందుకు ఈ రెజిమెంట్ సిద్ధమైంది. అలాంటి తనకు ఈ సమాజం ఏమిచ్చిందని శ్రీధర్రెడ్డి వాపోయారు. ఇలాంటి మృగాల కోసమా తాను సరిహద్దులో గుండెలడ్డుపెట్టి పహారా కాసింది? అని ఆవేదన వ్యక్తం చేశారు. నోరులేని ఎన్నో మృగాలకు వైద్యం చేసి ప్రాణం పోసిన తన కూతురు మానవ మృగాల చేతిలో ప్రాణాలు కోల్పోతుందని ఎన్నడూ ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. -
దీనిని మేమంతా స్వాగతిస్తున్నాం: మంత్రి
సాక్షి, అనంతపురం: పరిపాలన వికేంద్రీకరణకు గవర్నర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ చట్టం రద్దును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమని, ఇందుకు మూడు రాజధానులు ఆయన లక్ష్యం అన్నారు. అదే విభజన గాయాలు మానాలంటే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ తథ్యమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి డ్రామాలు ఆడారని, అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని మంత్రి ధ్వజమెత్తారు. రైతుల కడుపు కొట్టి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. సీఎంజగన్ వల్లే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమోందని, రాయలసీమలో హైకోర్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. నిపుణుల నివేదిక మేరకే మూడు రాజధానుల నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..) పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దును గవర్నర్ ఆమోదించడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి శుభ సూచకమని ఆనందం వ్యక్తం చేశారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికై కర్నూలును న్యాయ రాజధానిగా గుర్తించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. రాయలసీమ వాసుల తరుపున సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్సార్ కలలుకన్న రాయలసీమ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను పూర్తిచేసి తీరుతామన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అవినీతితో అమరావతిని నిర్మించాలన్న కలలు కల్లలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ: పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దుకు శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలపడాన్ని ఆమె స్వాగతిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్లో ఉండడం వల్ల ఎంతగానో నష్టపోయామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటులో ఉన్నాయని, మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతోనే మూడు రాజధానులను సీఎం జగన్ తీసుకొచ్చినట్ల ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని, ఏపీలో మూడు రాజధానులు ఎంతో అవసరమన్నారు. శాసనమండలిలో బిల్లులు ఆమోదం పొందకుండా చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన గవర్నర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చారిత్రక అవసరమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. -
ఇలాంటి రాక్షసుల కోసమా.. పహారా కాసింది?
సాక్షి, హైదరాబాద్ : దేశం నీకు ఏమిచ్చిందన్నది కాదు.. దేశానికి నువ్వు ఏమిచ్చావు అన్నది ముఖ్యం అంటారు పెద్దలు. సైన్యంలో పనిచేసి దేశానికి సేవలందించే వీర జవానుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఒకవేళ దేశ సేవలో అసువులుబాసితే అతని త్యాగానికి సెల్యూట్ చేస్తాం. అమరుడంటూ కీర్తిస్తాం. దిశ తండ్రి కూడా ఓ వీరసైనికుడే. కానీ ఆయనకు నలుగురు కీచకులు మిగిల్చిందేమిటి? తన గారాలపట్టి, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని అన్యాయంగా చిదిమేశారు. పైశాచికత్వంగా తెగబడి ప్రాణాలు తీసి కాల్చేశారు. నా గుండె బరువు ఎన్నటికీ దిగదు... దిశ నిందితుల ఎన్కౌంటర్ తరువాత ‘సాక్షి’ఆమె తండ్రి శ్రీధర్రెడ్డిని పరామర్శించింది. నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో మరణించడాన్ని ఆయన స్వాగతించారు. పోలీసుల పనితీరును అభినందిస్తున్నానని, వారికి కృత జ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను దేశంపై ప్రేమతో 1981 లో సైన్యంలో చేరా. అహ్మద్నగర్లో శిక్షణ తర్వాత అంబాలాలో పోస్టింగ్ ఇచ్చారు. తరువాత పంజాబ్లోని కపుడ్తలాలో పోస్టింగ్. అదే సమయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’కూడా జరిగింది. అప్పుడు పంజాబ్లో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆపరేషన్ మొదలైందని మాకు సందేశం అందింది. పలు రెజిమెంట్ల నుంచి వెళ్లాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. సిద్ధంగా ఉండాలని, రిజర్వు ఫోర్సు గా తరువాత వెళ్లాల్సింది మా యూనిట్ సభ్యులేనని ఆదేశాలు వచ్చాయి. నాతోటి వారితో సహా సిద్ధంగా ఉన్నాం. మేము ఆ ఆపరేషన్లో నేరుగా పాల్గొనలేదు కానీ రిజర్వు ఫోర్సు కిం ద పని చేశాం. సైన్యంలో ఆరేళ్లపాటు సేవలందించా. ఏ సైనికుడూ ప్రాణాల కోసం ఎప్పుడూ బాధపడడు. నేను కూడా ఎప్పుడూ భయపడలేదు. గుండెనిండా ధైర్యం కలవాడిని. కా నీ నేడు నా గుండె కూడా బరువెక్కింది. ఎన్ని చేసినా ఆ గుండె బరువు దిగదు’’అని అన్నారు. కీచకులకు త్వరగా శిక్షలు పడాలి.. ‘‘మాలాంటి సైనికులు సరిహద్దులో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెడతారు. మేం అందరి కోసం పాటుపడతాం. మాకు కుల, మత, ప్రాంతీయ భేదాలు ఉండవు. కానీ మాలాంటి సైనికుల గుండెలు కూడా బరువెక్కేలా చేస్తున్న ఇలాం టి పిశాచాలు దేశంలో స్వేచ్ఛగా తిరుతుండ టం బాధాకరం. ఇలాంటి వారి కోసమా మే ము ప్రాణాలు పణంగా పెట్టి పని చేసింది? అన్న ఆలోచన మమ్మల్ని మరింత బాధకు గురిచేస్తోంది. అందుకే ఇలాంటి రాక్షసులకు త్వర గా శిక్షలు పడేలా ప్రస్తుతమున్న చట్టాలను స వరించాలి. కొత్త చట్టాలు తీసుకురావాలి. నిర్భ య కేసులో ఏడేళ్లు గడిచినా నేటికీ దోషులకు శిక్ష పడలేదు. యూపీలోని ఉన్నావ్లో అత్యాచార బాధితురాలిని నిందితులు బెయిల్పై వచ్చి మరీ చంపడం అత్యంత హేయం. అం దుకే ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని చట్టపరంగా, శీఘ్రంగా శిక్షించేలా చట్టాలను బలోపేతం చేయాలి’’అని దిశ తండ్రి ప్రభుత్వాలను కోరారు. -
‘తండ్రీకొడుకులు నాటకాలు ఆడుతున్నారు’
సాక్షి, సంగారెడ్డి : ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చితే పంటితో తీస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో శనివారం జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు రఘునందన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీధర్రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కార్మికులను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరించడం దారుణం అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో రాయితో కొడితే.. మనం ఇటుకతో కొడదామన్న కేసీఆర్ ఇప్పుడు చేస్తుందేమిటి అని ప్రశ్నించారు. ‘కార్మికులు ఏమైనా మీ ఫాం హౌజ్లో వాటా అడిగారా సీఎం. తండ్రేమో జీహెచ్ఎమ్సీ నుంచి నిధులిస్తామంటే.. కొడుకు కేటీఆర్ మాత్రం నిధుల కేటాయింపు సాధ్యం కాదంటాడు. తండ్రీ కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు 45 రోజులకు ముందే నొటీసులిచ్చి సమ్మెకు వెళ్లారని పేర్కొన్నారు. ఐఏస్ అధికారి సోమేశ్ కుమార్ కార్మికులు వినకుంటే తొలగిస్తామని బెదిరిస్తున్నారని, ఇప్పటి వరకూ పోలీసు కానీస్టేబుల్ ఉద్యోగాలు తప్ప మరే ఉద్యోగాల భర్తీ జరగలేదని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పిరికిపందల సంఘం ఆధ్యక్షుడని ఎద్దేవా చేశారు. సకల జనుల సమ్మెతో సమైక్యాంధ్రులను వణికించిన చరిత్ర ఆర్టీసీ కార్మికులదని అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత బాగుపడింది ఆంధ్రా కాంట్రాక్టర్లని, మీకు మేము అండగా ఉంటాం.. ఎవరు భయపడవద్దని రఘునందన్ భరోసా ఇచ్చారు. చదవండి : లైవ్ అప్డేట్స్: నిలిచిన బస్సులు.. ప్రయాణికుల కష్టాలు -
అన్ని సమస్యలూ ఎదుర్కొన్నా
‘‘ఒక కొత్త నిర్మాత ఎదుర్కొన్న అన్ని సమస్యలను నేనూ ఎదుర్కొన్నాను. వీటన్నింటినీ ఒక లెర్నింగ్ ప్రాసెస్గా భావించాను. అందరికీ వినోదం కావాలి. కానీ చాలామందికి సినిమాలంటే చిన్నచూపు’’ అన్నారు నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిశోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మాది అనంతపురం. ఇంజినీరింగ్ పూర్తి చేశాను. కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజినీర్గా వర్క్ చేశాను. సినిమాలపై ఆసక్తితో నిర్మాణరంగంలోకి వచ్చాను. చిన్నతనం నుంచే నిర్మాణరంగంపై ఆసక్తి ఉంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు గారు నాకు ప్రేరణ. సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా చేశా. లాభ నష్టాలను చూశాను. ఈ అనుభవంతో ఒక సినిమాను నిర్మించాలనుకుని ఈ సినిమా చేశాను. ముందు మూడున్నర కోట్ల బడ్జెట్ అనుకున్నాం. కానీ దాదాపు ఆరుకోట్లు అయ్యింది. అయితే అవుట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రాయ్ లక్ష్మీకి మంచి క్రేజ్ ఉంది. అందరికీ నచ్చేలా ఉంటుంది ఈ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా మంచి ఎమోషన్ కూడా ఉంది. టీమ్ అందరూ బాగా సహకరించారు. హీరో హీరోయిన్లు బాగా నటించారు. మధునందన్, ప్రవీణ్ల పాత్రలు నవ్విస్తాయి. మరో నాలుగు ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. -
‘వెయ్యి అబద్ధాలు ఆడినా రాహుల్ పెళ్లి చేయలేరు’
సాక్షి, హైదరాబాద్ : రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు అంశానికి సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికను చూసి కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యిందని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆ నివేదికతో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి పోయిందన్నారు. గురువారం మీడియా మాట్లాడిన శ్రీధర్ రెడ్డి.. ‘ ఇన్ని రోజులుగా రఫేల్ డీల్పై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలకు వత్తాసు పలుకుతున్న ప్రతిపక్ష నేతల మాటలన్నీ విష ప్రచారం అని తేలిపోయింది. రఫేల్పై ఎలాంటి తప్పులు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉంది. తాజా కాగ్ నివేదిక కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటింది. ఈ నివేదికలో 16 అంశాలు ప్రస్తావించారు. రాడార్, చీకట్లో శత్రువులను ఛేదించే పనితీరు విమానాలు ఇందులో ఉన్నాయి. అబద్ధాలు మాట్లాడమే పనిగా పెట్టుకున్న రాహుల్కు నిజాలు మింగుడు పడటం లేదు. రఫేల్పై మోదీకి మరకపూయాలని రాహుల్ చూశారు. అబద్ధాన్ని గట్టిగా ప్రచారం చేసి అధికారంలోకి రావాలని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి అబద్ధాలు ఆడినా రాహుల్ గాంధీ పెళ్లి చేయలేరు. విష ప్రచారం చేసి అధికారంలోకి రాలేరు. కమీషన్లు రావని అప్పట్లు రఫేల్ విమానాలను కొనుగోలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అవసమరి ఇండియన్ ఎయిర్ఫోర్స్ చెప్తే వాటిని మేము కొనుగోలు చేశాం. రాహుల్, సోనియా, రాబర్ట్ వాద్రాలు ట్యాక్స్ ఎగ్గొట్టి దేశాన్ని దోచుకున్నారు. రాష్ట్రాలను దేశాన్ని దోచుకున్నది కాంగ్రెస్ పార్టీ’ అని తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ చదవండి: ధర 2.86 శాతం తక్కువే -
కాంగ్రెస్లో చంద్రబాబు కోవర్ట్ రేవంత్: శ్రీధర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్నేత రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చంద్రబాబు కోవర్ట్ అని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని విమర్శిస్తే పెద్దనాయకుడు అవుతానని రేవంత్రెడ్డి భ్రమపడుతున్నారని, మోదీని విమర్శించే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. మరోవైపు అమిత్షా ఒక్కసారి రాష్ట్రానికి వస్తేనే కాంగ్రెస్ వణికిపోతోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టే’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎంఐఎం (మజ్లీస్) పార్టీ కి వేసినట్టేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్రీధర్రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓల్డ్సిటీ ప్రాంతానికి పరిమితమైన ఒక పార్టీ నేత మాట్లాడుతూ కర్ణాటకలో కుమారస్వామి సీఎం కాగా లేనిది.. తెలంగాణలో తాను సీఎం కాలేనా అన డం అర్థంలేని మాటలన్నారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మార్చుకోండి
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మార్చి గాంధీ భవన్ అని పెట్టుకోవాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి హితవు పలికారు. విలేకరులతో మాట్లాడుతూ..మానిపోయిన గాయాలను మళ్లీ తెరమీదకు తెస్తూ మీ స్వార్థ రాజకీయాల కోసం తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకులు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతారా అని ప్రశ్నించారు. విధానం, సిద్ధాంతం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనేనని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో సొంతంగా పోటీ చేసే దమ్ముందా అని సూటిగా అడిగారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని వ్యాక్యానించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ నిన్న మాట్లాడుతూ కర్నాటకలో కుమారస్వామి సీఎం అవ్వగా లేనిది తాను సీఎం కాలేనా అన్న విషయాన్ని గుర్తు చేశారు. అక్బరుద్దీన్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. పాతనగరంలో కేవలం ఏడు స్థానాలకు పరిమితమైన ఎంఐఎం పార్టీ నుంచి ఏవిధంగా సీఎం అవుతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ, పాముకు పాలుపోసి పెంచిపోషిస్తుందని ఎంఐఎం నుద్దేశించి వ్యాఖ్యానించారు. మళ్లీ తెలంగాణాలో రజాకార్ల పాలన పునరుద్దరించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. సెక్యులరిజం అంటున్నటీఆర్ఎస్ ఇప్పుడు ఎంఐఎం మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బూటకపు సెక్యులరిజాన్ని తెలంగాణ ప్రజలు నమ్మకూడదని, నిజమైన సెక్యులరిజం ఉందంటే అది బీజేపీలోనే ఉందని అన్నారు. -
అధ్వానంగా ఆస్పత్రుల నిర్వహణ: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ అధ్వానంగా మారిందని శుక్రవారం బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి భవనం పెచ్చులూడుతూ రోగులు గాయపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరో పించారు. కాలుకు ఆపరేషన్ కోసం రెండ్రోజుల క్రితం ఉస్మానియాకు వచ్చిన రోగి ఇలాగే గాయపడి ఐసీయూలో చేరాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటన ఆస్పత్రుల నిర్వహణ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఓ నిదర్శనమన్నారు. నేడు కృష్ణా–తుంగభద్ర సంగమంలో.. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ అస్తికలను ఈ నెల 25న అలంపూర్ కృష్ణా–తుంగభద్ర సంగమంలో నిమజ్జనం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్రెడ్డి నేతృత్వంలో ఉదయం 7 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నిమజ్జన యాత్ర ప్రారంభమవుతుందన్నారు. -
‘ముందస్తు’ రాజకీయ జిమ్మిక్కు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ప్రతి రోజూ ముందస్తు ఎన్నికలు.. ఎప్పుడొస్తాయో.. నాకు అధికారం వస్తదా.. నా కుమారుడికి అధికారం వస్తదా అనే ఆలోచనే తప్ప.. ప్రజల ఆరోగ్యం గురించి పట్టింపే లేద’న్నారు. హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రిలోనే కాలు విరిగి వచ్చిన వ్యక్తి మీద పెచ్చులూడి మీద పడితే ఐసీయూలో చేర్చారు, హైదరాబాద్లోనే ఇట్లా ఉంటే ఊర్లలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డాక్టర్లు, నర్సులు భయంగా పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. సీఎం కంటికి ఢిల్లీ వెళ్లి వైద్యం చేసుకుంటారు కానీ ఊర్లలో ఉన్న ప్రజలు ఉస్మానియా ఆసుపత్రికి కూడా రావొద్దా అని సూటిగా అడిగారు. రోజూ కొత్తకొత్త ప్రకటనలు మాత్రం చేస్తారురూ.200 కోట్లు ఇచ్చినట్లుగానే ఇచ్చి రూ.6 కోట్లు మాత్రమే శాంక్షన్ చేశారు. చివరికి రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. పండుగలకు పబ్బాలకు, ఇఫ్తార్లకు వందల కోట్లు ఖర్చు పెట్టే మీరు ఆసుపత్రులకు డబ్బులు కేటాయించడానికి చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన డయాలిసిస్ సెంటర్లకు రిబ్బన్ కట్ చేసి పబ్బం గడపుకుంటున్నారని విమర్శించారు. ప్రగతి నివేదన సభకు రూ.200 కోట్లు ఖర్చు పెడతారు కానీ అందులో పదిశాతం ఉస్మానియా ఆసుపత్రికి ఇవ్వరా అని సూటిగా అడిగారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన కార్పొరేట్ ఆసుపత్రుల యజమాని మాత్రం బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారని తెలిపారు. ఎన్నికలు రాగానే కేంద్రాన్ని తిట్టడం కేసీఆర్కు సాధారణమైపోయిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా కనీసం పూట గడవదు. అన్నీ తెచ్చుకుని కేంద్రంపైనే విమర్శలా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాలేదు కాబట్టే బీజేపీని విమర్శించడం మొదలు పెట్టారని అన్నారు. ముందస్తు హడావిడి అంతా రాజకీయ జిమ్మిక్కని, ముందస్తు రాదు.. టీఆర్ఎస్, బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. -
‘మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రజలకు రౌడీలు, గూండాల నుంచి బెదిరింపులు వచ్చేవన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీల పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రుల, ఎమ్మెల్యేల పేషీలు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయన్నారు. మంత్రులు కృష్ణారావు, పద్మారావు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, దుర్గం చిన్నయ్యలు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులే రౌడీల్లాగా వ్యవహరిస్తే ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో 30 ఎకరాల దళితుల భూమి కబ్జా చేశారనే ఆరోపణలు వస్తే.. వాటిలో వాస్తవాలు ఇప్పటివరకు తేలలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు అధికారులను బెదిరించిన మంత్రి జూపల్లిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
దొంగలనుకొని గ్రామస్తుల దాడి
భీమ్గల్ (బాల్కొండ): గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ గిరిజనుడు మృతి చెందాడన్న వార్త నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న సమీపంలోని 12 తండాల గిరిజనులు చేంగల్ గ్రామంలోని పలు ఇళ్లపై దాడులకు దిగారు. అడ్డుకోబోయిన పోలీసులపై ఎదురుతిరిగారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడ్డారు. ఒకదశలో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. మంగళవారం దొంగలుగా భావించి గ్రామస్తులు జరిపిన దాడిలో నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం డీబీ తండాకు చెందిన మాలావత్ దేవ్యా (40), దేగావర్ లాలూ గాయపడ్డారు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దేవ్యా బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గిరిజనులు చేంగల్కు చేరుకొని ఆందోళనకు దిగారు. అడిషనల్ డీసీపీ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో సుమారు 10 మంది సీఐలు, 15 మంది ఎస్సైలతో సహా 100 మంది సిబ్బందిని రంగంలోకి దింపి పరిస్థితిని అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. చివరకు నిజామాబాద్ ఆర్డీవో వినోద్కుమార్ రంగంలోకి దిగి గిరిజన పెద్దలతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి రూ.8.5 లక్షల ఎక్స్గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇల్లు, ఐదెకరాల ప్రభుత్వ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దాడికి పాల్పడిన 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో ఫుటేజీ ఆధారంగా ఇంకా ఎంత మంది ఉన్నా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతో గిరిజనులు శాంతించి వెనుదిరిగారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. -
రావులపాలెం టు ఇందూరు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): గంజాయి స్మగ్లర్లను పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఆగడంలేదు. ఏపీలోని రావులపాలెం నుంచి ఇందూరుకు గం జాయి రవాణా అవుతోంది. ఈ క్రమం లో స్మగ్లర్లపై పోలీసులకు పక్కా సమా చారం రావడంతో వలపన్ని పట్టుకుంటున్నారు. ఈ వివరాలను ఆదివారం డీసీపీ శ్రీధర్రెడ్డి విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్ ఆటోనగర్కు చెం దిన మునావర్ అలీ గతేడాది 2017 మే నెలలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబట్టాడు. ఇతడిపై ఆంధ్ర లో 6 కేసులు, మహారాష్ట్రలో ఒకటి, వరంగల్ జిల్లా బచ్చన్నపేట్ పీఎస్లో ఒకటి, నిజామాబాద్ ఆరోటౌన్లో ఒక కేసు నమోదయ్యాయి. నగర శివారులో తనిఖీల్లో అరెస్టు ఈనెల 27న పెద్దిరాజు, క్యాతం శ్రీనివాస్తో 70 కిలోల గంజాయిని ఏపీ10 ఏడీ 1454 నంబరుగల ఇండిగో కారులో 28న ఉదయం నిజామాబాద్ నగర శివారు మాధవనగర్కు చేరుకున్నారు. ఇంతలో నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీధర్, పోలీసుల తో కలిసి అర్సపల్లి మాధవనగర్ బైపాస్ పై వాహనాల తనిఖీలు చేశారు. స్మగ్లర్ల కారును పోలీసులు తనిఖీలు చేయగా గంజాయి బాగోతం బయటపడింది. రవాణా చేస్తున్న పెద్దిరాజు, క్యాతం శ్రీనివాస్ను పోలీసులు విచారించారు. ము నావర్ అలీకి సప్లయ్ చేస్తున్నామన్నారు. దీంతో పోలీసులు మునావర్ అలీ ఇంటి పై దాడిచేశారు. ఇంట్లో 10 కిలోల గం జాయి లభ్యం కావటంతో వెంటనే అత డిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 80 కిలోల గంజాయిని(రూ.12 లక్షల విలువ) స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. వీరి నుంచి 5సెల్ఫోన్లు, రూ.వెయ్యి, కారును స్వాధీనం చేసుకు న్నామన్నారు. ప్రతిభ చూపిన పోలీసులను డీసీపీ అభినందించారు. వీరికి రివార్డులకు సీపీకి విన్నవిస్తామన్నారు. గుట్కా వ్యాపారి అరెస్టు.. నగరంలోని హైమదీబజార్లో గుట్కా వ్యాపారం చేస్తున్న షేక్ అహ్మద్ను అరెస్టు చేశామని డీసీపీ శ్రీధర్రెడ్డి తెలిపారు. శనివారం అబు బకార్ షాపు, గో దాంలపై పోలీసులు దాడిచేసి 75 కార్టన్ల గుట్కాను పట్టుకున్నారన్నారు. ఇది నిర్మ ల్ జిల్లా బాసర్కు చెందిన కరీం సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించామని, అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగామన్నారు. పథకం పన్నారిలా.. గంజాయి కేసులో విజయవాడ సబ్జైల్లో శిక్ష అనుభవిస్తున్న మునావర్ అలీకి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న మరో గంజాయి స్మగ్లర్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాడెర్ మండలం పాలకొల్లుకు చెందిన క్యాతం శ్రీనివాస్రావుతో పరిచయం ఏర్పడింది. వా రిద్దరు బెయిల్పై గతేడాది నవంబర్ లో జైల్ నుంచి విడుదలయ్యారు. అయినా మునావర్ ప్రవర్తనలో మా ర్పురాలేదు. ఇతడు మళ్లీ గంజాయి రవాణాపై దృష్టి సారించాడు. క్యాతం శ్రీనివాస్తో కలిసి ఈనెల 13న రావులపాలేం గ్రామానికి వెళ్లి పెద్దిరాజును పరిచయం చేసుకున్నారు. 80 కిలోల గంజాయి కావాలంటే, పెద్దిరాజు ప్రస్తుతం తన వద్ద 10 కిలోలు మాత్రమే ఉందని, మిగతా 70 కిలోల గంజాయి 15 రోజుల తర్వాత పంపిస్తానని చెప్పాడు. దాంతో మునావర్ రూ.80 వేలు పెద్దిరాజుకు చెల్లించి 10 కిలోల గంజాయినినిజామాబాద్కు తెచ్చాడు. -
ద్వంద్వ ప్రమాణాలకు హద్దే లేదా?
దేశ హితానికి ఆటంకంగా నిలుస్తున్న 2జి స్పెక్ట్రమ్, దాణా కుంభకోణం వంటి అంశాలపై కూడా కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఇంత ద్వంద్వ ప్రమాణాలతో వ్యవçహరించడం ఆశ్చర్యకరం. ఈ వైఖరి దేశ ప్రయోజనాలకు భంగకరం. గుజరాత్ ఎన్నికల సమయం నుంచి దేశంలో భారతీయ జనతా పార్టీపైనా, నరేంద్ర మోదీ పైన జరుగుతున్న విష ప్రచారం, తీవ్ర విమర్శలు, అదే సమయంలో దేశంలో జరుగుతున్న వివిధ పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు, ఒక వర్గం మీడియా, స్వయం ప్రకటిత మేధావులు, విమర్శకులు వ్యక్త్తం చేస్తున్న అభిప్రాయాల పరంపర, విశ్లేషణా చతురత చూస్తుంటే విస్మయం కలుగుతోంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో వాగ్బాణాలు మొదలుకొని, లాలూ ప్రసాద్పై నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు వరకు, కాదేదీ బురద జల్లడానికి అనర్హం అన్న విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల, సంస్థల వ్యవహారశైలి.. సమకాలీన రాజకీయాల్లో ఇష్టంలేని వారి పట్ల వ్యవహరించే వికృత, విశృంఖల విన్యాసాలను కళ్ళకు కడుతుంది. 2జి స్పెక్ట్రమ్ కేసులో పాటియాలా హౌస్ కోర్టు తీర్పు కచ్చితంగా దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ పని తీరును తప్పు పట్టే విధంగానే ఉన్నది. దేశ ఖజానాకు ఇంచుమించు లక్షన్నర కోట్లకు పైగా నష్టం కలిగించిన వ్యవహారాన్ని పకడ్బందీగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించగలిగేలా నేరాన్ని రుజువు చేయలేకపోవడం నిజంగానే భారత ప్రజల్ని నిరాశపరిచింది. కోర్టు తీర్పు రాగానే రాజా, కనిమొళి కంటే ఎక్కువగా సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కుంభకోణాల విషయంలో ఎంత ఆత్మన్యూనతా భావనలో ఉన్నారో చెప్పకనే చెపుతుంది. ఇది ట్రయిల్ కోర్టు తీర్పు మాత్రమే, ఇంకా న్యాయ వ్యవస్థలో మరిన్ని మెట్లు ఉన్నాయనే విషయాన్ని సావకాశంగా మర్చిపోవడం వారి అల్ప సంతోషానికి నిదర్శనం. కుంభకోణమే లేకపోతే విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు 122 లైసెన్సులు రద్దు చేసిందెందుకు అనే విషయంపై కాంగ్రెస్, ఇతర పక్షాలు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత సదరు వనరులను వేలం వేస్తే దేశ ఖజానాకు లక్షన్నర కోట్లకు పైగా నిధులు సమకూరిన విషయం కూడా గుర్తుంచుకోవాలి. మోదీపై విష ప్రచార బాధ్యతలు మోసే వారికి ఆయనపై ప్రేమ ఉండే అవకాశం లేదు కానీ, కనీసం దేశం పైనైనా ప్రేమ ఉండకపోవడం విచారకరం. ఎందుకంటే స్పష్టంగా అనేక లోటుపాట్లు, ఆర్థిక అవకతవకలు ఉన్నా.. సాక్ష్యాధారాలతో నిరూపించలేక పోయారు అనే ఒకే ఒక కారణం చేత అసలు కుంభకోణమే లేదన్నట్లు ప్రచారం చేయడం దేశానికి నష్టం కలిగించే విషయమే. కుంభకోణం జరిగిందీ, బీజేపీ ఇతర పక్షాలు దాన్ని వెలుగులోకి తెస్తే కేసు పెట్టిందీ, చార్జ్ షీట్ వేసింది కాంగ్రెస్ హయాంలో. కేసును నీరు గార్చాలని ప్రయత్నం జరిగింది కాంగ్రెస్ ద్వారా, కానీ తీర్పు వెలువడిన తర్వాత నిందించేది మోదీ ప్రభుత్వాన్ని,.. ఇదెక్కడి తర్కమో అర్థం కాదు. సీబీఐని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని అపవాదులు వేస్తున్న కొందరు నాయకులు లాలూపై కోర్టు తీర్పు వెలువడగానే స్వరం మార్చి కొత్త రాగాలాపన మొదలు పెట్టారు. డీఎంకే నాయకులపై కేసు తీర్పు విషయంలో ఒకవైపు సంబరాలు చేసుకుంటూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించిన పెద్దలకు, లాలూ ప్రసాద్ కేసు తీర్పు మాత్రం మోదీ ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిగా కనపడుతుంది. డీఎంకేకి ఒక న్యాయం, లాలూకు ఒకన్యాయమా అంటున్నారు. అసలు లాలూ పరిపాలనంతా కుంభకోణాల నిలయం అని తెలిసి, కోర్టులు తప్పు పట్టిన తర్వాత కూడా రాజకీయ ప్రయోజనాలకోసం ఆయన అవినీతిని మోస్తున్నది కాంగ్రెస్. అసలు దేశంలోని న్యాయ వ్యవస్థనంతా మోదీనే నడిపిస్తున్నట్లు, ప్రతి తీర్పూ మోదీ కనుసన్నల్లోనే వస్తున్నట్లు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించాలనే వాళ్ళను ఏమనాలి? ఇక గుజరాత్ ఎన్నికల ఫలితాల విషయానికొస్తే మోదీ ప్రభ తగ్గిందని చౌకబారు ప్రచారం చేసే వారికి కొదువలేదు. ఓట్ల శాతం పెరిగింది కదా, బీజేపీకి కాంగ్రెస్కు తేడా పెద్దగా ఏం తగ్గలేదు కదా అంటే జవాబుండదు. లేని కుంభకోణాల గురించి ఎంత అరచి గీపెట్టినా గుజరాత్ ప్రజలు పట్టించుకోలేదు. హిమాచల్ప్రదేశ్ ఫలితాల గురించి మాట్లాడాల్సొస్తే, అక్కడ కాంగ్రెస్పై ప్రభుత్వ వ్యతిరేకత ఉందనీ, ఐదేళ్ల తర్వాత అది సహజమంటారు. మరి బీజేపీ ఇరవై రెండేళ్ల పాలన తర్వాత ఆ మాత్రం సీట్లు తగ్గడం కూడా సహజమే అన్న లాజిక్ మాత్రం అసహజంగా మర్చిపోతారు. గజినీ వారసులు కదా. గుజరాత్లో కులాల కుంపట్లు రాజేసింది కాంగ్రెస్. మోదీ గుడికి వెళ్తే మతోన్మాదం అన్న కుహనా సెక్యులర్ వాదులందరికి రాహుల్ గుజరాత్లో ఎన్ని గుళ్ళు తిరిగారో, ఎన్ని పూజలు చేసారో, తెలిసే ఉంటుందనుకుంటాను. ఇరవై రెండేళ్ల పాలన తర్వాత కూడా గుజరాత్ ప్రజలకు మోదీ పట్ల చెక్కు చెదరని విశ్వాసాన్ని చూసైనా ఆత్మశోధన చేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ , సదరు వర్గాలు ఆ ప్రయత్నం చేయక పోగా విష ప్రచార పరంపరకు మరింత పదును పెడుతున్నారనేది పై విషయాలను పరిశీలిస్తే అవగతమవుతుంది . ఇప్పటికైనా ఈ నిత్య విమర్శనాకారులు సంకుచిత ప్రచారాలను మానుకొని జాతి హితం కోసం నిర్మాణాత్మక పద్ధతుల్లో వ్యవహరిస్తే అందరికీ మంచిది. శ్రీధర్ రెడ్డి రావుల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి–తెలంగాణ, ఈ–మెయిల్ : mail2rsrr@gmail.com -
కారులో ఎక్కించుకుని.. కాళ్లు మొక్కించుకుని..
ముషీరాబాద్: తనను కులం పేరుతో దూషించడమే కాకుండా కారులో ఎక్కించుకుని నగరంలో తిప్పుతూ, కొట్టుకుంటూ కాళ్లు మొక్కించుకున్నారని, దాన్ని వీడియో కూడా తీశారని దోమలగూడకు చెందిన విద్యార్థి పల్లె భాగ్యరాజు మాదిగ తెలిపారు. బుధవారం విద్యానగర్లోని ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జాతీయ కన్వీనర్ దేవయ్య మాదిగ, జన్ను కనకరాజు మాదిగలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15న గాంధీనగర్ జగదాంబ ఆస్పత్రి వద్ద తన స్నేహితుడు రమేష్ కారు కుమార్ అనే వ్యక్తికి ఢీ కొనడంతో అతడికి గాయాలయ్యాయన్నాడు. వైద్య ఖర్చుల కోసం రూ.5వేలు ఇస్తానని రమేష్ చెప్పగా కుమార్ కుమారుడు శ్రీధర్రెడ్డి, అతడి స్నేహితులు రమేష్తో బలవంతంగా రూ.30వేలకు కాగితం రాయించుకున్నట్లు తెలిపాడు. రమేష్ వద్దకు రాగా వైద్య ఖర్చులు ఇస్తామని, కావాలంటే కేసు పెట్టుకోమని చెప్పానన్నాడు. దీంతో 17న రాత్రి శ్రీధర్రెడ్డి తనకు ఫోన్ చేసి చిక్కడపల్లిలోని మధురాలయ బార్ వద్దకు రమ్మని చెప్పాడన్నారు. అక్కడ శ్రీధర్రెడ్డి మరో ఆరుగురు వ్యక్తులు తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ దాడి చేశారని, కులం పేరుతో దూషించడమేగాక కాళ్లు మొక్కించుకుని దానిని వీడియో తీసినట్లు తెలిపాడు. తాను చిక్కడపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లగా మరుసటి రోజు రమ్మన్నారని, 18న ఎస్ఐ నాగుల్మీరా ఇద్దరితో మాట్లాడుదామంటూ రాజీ ధోరణిలో మాట్లాడారని తెలిపాడు. తన కేసు నమోదు చేయాలని, తనకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలని కోరడంతో శ్రీధర్రెడ్డితో పాటు సాయికుమార్, రమేష్, మరో నలుగురిపై నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయాలి భాగ్యరాజుపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ కో ఆర్డినేటర్ దేవయ్య మాదిగ అన్నారు. నిజామాబాద్లో భరత్రెడ్డి చేసిన ఘోరం మరవకముందే నగరం నడిబొడ్డున ఓ దళిత విద్యార్థిపై అగ్రకులస్తులు దాడి చేయడం దారుణమన్నారు. న్యాయం కావాలని పోలీస్స్టేషన్కు వెళ్తే పట్టించుకోని ఎస్ఐ నాగుల్మీరాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మోదీ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు: బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని.. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి అన్నారు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్కు దిమ్మతిరిగిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీని విమర్శించడం, దూషించడం ద్వారా కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి పెద్ద నాయకుడు కావాలని ఆశపడుతున్నారని ధ్వజమెత్తారు. నైతికత గురించి రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్.. కులం, మతం గురించి ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూసిందని ఆరోపించారు. కాన్వెంట్లో చదువుకున్న రాహుల్గాంధీకి ప్రజలతో ఉండే మోదీతో పోలికే లేదని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ అధికారులతో భేటీ అయినందుకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని శ్రీధర్రెడ్డి డిమాండ్ చేశారు. -
'లీడర్ కావాలని రేవంత్ ఆశపడుతున్నారు'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీపై ఆరోపణలు చేసి లీడర్ కావాలని రేవంత్రెడ్డి ఆశపడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నైతికత గురించి రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రేవంత్కు ధైర్యముంటే కొడంగల్లో గెలిచి చూపించాలని సవాలు విసిరారు. గుజరాత్, హిమాచల్ ఫలితాలతో కాంగ్రెస్కు మరోసారి దిమ్మతిరిగిందని ఎద్దేవా చేశారు. కాగా, ఫిరాయింపులు, అబద్ధాలతో దిగజారుడు పద్ధతుల ద్వారా గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
కేసీఆర్ జీవితంతో సినిమా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (కేసీఆర్) జీవిత విశేషాలతో ఓ చిత్రం తెరకెక్కనుంది. మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో ధర్మపధ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘1969లో తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న మా నాన్న చెప్పిన సంగతులు వింటూ పెరిగాను. నేను విన్న అప్పటి సంగతులు, చూసిన ఈనాటి సంఘటనలు నాలోని దర్శకుణ్ణి నిద్రపోనివ్వలేదు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు తీసిపోని సవాళ్లను కేసీఆర్ ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకుని, ఆ చరిత్రను తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నా. కేసీఆర్ పుట్టినరోజు సంద ర్భంగా 2018 ఫిబ్రవరి 17న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. -
ఎయిర్పోర్టులో భారీగా మందులు స్వాధీనం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పెద్ద మొత్తంలో అనుమతి లేని మందులను స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన శ్రీధర్రెడ్డి అనే ప్రయాణికుడికి చెందిన లగేజీని తనిఖీ చేయగా రూ.60 లక్షల విలువైన అనుమతి లేని విదేశాల్లో తయారైన మెడిసిన్స్ దొరికాయి. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీధర్రెడ్డి హైదరాబాద్ వాసి అని సమాచారం. -
శ్రీధర్ రెడ్డిని సత్కరించిన ఎంపీ కేశినేని నాని
విజయవాడ(భవానీపురం) : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్రెడ్డిని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) సత్కరించారు. మంగళవారం న్యూ ఢిల్లీలో జరిగిన రెడ్క్రాస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ అత్యున్నత సేవా పురస్కారం కింద రాష్ట్రపతి ఆయనకు బంగారు పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కేశినేని భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీధర్రెడ్డిని కేశినేని నానీ అభినందించి సత్కరించారు. -
వరంగల్ లో జర్నలిస్టుల ధర్నా
జర్నలిస్టుల సమస్యలపై టియుడబ్ల్యూజే(ఐజేయు) ఆద్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి జర్నలిస్టుల ధర్నా లో పాల్గొన్నరు ఈ కార్యక్రమనికి టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా జాతీయ ,రాష్ట్ర నాయకులూ దాసరి కృష్ణారెడ్డి వెంకటరమణ కుమారస్వామీ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విలేఖరులు హాజరయ్యారు. జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ ,కట్ల శ్రీను బిజేపి జిల్లా అద్యక్షులు అశోక్ రెడ్డి టీడీపీ నాయకురాలు సీతక్క సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు శ్రీనివాసరావు వాసుదేవరెడ్డిలు సంఘీభావం తెలిపారు. జీవో 239 ను సవరించి తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. -
శ్రీధర్ రెడ్డి 9/33
హైదరాబాద్: ఫ్యూచర్ స్టార్స్ మీడియం పేసర్ శ్రీధర్ రెడ్డి (9/33) చెలరేగాడు. ఆక్స్ఫర్డ్ బ్లూస్తో జరిగిన ఎ-డివిజన్ రెండు రోజుల మ్యాచ్లో అతను అద్భుతమైన స్పెల్ (15.2-4-33-9) ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను హడలెత్తించాడు. తొలిరోజు ఆటలో ఫ్యూచర్స్టార్స్ 318/9 స్కోరు చేసింది. రెండో రోజు ఆక్స్ఫర్డ్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ తొమ్మిది శ్రీధర్ ఖాతాలోకే వెళ్లాయి. తర్వాత ఫాలోఆన్లో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆక్స్ఫర్డ్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్ ఫ్యూచర్స్టార్స్కు 9, ఆక్స్ఫర్డ్కు 3 పాయింట్లు దక్కాయి. ఖురేషీ 3కే ఏడు వికెట్లు శ్రీచక్ర ఆటగాడు అబ్దుల్ ఎలల్ ఖురేషీ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్లో మూడే పరుగులిచ్చి 7 వికెట్లు కూల్చిన ఖురేషీ బ్యాటింగ్లో అర్ధసెంచరీ సాధించాడు. మొదటి రోజు ఆటలో తొలుత బ్యాటింగ్ చేపట్టిన అవర్స్ 72 పరుగులకే ఆలౌటైంది. ఖురేషీ (5.5-2-3-7) అసాధరణ స్పెల్తో రెచ్చిపోయాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన శ్రీచక్ర ఆట నిలిచే సమయానికి 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఖురేషీ (63) రాణించాడు. అనిశ్ కుర్దుకర్కు 4 వికెట్లు దక్కాయి. ఇతర మ్యాచ్ల స్కోర్లు జిందా తిలిస్మాత్ తొలి ఇన్నింగ్స్: 93 (అజారుద్దీన్ 21; సౌరవ్ కుమార్ 5/55, ఈశ్వర్ రావు 4/18), బడ్డింగ్ స్టార్స్ తొలి ఇన్నింగ్స్: 279 (ముకేశ్ 54; అమర్ అయూబ్ 7/106), జిందా తిలిస్మాత్ రెండో ఇన్నింగ్స్: 105 (అజార్ అలీ 36; అబ్దుల్ మొఖిత్ 5/24, ముకేశ్ 4/34). ఉస్మానియా తొలి ఇన్నింగ్స్: 226, న్యూబ్లూస్ తొలి ఇన్నింగ్స్: 218, ఉస్మానియా రెండో ఇన్నింగ్స్: 200/4 (ఆశిష్ 100, సిద్ధాంత్ 49, వసీయుద్దీన్ 3/81), న్యూబ్లూస్ రెండో ఇన్నింగ్స్: 59/3. అగర్వాల్ సీనియర్స్ తొలి ఇన్నింగ్స్: 178, ఎస్బీఐ తొలిఇన్నింగ్స్: 199/9 (క్రాంతి కుమార్ 42, అబు బాకర్ 44), అగర్వాల్ రెండో ఇన్నింగ్స్: 25/5. గ్రీన్టర్ఫ్ తొలి ఇన్నింగ్స్: 376, నిజామ్ కాలేజి తొలి ఇన్నింగ్స్: 259 (సాయికుమార్ 81, సందీప్ 55; సాయి శ్రాగ్వీ 5/63, త్రిశాంక్ గుప్తా 5/118). విజయ్ హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 231, మహమూద్ సీసీ తొలి ఇన్నింగ్స్: 235/9 డిక్లేర్డ్ (గణేష్ 65; మెహర్ ప్రసాద్ 4/66), విజయ్ హనుమాన్ రెండో ఇన్నింగ్స్: 162/3 (భరత్ తేజ 38). -
వింతవ్యాధితో గొర్రెలు మృతి
వైద్యులకు కూడా అంతుచిక్కని వ్యాధితో 15 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం సురాజుపల్లె గ్రామపంచాయతీ కర్సుకుంటపల్లెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నపుల్లమ్మ అనే కాపరికి చెందిన రూ.ఒకట్నిర లక్షల విలువైన 15 గొర్రెలు ఒక్కరోజులోనే వింతవ్యాధితో చనిపోయాయి. పోషకుల సమాచారంతో పశువైద్యాధికారి శ్రీధర్రెడ్డి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నోటికి సంబంధించిన వ్యాధి గొర్రెలకు సోకుతోందని, అయితే లక్షణాలను బట్టి అది కొత్త వ్యాధి అని ఆయన తెలిపారు. మృత గొర్రెల నుంచి నమూనాలు సేకరించి లేబొరేటరీకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఫలితాలు అందిన అనంతరం వ్యాధి నిర్ధారణ అవుతుందని చెప్పారు. కాగా,ఈ గ్రామంలోని వారంతా గొర్రెల పెంపకాన్నే వృత్తిగా చేపట్టారు. సుమారు ఆరు వేల గొర్రెలను ఇక్కడ పోషించుకుంటున్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం ఎంపిక
సంగారెడ్డి టౌన్ : వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గాన్ని గురువారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆమోదంతో జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నెల 18 నుంచి మండల కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పి.శ్రీనివాస్రెడ్డి, క్రిస్టోఫర్, ఎండీ అజీర్, బి.శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శులుగా నరేంద్రరెడ్డి, రాములు, వీరన్న, తిరుపతిరెడ్డి, దుర్గాప్రసాద్, అశోక్గౌడ్, రఘురామ్రెడ్డి, భిక్షపతి అశోక్ పటేల్, ఇబ్రహీం, పాండునాయక్, నర్సిములు, సంయుక్త కార్యదర్శులుగా సంగాగౌడ్, శ్రీనివాస్, సంజీవ్, అహ్మద్, సతీష్ రాథోడ్, మల్లన్న, ఇమ్రాన్, సురేష్, వీరారెడ్డి, కుమార్, అధికార ప్రతినిధిగా సీహెచ్ మల్లయ్య, జిల్లా కార్యనిర్వాహక సభ్యులుగా రమేష్, ఎల్లం యాదవ్, మల్లేశం, కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులుగా ఎల్లయ్య, శశాంక్రెడ్డి, మల్లన్నను ఎన్నుకున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ యూత్ కన్వీనర్గా రాజశేఖర్రెడ్డి వైఎస్సార్ సీపీ సంగారెడ్డి నియోజకవర్గ యూత్ కన్వీనర్గా బి.రాజశేఖర్రెడ్డిని నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కన్వీనర్గా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. -
స్వచ్ఛమైన ప్రేమకథ!
‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’కి వినోద్ అసోసియేట్ డెరైక్టర్గా పనిచేశాడు. ట్రైలర్ బాగుంది. డైలాగులు కొత్తగా ఉన్నాయి. పూర్తి స్థాయి లవ్స్టోరీగా చేసిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని దర్శక-నిర్మాత ‘మధుర’ శ్రీధర్రెడ్డి అన్నారు. సాయి రోనక్, అదితీ సింగ్ జంటగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. ఈ చిత్రం ట్రైలర్ను హైదరాబాద్లో ‘మధుర’ శ్రీధర్రెడ్డి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. గుప్పెడంత ప్రేమ కోసం మనిషి ఏదైనా చేస్తాడు. తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈశాన్య భారతదేశ నేపథ్యం ఉంటుంది’’ అని తెలిపారు. ఈ వేడుకలో హీరో హీరోయిన్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పావని లింగాల తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో ముంచుతారా? సూదితో చంపిస్తారా?
-
ఆపరేషన్ చేశాం.. బ్లేడు వదల్లేదు
సుల్తాన్బజార్ (హైదరాబాద్): మహబూబ్నగర్ జిల్లాలోని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో ఓ మహిళ కడుపులో బ్లేడును వదిలేశారని ఓ పత్రిక (సాక్షి కాదు) లో వచ్చిన కథనం అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం కోఠిలోని తెలంగాణ వైద్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్రెడ్డితో కలసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వీరేశం, పుట్లా శ్రీనివాస్, డాక్టర్ జోయల్ సునీల్ మాట్లాడారు. ఆగస్టు 20న బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ వైద్య శిబిరంలో శస్త్ర చికిత్స చేయించుకున్న సరోజ కడుపులో డాక్టర్లు బ్లేడ్ వదిలేశారంటూ వచ్చిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. పది రోజులపాటు కడుపులో బ్లేడు ఉంటే అది పేగుల్లో ఇరుక్కుపోయి చనిపోయే ప్రమాదం ఉండేదని, కాని సదరు రోగి ఎంతో ఆరోగ్యంగా ఉందని తెలిపారు. కొందరు ప్రభుత్వ వైద్యుల ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ మహిళకు చికిత్స చేసిన స్థానిక వైద్యుడు సైతం కడుపులో బ్లేడు ఉందని నిర్ధారించలేదని తెలిపారు. ప్రస్తుతం సరోజ అనే ఆ మహిళ ఎంతో ఆరోగ్యంగా ఉందని తెలిపారు. తమ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేసిన వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు. -
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ 10 లక్షల పరిహారం ఇవ్వాలి భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్రెడ్డి కామారెడ్డి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కామారెడ్డిలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా శాఖ సమావేశం స్థానిక గంజ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంభాలకు రూ 10 లక్షల పరిహారం ఇవ్వాలని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మాణాలు చేశారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ 10 వేల నష్టపరిహారం ఇవ్వాలని, రైతులకు సంబంధించిన వంద శాతం రుణాలు ప్రభుత్వమే చెల్లించి తిరిగి రైతులకు రుణాలివ్వాలని, రెవెన్యూలో పహానీలో ఆన్లైన్, పట్టాదారు పాసుపుస్తకాలను తొందరగా ఇవ్వాలని, వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల కరెంటు సరఫరా చేయాలని, రైతుల పంటలను అడవి పందుల భారి నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మాణించారు. సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సాయిరెడ్డి, విఠల్రెడ్డి, అంజయ్య, విఠల్రెడ్డి, ఉప్పు రాజయ్య, జగదీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక... భారతీయ కిసాన్సంఘ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షునిగా దేవిరెడ్డి విఠల్రెడ్డి, అద్యక్షునిగా కొమిరెడ్డి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా పైడి విఠల్రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఉప్పు రాజయ్య, జగదీశ్వర్రెడ్డి, సహాయ కార్యదర్శిగా కూచన్పల్లి నారాయణరెడ్డి, విద్యుత్ విభాగానికి ఎం. లక్ష్మారెడ్డి, రెవెన్యూ విభాగానికి డీసీ సాయిలు, సేంద్రీయ విభాగానికి అకిటి జయకర్రెడ్డి, యువజన విభాగానికి అనంతరెడ్డి, కామారెడ్డి డివిజన్ అధ్యక్షునిగా లొంక వెంకట్రెడ్డి, ప్రధాన క్రాయదర్శిగా అంబీర్ వెంకట్రావ్, బోధన్ డివిజన్ అద్యక్షునిగా శంకర్రావ్, ప్రధాన క్రాయదర్శిగా సంజీవ్కుమార్, నిజామాబాద్ డివిజన్ అద్యక్షునిగా సాయిరెడ్డిలను ఎన్నుకున్నారు. -
‘బాబు అవినీతి దేశానికే తలవంపులు’
ఓడీ చెరువు : అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నాహజారే అంతటి వాడిని అని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి విమర్శించారు. శనివారం ఓడీ చెరువు మండలం సున్నంపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుకు రాష్ట్ర ప్రజానీకమే కాక యావత్ దేశం తల దించుకునేలా ఉందన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఆ నిధులను రాయలసీమలోని హంద్రీనీవా పనులకు వినియోగించి ఉంటే రాయలసీమ చెరువులు జలకళతో ఉండేవన్నారు. లేపాక్షి , హిందూపురం, చిలమత్తూరు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృధ్ది కేంద్రాలు స్థాపిస్తామని చెప్పి ఏడాది అయినా ఒక్కటీ చేయలేదన్నారు. -
విద్యాబాలన్ మిస్సింగ్..!
విద్యాబాలన్ తప్పిపోయారు....? మీరనుకుంటున్నట్లు బాలీవుడ్ నటి విద్యాబాలన్ కాదు....ఈ సినిమాలో ఓ పాత్ర పేరు. అసలు ఈ విద్యాబాలన్ ఎవరు...? ఎందుకు కనిపించట్లేదు...? వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాలంటే ‘వేరీజ్ విద్యాబాలన్’ చూడాల్సిందే. ప్రిన్స్, జ్యోతీ సేథ్ జంటగా శ్రీధర్రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మి నర్శింహరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘కథ’, ‘ఒక్కడినే’ ఫేం శ్రీనివాస్ దర్శకుడు. వచ్చే నెల 1న ఈ చిత్రం విడుదల కానుంది. టైటిల్ తరహాలోనే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. యూత్కి, మాస్కి నచ్చే కథ ఇదని, సంపూర్ణేష్ బాబు కామెడీ ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తుందనీ నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అక్కినేని శ్రీను, బాలాజీ శ్రీను ,సహనిర్మాతలు: హేమ వెంకట్, చిరంజీవి. -
టోల్..బెంబేల్
టోల్ప్లాజా నిర్మాణం అన్యాయం.. నెల్లూరు(సెంట్రల్) : నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడు జాతీయరహదారిపై టోల్ప్లాజా నిర్మాణం అన్యాయమని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జీరో అవర్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శుక్రవారం మాట్లాడారు. నెల్లూరు-కనుపర్తిపాడు సమీపంలో హైవేపై ఏర్పాటు చేస్తున్న టోల్ప్లాజా నేషనల్ హైవే నిబంధనలకు పూర్తిగా విరుద్ధమన్నారు. ఒక టోల్ప్లాజాకు మరో టోల్ప్లాజాకు 60 కి.మీ ఉండాలని, ఈ లోపల మరో టోల్ప్లాజా ఉండకూడదు అనే నిబంధన ఉందన్నారు. కావలి నుంచి తడ వరకు నాలుగు టోల్ప్లాజాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఒక్కొక్క టోల్ప్లాజా మధ్య 60 కి.మీ దూరం ఉండాలని ఇప్పటికే జిల్లా ప్రజల మీద 4 టోల్ప్లాజాల భారం పడుతుందన్నారు. అలాంటిది ఇప్పుడు ఏర్పాటు చేయనున్న టోల్ప్లాజాకు వెంకటాచలం స్వర్ణా టోల్ప్లాజాకి మధ్య దూరం కేవలం 16 కి.మీ మాత్రమే ఉందన్నారు. ఇప్పుడు కొత్త టోల్ప్లాజాతో నెల్లూరునగరవాసులపై పెనుభారం పడుతుందని ఆందోళన చెందారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి తక్షణమే టోల్ప్లాజా నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఒక్కసారి టోల్ ఫీజు వసూలు చేస్తే నేషనల్ హైవే నిబంధనల ప్రకారం ఆపే హక్కులేదని, అందువల్ల టోల్ వసూలు చేయకముందే ఆపివేయాలన్నారు. ఈ రోజు టోల్ప్లాజా నిర్మాణాన్ని ఆపకపోతే ఇకపై ఆపలేమని ఆందోళన చెందారు. ఇటీవల ఆ ప్రాంతంలో కడుతున్న టోల్ప్లాజాను ఆపాలని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కోరామని, దానికి అందరూ సహకరించారన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ కూడా టోల్ప్లాజాను ఆపివేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్ను సంప్రదించి టోల్ప్లాజా ఏర్పాటు అన్యాయని, రాతపూర్వకంగా కూడా నేషనల్ హైవే అధికారులను కోరారని, అయినా కూడా టోల్ప్లాజా ఏర్పాటు జరుగుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టోల్ప్లాజా నిర్మాణాన్ని ఆపివేయాలని కోరారు. దీనికి స్పందించిన రవాణాశాఖ మంత్రి సిద్దా రాఘవరావు వెంటనే ఈ టోల్ప్లాజా నిర్మాణాన్ని ఆపివేస్తానని హామీ ఇచ్చారని తెలియజేశారు. -
అడకత్తెరలో పోలీస్ అధికారులు
సాక్షి, గుంటూరు : జిల్లాలో పోలీస్ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. తమ వారికి అనుకూలంగా వ్యవహరించాలంటూ ఒక వైపు అధికారపార్టీ నేతలు ఒత్తిళ్లు, మరోవైపు నిక్కచ్చిగా విధులు నిర్వర్తించాలంటూ ఎస్పీల ఆదేశాలు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొంత మంది పోలీస్ అధికారులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. కొందరు వారికి భయపడి రాజీ పడుతుండగా, మరికొందరు సీఐలు, ఎస్సైలు మాత్రం వారితో రాజీ పడలేక సిక్లీవ్లు, లూప్లైన్ పోస్టుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఓ హత్య కేసులో తాము చెప్పిన వారిని ఇరికించలేదనే కొపంతో అధికార పార్టీ ముఖ్యనేత ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని తట్టుకోలేక నరసరావుపేట రూరల్ సీఐ శోభన్బాబు సిక్లీవ్ పెట్టారు. పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి సైతం సిక్లీవ్ పెట్టేందుకు ప్రయత్నించగా ఉన్నతాధికారులు వారించినట్లు సమాచారం. ఇదే దారిలో రూరల్ జిల్లాకు చెందిన నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు సిక్లీవ్లో వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. జిల్లాలోకి అడుగుపెట్టినప్పటి నుంచి రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్గా దృష్టి సారించడంతో నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన కొందరు పోలీసు అధికారులకు కంటిమీద కునుకు లేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించి ఏ ఏరియాలోనైతే అక్రమ రవాణాకు సహకరిస్తారో ఆ పోలీస్స్టేషన్ అధికారిని బాధ్యులుగా చేస్తూ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఇసుక, బియ్యం అక్రమ రవాణాదారులు, క్రికెట్ బెట్టర్లకు సహకరిస్తున్నారనే కారణంతో అనేక మంది సీఐలు, ఎస్సైలపై వీఆర్, సస్పెన్షన్ వేటు వేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్కుమార్ కూడా నగరంలో వ్యభిచార గృహాలు, క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలు, సింగిల్ నంబర్ లాటరీ వంటి అక్రమార్కులతో చేతులు కలిపితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేయడంతో ఉలిక్కిపడుతున్నారు. ఇప్పటి వరకు బియ్యం, ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న చీకటి వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్న అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొందరు పోలీసు అధికారులు మాత్రం అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్పీలు సీరియస్గా ఉన్నారని తాము చేయగలిగింది ఏమీలేదని కొందరు తేల్చి చెబుతున్నారు. మేం చెప్పినట్లు చేయాల్సిందే .... ఇదిలాఉంటే అధికార పార్టీ నేతలు మాత్రం పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చాం.. మా కార్యకర్తలు గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. ఇప్పుడైనా వారికి అనుకూలంగా పనులు చేయకపోతే ఎలా.. పెద్ద పనులైతే ఎస్పీలతో మేం మాట్లాడతాం... చిన్నచిన్న పనులు కూడా చేయకపోతే ఎలా ఊరుకుంటాం.. మా మాట వింటేనే ఇక్కడ ఉండండి.. లేదంటే సెలవుపెట్టి వెళ్లిపోండి.. ఇదీ పోలీస్ అధికారులపట్ల అధికారపార్టీ నేతల తీరు. దీంతో విసిగిపోయిన కొందరు పోలీస్ అధికారులు ఈ ఉద్యోగాలు మాకొద్దు బాబోయ్ అంటూ సెలవుపై వెళ్లిపోతున్నారు. -
‘మాస్టర్మైండ్స్’పై విచారణ కొనసాగుతోంది
సిద్దిపేట రూరల్: పట్టణంలోని మాస్టర్మైండ్స్ కళాశాలలో జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నామని సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలోని మాస్టర్మైండ్స్ కళాశాలలో నాలుగు నెలలుగా వాసవి అనే లెక్చరర్ పనిచేస్తోందని తెలిపారు. అయితే కొద్ది రోజులుగా కళాశాలకు చెందిన డెరైక్టర్ కిరణ్కుమార్రెడ్డి ఆమెను వేధిస్తున్నాడని, ఇదే క్రమంలో ఈ నెల 16న తను కళాశాలకు రాగానే వేధింపులకు గురిచేశాడని వాసవి ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు వన్టౌన్ పీఎస్లో సెక్షన్ 509 కింద కిరణ్కుమార్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా కళాశాలలో అల్లరి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేశారంటూ కాలేజీ యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు వాసవి భర్త తిరుపతితో పాటు మరో 10మంది విద్యార్థి నాయకులపై 448, 427, 307 సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు వివరించారు. 16వ తేదీన తాను కళాశాలకు వెళ్లినప్పుడు కాలేజీ నిర్వాహకులైన కిరణ్కుమార్రెడ్డి, విజయ్కుమార్రెడ్డి, మల్లారెడ్డి, పవన్కుమార్లు తదితరులు కులం(ఎరుకల) పేరుతో తనను దూషించారంటూ వాసవి భర్త తిరుపతి చేసిన ఫిర్యాదు మేరకు పైనలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఈ కేసును తానే ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నానని డీఎస్పీ చెప్పారు. ఎవరిపైనా పక్షపాతం చూపకుండా బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అలాగే కేసుల నమోదులో పక్షపాతం, ఓ వర్గంపై ఓవరాక్షన్ చేశారంటూ వన్టౌన్ సీఐ సురేందర్రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తులో ఏది తేలితే సెక్షన్లు కూడా అలాగే మారుతాయని వివరించారు. దీనిపై ఎవరికీ అపోహలు అవసరం లేదన్నారు. పట్టణంలో ఆందోళనలు, ర్యాలీలు చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సూచించారు. ఆయన వెంట టూటౌన్ సీఐ సైదులు ఉన్నారు. -
మంత్రుల ఇంటి అద్దె రూ.లక్షకు పెంపు
* మీరు త్యాగాలు చేయరా అని మంత్రులను ప్రశ్నించిన విపక్షం * ఆలయాలకు పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలకు అవకాశం * అభ్యంతరాలను తోసిరాజని బిల్లులకు శాసనసభ ఆమోదం సాక్షి, హైదరాబాద్: ఒకవైపు పీఆర్సీ కోసం ఉద్యోగులు అడుగుతున్నా స్పందించని ప్రభుత్వం.. మంత్రుల ఇంటి అద్దెను రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచుకోవడానికి సభలో బిల్లు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి తప్పుబట్టారు. మంత్రుల ఇంటి అద్దెను రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచడానికి ఉద్దేశించిన ‘ఏపీ జీతాలు, పెన్షన్ల చెల్లింపు సవరణ బిల్లు’ మీద శుక్రవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘‘విభజన వల్ల రూ. 16 వేల కోట్ల లోటు ఉంది. త్యాగాలకు సిద్ధం కావాలని సీఎం పదేపదే ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు రాజధానికి విరాళాలు సేకరిస్తున్నారు. త్యాగాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిస్తున్న వారు.. కనీసం పొదుపునకైనా సిద్ధం కారా? పొదుపు కోసం కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రుల భత్యాలు పెంచడం తగదు’’ అని హితవు చెప్పారు. ప్రతిపక్షం అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణించలేదు. బిల్లుకు ఆమోదం తెలపాలని ఆర్థిక మంత్రి యనమల ప్రతిపాదించారు. బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. డీజీపీకి 2 సంవత్సరాల పదవీ కాలం పదవీ విరమణతో సంబంధం లేకుండా డీజీపీకి 2 సంవత్సరాల పదవీ కాలాన్ని కల్పించడానికి ఉద్దేశించిన పోలీసు సంస్కరణల సవరణ బిల్లుకు కూడా సభ ఆమోదం తెలిపింది. యూపీఎస్సీ సూచించిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఒకరిని ఎంపిక చేసే అధికారం తాజా బిల్లు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ‘‘ఒకట్రెండు నెలల్లో పదవీ విరమణ చేసే అధికారిని డీజీపీగా ఎంపిక చేస్తే, తర్వాత రెండేళ్ల వరకు పదవిలో ఉంటారు. సీనియారిటీలో తర్వాత స్థానాల్లో ఉన్న ఐపీఎస్ అధికారులకు అన్యాయం జరగదా?’’ అని విపక్ష నేత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే హోం మంత్రి చినరాజప్ప బిల్లును ఆమోదించాలని సభను కోరారు. బిల్లుకు సభ ఆమోదం లభించింది. దేవాలయాల ప్రస్తుత పాలక మండళ్ల రద్దు, పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంపునకు అవకాశం కల్పించే ‘ఏపీ ధార్మిక, హిందూ మతపర సంస్థలు, దేవాలయాలు(సవరణ) బిల్లు’ మీద చర్చ జరగకుండానే సభ ఆమోదం తెలిపింది. ఫలితంగా కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లభించింది. -
డ్వామా బరితెగింపు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అక్రమార్కులను వెనకేసుకు రావడంలో డ్వామా అధికారులు బరితెగించారు. అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల పట్ల నిస్సంకోచంగా ‘రాజును మించిన రాజ భక్తి’ చాటుకుంటున్నారు. అసలు వీరు ప్రభుత్వ అధికారులా.. లేక ఆ రూపంలో ఉన్న కాంట్రాక్టర్లా అనిపించేలా వ్యవహరిస్తున్నారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థలో చిరుధాన్యాల మినీ కిట్స్ పంపిణీ తయారైంది. శనివారం నగరంలో నకిలీ విత్తనాల ప్యాకింగ్ స్థావరంపై పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో కళ్లకు కట్టినట్లు అక్రమాలు బయటపడ్డా... సదరు కాంట్రాక్టరుపై ఈగ కూడా వాలకుండా డ్వామా ఏపీడీ పోలీసుల వద్ద కూడా వాంగ్మూలం ఇచ్చారంటే అక్రమార్కులు, అధికారుల మధ్య బంధం ఎంత గట్టిగా పెనవేసుకు పోయిందో అర్థమవుతోంది. ‘డ్వామా’లో విత్తనాల సరఫరాను పర్యవేక్షించే ఏపీడీ నాగభూషణం కాంట్రాక్టరును వెనకేసుకొస్తున్న వైనం చూసి సంస్థలో సిబ్బందే ఆశ్చర్యపోతున్నారు. శనివారం నగరంలో అక్రమ విత్తనాల ప్యాకింగ్ స్థావరంపై పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ స్థావరంలో ‘డ్వామా’ పేరుతో ప్లాస్టిక్ కవర్లు ఉండటంతో డ్వామా అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్రమ విత్తనాల ప్యాకింగ్ స్థావరం యజమాని, కంట్రాక్టరు అయిన శ్రీధర్ రెడ్డికి కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే కాంట్రాక్టరు మాత్రం ఆ ఛాయలకు రాలేదు. డ్వామా ఏపీడీ మాత్రం హాజరై విత్తనాల ప్యాకింగ్లో ఎలాంటి అక్రమాలు లేవని, అంతా సవ్యంగానే జరుగుతోందంటూ వాదించారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి ధ్రువీకరణ లేని ధాన్యాన్ని విత్తనాల కింద సరఫరా చేయడం అక్రమమే అని తేల్చి చెప్పారు. ఆ మేరకు అక్కడున్న ధాన్యాన్ని సీజ్ చేసి కలెక్టర్కు నివేదిక పంపారు. సంబంధిత కాంట్రాక్టరుపై కేసు నమోదుకు సంబంధించి త్రీ టౌన్ ఎస్ఐ తమీమ్ అహ్మద్ని ‘సాక్షి’ సంప్రదించగా.. విత్తనాల ప్యాకింగ్ అంతా సవ్యంగానే జరుగుతోందని, అక్రమాలు లేవని డ్వామా ఏపీడీ వాంగ్మూలం ఇవ్వడంతో ఆ విషయాలనే ‘జనరల్ డైరీ’(జీడీ)లో నమోదు చేసుకున్నామని, ఫిర్యాదు లేక కేసు నమోదు చేయలేదని తెలిపారు. అసలు టెండర్లే పిలవలేదు : విత్తనాల సరఫరాకు సంబంధించి కాంట్రాక్టరుతో డ్వామా కుదుర్చుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ కాపీ ఇవ్వాల్సిందిగా ‘సాక్షి’ సంబంధిత ఏపీడీని మంగళవారం కోరింది. అందుకు సంబంధించిన వివరాలు సాయంత్రం ఇస్తానన్న అధికారి, తీరా సాయంత్రం అసలు విషయం బయట పెట్టారు. విత్తనాల సరఫరాకు సంబంధించి తామేమీ టెండర్లు పిలవలేదని, ఇండెంట్పై నేరుగా సంబంధిత డీలర్ నుంచి ఒక్కో మినీ కిట్ రూ.350 చొప్పున 11 వేల మినికిట్స్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కిట్ రూ.350 చొప్పున 11 వేల కిట్లకు రూ.37.50 లక్షలు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు జరిపేటప్పుడు టెండర్ లేకుండా ఎలా చేశారని ప్రశ్నిస్తే.. డ్వామాలో ఇలా టెండర్లు లేకుండానే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుందంటూ తన చర్యను సమర్థించుకున్నారు. అసలు విలువ : టెండర్ల విషయం అటుంచి.. వాస్తవంగా కాంట్రాక్టరు సరఫరా చేస్తున్న చిరుధాన్యాల విలువ ఎంత? అందుకు డ్వామా చెల్లిస్తోందెంత? అన్న వివరాలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగక మానవు. ప్రతి మినీ కిట్లో జొన్న, మొక్క జొన్న, సజ్జ, కొర్రలు అరకేజీ చొప్పున ఉంచి సరఫరా చేస్తున్నారు. ఈ చిరు ధాన్యాలు మార్కెట్ ధర కిలోకు.. జొన్న రూ.22, మొక్క జొన్న రూ.14, సజ్జ రూ.18, కొర్ర రూ.40 గా ఉన్నాయి. ఈ లెక్కన కాంట్రాక్టర్ మినీ కిట్లో ఉంచే నాలుగు రకాల ధాన్యం ధర రూ.47. సంచి, రవాణా ఖర్చులు మరో రూ.15 వేసుకున్నా మొత్తం ఖర్చు రూ.62. ఒక్కో కిట్పై వీరికి మిగిలేది రూ.288. 11వేల కిట్లకు రూ.31.68 లక్షలు. ఒక్క చిరుధాన్యాల సరఫరాలోనే రూ.31.68 లక్షలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందంటే.. ఇక మిగతా ‘డ్వామా’ పథకాల్లో ఎంత అవినీతి చోటు చేసుకుని ఉంటుందో అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతా సక్రమమేనంటూ వితండవాదం : ఈ విషయమై సంబంధిత ఏపీడీ నాగభూషణంను సంప్రదించగా.. విత్తనాల సరఫరాలో అక్రమాలు ఏమీ లేవని, మీరు సరైన అవగాహన లేక వార్త రాశారన్నారు. ఈ విషయమై తాము కలెక్టర్కు కూడా రెండు పేజీల వివరణ పంపుతున్నామని తెలిపారు. కలెక్టర్కు పంపిన నివేదిక ప్రతిని అడగ్గా దాన్ని యథాతథంగా ఇవ్వలేనని, కలెక్టర్కు పంపిన లేఖ సారాంశాన్ని తెలుగులో రాసి ‘సాక్షి’కి మెయిల్ చేశారు. తమకు విత్తనాలు సరఫరా చేసే కాంట్రాక్టరు లెసైన్సుడు విత్తన డీలర్ అని, లెసైన్సుడు డీలర్ తన గోడౌన్లో లూజు విత్తనాలను ప్యాకింగ్ చేయడంలో ఎలాంటి చట్ట వ్యతిరేకతకు పాల్పడలేదన్నారు. ఆ విత్తనాలను ధ్రువీకరణ లే ని విత్తనాలుగా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొనడం దురదృష్టకరమం టూ.. వారిపైనా తన కడుపు మంటను వెళ్లగక్కారు. ప్రభుత్వ విత్తన ధ్రువీకరణ సంస్థ నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేకుండా ప్యాక్ చేస్తుంటే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? రూ.37.50 లక్షల విలువైన పనిని టెండర్లు నిర్వహించకుడానే ఒక కాంట్రాక్టరుకు ఎందుకు కట్టబెట్టినట్లు? సప్లై కాంట్రాక్టరు నిబంధనల మేరకు సర్టిఫైడ్ సీడ్ కాకుండా మండీలో ధాన్యాన్ని చిన్న ప్యాకెట్లలో పెట్టి సరఫరా చేస్తే ఎందుకు ‘డ్వామా’ అధికారులు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ప్రశ్నలకు ‘డ్వామా’ ఏపీడీ సమాధానం దాట వేయడం గమనార్హం. -
నివాసయోగ్యమైన ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
రూరల్, సిటీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనిల్ నెల్లూరురూరల్ : వైఎస్సార్ నగర్లో నివాసయోగ్యమైన ఇళ్ల నిర్మాణమే తమ లక్ష్యమని నెల్లూరు రూరల్, నగర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేదలకు గూడు వసతి కల్పించే ఉద్దేశంతో నగర శివారు కొత్తూరు పరిధిలోని వైఎస్సార్నగర్లో చేపట్టిన పక్కాగృహాల నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగిందన్నారు. ఎమ్మెల్యేలు శనివారం వైఎస్సార్నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో ఇక్కడ పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ పాలకులు నాసిరకంగా పక్కాగృహాల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా గృహాలు నిర్మించారని మండిపడ్డారు. నగరంలోని 16 డివిజన్లకు చెందిన పేదలకు 6,500 ఇళ్లు మంజూరు చేశారన్నారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడం విచారకరమన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.30 కోట్ల ను గృహాల నిర్మాణానికి ఖర్చు చేసినా పూర్తి కాలేదన్నారు. నాసిరకం నిర్మాణాలపై విచారణ జరగలేదన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 50 కుటుంబాలకు మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నా రు. 2015 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించడమే తమ లక్ష్యమన్నారు. గృహనిర్మాణ సమస్యపై అసెంబ్లీలో గళమెత్తుతామన్నారు. గృహ నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకుంటే హడ్కో ద్వారా చేపట్టే విధంగా గృహ నిర్మాణశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇకపై తా ము ప్రతి రోజూ గృహాల నిర్మాణ పురోగతిపై మాట్లాడతామన్నారు. అధికారులతో సమీక్ష వైఎస్సార్నగర్లో గృహాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై రూరల్, నగర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్యాదవ్ పలు శాఖల అధికారులతో వైఎస్సార్నగర్లో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను హౌసింగ్ ఈఈ ద్వారా అడిగి తెలుసుకున్నారు. నెలలో ఎన్ని ఇళ్లు పూర్తి చేసి ఇవ్వగలరని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీనికి నెలకు 1000 పూర్తి చేస్తామని ఈఈ సమాధానమిచ్చారు. ఇళ్ల లబ్ధిదారులు రూ.3వేలు కట్టాలంటూ హౌసింగ్ అధికారులు నోటీసులు ఇవ్వడం సమంజసంగా లేదని, లబ్ధిదారులపై ఒత్తిడి తేవద్దని ఎమ్మెల్యేలు హౌసింగ్ ఈఈకి సూచించారు. వైఎస్సార్నగర్లో విద్యుత్ లైన్ల పనుల పై ఆ శాఖ డీఈతో చర్చించారు. రెండు నెలల్లో విద్యుత్ పరమైన పనులు పూర్తి చేస్తామని డీఈ హామీ ఇచ్చారు. వైఎస్సార్నగర్లో మంచినీ టి సరఫరా, అంతర్గత రోడ్ల నిర్మాణానికి సంబంధితశాఖ అధికారులు చొర వ తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. కార్పొరేటర్లతో సమావేశం వైఎస్సార్నగర్లో పలు ప్రాంతాల కా ర్పొరేటర్లతో రూరల్, నగర ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. ఆయా డివిజన్లలో గృహాలు పొందిన లబ్ధిదారుల జాబితా తీసుకుని లబ్ధిదారుల గృహాల వద్దకు వెళ్లాలన్నారు. గృహాల నిర్మాణంలో ఉన్న ప్రగతిని వారికి వివరించాలన్నారు. రోజుకు ఒక్కొక్క డివిజన్లో కనీసం 30 మంది లబ్ధిదారులనైనా కలవాలన్నారు. ఇళ్ల పరిశీలన వైఎస్సార్నగర్లోని పక్కా గృహాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. నిర్మాణదశలో ఉన్న, నాసిరకంగా ఉన్న గృహా లను సందర్శించారు. ఎమ్మెల్యేల వెంట డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు పావళ్ల మాధవి, తురకా అనిత, షేక్ తాజున్నీ, కొమరగిరి శైలజ, యాకసిరి ప్రశాంతికిరణ్, ఎస్కే వహిదా, బొబ్బల శ్రీనివాసయాదవ్, కాకుటూరు లక్ష్మీసునంద, కమల్రాజ్ సంపూర్ణ, ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, ఎ.బాలకోటేశ్వరరావు, దేవరకొండ అశోక్ ఉన్నారు. -
ఘనంగా వైఎస్ జయంతి
ఓడీ చెరువు : పార్టీ నేతలు, కార్యకర్తలు ఎప్పుడూ అధైర్య పడొద్దని, ఎల్లవేళలా అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ నేత దుద్దెకుంట శ్రీధరరెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం ఆయన మండల కేంద్రంలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి స్టోరు డీలర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను తొలగించాలని, వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లో భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ అధైర్యపడకుండా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి ముందుండాలని సూచించారు. త్వరలో మండలంలోని నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీ సీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన
నెల్లూరురూరల్, న్యూస్లైన్: రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన రానుందని, తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని బీవీనగర్, అనగుంట, కల్యాణ్నగర్, రాజుకాంప్లెక్స్, పాతవేదాయపాళెం, జనగణమనకాలనీ, దండోరా కాలనీల్లో ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రానుందన్నారు. తొలిరోజే రాష్ట్ర ప్రగతిని మలుపు తిప్పేలా జగనన్న ఐదు సంతకాలు చేస్తారని చెప్పారు. ఆ సంతకాలు రాష్ట్ర గతిని సమూలంగా మార్చివేస్తాయని, కొత్త అభివృద్ధి విప్లవం వస్తుందన్నారు. ఉచిత విద్యను అందించే అమ్మఒడిపై తొలి సంతకం, రూ.700 వృద్ధాప్య పింఛన్పై రెండో సంత కం, రైతన్నల కోసం రూ.3వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటుపై మూడో సంతకం, డ్వాక్రా రుణాల రద్దుపై నాల్గో సంతకం, గ్రామానికి, వార్డుకు ఒక ఆఫీసు చొప్పున పెట్టి ఏ కార్డు అయినా 24గంటల్లోనే వచ్చేలా ఐదో సంతకం జగనన్న చేస్తారని స్పష్టం చేశారు. ఐదు సంతకాలతో రాష్ట్రంలో మళ్లీ జగనన్న సంక్షేమ రాజ్యం వస్తుందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు సంతోషంగా జీవిస్తారన్నారు. ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. -
రాష్ట్ర భవిష్యత్ను ఓటుతో నిర్ణయించండి
నెల్లూరు రూరల్, న్యూస్లైన్ : ప్రజలు వేసే ఓట్లపైనే కొత్త రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. బుజబుజనెల్లూరులో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలసి రాజమోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైందన్నారు. ఓటర్లు సరైన తీర్పు ఇచ్చి సుస్థిరపాలనకు అవకాశం కల్పించాలని కోరారు. మహానేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు మరలా సమర్ధవంతంగా అమలుచేయగల సత్తా జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరన్నారు. సీమాంధ్రలో 150 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందన్నారు. జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు కూడా వైఎస్సార్సీపీవేనన్నారు. ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి కీలకపాత్ర పోషిస్తాడని వివరించారు. కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు తనను, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బాబు, పవన్ల వైఖరి శోచనీయం జగన్మోహన్రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సినీనటుడు పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు శోచనీయమని ఎంపీ రాజమోహన్రెడ్డి అన్నారు. నరేంద్రమోడీ నరహంతకుడని విమర్శించిన బాబు మళ్లీ అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటైన విషయమన్నారు. ఎన్టీఆర్ ద్వారా రాజకీయ గుర్తింపు పొందిన చంద్రబాబు ఆయన మరణానికే కారకుడయ్యాడని విమర్శించారు. అలాగే రాష్ట్ర విభజన విషయంలో ఆమోదం తెలిపి తెలుగుజాతిని రెండుగా విడదీసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఇక పవన్కల్యాణ్ నెల్లూరు సభలో సీమాంధ్ర నుంచి జగన్ను తరిమికొట్టాలంటూ వ్యాఖ్యలు చేయటం విచారకరమన్నారు. పోకిరి మాటలు మాట్లాడి గుండు కొట్టించుకోవటం పవన్కు అలవాటేనన్నారు. జగన్ను తరిమికొట్టడం పవన్ అబ్బతరం కాదని ఆవేశంగా మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వైఖరి కారణంగా మోడీ స్థాయి పూర్తిగా దిగజారిందన్నారు. రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటం తథ్యమన్నారు. కీలకమైన కేంద్ర మంత్రిగా రాజమోహన్రెడ్డి పదవిలోకి వస్తారన్నారు. వైఎస్ఆర్ వలన పదవులు పొందిన కాంగ్రెస్ నాయకులు ఆయన కుటుంబాన్ని విస్మరించడమే కాకుండా దూషణలకు దిగటం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వైఎస్ పథకాలు తిరిగి అమలు అవుతాయన్నారు. అన్నివర్గాల వారికి లబ్ధిచేకూరుతుందన్నారు. -
'బాలయ్య ప్రభావం ఏ మాత్రం ఉండదు'
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ హిందూపురం లోక్సభ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అనంతపురంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.... ఆ మహానేత మరణం తర్వాత రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహానేత ఉండి ఉంటే విభజన జరిగేది కాదన్నారు. విభజనలో మూలకారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా హీరో బాలకృష్ణ బరిలో దిగిన... ఆయన ప్రభావం ఏమాత్రం ఉంటుందని శ్రీధర్రెడ్డి వెల్లడించారు. -
దుర్మార్గంగా ఓటర్ల జాబితా తయారీ : కోటంరెడ్డి
నెల్లూరు(బారకాసు), న్యూస్లైన్: రెండురోజుల కిందట జరిగిన కార్పొరేషన్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను దుర్మార్గంగా తయారు చేశారని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. అస్తవ్యస్త ఓటరు జాబితాను సార్వత్రిక ఎన్నికల నాటికి సరిదిద్దాలని మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లగా పోటీ చేసిన అభ్యర్థులతో కలిసి ఆయన ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ అక్రమాలకు తావులేకుండా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఉత్వర్వులిచ్చినా క్షేత్రస్థాయిలో గందరగోళంగా తయారు చేశారని మండిపడ్డారు. వార్డుల విభజనలో కూడా ఇష్టానుసారం వ్యవహరించారన్నారు. ఒక డివిజన్లో 5 వేలు ఓట్లు, మరో డివిజన్లో 10 వేలు ఓట్లు చీల్చి ఇష్టానుసారం డివిజన్లను విభజించారని మండిపడ్డారు. బీసీలను ఓసీలుగా, ఓసీలను బీసీలుగా, ఎస్సీలుగా గణాంకాలు చేస్తూ లెక్కలేనన్ని అక్రమాలతో జాబితాలు తయారు చేశారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో గందరగోళం వల్లే కార్పొరేషన్ ఎన్నికల్లో 40 శాతం మంది తమ హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఓటర్లు తమకు స్లిప్పులు అందలేదని ఫిర్యాదు చేస్తుంటే రాజకీయ పార్టీలు స్పందించి పంపిణీ చేసేందుకు ప్రయత్నించడాన్ని పోలీసులు అడ్డుకుని కేసులు పెడతామనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మే 7న సార్వత్రిక ఎన్నికల్లోనైనా ఇలాంటి ఘోరమైన పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయాలని కోరారు. పొరపాట్లను సరిదిద్దకపోతే ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. అడ్డుకున్న పోలీసులు తప్పులు తడకగా తయారు చేసిన ఓటరు జాబితా విషయమై వైస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ నెల్లూరురూరల్ నియోజక వర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పార్టీ అభ్యర్ధులు, కార్యకర్తలతో కలిసి ఆర్డీవోను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తమ అభ్యర్థులతో మాత్రమే కార్యాలయంలోకి వెళ్తామని, కేవలం వినతిపత్రం అందచేస్తామని కోటంరెడ్డి హామీ ఇవ్వడంతో పోలీసులు వారిని లోనికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వర్లు, నెల్లూరురూరల్ నియోజక వర్గంలోని ఆయా డివిజన్లకు సంబంధించి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు. -
అబ్బో.. ఎంత డబ్బో
సిద్దిపేటజోన్, న్యూస్లైన్: ఎన్నికల సందడి ఒకవైపు కొనసాగుతున్న క్రమంలో స్థానిక ఎంపీడీఓ చౌరస్తా వద్ద మంగళవారం పోలీసుల తనిఖీలో రూ. 50 లక్షలు పట్టుబడ్డాయి. ఈ విషయం పట్టణంలో కలకలం సృష్టించింది. కరెన్సీని పోలీసు బందోబస్తు మధ్య వన్టౌన్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్రెడ్డి హుటాహుటిన స్టేషన్కు చేరుకుని కరెన్సీపై వివరాలు సేకరించారు. వన్ టౌన్ సీఐ నాగభూషణం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికలలో భాగంగా స్థానిక ఎంపీడీఓ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఏపీ 23ఏహెచ్ 2655 నంబరు గల కారులో రూ. 50 లక్షల నగదును గుర్తించారు. ఈ నగదుపై విచారించగా కొండపాక మండలం దుద్దెడ శివారులోని స్వాతి స్పిన్నింగ్ మిల్లుకు పత్తిని విక్రయించిన రైతులకు డబ్బులను చెల్లించేందుకు బ్యాంకు నుంచి రూ. 50 లక్షలను డ్రా చేసి తీసుకొస్తున్నట్టు సంబంధీకులు తెలిపారు. సంబంధిత నగదుతో ఉన్న కారును స్టేషన్కు తరలించి, విషయాన్ని డీఎస్పీకి వివరించినట్టు సీఐ తెలిపారు. అనంతరం బ్యాంకుకు సంబంధించిన డబ్బు డ్రా ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. మరోవైపు పెద్ద ఎత్తున పట్టుబడిన కరెన్సీపై పోలీసులు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సిద్దిపేటకు చెందిన సహాయ ఎన్నికల అధికారి, తహశీల్దార్ రాములు స్టేషన్కు చేరుకుని పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. డబ్బును సీజ్ చేసి సమగ్ర దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఆదాయ శాఖకు సమాచారం అందించారు. సీజ్ చేసిన నగదును స్థానిక ఎస్టీఓ కార్యాలయంలో భద్రపరిచారు. -
కరెంట్ కాటు
కుమారకాల్వ(చక్రాయపేట)న్యూస్లైన్ : చేతికి వచ్చిన పంటకు నీళ్లు కట్టేందుకు వెళ్లిన రైతన్నను వేకువజామున వచ్చిన కరెంటు ప్రాణం తీసింది. ఊడి కింద పడ్డ మోటారు వైరును తగిలించబోయిన ఆ రైతు ప్రాణాన్ని తీసి ఆయన కుటుంబాన్ని వీధిన పడేసింది. ఈసంఘటన చక్రాయపేట మండలంలోని కుమారకాల్వ గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా.. కుమారకాల్వకు చెందిన రైతు ఆలా ఈశ్వరయ్య(45) తెల్లవారుజామున 4గంటలకు విద్యుత్ వస్తుందని తన పొలంలో వేరుశనగ పంటకు నీళ్లు పెట్టాలని భార్యకు చెప్పి వెళ్లాడు. అక్కడికి వెళ్లే సరికి వైర్లు ఊడి కింద పడటంతో దాన్ని తగిలించ బోయి ప్రాణాలు వదిలాడు. తెల్లవారాక ఆయన బావమరది కాఫీ తీసుకెళ్లి చూసే సరికి ఈశ్వరయ్య శవమై కనిపించాడు. దీంతో అతడు ఇంటికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో విషయం గ్రామమంతా తెలిసి అందరూ పరుగున అక్కడికి చేరుకున్నారు. విగత జీవుడై పడిఉన్న ఈశ్వరయ్యను చూడగానే ఆప్రాంత మంతా రోదనలతో నిండుకొంది. మృతుడికి భార్య రామలక్షుమ్మతో పాటు భాస్కర్, జగదీష్ అనే ఇద్దరు కుమారులున్నారు. భాస్కర్కు బుధవారం ఇంటర్ పరీక్షలు మొదలు కావడంతో తండ్రి మృతిచెందిన విషయం పరీక్ష ముగిసిన తర్వాత తెలియ జేయడంతో ఆ విద్యార్థి కన్నీటి పర్యంతమయ్యాడు. సంఘటనపై వీఆర్వో శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని వేంపల్లెకు తరలించారు. తరలి వచ్చిన గ్రామస్తులు మృతుడు ఈశ్వరయ్య కుమారకాల్వతోపాటు పక్క గ్రామాలైన సిద్దారెడ్డిపల్లె, వెన్నపల్లె వాసులకు తలలోని నాలుక వంటి వాడని ఆ గ్రామాల ప్రజలు కంట తడిపెట్టారు. కువైట్కు వెళ్లి వచ్చి పొలం కొని కష్టాన్ని నమ్ముకొని బతికేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా గ్రామాల్లో జరిగే అల్లెం గుండు పోటీల్లో పాల్గొని బహుమతులు గెలిచేవాడని ఆయన స్మృతులను నెమరు వేసుకొంటూ గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈశ్వరయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు చెన్నారెడ్డి, శ్రీధర్రెడ్డి, సూరి, బయా రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
శ్రీధర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
నెల్లూరు రూరల్, న్యూస్లైన్: మే నెల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు అయ్యప్పగుడి సెంటర్లోని రాధాకృష్ణ కల్యాణమండపంలో ఆదివారం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీధర్రెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారన్నారు. ఆయన విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. సీమాంధ్రకు మంచి రోజులు వస్తున్నాయని, రెండు నెలల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. తెలుగువారిని రెండు ముక్కలు చేసిన సోనియాకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు ఎన్ని ప్రజాగర్జనలు నిర్వహించినా ప్రజాభిమానం పొందలేరన్నారు. నెల్లూరులో నిర్వహించిన బాబు సభకు ప్రలోభపెట్టి జనసమీకరణ చేశారన్నారు. తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మంలో నిర్వహించిన సభలోనూ జగన్మోహన్రెడ్డి తాను సమైక్యవాదినని చెప్పడం గర్వించదగిన విషయమన్నారు. కాంగ్రెస్ నుంచి వలసలు ఎక్కువయ్యాయని, వైఎస్సార్సీపీలో అవకాశం లేని వారు టీడీపీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. సీమాంధ్రను చంద్రబాబు సింగపూర్ చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ స్వర్ణయుగం సాధ్యమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసింది టీడీపీయేనన్నారు. ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్రెడ్డి పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించారని, ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లను వైఎస్సార్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా జగన్మోహన్రెడ్డి లెక్క చేయలేదన్నారు. రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు జవాబుదారిగా ఉంటానన్నారు. 30 ఏళ్లుగా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న తనను ఎమ్మెల్యే చేస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సిటీ సమన్వయకర్త పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ కార్పొరేషన్ను ఎమ్మెల్యే వివేకానందరెడ్డి తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ విలువైనదని, వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సిటీ కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ శ్రీధర్రెడ్డి విజయానికి కృషి చేస్తానన్నారు. పదవులు ఉన్నా, లేకున్నా పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. మేకపాటి సోదరుల వెంటే తన పయనం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ పిగిలం నరేష్యాదవ్, మాజీ కార్పొరేటర్లు తాటి వెంకటేశ్వరరావు, సన్నపరెడ్డి పెంచలరెడ్డి, నెల్లూరు మదన్మోహన్రెడ్డి, నాయకులు ఎస్డీ సలీంఅహ్మద్, సన్నపరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో పలువురి చేరిక ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి సమక్షంలో పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి రాజమోహన్రెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ కార్పొరేటర్లు రావులపల్లి వెంకటజ్యోతి, సూళ్లూరు రమాదేవితో పాటు సూళ్లూరు దేవరాజులు, పడారుపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి పాతపాటి ప్రభాకర్రెడ్డి అలియాస్ పుల్లారెడ్డి, సిద్ధార్ధ స్కూలు అధినేత సురేష్రెడ్డి, భక్తవత్సలనగర్ ప్రాంత నేత యనమల వీరారెడ్డి, వేదాయపాళెం ప్రాంత టీడీపీ నేత ఎంపీ కృష్ణారెడ్డి, హరనాథపురం కాంగ్రెస్ నేతలు మారంరెడ్డి కుమార్, మోహన్రావు తదితరులు ఉన్నారు. -
మన్నికగా కడితేనే.. మార్కెట్లో గిరాకీ!
సాక్షి, హైదరాబాద్: పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటిని కొనేందుకు ముందుకొస్తారు సామాన్యులు. అలాంటి వారికి నాణ్యమైన ఇళ్లను అందించడం బిల్డర్ల బాధ్యత. అందుకే ఎక్కడ ప్రాజెక్ట్ను ప్రారంభించినా నిర్మాణంలో ఎలాంటి రాజీపడకుండా నాణ్యమైన నిర్మాణ సామగ్రినే వినియోగిస్తాం అంటున్నారు ట్రాన్స్కాన్ లైఫ్స్పేసెస్ ప్రై.లి. ఎండీ శ్రీధర్రెడ్డి. ఫిర్జాదిగూడలో ఎకరం విస్తీర్ణంలో ‘ప్రగతి అవెన్యూ’ పేరుతో ప్రీమియం అపార్ట్మెంట్ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 70. అన్నీ 3 బీహెచ్కే ఫ్లాట్లే. ఎందుకంటే కొనుగోలుదారులందరి జీవన శైలి ఒకేలా ఉండాలి. భవిష్యత్తులో నిర్వహణ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దు. రూ. 15 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఏసీ జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, 270 గజాల్లో ల్యాడ్ స్కేపింగ్, అంపి థియేటర్, 4 వేల చ.అ. విస్తీర ్ణంలో క్లబ్ హౌస్, విశాలమైన పార్కింగ్, కార్ డ్రైవర్లకు ప్రత్యేకమైన రెస్ట్ రూములు వంటి సౌకర్యాలెన్నో కల్పిస్తున్నాం. చ.అ. ధర రూ. 2,650గా చెబుతున్నాం. 2015 మే కల్లా నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. భువనగిరిలో ఏరియా ఆసుపత్రి పక్కనే ‘ట్రాన్స్కాన్ లక్ష్మీ నరసింహా రెసిడెన్సీ’ పేరుతో మరో ప్రాజెక్ట్ను కూడా నిర్మిస్తున్నాం. 2 వేల గజాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో మొత్తం 35 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,250. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ల్యాడ్ స్కేపింగ్లతో నివాసితులకు గాలి, వెలుతురు విశాలంగా వచ్చేందుకు వీలుగా ఫ్లాట్ల గోడకు గోడకు మధ్య ఆరున్నర ఫీట్ల స్థలాన్ని వదులుతున్నాం. టైల్స్, రంగులు, లిఫ్ట్, సిమెంట్, బాత్ రూమ్ ఫిట్టింగ్స్.. ఇలా నిర్మాణ సామగ్రి అంతా నాణ్యమైనవే వినియోగిస్తున్నాం. -
సైకిలెక్కేందుకే..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుని పసుపు చొక్కా తొడుక్కోవాలని నిర్ణయం తీసుకున్న శాసనసభ్యులు ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధరరెడ్డి ప్రస్తుత పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 24, లేదా 25వ తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును నెల్లూరుకు రప్పించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సైకిలెక్కే దిశగా వారు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈలోగానే ఆదాలను నెల్లూరు లోక్సభకు పోటీ చేయించాలా? కావలి శాసనసభకు పోటీ చేయించాలా? అనే విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నందున ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తే డిపాజిట్ దక్కదని ఆదాల, ముంగమూరు దృఢ నిశ్చయానికి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసేయడంతో రెండో ప్రత్యామ్నాయంగా వారు తెలుగుదేశంను ఎంచుకున్నారు. ఆదాలతో జిల్లా టీడీపీ ముఖ్య నేతలకు ఉన్న సన్నిహిత సంబంధాలతో వారే ఈ ఇద్దరి చేరిక గురించి చంద్రబాబుతో మాట్లాడి సరేననిపించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి స్థానిక గ్రూపు రాజకీయాల వల్ల కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్రావుకు ఆదాలతో చెక్ పెట్టేలా పావులు కదిపారు. ఆదాలను కావలి నుంచి పోటీ చేయించి మస్తాన్ రావును లోక్సభకు పోటీ చేయించే ప్రతిపాదన చేశారు. చంద్రబాబు కూడా ఇందుకు అంగీకరించి మస్తాన్రావు ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. ఆదాల కోసం తనను బలిచేసే నిర్ణయం తీసుకుంటే తాను ఎన్నికల్లో పోటీకే దిగనని, కావలి నుంచైతేనే పోటీ చేస్తానని ఆయన తెగేసి చెప్పడంతో చంద్రబాబు సైతం వెనకడుగు వేశారు. అయితే ఆదాల, ముంగమూరులను పార్టీలోచేర్చుకోవడాన్ని మాత్రం చంద్రబాబు ఖరారు చేశారు. ఆదాలను నెల్లూరు లోక్సభకు పోటీ చేయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ముంగమూరు శ్రీధరరెడ్డికి మాత్రం ఆయన ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచే టికెట్ ఖరారైందని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన వెంటనే వీరిద్దరూ కాంగ్రెస్కు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరాలని భావించారు. అయితే అనూహ్య పరిణామాల నడుమ శాసనసభ రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరించడం, తనతో ఉన్న బంధుత్వం, ప్రభుత్వం నుంచి ఆదాలకు ఉన్న అవసరాల దృష్ట్యా సీఎం కిరణ్కుమార్రెడ్డి వీరి చేరికను వాయిదా వేయిస్తూ వచ్చారు. నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటం, లోక్సభలో గురువారం నాటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి ఇదే మంచి వాదన అవుతుందనే ఆలోచనతో ఎమ్మెల్యేలిద్దరూ గురువారం తమ రాజీనామా ప్రకటన చేశారు. చివరి వరకు సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూనే జనం వద్ద సమైక్య హీరోలుగా ముద్ర వేసుకునేందుకు ఆపసోపాలు పడిన ఆదాల, ముంగమూరు ఎట్టకేలకు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. -
హాస్టల్ సమావేశాలకు ‘సమ్మక్క’ ఎఫెక్ట్
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : హాస్టళ్లను గాడినపెట్టేందుకు ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సమ్మక్క సారలమ్మ జాతర ప్రభావంతో హాస్టల్ సమావేశాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు అనుకున్న రీతిలో హాజరుకాలేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లలో తల్లిదండ్రుల సమావేశాలు జరిగాయి. అయితే చాలా హాస్టళ్లలో ఒకరిద్దరు మాత్రమే హాజరయ్యారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు ఆదివారం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఏర్పాట్లలో మునిగి ఉన్నట్లు సంక్షేమ శాఖ అధికారులు చెప్పారు. దీంతో మొదటి సమావేశాలకే విఘ్నం ఏర్పడింది. హైదరాబాద్ కమిషనరేట్ నుంచి బీసీ సంక్షేమ శాఖ ఏడీ శ్రీధర్రెడ్డి సమావేశాలకు పరిశీలకుడిగా వచ్చారు. జిల్లాలోని మానకొండూరు, శంకరపట్నం హాస్టళ్లను సందర్శించి, తల్లిదండ్రుల సమావేశాలకు హాజరయ్యారు. కాగా ప్రతి నెల మొదటి వారంలో హాస్టళ్లలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహిస్తామని, వచ్చే సమావేశాలకు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు హాజరయ్యేట్లు చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ డీడీ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. -
ప్రసాదరావు నియామకానికి గ్రీన్సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా బి.ప్రసాదరావు నియామకానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులను విడుదల చేయనుంది. ఏసీబీ డెరైక్టర్ జనరల్గా ఉన్న ప్రసాదరావు.. సెప్టెంబర్ 30 నుంచి డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డీజీపీ నియామకంపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఢిల్లీలో బుధవారం భేటీ అయింది. ఐపీఎస్ 1979 బ్యాచ్కి చెందిన అరుణా బహుగుణ, టీపీ దాస్, బి.ప్రసాదరావు, ఎస్ఏ హుడా, 1981 బ్యాచ్కి చెందిన జేవీ రాముడు, ఏకే ఖాన్ పేర్లను డీజీపీ పదవికి యూపీఎస్సీ పరిశీలించింది. అరుణా బహుగుణ, దాస్, ప్రసాదరావుతో కూడిన ముగ్గురి ప్యానల్కు యూపీఎస్సీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి సీఎస్ పి.కె. మహంతి కూడా హాజరయ్యారు. ఈ ముగ్గురిలో ఒకర్ని డీజీపీగా నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రసాదరావును డీజీపీగా నియమించడం లాంఛన ప్రాయమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోసారి క్యాట్ను ఆశ్రయించిన దినేశ్ రెడ్డి మాజీ డీజీపీ దినేశ్రెడ్డి మరోసారి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. డీజీపీగా తన పదవీ విరమణకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ, ఇన్చార్జి డీజీపీగా ప్రసాదరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దినేశ్రెడ్డి క్యాట్లో మరో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తనను రెండేళ్లపాటు డీజీపీ పదవిలో కొనసాగించాలంటూ దినేశ్రెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్ను సవరించేందుకు అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది బుధవారం క్యాట్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషన్పై ధర్మాసనం స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అయితే ప్రసాదరావు నియామకంపై అభ్యం తరం ఉంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని.. ప్రస్తుత పిటిషన్లో ప్రసాదరావు ప్రతివాదిగా లేరని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శ్రీధర్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో, ప్రసాదరావును ప్రతిపాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటిషన్ వేయాలంటూ ధర్మాసనం దినేశ్రెడ్డిని ఆదేశించింది. -
‘శంఖారావా’నికి తరలిన జిల్లా జనం
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు పార్టీ నాయకులు జిల్లా నుంచి భారీగా జనాన్ని సమీకరించారు. సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్, అందోలు తదితర నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియానికి బయలుదేరి వెళ్లారు. మెదక్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పార్టీ యువత విభాగం జిల్లా అధ్యక్షులు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. జి.శ్రీధర్రెడ్డి సుమారు వంద వాహనాల్లో కార్యకర్తలు, ప్రజలను శంఖారావానికి తీసుకెళ్లారు. జిల్లా నాయకుడు పి.మనోజ్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనూ సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి నుంచి వాహనాల్లో భారీగా వెళ్లారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, పటాన్ చెరు నియోజకవర్గ సమన్వయకర్త గూడెం మహీపాల్రెడ్డి, కార్మిక విభాగం జిల్లా నేత నర్రా భిక్షపతి, అందోలు నుంచి బీసీ సెల్ కన్వీనర్ డీబీ మల్లయ్య, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాణిక్రావు నేతృత్వంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 25 వాహనాల్లో, నర్సాపూర్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ నుంచి పార్టీ నాయకుడు హబీబ్ ఆధ్వర్యంలో ప్రజలు, కార్యకర్తలు సభకు తరలివెళ్లారు. -
ఆ వార్తలో నిజం లేదు: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, హన్వాడ, కోయిలకొండ మండలాల్లో తాగునీటి పథకం కాంట్రాక్టులో తప్పుడు అర్హతపత్రం సమర్పించిన కాంట్రాక్టర్కు తాను మద్దతునిస్తున్నట్టు వచ్చిన వార్తలో నిజం లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అర్హతలున్నవారికే పని దక్కాలని, పోటీ ఉండాలన్న ఉద్దేశంతో శ్రీధర్రెడ్డి అనే కాంట్రాక్టర్తో టెండర్ వేయించానని, అంతేతప్ప ఆయన తప్పుడు అర్హత పత్రం సమర్పించలేదని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. టీడీపీకే చెందిన మరో కాంట్రాక్టర్ ధర్మారెడ్డి తప్పుడు అర్హత పత్రం సమర్పిస్తే తగిన చర్య తీసుకోవాలని అధికారులను కోరానన్నారు. -
రేవంత్.. నోరు అదుపులో పెట్టుకో : గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: రేవంత్రెడ్డీ...నోరు అదుపులో పెట్టుకో, మరోసారి వైఎస్సార్ సీపీ అధినేతపై అవాకులు, చవాకులు పేలితే తగిన గుణపాఠం చెబుతామని వైఎస్సార్ సీపీ యువత విభాగం జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. బుధవారం పోతిరెడ్డిపల్లిలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శ్రీధర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్కు బెయిల్పై బయటకు రావడంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. అందువల్లే టీడీపీ అధినేత చంద్రబాబు సహా రేవంత్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగన్పై అక్రమ కేసులు బనాయించినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. జగన్కు బెయిల్ రాకుండా చేసేందుకు చంద్రబాబు పనిగట్టుకుని మరీ ఢిల్లీకి కుట్రలు పన్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా అవి పనిచేయలేదన్నారు. జగన్ జన నేత కాబట్టే ఆయన బెయిల్పై విడుదల కాగానే జనం బ్రహ్మరథం పట్టారన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందనీ, త్వరలోనే ఆయన కేసులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయట పడతారన్నారు. జగన్ నాయకత్వంలో పార్టీ తిరిగి పుంజుకోవటం ఖాయమన్నారు. జైలులో ఉన్న సమయంలో సైతం తమ అధినేత ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించారన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ను, దానికి అంటకాగుతున్న టీడీపీ రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పి తీరుతారన్నారు. తెలంగాణలోనూ మహానేత వైఎస్సార్ అభిమానులున్నారనీ, పార్టీ ఈప్రాంతంలోనూ బలపడుతుందని శ్రీధర్రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో తమ పార్టీని ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఖాదర్హుస్సేన్, సుధాకర్, బస్వరాజ్, తుకారాం, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పల్ కాంగ్రెస్ నేత శ్రీధర్రెడ్డి ఆత్మహత్య