Talibans
-
పాకిస్తాన్ ముంగిట తాలిబన్ సవాళ్లు
అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు 2021లో అఫ్గానిస్తాన్ను వీడిన తర్వాత ఆ దేశాన్ని రెండోసారి హస్తగతం చేసుకున్న తాలిబన్... ప్రస్తుతం భద్రతా పరంగా పాకిస్తాన్కు అత్యంత ముప్పుగా మారింది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్లో తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ మిలిటరీ, నిఘా సంస్థలు తాలిబన్లకు శిక్షణ ఇచ్చి వారిని మరింత బలపడేలా చేశాయి. సోవియట్ యూనియన్ దళాల ఉపసంహరణ తర్వాత రాజకీయ అనిశ్చితి మధ్య అఫ్గానిస్తాన్ను పాలిస్తున్న బుర్హనుద్దీన్ రబ్బానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి 1996లో తాలిబన్లు ఆ దేశాన్ని హస్తగతం చేసు కున్నారు. అప్పటినుండి 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్పై దాడి తర్వాత అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు అఫ్గానిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసి హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పడే దాకా, తాలిబన్లతో పాకిస్తాన్ సత్సంబంధాలు నెరిపింది.వివాదాలు కూడా పట్టనంతగా...ఈ కాలంలో తాలిబన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంతలా పెనవేసుకు పోయాయంటే, రెండు దేశాల మధ్య 1947 నుండి ఉన్న సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేంతగా. ముఖ్యంగా 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన 2,640 కిలోమీటర్ల పొడవైన డ్యూరాండ్ లైన్ వల్ల దశాబ్దాలుగా ఏర్పడిన సంఘర్షణాత్మక వైఖరులను కూడా మరిచిపోయేంతగా. తాలిబన్తో సహా అఫ్గానిస్తాన్లో ఏర్పడిన అన్ని ప్రభుత్వాలదీ డ్యూరాండ్ లైన్ మీద ఒకే వైఖరి. వాటి వాదన ప్రకారం, ఇది సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూ జాతి ప్రజలను వేరుచేయడమే కాకుండా, శతాబ్దాలుగా ఉన్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తోంది. పాకిస్తాన్ మాత్రం ఈ లైన్ చట్టబద్ధత కలిగిన అధికారిక సరి హద్దుగా భావిస్తోంది. తాలిబన్ తన మొదటి దశ పాలనలో ఎక్కు వగా అఫ్గానిస్తాన్ను ఏకీకృతం చేయడంపై, తన అధికార పరిధిని విస్తరించడంపై దృష్టి కేంద్రీకరించింది. తాలిబన్కు కావలసిన కీలక మైన సైనిక, ఆర్థిక, దౌత్య సహాయాలను పాక్ చేస్తుండటంతో సరి హద్దు సమస్యలను లేవనెత్తి పాకిస్తాన్ ఆగ్రహానికి గురికాకూడదనే భయంతో తాలిబన్ కూడా సరిహద్దు విషయాన్ని పక్కన పెట్టింది. సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూన్లు ఏకమైతే పష్తూన్ జాతీయ వాదం తమను ముక్కలు చేస్తుందన్న భయం పాకిస్తాన్ను మొదటి నుండి వెంటాడుతోంది. ఆ విషయం తాలిబన్కు తెలిసినప్పటికీ తన కున్న అవసరాల దృష్ట్యా పష్తూన్ల ఐక్యత ఒక రాజకీయ కోణంలా రూపాంతరం చెందకుండా చూసుకుంది.ఎక్కడ చెడింది?ఇంతటి బలమైన సంబంధాలు నెరపిన పాకిస్తాన్, తాలిబన్ మధ్య 2021 తర్వాత దూరం పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనబడతాయి. ఒకటి, 2001లో అమెరికా చేపట్టిన తీవ్రవాదంపై యుద్ధంలో పాకిస్తాన్ పోషించిన ముఖ్యపాత్ర. 1999లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి జనరల్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దుర్భరస్థితిలో వుంది. ఆ దేశ విదేశీ అప్పులు సుమారు 39 బిలియన్ డాలర్లు ఉంటే, వడ్డీల చెల్లింపులకే బడ్జెట్లో సుమారు 56 శాతం కేటాయించాల్సిన పరిస్థితి! ఆ సమయంలో అమెరికాతో జట్టు కట్టడం వలన, అనేక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందడమే కాకుండా, పారిస్ క్లబ్ రుణదాతల నుండి కొత్త రుణాలు పొందగలిగింది. పాత రుణ బకాయిల చెల్లింపుల్లో సైతం అనేక వెసులుబాట్లు పొందగలిగింది. 1998లో అణు పరీక్షల తర్వాత ఎదుర్కొన్న అనేక ఆర్థిక ఆంక్షల నుండి విముక్తి పొందగలిగింది. వీటన్నిటి ఫలితంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడటమే కాకుండా, 2003 నాటికి పారిశ్రామిక రంగం సుమారు 8 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో 2001లో అఫ్గానిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం కూలిపోవడంతో అనేక మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్లోని ట్రైబల్ ఏరియాల్లోకి పారిపోయి ప్రజల్లో కలిసి పోయారు. మరి కొంతమంది, 2007లో పాకిస్తాన్లో కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇస్లామిక్ సిద్ధాంతాలను వ్యాపింప జేయ డానికి ‘తెహ్రిక్ ఏ తాలిబన్ పాకిస్తాన్’(టీటీపీ) స్థాపించారు.రెండో కారణానికి వస్తే, పాకిస్తాన్ 2017–2022 మధ్య ఏక పక్షంగా తన, అఫ్గానిస్తాన్ మధ్యన ఉన్న సరిహద్దుల్లో కంచె వేసి సరి హద్దులకిరువైపులా ఉన్న అనేక సంబంధాలను దెబ్బ తీసింది. ఈ కంచె తనకు సరిహద్దులపై పట్టును కల్పించి తీవ్రవాదాన్ని, మాదక ద్రవ్యాల, ఆయుధాల, మానవ, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు తోడ్పడుతుందని భావించింది. అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినప్పటికీ అత్యాధునిక వసతులతో సరిహద్దు కంచెను పూర్తిచేసింది. ఇది అఫ్గానిసాన్లోని అన్ని వర్గాలను, ముఖ్యంగా తాలిబన్లకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ సరిహద్దు వలన, సుమారు పదిహేను వేలమంది అఫ్గాన్లు తమ ఉపాధి కోల్పోవడమే కాకుండా, పాకిస్తాన్ నుండి వచ్చే సరుకుల్లో సుమారు 40 శాతం వస్తువులపై కోత పడటంతో అవి స్థానిక మార్కెట్లలో లభ్యం కాక అఫ్గాన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడటానికీ, వస్తువుల ధరలు పెరగడానికీ దారితీసింది.టీటీపీ డిసెంబర్ 31, 2022న మరింత ముందుకెళ్లి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఏకంగా పాకిస్తాన్ సార్వ భౌమత్వాన్ని సవాలు చేయడమే. అప్పటి నుండి పాకిస్తాన్లో తీవ్ర వాద దాడులు పెరగడం చూడవచ్చు. ఇస్లామాబాద్లోని ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ గతేడాది 1,166 తీవ్రవాద దాడులు ఎదుర్కొంది. అందులో 2,546 మంది చనిపోతే, 2,267 మంది గాయపడ్డారు. ఈ లెక్కలు అంతకుముందు ఏడాది (2023)తో పోలిస్తే 66 శాతం ఎక్కువ. ఒక్క గత నవంబర్లోనే 444 (రోజుకు సుమారు 15) దాడులు జరిగితే అందులో సుమారు 685 మంది చనిపోయారు.అంటే పరిస్థితి ఎంత తీవ్రత సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు టీటీపీ, మరోవైపు బలోచిస్తాన్ ప్రాంత స్వతంత్రం కోసం కొట్లాడుతున్న తీవ్రవాద గ్రూపుల దాడుల మధ్య పాకిస్తాన్ చిక్కుకుంది. అయితే, ఆ రెండు ప్రాంతాల తీవ్రవాద గ్రూపుల మధ్య ఉన్న భావజాల విభేదాల వల్ల వాటికి సన్నిహిత సంబంధాలు ఉండక పోవచ్చు. కానీ సరిహద్దుల్లో తాలిబన్ దాడులు చేస్తోంటే, పాకిస్తాన్ లోపల టీటీపీ రక్తపాతాన్ని సృష్టిస్తోంది.ఇండియాకూ కీలకమే!ఇలాంటి పరిస్థితుల మధ్య గత డిసెంబర్ 30న పాకిస్తాన్ ఐఎస్ఐ అధినేత... తాలిబన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అఫ్గాన్ నేష నల్ ఫ్రంట్కు ఆశ్రయమిచ్చిన తజికిస్తాన్ అధ్యక్షుడు ఏమోమాలి రహెమాన్ను కలిశారు. అది జరిగిన కొద్ది రోజులకు, జనవరి 8న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టకీని దుబాయ్లో కలిశారు. ఇవి కొత్త చర్చలకు దారి తీయడమే కాకుండా, ఈ ప్రాంతంలో మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలను, ఏర్పడుతున్న కొత్త సంబంధాలను, ఆవిష్కృతమవుతున్న నూతన ప్రాంతీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రానున్న రోజులలో వివిధ అవసరాల దృష్ట్యా తాలిబన్లతో సత్సంబంధాలు అటు రష్యాకూ, ఇటు చైనాకూ, వాటితో పాటే భారత్కూ అత్యంత కీలకం. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్యూ, న్యూఢిల్లీ ‘ opgadde2@gmail.com -
మహిళలు పనిచేసే ఎన్జీవోల మూత
కాబూల్: అఫ్గానిస్తాన్లోని తాలిబన్ పాలకులు మహిళలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ మహిళలు పనిచేసే జాతీయ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలన్నిటినీ మూసివేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ధరించాల్సిన హిజాబ్ను ఆయా సంస్థల్లోని అఫ్గాన్ మహిళలు ధరించకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆర్థిక శాఖ ఆదివారం రాత్రి ‘ఎక్స్’లో ఈ విషయం వెల్లడించింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేసే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని, కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా అందులో హెచ్చరించింది. నాన్ గవర్నమెంటల్ సంస్థల రిజిసే్ట్రషన్, సమన్వయం, నిర్వహణ, పర్యవేక్షణ సహా అన్ని కార్యకలాపాల బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. తాలిబాన్ నియంత్రణలో లేని సంస్థలు అన్నిటిలోనూ మహిళలు పనిచేయడం ఆపేయాలని మరోసారి హుకుం జారీ చేసింది. అత్యవసరమైన మానవతా సాయం అందించే కార్యక్రమాల్లోనూ మహిళల ప్రాతినిథ్యాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారని ఇటీవల ఐరాస సైతం ఆరోపించడం గమనార్హం. బాలికలు ఆరో గ్రేడ్ మించి చదువుకోరాదని, బహిరంగంగా కనిపించే విధుల్లో పాల్గొనరాదని ఇప్పటికే తాలిబన్ పాలకులు నిషేధం విధించడం తెలిసిందే. కిటికీల నుంచి మహిళలు కనిపించొద్దు తాలిబన్ నేత హిబతుల్లా అఖుంద్జాదా మరో తాఖీదు జారీ చేశారు. మహిళలు, నిలబడి లేదా కూర్చున్నట్లుగా కనబడేలా భవనాలకు కిటికీలు ఉండరాదన్నారు. కొత్తగా నిర్మించే వాటితోపాటు ఇప్పటికే ఉన్న భవనాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. వరండాలు లేదా వంటగదులు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఒక వేళ కిటికీలుంటే భవన యజమాని ఆ స్థానంలో గోడను నిర్మించడం లేదా ఏదైనా అడ్డుగా ఉంచడం చేయాలన్నారు. నివాస భవనాల్లోపలి భాగం కనిపించేలా కొత్తగా భవన నిర్మాణం చేయరాదని ఆయన మున్సిపల్, ఇతర అధికారులకు సైతం నిర్దేశించడం గమనార్హం. -
పుట్టిన రోజు వేడుకలకూ నోచుకోలేదు
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది? ఏదో హెయిరాయిల్ ప్రకటనలా ఉంది కదా! కానీ నిజానికి అదో బర్త్డే పార్టీ. అత్యంత రహస్యంగా చేసుకున్న పార్టీ. అందులో పాల్గొన్న అమ్మాయిలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. బర్త్డే పార్టీ అంత రహస్యంగా చేసుకోవడమెందుకు? వేరే ఏ దేశంలోనైనా అవసరం లేదు. కానీ ఆఫ్గానిస్తాన్లో మాత్రం అది అత్యవసరం! తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు, బాలికల దుస్థితికి అద్దం పడుతున్న ఈ ఫొటోను ఇరాన్–కెనడియన్ ఫొటో జర్నలిస్ట్ కియానా హయేరి తీశారు. ఇలాంటి చిత్రాల సమాహారాన్ని ‘నో విమెన్స్ లాండ్’ పేరిట ఈ నెల పారిస్లో ప్రదర్శించనున్నారు.ఏడు ప్రావిన్సులు తిరిగి... ఫ్రెంచ్ పరిశోధకురాలు మెలిస్సా కార్నెట్తో హయేరి 2018 నుంచి కలిసి పని చేస్తున్నారు. వారు కొన్నేళ్లుగా అఫ్గాన్లోనే ఉంటున్నారు. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ను వీడటం, దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం వంటి పరిణామాలకు వాళ్లు ప్రత్యక్ష సాక్షులు. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు వారిని భయపెట్టాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని కల్లబొల్లి ప్రతిజ్ఞలు చేసిన తాలిబన్లు చివరికి వాళ్లకు అసలు ప్రజా జీవితమే లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో సహా సర్వం కాలరాశారు. మహిళల గొంతు వినపడటమే నిషేధం. ముసుగు లేకుండా, మగ తోడు లేకుండా గడప దాటడానికి లేదు! బాలికల చదువుకు పాఠశాల స్థాయితోనే మంగళం పాడారు. బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, నృత్యం నిషేధం. అఫ్గాన్ మహిళల దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు హయేరి, కార్నెట్ ఏడు ప్రావిన్సుల్లో పర్యటించారు. ఎంతోమంది మహిళలను కలిశారు.ఆశలకు ప్రతీకలు కూడా... ఎంతసేపు అణచివేత గురించే ఎందుకు చెప్పాలి? అందుకే అఫ్గాన్ బాలికలు, మహిళలకు భవిష్యత్తు మీదున్న ఆశను కూడా హయేరి, కార్నెట్ ఫొటోల్లో బందించారు. తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపే వేడుకలను వాళ్లు జరుపుకొంటున్నారో చెబుతున్నారు. ప్రస్తుతం అఫ్గాన్లో బాలికలు, స్త్రీలకు సంబంధించి చిన్న వేడుక అయినా అది నేరుగా తాలిబన్ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. అందుకే బాలికలు పుట్టిన రోజులు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో స్నేహితులను కలుస్తున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రమాదాలు తెచ్చి పెడుతుందని తెలిసీ రిస్క్ చేస్తున్నారు. మహిళలు గుర్తింపుకే నోచుకోని చోట ఇలాంటి చిన్న వేడుకైనా పెద్ద ప్రతిఘటనే! చిరునవ్వులు చిదిమేస్తున్న కాలంలో ఆనందాన్ని ప్రదర్శించడం కూడా తిరుగుబాటే. అందుకే నిరసనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్నీ మహిళలు వదులుకోవడం లేదంటున్నారు. హయేరి, కార్నెట్.తాలిబన్లలోనూ విభేదాలు!మహిళలను తీవ్రంగా అణచివేయడంపై తాలిబన్లలోనే వ్యతిరేకత పెరుగుతోంది! అతివాది అయిన దేశాధినేత షేక్ హైబతుల్లా అఖుందా జాదా నిర్ణయాలను తాలిబన్లలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ వంటివాళ్లు బాలికలు, యువతుల విద్య కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఆరో తరగతి తర్వాత కూడా విద్యను అందించే అండర్ గ్రౌండ్ పాఠశాలలపై తాలిబన్లలోని కొన్ని విభాగాలు దృష్టి సారించినట్టు కార్నెట్ పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ను మరోసారి ఆకస్మిక వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో వరదలు, వర్ష సంబంధ ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రాథమికంగా అందిన సమాచారం అని మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని తాలిబాన్ అధికారులు శనివారం వెల్లడించారు. గత వారం పోటెత్తిన వరదవిలయం నుంచి తేరుకోకముందే మరో జలఖడ్గం అఫ్గానిస్తాన్పై దండెత్తి డజన్లకొద్దీ ప్రాణాలను బలితీసుకుంది. పశి్చమ ప్రావిన్స్ ఘోర్లో అత్యధికంగా 50 మంది మరణించారని ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ వహీద్ హమాస్ చెప్పారు. ప్రావిన్స్ రాజధాని ఫెరోజ్ కోహసహా వేలాది ఇళ్లు, వందల హెక్టార్లలో వ్యవసాయభూములు నాశనమయ్యాయి. ఉత్తర ఫరాయాబ్ ప్రావిన్స్లో 18 మంది చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రావిన్స్లోని నాలుగు జిల్లాల్లో వరదవిలయం దారుణంగా ఉందని, 300కుపైగా మూగజీవాలు మృతిచెందాయని గవర్నర్ అధికార ప్రతినిధి ఏస్మతుల్లాహ్ మొరాదీ చెప్పారు. ఘోర్ ప్రావిన్స్లో 2,500 కుటుంబాలు వరదబారిన పడ్డాయి. -
దేశం విడిచి వెళ్లండి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్థాన్కు అక్రమంగా వచ్చిన శరణార్థులు వెంటనే దేశం వీడి వెళ్లాలంటూ పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్ల పరిపాలనతో విసిగి వేసారిపోయిన అఫ్గాన్లు లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా పాక్కు చేరుకున్నారు. అలా వచ్చిన వారు 17 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వారందరూ నవంబర్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లో ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. అఫ్గాన్లో తాలిబన్ల కనుసన్న ల్లో ఉన్న ఉగ్రవాదులే దాడులకు పాల్పడుతున్నారని పాక్ ఆరోపి స్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్ 1లోగా అక్రమంగా వచ్చిన వారంతా వెళ్లకపోతే భద్రతా బలగాలతో వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. -
దెయ్యాలు వేదాలు వల్లిస్తే.. ఎవరూ ఊహించనిది ఇది!
ఎలన్ మస్క్తో పాటు ఎవరూ కూడా ఇలాంటి ఓ పరిణామం జరుగుతుందని ఊహించి ఉండరు. అదేంటో తెలుసా?.. తాలిబన్ల ఆయన్ని ఆరాధించడం. అవును.. ట్విటర్ను అద్భుతంగా నడిపిస్తూ తమకెంతో ప్రియపాత్రుడిగా నిలిచిపోయాడంటూ ఎలన్ మస్క్ను ఇష్టపడుతున్నారు వాళ్లు. అదే సమయంలో మార్క్ జుకర్బర్గ్ పేరు చెబితేనే అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే.. అఫ్గనిస్తాన్లో అనధికార ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తాలిబన్లు ట్విటర్పై.. దాని ఓనర్ ఎలన్ మస్క్పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తాలిబన్ నేత అనాస్ హక్కానీ సైతం మస్క్ను ఆకాశానికి ఎత్తేశాడు. భావ ప్రకటనకు సోషల్ మీడియాల్లో ట్విటర్ మాత్రమే సరైన వేదిక. దానిని సమర్థవంతంగా నడిపిస్తున్న ఎలన్ మస్క్కు తాలిబన్ల తరపున అభినందనలు. అందుకే ఆయనంటే మాకు ఎంతో గౌరవం అంటూ పేర్కొన్నారు. ‘‘ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల కంటే Twitter ద్వారా రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి. మొదటిది వాక్ స్వాతంత్ర్యం హక్కు. రెండోది Twitter స్వభావమైన విశ్వసనీయత. మెటాలాంటి అసహన విధానానికి ట్విటర్ దూరంగా ఉంటుంది. వేరొకటి దానిని భర్తీ చేయలేదు అంటూ మెటా థ్రెడ్స్ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారాయన. Twitter has two important advantages over other social media platforms. The first privilege is the freedom of speech. The second privilege is the public nature & credibility of Twitter. Twitter doesn't have an intolerant policy like Meta. Other platforms cannot replace it. pic.twitter.com/oYQTI3hgfI — Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) July 10, 2023 కారణం ఇదే.. మెటాను(ఒకప్పటి ఫేస్బుక్)ను తాలిబన్లు ద్వేషించడానికి ప్రధాన కారణం .. తాలిబన్ అనే పదాన్ని ఆ ప్లాట్ఫారమ్ పరిగణించే విధానం. పక్కా టైర్ 1 ఉగ్రవాద సంస్థగా తాలిబన్ను చూపిస్తోంది ఇది. పైగా తాలిబన్కు మురికి అనే అర్థం కట్టబెట్టింది. ఈ కారణం వల్లే ఫేస్బుక్(మెటా)లో తాలిబన్ లీడర్లు తమ అభిప్రాయాలను పంచుకోలేకపోతున్నారు.. అసహ్యించుకుంటున్నారు. అదే ట్విటర్లో అయితే యధేచ్ఛగా తమ పోస్టులను పెడుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ అఫ్గ్ పేరిట తాలిబన్ గ్రూప్కు ట్విటర్లో ఓ అధికారిక అకౌంట్ కూడా ఉంది. నాటో బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు తిరిగి అఫ్గనిస్థాన్ను స్వాధీనం చేసుకున్నాయి. ఇకపై ప్రజాస్వామ్య యుతంగా.. పాలన సాగిస్తామని, ఏ వర్గానికి హక్కుల్ని దూరం చేయబోమని ప్రకటించుకుని పాలన మొదలుపెట్టింది. పైగా ఈ ప్రచారంతోనే గ్లోబల్ గుర్తింపు, అటుపై ఆర్థిక సాయం.. ఒప్పందాల కోసం తాలిబన్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కానీ, తుపాకీ రాజ్యంలో మహిళలు, పిల్లల హక్కులను కాలరాస్తూనే వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తాలిబన్లు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది కదా!. ఇదీ చదవండి: ఒంటి కన్ను దొంగ.. భలే భలే కథ -
Afghan Women: చదువుల్లేక.. ఉద్యోగాల్లేక.. ఉరికొయ్యలే దిక్కై!
‘‘నాకు జీవితంపై ఇక ఎలాంటి ఆశలు లేవు. మమ్మల్ని చదువుకోనివ్వడం లేదు. స్వేచ్ఛగా బతికే అవకాశం లేదు. కుంగుబాటు, ఆందోళన నన్ను వేధిస్తున్నాయి. ఈ జీవితాన్ని ముగించాలన్న ఆలోచనలు తరచుగా వస్తున్నాయి. ఈ బాధలు భరించలేను. నా ఆవేదన ఎవరైనా వింటే బాగుండు. ఇది కేవలం నా ఒక్కరి దుస్థితి కాదు. నాతోపాటు యూనివర్సిటీలో చదువుకున్న యువతులంతా ఇలాగే మదన పడుతున్నారు. ఆత్మహత్య ఆలోచనలతో నిత్యం సతమతం అవుతున్నారు. బతకలేక చావలేక కుమిలిపోతున్నారు’’ – అఫ్గానిస్తాన్లో 20 ఏళ్లకుపైగా వయసున్న ఓ యువతి కన్నీటి గాథ ఇది. రాక్షస పాలనలో నిత్య నరకం అఫ్గానిస్తాన్లో 2021 ఆగస్టు నుంచి తాలిబన్ల పరిపాలన మళ్లీ మొదలైంది. అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్ ముష్కరులు అధికారంలోకి వచ్చారు. తాము పూర్తిగా మారిపోయామని, ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుకుంటామని తొలుత ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆచరణలో మాత్రం రాక్షస పాలనకు తెరతీశారు. మహిళలపై కఠినమైన ఆంక్షలు విధించారు. వారిపై దారుణమైన వివక్ష కొనసాగుతోంది. చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. ఆర్థిక స్వేచ్ఛ అసలే లేదు. అఫ్గాన్ బాలికలకు కొన్నిచోట్ల ప్రాథమిక విద్య మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఆరో తరగతి వరకూ పాఠశాలలకు వెళ్లి చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇంటికి పరిమితం కావాల్సిందే. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు నిరాకరిస్తున్నారు. కాలేజీ, యూనివర్సిటీ చదువులు యువకులకు మాత్రమే అన్నట్లుగా అనధికార శాసనం అమల్లోకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ యువతుల్లో మానసిక సమస్యలను, అనారోగ్యాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది అర్ధంతరంగా జీవితాలను చాలించినట్లు తెలుస్తోంది. సైకాలజిస్టులను సంప్రదించే బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఉత్తర అఫ్గానిస్తాన్లోని సంగ్చారక్ జిల్లాలో రెండు పాఠశాలల్లో ఇటీవలే దాదాపు 80 మంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. స్కూళ్లకు రాకుండా బాలికలను భయపెట్టడానికే విద్రోహులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. శరీరంలోకి విషం ఎక్కించినట్లుగా.. అఫ్గాన్ యువతుల్లో ఆత్మహత్య ఆలోచనలు ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతున్నాయని సైకాలజిస్టు డాక్టర్ అమల్ చెప్పారు. పరిస్థితి దిగజారుతోందని, ఇక్కడి వాస్తవాలు ప్రపంచానికి తెలియడం లేదని అన్నారు. ఆకలి చావులు, ఆహార సంక్షోభం గురించి మాత్రమే వార్తా పత్రికల్లో రాస్తున్నారని, మానసిక అనారోగ్య సమస్యల గురించి ఎవరూ రాయడం లేదని, మాట్లాడడం లేదని వెల్లడించారు. శరీరంలోకి నెమ్మదిగా విషం ఎక్కించినట్లుగా యువత ప్రవర్తిస్తున్నారని, జీవితంపై ఆశలు కోల్పోతున్నారని డాక్టర్ అమల్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో యువతులకు ప్రవేశం లేదంటూ తాలిబన్లు ప్రకటించినప్పుడు మొదటి రెండు రోజుల్లో తనకు 170 ఫోన్కాల్స్ వచ్చాయన్నారు. ఇప్పుడు నిత్యం దాదాపు 10 కాల్స్ వస్తున్నాయని తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది బాలికలు, యువతులే ఉంటున్నారని వివరించారు. వారిలో ఆత్మహత్య ఆలోచనలు పోగొట్టి, స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలి అఫ్గానిస్తాన్లో పితృస్వామ్య వ్యవస్థ బలంగా పాతుకుపోయింది. మహిళలపై ఆంక్షలు, వివక్ష, వేధింపులు అనేవి సహజంగా మారిపోయాయి. దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు మానసికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. బాధితుల్లో మహిళలే గణనీయంగా ఉంటారని తెలియజేసింది. తాలిబన్ల పెత్తనం మొదలయ్యాక పరిస్థితి మరింత దిగజారిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఆంక్షలు, వివక్షకు ఆర్థిక సంక్షోభం కూడా తోడయ్యిందని, ఇవన్నీ మహిళలను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నాయని అంటున్నారు. హెరాత్ ప్రావిన్స్లో ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో.. కౌమార వయసులో ఉన్నవారిలో మూడింట రెండొంతుల మందిలో ఆందోళన, కుంగుబాటు లక్షణాలు ఉన్నట్లు వెల్లడయ్యింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సకాలంలో చికిత్స అందించకపోతే వారు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దేశంలో ఆత్మహత్యల సంఖ్యను తాము రికార్డు చేయడం లేదని తాలిబన్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించాలని అఫ్గాన్ ప్రజలు కోరుతున్నారు. అలాగైతే తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందని, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశం అభివృద్ధి చెందుతుందని, మహిళలపై ఆంక్షలు రద్దవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కళాశాలలను తాలిబన్లు మూసేశారు. దాంతో నా ఉద్యోగం పోయింది. ఎక్కడా ఉపాధి దొరకలేదు. ఇంట్లో అందరినీ పోషించాల్సింది నేనే. పని దొరక్క చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. నిర్భయంగా బయట తిరగలేం. ఇంట్లోనే ఉండిపోవాలి. ఎలా బతకాలో తెలియడం లేదు. అందుకే మరోదారి లేక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశా. –మెహర్ అనే అధ్యాపకురాలి ఆవేదన ఇది ఈ ఏడాది మార్చి నెలలో స్కూల్ పునఃప్రారంభం కాగా, తరగతులకు హాజరయ్యేందుకు తన కుమార్తె ఉత్సాహంగా సిద్ధమైందని, తీరా అక్కడికి వెళ్లాక రావొద్దని చెప్పడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని నాదిర్ అనే వ్యక్తి చెప్పాడు. పెద్ద చదువులు చదువుకొని, దేశానికి సేవ చేయాలని తన బిడ్డ కలలు కనేదని తెలిపాడు. తాలిబన్ పాలకులు బాలికల పాఠశాలలను మూసివేశారని వెల్లడించాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. సిరీస్ బహిష్కరణ
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ షాకిచ్చింది. ఈ ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా ఆప్ఘనిస్తాన్తో జరగాల్సిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను రద్దు చేసుకుంటున్నట్లు సీఏ ఇవాళ (జనవరి 12) ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం మహిళలు, అమ్మాయిల ప్రాధమిక హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఏ వెల్లడించింది. 2021 సెప్టెంబర్లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, అమ్మాయిలకు విద్య, ఉపాధి దూరం చేయడంతో పాటు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించిందని, దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో పరోక్షంగా కూడా సమర్ధించేది లేదని పేర్కొంది. పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ వ్యాప్తికి సీఏ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, ఆఫ్ఘనిస్తాన్లో మహిళల క్రికెట్పై అంక్షలను సహించేది లేదని తెలిపింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమకు పూర్తి మద్దతు ప్రకటించిందని వివరించింది. తాలిబన్ ప్రభుత్వం మహిళలు, అమ్మాయిలపై అంక్షలు ఎత్తి వేస్తే వారితో సత్సంబంధాలు కొనసాగించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని అంది. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇలా వ్యవహరించడం ఇది తొలిసారి కాదు. గతంలో హోబర్ట్లో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ను ఇదే కారణంగా చూపి రద్దు చేసింది. -
ఆఫ్ఘన్ లో తాలిబాన్ దుర్మార్గం
-
అఫ్గాన్లో విద్యార్థినుల నిరసన గళం
కాబూల్: అఫ్గానిస్తాన్లో ఉన్నతవిద్యాసంస్థల్లో మహిళా విద్యార్థులపై నిషేధం విధించి, మహిళా విద్యను ఉక్కుపాదంతో అణిచివేస్తున్న తాలిబన్ ప్రభుత్వానికి విద్యార్థినుల నుంచి నిరసనలు మరింత పెరిగాయి. దయలేని తాలిబాన్లను ఎదిరించి వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగిన విశ్వవిద్యాలయాల విద్యార్థినులు తమ గొంతుకను గట్టిగా వినిపిస్తున్నారు. శనివారం హెరాత్ నగరంలోని రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం ఎదుట ఆందోళన చేసేందుకు దాదాపు 150 మంది వర్సిటీ విద్యార్థినులు బయల్దేరారు. ‘విద్య మా హక్కు’ అంటూ ప్లకార్డులు, బ్యానర్లను చేతబూనిన వారిని తరిమికొట్టేందుకు తాలిబన్ భద్రతా బలగాలు వాటర్ కేనన్లు వినియోగించారు. రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మలతో విద్యార్థినులను కొట్టారు. అయినాసరే నిరసనర్యాలీని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థినులు ప్రయత్నించారు. సంబంధించిన వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ విడుదలచేసింది. ‘తారిఖీ పార్క్ నుంచి నిరసన ర్యాలీ మొదలుపెట్టాం. అయితే, నగరంలో ప్రతీ వీధిలో సాయుధ తాలిబన్లు మమ్మల్ని అడ్డుకున్నారు. కొట్టారు. మాపై దాడి దారుణం’ అని మరియం అనే విద్యార్థిని ఆగ్రహంగా మాట్లాడారు. అయితే, ఈ నిరసన ర్యాలీపై రాష్ట్ర గవర్నర్ హమీదుల్లా ముతావకిల్ భిన్నంగా మాట్లాడారు. ‘ఓ నలుగురైదుగురు అమ్మాయిలు వచ్చి ఏదో ఫిల్మ్ షూట్ చేసి వెళ్లిపోయారు. వారికి ఎలాంటి అజెండా లేదు’ అని అన్నారు. వర్సిటీల్లో మహిళా విద్యపై నిషేధం విధించడంతో తాలిబాన్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, జీ–7 కూటమి దేశాలు తాలిబన్ సర్కార్ను తీవ్రంగా తప్పుబట్టాయి. అఫ్గాన్ విద్యార్థినులకు మద్దతుగా పాక్లోని క్వెట్టా సిటీలో కొందరు అఫ్గాన్ శరణార్థి విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఉద్యోగినులను తీసేయండి స్వచ్ఛంద సంస్థలకు తాలిబన్ల అల్టిమేటం మహిళలను చదువులకు దూరం చేసేందుకు కంకణం కట్టుకున్న అఫ్గాన్ తాలిబన్ పాలకులు తాజాగా మహిళలకు శరాఘాతం వంటి మరో చర్యకు పూనుకున్నారు. అఫ్గానిస్తాన్లోని విదేశీ, దేశీయ ప్రభుత్వేతర సంస్థలు మహిళా ఉద్యోగాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని ఆర్థిక మంత్రి మహ్మద్ హనీఫ్ పేర్కొన్నారు. వీటిని పాటించని ఎన్జీవోల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ప్రవేశించరాదనే ఆంక్షలు ఇప్పటికే ఉన్నాయి. -
రెక్కలు విరిచేస్తున్నారు..
అఫ్గానిస్తాన్లో చదువుకునే అమ్మాయిలు భయపడినంతా జరిగింది. ఏదో ఒక రోజు ఉన్నత విద్యకి తాము దూరమవుతామని మహిళల ఆందోళనలు నిజమయ్యాయి. యూనివర్సిటీల్లో ఇక మహిళలకి ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అంతర్జాతీయంగా వస్తున్న అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ, అఫ్గాన్ మహిళలు కన్న కలల్ని కల్లలు చేస్తూ వారి హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు. తాలిబన్ల తాజా ఆదేశాలను వ్యతిరేకిస్తూ కాబూల్లో అమ్మాయిలు నిరసన ప్రదర్శనలకి దిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేశారు. యూనివర్సిటీల దగ్గర తాలిబన్ బలగాలు భారీగా మోహరించి అమ్మాయిలు రాకుండా అడ్డుకుంటున్నారు. గత ఏడాది అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోయాక 2021, ఆగస్టు 15న తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు మహిళలకు అండగా ఉంటామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఈ ఏడాదిన్నర కాలంలో మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయింది. ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమైపోతున్నారు. రోజుకో కొత్త నిర్ణయంతో తాలిబన్లు మహిళల్ని తీవ్ర నిరాశ నిస్పృహలకి గురి చేయడంతో ఎందరో కుంగుబాటు సమస్యలతో బాధపడుతున్నారు. ఉన్నత విద్యకు అమ్మాయిల్ని దూరం చేయడంపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. అఫ్గాన్లో తాలిబన్లు మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని విమర్శించింది. కాబూల్ యూనివర్సిటీ బయట అమ్మాయిలు ఏడుస్తూ, ఒకరినొకరు ఓదార్చుకుంటున్న దృశ్యాలు మనసుని పిండేస్తున్నాయి. అఫ్గాన్ మహిళల ఛిద్రమైపోతున్న బతుకు చిత్రం ఎలా ఉందో చూద్దాం. మగతోడు లేకుండా ప్రయాణాలకు నో మగతోడు లేకుండా మహిళలు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకూడదని తాలిబన్లు 2021 డిసెంబర్లో నియంత్రణ విధించారు. మహిళలు ఒంటరిగా 45 మైళ్ల కంటే ఎక్కువ దూరం వెళ్ల కూడదు. అఫ్గాన్ జనాభాలో 10% మందికి ఆస్పత్రికి వెళ్లాలంటే కనీసం రెండు గంటలు ప్రయాణించాలి. అత్యవసర సమయాల్లో కూడా మగవారు లేకపోతే మహిళలకు చికిత్స ఇవ్వడాన్ని కూడా తాలిబన్లు అడ్డుకున్నారు. బురఖా లేకపోతే రాళ్ల దాడులు బురఖా లేకుండా మహిళలు అడుగు బయటకి పెడితే కఠిన శిక్షలు విధించడం మొదలు పెట్టారు. కాబూల్ వంటి నగరాల్లో ఈ నిబంధన గట్టిగా పాటించకపోయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు బురఖా లేకుండా వస్తే వారిని ఈడ్చుకువెళ్లడం, రాళ్లతో దాడి చేయడం వంటి అనాగరిక శిక్షలు విధించారు. 45% బాలికలు డ్రాపవుట్ 2021 సెప్టెంబర్ నుంచి అఫ్గాన్లో సెకండరీ స్కూల్స్లో అబ్బాయిలకే ప్రవేశం లభిస్తోంది. ఏడో తరగతి నుంచి అమ్మాయిల ప్రవేశాలను నిషేధించారు. పాథమిక, సెకండరీ పాఠశాలల నుంచి 45% మంది అమ్మాయిలు డ్రాపవుట్ అయ్యారు. 26% అమ్మాయిల్లో కుంగుబాటు మహిళల్ని వంటింటికే పరిమితం చేయడానికి తాలిబన్లు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో వారిని తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసింది. తాలిబన్ల రాక ముందున్న స్వేచ్ఛ కోల్పోవడంతో రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలలాడుతున్నారు. అమ్మాయిల్లో 26% మంది మానసిక కుంగుబాటుతో బాధపడుతూ ఉంటే అబ్బాయిల్లో 16% మందికి ఆ సమస్య ఉంది. 27% అమ్మాయిలు ఆందోళన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటే అబ్బాయిల్లో 18శాతంగా ఉంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
ఆకలి కేకల పాకిస్థాన్ను భారత్ ఆదుకోవాలని చూస్తే.. అమెరికా చేస్తోందేంటి?
పాకిస్థాన్లో ఏం జరుగుతోంది? కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్ఠి వానలు పడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా వరదలు పోటెత్తి కోట్లాది మందిని నిరాశ్రయులను చేసేశాయి. ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక పాక్ పాలకులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతటి విపత్తు వేళ పాకిస్థాన్ ప్రజల ఆకలి తీర్చడానికి.. అందుకోసం పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఇతర ఉత్పత్తులు అందించడానికి భారత ప్రభుత్వం సంసిద్ధమైపోయింది. పాక్ ప్రభుత్వం అడిగితే చాలు మరుక్షణమే వాటిని అందించి పాక్ను ఆదుకోవాలని భారత ప్రభుత్వం సమాయత్తమైపోయింది. ఇపుడు ప్రపంచంలోని ఏ దేశమైనా సరే పాకిస్థాన్ను ఆదుకోవాలంటే ఏం చేయాలి? వీలైనంతగా ఆహార ఉత్పత్తులను అందించి అక్కడి ప్రజల కడుపులు నింపాలి. ఇంతటి భీకరమైన పరిస్థితులు నెలకొన్న ఉన్న వేళ అగ్రరాజ్యం అమెరికా ఏం చేసిందో తెలుసా? పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల విలువ చేసే యుద్ధ విమానాల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. ఆకలి కేకల పాకిస్థాన్కు యుద్ధ విమానాలు అవసరమా? ఆహార ధాన్యాల బస్తాలు అవసరమా? అన్నది ఆరేళ్ల కుర్రాడినడిగినా చెప్తాడు. కానీ అమెరికాకి మాత్రం పాకిస్థాన్ను మరోలా ఆదుకోవాలని అనిపించింది . అందుకే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకీ ఏంటీ ప్రాజెక్ట్? అమెరికా ఏం చెబుతోందంటే పాకిస్థాన్కు తాము గతంలో సరఫరా చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఆధునికీకరించడానికి అవసరమైన స్పేర్ పార్టులను అందించడంతో పాటు ఆధునికీకరించే పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని చెబుతోంది. అది కూడా గతంలో తాము విక్రయించిన యుద్ధ విమానాలు జీవితకాలం పాటు పనిచేసేలా వాటికి సర్వీసింగ్ చేస్తున్నాం అంతే అని చెప్పుకొస్తోంది. ఇంతకు మించిన జోక్ మరోటి ఉంటుందా? ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేస్తూ.. యావత్ భూగోళాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టేస్తూ ఉగ్రహింసను విశ్వవ్యాప్తం చేసే అజెండాతో పాకిస్థాన్ తమ దేశాన్నే ఓ ఉగ్రకర్మాగారంగా మార్చేసిందని ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ విషయం అమెరికాకి తెలీదా? ఇపుడు పాకిస్థాన్కు యుద్ధ విమానాలను నెక్ట్స్ లెవెల్కి అప్ గ్రేడ్ చేసి ఇస్తే వాటిని పాకిస్థాన్ ఎవరిపై ప్రయోగిస్తుంది? సింపుల్.. భారత్ పైనే కదా. ఇది అమెరికాకి తెలీకుండా ఉంటుందా? ఈ వ్యాపారం అమెరికాకి కొత్తకాదు. అమెరికా చరిత్ర అంతా ఆయుధాల అమ్మకాలతోనే ముందుకు నడిచింది. యుద్ధాలు తేవడం ఆ తర్వాత ఆయుధాలు అమ్ముకోవడం.. ఇదీ అమెరికా శైలి. 1980లకి ముందు అమెరికా పాకిస్థాన్కు ఎఫ్-16 యుద్ధ విమానాలు అమ్మింది. అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్ను తన గుప్పెట్లో పెట్టుకున్న సోవియట్ యూనియన్ను దెబ్బతీయడం కోసం పాకిస్థాన్కు ఈ యుద్ధ విమానాలు సరఫరా చేసింది. వీరి సాయంతోనే పాకిస్థాన్ ముజాహిదీన్లను చేరదీసి వారిని ఉగ్రవాదులుగా మార్చి పెంచి పోషించింది. సెప్టెంబరు 11 దాడుల తర్వాత అల్ కాయిదాపై యుద్ధానికి అమెరికా కాలుదువ్విన వేళ మళ్లీ పాకిస్థాన్కు ఈ యుద్ధ విమానాలను సరఫరా చేసింది అమెరికా. ఆఫ్ఘనిస్థాన్లో 20 ఏళ్ల పాటు మకాం వేసిన అమెరికా ప్రజాప్రభుత్వాన్ని స్థాపించినా తాలిబాన్ను మాత్రం ఏమీ చేయకుండా వదిలేసింది. చివరకు గత ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్ ప్రజల మాన ప్రాణాలను తాలిబాన్ చేతుల్లో పెట్టేసి తమ సేనలను ఆఫ్ఘన్ నుండి వెనక్కి రప్పించేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా తాలిబాన్తో చేతులు కలిపింది. పాకిస్థాన్, తాలిబాన్ కలిస్తే ఆసియాలో మరింత అగ్గి రాజుకోవడం ఖాయమని మేధావులు ఆందోళన చెందుతున్నారు కూడా. సరిగ్గా ఈ తరుణంలోనే ఇపుడు అమెరికా మరోసారి పాకిస్థాన్తో ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మా గడ్డ మీలాగా కాదు.. పాక్కు తాలిబన్ల కౌంటర్
కాబూల్: అఫ్గనిస్థాన్లోని అనధికారిక తాలిబన్ల ప్రభుత్వం.. పొరుగు దేశం పాకిస్తాన్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. జైష్ - ఇ - మహ్మద్ చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన మసూద్ అజర్, అఫ్గనిస్తాలో తలదాచుకున్నాడంటూ పాక్ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టింది. అలాంటి ఉగ్రసంస్థలకు పాక్ గడ్డే అడ్డాగా ఉంటుందని, చివరకు అలాంటి సంస్థలను అక్కడి ప్రభుత్వమే పెంచి పోషిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ(తాత్కాలిక) అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తీవ్రంగా స్పందించారు. అఫ్గన్ నంగార్హర్ ప్రావిన్స్లో మౌలానా మసూద్ అజర్ తలదాచుకున్నాడని, అతనిని గుర్తించి.. అరెస్ట్ చేసి ఇస్లామాబాద్కు అప్పగించాలని ఇప్పటికే అఫ్గన్ను ఓ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పాక్ మీడియా హౌజ్లు కొన్ని ఆ కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. ‘‘అలాంటి లేఖ ఏం మా ప్రభుత్వానికి అందలేదు. అసలు జైషే చీఫ్ మా దేశంలోనే లేడు. అఫ్గన్ భూభాగాన్ని.. మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి మేము ఎవరినీ అనుమతించబోం. అలాంటిది వాళ్లకు(పాక్ను ఉద్దేశించి) మాత్రమే సాధ్యం’’ అంటూ జబీహుల్లా ముజాయిద్ పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదంటూ అఫ్గన్ విదేశీ వ్యవహారాల శాఖ పాక్ను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాశ్చాత్య దేశాలకు చెందిన పర్యాటకులను కిడ్నాప్ చేసిన నేరానికి భారత్లో శిక్ష అనుభవించాడు అజర్. అయితే.. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఐసీ-814 హైజాక్ వ్యవహారంలో ప్రయాణికుల కోసం భారత్ అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. బయటకు వచ్చాక జైష్ ఈ మొహమద్ను నెలకొల్పి.. భారత్లో ఎన్నో ఉగ్రవాద దాడులను నిర్వహించాడు. దీంతో పాక్ ఆ సంస్థను నిషేధించింది. మే 2019లో ఐరాస అతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారి కూడా ఈ మసూదే. ఇదీ చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి యాక్సిడెంట్! -
మోదీ జీ ఇది కరెక్ట్ కాదు.. తాలిబన్ల సూక్తులు
జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా తాలిబన్ల నేతృత్వంలోని ఆప్ఘనిస్ధాన్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తాజాగా ట్విట్టర్ వేదికగా.. ఇస్లాంను అవమానించి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా ఉన్మాద చర్యలను భారత్ అనుమతించరాదని తాము కోరుతున్నామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజహిద్ పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్తపై అధికార బీజేపీ పార్టీ నేత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. ఈ క్రమంలోనే మతోన్మాదంపై భారత్కు తాలిబన్లు కీలక సూక్తులు వల్లించారు. అంతకుముందు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ప్రవక్తపై వ్యాఖ్యల విషయంలో భారత్పై విరుచుకుపడ్డారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియాలో మతసామరస్యం దెబ్బతింటోందని, ముస్లింలను అణిచివేస్తున్నారని.. దీన్ని ప్రపంచ దేశాలు గమనించాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పాక్ వ్యాఖ్యలు, ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. తాము అన్ని మతాలను గౌరవిస్తామని స్పష్టం చేసింది. The Islamic Emirate of Afghanistan strongly condemns the use of derogatory words against the Prophet of Islam (Peace be upon him)by an official of the ruling party in India. 1/2 — Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) June 6, 2022 ఇది కూడా చదవండి: దేశ ప్రతిష్టకే భంగపాటు.. భవిష్యత్తు ఎలా ఉండనుంది..? -
హోడ ఖామోష్..: అఫ్గాన్ అగ్నితేజం
టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితా (100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2022)లో చోటు సంపాదించిన వారిలో అఫ్గానిస్థాన్ అగ్నితేజం హోడ ఖామోష్ ఒకరు. ‘ఖామోష్’ అనేది పేరు కాదు. లక్షల గొంతుల రణనినాదం... ఇరాన్లో జన్మించింది హోడ ఖామోష్. తాను చిన్న వయసులో ఉన్నప్పుడే కుటుంబంతో పాటు అఫ్గానిస్థాన్కు వచ్చింది. ఆరోజుల్లో తనకు నిద్ర పట్టాలంటే అమ్మ తప్పనిసరిగా ఏదో ఒక కథ చెప్పాల్సిందే. అలా ఖామోష్ కాల్పనిక ప్రపంచంలోకి ప్రవేశించింది. ఆ ప్రపంచంలో ఎన్నో కథలు చదివింది. ఎన్నో కవిత్వాలు విన్నది. తొలిరోజుల్లో తన కాల్పనిక ప్రపంచంలో వాస్తవాలతో సంబంధం లేని ఊహాకల్పిత సాహిత్యం మాత్రమే ఉండేది. ఆ తరువాత కాలంలో మాత్రం...తన ప్రపంచంలోకి వాస్తవికత నడిచి వచ్చింది. రాజులు, రాణులు, అందమైన కోటలు, అద్భుత దీపాల స్థానంలో... నిజమైన సమాజం దర్శనమిచ్చింది. మనుషులు ఎదుర్కొనే రకరకాల సమస్యలను గురించి లోతుగా తెలుసుకోగలిగింది. తన మనసులోని వేడివేడి భావాలను కవిత్వంగా రాసేది. ‘సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజం తరఫున పనిచేయడానికి ఇది మాత్రమే చాలదు’ అనుకొని జర్నలిస్ట్ కావాలనుకుంది. ఖామోష్ ఆలోచనను హర్షించిన వారు తక్కువ. భయపెట్టిన వారు ఎక్కువ. అయితే అవేమీ తన కలను అడ్డుకోలేకపోయాయి. జర్నలిజంలో శిక్షణ పొందిన ఖామోష్ ఆ తరువాత స్థానిక పత్రికలలో పనిచేసింది. స్త్రీల హక్కులు, ఉద్యమాలపై ప్రత్యేకకథనాలు రాసింది. లోకల్ రేడియో ఛానల్స్ ప్రెజెంటర్గా తన గొంతు వినిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే పౌరహక్కుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం మరో ఎత్తు. ఉద్యమంలో భాగంగా ఎందరో మహిళలకు అండగా నిలిచింది. దాడులను ఎదుర్కొంది. బాధితులకు న్యాయం జరిగే వరకు మడమ తిప్పలేదు. అఫ్గానిస్థాన్లో తాలిబన్ల పాలన మళ్లీ మొదలైన తరువాత చాలామంది కలాలు అటకెక్కాయి. గొంతులు మాట మార్చుకున్నాయి. కానీ ఖామోష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అవే అక్షరాలు...అదే గొంతు! తాలిబన్ల పాలన మొదలై అప్పటికే అయిదు నెలల దాటింది. ఆ సమయంలో ‘స్త్రీలపై జరుగుతున్న అణచివేత’ అనే అంశంపై నార్వేలో మాట్లాడే అవకాశం లభించింది. ‘ఈ సమయంలో మాట్లాడితే ప్రాణాలకే ముప్పు’ అని చాలామంది హెచ్చరించినా ఆమె భయపడలేదు. ‘నేను తప్పు చేయడం లేదు. తప్పుల గురించి మాట్లాడబోతున్నాను’ అంటూ నార్వేకి వెళ్లింది ఖామోష్. నీళ్లు నమలకుండా నిజాలు మాట్లాడింది. ఆనాటి ఆమె ప్రసంగంలో కొన్ని మాటలు... ‘నా పేరు హోడ ఖామోష్. అఫ్గానిస్థాన్లోని వేలాది మంది మహిళలలో నేను ఒకరిని. నేను ఏ రాజకీయపార్టీకి సానుభూతిపరురాలిని కాదు. సభ్యురాలిని కాదు. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నాను. తాలిబన్ల పాలనలో ఉన్నాను. భయంతో గుండె వేగంగా కొట్టుకునే చోట, బుల్లెట్ల చప్పుడు నిరంతరాయంగా వినిపించే చోట ఉన్నాను’ ‘కాబుల్ తాలిబన్ల వశం అయిన తరువాత రాజ్యం పోలీసు రాజ్యం అయింది. స్త్రీలపై వివక్షత పెరిగింది. మీరు ఉండాల్సింది విద్యాలయాల్లో కాదు ఇంట్లో...అంటూ అణచివేత మొదలైంది. ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పాపానికి ముర్తాజ సమది అనే ఫొటోగ్రాఫర్ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. కాబుల్లో స్త్రీల నిరసన ప్రదర్శనకు సంబంధించిన వార్తలు రాసినందుకు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తమ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న 70 మంది పౌరులను అరెస్ట్ చేశారు. వారిలో 40 మంది మహిళలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురిచేశారు’ నార్వే సదస్సులో అఫ్గాన్ కన్నీటి చిత్రాన్ని కళ్లకు కట్టిన ఖామోష్ ‘ఇక అంతా అయిపోయింది’ అని నిరాశ పడడం లేదు. ‘స్త్రీలను గౌరవించే రోజులు, స్త్రీల హక్కులు రక్షించబడే రోజులు తప్పకుండా వస్తాయి’ అంటున్న ఖామోష్లో ‘ఆశ’ అనే జ్వాల ఉజ్వలంగా వెలుగుతూనే ఉంది. -
ఆప్ఘన్లో బాంబు పేలుళ్లు.. తాలిబన్లు అలర్ట్
కాబూల్: అఫ్గానిస్థాన్లో ఐఎస్ఐఎస్(ISIS) తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర అఫ్గానిస్థాన్లో గురువారం రాత్రి మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ రెండు బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్ అధికారులు తెలిపారు. దీంతో తాలిబన్ బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. గత వారమే మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్(ISIS) తెలిపింది. ఇది కూడా చదవండి: చెప్పినట్లు వింటావా.. లేదంటే మరో 20 మంది మగాళ్లను తీసుకురమ్మంటావా? -
ఇదేం న్యాయం.. మా ఆడబిడ్డల సంగతి ఏంటి?
తాలిబన్ల బుద్ధి.. వంకర బుద్ధి. ఏం జరిగినా.. అది మారదు. ఈ మాట అంటోంది అఫ్గన్ పౌరులే. తాలిబన్ల పాలనలో గతంలో కంటే పరిస్థితి ఇంకా దిగజారుతోందనేది వాళ్ల ఆవేదన. ఇందుకు ఉదాహరణగా బాలికల విద్యను హరిస్తూ.. వాళ్ల హక్కులను కాలరాయడం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నా.. తాలిబన్లు మాత్రం వెనక్కి తగ్గట్లేదు!. ఇస్లామిక్ ఎమిరేట్ అలియాస్ తాలిబన్ సర్కార్.. అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అది దొరికితేనే.. నిలిచిపోయిన నిధులు అఫ్గన్ గడ్డకు చేరేది, సంక్షోభం నుంచి తేరుకునేది. అయితే హేయనీయమైన తాలిబన్ల తీరు వల్లే అది జాప్యం అవుతోంది. మహిళలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యయుతమైన విధానాలతో తమ పాలనలో కొత్త అఫ్గనిస్థాన్ను చూస్తారంటూ హామీలు ఇచ్చిన తాలిబన్లు.. నీటి మీద రాతల్లాగే ఉన్నాయి. తీరు మార్చుకోకుండానే ముందుకు పోతున్నట్లు తాలిబన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గనిస్థాన్లో అమ్మాయిలు.. విద్యాఉద్యోగాలు, క్రీడారంగానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. అదే సమయంలో తాలిబన్ నేతలు మాత్రం వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివిస్తూ.. స్వేచ్ఛగా బతకనిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబన్ కేబినెట్లో పాతిక మంది దాకా తమ పిల్లలను పొరుగున ఉన్న పాక్లోని పెషావర్, కరాచీలో.. ఇంకొందరు దోహాలోని స్కూల్స్లో పిల్లలను చదివించుకుంటున్నారు. వాళ్లలో ఆరోగ్య మంత్రి ఖ్వాలందర్ ఎబాద్, విదేశాంగ ఉపముఖ్యమంత్రి షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్, తాలిబన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షాహీన్లు ఉన్నారు. సుహెయిల్ షాహీన్ పిల్లలు ఏకంగా దోహాలోని ఇస్లామిక్ ఎమిరేట్స్ అధికారిక కార్యాలయంలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయనగారి పెద్ద కూతురు ఏకంగా ఫుట్బాల్ టీంలో సభ్యురాలిగా ఉందట. ఖ్వాలందర్ కూతురు ఇస్లామాబాద్లో మెడిసిన్ చదువుతోంది. ఆమె టెన్నిస్ ఛాంపియన్. మరో ఇద్దరు కీలక నేతల కూతుళ్లు సైతం దోహాలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్నారట. ఈ అంశాలనే ప్రస్తావిస్తూ.. తమకూ స్వేచ్చను ఇవ్వాలని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు మహిళలు. అయితే.. ఈ అంశంపై నిర్ణయం తమ చేతుల్లో లేదని, త్వరలో భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకుంటామని తాలిబన్ ప్రతినిధులు చెప్తున్నారు. మార్చిలో బడులు తెరిచారని ఆనంద పడ్డ బాలికలకు.. ప్రవేశం లేదంటూ పిల్లలను వెనక్కి పంపి గట్టి షాకే ఇచ్చారు అక్కడి విద్యాశాఖ అధికారులు. మళ్లీ పెళ్లిళ్లు! ఇదిలా ఉంటే తాలిబన్ నేతలు ఓ కొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. చదువుకున్న మహిళలను రెండో వివాహం చేసుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉన్నంత కాలం తాము నాగరికతలో వెనుకబడిపోయామన్న భావనలో ఉన్న వాళ్లు.. మొదటి భార్యలకూ లోక జ్ఞానం లేదనే నిర్ణయానికి వచ్చేసి.. చదువుకున్నవాళ్లను మళ్లీ పెళ్లి చేసుకుని పట్టణాలు, నగరాల్లో కాపురాలు పెడుతున్నారు. రాజకీయ నాయకులే కాదు.. సివిల్ సర్వెంట్లు, ఇతర అధికారులు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్ను ఫాలో అవుత్నున్నారు.. -
ఆ మహిళలకు విమానంలోకి నో ఎంట్రీ
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లో మహిళలపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. మగ తోడు లేకుండా వారు ఒంటరిగా విమానాల్లో ప్రయాణించడానికి వీల్లేదని తాలిబన్లు తాజాగా హుకుం జారీ చేశారు. శుక్రవారం కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఒంటరి మహిళలను విమానమెక్కేందుకు అనుమతించలేదు. బాలికలు ఆరో తరగతి వరకే చదువుకోవాలన్న ఆదేశాలను నిరసిస్తూ రాజధాని కాబూల్లో బాలికలు శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. చదవండి: (మాట తప్పిన తాలిబన్లు.. షాకింగ్ నిర్ణయంతో ఆవేదనలో బాలికలు) -
మాట తప్పిన తాలిబన్లు.. షాకింగ్ నిర్ణయంతో ఆవేదనలో బాలికలు
కాబూల్: తాలిబన్లు మరోసారి మాట తప్పారు. ప్రపంచ దేశాలు తమ వైపు వేలెత్తి చూపించేలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలో బాలికలను హైస్కూల్ విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు తాలిబన్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. తీరా స్కూల్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు షాకిచ్చారు. అయితే, ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదని.. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో బాలికలు ఆవేదనకు గురవుతున్నట్టు సమాచారం. అయితే, ఇందుకు కారణం గ్రామీణ ప్రజలేనని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారు తమ పిల్లలను స్కూల్స్కు పంపేందుకు అంగీకరించడంలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి సీనియర్ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహిళ స్వేచ్చ పట్ల ఆంక్షలు ఉండాలని, కఠినంగా వ్యవహరించాలని సీనియర్లు కోరుతుండగా.. స్వేచ్చ అవసరమంటూ మరికొందరు పట్టుబడుతున్నట్టు సమాచారం. -
భారత్ భేష్ అంటున్న తాలిబన్లు
-
పాక్ చెత్త.. భారత్ బంగారం!: తాలిబన్లు
అఫ్గనిస్థాన్ పునర్మిర్మాణంలో పలు దేశాలు పాలు పంచుకుటున్న విషయం తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్ను ఆక్రమించుకున్నాక.. ఆర్థిక ఆంక్షల వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది. తాలిబన్ ప్రభుత్వానికి ఇంకా గ్లోబల్ గుర్తింపు దక్కనప్పటికీ.. నానాటికీ పరిస్థితి దిగజారిపోతుండడంతో మానవతా కోణంలో భారీ సాయమే అందుతోంది. ఈ క్రమంలో.. అఫ్గన్ పొరుగున ఉన్న పాక్ గోధుమలను అందించగా.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది అక్కడి ప్రభుత్వం. ‘‘పాక్ నుంచి పంపించిన గోధుమ నాసికరంగా ఉన్నాయి. తినడానికి అస్సలు పనికిరావు. చెత్తలోపారబోయడానికి తప్ప. ఎందుకు పంపారో ఆ దేశ ప్రభుత్వానికే తెలియాలి. బహుశా ఖరాబును జమ చేసుకోవడం ఇష్టం లేక పంపారేమో’’ అంటూ మండిపడ్డారు అక్కడి అధికారులు. అదే సమయంలో భారత్ అందించిన గోధుమలపైనా స్పందించారు. భారత్ మేలిమి రకపు గోధుమలను అందించిందని, అందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. తాలిబన్ ప్రతినిధులు పాక్-భారత్ గోధుమ సాయంపై స్పందించిన వీడియో ఒక దానిని అఫ్గన్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఒమెరీ ట్వీట్ చేశారు. దీనికి అఫ్గన్ నెటిజనుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. జై హింద్ అంటూ పలువురు అఫ్గన్ పౌరులు ట్వీట్లు చేస్తుండడం విశేషం. #Afghanistan : #Taliban officials allege that wheat sent by @ImranKhanPTI #Pakistan Govt is rotten not fit for consumption while @narendramodi’s Indian Govt’s 50,000 MT of wheat is very good.pic.twitter.com/5NSnQBVEKo — Arun (@arunpudur) March 4, 2022 ఇదిలా ఉండగా.. సంక్షోభ సమయం నుంచే భారత్, అఫ్గనిస్థాన్కు సాయం అందిస్తోంది.ఈ క్రమంలో రోడ్డు మార్గం గుండా సరుకులు పంపే సమయంలో పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసి అడ్డుపడగా.. తమ దేశం గుండా అనుమతించి పెద్ద మనసు చాటుకుంది ఇరాన్. ఇదిలా ఉండగా.. అమృత్సర్ నుంచి మొన్న గురువారం 2వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగామ్లో భాగంగా యాభై వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపాలనే కమిట్మెంట్కు కట్టుబడి.. సాయం అందిస్తూ పోతోంది భారత్. ఈ సందర్భంగా కోలుకుంటున్న అఫ్గన్తో భారత్ మంచి సంబంధాలు కోరుకుంటోందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. -
రష్యా-ఉక్రెయిన్ వార్: తాలిబన్ల స్పందన ఇదే..
కాబూల్: ఉక్రెయిన్పై రష్యా అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్పై సైనిక చర్యలకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై తాలిబన్లు సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. అలాగే.. హింసాత్మక ఘటనలను ప్రేరేపించే చర్యల నుంచి ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని కోరారు. యుద్దం పరిష్కారం కాదని.. ఈ సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాలిబన్లు సూచించారు. అనంతరం ఉక్రెయిన్లో ఉన్న ఆప్ఘనిస్తాన్ ప్రజలు సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. Statement concerning crisis in #Ukraine pic.twitter.com/Ck17sMrAWy — Abdul Qahar Balkhi (@QaharBalkhi) February 25, 2022 -
హిజాబ్ కాకున్నా చద్దర్తో అయినా కప్పుకోండి!
భారత్లో హిజాబ్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో వివాదం చేటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కర్టాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. దేశంలోని పలు రాష్ట్రాలకు పాకుతోంది. ఇదిలా ఉండగా మతం పేరుతో మహిళల పట్ల నిరంకుశంగా వ్యవహరించే తాలిబన్లు.. హిజాబ్ విషయంలో తాజాగా కఠిన ఆదేశాలు జారీచేశారు. అఫ్గానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం.. మహిళలు బుర్ఖా తప్పనిసరిగా ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు ధరించాల్సిందేనని పేర్కొంది. మహిళలు పనిచేసే చోట తప్పనిసరిగా బుర్ఖా ధరించాలని, లేదంటే చద్దర్ అయినా ముఖానికి అడ్డుగా పెట్టుకొవాలని పేర్కొంది. అయితే తాలిబన్ ప్రభుత్వ ఏర్పడిన మొదట్లో దేశ మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని నిషేధించింది. కొన్ని రోజుల తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకొని.. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల్లో.. బుర్ఖా, హిజాబ్ ధరించడం, గైడ్లైన్స్ను పాటించకపోతే సదరు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
ఈ రాజ్యం మాకొద్దు
-
మహిళా హక్కులకు పాతర
అట్లాంటా: అఫ్గాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత దేశంలో మహిళల పరిస్థితి ఘోరంగా మారిందని అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఆరోపించాయి. ముఖ్యంగా మహిళలు, స్వలింగ సంపర్కులు, హిజ్రాల పరిస్థితి దేశంలో దుర్భరంగా మారుతోందని హ్యూమన్రైట్స్ వాచ్ సంస్థ తెలిపింది. తాలిబన్లు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన హక్కుల హననమే పునరావృతం అవుతోంది. వీరి పాలనలో మహిళలు రెండు రకాలుగా బాధితులవుతున్నారు. లైంగిక పరమైన దాడులు ఒక సమస్య కాగా, అలాంటి బాధితులపై సొంతవారి అకృత్యాలు రెండో సమస్యగా మారాయని హక్కుల కార్యకర్తలు వివరిస్తున్నారు. -
తీరుమారని తాలిబన్లు
న్యూయార్క్: అఫ్గాన్లో ప్రభుత్వ మాజీ సభ్యులు, మాజీ భద్రతా దళ సభ్యులు, అంతర్జాతీయ దళాలతో కలిసి పనిచేసిన వారు.. కలిపి దాదాపు 100 మందికి పైగా స్వదేశీయులను తాలిబన్లు చంపినట్లు నమ్మకమైన ఆరోపణలు వచ్చాయని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ చెప్పారు. హతుల్లో మూడింట రెండొందలమందిని సరైన విచారణ లేకుండానే తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారన్నారు. తమ హయాంలో దేశీయులందరికీ క్షమాభిక్ష పెడుతున్నామని, కక్ష సాధింపులుండవని గతంలో తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇందుకు విరుద్ధంగా తాలిబన్లు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అఫ్గాన్లో హక్కుల కార్యకర్తలు, మీడియాపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని గుట్టెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. అటు తాలిబన్లు, ఇటు ఐఎస్ ఉగ్రవాదులు కలిపి ఇప్పటికి 8 మంది పౌర హక్కుల కార్యకర్తలను చంపారని, 10 మందిని నిర్బంధించారని తెలిసిందన్నారు. గత ఆగస్టులో అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల వశమయ్యాయి. త్వరలో ఎన్నికలు జరుపుతామని తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు అలాంటి ఊసు తీసుకురాలేదు, పైగా మహిళలపై తీవ్ర నిర్భంధం మొదలైంది. దేశంలో మానవహక్కుల పరిరక్షణ జరపకపోతే విదేశీ సాయం అందించమని పలు దేశాలు ప్రకటిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. అఫ్గాన్లో ప్రస్తుతం అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయని, దాదాపు 3 కోట్లమంది సంక్షోభ కోరల్లో చిక్కుకున్నారని ఆంటోనియో చెప్పారు. మరోవైపు తాలిబన్లపై ఎన్ఆర్ఎఫ్, ఐసిస్ దాడులు కూడా పెరిగాయన్నారు. తాలిబన్లలో జాతుల వైరుధ్య తగాదాలు ముదిరాయని చెప్పారు. -
వెయ్యి కోట్ల డాలర్లను విడుదల చేయండి
ఓస్లో: అఫ్గానిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తొలిసారిగా పశ్చిమ దేశాల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమై చర్చించారు. నార్వే రాజధాని ఓస్లోలో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొన్న తాలిబన్ ప్రతినిధులు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు స్తంభింపజేసిన వెయ్యి కోట్ల అమెరికా డాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఫ్గానిస్తాన్ మానవ సంక్షోభం అంచులో ఉందని అందుకే ఆ నిధులు విడుదల చేయాలని వారు ఒత్తిడి తీసుకువచ్చారు. తాలిబన్ల తరఫున హాజరైన షఫీవుల్లా అజామ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్కు చెందిన ఆస్తుల్ని విడుదల చేయాలని, రాజకీయపరమైన విభేదాలతో సాధారణ పౌరుల్ని శిక్షించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆకలి కేకలు, గడ్డ కట్టించే చలి పరిస్థితుల్లో స్తంభింపజేసిన ఆస్తుల్ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి ముందు పశ్చిమ దేశాల ప్రతినిధులు అఫ్గాన్ మహిళా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలతో మాట్లాడి అఫ్గాన్లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, యూరోపియన్ యూనియన్కు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
తాలిబన్ల పైశాచికం.. వీడియో వైరల్
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల దురాగతాలు మరోసారి వైరల్ వీడియోలో బట్టబయలయ్యాయి. దేశంలోని పాక్టియా ప్రావిన్స్లో.. ఒక సంగీతకారుడి సంగీత పరికరాన్ని తాలిబానీ పురుషులు తగులబెట్టారు. దీనిని చూస్తూ ఒకవైపు సంగీతకారుడు ఏడుస్తుండగా, మరోవైపు తాలిబన్లు తుపాకులు ధరించి దీనిని చూస్తూ పైశాచిక ఆనందం పోందడం గమనించవచ్చు. ఈ వీడియోను అబ్దుల్ హక్ ఒమేరి అనే జర్నలిస్ట్ ట్విటర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్లు తమ ఆధీనంలోకి వచ్చినప్పటి నుండి, దేశంలో అనేక మార్పులు వచ్చాయి. కార్లలో, వివాహా వేడుకల సమయంలో సంగీతం వినడాన్ని తాలిబాన్ చట్టవిరుద్ధం చేసింది. పురుషులు, స్త్రీలు వేర్వేరు వేదికలలో వివాహాలు జరుపుకోవాలని బలవంతం చేశారు. Video : Taliban burn musician's musical instrument as local musicians weeps. This incident happened in #ZazaiArub District #Paktia Province #Afghanistan . pic.twitter.com/zzCp0POeKl — Abdulhaq Omeri (@AbdulhaqOmeri) January 15, 2022 చదవండి: (అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు') -
అఫ్గన్లకు ఇక మంచిరోజులు!
అఫ్గన్ పౌరులకు మంచిరోజులు మొదలయ్యాయి!. చరిత్రలో మునుపెన్నడూ చూడలేనంత దీనస్థితిని ఒక దేశం ఎదుర్కొనుందన్న విశ్లేషణలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్ నేలకు సాయం అందించేందుకు అగ్ర రాజ్యంతో పాటు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు ఆహార, ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేసేందుకు భారీ విరాళాల కోసం ఐక్యరాజ్య సమితి ప్రణాళిక రచించింది. తాజాగా అమెరికా 308 మిలియన్ డాలర్ల (రెండువేల కోట్ల రూపాయలకు పైనే) తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆశ్రయం, ఆరోగ్య భద్రత, చలికాల పరిస్థితుల నేపథ్యంలో సాయం, అత్యవసర ఆహార సాయం, మంచి నీరు, శానిటేషన్, శుభ్రత సర్వీసులు తదితరాల కోసం ఈ భారీ సాయం వినియోగించనున్నట్లు, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోనున్నట్లు వైట్ హౌజ్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో మానవతా ధృక్పథంతో అమెరికా అందించిన సాయం(గత అక్టోబర్ నుంచి) ఇప్పటిదాకా 782 మిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు 27 దేశాలు అఫ్గన్కు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి కూడా. గతంలో అఫ్గన్ బడ్జెట్ 80 శాతం విదేశీ నిధుల ద్వారానే సమకూరేది. అయితే తాలిబన్ల రాకతో ఎక్కడిక్కడే నిధులు ఆగిపోయాయి. పైగా అఫ్గన్కు చెందిన అకౌంట్లు సైతం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఐదు నెలల తాలిబన్ల పాలనలో అఫ్గన్ ఆర్థిక వ్యవస్థ గాడితప్పి సంక్షోభం దిశగా అడుగులు పడ్డాయి. ఒకానొక టైంలో కరెన్సీ కొరత కారణంగా వస్తు మార్పిడి విధానం వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఒకవైపు ఆహార కొతర, మరోవైపు ఆహార ఉత్పత్తుల ధరలు 20 శాతం పెరగడంతో ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు. ఈ తరుణంలో ఆదుకోవాలంటూ అమెరికాతో సహా అన్ని దేశాలకు తాలిబన్ ప్రభుత్వం పిలుపు ఇవ్వగా.. అనూహ్యమైన స్పందన లభిస్తోంది. యూఎన్ భారీ ప్రణాళిక సాయం కోసం చూస్తున్న కోట్ల మంది అఫ్గన్ పౌరుల ముఖం తలుపులు వేయొద్దంటూ యూఎన్ ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిథ్స్ ప్రపంచానికి పిలుపు ఇచ్చారు. అఫ్గనిస్థాన్ సంక్షోభం నుంచి బయటపడాలంటే 2022 ఒక్క ఏడాదిలోనే 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దేశంలో ఉన్న పౌరుల కోసం 4.4 బిలియన్ డాలర్లు, సరిహద్దుల అవతల ఆశ్రయం పొందుతున్న పౌరుల కోసం 623 మిలియన్ డాలర్లు అవసరం పడొచ్చని యూఎన్ భావిస్తోంది. ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి ఒక దేశం కోసం ఇంత పెద్ద ఎత్తున్న సాయం కోసం ప్రపంచానికి పిలుపు ఇవ్వడం ఇదే మొదటిసారి. పాక్ సహకరించకున్నా.. ఇదిలా ఉంటే అఫ్గనిస్థాన్కు సాయం అందించే విషయంలో భారత్ ముందు నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. గత ఆగష్టు నుంచి ఆహార ఉత్పత్తులతో పాటు మందులను సైతం పంపించింది. కిందటి నెలలో ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్లను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాబూల్లోని ఇందిరాగాంధీ ఆస్పత్రికి మందుల్ని సరఫరా చేసింది. మరోవైపు ఆహార కొరత నేపథ్యంలో అక్కడి ప్రజల కోసం యాభై వేల టన్నుల గోధుమల్ని పంపించింది భారత్. ముందుగా పాక్ మార్గం గుండా వెళ్లాల్సి ఉండగా.. అఫ్గన్తో సరిహద్దు ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాక్తో భారత్ ప్రభుత్వం సంప్రదింపులు సైతం జరపగా.. లాభం లేకుండా పోయింది. అ తరుణంలో అనూహ్యంగా ఇరాన్ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. తమ గుండా సరుకుల్ని,మందుల్ని అఫ్గన్ను పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చదవండి: అఫ్గన్పై అమెరికా కొర్రిలు.. తలవంచిన తాలిబన్ ప్రభుత్వం -
అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు
We Beat The Americans: Talibans: అమెరికా సైనిక దళాలపై తాలిబాన్లు విజయాన్ని సూచించే అనధికారిక ప్రదర్శనలు అఫ్గనిస్తాన్లోని ఘజ్నీ ప్రావిన్స్లో చోటుచేసుకున్నాయి. అమెరికన్లు ప్రపంచంలోనే తమని తాము గొప్ప శక్తిగా చెప్పుకుంటున్నప్పటికీ, మేము అమెరికన్లను ఓడించగలమని అఫ్గన్లు, ప్రపంచం, భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా మేము దీన్ని చూపిస్తున్నామని తాలిబన్ ప్రావిన్షియల్ కల్చర్ చీఫ్ ముల్లా హబీబుల్లా ముజాహిద్ మీడియాకు తెలిపాడు. చారిత్రకంగా అమెరికా సుదీర్ఘ యుద్ధాల్లో సేవలందించిన సైనిక దళాల పేర్లను, వారు ఆక్రమించిన స్థావరాలను కాంక్రీట్ గోడపై క్రమం తప్పకుండా చెక్కడం పరిపాటి. ఐతే అమెరికా సైన్యానికి, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణల్లో అవి ధ్వంసమయ్యాయి. అఫ్గన్ నుంచి అమెరికా సైన్యం స్వచ్ఛంద నిష్క్రమణ తర్వాత వారికి సంబంధించిన యుద్ధసామగ్రిని రోడ్లపై ప్రదర్శనకు ఉంచి తాలిబన్లు ప్రగల్భాలు పలకడం గమనార్హం. 19వ శతాబ్దంలో బ్రిటిష్ దళాల ఓటమితో పాటు ప్రస్తుతం మూడు విదేశీ సామ్రాజ్యాలపై అఫ్గనిస్తాన్ విజయం సాధించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ విజయం సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నామని తాలిబన్ పోరాట యోధుడు ఓజైర్ (18) తెలిపాడు. ఇక్కడ జన్మించిన అఫ్గన్లు శక్తివంతమైన అమెరికా దేశాన్ని ఓడించగలరని నిరూపించేందుకే వీటిని ప్రదర్శిస్తున్నామన్నాడు. ముల్లా హబీబుల్లా ముజాహిద్ పేలుడు గోడల ముందు నిలబడి యుద్ధాల్లో మరణించిన 20, అంతకంటే ఎక్కువ మంది ముఖ్యమైన కమాండర్లు, జనరల్స్ పేర్లు వీటిమీద ఉన్నాయని ప్రగల్భాలు పలికాడు. మరోవైపు అఫ్గనిస్తాన్ కొత్త పాలకుల సమక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని, అక్కడి జనాభాలో సగానికి పైగా ప్రజలు ఆకలి బాధను ఎదుర్కొంటున్నట్లు యూఎస్ అభిప్రాయపడింది. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. -
ఎన్నికల కమిషన్ను రద్దు చేసిన తాలిబన్లు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఎన్నికల కమిషన్ను తాలిబన్ల ప్రభుత్వం రద్దు చేసింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ఫిర్యాదుల కమిషన్ను రద్దు చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి (డిప్యూటీ) బిలాల్ కరీమి ఆదివారం వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో అఫ్గాన్లో ఈ వ్యవస్థలు అనవసరం. భవిష్యత్తులో అవసరమైతే వీటిని పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, శాంతి స్థాపన మంత్రిత్వ శాఖలనూ మూసివేస్తున్నట్లు బిలాల్ తెలిపారు. -
కంచె లొల్లి.. పాక్ సైన్యం-తాలిబన్ల మధ్య కాల్పులు
సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యిందని ప్రకటించుకున్న కొన్నిరోజులకే పాక్ సైన్యం-తాలిబన్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. 2017 నుంచి పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ ఇరు దేశాల మధ్య వేల కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వివాదం తరచూ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో డ్యూరండ్ లైన్ వెంట పాక్ సైన్యం, తాలిబన్ ఫోర్స్ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో దాదాపు అర్థగంట పాటు ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా హౌజ్లతో పాటు ట్విటర్లోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫెన్సింగ్ వద్ద తాలిబన్ ట్రూప్కు చెందిన వ్యక్తి కంచె తొలగిస్తుండగా .. ఇద్దరు పాక్ సైనికులు అడ్డుకున్నారని, వారిని ఆ వ్యక్తి కాల్చి చంపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం. అయితే ఇరుపక్షాలు మాత్రం నష్టంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, కొన్ని గంటలకే వ్యవహారం సర్దుమణిగిందంటూ అఫ్గన్, పాక్ పక్షాల నుంచి ప్రకటన వెలువడింది. ఇక స్థానిక మీడియాలో కథనాలు మాత్రం విరుద్ధంగా ఉంటున్నాయి. మరోవైపు అఫ్గన్ సరిహద్దు వెంట 26 వేల కిలోమీటర్ల మేర కంచె పనుల్ని దాదాపు పూర్తి చేయగా.. తాలిబన్లు వైర్ను తెంచుకెళ్లి ఇనుప సామాన్ల స్టోర్లలో అమ్మేసుకుంటున్నారు. ఈ తీరుపైనా పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్కు పాక్ షాక్ -
ఎట్టకేలకు దిగొచ్చిన తాలిబన్లు!
Afghan Taliban Govt Needs US Help: దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతూ.. జనజీవనం ఆకలి కేకల దుస్థితికి చేరుకున్న తరుణంలో తాలిబన్ ప్రభుత్వం దిగొచ్చింది. అమెరికా విధించిన ఆంక్షల కొర్రిల నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించి సాయం కోసం చేతులు చాచింది. అఫ్గన్ నేలపై ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. వరుసగా అమెరికా, పొరుగు దేశాల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్నారు తాలిబన్లు. అయితే ప్రతీ చర్చలో తమ ఆధిపత్యమే ప్రదర్శిస్తూ.. ఫలితంపై ఎటూ తేల్చకుండా వస్తున్నారు. దీంతో దేశంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాయం కావాలి ఆడపిల్లలకు విద్యను అందించడం, ఉద్యోగ-ఉపాధి కల్పన ద్వారా మహిళా సాధికారికతకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి స్పష్టం చేశారు. అయితే ఇందుకు ప్రపంచ దేశాల సాయం తమకు అవసరం ఉందని ఆదివారం ది అసోషియేట్ ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేస్తుంటారు. కానీ, మేం అధికారం చేపట్టేనాటికే అఫ్గన్ ఆర్థికం ఘోరంగా ఉంది. గత ప్రభుత్వ ప్రతినిధులు నిధులతో పారిపోయారు. పైగా అఫ్గన్కు చెందిన బిలియన్ల డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేశారు. అమెరికాతో మాకెలాంటి సమస్యలు లేవు. ఒక్క అమెరికాతోనే కాదు అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. ..అఫ్గన్కు సంబంధించి 10 బిలియన్ డాలర్ల ఫండ్ నిలిచిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అది విడుదలయ్యేందుకు అన్నీ దేశాలు మాకు సహకరిస్తాయని భావిస్తున్నాం. అఫ్గన్పై ఆంక్షలు ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలు కలిగించవు. అఫ్గన్ అస్థిరత, ఒక దేశ ప్రభుత్వాన్ని బలహీనపర్చడం ఏదో ఒక దేశం ఆసక్తి మీద ఆధారపడి ఉండదని గమనించాలి. అఫ్గన్ కోలుకోవడానికి సాయం అందించాలి’’ అని అంతర్జాతీయ సమాజానికి ముట్టాఖి విజ్ఞప్తి చేశాడు. ఇక తాలిబన్ల పాలనలో ఆడపిల్లలు, మహిళల అణచివేత కొనసాగుతోందన్న కథనాలను కొట్టిపారేసిన ముట్టాఖీ.. మత చట్టంలో కొన్ని సవరణలకు, వాటిని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. గతంలోనూ తాము సవరణలు చేపట్టిన అంశాన్ని ప్రస్తావించారాయన. ‘‘ముందు ప్రపంచం మాతో కలవాలి. మేం వాళ్లతో కలవాలి. అప్పుడే కదా మాకు బయటి ప్రపంచం గురించి తెలిసేది. ఎలాంటి సడలింపులు ఇవ్వాలో తెలిసేది’’ అని వ్యాఖ్యానించారాయన. చదవండి: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు తప్పులు ఒప్పుకుంటున్నాం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలలపాటు తమ(తాలిబన్) ప్రభుత్వం తప్పులు చేసిందని ముట్టాఖీ అంగీకరించారు. అయితే వాటి గురించి చర్చించకుండా.. సంస్కరణల గురించి, సంక్షోభం నుంచి గట్టెక్కడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారాయన. అమెరికా దళాల ఉపసంహరణ ప్రకటన నేపథ్యంలో.. మేం మాట నిలబెట్టుకున్నాం. నాటో, అమెరికా దళాలపై ఎటువంటి దాడులు చేయలేదు. దురదృష్టవశాత్తూ ఐసిస్ చేసిన దాడుల్ని మేం చేసినట్లుగా అనుమానించారు. ఆపై మా నిజాయితీ నిరూపించుకున్నాం. ప్రతీకార దాడుల కథనాలు కూడా ఊహాగానాలే!. ఏదిఏమైనా శాంతి భద్రతల స్థాపనకు, మానవ హక్కుల పరిరక్షణ ప్రకటనకు కట్టుబడి ఉంటాం. ముందు ముందు కూడా అదే ఆచరిస్తాం. అందుకు అఫ్గన్ను ఆదుకోవాల్సిన బాధ్యత అమెరికా లాంటి అగ్రరాజ్యం పై ఉందని ఆయన పేర్కొన్నారాయన. ‘‘అమెరికా సంయుక్త బలగాల ఉపసంహరణ తర్వాత అప్గన్.. దారుణంగా దెబ్బతింది. అది కోలుకోవాలంటే తిరిగి అమెరికా చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే అమెరికా గొప్ప దేశం కాబట్టి. పొరపచ్చాలను పక్కనపెట్టి అమెరికాతో మా ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తేనే అప్గన్నిస్థాన్ బాగుపడేది అని ఆశాబావం వ్యక్తం చేశారాయన. అయితే ఐసిస్ వ్యతిరేక పోరాటంలో అమెరికాకు మద్ధతుగా నిలుస్తారా? అనే ప్రశ్నకు మాత్రం అమిర్ ఖాన్ దాటవేత ధోరణి ప్రదర్శించడం కొసమెరుపు. చదవండి: పెళ్లిళ్లపై తాలిబన్ల సంచలన నిర్ణయం.. -
అఫ్గాన్లో పాకిస్తాన్ విధ్వంసకర పాత్ర
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ వ్యవహారాల్లో పొరుగు దేశం పాకిస్తాన్ చాలా ఏళ్లుగా చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు అమెరికాలో కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్ఎస్) తన నివేదికలో వెల్లడించింది. స్వతంత్ర విషయ నిపుణులు ఈ నివేదికను రూపొందించారు. అఫ్గాన్లో పాక్ విధ్వంసకర, అస్థిరతకు కారణమయ్యే పాత్ర పోషిస్తున్నట్లు సీఆర్ఎస్ రిపోర్టు తేల్చిచెప్పింది. తాలిబన్ ముష్కరులకు పాక్ పాలకుల అండదండలు బహిరంగ రహస్యమేనని పేర్కొంది. పాకిస్తాన్, రష్యా, చైనా, ఖతార్ వంటి దేశాలు తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించి, సంబంధాలు పెంచుకొనే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే అమెరికా ఒంటరి కాక తప్పదని పేర్కొంది. అఫ్గాన్పై అమెరికా పట్టు సడలిపోతుందని పేర్కొంది. ఫలితంగా తాలిబన్ పాలకులు అమెరికా ఒత్తిళ్లను ఎదిరించే పరిస్థితి ఉత్నన్నమవుతుందని సీఆర్ఎస్ రిపోర్టు వివరించింది. ‘‘అఫ్గాన్ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడాన్ని కొందరు పాక్ విజయంగా భావిస్తున్నారు. దీంత్లో అక్కడ పాక్ పెత్తనం పెరిగిపోతుంది. అఫ్గాన్పై భారత్ ప్రభావాన్ని తగ్గించాలన్న పాక్ యత్నాలు తీవ్రమవుతాయి’’ అని పేర్కొంది. ఢిల్లీ సదస్సును స్వాగతించిన తాలిబన్ కాబూల్: అఫ్గానిస్తాన్పై భారత్ నిర్వహించిన ‘ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్’ను తాలిబన్ ప్రభుత్వం స్వాగతించింది. భారత్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల సదస్సులో మొత్తం 8 దేశాలు పాల్గొన్న విషయం తెలిసిందే. సదస్సు నేపథ్యంలో భారత్ చేసిన డిమాండ్లన్నిటినీ తాము నెరవేర్చామని తాలిబన్ ప్రభుత్వం తెలిపిందని టోలో వార్తా సంస్థ తెలిపింది. ‘ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబన్) భారత్ సదస్సును స్వాగతిస్తోంది. పాలన విషయంలో గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అఫ్గాన్ భూభాగాన్ని తమకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని ఏ ఒక్క దేశం కూడా ఆందోళన చెందవద్దు’అని అఫ్గాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇనాముల్లా సమాంగని తెలిపారని టోలో న్యూస్ పేర్కొంది. అఫ్గాన్లో ప్రస్తుత పరిస్థితులను, ఎదుర్కొంటున్న సవాళ్లను అంచనా వేయడంలో ఢిల్లీ భేటీ అసాధారణ చొరవ చూపిందని పేర్కొంది. ‘అఫ్గానిస్తాన్కు సాయం అందిస్తున్న దేశాల్లో ఒకటైన భారత్.. ఢిల్లీ సదస్సును ప్రభావవంతంగా నిర్వహించిందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు సయద్ హకీమ్ కమాల్ చెప్పారు. ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు పాల్గొన్నాయి. -
అఫ్గాన్ ఉగ్రవాదుల అడ్డా కాకూడదు
న్యూఢిల్లీ: తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకాలాపాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని భారత్ ఆ«ధ్వర్యంలో బుధవారం జరిగిన భద్రతా సదస్సులో పాల్గొన్న ఎనిమిది ఆసియన్ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అఫ్గాన్ సంక్షోభం విసిరే సవాళ్లపై ఏర్పాటైన ‘ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ అఫ్గానిస్తాన్’ సదస్సు అంతర్జాతీయ ఉగ్రవాదానికి అఫ్గాన్ అడ్డాగా మారకుండా నిరోధించడానికి కలసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించింది. సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. అఫ్గానిస్తాన్లో భద్రతా పరిస్థితులపై ఈ సదస్సులో చర్చ జరిగింది. శాంతియుత, భద్రతాయుత, సుస్థిరమైన అఫ్గానిస్తాన్ని చూడటమే తమ లక్ష్యమని సదస్సుకి హాజరైన ప్రతినిధులు పేర్కొన్నారు. కాబూల్, కాందహార్, కుందుజ్లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని సమావేశం ఖండించింది. పాకిస్తాన్, చైనా ఏవో సాకులు చెప్పి సదస్సుకి దూరంగా ఉన్నాయి. నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలి: మోదీ అఫ్గానిస్తాన్లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సదస్సు ముగిసిన తర్వాత భద్రతా ప్రతినిధులందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మోదీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అఫ్గానిస్తాన్ అభివృద్ధి కోసం నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. అఫ్గాన్ భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని చెప్పారు. ఇందుకోసం అక్కడ ఉగ్రవాద సంస్థలకు స్థానం లేకుండా చేయాలన్నారు. అఫ్గాన్ నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి వ్యూహ రచన చేయాలన్నారు. అఫ్గాన్లో జనం ఆకలితో అలమటించిపోతున్నారని, ముష్కరులు వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నారని, సంక్షోభం నానాటికీ ముదురుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ఇరుగు పొరుగు దేశాలు మానవతాదృక్పథంతో నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకి నేతృత్వం వహించి ప్రారంభోపన్యాసం చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అఫ్గానిస్తాన్లో ఇటీవల జరిగిన పరిణామాలు ప్రాంతీయంగానూ సవాళ్లు విసురుతున్నాయని అన్నారు. తాలిబన్లతో చర్చల ద్వారానే అఫ్గాన్ సమస్యని పరిష్కరించగలమని రష్యా ప్రతినిధి నికోలాయ్æ అన్నారు. సదస్సు ఒక డిక్లరేషన్ని ఆమోదించింది. మళ్లీ వచ్చే ఏడాది సమావేశం కావాలని అంగీకారానికి వచ్చారు. డిక్లరేషన్లో ఏముందంటే ? ► అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యాకలాపాలు జరగకూడదు. అక్కడ ప్రభుత్వం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం, ఆర్థిక సహకారం అందించకూడదు. ► అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదంటూ పాకిస్తాన్కు పరోక్ష హెచ్చరికలు జారీ. ► సామాజికంగా, ఆర్థికంగా కునారిల్లుపోతున్న అఫ్గానిస్తాన్ పరిస్థితిపై సదస్సు ఆందోళన. అఫ్గాన్ ప్రజలకు మానవత్వంతో అత్య వసరంగా సాయం చెయ్యాలని నిర్ణయం. ► అఫ్గాన్లో అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సాయం అందేలా చర్యలు చేపట్టాలి. మానవతా దృక్పథంతో చేసే ఈ సాయంలో ఎలాంటి వివక్షలకు తావు ఉండకూడదు ► మహిళలు పిల్లలు, మైనారిటీల హక్కుల్ని ఎవరూ ఉల్లంఘించకూడదు. ► అఫ్గానిస్తాన్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించేలా ప్రభుత్వం ఏర్పాటుకావాలి. ► కోవిడ్పై పోరాటానికి అఫ్గానిస్తాన్కు కావల్సిన సాయం అందించడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్లో కూడా అన్ని దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి. ► ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అఫ్గాన్లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించాలి. -
నలుగురు మహిళల దారుణ హత్య.. ప్రకటించిన తాలిబన్లు
కాబూల్: తాలిబన్లు ఆక్రమించిన నాటి నుంచి అఫ్గనిస్తాన్లో అరాచకాలు.. ముఖ్యంగా మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అఫ్గన్ ఉత్తర నగరమైన మజర్ ఈ షరిఫ్లో నలుగురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ వార్తను అఫ్గన్ తాలిబన్ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఆ వివరాలు.. తాలిబన్లు అఫ్గనిస్తాన్ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు విదేశాలకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన నలుగురు మహిళలు కూడా ఈ ప్రయత్నంలోనే ఉన్నారు. వీరు నలుగురు స్నేహితులే కాక.. కోలిగ్స్ కూడా. వీరు దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఏజెంట్ ద్వారా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. (చదవండి: తాలిబన్ల దుశ్చర్య.. 13 మంది ఊచకోత) ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వీరికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఏజెంట్ అని భావించిన మహిళలు అతడితో మాట్లాడారు. ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో అతడితో పాటు కారులో వెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి వారిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. చనిపోయిన నలుగురు కూడా హక్కుల కార్యకర్తలని సమాచారం. అయితే దీని గురించి మాట్లాడటానికి వారి కుటుంబ సభ్యులు నిరాకరించారు. చదవండి: తెరపైకి తాలిబన్ల సరికొత్త రూల్.. ఈ సారి ఏకంగా.. -
తాలిబన్ల దుశ్చర్య.. 13 మంది ఊచకోత
కాబూల్: అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ఓవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.. దేశంలో మాంద్యం పెరిగితోంది. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా.. చాంధస పాలన కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తాలిబన్లు ఓ మహిళా క్రీడాకారిణి తల నరికిన ఘటన గురించి చదివాం. తాజాగా తాలిబన్లు మరో దుశ్చర్యకు పూనుకున్నారు. పెళిల్లో మ్యూజిక్ బంద్ చేయించడం కోసం ఏకంగా 13 మందిని చంపేశారు. ఈ విషయాన్ని అఫ్గన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. అమ్రుల్లా చెప్పిన దాని ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్ ప్రాంతంలో ఓ చోట వివాహం జరుగుతుంది. ఇక పెళ్లి అంటే సందడి ఉంటుంది కదా. అలానే ఆ వివాహ వేడుక వద్ద మ్యూజిక్ ఏర్పాటు చేశారు. అది తాలిబన్లకు నచ్చలేదు. మ్యూజిక్ ఆపమని చెప్పడానికి వారు అక్కడున్న జనాల్లో ఓ 13 మందిని ఊచకోత కోశారు. (చదవండి: తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం ) ఈ సందర్భంగా అమ్రుల్లా ‘‘తాలిబన్ మిలిటెంట్లు నంగర్హార్ ప్రావిన్స్ ప్రాంతంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో సంగీతాన్ని ఆపడం కోసం 13 మందిని ఊచకోత కోశారు. మనం కేవలం ఖండించడం ద్వారా మాత్రమే ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేం. మన సంస్కృతిని చంపేయడం కోసం పాకిస్తాన్ వీరికి దాదాపు 25 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చింది. మన సంస్కృతి స్థానంలో ఐఎస్ఐ కల్చర్ని తీసుకువచ్చి.. మన ఆత్మలను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రాక్షస పాలన ఎంతో కాలం కొనసాగదు. కానీ ఉన్నన్ని రోజులు అఫ్గన్లు మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అంటూ ట్వీట్ చేశారు. Taliban militiamen have massacred 13 persons to silence music in a wedding party in Nengarhar. We can't express our rage only by condemnation. For 25 years Pak trained them to kill Afg culture & replace it with ISI tailored fanaticism to control our soil. It is now in works. 1/2— Amrullah Saleh (@AmrullahSaleh2) October 30, 2021 (చదవండి: అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?) అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న నాటి నుంచి తాలిబన్లు దేశంలో కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్, టీవీల్లో ఆడవారి గొంతు వినిపించకూడదంటూ నిషేధం విధించారు. అఫ్గనిస్తాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ కాలేజీని కూడా మూసేశారు. చదవండి: ఆ డబ్బులు అఫ్గనిస్తాన్వి.. మాకు తిరిగివ్వండి: తాలిబన్లు -
మహిళలపై తాలిబన్ పాలకుల ఉక్కుపాదం
-
తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం
కాబూల్: ఆ తల్లికి నలుగురు సంతానం. నాలుగో బిడ్డ నెలల పసికందు చిన్న పాప. కొన్ని నెలల క్రితం వరకు వారి జీవితాలు బాగానే ఉండేవి. కానీ దేశం తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన నాటి నుంచి గడ్డు పరిస్థితులు. కడుపునిండా తిని ఎన్ని రోజులవుతుందో. తాము సరే.. కానీ పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పసిదానికి పాలు కూడా కరువయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. ఆ మహిళ తన అమ్మ మనసును చంపుకుంది. మిగతా పిల్లల ఆకలి తీర్చడం కోసం నెలల పసిగుడ్డును అమ్మకానికి పెట్టింది. అది కూడా కేవలం 500 డాలర్లకు. ఇక భవిష్యత్తులో ఆ పాపను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం కోసం ఈ చిన్నారిని కొన్నాడు సదరు వ్యక్తి. అఫ్గన్లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో.. ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థం అవుతుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు ఇలాంటి చిన్నారులను బలి పశువులను చేస్తున్నారు. ఆవివరాలు.. (చదవండి: ఆకలితో అల్లాడుతున్న అఫ్గన్ చిన్నారులు.. తిండి దొరక్క) అఫ్గనిస్తాన్లోని ఓ కుగ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చిన్నారి తండ్రి కొంతకాలం వరకు చెత్త ఏరుకుని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత కష్టాలు ప్రారంభం అయ్యాయి. అతడికి నలుగురు సంతానం. భార్యాబిడ్డల ఆకలి తీర్చడం చిన్నారి తండ్రికి తలకు మించిన భారమయ్యింది. ఈ క్రమంలో ఆఖరి సంతానం అయిన నెలల పాపను 500 డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. (చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్కు పాక్ షాక్) మిగతా బిడ్డల ఆకలి తీర్చడం కోసం ఈ పసికందును అమ్మేశాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. పసిదాన్ని భవిష్యత్తులో తన కుమారుడికిచ్చి వివాహం చేయడం కోసం ఈ పాపను కొన్నాడట సదరు వ్యక్తి. ఈ సందర్భంగా చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ‘‘పాపతో సహా ఇంట్లో అందరం ఆకలితో బాధపడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ దారుణానికి ఒడగట్టాను. పాప చాలా చిన్నది.. ఇప్పుడు నేను చేసిన పని గురించి దానికేం తెలియదు. మిగతా పిల్లలు పెద్దవాళ్లు. వారికి పరిస్థితి అర్థం అవుతుంది. బిడ్డను అమ్ముకునేంత కసాయి దాన్ని కాదు. కానీ మిగతా పిల్లల ఆకలి నన్ను ఈ పాపానికి పురిగొల్పింది’’ అంటూ కన్నీరుపెట్టుకుంది. చదవండి: తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా -
తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్కు పాక్ షాక్
ఆఫ్ఘనిస్తాన్ మిత్రరాజ్యంగా ఉన్న పాకిస్థాన్.. ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చింది. తాలిబన్ల అతిజోక్యంతో విసుగొచ్చి.. అఫ్గన్కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ధరల్ని తగ్గించే ప్రసక్తే లేదని పేర్కొంటూ.. ఈ మేరకు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. దీంతో అఫ్గన్కు ప్రస్తుతం నడుస్తున్న ఏకైక విదేశీ విమాన సర్వీస్ కూడా నిలిచిపోయినట్లు అయ్యింది. కారణం.. తాలిబన్ల దురాక్రమణకు ముందు(ఆగస్టు 15 వరకు) కాబూల్-ఇస్లామాబాద్ మధ్య విమాన ఛార్జీ టికెట్ ధర 120-150 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడది 2500 డాలర్లకు చేరుకుని మంటపుట్టిస్తోంది. ఈ తరుణంలో టికెట్ ధరల్ని తగ్గించాలని, లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని తాలిబన్ ప్రభుత్వం పాక్ను హెచ్చరించింది. ఇందుకు కౌంటర్గానే పాక్ తన సర్వీసులు నిలిపివేసి తాలిబన్లకు ధీటుగా బదులిచ్చింది. తమ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నా.. తాలిబన్లను ఇంతకాలం ఓపికగా భరిస్తూ వస్తున్నామని చెబుతోంది పీఐఏ. అయితే ఇప్పుడు మునుపటి ధరలతో విమాన సర్వీసులు నడపాలన్నది తాలిబన్ల తాజా ఆదేశం. కానీ, బీమా సంస్థలు కాబూల్ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున బీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని, అందుకనే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని పాక్ చెబుతోంది. ఇంతకాలం తాము మానవతా దృక్పత కోణంలోనే విమాన సర్వీసులు నడిపామని, కానీ, ఇక మీదట టికెట్ ధరలను తగ్గించలేమని పేర్కొంటూ అఫ్గనిస్తాన్కు విమాన సర్వీసులను రద్దు చేసింది పీఐఏ. చదవండి: పాక్ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా! -
పాక్ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా!
‘రండి అన్న రండి.. మేడిన్ అమెరికా గన్లు ఉన్నాయి. బుల్లెట్ల దగ్గరి నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దాకా అన్నీ సరసమైన ధరలకే అమ్ముతున్నాం’ (తెలుగీకరించాం) అంటూ పాకిస్థాన్ మార్కెట్లలో ఇప్పుడు కోలాహలం కనిపిస్తోంది. ఈ అత్యాధునిక ఆయుధాలన్నీ అమెరికా అఫ్గనిస్తాన్ నుంచి పోతూ పోతూ వదిలేసి పోయినవే కావడం విశేషం!. కరాచీ, లాహోర్, పెషావర్, గుజ్రన్వాలా.. పాకిస్థాన్ గన్మార్కెట్లలో అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ వెపన్స్ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రకారం.. అక్కడి మార్కెట్లలో వీటి అమ్మకాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. ‘‘తాలిబన్లు మేమూ భాయి భాయిలం. వాళ్ల దగ్గరి నుంచి వీటిని కొనుగోలు చేయడాన్ని, మా దేశంలో పౌరులకు అమ్ముకోవడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం’’ అంటూ అక్కడి అమ్మకందారులు చెప్తున్నారు. అడ్వాన్స్డ్ పిస్టోల్స్, రైఫిల్స్, గ్రెనేడ్స్, నైట్ విజన్ గగూల్స్, బుల్లెట్ఫ్రూఫ్ జాకెట్లు, స్పై కెమెరాలు, నార్మల టేజర్ గన్స్, టేజర్ స్టిక్స్, ఇతరత్ర మారణాయుధాలు పాక్ గన్ మార్కెట్లలో జోరుగా అమ్ముడుపోతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం తాలిబన్ల ఖండన.. అయితే ఈ కథనాలను తాలిబన్లు ఖండిస్తున్నారు. తాలిబన్(Islamic Emirate of Afghanistan) ప్రతినిధి బిలాల్ కరిమి పేరిట న్యూయార్క్ టైమ్స్లో తాజాగా ఓ కథనం ప్రచురితమైంది. ‘‘ఆ కథనాల్ని మేం ఖండిస్తున్నాం. ఆయుధాల విషయంలో మేమేం అంత నిర్లక్క్ష్యంగా లేము. అక్రమ రవాణా కాదుకదా.. కనీసం సింగిల్ బుల్లెట్ను మేం బయటవాళ్లకు అమ్ముకోలేదు’’ అని కరిమి తెలిపాడు. అమెరికన్లు వదిలేసిన వెళ్లిన ప్రతీ ఆయుధాన్ని, వస్తువుల్ని సీజ్ చేసి భద్రపరిచామని, ఆ ఆయుధాల్ని భవిష్యత్తులో తమ(తాలిబన్ల) సైన్యం అవసరాల కోసమే ఉపయోగిస్తామని కరిమి పేర్కొన్నాడు. అయినప్పటికీ అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడతామని తాలిబన్ సంస్థ ప్రకటించింది. ప్రతీకాత్మక చిత్రం లూట్ కా మాల్! అయితే పాక్ వీధుల్లో అమ్ముడుపోతున్న ఆయుధాలు.. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలే అని నిర్ధారణ అయ్యింది. అమెరికా భద్రతా బలగాల పహారా సాగినంత కాలం.. తాలిబన్లు-పాక్ సాయంతో కలిసి అమెరికా-నాటో బృందాలపై దాడులకు తెగపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ ఆయుధాల్ని ఎత్తుకెళ్లిపోయేవాళ్లు. ఈ తరుణంలో ఇప్పుడు వదిలేసి వెళ్లిన ఆయుధాల్ని అక్రమంగా తరలించడమో లేదంటే ఆదాయం కోసం అమ్ముకోవడమో తాలిబన్లు చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాలిబన్లు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తుండగా.. పాక్ వ్యాపారులు మాత్రం అంతా పద్దతిగానే జరిగిందని చెప్తుండడం విశేషం. దీంతో దొడ్డిదారిన ఆ ఆయుధాలు తరలిపోయి ఉంటాయన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సైన్యం ఉపసంహరణలో భాగంగా.. అఫ్గనిస్తాన్ బాగ్రమ్ ఎయిర్బేస్కు పవర్కట్ చేసి గప్చుప్గా వెళ్లిపోయాయి అమెరికా దళాలు. వెళ్తూ వెళ్తూ అఫ్గన్ గడ్డపై 83 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సంపత్తిని వదిలేశాయి. చదవండి: అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్ -
అమెరికా సాయం అక్కర్లేదు!
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లో పెట్రేగుతున్న ఐసిస్ సహా ఇతర ఉగ్ర గ్రూపుల అణచివేతకు అమెరికా సాయం కోరేదిలేదని తాలిబన్లు శనివారం స్పష్టం చేశారు. ఆగస్టులో అమెరికా అఫ్గాన్ నుంచి వైదొలిగిన అనంతరం తొలిసారి తాలిబన్లతో యూఎస్ శని, ఆదివారాల్లో దోహాలో చర్చలు జరపనుంది. ఈ సమయంలో తాలిబన్లు కీలక అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అఫ్గాన్లో తిష్టవేసుకున్న ఉగ్రతండాలను కట్టడి చేయడం, ఆదేశంలో ఉండిపోయిన విదేశీయులను వారివారి దేశాలకు పంపడంపై చర్చలు ఉంటాయని ఇరువర్గాలు తెలిపాయి. వీటిలో విదేశీయుల తరలింపుపై తాలిబన్లు సానుకూలంగా ఉన్నారు. కానీ ఐసిస్ కట్టడికి అమెరికా సాయం కోరమని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ చెప్పారు. తాజాగా అఫ్గాన్ మసీదులో ఐసిస్ జరిపిన ఆత్మాహుతిదాడిలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే! అయితే వీరిని తాము స్వతంత్య్రంగా ఎదుర్కోగలమని సుహైల్ చెప్పారు. యూఎస్ సేనలు అమెరికాలో ఉన్నప్పడు కూడా అఫ్గాన్ షియా మైనారీ్టలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ దాడులు జరిపింది. తాలిబన్లు, అమెరికన్లకు ఐసిస్ వల్ల ప్రమాదం ఉన్నందున కలసికట్టుగా దీనిపై పోరాటం చేస్తారని విశ్లేషకులు భావించారు. గుర్తింపు కోసం కాదు తాలిబన్లతో జరిపే చర్చలు, వారు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ముందస్తు సన్నాహాలు కాదని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు ఈచర్చలకు ముందు పాక్ మిలటరీ అధికారులతో అమెరికా డిప్యుటీ స్టేట్ సెక్రటరీ వెండీ షెర్మన్ ఇస్లామాబాద్లో సమావేశమయ్యారు. ఇందులో కూడా అఫ్గాన్ పరిణామాలనే చర్చించినట్లు తెలిసింది. అఫ్గాన్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించాలని, అమెరికాలో నిలిపివేసిన అఫ్గాన్ నిధులను విడుదల చేయాలని పాక్ యూఎస్ను అరి్ధంచిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేదంటే అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే తాలిబన్లు తమ ప్రభుత్వంలో మరిన్ని వర్గాలకు చోటివ్వాలని, మానవహక్కులు, మైనార్టీ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పాక్ కోరింది. దేశంలో తమకు రక్షణ కరువైందని అఫ్గాన్ షియా పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా నుంచి అఫ్గాన్కు... తాలిబన్ల దాడికి వెరిచి భారత్కు పారిపోయివచి్చన అఫ్గాన్ పౌరుల్లో వందమందికి పైగా స్వదేశానికి పయనమయ్యారని అఫ్గాన్ ఎంబసీ వర్గాలు తెలిపాయి. కాబూల్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది అఫ్గాన్లు విదేశాలకు పారిపోయారు. ఇలా ఇండియా వచి్చనవారిలో పలువురు ప్రస్తుతం అఫ్గాన్ వెళ్లేందుకు ఇండియా నుంచి టెహ్రాన్ చేరుకున్నారని అధికారులు చెప్పారు. త్వరలో మరింతమంది అఫ్గాన్లు స్వదేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అఫ్గాన్ మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిని అమెరికా ఖండించింది. -
తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా
US Talibans Face To Face Meeting: అమెరికా సైనిక దళాల ఉపసంహరణ వల్లే తాలిబన్ల దురాక్రమణకు మార్గం సుగమం అయ్యిందనే విమర్శ ఉంది. అంతేకాదు అఫ్గనిస్తాన్ నుంచి చాలా దేశాలకు వర్తకవాణిజ్యాలు నిలిచిపోవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో తాలిబన్లతో చర్చలకు అమెరికా సిద్ధపడడం ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 31తో ఆఫ్గన్ నుంచి బలగాల్ని ఉపసంహరించుకున్న అగ్రరాజ్యం.. ఆ తర్వాత అక్కడి పరిణామాల్లో తలదూర్చలేదు. కానీ, అక్కడి పౌర హక్కుల ఉల్లంఘనపై మాత్రం తాలిబన్లను నిలదీస్తూ వస్తోంది. మరోవైపు తాలిబన్ల చేష్టల్ని ఓ కంటకనిపెడుతున్న అమెరికా.. ఇప్పుడు ప్రత్యక్ష చర్చలకు సిద్ధపడుతుండడం విశేషం. ప్రపంచంతో వర్తకవాణిజ్యాల పునరుద్దరణ ప్రధాన ఎజెండాగా ముఖాముఖి చర్చలకు రెడీ అయ్యింది. ఈ చర్చల్లోనే తాలిబన్లకు పలు షరతులు విధించాలని భావిస్తోంది. ఆ ఒక్కటి తప్ప.. అయితే ఆశ్చర్యకరరీతిలో చర్చలకు సిద్ధపడిన బైడెన్ ప్రభుత్వం.. తాలిబన్లకు మాత్రం గట్టి ఝలకే ఇచ్చింది. ఇలా చర్చలు జరిపినంత మాత్రానా తాలిబన్లను అఫ్గనిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధులుగా గుర్తించబోమని (తాలిబన్ ప్రభుత్వంగా గుర్తించమని పరోక్షంగా) ప్రకటన విడుదల చేసింది. ‘‘తాలిబన్లు ఇప్పటికీ ఉగ్రవాద అనుబంధ సంస్థగానే ఉన్నారు. అమెరికాతో పాటు మిగిలిన అంతర్జాతీయ సమాజం నుంచి వాళ్లు(తాలిబన్లు) మారారనే నమ్మకం కలిగినప్పుడే ప్రభుత్వ గుర్తింపు అంశం పరిశీలిస్తాం’ అని అమెరికా తరపు ప్రతినిధి ఒకరు శుక్రవారం తెలిపారు. అమెరికా తరపున ప్రతినిధులు శనివారం నేరుగా తాలిబన్లతో సమావేశమై చర్చలు జరపబోతున్నారు. వాణిజ్య అంశాలతో పాటు ఎగుమతులు-దిగుమతుల కొనసాగింపు, సుంకాల విధింపు-సడలింపులు తదితర విషయాలపై చర్చించనున్నారు. వీటితో పాటే మానవ హక్కులు.. ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల్ని పరిరక్షించాలనే డిమాండ్ను సైతం తాలిబన్ల ముందు ఉంచాలని అమెరికా భావిస్తోందట. అంతేకాదు ఈ సంక్షోభ-విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దేశాలను, సహాయక బృందాలను అఫ్గనిస్తాన్లోకి అనుమతించాలని సైతం కోరనుంది. చదవండి: ప్రపంచ దేశాల ఆందోళన.. అఫ్గాన్పై మాస్కోలో సదస్సు -
మసీదులో మారణకాండ
కాబూల్: పశ్చిమ అఫ్గానిస్తాన్ కుందుజ్ ప్రావిన్సులోని గోజార్ ఇ సయీద్ అబాద్ మసీదులో శుక్రవారం సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్జజీరా వెల్లడించింది. అయితే కుందుజ్ ఆస్పత్రి అధికారి ఒకరు పేలుడులో 25మంది మరణించారని, 51మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు అధికారిక బఖ్తార్ న్యూస్ ఏజెన్సీ ఈ పేలుళ్లలో 46మంది మరణించారని, 140మంది గాయపడ్డారని తెలిపింది. ఇవన్నీ ప్రాథమిక గణాంకాలేనని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దేశ పాలనపగ్గాలు తాజాగా చేపట్టిన తాలిబన్లకు ఈ పేలుడు సవాలుగా మారింది. పేలుడులో మొత్తం 100 మంది మరణించడం లేదా గాయపడడం జరిగిందని కుందుజ్ ప్రావిన్స్ తాలిబన్ పోలీసు అధికారి ఒబైదా ప్రకటించారు. గాయపడినవారి కన్నా మరణించినవారే ఎక్కువగా ఉండొచ్చన్నారు. షియాల రక్షణకు తాలిబన్లు కట్టుబడిఉన్నారని భరోసా ఇచ్చారు. అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు. దాడిని షియాల మతపెద్ద అలిమి బల్ఖి ఖండించారు. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రార్ధనాస్థలాల రక్షణకు ఉంచిన ఆయుధాలను తాలిబన్లు తీసుకుపోయినందున, వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనన్నారు. ఐసిస్ హస్తం మసీదులో జరిగిన ఘోర పేలుడుకు కారకులెవరో తొలుత తెలియరాలేదు. అయితే పేలుడు జరిగింది షియా ముస్లింలకు చెందిన మసీదు కావడంతో ఐసిస్పైనే అందరికీ తొలుత అనుమానం వచ్చింది. ఇందుకు తగ్గట్లే తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్ అనుబంధ సంస్థ ఐసిస్– కే వారి మీడియా ఏజెన్సీ అమాక్ న్యూస్లో ప్రకటించింది. ఇదే అంశాన్ని ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూపు నిర్ధారించింది. షియా హజారాలను లక్ష్యంగా చేసుకొనే ఆత్మాహుతి దాడి చేసినట్లు ఐసిస్–కే టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించుకుంది. గతంలో పలుమార్లు షియా మైనారీ్టలపై ఐసిస్ దాడులు చేసిన చరిత్ర ఉంది. అమెరికా సైన్యాలు వైదొలిగిన అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు అఫ్గాన్లో దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా షియాలపై ఐసిస్–కే యుద్ధాన్నే ప్రకటించింది. తాజాదాడులను ఐరాస ఖండించింది. పేలుడుపై తమ పత్య్రేక దళాలు దర్యాప్తు జరుపుతున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకప్పుడు కొన్నిప్రాంతాలకే పరిమితమైన ఐసిస్ దాడులు ఇప్పుడు పలు చోట్ల జరగడం తాలిబన్లతో పాటు అఫ్గాన్ పొరుగుదేశాలను కూడా కలవరపరుస్తోంది. -
ప్రపంచ దేశాల ఆందోళన.. అఫ్గాన్పై మాస్కోలో సదస్సు
మాస్కో: అఫ్గానిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ భూభాగం నుంచి ఉగ్రవాదం పెరిగిపోతుందని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ పరిణామాలపై చర్చించడానికి రష్యా ఈ నెల 20న ఒక అంతర్జాతీయ సదస్సుని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సదస్సుకి తాలిబన్లను కూడా ఆహ్వానిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కబులోవ్ చెప్పినట్టుగా రష్యన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. తమ భూభాగంలోకి ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎక్కడ చొరబడతారోనన్న ఆందోళనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలి రఖ్మాన్తో ఫోన్లో మాట్లాడారు. మధ్య ఆసియాలో భద్రతా పరిస్థితులపై చర్చించారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
తాలిబన్లను చర్చలకు ఆహ్వానించిన రష్యా
మాస్కో: అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకుని.. పాలన ఆరంభించిన తాలిబన్లను చర్చలకు ఆహ్వానించింది రష్యా. అక్టోబర్ 20న మాస్కోలో తాలిబన్లతో చర్చలు జరపనున్నట్లు అఫ్గనిస్తాన్ రష్యా ప్రతినిధి ఒకరు గురువారం వెల్లడించారు. ప్రతినిధి జమీర్ కాబులోవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 20 న రష్యా రాజధానిలో అఫ్గన్ అంశంపై చర్చించేందుకుగాను తాలిబాన్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించాము’’ అని ప్రభుత్వ ఆధీనంలోని ఆర్ఐఏ నోవోస్టి వార్తా సంస్థకు తెలిపారు అయితే ఈ మాస్కో ఫార్మట్ చర్చలకు హాజరవుతున్న తాలిబన్ ప్రతినిధులు ఎవరనేదాని గురించి సమాచారం లేదు. తాలిబన్లు అఫ్గనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశంలో తలెత్తిన మానవతా విపత్తును నివారించడానికి ఈ చర్చలు సాయం చేస్తాయని.. రష్యా ఈ విషయంలో అఫ్గన్కు సాయం చేస్తుందని కాబులోవ్ తెలిపారు. ప్రస్తుతం దీని గురించి చర్చిస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. (చదవండి: అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?) ఇటీవల సంవత్సరాలలో అఫ్గన్ ప్రభుత్వంతో శాంతికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్న వరుస చర్చల కోసం మాస్కో.. తాలిబాన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చింది. అఫ్గన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒక నెల ముందు అనగా జూలైలో కూడా తాలిబన్లు మాస్కోలో పర్యటించారు. అఫ్గనిస్తాన్లో తమ సైనికులను చంపడానికిగాను రష్యా తాలిబన్లకు బహుమతులను అందిస్తుందని అమెరికా ఆరోపించింది. అయితే మాస్కో వీటిని ఖండించింది. చదవండి: ఐరాసలో మాకూ చోటివ్వండి: తాలిబన్లు -
13 మంది హజారాలను తాలిబన్లు అన్యాయంగా చంపేశారు
కైరో: అఫ్గాన్లోని హజారా వర్గానికి చెందిన 13 మందిని తాలిబన్లు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. వీరిలో ఎక్కువమంది తాలిబన్లకు లొంగిపోయిన అఫ్గాన్ సైనికులని వెల్లడించింది. డేకుండి ప్రావిన్స్లోని కహోర్ గ్రామంలో ఆగస్ట్ 30వ తేదీన ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొంది. మృతుల్లో 11 మంది అఫ్గాన్ భద్రతా సిబ్బంది కాగా 17 ఏళ్ల బాలిక సహా ఇద్దరు పౌరులున్నట్లు తెలిపింది. ఈ వార్తలపై వివరణ కోరేందుకు అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధి ఫోన్ ద్వారా యత్నించగా తాలిబన్లు స్పందించలేదు. ‘ఆగస్ట్ 14వ తేదీన డేకుండి ప్రావిన్స్ తాలిబన్ల హస్తగతమైంది. ఖిదిర్ జిల్లాలో 34 మంది సైనికులు తమ ఆయుధాలతో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆగస్ట్ 30న 300 మందితో కూడిన తాలిబన్ కాన్వాయ్ సైనికులున్న గ్రామానికి చేరుకుంది. కుటుంబాలతో పాటు కొందరు సైనికులు అక్కడి నుంచి వెళ్లిపో యేందుకు యత్నించగా తాలిబన్లు విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో ఇద్దరు సైనికులతోపాటు, మసుమా అనే బాలిక, మరో వ్యక్తి చనిపోయారు. మాజీ సైనికుడొకరు జరిపిన కాల్పుల్లో ఒక తాలిబన్ ఫైటర్ చనిపోగా మరొకరు గాయపడ్డారు. అనంతరం, లొంగిపోయిన సైనికుల్లో 9 మందిని తాలిబన్లు సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లి కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధా రాలు మా వద్ద ఉన్నాయి’ అని ఆమ్నెస్టీ తెలిపింది. ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ మాట్లాడుతూ.. ‘హజారాలను దారుణంగా చంపడం తాలిబన్లు మారలేదనడానికి నిదర్శనం. అఫ్గాన్లో గతంలో అధికారంలో ఉండగా పాల్పడిన అకృత్యాలను తిరిగి సాగిస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతం మొత్తంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. గతేడాది యూఎస్కు తాలిబన్లకు మధ్య దోహాలో జరిగిన డీల్లోని పలు అంశాల్లో భారత్ను పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అఫ్గాన్లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావడం, అఫ్గాన్ గడ్డపై ఎలాంటి ఉగ్రమూకలు నివాసం ఏర్పరుచుకోకుండా జాగ్రత్త వహించడమే ప్రస్తుతానికి ఇండియాకు కావాల్సిన అంశాలన్నారు. ఇండో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ సమావేశంలో ఆయన ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. అఫ్గాన్లోని కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడంలో ఇండియాకు ఎలాంటి తొందర లేదన్నారు. యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్తో ఏర్పాటైన క్వాడ్ గ్రూప్ ఏదేశానికి వ్యతిరేకం కాదని, దురుద్దేశాలతో ఏర్పాటైన కూటమి కాదని స్పష్టం చేశారు. అఫ్గాన్ గడ్డను ఉగ్ర అడ్డాగా మార్చకూడదన్న అంశంతో పాటు పలు అంశాల్లో ఇండియా, అమెరికాకు సామ్యాలున్నాయని చెప్పారు. అయితే దోహా డీల్ సందర్భంగా తమను అనేక అంశాల్లో పరిగణనలోకి తీసుకోలేదని ఎత్తిపొడిచారు. అలాంటి ఒప్పందాలు విసృతమైనవిగా ఉండాలని, కానీ ఏం జరుగుతుందో అంతా చూస్తున్నారని పరోక్షంగా అమెరికాను దెప్పిపొడిచారు. అఫ్గాన్లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడుతుందా? మైనార్టీల హక్కులకు రక్షణ కలుగుతుందా? అని ప్రశ్నించారు. అంత రహస్యమెందుకు? దోహాలో యూఎస్, తాలిబన్లకు మధ్య అఫ్గాన్పై ఒప్పందం కుదరింది. దీని ప్రకారం యూఎస్ దళాలు అఫ్గాన్ నుంచి వైదొలుగుతాయి, తాలిబన్లు హింసను వీడతారు. కానీ పాలన చేతికొచ్చాక తాలిబన్ల ప్రవర్తన ప్రశ్నార్ధకంగా మారింది. దీన్నే జైశంకర్ ప్రస్తావించారు. కీలకమైన అంశాలపై నిర్ణయాలకు ముందు ఆచితూచి వ్యవహరించాలని, కానీ సదరు డీల్లో ఏముందో పూర్తిగా అంతర్జాతీయ సమాజంలో ఎవరికీ తెలియదని చెప్పారు. అఫ్గాన్లో ఉగ్ర తండాలకు అభయం చిక్కకూడదన్న అంశాన్ని జోబైడెన్తో ప్రధాని ప్రస్తావించారని తెలిపారు. అఫ్గాన్లో పరిణామాల ప్రభావం దగ్గరగా ఉన్నందున తమపై ముందుగా, అధికంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే సరిహద్దు తీవ్రవాదానికి తాము బాధితులమని గుర్తు చేశారు. పాక్కు సంయుక్త వార్నింగ్ ఇవ్వడంపై అమెరికానే తేల్చుకోవాలన్నారు. క్వాడ్ను నెగిటివ్ ఉద్దేశంతో ఏర్పరచలేదని, చైనాతో తమ దేశాలన్నింటికీ స్థిరమైన సంబంధాలే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా ఎదుగుదల ప్రపంచ నియతిపై మౌలిక ప్రభావం చూపగలదని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఏదేశానికాదేశం తమ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా చైనాతో వ్యవహరిస్తుందన్నారు. -
తాలిబన్ల అరాచకం
-
భారత్కు లేఖ రాసిన తాలిబన్లు
-
Anand Mahindra: తాలిబన్ల ఇలాకాలో ఆ ఛాన్స్ వస్తేనా..
కఠిన ఆంక్షలు, నిషేధాజ్క్షలతో ఒకప్పుడు తాలిబన్లు అఫ్గన్లకు ప్రత్యక్ష నరకం చూపించారు. మళ్లీ వాళ్ల పాలనలో భయంభయంగానే గడపాల్సి వస్తోంది అక్కడి ప్రజలు. పైకి అంతర్జాతీయ సమాజానికి మాత్రం ఒకలా సందేశం ఇస్తూ.. అంతర్గతంగా అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు తాలిబన్లు ఇప్పుడు. మాట కాదన్నా.. ఎదురు తిరిగినా ఉరి తీసి వేలాడేస్తున్నారు. తాజాగా మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరమంటూ ఫత్వా జారీ చేసిన తాలిబన్లు, బార్బర్లు, సెలూన్ నిర్వాహకుల జీవనోపాధిపై పెద్దదెబ్బే వేశారు. ఈ నేపథ్యంలో కొందరు దుకాణాలు మూసేసుకుంటుండగా.. తెగిస్తున్న కొందరికి చావు బెదిరింపులు అందుతున్నాయట. అయితే సమకాలీన అంశాలపై నిత్యం స్పందించే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ఈ సీరియస్ పరిణామంపై తనదైన శైలిలో ఓ ట్విటర్ పోల్ నిర్వహించారు. ఒకవేళ మీరు గనుక అఫ్గనిస్తాన్లో ఓ షేవింగ్ రేజర్ కంపెనీ సేల్స్ పర్సన్ అయ్యి ఉంటే.. ప్రస్తుత పరిణామాలలో ఏం చేస్తారు? అంటూ నాలుగు ఆఫ్షన్లు ఇచ్చారాయన. ఒకటి.. బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కు తిరుగు టపా కట్టడం, రెండు.. ఆ ఆదేశాల్ని మార్చేలా లాబీయింగ్ చేయడం, మూడు.. గడ్డం సంరక్షణ కోసం కొత్త ప్రొడక్ట్ను కనుగొనడం, నాలుగు.. మీ ముందు ఇంకేమైనా మార్గం ఉందా? అని అడిగారు. అఫ్కోర్స్.. దానికి నెటిజన్స్ కూడా అంతే ఫన్నీగా రిప్లైలు ఇస్తున్నారనుకోండి. Imagine you’re a salesperson in Afghanistan for a Shaving Razor company, which of the following options would you pursue? 1) Pack your bags, head for the Airport 2) Lobby for a modification in this order 3) Invent a disruptive new product for beard-care 4) Other? https://t.co/MVIO9wUShu — anand mahindra (@anandmahindra) September 27, 2021 I will introduce new range of Beard care and essential… like Gillett did from sword to razor 🪒 — Saurabh Jain (@mrsaurabhj) September 27, 2021 Color for Beard -- time for Godrej to put up Hair Dye color factory :-) — Equiideas (@Equiideas09) September 27, 2021 Will take over and start manufacturer of gun 😃 — InduKalpa (ইন্দুকল্প) (@indukalp) September 27, 2021 Here we have options to choose But their they don't have any option They only have rules to follow 😜 — Sumit Koushik (@sumitkoushik1) September 27, 2021 ‘Others’ option includes hand cutting, limbs cutting & death by hanging from crane. So choose your option carefully if opting for OTHERS. — Devesh Dhingra (@Dev_Dh14) September 27, 2021 ఇదిలా ఉంటే అఫ్గన్ హెల్మండ్ ప్రావిన్స్లో మగవాళ్లు స్టైల్గా క్రాఫ్ చేయించుకోవడం, గడ్డం తీసేయడాన్ని నిషేధిస్తూ ఫత్వా జారీ చేసింది తాలిబన్ సంస్థ. అంతేకాదు ఇస్లామిక్ ఓరియెంటేషన్ మంత్రిత్వ శాఖ సెలూన్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి.. కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు ఆ ఆదేశాల్ని ఎదురు ప్రశ్నించడానికి వీల్లేదని కూడా పేర్కొంది. ఇక ఆ ఆదేశాల్లో సెలూన్లలో పాటల్ని ప్లే చేయకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మరో బాంబు పేల్చిన తాలిబన్లు -
ఆఫ్గనిస్థాన్ లో మళ్లీ అరాచక పాలన
-
ఐరాసలో మాకూ చోటివ్వండి: తాలిబన్లు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ దేశాల అంతర్జాతీయ కూటమి అయిన ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో తామకూ భాగస్వామ్య పాత్ర పోషించే అవకాశమివ్వాలని తాలిబన్లు విన్నవించుకున్నారు. తమ శాశ్వత ప్రతినిధి, దోహాకు చెందిన సుహైల్ షాహీన్ ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించేందుకు అనుమతినివ్వాలని తాలిబన్లు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్కు తాలిబన్లు లేఖ రాశారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని గత సర్కార్ కూలిపోయిందని, ఇక మీదట ఐరాసలో అఫ్గాన్ శాశ్వత ప్రతినిధిగా సుహైల్ను కొనసాగించాలని ఆ దేశ విదేశాంగ శాఖ నుంచి 20న లేఖ వచ్చిందని ఐరాసలో ఉన్నతాధికారి ఫర్హాన్ హక్ వెల్లడించారు. తమ ప్రతినిధి బృందం ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు, అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్కు మాట్లాడే అవకాశమివ్వాలని తాలిబన్లు కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఘనీ ప్రభుత్వ హయాంలో ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా నియమించబడిన గ్రామ్ ఇసాక్జాయ్ ఇంకా ఐరాసలో కొనసాగుతున్న నేపథ్యంలో తాలిబన్ల ప్రతిపాదన కొత్త సమస్య తెచ్చిపెట్టేలా ఉంది. సర్వ సభ్య సమావేశంలో 193 సభ్య దేశాలకు ఈ విషయం తెలియజేశామని, 27న ‘అఫ్గాన్’ సీటు వద్ద ఎవరిని ప్రతినిధిగా సమావేశాల్లో కూర్చోబెట్టాలో ఇంకా నిర్ణయించలేదని ఐరాస ఉన్నతాధికారి ఫర్హాన్ చెప్పారు. తాలిబన్లను బహిష్కరించకండి: ఖతార్ అఫ్గాన్ సంక్షోభంలో మధ్యవర్తి పాత్ర పోషించిన ఖతార్ ఈ విషయంలో స్పందించింది. ‘ అఫ్గాన్తో దౌత్య సంబంధాలు కొనసాగాలంటే తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. వారిని బహిష్కరించకూడదు. అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వం తరఫున శాశ్వత ప్రతినిధిని ఈ సమావేశాల్లో అనుమతించాలి’ అని న్యూయార్క్లో సర్వ సభ్య సమావేశంలో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన టర్కీ అధ్యక్షుడు 74 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కశ్మీర్ అంశాన్ని భారత్–పాక్లు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస వేదికగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగన్ బుధవారం మరోసారి లేవనెత్తారు. అయితే, గతంలోనూ ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. -
తాలిబన్ ప్రభుత్వ పెద్దలతో... చైనా, రష్యా, పాక్ మంతనాలు
బీజింగ్: చైనా, రష్యా, పాకిస్తాన్కు చెందిన ప్రత్యేక రాయబారులు అఫ్గానిస్తాన్లోని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వ అత్యున్నత ప్రతినిధులతో సమావేశమయ్యారు. అఫ్గాన్ రాజకీయ ప్రముఖులు హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లాతోనూ వారు భేటీ అయ్యారు. రాజధాని కాబూల్లో ఈ సమావేశాలు జరిగినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా అఫ్గాన్లో సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, ఉగ్రవాదంపై పోరాటం, ప్రజల పరిస్థితిపై చర్చ జరిగిందని తెలిపారు. మూడు దేశాల ప్రత్యేక రాయబారులు ఈ నెల 21, 22న అఫ్గాన్లో పర్యటించారని, ప్రధానమంత్రి మొహమ్మద్ హసన్ అఖుంద్తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో చర్చలు జరిపారని పేర్కొన్నారు. ‘అఫ్గాన్లోని తాజా పరిణామాలపై మూడు దేశాల ప్రత్యేక రాయబారులతో మా అభిప్రాయాలను పంచుకున్నాం. మా దేశంలో శాంతి, స్థిరత్వం, సమ్మిళిత ప్రభుత్వం కోసం ఇరుగుపొరుగు దేశాలు పొషిస్తున్న పాత్రను స్వాగతిస్తున్నాం’’అని అఫ్గాన్ నాయకుడు అబ్దుల్లా అబ్దుల్లా ట్వీట్ చేశారు. అఫ్గాన్ను గత నెలలో తాలిబన్లు మళ్లీ ఆక్రమించిన తర్వాత హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లాను విదేశీ రాయబారులు కలవడం ఇదే మొదటిసారి. -
మూడే రోజులు... ఎన్నో అంశాలు
కీలక సందర్భంలో జరుగుతున్న కీలకమైన సమావేశాలు. అత్యంత కీలకమైన పర్యటన. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటన సందర్భాన్ని ఒక్క ముక్కలో వర్ణించాలంటే – అంతే. రానున్న మూడు రోజుల్లో అమెరికా అనేక ప్రధానమైన ఘట్టాలకు వేదికగా నిలవనుంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల సదస్సు, ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వప్రతినిధి సభ సమావేశం, వివిధ దేశాల అంతర్జాతీయ నాయకులతో మోదీ సంభాషణలు, చర్చలతో అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షించనుంది. కోవిడ్ మహ మ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టాక పెద్దయెత్తున అంతర్జాతీయ నేతలు భౌతికంగా ఒకచోట చేరి, సంభాషించడం ఇదే తొలిసారి. అఫ్గానిస్తాన్లో తాలిబన్ల రాజ్యం లాంటి తాజా పరిణామాలతో పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు లాంటివి ఈ మూడు రోజుల పర్యటనను భారత్కు ప్రధానమైనవిగా మార్చాయి. ఇటు బైడెన్తో వ్యక్తిగత భేటీలో, అటు ఐరాస సమావేశంలో దేశ ప్రయోజనాలను సమున్నతంగా నిలబెట్టడానికి మోదీ బృందం కసరత్తు చేసుకొని మరీ వెళుతోంది. గడచిన కొన్ని నెలలుగా వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ ప్రాధాన్యమున్న సమావేశాలు అనేకం వర్చ్యువల్గా సాగుతూనే ఉన్నాయి. ఇదే ‘క్వాడ్’ దేశాల సమావేశం ఈ మార్చిలో ఆన్లైన్ లోనూ సాగింది. ఈ నెల 17న షాంఘై సహకార మండలి సమావేశమూ జరిగింది. అంతకంతకూ పెద్దదవుతున్న ఉగ్రవాద భూతం గురించి అందులోనూ భారత్ లేవనెత్తింది. అయితే, ఈసారి భౌతిక సమావేశంలో దాన్ని మరింత బలంగా అందరి ముందుకూ తీసుకురానుంది. గత క్వాడ్ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను ముందుకు తీసుకెళ్ళే చొరవ ఇప్పుడు మనదే. పేద దేశాలను కోవిడ్ టీకాలతో ఆదుకొనే అంశానికి నిర్దిష్టమైన చర్యల అజెండా ఖరారు కానుంది. ఈ క్రమంలో ఇండో–పసిఫిక్, అఫ్గాన్ సమస్యలను పరిశీలిస్తూనే, చైనాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయవచ్చు. మరోపక్క యాపిల్ సహా అమెరికాలోని ప్రసిద్ధ సంస్థల సీఈఓలతోనూ మోదీ సమావేశ మవుతున్నారు. భారత, అమెరికాల మధ్య బంధాన్ని పటిష్ఠం చేయడం ఆయన ముందున్న సవాలు. నిజానికి, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలసి ‘హౌడీ మోడీ’ సభలో పాల్గొని, మోదీ ప్రసంగించారు. మోదీ ప్రాచుర్యం ఎన్నికల్లో తనకు కలిసొస్తుందని ట్రంప్ ఆశ పడ్డారు కూడా! తీరా ట్రంప్పై బైడెన్ విజయం సాధించారు. ఆ తరువాత అమెరికాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. భారత–అమెరికా ద్వైపాక్షిక సంబం ధాలపై బైడెన్తో మోదీ లోతుగా చర్చించనున్నారు. డెబ్భై రెండేళ్ళ క్రితం 1949లోనే రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య మొదలైన ద్వైపాక్షిక సంబంధాలకు ఇది కీలకమైన కొనసాగింపు కావాల న్నది భారత ఆకాంక్ష. అమెరికా తొలి మహిళా వైస్–ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ను మోదీ కలుసు కోనున్నారు. ఇక, ఐరాస సర్వప్రతినిధి సభ 76వ సమావేశం సోమవారమే న్యూయార్క్లో ఆరం భమైంది. ఇది కూడా కరోనా అనంతర ప్రపంచంలో ఐరాస ప్రతినిధులందరూ పాల్గొంటున్న తొలి సమావేశాలు. రానున్న నవంబర్లో గ్లాస్గోలో కీలకమైన ‘ఐరాస వాతావరణ మార్పు సదస్సు’ (సీఓపీ 26) జరగాల్సి ఉంది. దానికి ముందస్తు సన్నాహంగా ఈ తాజా సమావేశం వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి అంశాలపై దృష్టి పెడుతోంది. ఇందులోనూ భారత్ది ప్రధాన భూమికే. అలాగే, మానవీయ సంక్షోభాన్ని నివారించడం కోసం అఫ్గాన్లోని కొత్త తాలిబన్ ప్రభు త్వంతో వ్యవహరించాల్సిన తీరుపై ఐరాస ఇచ్చిన పిలుపునకు వివిధ దేశాలు స్పందించనున్నాయి. తాలిబన్ల ద్వారా తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్న పాకిస్తాన్ దురాలోచనకు అంతర్జాతీయ మద్దతుతో గండి కొట్టడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. అమెరికాను మంచి చేసుకుంటూనే, అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోవడం అవసరమైన ఈ పర్యటన ప్రాధాన్యం మన సర్కారుకు తెలుసు. అందుకే మోదీ సర్కారు టెలికమ్ రంగంలో అంతర్జాతీయ సంస్థలకు ఎదురైన ఇక్కట్ల అంశంపై అర్జెంటుగా దృష్టిపెట్టింది. మూడు ప్రైవేటు టెలికమ్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర ఇటీవల కేంద్రం భారీ రాయితీలివ్వడం ఈ అమెరికా పర్యటనలో మార్కుల కోసమేనని పరిశీలకుల వాదన. అంతర్జాతీయ కోవిడ్ నివారణ చర్యలూ చర్చకు రానున్న నేపథ్యంలో పర్యటనకు రెండు రోజుల ముందు భారత్ మళ్ళీ టీకాల ఎగుమతిని ప్రకటించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా ఈ అక్టోబర్ నుంచి టీకాల ఎగుమతిని పునఃప్రారంభిస్తున్నట్టు భారత్ తెలిపింది. 2019 సెప్టెంబర్ అమెరికా పర్యటనలో ‘అబ్కీ బార్... ట్రంప్ సర్కార్’ అంటూ ట్రంప్ను గెలిపించాలంటూ ప్రవాసు లకు మోదీ పిలుపునిచ్చారు. సహజంగానే ఆ మాట డెమోక్రటిక్ పార్టీ యంత్రాంగానికి రుచించ లేదు. బైడెన్ సారథ్యంలోని డెమోక్రటిక్ ప్రభుత్వం మన జమ్మూకశ్మీర్లోని మానవహక్కుల లాంటి అంశాలపై గట్టిగానే గొంతు విప్పుతూ వస్తోంది. ఇప్పుడు డెమోక్రాట్ సర్కారుకు దగ్గరవడానికి మనం గట్టి ప్రయత్నమే చేస్తున్నాం. ఈ మూడు రోజుల పర్యటన అందుకు బలమైన పునాది వేసే సూచనలున్నాయి. అమెరికాతో దోస్తీతో ఉపఖండంలో చైనాకు చెక్ పెడుతూనే, అమెరికన్ మూసలో ఇరుక్కుపోకుండా భారత ప్రయోజనాలను కాపాడుకోవడమే ఇప్పుడు కీలకం. ఈ సమన్వయ, సమ తూక దౌత్యవిన్యాసమే ఇప్పుడు మోదీ బృందానికి ఉన్న పెనుసవాలు. -
Afghanistan: అఖుండ్జాదా హతం.. బందీగా బరాదర్?!
రెండు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే ఎవరైనా ప్రజల ముందు ప్రత్యక్షమవుతారు. కానీ అఫ్గాన్లో తాలిబన్ల అగ్రనాయకత్వం మాత్రం దేశం స్వాధీనమైనా బయటకు కనిపించకుండా రహస్యంగానే ఉంటోంది. ఇది వారి ప్రణాళికలో భాగమా? లేక దేశం వశమయ్యాక పరోక్ష శక్తులు తాలిబన్లను దెబ్బతీశాయా? అదే నిజమైతే తాలిబన్ అధినేతలు ఇకపై కనిపించరా? హక్కానీ నెట్వర్క్ చేతుల మీదుగా అఫ్గాన్ను పాక్ పాలిస్తుందా? అనే అంతుచిక్కని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వీటికి సమాధానాల కోసం అన్వేషిస్తున్న పాశ్చాత్య మీడియా తాజాగా విడుదల చేస్తున్న కథనాలపై అనుమానాలు నిజమవుతున్నాయనే చెబుతున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, తాలిబన్లు అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. దేశం స్వాధీనం కాగానే తాలిబన్లు తమ అగ్రనేతలతో కూడిన ప్రభుత్వాన్ని ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అఫ్గాన్లో పాగా వేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనకు తాలిబన్లు చాలా సమయం తీసుకున్నారు. చివరకు మల్లగుల్లాల అనంతరం ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. అయితే ఇందులో తాలిబన్లకు కాకుండా హక్కానీ నెట్వర్క్ నేతలకు పెద్దపీట వేయడం జరిగింది. దీంతో అఫ్గాన్ అంతర్గత పరిణామాలపై ప్రపంచ దేశాలు మరింత శ్రద్ధ పెట్టాయి. సదరు తాత్కాలిక ప్రభుత్వాన్ని అనేక దేశాలు గుర్తించలేదు. ఒకపక్క ఇంత హడావుడి జరుగుతున్నా, తాలిబన్ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్జాదా మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. నిజానికి ఆయన నాయకత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనుకున్నారు. కానిపక్షంలో యూఎస్తో శాంతి చర్చల్లో కీలకపాత్ర పోషించిన బరాదర్ ప్రధాని అవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పెద్దగా గుర్తింపులేని ముల్లా హసన్ను ప్రధానిగా ప్రకటించారు. దీంతో అసలు తాలిబన్ నేతలకు ఏమైందన్న ప్రశ్నలు ఉదయించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ద స్పెక్టేటర్ అనే పాశ్చాత్య మీడియాలో వెలువడిన కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. బరాదర్ను బందీ చేసి ఉంటారని, అఖుండ్జాదా చనిపోయి ఉంటారని ఈ కథనం పేర్కొంది. గతంలో గార్డియన్ సైతం ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేసింది. కాబూల్ గొడవే కారణమా? ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాబూల్ అధ్యక్ష భవనంలో హక్కానీలకు, తాలిబన్లకు మధ్య గొడవ జరిగిందని, ఈ గొడవలో బరాదర్ తీవ్రంగా గాయపడ్డాడని కథనాలు వచ్చాయి. కానీ తాను బాగానే ఉన్నానంటూ బరాదర్ ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. అనంతరం కొందరితో కలిసి ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. అయితే ఈ వీడియో చూస్తే అందులో బరాదర్ను బందీగా ఉంచినట్లు కనిపిస్తోందని మీడియా వర్గాలు అనుమానిస్తున్నాయి. సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు కోసం యత్నించడం, పంజ్షీర్పై శాంతియుత పరిష్కారాన్ని కోరడం వంటి బరాదర్ చర్యలు నచ్చని హక్కానీ నెట్వర్క్ ఆయనపై దాడి చేసి అనంతరం బంధించిందని కథనాలు వచ్చాయి. అదేవిధంగా తాలిబన్ అగ్రనేత అఖుండ్జాదాను హతమార్చిఉండొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. లేదంటే వీరిద్దరూ ఈపాటికి బయటి ప్రపంచానికి కనిపించేవారని, హక్కానీ నెట్వర్క్ వీరిని మాయం చేసిందని చాలామంది భావిస్తున్నట్లు స్పెక్టేటర్ కథనం పేర్కొంది. గతంలో ముల్లా ఒమర్ 2013లో మరణిస్తే 2015వరకు బయటకు చెప్పని వైనాన్ని గుర్తు చేసింది. ఇదంతా పాక్ పరోక్షంగా ఆడిస్తున్న నాటకంగా విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలిపింది. తాలిబన్ల కన్నా తమకు అనుకూల హక్కానీ నెట్వర్క్ నేతల చేతిలో అఫ్గాన్ ప్రభుత్వం ఉండడం పాక్కు కావాలని, అందుకే ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనకు ముందు ఐఎస్ఐ చీఫ్ అఫ్గాన్కు వచ్చారని గుర్తు చేసింది. పాక్ కుయుక్తులు అర్థం చేసుకోకుండా తాలిబన్లు గుడ్డిగా నమ్మారని గత ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అమ్రుల్లా చాలాసార్లు విమర్శించారు. తాజా కథనాలు చూస్తే అదే నిజమైందని, పాక్ చేతికి అఫ్గాన్ పాలనా పగ్గాలు పరోక్షంగా వచ్చాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
Afghanistan: మహిళా సిబ్బంది ఇళ్ల వద్దే ఉండాలి
కాబూల్: అఫ్గనిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు మునుపటి నిరంకుశ విధానాలను ఒక్కటొక్కటిగా తెరపైకి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు.. తాజాగా రాజధాని కాబూల్ పాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక మేయర్ హమ్దుల్లా నమోనీ ఆదివారం తన మొట్టమొదటి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘మహిళా సిబ్బందిని ప్రస్తుతానికి ఇళ్ల వద్దే ఉండిపోవాలని కోరాము. మరో ప్రత్యామ్నాయం లేనందున డిజైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాలతోపాటు మహిళల టాయిలెట్ల వద్ద పనిచేసే వారిని మాత్రం విధులకు హాజరు కావాలని కోరాం’ అని అన్నారు. అయితే, మొత్తం సిబ్బందిలో ఎందరిని ఇళ్లకు పరిమితం చేసిందీ ఆయన వెల్లడించలేదు. కాబూల్ నగర పాలక సంస్థలో సుమారు 3 వేల మంది పనిచేస్తుండగా అందులో వెయ్యి మంది వరకు మహిళలున్నట్లు అంచనా. కాగా, తాలిబన్ల నిర్ణయంపై ఉద్యోగినులు కాబూల్లో ఆదివారం నిరసన తెలిపారు. తమ హక్కులను తాలిబన్లు లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు స్వేచ్ఛ లేని సమాజం మృత సమాజంతో సమానమన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాయబార కార్యాలయాలు, నేతల ప్రైవేట్ నివాసాల వద్ద ఉన్న భద్రతా వలయాలను తొలగిస్తున్నట్లు మేయర్ హమ్దుల్లా తెలిపారు. కాబూల్లో పౌరుల రక్షణకు తమదే బాధ్యతని చెప్పుకునేందుకు, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, మద్దతు చూరగొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. చదవండి: కాబూల్ ఆత్మాహుతి బాంబర్ భారత్ అప్పగించిన వ్యక్తి అఫ్గన్ నిజమైన సంస్కృతి ఇదే.. ‘నా దుస్తుల జోలికి రావొద్దు’ -
తాలిబన్లతో చర్చిస్తున్నా: పాక్ ప్రధాని ఇమ్రాన్
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఇందుకోసం తాలిబన్లతో చర్చలు ప్రారంభించానని తెలిపారు. తజకీలు, హజారాలు, ఉజ్బెక్లకు ప్రభుత్వంలో వాటా ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. అయితే, చర్చల వివరాలను ఆయన బయటపెట్టలేదు. చదవండి: లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు ప్రజల హక్కులను గౌరవం లభించేలా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని తాలిబన్లకు ఇమ్రాన్ హితవు పలికారు. అఫ్గాన్ గడ్డ మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మారొద్దని చెప్పారు. అఫ్గానిస్తాన్లోని కొత్త ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా పాకిస్తాన్ చొరవ చూపాలంటూ షాంఘై కో–అపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సభ్య దేశాలు కోరిన మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రకటన చేయడం విశేషం. తాలిబన్ల ప్రభుత్వ మంత్రివర్గంలోని 33 మందిలో తజకీలు, మహిళలకు ప్రాతినిథ్యం దక్కకపోవటం గమనార్హం. చదవండి: అమెరికాపై ఫ్రాన్స్ ఆగ్రహం -
అఫ్గాన్ లో ఆకలి కేకలు
-
తాలిబన్ల తలపట్లు
ఇల్లు అలకగానే పండుగ కాదు, ముందుంది మొసళ్ల పండుగ... ఇలాంటి సామెతలన్నీ తాలిబన్లకు వర్తించేలా పరిస్థితులు మారుతున్నాయి. అఫ్గాన్ను స్వా«దీనం చేసుకున్న ఆనందం ఆవిరవడానికి తాలిబన్లకు ఎక్కువ సమయం పట్టడం లేదు. తాత్కాలిక ప్రభుత్వంలో వివిధవర్గాలకు ప్రాతినిధ్యం వహించే నేతల మధ్య సయోధ్య కరువవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అఫ్గాన్ను అమెరికా సైన్యాలు వదిలిపోవడంతో అలవోకగా స్వాదీనం చేసుకున్న తాలిబన్లు.. అది తమ ఘనవిజయంగా భావించారు. కానీ దేశానికి ఆధిపత్యం వహించే విషయంలో అగ్రనేతల మధ్య ఆరంభమైన కుమ్ములాటలు అఫ్గాన్ స్వాధీన విజయాన్ని ఆవిరి చేస్తున్నాయి. నిజానికి బయటనుంచి చూసేవారికి తాలిబన్లంతా ఒకటేనని, వారి సిద్ధాంతాల్లో తేడాలుండవని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అన్ని పారీ్టల్లాగానే తాలిబన్లలో కూడా వర్గాలు, గ్రూపులు, అభిప్రాయభేదాలు, కుమ్ములాటలు బోలెడున్నాయని తాలిబన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు అజ్ఞాతంలో బతుకుతూ అమెరికాతో యుద్దం చేయాల్సిరావడం వల్ల ఈ వర్గాలు, భేదాభిప్రాయాలు బయటపడలేదు. కానీ ఎప్పుడైతే దేశం స్వాదీనమై పాలనా పగ్గాలు చేతికి వచ్చాయో వీరిలో విభేదాలు ముదురుతున్నాయి. ఉమ్మడి శత్రువు మొఖం చాటేయగానే తాలిబన్లలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ మంటలు ముదిరి సోమవారం రెండువర్గాల మధ్య అధ్యక్ష భవనంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తాలిబన్ అగ్రనేత, సహవ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ మరణించాడని పుకార్లు షికారు చేశాయి. కానీ తాను బతికే ఉన్నానని బరాదర్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అయినా సరే తన పరిస్థితిపై అయోమయం నెలకొంది. (చదవండి: ప్రభుత్వ ఏర్పాటుతో వేర్పాటు బీజాలు అఫ్గాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగానే బరాదర్ నాయకుడిగా ఉంటారని ఎక్కువమంది భావించారు. అమెరికాతో చర్చలు జరిపి, వారి సేనలు వెనక్కుమరలిపోయేలా చేయడంలో బరాదర్ కీలకపాత్ర పోషించాడు. దీనికితోడు అతను ముల్లాఒమర్కు సన్నిహితుడు. ఖతార్తో తనకు సత్సంబంధాలున్నాయి. అందుకే సహజంగా బరాదరే ప్రధాని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అఖుండ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని అఫ్గాన్ పరిణామాల విశ్లేషకుడు నైమతుల్లా ఇబ్రహిమి అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వంలో కాందహార్కు చెందిన పాతతరం తాలిబన్లతో పాటు అల్కాయిదా, పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలున్న హక్కానీలకు పెద్దపీట దక్కింది. ఇరాన్ అండ ఉన్న పశ్చిమ తాలిబన్ గ్రూపునకు అసలు ప్రాధాన్యమే దక్కలేదు. గతంలో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాందహార్ గ్రూపుదే ప్రభుత్వంలో ఆధిపత్యం ఉండేది. కానీ తాజా ప్రభుత్వంలో హక్కానీలకు ప్రాధాన్యత పెరిగింది. ఐఎస్ఐ అండదండలే హక్కానీల బలం పెరిగేందుకు కారణమయ్యాయని నైమతుల్లా చెప్పారు. హక్కానీల నేత సిరాజుద్దీన్ తలపై అమెరికా కోటి డాలర్ల బహుమతి ప్రకటించింది. కానీ ప్రస్తుతం సిరాజుద్దీన్ అఫ్గాన్ ప్రభుత్వంలో కీలకమంత్రి అయ్యారు. ఇది పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని అంశం. (చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్బాల్ జట్టు) ఉమ్మడి ప్రభుత్వమే శరణ్యం? హక్కానీల ప్రాధాన్యత పెరగడం వల్లనే అఫ్గాన్ ప్రభుత్వాన్ని యూఎస్, మిత్రపక్షాలు గుర్తించడంలో జాప్యం చేయడం, అమెరికాలోని అఫ్గాన్ బ్యాంకు నిధులు విడుదల చేయకుండా తొక్కిపట్టడం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీన్ని బరాదర్ వైఫల్యంగా హక్కానీలు ఎత్తిచూపుతున్నారు. అయితే ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చినందుకు ఈ విషయంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని బరాదర్ వర్గం భావిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం గుర్తించకపోతే అఫ్గాన్కు ఆర్థిక సాయం అందదు. దీంతో దేశం తీవ్ర సంక్షోభంలో మునిగే ప్రమాదం ఉంది. దీన్ని పట్టించుకోకుండా తాలిబన్– హక్కానీలు సిగపట్లు పడుతున్నారు. ఇది కేవలం అఫ్గాన్కే కాకుండా పొరుగుదేశాలకు కూడా ప్రమాదం తెస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్లోని పలు వర్గాలను ప్రభుత్వంలో చేర్చుకోకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందని, దీనివల్ల తిరిగి దేశంలో అంతర్యుద్ధం ఆరంభం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్యుద్ధమే ఆరంభమైతే మరలా రష్యా, ఇరాన్, ఇతర దేశాలు తమ అనుకూల గ్రూపులకు సాయం చేయడం మొదలుపెడతాయి. దీంతో మరోమారు అఫ్గాన్లో హింసాత్మక పోరు పెచ్చరిల్లుతుందని నైమతుల్లా అభిప్రాయపడ్డారు. మరి ఇప్పటికైనా తాలిబన్లు, హక్కానీలు భేదాభిప్రాయాలు మరిచి ఇతర గ్రూపులకు కూడా ప్రభుత్వంలో స్థానం కల్పిస్తాయా? లేక గ్రూపు రాజకీయాలను పెంచుతాయా? అని అన్ని దేశాలు ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘ఔకస్’ ప్రమాద ఘంటికలు
ఇప్పటికే అనేకానేక కూటములతో కిక్కిరిసివున్న ప్రపంచంలోకి మరో సైనిక కూటమి అడుగు పెట్టింది. గత కొన్నేళ్లుగా చైనా పోకడలతో స్థిమితం లేకుండా పోయిన అమెరికాయే ఈ కొత్త కూటమి పుట్టుకకు కూడా కారణం. ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలున్న ఈ త్రైపాక్షిక కూటమిని ఆ దేశాల పేర్లు గుదిగుచ్చి ‘ఔకస్’గా వ్యవహరించబోతున్నారు. అఫ్గానిస్తాన్లో రెండు దశాబ్దాలపాటు తిష్టవేసి సాగించిన యుద్ధం ఆశించిన ఫలితం ఇవ్వకపోగా, తాలిబన్ల ధాటికి కకావికలై అవమానకర రీతిలో నిష్క్రమించాల్సివచ్చిన అమెరికాకు ఈ కొత్త కూటమి ఓదార్పునిచ్చే మాట వాస్తవమే. కానీ మూడు దేశాల అధినేతలూ కూటమి ఏర్పాటు గురించి ప్రకటించిన కాసేపటికే చైనా సంగతలావుంచి... మిత్ర పక్షాలైన ఫ్రాన్స్, యూరొపియన్ యూనియన్(ఈయూ)లనుంచి వినబడిన అపస్వరాలు రాగల రోజుల్లో ఆసక్తికర పరిణామాలు సంభవించబోతున్నాయన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. ఏడు దశాబ్దాలపాటు పూర్వపు సోవియెట్ యూనియన్, అమెరికాల మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధం బెడద 90వ దశకం నుంచి తొలగిందని అందరూ అనుకుంటుండగా ఈ ఏడాది మార్చిలో చతుర్భుజ కూటమి(క్వాడ్) దేశాల తొలి శిఖరాగ్రం జరిగింది. దానిపై కొంత ‘నాగరికంగా’ స్పందించిన చైనా... ఈసారి మాత్రం అన్ని మొహమాటాలనూ, దౌత్య మర్యాదలను వదిలి ఆస్ట్రేలియానుద్దేశించి బెదిరింపులకు దిగింది. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక అయిన ‘గ్లోబల్ టైమ్స్’ సంపాదకీయం ద్వారా గట్టి హెచ్చరికలే పంపింది. భౌగోళికంగా చూస్తే చైనా, ఆస్ట్రేలియాల మధ్య ఏ రకమైన పొర పొచ్చాలూ లేవని, కానీ ఆస్ట్రేలియా తనంత తానుగా చైనా–అమెరికాల వైరంలో తలదూర్చి కొరివితో తలగోక్కుంటున్నదని దాని సారాంశం. అమెరికా అండ చూసుకుని సైనిక దుస్సాహసానికి పాల్పడితే చైనా ‘నిర్దాక్షిణ్యం’గా బదులుతీర్చుకోవడం ఖాయమని బెదిరించింది. బహుశా దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రాణాలను వృథా చేసుకునే పాశ్చాత్య సైనిక పటాలంలో తొలి వంతు ఆస్ట్రేలియాదే కావొచ్చని కూడా విస్పష్టంగా సంకేతాలు పంపింది. చైనా ఆగ్రహావేశాల మాట అటుంచి ఆస్ట్రేలియా ఈ కూటమికి సై అనడం ప్రపంచ దేశాలన్నిటికీ ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి అమెరికా ప్రమేయం ఉన్న కూటముల్లో ఆస్ట్రేలియాకు సభ్యత్వం ఉండటం కొత్తేమీ కాదు. 1941లో అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్లతో పాటు ‘ఫైవ్ ఐస్’(అయిదు నేత్రాల) కూటమిలో అది కూడా భాగస్వామి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఏర్ప డిన‘అంజుస్’లోనూ అది కొనసాగుతోంది. క్వాడ్లో సరేసరి. అందులో అమెరికా, భారత్, జపాన్ లతోపాటు అది కూడా ఉంది. అయితే ఈ మూడు కూటముల తీరుతెన్నులూ వేరు. ఫైవ్ ఐస్ అప్పటి సోవియెట్ యూనియన్పై నిఘా పెట్టి ఆ సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. అంజుస్ రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్కు వ్యతిరేంగా అమెరికా, బ్రిటన్ల కోసం ఏర్పడింది. క్వాడ్ చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన కూటమి. కానీ కొత్తగా అడుగుపెట్టిన ‘ఔకస్’ ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాములను సమకూర్చాలని నిర్ణయించింది. అదే చైనాకు ఆగ్రహం కలిగిస్తున్న అంశం. ఇది కేవలం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించిందేనని ఆ దేశం రగిలిపోతోంది. కారణాలు వేరైనా ఫ్రాన్స్కు సైతం అమెరికా, ఆస్ట్రేలియాల పోకడలు ఏమాత్రం నచ్చడం లేదు. తనతో డీజిల్–విద్యుత్లతో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఆస్ట్రేలియా 4,300 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుని...ఆ ప్రాజెక్టుపై దాదాపు 1,800 కోట్ల డాలర్లు వ్యయం చేశాక ఏకపక్షంగా దాన్నుంచి తప్పుకోవటం ఫ్రాన్స్ ఆగ్రహావేశాలకు కారణం. అవసరమైన ఆహారం, మంచినీరు ఉన్నంతకాలం సముద్ర జలాల్లో గుట్టుచప్పుడు కాకుండా సంచరించడానికి వెసులుబాటుండే అణు శక్తి జలాంతర్గాముల ముందు... ఆక్సిజెన్ కోసం పదే పదే ఉపరితలానికి రాకతప్పని స్థితిలో ఉండే డీజిల్–విద్యుత్ జలాంతర్గాములు సురక్షితమైనవి కాదని ఆస్ట్రేలియా అభిప్రాయపడుతోంది. అటు వేల కోట్ల డాలర్ల కాంట్రాక్టును మిత్ర దేశమన్న మర్యాద కూడా లేకుండా అమెరికా సొంతం చేసుకుందన్న బాధ ఫ్రాన్స్ను పీడిస్తోంది. ఈయూ అభ్యంతరం వేరు. ఇన్ని దశాబ్దాలుగా నాటో కూటమి ద్వారా తమ వల్ల ప్రయోజనం పొందిన అమెరికా మాట మాత్రమైనా చెప్పకుండా భిన్నమైన బాట పట్టడం ఈయూ సహించలేకపోతోంది. ఈయూ నుంచి బయటికొచ్చాక బ్రిటన్ తీసుకున్న అతిపెద్ద వ్యూహా త్మక నిర్ణయం ఈ ‘ఔకస్’. అమెరికా సాంకేతికతతో తమ దేశంలోనే ఈ జలాంతర్గాముల నిర్మాణం జరుగుతుంది గనుక దానికిది లాభసాటి బేరం కూడా. అయితే ఒకటి మాత్రం నిజం. పోఖ్రాన్లో మనం అణుపరీక్ష జరిపినప్పుడు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించామని ఆరోపిస్తూ తమ రక్షణ రంగ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భారత శాస్త్రవేత్తలను గంటల్లో దేశం వదిలిపోవాలని గెంటేసిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఆ ‘చాదస్తం’ ఎందుకు వదిలిపెట్టాల్సివచ్చిందో సంజాయిషీ ఇవ్వాల్సివుంది. డోనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణ యాలు ఈయూ దేశాలను క్రమేపీ అమెరికాకు దూరం చేశాయి. అమెరికాను కాదని అవి రష్యాతో గ్యాస్ పైప్లైన్పై ఒప్పందానికొచ్చాయి. ఇప్పుడు బైడెన్ ఆవిష్కరించిన ‘ఔకస్’ వాటిని మరింత దూరం చేయడం ఖాయం. ఈ పరిణామంతో మున్ముందు పునరేకీకరణలు ఎలా ఉంటాయో, ఎవరు ఏ శిబిరంలో చేరతారో... వాటి పర్యవసానాలేమిటో చూడాల్సి వుంది. అయితే ‘ఔకస్’ పూర్తి స్థాయిలో అమలైతే రాజుకునే ఘర్షణలు ఆసియా ఖండ దేశాలన్నిటినీ చుట్టుముట్టడం ఖాయం. -
తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్బాల్ జట్టు
ఇస్లామాబాద్: అఫ్ఘానిస్తాన్ మహిళల ఫుట్బాల్ జట్టు సురక్షితంగా పాకిస్తాన్ చేరుకుంది. తాలిబన్ ప్రభుత్వం నుంచి మహిళా ఫుట్బాలర్లకు ముప్పు ఉండటంతో 32 మంది తమ కుటుంబసభ్యులతో సహా పొరుగుదేశం పాక్లో అడుగుపెట్టారు. నిజానికి ఈ జట్టు ఖతర్కు బయల్దేరాలనుకుంది. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడికి వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో తాలిబన్ల కళ్లుగప్పి పాక్కు చేరుకుంది. తాలిబన్ సర్కారు పురుషుల క్రీడలకు అనుమతించినప్పటికీ మహిళలు షరియా చట్టాల ప్రకారం ఆటలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై మహిళా ఫుట్బాలర్లు విమర్శలకు దిగడంతో తాలిబన్లు వారిని నిర్బంధించాలనుంది. బ్రిటన్కు చెందిన ఎన్జీవో సహకారంతో ఫుట్బాలర్లకు పాక్ అత్యవసర వీసాలు జారీ చేసింది. వీరికి పెషావర్ లేదంటే లాహోర్లో బస ఏర్పాటు చేసే అవకాశముంది. -
పాక్ చేతిలో... అగ్ర రాజ్యాలు చిత్తు!
పంజ్షీర్ను తాలిబన్లు ఆక్రమించిన ఘటన... ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం అమెరికా సమాధిమీద చివరి రాతను రాసేసింది. పాక్ సైన్యం, పాక్ ప్రభుత్వం చేతిలో తాము చిత్తయిపోయామని రష్యా, అమెరికాకు ఆలస్యంగానైనా అర్థమైపోయింది. ఒక్క ఫ్రాన్స్ మినహా మిగతా నాటో కూటమి మొత్తంగా కాగితపు పులేనని అఫ్గాన్ పరిణామాలతో తేలిపోయింది. చైనా కూడా అఫ్గాన్ నూతన ప్రభుత్వం ఐఎస్ఐకి విస్తృతరూపమే అని గ్రహించేసింది. అఫ్గాన్ వ్యవహారాల్లో తలదూర్చడమంటే పాక్, అఫ్గాన్ రెండు దేశాల కరువు తీర్చడానికి తన వనరులన్నీ ఖర్చుపెట్టాల్సి ఉందని చైనాకూ అర్థమవుతున్నట్లుంది. నాటో బలగాలు తిరోగమించడం, చైనా–పాక్ కూటమి ముందు రష్యా కూడా తలవంచాక ప్రజాస్వామ్యం కోసం పోరాడే ఒకే ఒక్క దేశంగా భారత్ మిగిలింది. అఫ్గాన్ పరిణామాలు అగ్రరాజ్యానికీ, ప్రపంచ ఆధిపత్య శక్తులకూ అంతిమ పరాజయం. అఫ్గానిస్తాన్లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో బహుశా భారతదేశం ఇప్పుడు తక్కిన ప్రపంచం కోసం సారథ్య స్థానాన్ని కైవసం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదేసమయంలో పాకిస్తాన్ సైన్యం, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని సంకర పౌర ప్రభుత్వం చేతిలో మూర్ఖులుగా మిగిలిపోయామని రష్యా, అమెరికా రెండూ ఇప్పుడు గ్రహిస్తూ మథనపడుతున్నాయి. మరోవైపున చైనా నాయకత్వానికి మెల్లగా తత్వం బోధపడుతున్నట్లుంది. తాలిబన్–పాక్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) పోషకురాలిగా తాను నిలబడటం అంటే, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ రెండు దేశాలకు సహాయం అందించడానికి తన వనరులన్నింటినీ ఖర్చుపెట్టాల్సి ఉండటమేనని చైనా నాయకత్వానికి కూడా అర్థమవుతున్నట్లు కనిపిస్తోంది. అంతకుముందు పంజ్షీర్ లోయలోని తాలిబన్ తిరుగుబాటు దళాలపై పాక్ బాంబుదాడులు చేయడానికి కజకిస్తాన్లోని తన సైనిక స్థావరాలను ఉపయోగించుకోవచ్చని రష్యా అనుమతించింది. మరోవైపున చైనా నిఘా ఉపగ్రహాలు.. అత్యంత కచ్చితత్వంతో అఫ్గాన్ తిరుగుబాటు బలగాలకు చెందిన లక్ష్యాలను దెబ్బతీయడానికి పాకిస్తాన్ బాంబర్లకు, డ్రోన్లకు సహాయం చేశాయి. కాగా, పంజ్షీర్ను తాలి బన్లు ఆక్రమించిన ఘటన జోబైడెన్ నేతృత్వంలోని ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం అమెరికా సమాధిమీద చివరి రాతను రాసేసింది. అంతి మంగా, న్యూఢిల్లీ సందర్శించి అమెరికా పరువును నిలబెట్టడమే కాకుండా, తన వ్యక్తిగత ప్రతిష్టను కూడా తిరిగి సాధించే అవకాశాన్ని అన్వేషించాలంటూ సీఐఏ చీఫ్ బర్న్స్ని జో బైడెన్ కోరాల్సి వచ్చింది. అఫ్గాన్ ప్రజలను తాలిబన్లకు వదిలేసిన తన పిరికిపంద చర్యను కప్పిపెట్టుకోవడంతోపాటు తన పరువు నిలబెట్టుకునేందుకు కూడా భారత్ సహాయం చేస్తుందని బైడెన్ ఆశిస్తున్నట్లుంది. తాలిబన్లను అడ్డుకోవడంలో అఫ్గాన్ సైనికబలగాలు విఫలమయ్యాయని బైడెన్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసిపోయింది. తాలిబన్ శక్తులు కాబూల్ని ఆక్రమించే పనిలో సులభ విజయం సాధించడానికి అమెరికన్లు పాకిస్తాన్ సైన్యాధికారులను తప్పు పద్ధతిలో ప్రోత్సహిం చినట్లు ఇప్పుడు ప్రపంచానికే తెలిసిపోయింది. అలాగే తాలిబన్ దురాక్రమణ బలగాలను ప్రతిఘటించవద్దని అఫ్గాన్ కమాండర్లకు కూడా పనిలోపనిగా కబురందించారు. చివరిదశలో అఫ్గాన్లో ఏం జరిగిందనే విషయమై అమెరికా కథనాలపై అమెరికన్ మీడియా ప్రస్తుతం ప్రతిరోజూ కొత్త వార్తలను వండిపెడుతూనే ఉంది. అఫ్గాన్ మహిళలు తాలిబన్లను సాహసోపేతంగా ఎదుర్కొంటున్నప్పుడు పాక్ సైన్యం, దాని నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో విర్రవీగుతున్న తాలిబన్ మూకలు అఫ్గాన్ మహిళల వక్షోజాలకు ఆటోమేటిక్ రైఫిల్స్ని గురిపెట్టిన దృశ్యాలను ప్రపంచం తిలకించినప్పుడు అమెరికా పరువు మొత్తంగా పోయింది. పంజ్షీర్ లోయపై పాక్ సైన్యం బాంబులు కురిపించడానికి నిరసనగా అఫ్గాన్లో ఆందోళనకారులు పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. వారు ప్రదర్శించిన అసాధారణ సాహసాన్ని మొత్తం ప్రపంచం చూసింది. బైడెన్ వల్లించిన అబద్ధాలను ఇక నమ్మేవారు చాలా తక్కువ అని తేలిపోయింది. అయితే ఇస్లామాబాద్లోని తమ మార్గదర్శకులకు భంగపాటు కలిగిస్తూ తాలిబన్ సాయుధులు... నిరాయుధులైన మహిళ లను చంపడానికి సాహసించలేకపోయారు. రావల్పిండిలోని ఐఎస్ఐ జనరల్ హెడ్ క్వార్టర్స్ ప్రత్యక్ష ఆదేశాలతో పనిచేసే పాక్ ప్రచ్ఛన్న సంస్థ హక్కాని నెట్వర్క్... ఆందోళనకారులను అణచేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, ఆందోళనకారులు భీతిల్లలేదు. అప్పుడు కూడా తాలిబన్ సాయుధులు నిరాయుధ మహిళలపై కాల్పులకు ప్రయత్నించలేదు. ఆందోళనకారులను భయపెట్టి వారిపై పాశవిక బలాన్ని ప్రయోగించాలని తలచిన హక్కాని నెట్వర్క్... 1989 ఏప్రిల్లో తియనాన్మెన్ స్క్వేర్లో చైనా ప్రభుత్వం తలపెట్టిన మారణకాండను పోలినదాన్ని మరోసారి సృష్టించాలని స్పష్టంగా భావించింది. ఈలోగా చైనా కూడా అఫ్గాన్ నూతన ప్రభుత్వం ఐఎస్ఐకి విస్తృత రూపమే అని గ్రహించేసింది. అఫ్గాన్లో తిరుగుబాటు దళాలకు సహకరించవద్దని భారత్కు తానిచ్చిన సలహా పెద్ద తప్పిదమని రష్యా కూడా ఎట్టకేలకు గ్రహించింది. కజకిస్తాన్లోని తన వైమానిక స్థావరం నుంచి జెట్ ఫైటర్లను పంపే వీలున్నప్పటికీ రష్యా అందుకు పూనుకోలేకపోయింది. అఫ్గానిస్తాన్లో పరిస్థితి ఇప్పటికీ అస్పష్టంగానే కనిపిస్తోంది. మయన్మార్లో తాను ప్రారంభించి అమలు చేసిన ప్రయోగాన్ని పునరావృతం చేయడానికి చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్కి కూడా కష్టమయ్యేది. అంగ్ సాన్ సూకీ, తదితర ప్రజాస్వామిక నేతలను జైల్లో పెట్టి మార్షల్ లా విధించాలంటూ మయన్మార్ సైనికాధిపతి మిన్ అంగ్ హ్లాయింగ్ని ప్రభావితం చేయడంలో చైనా అప్పట్లో విజయం సాధిం చింది. మయన్మార్ ఓడరేవుల వద్దకు రోడ్ లింక్ ఏర్పర్చాలనే తన ప్రయత్నంలో భాగంగా చైనా ఆ దేశంలో తనకు విధేయంగా ఉండే ప్రభుత్వం ఉండాలని కోరుకుంది. చివరకు తన లక్ష్యాన్ని సాధించింది కూడా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం ఉంటే అంతంలేని తన డిమాండ్లను సాధించుకోవడం చైనాకు కష్టమయ్యేది మరి. అందుకే సూకీని తిరిగి అధికారంలోకి రాకుండా చైనా అడ్డుకుంది. వాస్తవానికి చైనాతో సూకీ అనేక వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేశారు. అయినా సరే తనకు విధేయంగా ఉండే ప్రభుత్వమే ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ బలంగా కోరుకున్నారు. దాంట్లో భాగంగానే మయన్మార్ నుంచి అపార లాభాలను దండుకోవడానికి చైనా అక్కడ సైనిక పాలనను తీసుకొచ్చింది. తనవద్ద పోగుపడిన అదనపు డాలర్లను ప్రతిపాదిస్తూ ఇరాన్, రష్యా, పాకిస్తాన్ దేశాల విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని చైనా అమలు పరిచింది. రష్యా పట్ల భ్రమలు తొలగిపోయాక, ఇప్పుడు అఫ్గాన్ విషయంలో ఏర్పడిన కొత్త కూటమి ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజల్ని బానిసలుగా చేసుకునే ప్రయత్నాలు విజయవంతమయ్యేందుకు చైనాకు కొన్ని అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అఫ్గాన్లో ఇటీవల జరిగిన ఘటనలతో, ఒక్క ఫ్రాన్స్ మినహా మిగతా నాటో కూటమి మొత్తంగా కాగితపు పులేనని తేలిపోయింది. ఆంగ్లో–అమెరికన్ కూటమి చెప్పే ప్రజాస్వామ్యం సారం లేని గుజ్జు అని తేలిపోయింది. ఈలోపు, పాశ్చాత్య దేశాల సమర్థకులు, అమెరికా కేంద్రంగా పనిచేసే జర్నలిస్టులు, ప్రత్యేకించి ఫరీద్ జకారియా వంటి వారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పెంటగాన్లకు బలహీన స్వరంతో మద్దతు పలుకుతున్నారు. అసాధారణమైన రాజకీయ ఒత్తిడి వల్లే అమెరికన్ నేతృత్వంలోని నాటో శక్తులు అఫ్గానిస్తాన్ను వదిలిపెట్టాల్సి వచ్చిం దని, వందల కోట్ల డాలర్ల విలువైన సైనిక సామగ్రిని అక్కడే వదలిపెట్టాల్సి వచ్చిందని వీరు వంతపలికారు. కానీ స్వాతంత్య్ర ప్రేమికులైన ప్రజలతో కూడిన దేశాన్ని తాలిబన్ నిరంకుశ వ్యవస్థకు లొంగిపోయేలా ఎలా చేశారన్న దానిపై ఈ సమర్థకులెవ్వరూ జవాబివ్వరు. పాకిస్తాన్, చైనా దేశాల సైనిక, రాజకీయ మద్దతుతో తాలిబన్ అధికారంలోకి వచ్చిన పరిణామాలను కూడా వీరు పెద్దగా ప్రస్తావించరు. అఫ్గానిస్తాన్లో రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ గొప్ప క్రీడ ఇప్పుడు భారతదేశాన్ని దెబ్బతీయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతం నుంచి అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు తిరోగమించడం, చైనా–పాక్ కూటమి ముందు రష్యా కూడా తలవంచాక మానవహక్కులు, ప్రజాస్వామ్యం కోసం పోరాడే ఒకే ఒక్క దేశంగా భారత్ మిగిలి ఉంది. మరోవైపున ఎనభై ఏళ్లు దాటిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా ముందు ఓడిపోకపోవచ్చు కానీ అఫ్గానిస్తాన్లో అమెరికా సంపూర్ణ తిరోగమనాన్ని మాత్రం ఎట్టకేలకు అంగీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అఫ్గాన్ పరిణామాలు అగ్రరాజ్యానికీ, ప్రపంచ ఆధిపత్య శక్తులకూ అంతిమ పరాజయం మాత్రమే. గోపాల్ మిశ్రా, ఫ్రీలాన్స్ జర్నలిస్టు (ఫస్ట్ ఇండియా సౌజన్యంతో) -
అఫ్గాన్కు భారీ స్థాయిలో ఆర్థికసాయం!
ఐక్యరాజ్య సమితి/జెనీవా: తాలిబన్లు చెరబట్టిన అఫ్గాన్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో ఆర్థికసాయం చేస్తామని ప్రకటించాయి. కరువు, పేదరికం, వలసలతో సతమతమవుతున్న అఫ్గాన్ ప్రజల ఆకలి, వసతుల కష్టాలు తీర్చేందుకు 1.2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,836 కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని పలు దేశాలు హామీ ఇచ్చాయని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా చూడడం, మానహక్కుల పరిరక్షణ తదితర సమస్యలపైనా ప్రపంచ దేశాలు తమ వంతు కృషిచేయాలని గుటెర్రస్ సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్కు సత్వర ఆర్థిక సాయం కోరుతూ ఐరాస సోమవారం జెనీవాలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం తెల్సిందే. ఈ ఏడాది అవసరాలు తీర్చేందుకు కనీసం 60.6 కోట్ల డాలర్ల సాయం చేయాలని గుటెర్రస్ కోరడం విదితమే. ‘ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సమాజం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల సాయం చేస్తామని ‘ముఖ్యమైన’ దేశాలు ప్రకటించాయి. నా అంచానాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో విరాళాలు వస్తున్నాయి. అఫ్గాన్కు అంతర్జాతీయ సమాజం ఎంతటి భారీ స్థాయిలో ఆర్థిక తోడ్పాటు ఇస్తుందనడానికి ఈ ఘటనే తార్కాణం’ అని స్విట్జర్లాండ్ నగరం జెనీవాలో పత్రికా సమావేశంలో గుటెర్రస్ చెప్పారు. ‘తాలిబన్ల అనుమతి లేకుండా మానవతా కార్యక్రమాల అమలు అసాధ్యం. మానవ హక్కులు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం.. అంశమేదైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సాయం అందాలంటే తాలిబన్ ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాల్సిందే’ అని ఆయన స్పష్టంచేశారు. ‘ తాలిబన్ల దురాక్రమణ, కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద వేలాది మంది అఫ్గాన్ అభాగ్యుల పడిగాపులు, బాంబు పేలుళ్లు వంటి విషాదకర ఘటనలతో స్థానికుల భవిష్యత్ అగమ్యగోచరమైన నేపథ్యంలో ఐరాస అక్కడ సహాయ కార్యక్రమాలను కొనసాగించడం తప్పనిసరి’ అని గుటెర్రస్ వ్యాఖ్యానించారు. -
Afghanistan: తాలిబన్ల పంట పండింది
ఆర్థికంగా ముప్పావు భాగం మునిగిన అఫ్గన్ నావను నడిపేందుకు తాలిబన్లకు ఇప్పుడు ఆసరా అవసరం. ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) సైతం అఫ్గనిస్తాన్కు ఆపన్నహస్తం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈలోపు తమ వనరులను సమీకరించుకునే పనిలో పడ్డారు తాలిబన్లు. ఈ క్రమంలోనే పాత ప్రభుత్వంలోని మంత్రులు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అమ్రుల్లా సలేహ్.. అఫ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు. మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన తర్వాత.. సలేహ్ తనను తాను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై తాలిబన్ల ఆక్రమణ తర్వాత అజ్ఞాతంలో ఉంటూ.. తాలిబన్లతో పోరాటం కొనసాగుతుందని ప్రకటించాడు కూడా. అయితే ఆయన ఇంట్లో తాలిబన్లు తాజాగా సోదాలు నిర్వహించారు. సుమారు 6 మిలియన్ల విలువ చేసే డాలర్లు(మన కరెన్సీలో 45 కోట్ల రూ. దాకా), 18 పెద్ద బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్ మల్టీమీడియా బ్రాంచ్ చీఫ్ అహ్మదుల్లా ముట్టాఖీ తన ట్విటర్లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. د امر الله صالې په کور کې شپږنیم میلیونه ډالر د سرو زرو له اتلس خښتو سره يوځای د اسلامي امارت د ځواکونو لاسته ولوېدل. pic.twitter.com/E5YinxvTe0 — Ahmadullah Muttaqi (@Ahmadmuttaqi01) September 13, 2021 ఇక సలేహ్తో పాటు ఆయనకు అనుకూలంగా పని చేసిన మంత్రులు, అధికారులు, గత పాలనలో అవినీతికి పాల్పడ్డవాళ్ల ఇళ్లలోనూ తాలిబన్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా సోమ్ము సేకరించినట్లు తెలుస్తోంది. ఇక పరారీలో ఉన్న మరికొందరి దగ్గర సొమ్ము ఉండొచ్చని భావిస్తున్న తాలిబన్లు.. ఓ లిస్ట్ తయారు చేసుకుని వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే అఫ్గనిస్తాన్ను తాలిబనిస్తాన్గా మారడం తనకు ఇష్టం లేదని ప్రకటించుకున్న సలేహ్.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పంజ్షీర్కు పారిపోయాడు. అక్కడ ప్రతిఘటన దళాల నేత అహ్మద్ మస్సౌద్తో కలిసి పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో సలేమ్ సోదరుడు రుల్లాహ్ను బంధించి, చిత్రహింసలు పెట్టి మరీ చంపారు తాలిబన్లు. చదవండి: అఫ్గన్ థియేటర్ల మూత, బాలీవుడ్కు ఆర్థిక ముప్పు ఇక సెప్టెంబర్ 3న చివరిసారిగా పోరు కొనసాగుతుందని ప్రకటించిన సలేహ్.. సెప్టెంబర్ 6న పంజ్షీర్ తాలిబన్ల వశం అయ్యిందన్న ప్రకటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఆయన ప్రాణాలతోనే ఉన్నాడా? లేదా పరారీలో ఉన్నాడా? అనేది నిర్దారణ కావాల్సి ఉంది. చదవండి: తాలిబన్ ఎఫెక్ట్.. భారత్లో అలర్ట్ -
మహిళలపై ఆర్ఎస్ఎస్, తాలిబన్ అభిప్రాయం ఒక్కటే!
భోపాల్: ఉద్యోగాలు చేసే మహిళల విషయంలో మన దేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), అఫ్గానిస్తాన్లోని తాలిబన్ల అభిప్రాయం ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, తాలిబన్లు వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోనంత వరకూ ఇదే నిజమని భావించాల్సి వస్తుందని చెప్పారు. 2013లో మోహన్ భగవత్ మాట్లాడినట్లు చెబుతున్న ఓ వీడియోను దిగ్విజయ్ ప్రస్తావించారు. పెళ్లి అనేది ఒక కాంట్రాక్టు, పెళ్లయిన మహిళలు ఇళ్లల్లోనే ఉండాలి, ఇంటి పనులు చూసుకోవాలి అని మోహన్ భగవత్ అన్నారని గుర్తుచేశారు. అఫ్గాన్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదని తాలిబన్లు తేల్చిచెబుతున్నారని వెల్లడించారు. దిగ్విజయ్ ట్వీట్ను మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ తప్పుపట్టారు. దిగ్విజయ్తోపాటు కాంగ్రెస్ నాయకత్వం తాలిబన్ల మద్దతుదారులని ఆరోపించారు. -
ప్రమాణ స్వీకారోత్సవం రద్దు చేసిన తాలిబన్లు
కాబూల్: కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని తాలిబన్లు రద్దు చేశారు. వనరులు, నిధుల వృ«థా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు. ఇందుకోసం రష్యా, చైనా, ఖతార్, పాకిస్తాన్, ఇరాన్కు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ అకస్మాత్తుగా ప్రమాణస్వీకారోత్సవ రద్దు నిర్ణయం ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవం లేకపోయినా ప్రభుత్వం ఏర్పడి పనిచేయడం ప్రారంభమైందని తాలిబన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగని ప్రకటించారు. అయితే నిధుల వృథా నివారణ అనేది అసలు కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్ మిత్రుల ఒత్తిడి వల్లనే ఈ ఉత్సవాన్ని రద్దు చేశారని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది. 11న ప్రమాణ స్వీకారోత్సవం జరపడం అమానవీయమని, దాన్ని నిలిపివేయమని తాలిబన్లకు సలహా ఇవ్వాలని యూఎస్, నాటో దేశాలు ఖతార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొంది. దీనివల్ల అఫ్గాన్లో తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు గుర్తించడం మరింత కఠినతరమవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. -
తిరిగి రండి.. మీకు పూర్తి రక్షణ కల్పిస్తాం: అఫ్గన్ ప్రధాని
కాబూల్: అఫ్గనిస్తాన్ ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు ఎవరు విధులకు హాజరవ్వడం లేదు.. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుత అఫ్గన్ ప్రధాని ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ ప్రభుత్వ అధికారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని.. తిరిగి దేశానికి రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు అఖుంద్ బుధవారం ఓ ప్రకటన చేశారు. (చదవండి: కొత్త కోణం: అఫ్గాన్ సింహాలు తలవంచేనా!) అఖుంద్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్లో అధికారంలోకి రావడానికి మేం భారీ మూల్యం చెల్లించాం. దేశ పునర్నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదుర్కొబోతున్నాం. ఈ సందర్భంగా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. దేశం విడిచిపోయిన అధికారులు తిరిగి వచ్చేయండి. మీకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాం. యుద్ధంలో ధ్వంసమైన అఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో అనేక సవాళ్లను చవి చూడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మీ అవసరం చాలా ఉంది. మీ రక్షణ బాధ్యత మాదే.. తిరిగి దేశానికి వచ్చేయండి’’ అని పిలుపునిచ్చాడు. (చదవండి: Afghanistan: అఫ్గాన్లో ఆపద్ధర్మ ప్రభుత్వం) తాజాగా అఫ్గనిస్తాన్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో ఎక్కువగా అంతర్జాతీయ ఉగ్రవాదులు, వారి తలపై రివార్డులు ఉన్న వారు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారే ఉండటం గమనార్హం. ఈ ప్రభుత్వ ఏర్పాటులో పాక్ కీలక పాత్ర పోషించింది. అఫ్గన్ కేబినెట్ మంత్రులు సెప్టెంబర్ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9/11 దాడులకు ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో అఫ్గన్ కేబినెట్ మంత్రులు ఆ రోజే తమ ప్రమాణ స్వీకారానికి ఎన్నుకోవడం గమనార్హం. -
తాలిబన్ల అరాచకం: జర్నలిస్టులకు చిత్రహింసలు
కాబూల్: తాలిబన్లు రెచ్చిపోయారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను చితకబదారు. రక్తమొచ్చేలా దాడి చేశారు. వారిని దాడి చేసి బంధించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. అఫ్గానిస్తాన్లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. వెస్ట్రన్ కాబూల్లోని కార్ట్-ఈ-చార్ ప్రాంతంలో బుధవారం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను తాలిబన్లు ఎత్తుకెళ్లిపోయారు. చదవండి: లోకేశ్కి ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు శిక్షణ అనంతరం ఓ గదిలో బంధించి చితకబాదారు. వారి దుస్తులు విప్పేసి రక్తమొచ్చేలా తీవ్రంగా దాడి చేశారు. తాలిబన్లు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు తఖి దర్యాబీ, నిమతుల్లా నక్తీ. జర్నలిస్టు వృత్తిని ఎగతాళి చేస్తూ దారుణంగా హింసించారని బాధిత జర్నలిస్టులు తెలిపారు. తమ పాలనలో మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లదని తాలిబన్లు ప్రకటించారు. అయినా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారిద్దరితో పాటు మరికొందరు జర్నలిస్టులను ఎత్తుకెళ్లి అనంతరం విడిచి పెట్టారని చెప్పారు. దర్యాబీ, నక్దీ ఓ ఛానల్లో వీడియో ఎడిటర్లుగా పని చేస్తున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి చెర నుంచి విడుదలైన అనంతరం బాధితుడు నక్దీ మీడియాతో మాట్లాడారు. ‘ఒక తాలిబన్ నా తలపై కాలు పెట్టి నలిపేశాడు. మొఖాన్ని కూడా చిదిమేశాడు. తర్వాత తలపై తన్నాడు. నన్ను చంపేస్తారని అనుకున్నా’ అని వాపోయాడు. ‘నువ్వు వీడియోలు చిత్రీకరించవద్దు’ అని హెచ్చరించినట్లు తెలిపాడు. ఈ ఘటనపై జర్నలిస్టు లోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వీరిపై దాడిని జర్నలిస్ట్ లోకం ఖండిస్తోంది. Send our journalists to hospital. pic.twitter.com/W3GQ34BPtl — Zaki Daryabi (@ZDaryabi) September 8, 2021 -
పాక్ కనుసన్నల్లో...
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టుగా అఫ్గాన్లో ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు, హక్కానీలు ఒక అవగాహనకు రాలేక కొట్టుకు చస్తుంటే పాకిస్తాన్ తలదూర్చి అన్నీ తనకి అనుకూలంగా మార్చేసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాదులు, వారి తలపై రివార్డులు ఉన్న వారు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారితో ప్రభుత్వాన్ని నింపేసింది. కొత్త సర్కార్ భారత్కు ఎలా ఎదురు దెబ్బగా మారింది ? అఫ్గానిస్తాన్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని చూస్తే అడుగడుగునా పాకిస్తాన్ ముద్ర స్ఫష్టంగా కనిపిస్తుంది. తాలిబన్లు, హక్కానీల మధ్య నెలకొన్న విభేదాల్ని పరిష్కరించడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్ట్నెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ స్వయంగా కాబూల్కి తరలివచ్చి మూడు రోజులు మకాం వేశారు. పక్కా స్క్రీన్ప్లేతో రాత్రికి రాత్రి అధికార రేసులో ఉన్నవారి పేర్లన్నీ మార్చేశారు. దోహాలో భారత్తో సహా అంతర్జాతీయ దేశాలతో శాంతి చర్చలు జరిపిన వారిని తెలివిగా పక్కకు తప్పించారు. ప్రధానిగా ఉగ్రవాది ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ను నియమించడంలోనూ, తమ నియంత్రణలో ఉండే హక్కానీ నెట్వర్క్కు చెందిన పలువురు నాయకులకు పదవులు ఇప్పించడంలోనూ పాక్ విజయం సాధించింది. భారత్పై దాడులు చేసిన హక్కానీలకు కీలక పదవులు అఫ్గాన్ కొత్త ప్రభుత్వంతో తమ పంతం నెగ్గించుకొని కీలక పదవులు సాధించింది మాత్రం హక్కానీ గ్రూపే. ఈ సంస్థ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించారంటేనే అక్కడ ఉన్నది ఐఎస్ఐ ప్రభుత్వమేనని అవగతమవుతుంది. పాకిస్తాన్లోని నార్త్ వజరిస్తాన్లో అల్కాయిదాతో ఉగ్రవాద సంస్థతో సిరాజుద్దీన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. 2008లో కాబూల్లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడుల వెనుక హక్కానీల హస్తం ఉంది. ఈ దాడుల్లో 58 మంది మరణించారు. భారతీయులపైనా, భారత దేశ ప్రయోజనాలపైనా 2009, 2010లో కూడా ఈ సంస్థకు చెందిన వారు దాడులకు తెగబడుతూనే ఉన్నారు. అలాంటి సంస్థను నడిపిస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ చేతిలో శాంతి భద్రతలతో పాటుగా ప్రావిన్స్లకు గవర్నర్లను నియమించే అధికారాలు కూడా ఉన్నాయి. సిరాజుద్దీన్ హక్కానీపై అమెరికా ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్రవేయడంతో పాటు అతని తలపై కోటి డాలర్ల అవార్డు కూడా ప్రకటించింది. శరణార్థుల మంత్రి ఖలీల్ హక్కానీ కూడా ఉగ్రవాదే. అల్కాయిదా సంస్థ తరఫునే అతను పని చేస్తుంటాడు. భారత్ రాయబారితో చర్చించాడని.. అమెరికాతో దోహాలో శాంతి చర్చలు జరిపి, అందరి దృష్టిలో పడిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రాధాన్యాన్ని తగ్గించారు. వాస్తవానికే ఆయనే ప్రభుత్వాధినేత అవుతారని అనుకున్నారు. ఆఖరి నిమిషంలో ఆయనకు బదులుగా హసన్ వచ్చి చేరారు. ఇక దోహా చర్చల్లో బరాదర్తో పాటు పాల్గొన్న షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ విదేశాంగ మంత్రి రేసులో ఉండేవారు. కానీ ఖతర్లో భారత రాయబారి దీపక్ మిట్టల్ను ఆయన ఆగస్టు 31న కలుసుకున్న విషయం బయటకు వచ్చింది. భారత ప్రతినిధితో చర్చించడమే మహా పాపమైనట్టుగా అతనిని కూడా ప్రభుత్వం నుంచి తప్పించారు. సమ్మిళిత సర్కార్ ఎక్కడ? అమెరికా నుంచి సంకీర్ణ బలగాలు వెనక్కి వెళ్లడానికి ముందు సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమ్మిళిత సర్కార్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పాక్ ప్రమేయంతో ఆ హామీని తుంగలో తొక్కేశారు. ముందే ఊహించినట్టుగా అఫ్గాన్ ప్రభుత్వంలో మహిళలకి చోటు దక్కలేదు. ఇక 33 మంది మంత్రుల్లో పాస్తూన్ తెగకు చెందిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. పాక్ తన అడుగులకి మడుగులొత్తే వారినే ప్రభుత్వంలో చేర్చింది. అమెరికాలోని గ్వాంటనామా జైళ్లలో మగ్గిన వారికీ ప్రభుత్వంలో చోటు లభించింది. సమాచార సాంస్కృతిక మంత్రి ఖైరుల్లా ఖైర్ఖ్వా, ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్దుల్ హక్ వసీక్, సరిహద్దు వ్యవహారాల మంత్రి ముల్లా నూరుల్లా నూరీలు ఒకప్పుడు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారే. ఇలా ఉగ్రవాదులతో నిండిపోయిన ఈ ప్రభుత్వంతో భారత్ ఎలాంటి తలనొప్పులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
అఫ్గన్లో తాలిబన్ల పాలన.. యూఎన్ కీలక సూచన
న్యూయార్క్: మహిళలు, యువత భాగస్వామ్యంతోనే అఫ్గనిస్తాన్లో సమగ్ర పరిపాలన సాధ్యమని ఐక్యరాజ్యసమితి అసిస్టెన్స్ మిషన్ (యూనైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ (యూఎన్ఏఎంఏ)) స్పష్టం చేసింది. అఫ్గనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో పరిపాలన విధానంలో యువత, మహిళలకు అవకాశం ఇవ్వకూడదనే తాలిబన్ల ఆలోచన తీరును యూఎన్ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు వారి భాగస్వామ్యం లేని పరిపాలన విధానం అర్థరహితమైనదని పేర్కొంది. (చదవండి: Afghanistan: అఫ్గాన్లో ఆపద్ధర్మ ప్రభుత్వం ) తాలిబన్లు హింసా ప్రవృత్తి మానుకోవాలి.. దేశంలో శాంతి, సుస్థిర సౌభ్రాతత్వం అనేవి సమగ్ర పాలన పైనే ఆధారపడి ఉంటాయని యూఎన్ఏఎంఏ నొక్కి చెప్పింది. భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత జీవన విధానం అనేవి అఫ్గాన్ ప్రజల ప్రాథమిక హక్కులని గుర్తు చేసింది. తిరుగుబాటుదారులు, పాత్రికేయుల పట్ల హింసా ప్రవృత్తిని ప్రదర్శంచకూడదంటూ హితవు పలికింది. ఆఫ్గాన్లోని బాలికలు, మహిళలకు అండగ ఉంటామని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వారికి పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు యూఎన్ఏఎంఏ ప్రకటించింది. -
మ్యాగజైన్ స్టోరీ 7th September 2021
-
Afghanistan: అఫ్గాన్లో ఆపద్ధర్మ ప్రభుత్వం
కాబూల్: అఫ్గానిస్తాన్ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం విలేకరులకు తెలిపారు. రెండుదశాబ్దాల పాటు అమెరికాతో పోరాడిన అగ్రనేతలు తాజా ప్రభుత్వంలో ప్రాధాన్యమైన పదవులు పొందారు. అమెరికాతో చర్చల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్తో పాటు మౌల్వీ హనాఫీలు అఖుంద్కు డిప్యూటీలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఏర్పాటైంది తాత్కాలిక ప్రభుత్వమేనని, శాశ్వత ప్రభుత్వం కాదని జబీహుల్లా చెప్పారు. దేశంలో ఇతర ప్రాంతాలవారిని కూడా ప్రభుత్వంలో కలుపుకునేందుకు యత్నిస్తామన్నారు. అయితే ఎంతకాలం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వంలో మార్పులు ఎలా వస్తాయో వెల్లడించలేదు. ప్రభుత్వంలో ప్రతి మంత్రికి ఇద్దరు డిప్యూటీలుంటారని తెలిపారు. ప్రభుత్వంలో తాలిబనేతర వర్గాలకు స్థానం దక్కినట్లు కనిపించలేదు. అఫ్గాన్లో స్థిరత్వం కోసం దేశంలోని అన్ని తెగలను, వర్గాలను కలుపుకొని సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావాలని అంతర్జా తీయ సమాజం ఆశిస్తోంది. ప్రభుత్వ కూర్పు, అధికార పంపిణీల విషయంలో తాలిబన్లు, హకాన్నీ నెట్వర్క్కు మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా ఉండటాన్ని హక్కానీ నెట్వర్క్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో పాక్ ఐఎస్ఐ చీఫ్ మధ్యవ ర్తిత్వానికి వచ్చారు. చర్చల అనంతరం అందరికీ ఆమోదయోగ్యుడైన హసన్ అఖుంద్కు తాత్కాలికంగా పాలనాపగ్గాలు అప్పగించినట్లు కనపడుతోంది. మంత్రివర్గంలో అందరూ ఊహించినట్లే మహిళలకు స్థానం కల్పించలేదు. ఖారీ ఫసిహుద్దీన్ బంద్క్షనిని ఆర్మీ చీఫ్గా నియమించారు. తాలిబన్ అధినేత హెబతుల్లా అఖుంద్జాదా సుప్రీం లీడర్గా ఇరాన్ నమూనా ప్రభుత్వం ఏర్పడుతుందని చాలామంది భావించారు. కానీ తాజా ప్రభుత్వంలో హెబతుల్లా ఎలాంటి పాత్ర పోషించేది స్పష్టం కాలేదు. ఇరాన్లో అధ్యక్షుడి కన్నా ఉన్నతస్థానంలో సుప్రీంలీడర్ ఉంటాడు. అంతిమాధికారాలన్నీ అతని చేతిలోనే ఉంటాయి. ఇతర ప్రముఖులు డిప్యూటీగా నియమితులైన ముల్లా బరాదర్, తాలిబన్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2001లో తాలిబన్ల ప్రభుత్వం పడిపోయిన తర్వాత అప్పటి అఫ్గాన్ అధినేత హమీద్ కర్జాయ్తో సహకరిస్తామని సంప్రదింపులు జరిపినట్లు వార్తలున్నాయి. 2010లో పాక్లో అరెస్టయి అమెరికా ఒత్తిడితో 2018లో విడుదలయ్యారు. అప్పటినుంచి ఖతార్లో ఉంటున్నారు. యూఎస్ దళాల ఉపసంహరణ ఒప్పందంలో కీలకపాత్ర పోషించారు. తాలిబన్లు కాబూల్ను ఆక్రమించాక దేశంలోకి అడుగుపెట్టారు. హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కీలకమైన హక్కానీ నెట్వర్క్ అధిపతి. సూసైడ్ బాంబర్ల వినియోగం హుక్కానీ నెట్వర్క్ ప్రాముఖ్యత. తాలిబన్ల మిలటరీ ప్రధానబలం. తాలిబన్లతో అంతగా ఈ నెట్వర్క్కు పొసగదని, పాక్ కారణంగా కలిసి ఉంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రిగా నియమితులైన ముల్లా యాకూబ్, తాలిబన్ స్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు. తాలిబన్ల ఫీల్డ్ కమాండర్లను పర్యవేక్షించే మిలటరీ కమిషన్కు అధిపతిగా వ్యవహరించారు. ఎవరీ అఖుంద్? ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్(65), తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారు. గత తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, కాందహార్ గవర్నర్గా పనిచేశారు. అనంతరం ఐరాస ఆంక్షల జాబితాకెక్కారు. తాలిబన్ కమాండర్లలో అత్యంత ప్రభావశాలి అని ఐరాస పేర్కొంది. అఖుంద్ పేరును స్వయంగా తాలిబన్ అగ్రనేత ముల్లా హెబతుల్లా అఖుంద్జాదా ప్రతిపాదిం చారని పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరవైఏళ్లుగా తాలిబన్ల నాయకత్వ మండలి ‘రెహబరి షురా’కు అఖుంద్ అధిపతిగా ఉన్నారు. ఈ కూటమి అగ్రనేత అఖుంద్జాదా ఆదేశాల మేరకు అన్ని రకాల మిలీషియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కీలక మంత్రులు– శాఖలు ► అమీర్ ఖాన్ ముత్తఖీ: విదేశాంగ మంత్రి ►షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్: విదేశాంగ సహాయ మంత్రి ► సిరాజ్ హక్కానీ: హోంశాఖ మంత్రి ► ముల్లా యాకూబ్: రక్షణ మంత్రి ► అబ్దుల్లా హకీం షరే: న్యాయ మంత్రి ► హిదాయతుల్లా బద్రి: ఆర్థిక మంత్రి ► షేక్ మవ్లావీ నూరుల్లా: విద్యా మంత్రి ► నూర్ మొహ్మద్ సాకిబ్: మత వ్యవహారాలు (చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!) చదవండి: క్రికెట్ మ్యాచ్లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..? -
పాక్ వ్యతిరేక నినాదాలు.. కాల్పులు జరిపిన తాలిబన్లు
కాబూల్: తాలిబన్ల ఆక్రమణ నాటి నుంచి అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో హై టెన్షన్ నెలకొంది. తాలిబన్లకు పాకిస్తాన్ సహకరిస్తోందని అఫ్గనిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ తీరుకు నిరసనగా పలువురు అఫ్గన్ వాసులు పాక్ ఎంబసీ వద్ద ఆందోళనలకు దిగారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వీరంతా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. అఫ్గన్ వాసుల చర్యల పట్ల తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందకు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (చదవండి: పాక్ సహా ఏ దేశ జోక్యాన్ని సహించం: తాలిబన్లు) కాబూల్లోని పాకిస్తాన్ ఎంబసీ ఎదురుగా స్థానికుల ఆందోళనకు దిగారు. అఫ్గనిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యంపై ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో ఎంబసీ ప్రాంతం హోరెత్తిపోయింది. అయితే నిరసనలను జీర్ణించుకోలేక పోయిన తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. నిరసనకారులు పరుగులు పెట్టారు. తాలిబన్ల తాజా చర్యలతో వారి వైఖరి ఏ మాత్రం మారలేదని.. హింసే వారి ఆయుధమని.. శాంతి మంత్రం వారికి రుచించదని మరోసారి రుజువుయ్యింది. చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి! Kabul Protest started from Pakistani embassy and continued till the presidential palace. The Taliban was seen shooting after that to disperse the crowd. pic.twitter.com/yJuwYWT9vl — Sidhant Sibal (@sidhant) September 7, 2021 -
పాక్ జోక్యాన్ని సహించం
కాబూల్: అఫ్గాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో పాకిస్తాన్ జోక్యాన్ని నిరసిస్తూ మంగళవారం వందలాది మంది కాబూల్ రోడ్లెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. పంజ్షీర్ ప్రావిన్స్ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ సహాయ సహకారాలు అందించిందని, పాక్ వైమానిక దాడులు జరిపి పంజ్షీర్ తాలిబన్ల పరం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్ లీవ్ అఫ్గానిస్తాన్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. పాక్ ఆడించినట్టు ఆడే ప్రభుత్వం తమకు వద్దని, సమ్మిళిత ప్రభుత్వమే కావాలని డిమాండ్లు చేశారు. మరోవైపు నిరసనకారులను చెదరగొట్టడానికి తాలిబన్ కమాండర్లు గాల్లో కాల్పులు జరిపారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. నిరసన ప్రదర్శనల కవరేజ్ చేస్తున్న జర్నలిస్టుల్ని తాలిబన్లు అరెస్ట్ చేసినట్టుగా అఫ్గాన్లో టోలో న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హెరాత్లో పాక్కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శలపై తాలిబన్లు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇద్దరి మృతదేహాలను నగర కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పంజ్షీర్లో విదేశీ జెట్లు దాడులు జరపడంపై ఇరాన్ కూడా తాలిబన్లను నిలదీసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. చదవండి: చమన్ బోర్డర్ను మూసేసిన పాక్ -
తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!
తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, విదేశాలకు వెళ్తున్న వారిని తాలిబన్లు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్లోని పెద్ద నగరాల్లో ఒకటైన మజర్–ఏ–షరీఫ్ ఎయిర్పోర్టు నుంచి వెళ్లాల్సిన దాదాపు నాలుగు చార్టర్డ్ విమానాలను తాలిబన్లు కొన్ని రోజులుగా నిలిపివేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయా విమానాల్లో ప్రయాణించేందుకు సన్నద్ధమైన వందలాది మంది ప్రయాణికులు ప్రస్తుతం తాలిబన్ల వద్దే బందీలుగా ఉన్నట్లు అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైఖేల్ మెక్కౌల్ చెప్పారు. అయితే, నాలుగు విమానాలను తాలిబన్లు ఎందుకు కదలనివ్వడం లేదన్నది ఇంకా తెలియరాలేదు. మజర్–ఏ–షరీఫ్ ఎయిర్పోర్టు వద్ద అఫ్గాన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నాలుగు విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా అఫ్గాన్ పౌరులేనని, వారిలో చాలా మందికి పాస్పోర్టులు, వీసాలు, ఇతర ధ్రువపత్రాలు లేవని తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లలేకపోతున్నారని వెల్లడించారు. అమెరికా వాదన మరోలా ఉంది. ప్రయాణికుల్లో తమ దేశ పౌరులు కూడా ఉన్నారని రిపబ్లికన్ నాయకుడు మైఖేల్ మెక్కౌల్ స్పష్టం చేశారు. వారు విమానాల్లోనే కూర్చొని, తాలిబన్ల చెరలో బందీలుగా ఉన్నారని చెప్పారు. బందీలను విడిచిపెట్టడానికి డిమాండ్లు చేయాలని తాలిబన్లు యోచిస్తున్నారని ఆరోపించారు. డబ్బు లేదా తాలిబన్ కొత్త ప్రభుత్వానికి చట్టబద్ధత అనేవే ఈ డిమాండ్లు కావొచ్చని చెప్పారు. సమస్యను పరిష్కరించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. నిజానికి ప్రయాణికులెవరూ తాలిబన్ల వద్ద బందీలుగా లేరని స్థానికులు తెలియజేశారు. -
‘జావేద్ అక్తర్ కుట్రపూరిత వ్యాఖలు చేస్తున్నారు’
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోల్చూతు ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దేశంలో వివాదాన్ని రాజేశాయి. జావేద్ వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషిత్ ఖండించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారంటూ జావేద్పై వీహెచ్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు.. మహిళల పట్ల వ్యతిరేక ధోరణి గలిగినవారు, హింసను ప్రేరింపించే ఒక ఉగ్రవాద సంస్థ. అటువంటి సంస్థలతో ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, వీహెచ్పీలకు పోలికేమిటీ అంటూ దుయ్యబట్టారు. సమాజంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. జావేద్ అక్తర్పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా వీహెచ్పీ నేతలు కోరారు. (చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక) జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోంది’ అని జావేద్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: బీజేపీ, ఆరెస్సెస్లతో భారత్కు ప్రమాదం -
Panjshir: తాలిబన్ల పైచేయి.. పంజ్షీర్ కైవసం
అఫ్గనిస్తాన్లో హోరాహోరీగా సాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు ముగిసింది!. పంజ్షీర్ ప్రావిన్స్పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. అఫ్గనిస్తాన్లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపాడు. మరోపక్క పంజ్షీర్ ప్రావిన్సియల్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుపెట్టామని పంజ్షీర్ యోధులు ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. చదవండి: పోరాటాల గడ్డ.. పంజ్షీర్ మరోవైపు పంజ్షీర్ సాయుధ దళాల నేత అహ్మద్ మసూద్ పోరాటం పక్కనపెట్టి, చర్చల కోసం హస్తం చాస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించాడు. అయితే ఆయుధం పక్కనపెట్టే ప్రసక్లే లేదని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తాజా ‘పంజ్షీర్ కైవసం’ ప్రకటన కథనాలపై స్పందించేందుకు అహ్మద్ అందుబాటులో లేకుండా పోయాడు. ఆయన పరారీలో ఉన్నట్లు లోకల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. #FahimDashty was not a fighter, he was a journalist. And killing a journalist is a war crime. One of many, alas, committed by the Taliban. He was brave and sweet. He was with #AhmadShahMassoud on Sept 9, 2001; but he did not survive the assault on #Panjshir ... #PrayForPanjshir pic.twitter.com/nOOumkhsZN — Bernard-Henri Lévy (@BHL) September 5, 2021 అఫ్గన్ జాతీయ ప్రతిఘటన దళాల ప్రతినిధి, అఫ్గన్ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడు ఫహిమ్ దాష్టీని తాలిబన్లు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. అయితే పాక్ దళాలు జరిపిన డ్రోన్ బాంబు దాడుల్లో ఆయన మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పాక్ సహకారంతో తాలిబన్లు పంజ్షీర్ను కైవసం చేసుకుందని అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో పంజ్షీర్లో మారణహోమం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. చదవండి: భారీ నష్టం తాలిబన్లకేనా? -
Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్షీర్ గురించి తెలుసా?
పంజ్షీర్.. కొద్ది రోజులుగా ఈ పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. చుట్టూ పర్వతాలే కోట గోడలా రక్షణనిస్తున్న ఆ లోయవైపు ఇన్నాళ్లూ ఎవరూ కన్నెత్తి కూడా చూడలేకపోయారు. ఇప్పుడు తాలిబన్లు ఆ లోయపై పట్టు బిగించాలని చూస్తూ ఉంటే మరోవైపు తాలిబన్ వ్యతిరేక శక్తులు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఎందుకీ లోయపై తాలిబన్లకు అంత మక్కువ? అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్కు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో హిందుకుష్ పర్వత సానువుల్లో పంజ్షీర్ లోయ ఉంది. దీనిని అయిదు సింహాల లోయ అని కూడా పిలుస్తారు. ఈ లోయకి ఆ పర్వతాలే రక్షణ కవచాల్లా నిలుస్తాయి. ఈ లోయలోకి వెళ్లాలంటే పంజ్షీర్ నది వల్ల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ఇరుకైన రహదారి మాత్రమే మార్గం. అందుకే అక్కడి స్థానికులకు ఈ లోయను కాపాడుకోవడం అత్యంత సులభంగా మారింది. భౌగోళికంగా చూస్తే అఫ్గాన్తో సంబంధం లేనట్టుగానే ఉంటుంది కానీ దేశంలో ఉన్న 34 ప్రావిన్స్లలో పంజ్షీర్ కూడా ఒకటి. చారిత్రకంగా చూస్తే పలుమార్లు నిర్ణయాత్మక పాత్రని పోషించింది. మొదట్నుంచి ఎవరికీ తలవంచకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈ లోయపై ఆధిపత్యం సాధించడానికి తాలిబన్లు ఈసారి తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. పోరాటాల గడ్డ పంజ్షీర్ అంటే అహ్మద్ షా మసూద్ గురించి చెప్పుకోవాలి. 1953 సంవత్సరంలో ఈ లోయలో జన్మించిన మసూద్ తనకంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇస్లాం మత శక్తులతో తనలో చివరి ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూ వచ్చారు. పంజ్షీర్ లోయ స్వతంత్రతని కాపాడారు. 1980 దశకంలో అఫ్గాన్ను సోవియెట్ యూనియన్ దురాక్రమణ చేసినప్పుడు, 1990 నాటి అంతర్యుద్ధం సమయంలో, తాలిబన్లు దేశాన్ని పాలించిన 1996–2001 మధ్య కాలంలో కానీ ఈ లోయ ఎప్పుడూ ఎవరి వశం కాలేదంటే మసూద్ పోరాట పటిమే కారణం. ఆ లోయలో లక్షా 50 వేల మంది వరకు నివసిస్తారు. వారంతా తాజిక్ తెగకు చెందిన వారు. మరోవైపు పాస్తూన్ తెగ వారు ఎక్కువగా తాలిబన్ ముఠాలో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మçసూద్ శక్తియుక్తులతో వారు ఆ లోయవైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. పంజ్షీర్ లోయతో పాటు చైనా, తజికిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య పాకిస్తాన్ వరకు ఆయన ప్రభావమే ఉండేది. మసూద్కి సంప్రదాయ ఇస్లామ్ భావాలు ఉన్నప్పటికీ సమాజంలో మహిళలకు సమాన స్థానం ఇవ్వాలని ఆరాటపడేవారు. అయితే మసూద్ గ్రూప్ సభ్యులే ఎక్కువగా మానహక్కుల్ని హరించారన్న విమర్శలు ఉన్నాయి. 2001లో మసూద్ని అల్ఖాయిదా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ లోయను నడిపిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మద్లు కూడా ఆయనకు సహకరిస్తూ లోయను కాపాడుతున్నారు. పచ్చల లోయ ఈ లోయలో ఎక్కువగా ఎమరాల్డ్ (పచ్చలు) లభిస్తాయి. ఇప్పటివరకు ఇంకా తవ్వకం చేపట్టని ఎన్నో పచ్చల గనులు ఉన్నాయి. అవే ఈ ప్రాంతానికి ప్రధాన ఆదాయ వనరు. అమెరికా నాటో దళాలు స్వాదీనంలో అఫ్గాన్ ఉన్నప్పుడు ఈ లోయలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. అఫ్గాన్లో ఇంధనానికి ఒక హబ్గా మారింది. ఎన్నో జలవిద్యుత్ ఆనకట్టల్ని ఈ లోయలో నిర్మించారు. విద్యుత్లో స్వయంసమృద్ధిని సాధించిన ప్రాంతం ఇదొక్కటే. పచ్చల గనులతో ఆర్థికంగా పటిష్టంగా ఉండడంతో తాలిబన్లు ఈ లోయని ఆక్రమించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. పంజ్షీర్కు ఎదురయ్యే సవాళ్లేంటి ? పంజ్షీర్లో పచ్చలు, వెండి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆహారం, వైద్యం అవసరాల కోసం అఫ్గాన్లో ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పదు. ప్రస్తుతం ఈ లోయ చుట్టూ తాలిబన్లు తమ కమాండర్లను మోహరించారు. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల సరఫరా నిలిపివేశారు. అయితే ఆ లోయలో వచ్చే చలికాలం వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరించే ఆ లోయ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా కనిపిస్తోంది. పంజ్షీర్పై పూటకొక రకమైన వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Afghanistan- Panjshir: పంజ్షీర్లో హోరాహోరీ
కాబూల్: అఫ్గానిస్తాన్లో తమ స్వాదీనంలో లేని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్షీర్ను ఎలాగైనా తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలతో ఆ లోయలో హోరాహోరీ పోరాటం జరుగుతోంది. తాలిబన్లు, వారిని గట్టిగా ప్రతిఘటిస్తున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ (ఎన్ఆర్ఎఫ్ఏ) ఎవరికి వారే తమదే పై చేయిగా ఉందని చెప్పుకుంటున్నారు. ఖవాక్ మార్గం వద్ద వందలాది మంది తాలిబన్లతో జరిగిన పోరులో 700 మందికిపైగా తాలిబన్లు మరణించారని, మరో 600 మందిని నిర్బంధించి జైళ్లలో ఉంచామని ఎన్ఆర్ఎఫ్ఏ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు పంజ్షీర్ ప్రావిన్స్ బజారక్లోకి ప్రవేశించి గవర్నర్ కార్యాలయాన్ని చుట్టుముట్టినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ అదంతా ఉత్తదేనని తేలింది. పంజ్షీర్ ప్రావిన్స్లో ఉన్న ఏడు జిల్లాలకు గాను నాలుగు జిల్లాలైన షూతల్, అనాబా, ఖింజ్, ఉనాబాలపై పట్టు సాధించామని తాలిబన్ అధికార ప్రతినిధి బిలాల్ కరిమి వెల్లడించినట్టుగా అస్వాకా న్యూస్ ఏజెన్సీ కథనాన్ని ప్రచురించింది. మానవీయ సంక్షోభాన్ని నివారించండి: యూఎన్కు సలేహ్ లేఖ పంజ్షీర్ లోయపై తాలిబన్లు భీకరంగా దాడి చేస్తున్నారని, ఈ లోయలో మానవీయ సంక్షోభం ముంచుకొస్తుందని అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల దాడుల్ని అడ్డుకొని మానవీయ సంక్షోభం నుంచి లోయని కాపాడాలంటూ ఆయన ఐక్యరాజ్యసమితి(యూఎన్)కి ఒక లేఖ రాశారు. తమ లోయకి తాలిబన్లు కమ్యూనికేషన్లని కట్ చేశారని, ఆర్థికంగా కూడా దిగ్బంధిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్ల దాడిని అడ్డుకొని చర్చల ద్వారా ఒక రాజకీయ పరిష్కారానికి కృషి చెయ్యాల్సిన అవసరం ఉందని సలేహ్ ఆ లేఖలో పేర్కొన్నారు. చర్చలకు సిద్ధం: మసూద్ తాలిబన్లు పంజ్షీర్, అంద్రాబ్ల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటే వారితో చర్చలకు సిద్ధమని ఎన్ఆర్ఎఫ్ఏ నాయకుడు అహ్మద్ మసూద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘శాంతియుతంగా తాలిబన్లతో విభేదాలను పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నాం. వివిధ గ్రూపులు, తెగలతో సమ్మిళిత అధికార వ్యవస్థ నెలకొంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. దేశీయ విమానాలు షురూ... కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జాతీయ విమానసంస్థ అరియానా అఫ్గాన్ ఎయిర్లైన్స్హెరాత్, కాందహార్, బాల్ఖ్లకు విమానాలను నడిపింది. రాడార్ వ్యవస్థ లేనందువల్ల పగటి పూట మాత్రమే విమానాలు నడుస్తున్నాయి. కాబూల్ విమానాశ్రయం పునరుద్ధరణకు ఖతార్, టర్కీ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవల పునరుద్ధరణ మానవతా సాయానికి వీలుకలి్పస్తుందని యూఎన్ పేర్కొంది. -
Afghanistan: అధికారం కోసం హక్కానీ, బరాదర్ పోరు
కాబూల్: అఫ్గనిస్తాన్లో అధికారం ఎవరు చేపట్టనున్నారనే దానిపై గందరగోళం నెలకొంది. ముల్లా బరాదర్తో ప్రభుత్వాన్ని పంచుకోవటానికి హక్కానీ నెట్వర్క్ సిద్దంగా లేనట్లు సమాచారం. హక్కానీ గ్రూపునకు పాకిస్తాన్ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఈ గ్రూపు అతి సాంప్రదాయవాద సున్నీ పస్తున్ ప్రభుత్వం వైపు మొగ్గుచూపుతోంది. దోహ శాంతి చర్చల్లో తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగం చీఫ్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. (చదవండి: అఫ్గానిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా బరాదర్?) అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా మైనారిటీలు ప్రభుత్వంలో భాగం కావాలని బరదార్ కోరుకుంటున్నారు. కానీ, హక్కానీ అధినేత, తాలిబన్ల ఉప నాయకుడు సిరాజుద్దీన్ అతని టెర్రరిస్ట్ మిత్రులు మాత్రం ఎవరితోనూ ప్రభుత్వాన్ని పంచుకోవటాని ఇష్టపడటం లేదు. నూటికి నూరు శాతం తాలిబన్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు. తాము కాబూల్ని గెలుచుకున్నామని, అఫ్గన్ రాజధానిపై ఆధిపత్యం కలిగిఉన్నామని, వెనక్కు తగ్గాలని బరాదర్ను కోరారు. కాగా, బరాదర్ ప్రభుత్వాధినేతగా శనివారమే అఫ్గన్లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ, చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే వారం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు స్పష్టం చేశారు. -
భారీ షాక్.. 600 మంది తాలిబన్ల హతం!
Afghanistan Panjshir Talibans Fight: అఫ్గనిస్తాన్లో ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది. అఫ్గన్ ప్రతిఘటన దళాలు, తాలిబన్లు చేస్తున్న పరస్పర పైచేయి ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కీలకమైన పంజ్షీర్ ప్రావిన్స్ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబన్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈలోపు పంజ్షీర్ తిరుగుబాటు దళం ఆ ప్రకటనను ఖండించింది. యుద్ధం కొనసాగుతోందని... పంజ్షీర్ లొంగిపోలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు పంజ్షీర్ ప్రతిఘటన దళం నుంచి మరో ప్రకటన వచ్చింది. హోరాహోరీ పోరులో 600 మంది తాలిబన్లను మట్టుపెట్టినట్లు ప్రకటించుకుంది. పంజ్షీర్ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలకు పంజ్షీర్ యోధుల నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాము జరిపిన దాడుల్లో ఆరు వందల మంది తాలిబన్లు చనిపోయారని, వెయ్యి మందికి పైగా లొంగిపోయారని పంజ్షీర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టి ప్రకటించాడు. ఇక తాలిబన్ల దాడులను తిప్పి కొడుతున్నామని పంజ్షీర్లు చేస్తున్న ప్రకటనలతో... వాస్తవ పరిస్థితి ఏంటన్న దానిపై అంతర్జాతీయ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు పంజ్షీర్ దళాల ప్రకటనను తాలిబన్లు ధృవీకరించడం లేదు. పంజ్షీర్ ప్రావిన్స్పై తాలిబన్ల యుద్ధం కొనసాగుతోందని చెప్పారు. అయితే పంజ్షీర్ రాజధాని బజారక్కి వెళ్లే రోడ్డు మార్గంలో ల్యాండ్ మైన్లు అమర్చారని, అందువల్లే అక్కడి నుంచి ముందుకెళ్లడం కష్టంగా మారిందని చెప్పారు. ఇప్పటివరకూ పంజ్షీర్లోని ఏడు జిల్లాల్లో నాలుగు తాలిబన్ల ఆధీనంలోకి వచ్చాయన్నారు. మిగతా జిల్లాలను కూడా వీలైనంత త్వరగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మధ్య ప్రావిన్స్ వైపు నుంచి తాలిబన్లు పోరాడుతున్నారని తాలిబన్ ప్రతినిధి బిలాల్ కరిమీ వెల్లడించారు. చదవండి: అఫ్గన్ ప్రభుత్వ ఏర్పాటు.. రంగంలోకి పాక్ ఇరు వర్గాలు ప్రకటనలైతే చేస్తున్నాయి గానీ... ఎక్కడా ఆధారాలు బయటపెట్టట్లేదు. దీంతో ఈ పరస్పర ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇంకోవైపు కాబూల్ ఎయిర్పోర్ట్ను తిరిగి ప్రారంభించిన తాలిబన్లు.. మిగతా దేశాల ప్రతినిధులు, రవాణా, సహాయక చర్యల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్లిక్ చేయండి: తాలిబన్ల అత్యుత్సాహం.. అమాయకులు బలి -
భారత్ ఆందోళనలపై తాలిబన్లు సానుకూలం!
వాషింగ్టన్: అఫ్గాన్ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. తాలిబన్ల అ«దీనంలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్లో పాక్ చర్యల్ని భారత్, అమెరికా నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.అఫ్గాన్లో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని శ్రింగ్లా తెలిపారు. (చదవండి: Kodanad Case: వీడని మిస్టరీ.. అంతులేని ‘కొడనాడు’ కథ) అఫ్గాన్పై అమెరికా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందని, భారత్ సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. వేగంగా మారుతున్న పరిణామాలు ఎలా రూపుదిద్దుకుంటాయో గమనిస్తున్నామన్నారు.తాలిబన్లతో భారత్ సంబంధాలు పరిమితమని, ఇటీవలి భేటీలో ఏ విషయంపైనా విస్తృత స్థాయిలో చర్చలు జరగలేదన్నారు. అయితే, అఫ్గాన్ గడ్డను ఉగ్ర అడ్డాగా మారుతుందేమోనన్న భారత ఆందోళనపై సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని తెలిపారు. అఫ్గాన్ భూభాగంలోని అనేక శక్తులకు పాక్ అండగా నిలిచిందని చెప్పారు. ఐరాస ఆంక్షల జాబితాలోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు అఫ్గాన్లోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నాయని, వీరి కదలికలపై కన్నేసి ఉంచామని తెలిపారు. అఫ్గాన్ నుంచి ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు సాగినా తాలిబన్లదే బాధ్యతన్నారు. నవంబర్లో అమెరికాతో చర్చలు భారత్, అమెరికా మధ్య నాలుగో వార్షిక 2+2 చర్చలు నవంబర్లో వాషింగ్టన్లో జరుగుతాయని హర్షవర్ధన్ చెప్పారు. ఈదఫా చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్నాధ్ సింగ్, జైశంకర్లు తొలిసారి బైడెన్ ప్రభుత్వంలోని రక్షణ, విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నారు. (చదవండి: బీజేపీ నేత సువేందుకు సమన్లు) -
అఫ్గాన్లో ప్రభుత్వ ఏర్పాటు మళ్లీ వాయిదా
కాబూల్: అఫ్గానిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్న తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ ముఠా అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగం చీఫ్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా శనివారమే అఫ్గాన్లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ, చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే వారం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల మద్దతు లభించేలా ప్రభుత్వాన్ని కూర్చే పనిలో ఉండడం వల్లే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోందని తాలిబన్ చర్చల కమిటీ సభ్యుడు ఖలీల్ హక్కానీ చెప్పారు. తాలిబన్లకి ఇప్పటికే మద్దతు ప్రకటించిన జమైత్ ఏ ఇస్లామీ అఫ్గానిస్తాన్ చీఫ్, దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సోదరుడైన గుల్బుద్దీన్ హెక్మత్యార్కు ప్రభుత్వంలో చోటు లభించనుంది. పంజ్ïÙర్లో కొనసాగుతున్న పోరాటం అఫ్గానిస్తాన్లో పంజ్ïÙర్ లోయ ఇంకా తాలిబన్ల వశం కాలేదు. శనివారం మళ్లీ ఇరు వర్గాల మధ్య పోరాటం మొదలైంది. ఇప్పటివరకు తాలిబన్ల కన్ను పడని పంజ్ïÙర్ను ఆక్రమించుకున్నట్టుగా శుక్రవారం వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం వదంతులేనని తేలింది. పంజ్ïÙర్ తమ స్వాధీనంలోకి వచి్చందని ఇప్పటివరకు తాలిబన్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోవియెట్ యూనియన్ ఆక్రమణలో ఉన్నప్పుడు, తాలిబన్ల పరిపాలనలోనూ పంజ్ïÙర్ స్వతంత్రంగానే వ్యవహరించింది. 1996–2001 మధ్య కాలంలో తాలిబన్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆ ప్రాంతాన్ని కూడా తమ వశం చేసుకోవాలని తాలిబన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలే, తాలిబన్లను తీవ్రంగా వ్యతిరేకించే అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ల అ«దీనంలో పంజ్షీర్ లోయ ఉంటుంది. గాల్లోకి కాల్పులు.. 17 మంది మృతి! పంజ్ïÙర్ తాలిబన్ల పరమైందని వదంతులు వ్యాపించడంతో రాజధాని కాబూల్లో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కాల్పుల్లో 17 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. అయితే వారు అలా సంబరాలు చేసుకోవడాన్ని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తప్పు పట్టారు. ఆయుధాలనేవి ప్రభుత్వ ఆస్తి అని, వాటిని గాల్లోకి పేలుస్తూ వృథా చేయరాదని హితవు చెప్పారు. మహిళా కార్యకర్త తలకి గాయాలు మహిళలు తమ హక్కుల్ని కాపాడాలంటూ చేస్తున్న ఉద్యమాన్ని తాలిబన్లు అణగదొక్కేస్తున్నారు. మహిళలు తమ రాజకీయ హక్కుల్ని కాపాడా లంటూ అధ్యక్ష భవనం వరకు తీసిన ర్యాలీని తాలిబన్లు అడ్డుకొని బాష్పవాయువు ప్రయోగిం చారు. మహిళల్ని విచక్షణారహితంగా కొట్టినట్టుగా టోలో న్యూస్ వెల్లడించింది. ఉద్యమకారిణి నర్గీస్ సద్దాత్ను చితకబాదారు. తలకి బలమైన గాయంతో ముఖమంతా నెత్తురోడుతూ ఆమె ఆ నిరసన ప్రదర్శనలో కనిపించారు. అందరినీ కలుపుకొని పోవాలి: అమెరికా తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనారీ్టల హ క్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు. మరోవైపు అఫ్గాన్లో మానవ సంక్షోభం, ఆరి్థక సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 13న జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం కానుంది. కాబూల్కు ఐఎస్ఐ చీఫ్ ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు, మరోవైపు పంజ్ïÙర్లో కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో పాకిస్తాన్లో అత్యంత శక్తిమంతమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ కాబూల్కు చేరుకున్నారు. ఆయన వెంట పాక్ అధికారుల బృందం కూడా వచి్చంది. తాలిబన్ల ఆహా్వనం మేరకే హమీద్ అఫ్గాన్ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్ఐ చీఫ్ను ఆహా్వనించడంతో వారిమధ్య సుదృఢ బంధాలు తేటతెల్లమవుతున్నాయి. తాలిబన్ అగ్ర నేతలు, కమాండర్లతో ఐఎస్ఐ చీఫ్ çచర్చలు జరపనున్నారు. -
తాలిబన్ల వల్లే పెట్రోల్ ధర పెరిగింది: బీజేపీ ఎమ్మెల్యే
బెంగళూరు: అఫ్గనిస్తాన్లో తాలిబన్ల అరాచకం ప్రారంభం అయిన నాటి నుంచి మన దేశంలో వారి ప్రస్తావన బాగా పెరిగింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకునే క్రమంలో నేతలను తాలిబన్లతో పోలుస్తూ.. తిడుతున్నారు. మరి కొందరు నాయకులు ఓ అడుగు ముందుకు వేసి.. దేశంలో ఇంధన ధరలు, వంట గ్యాస్ ధరలు పెరగడానికి కారణం తాలిబన్లే అని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఈ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. కర్ణాటక హుబ్లీ-ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బల్లాడ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్లో తాలిబన్ల సంక్షోభం ముదురుతుంది. అందువల్ల ముడి చమురు సరఫరాలో తగ్గుదల ఉంది. ఫలితంగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఓటర్లుకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు. ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: చౌకగా పెట్రోల్ కావాలా?, అయితే, అఫ్గానిస్తాన్ వెళ్లండి: బీజేపీ నేత) అరవింద్ వ్యాఖ్యలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గన్లో తాలిబన్ల సంక్షోభం మొదలై నెల రోజులు అవుతుందేమో. కానీ దేశంలో గత కొద్ది నెలల నుంచి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీనికి తాలిబన్లతో ముడిపెట్టడం ఏంటి.. పైగా జనాలకు జ్ఞానం లేదని బుద్ధిలేని వ్యాఖ్యలు చేసి.. నీ తెలివితేటలు ప్రదర్శించుకున్నావ్ అంటూ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు జనాలు. (చదవండి: అఫ్గన్లో ప్రభుత్వ ఏర్పాటు: రంగంలోకి దిగిన పాక్) ఇక ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇక రాయిటర్స్ ప్రకారం ఈ ఏడాది జూలై నాటికి ఇరాక్, సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్, నైజిరియా, అమెరికా, కెనడా దేశాలు భారత్కు ముడి చమురు విక్రయిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ లిస్ట్లో అఫ్గనిస్తాన్ లేదు. ఈ క్రమంలో దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు.. అఫ్గనిస్తాన్లో తాలిబన్ల సంక్షోభానికి ముడి పెట్టడం పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఇంధన ధరల పెంపు అంశంలో కేంద్రంపై భారీ ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంధన ధరలు పెంచుతూ ఇప్పటికే సుమారు 23 లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది అని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు 44 శాతం, డీజిల్ ధరలు 55 శాతం పెరిగినట్లు రాహుల్ గాంధీ విమర్శించారు. చదవండి: అది తాలిబన్ల అఘాయిత్యం కాదు.. సంబురం -
అఫ్గన్లో ప్రభుత్వ ఏర్పాటు: రంగంలోకి దిగిన పాక్
కాబూల్: అఫ్గనిస్తాన్ను వశం చేసుకున్న తాలిబన్ల పట్ల మొదటి నుంచి సానుకూలంగా ఉన్న చైనా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనా తన నమ్మినబంటు పాకిస్తాన్ సాయంతో అఫ్గనిస్తాన్లో తాలిబన్ల రాజ్యం ఏర్పాటు చేసేందుకు సాయం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ శనివారం కాబూల్ చేరుకున్నాడు. అఫ్గన్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సాయం చేయడమేకాక ముల్లా యాకూబ్ నేతృత్వంలోని కాందహరీలు, సిరాజుద్దీన్ హక్కానీ అధ్వర్యంలోని కాబూలీల మధ్య తలెత్తిన అంతర్గత సమస్యల పరిష్కరించడానికి హమీద్ ప్రయత్నించనున్నట్లు తెలిసింది. అలానే పాక్.. అఫ్గన్ ఆర్మీలో హక్కానీలను ప్రవేశపెట్టడానికి పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమచారం. ఐఎస్ఐ, హక్కానీ నెట్వర్క్ పోషకుడిగా పరిగణించబడుతుంది. అంతేకాక ఇది అమెరికా, ఐక్యరాజ్య సమితి హక్కానీని తీవ్రవాద గ్రూపుగా ప్రకటించింది. అంతేకాక ఇది అల్ ఖైదాకు సంబంధించిన సంస్థగా ప్రకటించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రయత్నాల పట్ల అఫ్గన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్ల ప్రధాన సంస్థ పాకిస్తాన్లో ఉన్నట్లు గతంలో అఫ్గన్ ప్రభుత్వం, అమెరికా ఆరోపించినప్పటికి.. పాక్ వాటిని కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. (చదవండి: క్రికెట్ మ్యాచ్లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..?) తాలిబన్లు తాము అఫ్గన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించడంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో హమీద్ కాబూల్ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది. అయితే హమీద్ పర్యటన గురించి ఎలాంటి అధికారక ప్రకటన లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంలో తాలిబన్ నాయకత్వానికి సాయం చేయడానికే హమీద్ కాబూల్ వచ్చాడని మీడియా వర్గాలు వెల్లడించాయి. (చదవండి: తాలిబన్లకు చైనా మరింత మద్దతు, కీలక హామీ ) అయితే ఈ మొత్తం వ్యవహారంలో చైనా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. డ్రాగన్ దేశం పాకిస్తాన్ను ట్రంప్కార్డ్గా వాడుకుని.. తాలిబన్లకు రహస్యంగా సాయం చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అఫ్గన్లో తాలిబన్ల అరాచకాలు మొదలైన వెంటనే అన్ని దేశాలు అక్కడ తమ రాయబార కార్యాలయాలను మూసి వేసినప్పటికి చైనా మాత్రం ఆ పని చేయలేదు. అంతేకాక ప్రస్తుతం చైనానే తమను ఆర్థికంగా ఆదుకుంటుందని తాలిబన్లు భావిస్తున్నారు. అలానే అఫ్గన్లోని విస్తారమైన విస్తారమైన రాగి, లిథియం గనులను దృష్టిలో పెట్టుకుని.. డ్రాగన్ అఫ్గనిస్తాన్ కోసం ఉద్దేశించిన బెల్ట్ రోడ్ పనులను కొనసాగించనున్నట్లు తెలిపింది. చదవండి: అఫ్గన్ వాసుల తాకిడితో చమన్ సరిహద్దులను మూసివేసిన పాక్ -
తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!
కాబుల్: అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్షీర్ ప్రాంతం సవాలుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. తాజాగా శుక్రవారం తాలిబన్లు తాము పంజ్షీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాక తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు జరుపుకున్నారు. అయితే తాలిబన్ల అత్యుత్సాహం సామాన్యుల పాలిట శాపంగా మారింది. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 17 మంది అఫ్గన్ పౌరులు మరణించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. (చదవండి: కొరకరాని కొయ్యగా పంజ్షీర్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?) రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ (ఎన్ఆర్ఎఫ్ఏ) ఓడించి, పంజ్షీర్ను అధీనం చేసుకున్నట్టు తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం గాల్లో కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనలో సుమారుగా 17 మంది మృతి చెందగా, 41 మంది గాయపడ్డారు. ఇలాంటి పనులతో పౌరులకు హాని తలపెట్టవద్దని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ట్విట్టర్లో సైనికులకు సూచనలు చేశారు. తిరుగుబాటుదారులు శాంతియుతంగా లొంగిపోవాలని ప్రకటించారు. అయితే పంజ్షీర్ తిరుగుబాటుదారుల నాయకుడు అహ్మద్ మసూద్ మాత్రం దీన్ని కొట్టిపారేశాడు. ఈ విషయంపై పాకిస్తాన్ మీడియాల్లో ప్రసారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రతిఘటన దాడులు కొనసాగుతునే ఉన్నాయని అహ్మద్ మసూద్ స్థానిక మీడియాకు వెల్లడించారు. کابل ښار او ټول هیواد کې د مجاهدینو د پام وړ: له هوایي ډزو څخه جدا ډډه وکړئ او پر ځای یې د الله تعالی شکر اداء کړئ. ستاسي په لاس کې وسله او مرمۍ بیت المال دي، هیڅوک یې د ضائع کیدو حق نلري. سړې مرمۍ عامو خلکو ته د زیان اړولولو قوي احتمال لري؛ نو بناء بې ځایه ډزې مه کوئ. — Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) September 3, 2021 Afghanistan: తాలిబన్లకు కీలక సమాచారం చిక్కకూడదనే.. -
Afghanistan: తాలిబన్లకు కీలక సమాచారం చిక్కకూడదనే..
అఫ్గనిస్తాన్లో రాజ్యాధికారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన తాలిబన్లకు గూగుల్ పెద్ద షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం అందించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు అకౌంట్లు, మెయిల్స్ను తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు ప్రకటించిన గూగుల్.. మరోవైపు తాలిబన్ల నుంచి వస్తున్న విజ్ఞప్తులను తోసిపుచ్చుతోంది. గత అఫ్గన్ ప్రభుత్వానికి సంబంధించిన ఈ-మెయిల్ అకౌంట్లను, మాజీ అధికారుల మెయిల్స్ను, అఫ్గన్ డిజిటల్ డేటా సర్వర్లను గూగుల్ తాతాల్కికంగా బ్లాక్ చేసింది. అయితే అది ఏ సంఖ్యలో అనేది గూగుల్ వెల్లడించలేదు(దాదాపు 24 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు అంచనా). ‘‘అఫ్గన్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, వాటిని అన్బ్లాక్ చేసే విషయంపై వేచిచేత ధోరణిని అవలంభించనున్నామ’’ని శుక్రవారం గూగుల్ మాతృక సంస్థ ఆల్ఫాబెట్ ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఒకవేళ తాలిబన్లు పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా.. ఆ వివరాల్ని అందించే ఉద్దేశంలో గూగుల్ లేదని తెలుస్తోంది. చంపేస్తారనే భయంతో.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ప్రభుత్వ అధికారులు, విదేశాలకు చెందిన ప్రతినిధులు అఫ్గన్ వ్యవస్థకు చెందిన కీలక సమాచారానికి(డాటా)ను వదిలేసి పారిపోయారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాల్ని వెల్లడించాలంటూ గూగుల్కు, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు మెయిల్స్ ద్వారా తాలిబన్ సంస్థ రిక్వెస్ట్ మెయిల్స్ పెడుతోంది. ఒకవేళ ఆ డాటా తాలిబన్ల చేతికి వెళ్తే పరిస్థితి ఏంటన్నది అంచనా వేయలేకపోతున్నారంతా. పైగా బయోమెట్రిక్ డేటా బేస్ ఆధారంగా చేసుకుని కొత్త ప్రభుత్వం(తాలినబ్ల నేతృత్వంలోని).. గతంలో తమకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లను, పని చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గప్చుప్ కీలక సమాచారాన్ని తాలిబన్ల చేతికి వెళ్లనివ్వకుండా భద్రపరిచే విషయంలో గూగుల్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే మైక్రోసాఫ్ట్ మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు. మైకోసాఫ్ట్ ఈ మెయిల్స్ సర్వీస్ ద్వారానే గతంలో అఫ్గన్ అధ్యక్ష భవనం, విదేశాంగ శాఖ, అఫ్గన్ ఏజెన్సీలన్నీ కీలక సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్నాయి. ఈ తరుణంలో ఆ డాటా భద్రతపై మైక్రోసాఫ్ట్ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. పైగా స్పందించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది కూడా. హాని తలపెట్టం: తాలిబన్లు ప్రభుత్వ-ఆర్థిక సంబంధిత వ్యవహారాల కోసమే తాము డిజిటల్ డాటాను కోరుతున్నామని తాలిబన్లు చెప్తున్నారు. అమెరికాకు ఏజెంట్లుగా పని చేసిన అఫ్గన్ పౌరులను క్షమించి వదిలేస్తున్నామని ఇది వరకే ప్రకటించామని, అఫ్గన్ వ్యవస్థ సజావుగా నడవాలంటే పాత రికార్డులు తప్పనిసరిగా అవసరమని తాలిబన్లు చెప్తున్నారు. కానీ, ఈ విషయంలో తాలిబన్లను నమ్మే ప్రసక్తే లేదని అమెరికా అంటోంది. దురాక్రమణ టైంలో కీలక సమాచారానికి చెందిన సర్వర్స్ను తాలిబన్లు భద్రపరిచే ప్రయత్నాలు చేశారని, అఫ్గన్లో అమెరికా నిర్మించిన డిజిటల్ వ్యవస్థను ట్రేస్ చేసే ప్రయత్నామూ జరిగిందని అమెరికా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. చదవండి: తాలిబన్లతో సంప్రదింపులు అవసరం -
కశ్మీర్ విషయం లో మాటమార్చిన తాలిబన్లు
-
కశ్మీర్ ముస్లింల హక్కులపై మాట్లాడుతాం!
ఇస్లామాబాద్: కశ్మీర్ సహా ప్రపంచంలోని ముస్లింల హక్కుల కోసం గళమెత్తుతామని తాలిబన్లు ప్రకటించారు. ఒకపక్క భారత్తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని, కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోమంటూనే కశ్మీర్పై తాలిబన్లు కొత్త ప్రేలాపనలు మొదలుబెట్టారు. కశ్మీర్ సహా ఎక్కడ నివసించే ముస్లింల హక్కుల కోసమైనా మాట్లాడే హక్కు తమకుందని, అయితే ఏ దేశానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలు చేపట్టే విధానం తమకు లేదని తాలిబన్లు వింత భాష్యాలు చెప్పారు. అఫ్గాన్ తిరిగి తాలిబన్ పాలనలోకి పోవడంతో భారత్కు ఉగ్రముప్పు పెరిగిందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సహా ప్రపంచంలో ఎక్కడ నివసించే ముస్లింల కోసమైనా మాట్లాడే హక్కు సాటి ముస్లింలుగా తమకుందన్నారు. ఇటీవలే ఖతార్లో భారత రాయబారితో భేటీ అయిన తాలిబన్లు..అఫ్గా్గన్ గడ్డను ఉగ్రనిలయంగా మార్చమంటూ హామీ ఇచ్చారు. కశ్మీర్ భారత అంతర్గత విషయమని, తాము జోక్యం చేసుకోబోమని గతంలో తాలిబన్లు చేసిన ప్రకటనతో తాజా ప్రకటన విభేదిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు భావిస్తున్నారు. అలాగే భారత వ్యతిరేక హక్కానీ నెట్వర్క్పై సైతం తాలిబన్ల స్వరం మారింది. హక్కానీలపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారాలని సుహైల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. పంజ్ షీర్ తాలిబన్ల వశం! ఇన్నాళ్లూ తమకు ఎదురు నిలిచిన పంజ్ షీర్ లోయను సైతం స్వాధీనం చేసుకున్నామని, తద్వారా మొత్తం అఫ్గానిస్తాన్పై పూర్తి పట్టు సాధించామని తాలిబన్ కమాండర్ ఒకరు శుక్రవారం ప్రకటించారు. పంజ్ షీర్లోని తిరుగుబాటుదారులపై విజయం సాధించామని చెప్పారు. కీలకమైన పంజ్ షీర్ తమ వశం కావడంతో రాజధాని కాబూల్లో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. పంజ్ షీర్ను ఆక్రమించినట్లు తాలిబన్లు చెబుతున్నప్పటికీ అధికారికంగా ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. పునర్నిర్మాణానికి చైనా సాయం చైనా తమకు అత్యంత కీలక భాగస్వామి అని, అఫ్గాన్ పునరి్నర్మాణానికి చైనా సాయం తీసుకుంటామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. అఫ్గాన్లోని ఖనిజ నిక్షేపాలు వెలికితీసి దేశానికి ఆర్థిక ఆసరా అందించేందుకు చైనా సహాయం అందిస్తుందన్నారు. చైనా ప్రతిపాదిత వన్బెల్ట్, వన్ రోడ్ను సమర్థి్ధస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వంపై నేడు ప్రకటన పెషావర్: అఫ్గానిస్తాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు తమ ప్రకటనను ఒకరోజు వాయిదా వేశారు. శనివారం తమ నిర్ణయాన్ని వెల్ల డిస్తామని చెప్పారు. కొత్త సర్కారు అధినేతగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు తెరపైకి వచ్చింది. తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడైన బరాదర్ ప్రస్తుతం దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ చైర్మన్గా ఉన్నాడు. అఫ్గానిస్తాన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై గత ఏడాది అమెరికాతో జరిగిన చర్చల్లో కీలకంగా వ్యవహరించాడు. ప్రమాదంలో మహిళా జడ్జీలు కాబూల్: తాలిబన్ల రాకతో అఫ్గానిస్తాన్లో మహిళా జడ్జీల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పలువురు నేరస్తులను ఇటీవల తాలిబన్లు విడిపించారు. దీంతో తమకు శిక్ష విధించిన మహిళా జడ్జీలపై ప్రతీకారం తీర్చుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జనవరిలోనే తాలిబన్లు ఇద్దరు మహిళా న్యాయమూర్తులను కాల్చి చంపారు. ఇలా ప్రమాదం అంచుల్లో ఉన్న మహిళా జడ్జీల సంఖ్య 250 వరకూ ఉంది. తాలిబన్లు అఫ్గాన్ను హస్తగతం చేసుకోగానే కొందరు దేశాన్ని వదిలి వెళ్లిపోగా పరిస్థితులు అనుకూలించక కొందరు ఇక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు వారి ఇళ్లకు వెళ్లి తమకు శిక్ష విధించిన మహిళా జడ్జి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నట్లు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ విమెన్ జడ్జెస్ (ఐఏడబ్ల్యూజే) సభ్యులు తెలిపారు. విడుదలతోనే ప్రమాదం.. దోషులను తాలిబన్లు విడుదల చేయడంతోనే అసలు ప్రమాదం ప్రారంభమైందని అఫ్గాన్ నుంచి యూరోప్కు వెళ్లిన ఓ మహిళా జడ్జి చెప్పారు. జడ్జిలేగాక సామాజిక కార్యకర్తలైన మహిళలకు సైతం ముప్పు పొంచి ఉందని వివరించారు. ‘మిమ్మల్ని వెంటాడి తీరుతాం’ అని తాలిబన్లు ఇప్పటికే మహిళా పోలీసు ఆఫీసర్లకు సందేశాలు పంపినట్లు వెల్లడించారు. తమ హక్కులను కాపాడాలంటూ అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో మహిళల ర్యాలీ -
తాలిబన్లకు ఊహించని ఝలక్
ఇరవై ఏళ్ల స్వేచ్ఛకు కళ్లెం వేయాలనే ప్రయత్నానికి అఫ్గన్ మహిళ ఎదురు తిరిగింది. తాలిబన్ల దురాక్రమణ జరిగిన మరుక్షణం నుంచి అఫ్గన్ నేలపై మహిళా భద్రత గురించి ఆందోళన వ్యక్తం అయిన విషయం తెలిసిందే. అణచివేత పరిణామాలు ఉండబోవని ఓవైపు చెబుతూనే.. మరోవైపు కట్టడికి తాలిబన్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ తరుణంలో హక్కుల కోసం అఫ్గన్ మహిళలు గళం లేవనెత్తారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ వేల మంది అఫ్గన్ మహిళలు ర్యాలీలు చేపడుతున్నారు. ‘‘మేం అసహనంలో ఉన్నాం’’.. ఈ ఫ్లకార్డులతో ప్రస్తుతం అఫ్గన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది అఫ్గన్ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘మా హక్కులు మాకు ఇవాల్సిందే’ అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. అఫ్గన్ పశ్చిమ ప్రాంతంలోని చాలా ఊళ్లలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మూడో అతిపెద్ద పట్టణం అయిన హెరాత్లో యాభై మంది మహిళలు మొదలుపెట్టిన నిరసన ప్రదర్శన.. మిగతా మహిళల్లో స్ఫూర్తి, ధైర్యాన్ని నింపింది. ఉద్యోగాల నుంచి తమను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వాళ్లు. ‘‘తాలిబన్ల ఆక్రమణ పరిణామాల తర్వాత యావత్ అఫ్గన్ మహిళా లోకం నాలుగు గోడల నడుమే బంధి అయిపోయింది. ఈ పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో కుటుంబాలను దిగజారుస్తోంది. ఇంట్లో ఆడవాళ్లు పని చేస్తేనే గడవని కుటుంబాలు కూడా ఉన్నాయి. పరిస్థితులు దిగజారకముందే తమను పనులకు అనుమతించాల’’ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ప్రభుత్వమేదైనా.. ప్రజాస్వామ్యయుతంగా అఫ్గన్ను చూడాలనుకుంటన్నట్లు వాళ్లు కోరుకుంటున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మరోపక్క ఆడవాళ్లు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి తమ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాబోవని, వాళ్లకు ఆ స్వేచ్ఛ ఉందని తాలిబన్లు ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు మహిళా నిరసనకారులు. ‘‘తాలిబన్లవి అబద్దపు ప్రచారాలు. ఆడవాళ్లను అసలు ఆఫీసుల్లోకి అనుమతించడం లేదు. కాదని వెళ్లే ప్రయత్నాలు చేస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఆడ పిల్లలను స్కూల్స్, కాలేజీల్లోకి అనుమతించలేదు. ఇదేనా వాళ్లిచ్చే స్వేచ్ఛ’’ అంటూ తాలిబన్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే ! విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. ఇప్పటికే తాలిబన్ల సమావేశాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకపోగా.. క్యాబినెట్లోనూ మహిళలకు చోటు దక్కకపోవచ్చనే సంకేతాలిస్తుండడంపై అఫ్గన్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హక్కుల్ని రక్షించుకోవడం కోసం చావడానికైనా సిద్ధం అని ప్రకటించుకుంటున్నారు వాళ్లు. మరోవైపు కుటుంబాలతో సహా ఆడవాళ్లు నిరసనల్లో పాల్గొంటున్నారు. ‘‘బుర్ఖాలకు మేం సిద్ధం. ప్రతిగా తమ ఆడబిడ్డలను చదువు, ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని కొందరు తల్లులు, తాలిబన్లను డిమాండ్ చేస్తున్నారు. కాబూల్లో కిందటి నెలలో ఇలాంటి ర్యాలీ ఒకటి జరిగింది. అయితే తాలిబన్లు సమర్థవంతంగా ఆ ఉద్యమాన్ని అణచివేశారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో తలమునకలైన క్రమంలో ఊహించని పరిణామాలు ఎదురుకావడం తాలిబన్లకు మింగుడు పడడం లేదు. చదవండి: తాలిబన్ చీఫ్ అఖుంద్జాదా గురించి ఆసక్తికర విషయాలు -
దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉండదు
-
అప్ఘాన్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు
-
అది తాలిబన్ల అఘాయిత్యం కాదు.. సంబురం
Taliban Hangs To Helicopter: అమెరికా-నాటో దళాలు అఫ్గన్ నేలను విడిచిన తర్వాత తాలిబన్లు రెచ్చిపోతున్నారంటూ కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాందహార్లో ఓ వ్యక్తిని చంపి.. అమెరికా గస్తీ హెలికాప్టరుకు వేలాడదీసి గగనతంలో తాలిబన్లు తిప్పిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అమెరికా రాజకీయ వేత్తలు, నటుల నుంచి మొదలు.. భారత జర్నలిస్టులు, మీడియా హౌజ్ల దాకా ఇదొక అఘాయిత్యంగా పేర్కొంటూ కథనాలు ప్రసారం చేశాయి. అయితే.. అయితే అది తప్పుడు వార్త. మిలియన్ల మంది షేర్ చేసిన ఈ వీడియో నిజం కాదని నిర్ధారణ అయ్యింది. పన్నెండు సెకండ్ల వీడియో వీడియో బిల్డింగ్ల మధ్య ఓ వ్యక్తి వేలాడుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అమెరికా పాట్రోలింగ్ హెలికాఫ్టర్ ఉపయోగించి.. ఓ వ్యక్తిని తాలిబన్లు చంపి ఉరేగించారని, ప్రజలకు భయంకరమైన సందేశాన్ని పంపారంటూ పలువురు భారత జర్నలిస్టులు వరుసపెట్టి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై అమెరికాలో రాజకీయ దురమారం సైతం చెలరేగింది. కానీ, ఇది విషాదం కాదని.. సంబురం అని ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్లో తేలింది. Afghan pilot flying this is someone I have known over the years. He was trained in the US and UAE, he confirmed to me that he flew the Blackhawk helicopter. Taliban fighter seen here was trying to install Taliban flag from air but it didn’t work in the end. https://t.co/wnF8ep1zEl — BILAL SARWARY (@bsarwary) August 31, 2021 అమెరికా దళాలు ఖాళీ చేశాక.. అమెరికా మిలిటరీ యుద్ధ సామాగ్రి మొత్తాన్ని తాలిబన్లు స్వాధీనపర్చుకున్నారు. సంబురంగా జెండాలు ఎగరేసి వేడుకలు చేసుకున్నారు. కాందహార్లో జెండాను ఎగరేయడానికి బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ ద్వారా ఓ ఫైటర్ను ఉపయోగించుకున్న సందర్భం అది. టబుసమ్ రేడియో అనే పేజీ నుంచి వైరల్ అయ్యింది. అఫ్గన్ రేడియో స్టేషన్ అగస్టు 30న టెలిగ్రామ్లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. కాందహార్లోని గవర్నర్ కార్యాలయం మీద జెండా ఎగరేయడానికి ఆ తాలిబన్ మెంబర్ ప్రయత్నించాడు. ఫుల్ లెంగ్త్ వీడియోలో చేతులు ఊపడం కూడా చూడొచ్చు. అమెరికా భద్రత దళాల ఉపసంహరణ సందర్భంగా తాలిబన్ల సంబురంలో భాగంగా ఈ ఘటన జరిగింది. కేవలం అక్కడే కాదు.. చాలాచోట్ల జెండాను ఎగరేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. చదవండి- తాలిబన్లు మంచోళ్లు: క్రికెటర్ -
బిర్యానీ ప్రియులకు షాక్.. పెరిగిన రేట్లు!
అఫ్గన్ సంక్షోభం హైదరాబాద్ బిర్యానీపై ప్రభావం చూపెడుతోంది. బిర్యానీ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలను నిజం చేస్తూ.. ఇప్పటికే చాలాచోట్ల రేట్లు పెంపును అమలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని చాలా చోట్ల ఇప్పటికే బిర్యానీ రేట్లు పెరిగాయి. రేపు మొదటి తారీఖు (సెప్టెంబర్ 1) కావడంతో పెంచిన ధరలను అమలు చేయాలని మెజార్టీ రెస్టారెంట్ల ఓనర్లు నిర్ణయించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిన్న, ఓ మోస్తరు రెస్టారెంట్లు సైతం మినిమమ్ 20 నుంచి 30 రూ. పెంచేశాయి. గరిష్టంగా రూ.100 దాకా పెరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికే మెనూను ఆన్లైన్ల్లో అప్డేట్ చేశాయి. పెంచిన ధరల్ని పార్శిల్కు సైతం వర్తింపజేయనున్నారు. అయితే కొన్ని రెస్టారెంట్లు వాటి ఆన్లైన్ ఆర్డర్లకు తప్ప.. దాదాపు మెజార్టీ హోటల్స్, రెస్టారెంట్లు బిర్యానీ రేట్లను పెంచేశాయి. సింగిల్, డబుల్ పీస్, జంబో, ఫ్యామిలీ ప్యాక్.. ఇలా దాదాపు అన్నింటిపైనా వడ్డింపు మొదలు కానుంది. కొన్ని రెస్టారెంట్లు ఆన్లైన్ బుకింగ్పై జీఎస్టీ, ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ చార్జీలతో మోత మోగించడం ఇప్పటికే మొదలుపెట్టేశాయి. చిన్న చిన్న బిర్యానీ పాయింట్లు మాత్రం దాదాపు పాత రేట్లకే బిర్యానీని అందిస్తున్నాయి. బిర్యానీతో పాటు కబాబ్, రకరకాల మాంసాహార, శాఖాహార వంటకాల్లో వాడే డ్రై ఫ్రూట్స్, కొన్నిరకాల మసాల దినుసుల్ని అఫ్గనిస్థాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆ దినుసుల వ్యాపారం మీద ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయి కూడా. అయితే, తాలిబన్ల ఆక్రమణ తర్వాత.. అక్కడి నుంచి వాటి దిగుమతి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీంతో మార్కెట్లో వాటి బల్క్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆ ప్రభావం ‘బిర్యానీ’పై పడగా.. రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెప్తున్నారు. తిరిగి యథాస్థితి నెలకొంటే.. అప్పుడు రేట్ల తగ్గింపు గురించి ఆలోచిస్తామని కొందరు వ్యాపారులు అంటున్నారు. చదవండి: అఫ్గన్ సంక్షోభం.. ఇలాగైతే బిర్యానీ రేట్లు పెరిగే ఛాన్స్! -
తాలిబన్లను పొగిడిన పాక్ క్రికెటర్పై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు
ఇస్లామాబాద్: "తాలిబన్లు సానుకూల దృక్పథంతో ముందుకొచ్చారు.. మహిళలను పనులు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు.. తాలిబన్లు క్రికెట్ను చాలా ఇష్టపడతారంటూ" తాలిబన్ల అనుకూల వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. దీంతో సోషల్మీడియా వేదికగా అఫ్రిదిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ❝Taliban have come with a very positive mind. They're allowing ladies to work. And I believe Taliban like cricket a lot❞ Shahid Afridi. He should be Taliban's next PM. pic.twitter.com/OTV8zDw1yu — Naila Inayat (@nailainayat) August 30, 2021 తాలిబన్ల క్రూర పాలన నుంచి తప్పించుకునే క్రమంలో లక్షల సంఖ్యలో అఫ్గాన్లు, ముఖ్యంగా మహిళలు ఇల్లు వాకిలి వదిలేసి పారిపోతుంటే అఫ్రిది ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు ఊగిపోతున్నారు. అఫ్గాన్ల అవస్థలు కళ్లకు కట్టినట్లు కనబడుతుంటే అఫ్రిది ఈ రకమైన వ్యాఖ్యలు చేయడమేంటని విరుచుకుపడుతున్నారు. తాలిబన్లు శాంతి కాముఖులమంటూనే, మహిళలను అణగదొక్కడం వారి రెండు వారాల పాలనతో తేలిపోయిందని, ఇలాంటి వారికి పాక్ క్రికెటర్ వత్తాసు పలకడాన్ని అతని విజ్ఞతకే వదిలేస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ అఫ్గాన్ మహిళలు, మహిళా జర్నలిస్టులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంటే అఫ్రిది లాంటి ప్రముఖుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని మరికొందరంటున్నారు. "తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టం. వాళ్లు సహకరిస్తే దేశంలో క్రికెట్ బాగా అభివృద్ధి చెందుతుందని" అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై పాక్ మహిళా జర్నలిస్ట్ నైలా ఇనాయత్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ఇతడు తాలిబన్ల తర్వాతి ప్రధాని కావాలి అంటూ సెటైర్ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్మీడియాలో వైరలవుతోంది. చదవండి: అక్కడ జాన్ సీనా అయితే ఇక్కడ సురేశ్ రైనా.. -
ఆఫ్గనిస్తాన్ ని పావుగా వాడుకుని పాకిస్తాన్ కొత్త కుట్ర
-
తాలిబన్ల ‘కే’ తలనొప్పి
తాడిని తన్నేవాడుంటే, వాడి తలదన్నేవాడొకడున్నట్లు అందరినీ భయపెడుతున్న తాలిబన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మరో ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపు. ఐసిస్– ఖొరసాన్గా పిలిచే ఈ గ్రూపు చేస్తున్న దాడులను ఎలా ఎదుర్కోవాలా అని తాలిబన్లు తలపట్టుకుంటున్నారు. అమెరికా సేనలు వెనక్కు పోవడం, పౌర ప్రభుత్వం కూలిపోవడం, దేశంలో చాలా భూభాగం స్వాధీనంలోకి రావడం.. వంటి పరిణామాలు తాలిబన్లకు కలిగిస్తున్న ఆనందాన్ని ఐసిస్–కే దాడులు ఆవిరిచేస్తున్నాయి. ఘనీ ప్రభుత్వం దిగిపోయినందుకు ఆనందించాలా? ఆ ప్రభుత్వ స్థానంలో కూర్చోబోతున్న తమకు ఎదురవుతున్న సవాళ్లకు భయపడాలా? అర్థం కాని పరిస్థితి తాలిబన్లలో నెలకొంది. ఐసిస్–కే నిర్వహించిన కాబూల్లో బాంబు దాడి, ఎయిర్పోర్టుపై రాకెట్ దాడులు వంటివి తాలిబన్లను ఆందోళన పరుస్తున్నాయి. తాలిబన్లు కూడా ఐసిస్–కే లాగానే షరియాకు కట్టుబడి పాలన సాగించే గ్రూపు. మరి అలాంటప్పుడు వీరితో వారికి ఎందుకు వైరం వస్తుందని చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు ఇరు గ్రూపుల లక్ష్యంలో భేదాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సర్కారీ బడుల్లో చదివించే టీచర్లకు అవార్డులు ) 2015లో బీజాలు అఫ్గాన్లో ఐసిస్ ప్రతినిధిగా ఐసిస్– ఖొరసాన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఐసిస్ 2015లో ప్రకటించింది. వెంటనే ఈ గ్రూపుపై తాలిబన్లు యుద్ధం ప్రకటించారు. తాలిబన్లు అఫ్గాన్లో షరియా ఆధారిత పాలనా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆవిర్భవించిన గ్రూపు. తాలిబన్ల ఎజెండా అఫ్గాన్కే పరిమితం. విదేశీయుల నుంచి అఫ్గాన్కు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తాలిబన్లు అంటారు. కానీ ఐసిస్ లక్ష్యం అఫ్గాన్తో ఆగదు. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో అన్ని ముస్లిం దేశాలను కలుపుకొని ఖలీఫత్ (ఇస్లామిక్ రాజ్యం) ఏర్పాటు ఐసిస్ ప్రధాన లక్ష్యం. ఇందువల్లనే తాలిబన్లకు, ఐసిస్కు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తాలిబన్లు పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలని, అఫ్గాన్లో ఆధిపత్యం కోసం పాక్ సృష్టించిన గ్రూపని ఐసిస్ విమర్శిస్తోంది. పాక్ చేతిలో బొమ్మలు కాకపోతే వెంటనే తమతో చేతులు కలిపి షరియా అమలుకు కలిసిరావాలని తాలిబన్లను ఐసిస్–కే డిమాండ్ చేసింది. ఐసిస్–కే ఆరోపణలను తాలిబన్లు తోసిపుచ్చారు. అఫ్గాన్లో జిహాద్కు తాము సరిపోతామని, సమాంతరంగా మరో గ్రూపు అవసరం లేదని, ఐసిస్–కే తమ కార్యకలాపాలను నిలిపివేసి అఫ్గాన్ నుంచి వైదొలగాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మండిపడ్డ ఐసిస్ ఖలీఫత్లో చేరని కారణంగా తాలిబన్లపై జాలి చూపవద్దని ఐసిస్–కేను ఆదేశించింది. మొత్తం ఖలీఫత్కు ఒకరే అధినేత (ఖలీఫా/అమిర్) ఉంటారని దానికి విరుద్ధంగా తాలిబన్లు సొంతంగా అమిర్ను ప్రకటించుకోవడం ఏమిటని ఐసిస్–కే గతంలోనే నిలదీసింది. రెండో ఖలీఫాను తుదముట్టించాలని 2015లోనే పిలుపిచ్చింది. (చదవండి: వైరల్: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు) ఏం జరగవచ్చు ప్రస్తుతానికి అఫ్గానిస్తాన్లో చాలా భాగం తాలిబన్ల చేతుల్లోకి వచ్చింది. దేశంలో సుదీర్ఘ పౌరపోరాటానికి ఈ గ్రూపు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విమానాశ్రయం వద్ద బాంబుదాడులు జరిపింది. అమెరికా దళాలు వైదొలిగాక ఈ గ్రూపు మరిన్ని దాడులు చేయవచ్చన్న భయాలున్నాయి. ఐసిస్–కేను తాము ఎదుర్కొంటామని, అమెరికా సాయం అవసరం లేదని, అందువల్ల అమెరికా దళాలు పూర్తిగా వెళ్లిపోవాలని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు అమెరికా దళాల ఉపసంహరణను జాప్యం చేయాలని ఐసిస్ భావించింది. దీనివల్ల తాలిబన్లు– అమెరికన్ల పైనే ఎక్కువగా దృష్టిపెట్టి బిజీగా ఉంటారని, ఈ మధ్యలో తాము పైచేయి సాధించవచ్చని ఐసిస్ యోచిస్తున్నట్లు రక్షణ నిపుణుల అంచనా. ఇస్లాం ఆచరణలో తేడాలు తాలిబన్లు, ఐసిస్ గ్రూప్ రెండూ జీహాద్ ద్వారా ఇస్లామిక్ సామ్రాజ్య ఏర్పాటుకు యత్నించేవే అయినా, ఇస్లాంను అర్ధం చేసుకోవడంలో రెండు గ్రూపుల మధ్య బేధాలున్నా యి. తాలిబన్లలో ప్రధానంగా ఫష్తూన్ తెగకు చెందిన వారుంటారు. వీరు సున్నీ ఇస్లాంకు చెందిన హనఫీ మార్గాన్ని అవలంబిస్తారు. తాలిబన్లు దియోబంది మార్గ ప్రవచనాలను పాటిస్తారు. ఐసిస్ సున్నీ ఇస్లాంలోని వహాబీ/సలాఫి మార్గాన్ని పాటిస్తుంది. సూఫీ మార్గంపై తాలిబన్లకు నమ్మకం ఉండగా, ఐసిస్కు సూఫిజం గిట్టదు. ఇస్లాంలో మరో వర్గం షియా ముస్లింలను ఐసిస్ కాఫిర్లు(ద్రోహులు)గా భావిస్తుంది. సూఫీ మార్గాన్ని తిరస్కరిస్తూ ఐసిస్ ఫత్వాలు జారీ చేయగా, ఐసిస్ను వ్యతిరేకిస్తూ తాలిబన్లు ఫత్వాలు జారీ చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
అమెరికా సైనికులను వెనక్కి పిలిపిస్తానన్న ట్రంప్
-
జానపద గాయకుడిని కాల్చి చంపిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్లో తాలిబన్లు నిరంకుశ పాలన సాగిస్తారనే అనుమానాలు బలపడు తున్నాయి. జానపద గాయకుడు ఫవాద్ అందారబీని తాలిబన్లు కాల్చి చంపినట్లు సమాచారం. బఘ్లాన్ ప్రావిన్స్లోని అందారబీ వ్యాలీలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఒకసారి తాలిబన్లు తమ నివాసానికి వచ్చి, తన తండ్రితో మాట్లాడి టీ తాగి వెళ్లారని ఫవాద్ కుమారుడు జవాద్ అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపారు. కానీ, శుక్రవారం తాలిబన్ ముఠాకు చెందిన ఒక వ్యక్తి తుపాకీతో తన తండ్రిని కాల్చి చంపేశాడ న్నారు. దోషిని శిక్షిస్తామని స్థానిక తాలిబన్ నేతలు హామీ ఇచ్చారన్నారు. ‘మా నాన్న అమాయకుడు. ప్రజలకు వినోదం పంచడం మాత్రమే తెలిసిన గాయకుడు’అని ఆయన తెలిపారు. తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. గాయకుడు అందారబీ ఘిచాక్ అనే వాద్య పరికరాన్ని వాయిస్తారు. తన జన్మభూమి, తన ప్రాంత ప్రజలు, తన దేశం గురించి సంపద్రాయ, దేశభక్తిని ప్రబోధించే పాటలు పాడుతుంటారు. కళాకారుల హక్కులను గౌరవించేలా అంతర్జాతీయ సమాజం తాలిబన్లపై ఒత్తిడి తేవాలని ఐరాస సాంస్కృతిక విభాగం ప్రతినిధి కరీమా బెన్నౌన్ అన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామర్డ్ స్పందిస్తూ... తాలిబన్ల వైఖరి మార లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. -
మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ
కాందహార్: అఫ్గానిస్తాన్లోని కాందహార్లో మహిళలపై తాలిబన్ల అరాచకం మొదలైంది. టీవీ, రేడియోల్లో మహిళా గళాలపై నిషేధం విధిస్తూ కఠినమైన ఆంక్షలు జారీ అయ్యాయి. అలాగే, తాలిబన్లు సంగీతంపై కూడా తమ వ్యతిరేకతను చాటుకున్నారు. సంగీత ప్రసారాలను నిలిపివేయాలంటూ టీవీ, రేడియో మాధ్యమాలకు హుకుం జారీ చేశారు. 1996-2001 మధ్య కాలంలో కూడా తాలిబన్లు ఇదే తరహాలో సంగీతంపై ఆంక్షలు విధించారు. క్యాసెట్ టేపులు, మ్యూజిక్ సిస్టమ్స్ను అప్పట్లో వారు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే, అఫ్గాన్ రేడియో స్టేషన్లలో ఇస్లామిక్ సంగీతం మాత్రం నిరభ్యంతరంగా ప్రసారం చేసుకోవచ్చని తాలిబన్లు ప్రకటించడం గమనార్హం. కాగా, ఆగస్టు 15న కాబూల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత.. మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని, వారు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చని, ఇస్లామిక్ చట్టం ప్రకారం చదువుకోవచ్చని చెప్పిన తాలిబన్లు.. రోజుల వ్యవధిలోనే మాట మార్చారు. వారి మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదని స్థానికులు వాపోతున్నారు. తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో మహిళలు తమ రోజువారీ కార్యకలాపాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల్లోని మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. చదవండి: Viral Video : సముద్ర తీరంలో అద్భుతం! -
తాలిబన్లకు ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్
భద్రతపై ఎన్ని హామీలు ఇస్తున్న తాలిబన్లపై అఫ్గన్లకు నమ్మకం కలగడం లేదు. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలని, అధికారులు ఆఫీసులకు రావాలని తాలిబన్లు భరోసా ఇస్తున్నా.. స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా భద్రతా దళాల తరలింపు ప్రక్రియ ముగిశాక.. అఫ్గనిస్తాన్ పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే పరిస్థితి నెలకొనవచ్చని నిపుణులు అప్పుడే ఓ అంచనాకి వచ్చారు. తుపాకుల పహారా నడుమే అరకోరగా తెరుచుకుంటున్న షాపింగ్సముదాయాలు. బ్యాంకులు బంద్.. ఏటీఎంలలో నిండుకున్న డబ్బులు. చాలావరకు పెట్రోల్ బంక్లకు నో స్టాక్ బోర్డులు. మరోవైపు మందుల కొరతతో అఫ్గన్లు అల్లలాడిపోతున్నారు. ఈ తరుణంలో తాలిబన్ల కంటపడకుండా బిస్కెట్ ప్యాకెట్ల నుంచి మొదలు.. ప్రతీ నిత్యావసరాలను అడ్డగోలు రేట్లకు అమ్మకుంటున్నారు అక్కడి వ్యాపారులు. గత పదిరోజులుగా అఫ్గనిస్తాన్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. ఆకలి కేకలు తప్పవా? సెప్టెంబర్ నుంచి అఫ్గనిస్తాన్లో తీవ్ర సంక్షోభం మొదలుకావొచ్చని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పుడ్ ప్రోగ్రాం(WFP) అంచనా వేస్తోంది. బ్రెడ్డు కూడా దొరకని పరిస్థితుల్లో సుమారు కోటిన్నర మంది ఆకలి కోరల్లో కొట్టుమిట్టాడతారని, భారీ ఎత్తున్న సహాయకార్యక్రమాల అవసరం పడొచ్చని యూఎన్ విభాగం అభిప్రాయపడింది. యూఎన్ అంచనా ప్రకారం.. ప్రపంచంలో అంతర్జాతీయ సమాజం నుంచి మూడో అతిపెద్ద సహాయక కార్యక్రమం అఫ్గనిస్తాన్ గడ్డపై నిర్వహించాల్సి రావొచ్చని చెబుతోంది. డబ్ల్యూహెచ్వో నిస్సహాయత! రెడ్క్రాస్, డబ్ల్యూహెచ్వోలతో పాటు మరికొన్ని ఎన్జీవోలు అఫ్గనిస్తాన్లో గత ఇరవై ఏళ్లుగా సేవలు అందిస్తున్నాయి. నెలన్నర పరిస్థితుల తర్వాత ఈ వారం మొదట్లో సుమారు 500 టన్నుల మందులను దించేందుకు ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు డబ్ల్యూహెచ్వో రీజియనల్ డైరెక్టర్ తెలిపారు. దీనికితోడు కరోనా కేసులు పెరుగుతూ.. నాలుగో వేవ్ దిశగా వెళ్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే కాబూల్ ఎయిర్పోర్ట్లో పరిస్థితులు క్లియర్ అయితే గనుక.. ఈ సమస్యకు కొంత పరిష్కారం అవ్వొచ్చని భావిస్తున్నారు. నిధులు నిల్ ప్రభుత్వ నిధుల సంగతి!. 2001లో తాలిబన్ల కట్టడి నాటికి అఫ్గన్ఆర్థిక వ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉండేది. అమెరికా-నాటో దళాల మోహరింపు నడుమ తర్వాతి ఇరవై ఏళ్లలో విదేశీ నిధులతోనే అఫ్గన్ ఆర్థిక వ్యవస్థ నడిచింది. ఒకానొక టైంలో అసలు అఫ్గన్ ప్రభుత్వం 70-80 శాతం అంతర్జాతీయ దాతల సహకారం ద్వారా నడిచింది. అందులో యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అందించే సాయం ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ సాయం ఆగిపోయింది. బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయ్యాయి. బయటి దేశాల సాయం ఇప్పుడప్పుడే అందే ఛాన్స్ లేదు. ప్రభుత్వ ఏర్పాటునకు తాలిబన్లకు ఇంకా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. పొరుగు లేదంటే మిత్ర దేశాల సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా.. అందుకు ఇప్పట్లో తగ్గ పరిస్థితులు కనిపించడం లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో.. అఫ్గన్బండిని లాగడం తాలిబన్లకు కత్తిమీద సాము లాంటిదే. చదవండి: భారత్తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: తాలిబన్లు వనరులే దిక్కింకా! తాలిబన్ల ముందున్న మొదటి పని.. ధరలను అదుపు చేస్తూనే ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారకుండా చూసుకోవడం. ఉత్పత్తులను దేశంలోకి అనుమతించేలా తక్షణ చర్యలు చేపట్టడం. ఇదంతా రాజకీయ, పాలనాపరమైన, అంతర్గత సంక్షోభ వ్యవహారాలతో సంబంధం లేకుండా జరగాలి. అలాగే వనరులను ప్రధానంగా ఉపయోగించుకుని సంక్షోభం నుంచి ఎంతో కొంత అధిగమించే ప్రయత్నం చేయాలి. అఫ్గన్ నేల ఎంతో విలువైన రాశులకు నిలయం. కాపర్, గోల్డ్, ఆయిల్, సహజ వాయువులు, యురేనియం, బాక్సైట్, కోల్, ఐరన్ ఓరె, లిథియం, క్రోమియం, లెడ్, జింక్, జెమ్స్టోన్స్, సల్ఫర్, జిప్సం, మార్బుల్.. తదితరాలు దొరకుతాయి. 1.4 మిలియన్ టన్నుల అరుదైన ఖనిజ సంపద ఇక్కడ నెలవై ఉంది. దీనిని మిలిటరీ ఎక్విప్మెంట్, ఎలక్రా్టనిక్ గూడ్స్ తదితరాల కోసం వేరేదేశాలకు తరలించి భారీగా నిధులు సమకూర్చుకోవచ్చు. తద్వారా కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది. కరోనా టైంలోనే అఫ్గన్ ఖనిజ సంపద మీద చాలా దేశాలు ఆసక్తి చూపించాయి. ప్రత్యేకించి చైనా.. అఫ్గన్లో భారీ పెట్టుబడుల ద్వారా ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే తాలిబన్ల దురాక్రమణతో ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్లాలి. ఇప్పుడు తాలిబన్లతో చర్చలకు సైతం సిద్ధపడుతున్న చైనాను.. భారీ పెట్టుబడులకు ఆహ్వానించాలి. చదవండి: ఐసిస్ కే ఎవరు? భారత్కు వాళ్లతో ముప్పా? ఒకప్పుడు తాలిబన్లకు ఓపియం(నల్ల మందు) ప్రధాన ఆదాయ వనరుగా ఉపయోగించుకున్నారు. ఓపియం సాగు, పన్నులు, తరలింపు ద్వారా విపరీతమైన నిధులు సమకూర్చుకున్నారు. కానీ, ఇప్పుడు దానికి దూరంగా ఉంటామని ప్రకటించుకున్నారు. అయితే ఓపియం సాగు ద్వారా 2019లో లక్షా ఇరవై వేల ఉద్యోగాలు లభించాయి. ట్యాక్సుల ద్వారా నిధులొచ్చాయి. అలాంటి దానిపై నిషేధం.. అఫ్గన్ను ఆర్థికంగా కోలుకునే అవకాశం నుంచి దూరం చేస్తుందని కొందరు అమెరికన్ మేధావులు విశ్లేషిస్తున్నారు. కానీ, ఓపియం వర్తకం ద్వారా అంతర్గత, అంతర్జాతీయ సమాజం నుంచి శత్రువుల్ని తయారు చేసుకోవడం తమకు ఇష్టం లేదని ప్రకటించుకుంది తాలిబన్. అంతేకాదు నల్ల మందులో అమెరికాలో 2019లో యాభై వేల మరణాలు సంభవించాయనే విషయాన్ని ప్రధానంగా వినిపిస్తూ.. బ్యాన్ ఆదేశాలకు సిద్ధపడింది తాలిబన్ సంస్థ. వీటికి బదులుగా వనరులతో పాటు పశుపోషణ, డ్రైడ్ ఫ్రూట్స్ వ్యాపారాల్ని సమర్థవంతంగా నడిపించుకోవడం, బయటి ఉత్పత్తులకు అనుమతించడం ద్వారా ఊబి మధ్య నుంచి బయటపడొచ్చు. - సాక్షి వెబ్ డెస్క్ -
విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు
కాబూల్: అఫ్గాన్ నుంచి పశ్చిమ దళాల తరలింపు గడువు దగ్గరపడుతుండడంతో పలువురు అఫ్గాన్ పౌరులు దేశం విడిచిపోయేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. దీంతో తాలిబన్లు ప్రజలు రాకుండా అడ్డుకొనేందుకు అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనంగా మరిన్ని చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. అఫ్గాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబన్ దళాలు కాబుల్ రహదారులపై పహారా కాస్తున్నారు. అమెరికా దళాలు వైదొలిగిన వెంటనే మొత్తం విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంటామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా చెప్పారు. తాలిబన్ల దిగ్బంధంతో విమానాశ్రయం వెలుపల ఇప్పటివరకు ఉన్న రద్దీ దృశ్యాలు కనుమరుగయ్యాయి. శనివారం విమానాశ్రయానికి వచ్చే రోడ్డుపై తాలిబన్లు కొన్ని వార్నింగ్షాట్లు పేల్చడంతో పాటు, హెచ్చరికగా స్మోక్ బాంబులను ప్రయోగించారు. చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విదేశాల నుంచి సహాయం ఆగిపోవడంతో అఫ్గాన్లో ఆర్థిక సంక్షోభం అలముకుంది. పలువురు ఉద్యోగులు, సామాన్య ప్రజలు బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నగదు కోసం క్యూ కట్టారు. దీంతో ఏటీఎంల్లో విత్డ్రాను 24గంటలకు 200 డాలర్లకు పరిమితం చేశారు. అలాగే ప్రతి కస్టమర్ వారానికి 200 డాలర్లు బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకునే వీలు కల్పించాలని అఫ్గాన్ కేంద్ర బ్యాంకు అన్ని బ్యాంకులను ఆదేశించింది. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమన ఏర్పాట్లేనని నిపుణులు అంటున్నారు. తాలిబన్లు అందరినీ కలుపుకుపోతూ ప్రజాస్వామ్యయుతం గా వ్యవహరిస్తే తప్ప విదేశీ సాయం అందడం కష్టంగా కనిపిస్తోందన్నారు. అఫ్గాన్ బడ్జెట్లో 75 శాతం విదేశీ సాయం ఆధారంగా నడుస్తుంది. -
టార్గెట్ ఐసిస్: అమెరికా వేట మొదలైంది
US Revenge Attacks On ISIS: తమ సైనికులను పొట్టనపెట్టుకున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థపై అమెరికా ప్రతీకార వేట మొదలైంది. ‘వెంటాడి.. వేటాడి మట్టుపెడతామ’ని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించి కొన్ని గంటలు గడవకముందే.. దాడులకు దిగి లక్క్ష్యం పూర్తి చేసింది. శుక్రవారం సాయంత్రం దాటాక నంగహర్ ప్రావిన్స్లోని ఐసిస్ ఖోరసాన్ ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన అమెరికా దళాలు.. వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో కాబూల్ జంట పేలుళ్ల సూత్రధారిని మట్టుపెట్టినట్లు సమాచారం. ఐసిస్-కే గ్రూపు లక్క్ష్యంగా శుక్రవారం ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా దళాలు ప్రకటించుకున్నాయి. అఫ్గన్ భూభాగం అవతలి నుంచే రీపర్ డ్రోన్ సహాయంతో ఈ దాడికి పాల్పడింది. కాబూల్ పేలుళ్ల సూత్రధారి ఓ వాహనంలో వెళ్తుండగా గుర్తించి.. ఆ పక్కా సమాచారంతో దాడి నిర్వహించింది. ఈ దాడిలో ఆత్మాహుతి దాడుల వ్యూహకర్తతో పాటు అతని సహాయకుడు మృతిచెందాడని, సాధారణ పౌరులెవరికీ ఏం కాలేదని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ ఓ ప్రకటనలో స్పష్టం చేశాడు. మధ్య ఆసియా దేశాల్లోని అమెరికన్ ఆర్మీ బేస్ నుంచి నిర్వహించిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైట్ హౌజ్ దళాలు ప్రకటించుకున్నాయి. మరోవైపు కాబూల్ దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. బలగాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు ప్రకటించింది. ఇంకోవైపు ఎయిర్పోర్ట్ బయట సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం రాత్రి కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర జరిగిన జంట బాంబు పేలుళ్లలో 13 మంది యూఎస్ సైనికులు, 78 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. చదవండి: కాబూల్ దాడులు.. ట్రంప్ భావోద్వేగం బరిలోకి తాలిబన్లు ఐసిస్-కే ఉగ్రవాద సంస్థపై అమెరికాతో పాటు తాలిబన్లు ప్రతీకార చర్యలకు దిగారు. మరిన్ని దాడులకు ఐసిస్-కే పథక రచన చేస్తుందన్న సమాచారం మేరకు తాలిబన్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ మేరకు కాబూల్లో ఇంటింటినీ గాలిస్తున్న తాలిబన్ బలగాలు.. ఇప్పటికే ఐసిస్-కే సానుభూతిపరులు, మద్ధతుదారులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల ద్వారా దాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. చదవండి: ఐసిస్ ఖోరసాన్- వీళ్లెంత దుర్మార్గులంటే.. క్లిక్ చేయండి: కాబూల్ పరిస్థితి- వాటర్ బాటిల్ 3 వేలు.. ఫుడ్ ప్యాక్ 7 వేలు -
Kabul Airport Attack: ఐసిస్–కె అంటే తెలుసా?
కాబూల్ విమానాశ్రయాన్ని రక్తమోడించిన ఐసిస్–కె సంస్థ అఫ్గాన్లో తన పట్టు మరింత బిగించాలని చూస్తోంది. అటు అమెరికా, ఇటు తాలిబన్లకు గట్టి హెచ్చరికలు పంపడానికే ఈ దారుణానికి ఒడిగట్టింది. తాలిబన్లతో ఇప్పటికే ఆధిపత్య పోరాటంలో ఉన్న ఈ ఉగ్ర సంస్థ ఈ పేలుళ్లతో అమెరికాకి పక్కలో బల్లెంలా మారింది. అసలు ఏమిటి ఉగ్ర సంస్థ? ఎలా అరాచకాలు చేస్తోంది? ఏమిటీ ఐసిస్–కె? ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థలో కార్యకలాపాలు సాగిస్తున్న కరడుగట్టిన భావజాలం ఉన్న ఉగ్రవాదులు కొందరు 2014లో ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. పాకిస్తానీ తాలిబన్ ఫైటర్లు మొదట్లో ఈ గ్రూపులో చేరారు. తూర్పు అఫ్గానిస్తాన్లో తొలిసారిగా వీరి కదలికలు కనిపించాయి. ప్రస్తుత అఫ్గానిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, టర్క్మెనిస్తాన్లో భాగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఖొరాసన్ అని పిలిచేవారు. వీరి ప్రధాన కార్యాలయం ఈ ప్రాంతంలోనే ఉంది. పాకిస్తాన్కి మాదకద్రవ్యాలు, అక్రమంగా మనుషుల్ని రవాణా చేయాలంటే ఈ మార్గంలోనే వెళ్లాలి. ఈ ప్రాంతానికి గుర్తుగా వీరిని ఐసిస్–కె లేదంటే ఐఎస్–కె అని పిలుస్తారు. మధ్య, దక్షిణాసియాల్లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమే వీరి లక్ష్యం. ఇక్కడ చదవండి: ఐసిస్–కెతో భారత్కూ ముప్పు! ఎన్నో అరాచకాలు తాలిబన్లు కేవలం అఫ్గానిస్తాన్కు పరిమితమైపోతే ఐసిస్–కె ప్రపంచవ్యాప్తంగా ముస్లిమేతరులపై జీహాద్కు పిలుపునిచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనాల ప్రకారం ఐసిస్–కెలో 2017–18 సంవత్సరంలోనే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లో సాధారణ పౌరులు లక్ష్యంగా 100కి పైగా దాడులు చేసింది. ఇక అమెరికా–అఫ్గాన్, పాకిస్తానీ బలగాలపై 250 దాడులు జరిపింది. 2020లో కాబూల్ విమానాశ్రయం, , కాబూల్ యూనివర్సిటీపై దాడులు, అధ్యక్ష భవనంపై రాకెట్లతో దాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్టుగా అనుమానాలున్నాయి. ఇవే కాకుండా అమ్మాయిలు చదువుకునే పాఠశాలలపై దాడులకు దిగడం, ఆస్పత్రుల్లో మెటర్నటీ వార్డులపై దాడులకు పాల్పడి గర్భిణిలను, నర్సులను నిర్దాక్షిణ్యంగా కాల్చేయడం చేశారు. షియా ముస్లింలపై అధికంగా దాడులకు చేస్తున్నారు. చదవండి:Donald Trump: దేశం శోకంలో మునిగిపోయింది.. ట్రంప్ భావోద్వేగం ఇంకా ఎలాంటి ప్రమాదాలున్నాయ్? తాలిబన్ల క్రూరత్వమే భరించలేనిదిగా ఉంటే ఐసిస్–కె మరింత కర్కశంగా వ్యవహరిస్తోంది. షరియా చట్టాలను పూర్తిగా మార్చేసి తాము సొంతంగా రూపొందించిన నియమ నిబంధనలను అఫ్గాన్ ప్రజలపై రుద్దాలని ఈ సంస్థ చూస్తోంది. తాలిబన్లు కఠినంగా వ్యవహరించడం లేదన్నది వీరి భావన. తాలిబన్లు, ఐసిస్–కె మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరాటం నడుస్తూనే ఉంది. అమెరికాతో తాలిబన్లు శాంతి చర్చలకు వెళ్లడం కూడా ఈ సంస్థకి అసలు ఇష్టం లేదు. శాంతి ఒప్పందాల వల్ల జీహాద్ లక్ష్యాలను చేరుకోలేమని వీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇప్పుడీ దాడులతో అమెరికాకు కూడా పక్కలో బల్లెంలా మారింది. హక్కానీ నెట్వర్క్ అండ తాలిబన్లతో వీరికి ఏ మాత్రం సరిపడదు కానీ తాలిబన్లకు అత్యంత సన్నిహితంగా మెలిగే హక్కానీ నెట్వర్క్తో సత్సంబంధాలున్నాయి. ఐసిస్–కె, హక్కానీ నెట్వర్క్, పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఇతర సంస్థలు ఉమ్మడిగా పన్నాగాలు పన్ని ఎన్నో దాడులకు దిగారు. ఆగస్టు 15న అఫ్గాన్ను తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత జైళ్లలో ఉన్న వారిని చాలా మందిని విడుదల చేశారు. వారిలో ఐఎస్, అల్ ఖాయిదా ఉగ్రవాదులు ఐసిస్–కెతో చేతులు కలిపారు. హక్కానీ నెట్వర్క్ సభ్యులే ఈ సంస్థకి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారన్న అనుమానాలున్నాయి. బలమెంత? 2014లో ప్రారంభమైన ఈ సంస్థ 2016 నాటికి అత్యంత శక్తిమంతంగా ఎదిగింది. ఆ సమయంలో ఈ సంస్థలో 3 వేల నుంచి 8,500 మంది వరకు ఉగ్రవాదులు ఉండేవారు. కానీ అమెరికా, అఫ్గాన్ బలగాలతో పాటు తాలిబన్లు జరిపిన దాడుల్లో చాలా మంది మృత్యువాత పడ్డారు. 2019 నాటికి ఈ సంస్థలో సభ్యుల సంఖ్య 2,000–4,000కి పడిపోయింది. మన దేశంలోని కేరళ యువకులు 100 మందిపై ఈ సంస్థ వల వేసి లాగేసుకుంది. గెరిల్లా పోరాటంలో ఈ సంస్థ ఉగ్రవాదులకి అత్యంత నైపుణ్యం ఉంది. పలుమార్లు ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ సంస్థ ఏర్పడినప్పుడు పాకిస్తానీ తాలిబన్ హఫీజ్ సయీద్ ఖాన్ ఈ సంస్థకు చీఫ్గా వ్యవహరించాడు. అతనికి డిప్యూటీగా ఉన్న అధుల్ రాఫ్ అలీజా అమెరికా చేసిన దాడుల్లో హతమయ్యారు. ప్రస్తుతం షహాబ్ అల్ముజీర్ ఈ సంస్థకి చీఫ్గా ఉన్నాడు. అతను సిరియాకి చెందినవాడని భావిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కాబూల్ పేలుళ్లు: ‘అసలు ఇండియాలో అడుగు పెడతామనుకోలేదు’
సాక్షి, వెబ్డెస్క్: తాలిబన్లు అఫ్గనిస్తాన్ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ క్రమంలో పలు దేశాలు అఫ్గన్లో ఉన్న తమ దేశీయుల తరలింపుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే గురువారం దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గన్లు లక్ష్యంగా కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం ఆత్మాహుతి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి భయంకర పరిస్థితుల నుంచి క్షేమంగా స్వదేశం చేరుకున్న ఓ భారతీయ జంట తాము ఎదర్కొన్న భయానక అనుభవాల గురించి వివవరించింది. ఇప్పటికే భారత ప్రభుత్వం అఫ్గన్ నుంచి 800 మంది భారతీయులను క్షేమంగా దేశానికి చేర్చింది. ఇలా చేరుకున్న వారిలో గుజరాత్కు చెందిన షివాంగ్ దవే, అతడి భార్య కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారు తాము ఎదొర్కన్న భయానక అనుభవాలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి వెల్లడించారు దవే దంపతులు. షివాంగ్ దవే మాట్లాడుతూ.. ‘‘నేను గత 15 ఏళ్లుగా అఫ్గన్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పని చేస్తున్నాను. నాకు ఇద్దరు కుమారులు రోహిత్భయ్ దవే, మరొకరు ప్రముఖ గుజరాత్ కవి హరింద్ర దవే. తాలిబన్లు అఫ్గనిస్తాన్ను ఆక్రమించిన తర్వాత మేం అక్కడ బతకడం అసాధ్యం అని మాకు అర్థం అయ్యింది. భారత ప్రభుత్వం మమ్మల్ని తరలించేందుకు ముందుకు వచ్చింది’’ అని తెలిపాడు. (చదవండి: పాకిస్తాన్ మా రెండో ఇల్లు : తాలిబన్లు) ‘‘కాబూల్ విమానాశ్రయం చేరుకుంటే తప్ప మా భవిష్యత్ ఏంటో అర్థం కాదు. ఇక మా ఇంటి దగ్గర నుంచి కాబూల్ విమానాశ్రయం చేరుకునే దారి వెంబడి మాకు ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత కాబూల్ విమానాశ్రయం వెళ్లే దారులన్నింటిని మూసేశారు. రోడ్ల మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. వీటన్నింటిని దాటుకుని విమానాశ్రయం చేరుకున్నాము’’ అని తెలిపాడు దవే. (చదవండి: కాబూల్ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి! ) దవే భార్య మాట్లాడుతూ.. ‘‘అసలు మేం కాబూల్ విమానాశ్రయం చేరుకుంటామా.. లేదా అనే భయం వెంటాడసాగింది. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి విమానాశ్రయం చేరుకున్నాము. కానీ అక్కడ అనుకోని ఉపద్రవం ఏర్పడింది. తాలిబన్లు నా భర్తను బంధించారు. నాకు అర్థం అయ్యింది.. మా జీవితాలు ఇక్కడే ముగిసిపోతాయి.. మేం మా స్వదేశం వెళ్లమని తెలిసింది. కాకపోతే అదృష్టం కొద్ది మే తాలిబన్ల చేతుల నుంచి బయటపడి.. ఇండియా వెళ్లే విమానం ఎక్కగలిగాము’’ అని గుర్తు చేసుకున్నారు.(చదవండి: ఇక అంతా తాలిబన్ల సహకారంతోనే..) ‘‘ఆ తర్వాత అనేక చోట్ల ఆగుతూ మా ప్రయాణం కొనసాగింది. విమానం గాల్లోకి లేచి.. భారత్లో ల్యాండ్ అయ్యే వరకు ఊపిరి బిగపట్టుకుని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాము. గాల్లో ఉండగా కిందకు చూస్తే.. ప్రతి 40-50 మీటర్లకు ఓ చోట పేలుళ్లు చోటు చేసుకునే ఘటనలు దర్శనమిచ్చాయి. మా జీవితంలో అంతలా భయపడిన దాఖలాలు లేవు. ఆదివారం భారత్లో ల్యాండ్ అయ్యాము. ఆ తర్వాత గుజరాత్లోని మా ఇంటికి చేరుకున్నాం. ప్రస్తుతం మా బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేవు.. మాకు ఉద్యోగం లేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్థం కావడం లేదు’’ అని దవే దంపతులు వాపోయారు. -
Kabul Airport Blast: అదృష్టమంటే వీళ్లదే!
జంట పేలుళ్లతో కాబూల్ ఎయిర్పోర్ట్ రక్తసిక్తంగా మారింది. అమెరికా భద్రతా దళాలను టార్గెట్గా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె) సంస్థ చేపట్టిన నరమేధంలో అఫ్గన్ పౌరులు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి నుంచి 160 మంది అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. తాలిబన్ల దురాక్రమణ తర్వాత పెద్ద ఎత్తున్న పౌరులు పారిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనార్టీలు, మహిళలు భద్రత విషయంలో భయాందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో అఫ్గన్ సంతతికి చెందిన సుమారు 160 మంది మైనార్టీలు బుధవారం సాయంత్రం కాబూల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వీళ్లలో 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు ఉన్నారు. అక్కడి నుంచి బయటి దేశాలకు వెళ్లాలన్నది వాళ్ల ఉద్దేశం. అయితే తాలిబన్లు గార్డులు వీళ్లను అడ్డుకున్నారు. సరైన పేపర్లు ఉన్నా.. తమను అడ్డుకున్నారంటూ వాళ్లంతా కాసేపు ధర్నా దిగారు కూడా. ఎంతసేపు ఎదురుచూసినా అనుమతించబోమని తాలిబన్లు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి వాళ్లంతా వెనుదిరిగారు. అయితే వాళ్లు ఏ ప్రదేశంలో అయితే కొద్దిగంటలపాటు ఎదురుచూశారో.. సరిగ్గా అదే ప్రదేశంలో(అబ్బే ఎంట్రన్స్ దగ్గర) ఆత్మాహుతి దాడి జరిగింది. I just had a phone call conversation with S Gurnam Singh, president of Kabul Gurdwara committee who apprised me that today’s #Kabulairport explosion has happened at exactly same place where they were standing yesterday We thank Almighty that such thing didn’t happen yesterday pic.twitter.com/sbCiHaMZGP — Manjinder Singh Sirsa (@mssirsa) August 26, 2021 ‘‘ముందురోజు ఎక్కడైతే మేం ఎదురుచూశామో.. అక్కడే ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని తెలిసి వణికిపోయాం. అదృష్టం బావుండి అక్కడి నుంచి మేం వెళ్లిపోయాం. దాడిని తల్చుకుంటే బాధగా ఉంది. ప్రస్తుతం మా బృందం సురక్షితంగా ఉన్నాం. కార్టే పార్వాన్లోని గురుద్వారలో ఆశ్రయం పొందుతున్నాం’’ అని కాబూల్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ గుర్మాన్ సింగ్ తెలిపారు. వాళ్లు సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిస్రా సైతం దృవీకరించారు. వీళ్లను సురక్షితంగా దేశం దాటించే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నట్లు బ్రిటన్ విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: అఫ్గన్ ఎకానమీ.. ఘోరమైన సమస్యలు హాట్ న్యూస్: కాబూల్ దాడి.. మూల్యం చెల్లించకతప్పదు -
Kabul Airport Attack: వెంటాడి వేటాడి మట్టుపెడతాం: బైడెన్
Kabul Airport Blast: కాబూల్ ఎయిర్పోర్ట్ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అఫ్గనిస్తాన్లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్ ఖోరసాన్(కె) గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనల్లో 60 మంది చనిపోగా(70 నుంచి 90 మధ్య అంచనా).. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక కాబూల్ ఎయిర్పోర్ట్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగంగా ప్రసంగించారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘‘బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. వాళ్లెవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ దాడిని అంతతేలికగా మేం మరిచిపోం. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం. ఐసిస్ నాయకుల ఏరివేత ఇక మొదలైనట్లే’’ అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన.. మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్.. సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. అయితే ఈ దాడి తరలింపు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపబోదని, అనుకున్న గడువులోపు(ఆగస్టు 31) తాలిబన్ల సహకారంతో సైన్యం-పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న మాటను కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు. తాము శాంతిని కొరుకుంటున్నామని ప్రకటించుకున్న తాలిబన్లు(ది ఇస్లామిక్ ఎమిరేట్స్).. పౌరులను లక్క్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా సైన్యం పహారా కాస్తున్న ప్రాంతంలోనే దాడి జరిగిందంటూ తాలిబన్ ప్రతినిధి ఒకరు ట్విటర్ ద్వారా ప్రకటన విడుదల చేశాడు. చదవండి: కాబూల్ విమానాశ్రయం: మారణహోమం ఇలా.. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల నిఘాలో ఉన్నట్లు బైడెన్ ప్రకటించిన కొన్ని గంటలకే కాబూల్ హమీద్ కర్జాయ్ ఎయిర్పోర్ట్ అబ్బే గేట్ వద్ద ఓ బాంబు పేలుడు, బారోన్ హోటల్ వద్ద మరో పేలుడు జరగడం విశేషం. అమెరికన్లను లక్క్ష్యంగా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె)ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. సూసైడ్ బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి. క్లిక్ చేయండి: టార్గెట్లో ఉన్నారు.. జాగ్రత్త: బైడెన్ President Joe Biden pauses as he listens to a question as he speaks about the attack at Kabul airport that killed at least 12 U.S. service members pic.twitter.com/iKDAdcXwQy — Evan Vucci (@evanvucci) August 26, 2021 చిన్నపిల్లలు, అఫ్గన్ పౌరులు, తాలిబన్ గార్డులు ఘటనల్లో గాయపడినట్లు తెలుస్తోంది. ఆ జంట పేలుళ్లలో 13 మంది అమెరికన్ సైనికులు చనిపోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి తర్వాత పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని ప్రకటించిన బైడెన్.. తరలింపు ప్రక్రియ కొనసాగునుందని ప్రకటించారు. ఇప్పటికే లక్ష మందికి పైగా అఫ్గన్లను(వాళ్లలో ఐదువేల మంది అమెరికన్లు), మరో వెయ్యి మందిని తరలిస్తే ఆపరేషన్ పూర్తైనట్లేనని అమెరికా రక్షణ దళ జనరల్ మెక్కెంజీ ప్రకటించారు. -
కాబూల్ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి!
కాబూల్: భయపడినంతా జరిగింది. కాబూల్ రక్తమోడింది. దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గాన్ల లక్ష్యంగా కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం చీకటి పడుతున్న వేళ ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటివరకూ ఈ రెండు బాంబుపేలుళ్లలో 100 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 90 మంది అఫ్గాన్ జాతీయులే ఉండగా, 13 మంది వరకూ అమెరికా దేశానికి చెందిన వారు ఉన్నారు. చదవండి: ఇటలీ విమానంపై కాల్పులు విమానాశ్రయంలో పేలుడు దృశ్యం ఇది ఇస్లామిక్ స్టేట్ – ఖోరాసన్ (ఐసిస్–కె) ఉగ్రమూక దుశ్చర్యగా భావిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయానికి ఉగ్రముప్పు పొంచివుందని, ఆ పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని... సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని అమెరికా, బ్రిటన్ సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బాంబుల మోతతో కాబూల్ దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడితో పాటు విమానాశ్రయానికి వచ్చిన వారిపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లుగా సమాచారం అందుతోంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని... బిక్కుబిక్కుమంటూ విమానాశ్రయంలోకి ప్రవేశం కోసం వేచిచూస్తున్న అఫ్గాన్లు, విదేశీయులు ఈ దాడితో తీవ్రంగా భయకంపితులయ్యారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. చదవండి: అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది రక్తమోడుతున్న ఓ అఫ్గాన్ పౌరుడు విమానాశ్రయం ప్రధాన ద్వారం అబే గేటు వద్ద రాత్రి 6.45 గంటలకు తొలి ఆత్మాహుతి దాడి జరిగింది. అక్కడ వేల సంఖ్యలో జనం గుమిగూడి ఉండటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. సాధారణ పౌరులతో పాటు అమెరికా భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 11 మంది అమెరికా మెరైన్ దళ సభ్యులు, వైద్య బృందంలో ఒకరు కలిపి మొత్తం 12 మంది అమెరికా సిబ్బంది చనిపోయారని అమెరికా ధ్రువీకరించింది. రెండోదాడి అబే గేటుకు సమీపంలోకి బారన్ హోటల్ గేటు వద్ద రాత్రి 8 గంటలకు జరిగింది. ఇక్కడ 52 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కాబూల్ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ఇప్పటిదాకా 60 మంది క్షతగాత్రులు చేరారు. పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ అమెరికన్ భద్రతా సిబ్బంది మరణించినట్లు, గాయపడ్డట్లు ధ్రువీకరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం విమానాశ్రయం గేటు వద్ద జరిగిన పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించారని, క్షతగాత్రులయ్యారని ప్రత్యక్షసాక్షి అదమ్ ఖాన్ తెలిపారు. చాలామంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయన్నారు. గాయపడ్డ మహిళలు రక్తమోడుతూ రోదించడం, చిన్నారుల ఆక్రందనలతో సంఘటనా స్థలం వద్ద భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానాశ్రయం ప్రహరీగోడను ఆనుకొని ఉన్న మురికి కాలువలో దిగి... అమెరికా బలగాలను తమను లోనికి అనుమతించాలని బతిమాలుతున్న అఫ్గాన్లపై ఆత్మాహుతి బాంబర్ దూసుకెళ్లి పేల్చి వేసుకున్నాడు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు నిఘా, భద్రతావర్గాలు తాజా పరిస్థితిని వివరించాయి. బైడెన్ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విమానాశ్రయం అమెరికా బలగాల అధీనంలోనే ఉందని, లోపల య«థావిధిగా తరలింపు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని పెంటగాన్వర్గాలు చెప్పాయి. అమెరికా అధీనంలోని ప్రాంతంలోనే: తాలిబన్లు ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించారు. ఈ బాంబుపేలుళ్లు అమెరికా నియంత్రిత ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. తాము ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని... ఎయిర్పోర్ట్ భద్రతపై నిశితంగా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్ను స్థావరంగా వాడుకోవడానికి అనుమతించబోం’ అని జబీహుల్లా ప్రకటించారు. ఐసిస్ ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని తామే అమెరికాను హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,800 మంది అమెరికా సైనికులు, వెయ్యిమంది దాకా బ్రిటన్ సైన్యం, ఇతర నాటో దళాలు ఉన్నాయి. ఆగస్టు 31వ తేదీలోగా ఈ బలగాల ఉపసంహరణ పూర్తికావాలని... గడువు పొడిగించే సమస్య లేదని తేల్చిచెప్పిన తాలిబన్లు... విమానాశ్రయం అన్ని వైపుల నుంచీ మోహరించి ఉన్నారు. ఒప్పందం మేరకు విమానాశ్రయం లోనికి వెళ్లే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అయితే ఎయిర్పోర్ట్కు వస్తున్న అఫ్గాన్లను అడ్డుకుంటున్నారు. ఇళ్లకు తిప్పిపంపేస్తున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి వేలాదిగా విమానాశ్రయానికి తరలివస్తున్న అఫ్గాన్లను చెదరగొడుతున్నారు. గురువారం వీరిపై వాటర్ క్యానన్లను కూడా ప్రయోగించారు. ఆయుధాలు చేజిక్కించుకొని... ఐసిస్(కె) కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. తాలిబన్లను మించి ఇస్లామిక్ అతివాద భావజాలం. ఐసిస్కు తాలిబన్లతో తీవ్రవైరముంది. అంతర్జాతీయ ప్రకంపనలు సృష్టించడం, తాలిబన్లను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడం లక్ష్యంగా ఐసిస్ ఈ దాడులకు వ్యూహరచన చేసినట్లు కనపడుతోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న క్రమంలో ఆయా ఫ్రావిన్సుల్లోని జైళ్లలో ఉన్న ఖైదీలందరినీ విడుదల చేశారు. వీరిలో తాలిబన్లతో పాటు ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారు. వీరందరూ బయటపడి... అస్త్రసన్యాసం చేస్తున్న అఫ్గాన్ సైనికుల ఆయుధాలను చేజిక్కించుకున్నారని... కొద్దికాలంలోనే బాగా బలపడ్డారని తెలుస్తోంది. ఆగస్టు 31లోగా బలగాల ఉపసంహరణ పూర్తిచేస్తామని, ఆలోగా హమీద్ కర్జాయ్ విమానాశ్రయం జోలికి రావొద్దని అమెరికా – తాలిబన్లతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయ, భద్రతా చానళ్ల ద్వారా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ... అమెరికన్లను, నాటో దళాలకు సహాయపడ్డ అఫ్గాన్లను ఆగమేఘాలపై తరలిస్తోంది. గడువు సమీపిస్తున్న కొద్దీ తరలింపులో వేగం పెంచింది. చరిత్రలోనే అతిపెద్ద ఎయిర్లిఫ్ట్గా భావిస్తున్న ఆపరేషన్లో మంగళవారం 19 వేల మందిని, బుధవారం 13,400 మందిని సురక్షితంగా కాబూల్ బయటకు తరలించింది. 4,500 మంది అమెరికన్లను తరలించగా... మరో 1,500 మంది అమెరికన్లు ఇంకా కాబూల్లోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ గురువారం చెప్పారు. భారతీయులందరినీ తరలిస్తాం అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జై శంకర్ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్లో చిక్కుకుపోయి ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. అఫ్గాన్లో పరిస్థితులు సంక్లిష్టంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో జై శంకర్ విపక్ష నాయకులకు అఫ్గాన్లో పరిస్థితుల్ని వివరించారు. ఈ భేటీకి 31 పార్టీల నుంచి 37 మంది నాయకులు హాజరయ్యారు. జై శంకర్తో పాటుగా కేంద్రమంత్రి, రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయెల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఇక విపక్షాల నుంచి ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్, డీఎంకేకు చెందిన టి.ఆర్.బాలు తదితరులు హాజరయ్యారు. అనంతరం జైశంకర్ మాట్లాడారు. అఫ్గాన్లో పరిస్థితులు చక్కబడే వరకు తాలిబన్ల పట్ల కేంద్రం తన వైఖరిపై ఒక నిర్ణయానికి రాలేదని అన్నారు. ‘మా ముందున్న అతి పెద్ద కార్యక్రమం భారతీయులందరినీ తరలించడం. అఫ్గాన్తో స్నేహసంబంధాలను కొనసాగించడమూ మా ముందున్న లక్ష్యం’ అని జై శంకర్ ట్వీట్ చేశారు. -
ఇక అంతా తాలిబన్ల సహకారంతోనే..
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 31లోగా ఉపసంహరిస్తామని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆ తర్వాత బలగాలను ఆ దేశంలో ఉంచే ప్రణాళికేదీ లేదన్నారు. వైట్హౌస్లో మంగళవారం బైడెన్ విలేకరులతో మాట్లాడుతూ డెడ్లైన్లోగా బలగాలను ఉపసంహరించాలనుకుంటున్నామని, అయితే ఇందుకు తాలిబన్ల సహకారం ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాషింగ్టన్: ప్రస్తుతం కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,800 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆగస్టు 31 లోగా బలగాలను ఉపసంహరించేలా కార్యక్రమం కొనసాగుతోంది. కానీ ఎంత త్వరగా అమెరికా సైనికులు వెనక్కి వచ్చేస్తే అంత మంచిదని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ వారికి ముప్పు పెరుగుతూ ఉంటుంది. తాలిబన్లు తమ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకి కల్పించకుండా, విమానాశ్రయాలోకి అన్నీ అనుమతిస్తే పని తొందరగా అవుతుంద’’ని బైడెన్ అన్నారు. ఆగస్టు 31 తర్వాత అమెరికా బలగాలను అఫ్గనిస్తాన్లో ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతినివ్వబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. వాళ్ల సహకారంతోనే బలగాల ఉపసంహరణ కొనసాగాలంటూ బైడెన్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చు గడువు కంటే ముందే బలగాల ఉపసంహరణకు తమ ప్రభుత్వం ఎంతో పట్టుదలగా ఉందని బైడెన్ అన్నారు. లేదంటే ఉగ్రవాద సంస్థల నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గనిస్తాన్లో ఐసిస్కు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసిస్–కె అమెరికా బలగాలను టార్గెట్ చేసిందని వెల్లడించారు. వాళ్లు ఎప్పుడైనా విమానాశ్రయంపై దాడి చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసిస్–కె సంస్థ సామాన్య పౌరులపై ఆత్మాహుతి దాడులు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని బైడెన్ పేర్కొన్నారు. తాలిబన్ల పాజిటివ్ రియాక్షన్ ఆగష్టు 31 తర్వాత కమర్షియల్ విమానాల ద్వారా అఫ్గన్ల ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలని తాలిబన్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జర్మన్ దౌత్యవేత్త మర్కుస్ పోట్జెల్ ట్విటర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. తాలిబన్ డిప్యూటీ చీఫ్ షెర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ హామీ ఇచ్చాడని, లీగల్ డాక్యుమెంట్లు ఉన్న అఫ్గన్లకు విదేశాలకు వెళ్లే వెసులుబాటు కల్పించేందుకు తాలిబన్లు సుముఖంగా ఉన్నట్లు మర్కుస్ తెలిపారు. ఈ–వీసాలతోనే భారత్లోకి అనుమతి న్యూఢిల్లీ: ఇకపై భారత్కు విమాన మార్గంలో వచ్చే అఫ్గన్ పౌరులను ఈ–వీసాలతోనే అనుమతిస్తామని బుధవారం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఎమర్జెన్సీ వీసా తీసుకోవాలంటే అక్కడి రాయబార కార్యాలయానికి నేరుగా వచ్చి అఫ్గనీయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడి ఎంబసీలను మూసేశారు. దాంతో ఆన్లైన్లో ఈ–వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ–వీసా ఆరు నెలలు చెల్లుబాటు అవుతుంది. సాధారణ వీసాలు పొంది భారత్కు చేరుకోని వీసాలు ఇకపై చెల్లుబాటు కావని, ఈ–వీసాలపైనే భారత్లోకి అనుమతిస్తామని హోం శాఖ స్పష్టంచేసింది. చదవండి: అఫ్గన్ మునిగిన నావ.. తాలిబన్ల ప్రయాణం!! -
మునిగిపోతున్న పడవను నడుపుతున్న తాలిబన్లు
ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ పాలన చేపట్టినప్పటి నుంచి కాబూల్ పౌరులు తమ బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకోలేకపోయారు. అప్పటి నుంచి నిత్యావసరాల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ ప్రధానమైన ఆహార గోధుమ ధరలు రెట్టింపు అయ్యాయి. తనను తాను 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' అని పిలుచుకునే తాలిబన్లు గత కొన్ని రోజులుగా అక్కడ పరిస్థితిని చక్కబెట్టడానికి అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగ దేశ కేంద్ర బ్యాంకు తాత్కాలిక గవర్నర్ నియామకం కూడా ఉంది. గత అఫ్గన్ ప్రభుత్వంలో గవర్నర్ గా పనిచేసిన అజ్మల్ అహ్మదీ తిరుగుబాటు తర్వాత అకస్మాత్తుగా కాబూల్ నుంచి పారిపోయాడు. "ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి, ప్రజల ఆర్ధిక సమస్యలను పరిష్కరించడానికి ఇస్లామిక్ ఎమిరేట్ నాయకత్వం హాజీ మొహమ్మద్ ఇద్రీస్ డా అనే వ్యక్తిని ఆఫ్ఘనిస్తాన్ బ్యాంక్ తాత్కాలిక గవర్నర్ గా నియమించారు" అని ఆగస్టు 23న 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. అసలు ఇద్రీస్ కు ఉన్న అర్హతల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఇంతకముందు తాలిబన్ ఆర్థిక కమిషన్ అధిపతి, జావ్జ్జాన్ ప్రావిన్స్ గవర్నర్ గా పనిచేశారు. ఇక గుల్ ఆఘా అనే వ్యక్తిని ఆర్థిక మంత్రిగా ప్రకటించారు. కానీ, ఇద్రీస్ వలె ఇతని గురించి కూడా పెద్దగా వివరాలేమీ తెలియదు. మునిగిపోతున్న నావను నడుపుతున్నారు అక్రమ మైనింగ్, నల్లమందు ఉత్పత్తి ఆదాయ వనరులు దేశాన్ని నడపడానికి సరిపోవని 'ఫైనాన్షియల్ టైమ్స్'లో ఒక వ్యాసంలో అహ్మదీ చెప్పారు. "అక్రమ మైనింగ్, నల్లమందు ఉత్పత్తి లేదా వాణిజ్య మార్గాల ద్వారా ఆదాయాలు పెద్దవిగా ఉన్నట్లు కనిపించడం వల్ల కొందరు అవి ఆర్థిక సమస్యను తగ్గిస్తాయని భావిస్తున్నారు. అలాగే, చైనా లేదా రష్యా పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతారని ఆశిస్తున్నారు. కానీ, అది ఒక ఆశ మాత్రమే. నిజం చెప్పాలంటే తాలిబన్లు మునిగిపోతున్న నావను నడుపుతున్నారు. తిరుగుబాటు చేసేటప్పుడు అటువంటి తాలిబన్ ఆదాయ వనరులు సాపేక్షంగా పెద్దవిగా కనిపిస్తాయి. ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడపడానికి అవి పూర్తిగా సరిపోవు" అని అజ్మల్ అహ్మదీ అన్నారు.(చదవండి: తాలిబన్లతో చర్చలు.. చైనా కీలక వ్యాఖ్యలు) అంతర్జాతీయ ఆంక్షలు, ప్రధాన దాతల నుంచి సహాయాన్ని నిలిపివేయడం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. "ప్రియమైన దేశవాసులారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి డాలర్లు, పురాతన వస్తువులను వాయు, భూ మార్గం ద్వారా బదిలీ చేయకూడదు అని మేము మీకు తెలియజేస్తున్నాము. మేము పేర్కొన్న వాటిని మీరు బదిలీ చేసేటప్పుడు గుర్తిస్తే వాటిని వెంటనే జప్తు చేసి, బదిలీదారులతో చట్టబద్ధంగా వ్యవహరిస్తాము" అని ముజాహిద్ ట్వీట్ చేశారు. సహాయం నిలిపివేత అమెరికా ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర బ్యాంకులకు చెందిన 9.4 బిలియన్ డాలర్ల నిల్వలను ఫ్రీజ్ చేయగా, ప్రధాన దాతలు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు కూడా ఆఫ్ఘనిస్తాన్ కు సహాయాన్ని నిలిపివేశాయి. ప్రధాన ఆదాయాలు అన్నీ తాలిబన్లు కోల్పోతున్నారని అహ్మదీ హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దేశంలోని 38 మిలియన్ల ప్రజలకు మరింత బాధ కలుగుతుంది. "తాలిబన్ల రాజ్యంలో ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. దాతలు ఆర్థిక సహాయం నిలిపివేయడం వల్ల ప్రభుత్వ సేవలను తగ్గించాల్సి ఉంటుంది. చాలా మ౦ది ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోతారు, మిగిలి వారికి జీతాలు చాలా తక్కువగా ఉ౦టాయి" అన్నారు.(చదవండి: కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్) పోషకాహార లోపం అనుభవలేమి గల తాలిబన్ల ఆర్థిక బృందం చేసే పొరపాట్లు, ఆంక్షలు వల్ల సాధారణ అఫ్గన్ ప్రజలు బాధలు పెరుగుతాయి. మే 2021లో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నివేదికలో ముగ్గురు ఆఫ్ఘన్లలో ఒకరు తీవ్రంగా ఆహార కోసం అలమటిస్తున్నారని తెలిపింది. "రాబోయే అనిశ్చితికి ముందే మనం ఇప్పుడు చర్య తీసుకోవాలి, ప్రజల ఇళ్లకు ఆహారాన్ని దగ్గర చేయాలి, తల్లులు, పిల్లల్లో కోలుకోలేని పోషకాహార లోపాన్ని తగ్గించాలి. వారు ఎక్కువగా ప్రభావితం అవుతారు కాబట్టి మేము వేచి చూడలేము" అని ఆఫ్ఘనిస్తాన్ లోని డబ్ల్యుఎఫ్పీ ప్రతినిధి మేరీ-ఎల్లెన్ మెక్ గ్రోర్టీ తిరుగుబాటుకు మూడు నెలల ముందు చెప్పారు. మరి ప్రస్తుత కఠిన పరిస్థితులను చక్కదిద్ది అఫ్గన్ను తాలిబన్లు ఎలా పాలిస్తారో మనం వేచి చూడాలిక!. -
Panjshir Valley: తాలిబన్లతో మాటలా? తూటాలా?
తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గన్ పరిణామాలు.. అంతర్యుద్ధం దిశగా దారి తీశాయి. ఆఫ్గన్ రెబల్స్ చేతుల్లోకి వెళ్లిన ప్రాంతాలను.. తిరిగి చేజిక్కిచ్చుకునేందుకు చర్చలతో ముందుకెళ్తోంది తాలిబన్ గ్రూప్. అయితే దేశంలో చాలా భాగాలు తిరిగి తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చినప్పటికీ.. పంజ్ షీర్ లోయ మాత్రం ఇంకా ప్రతిఘటన దళాల స్వాధీనంలోనే ఉండడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు చర్చల ప్రస్తావన వినిపిస్తున్నప్పటికీ.. మరోవైపు సమరానికి సై అంటూ పంజ్షీర్ దళం ప్రకటన ఇవ్వడం గందరగోళానికి దారితీస్తోంది. మేజర్ అమీర్ అక్మల్.. పంజ్షీర్ ప్రతిఘటన దళ సభ్యుడు. చిట్టచివరి అవుట్పోస్ట్ని సమర్థవంతంగా నడిపిస్తున్న కమాండర్. తాలిబన్ల గందరగోళ ప్రకటనల నేపథ్యంలో.. పోరుకే సిద్ధమని బహిరంగంగా ప్రకటించాడు. ‘మా దళంలో యువతే ఎక్కువగా ఉంది. సైనికులు.. మాజీ జిహాదీ కమాండర్ల అనుభవం మాకు కలిసి వస్తుంది. అందరికీ ఆమోద యోగ్యమైన వ్యవస్థకే మేం లోబడి ఉన్నాం. దేశాన్ని(అఫ్గనిస్థాన్)ను మళ్లీ నరకంలోకి దించం. సమరానికి మేం సిద్ధం. యుద్ధానికి కావాల్సిన సైన్యం, సరంజామా సరిపడా మాకు ఉంది’ అని ప్రకటించాడు అమీర్. పటిష్టమైన పద్మవ్యూహం హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో పంజ్షిర్ లోయ ఉంది. పంజ్షిర్(పంజ్షేర్) అంటే ఐదు సింహాలు అని అర్థం. ఇక్కడి జనాభా లక్షకు పైనే. చుట్టూ కొండలు, ఇరుకైన పర్వత శ్రేణులు, పంజ్షిర్ నదీ ప్రవహిస్తుంటాయి. ఈ లోయలోనే తజిక్ యుద్ధవీరులు ఉంటారు. చొరుబాటుదారుల్ని చంపి పాతరేస్తారు ఇక్కడ. అహ్మద్ షా మసూద్ లాంటి తజిక్ పోరాటయోధుల ఆధ్వర్యంలో సోవియట్ సైన్యాన్ని, తాలిబన్లను సైతం నిలవరించగలిగింది ఈ దళం. భీకర యోధులుగా వీళ్లకు పేరుంది. అయితే పాక్ వెన్నుదన్నులతో నడిచే తాలిబన్లను వీళ్లు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరు. అందుకే ఇప్పుడు అఫ్గన్ సైన్యం నుంచి భారీగా ఈ దళంలోకి చేరికలు వస్తున్నాయి. సుమారు తొమ్మిదివేల మంది ప్రస్తుతం ఈ దళంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో స్థానిక మిలిటెంట్లు, స్టాఫ్ ఉన్నారు. ‘‘ఆర్మీతో మేం సాధించింది ఏం లేదు. ఇప్పుడు మా మాతృభూమిని తాలిబన్ల చెర నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాం’ అని తజిక్ ప్రకటించింది. లొంగుబాటు కథనాలు పంజ్ షీర్ లీడర్ అహ్మద్ మసూద్ గౌరవపూర్వకంగా లొంగిపోవాలనుకుంటున్నారని, ఈ మేరకు తాలిబన్లతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ‘‘40 మందితో కూడిన తాలిబన్ల బృందం.. డిమాండ్లు అంగీకరించడమా? లేదా తిరుగుబాటును ఎదుర్కోవడమా? అనే రెండు ఆప్షన్లతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక నియంతృత్వానికి వ్యతిరేకమని ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్(ఉపాధ్యక్షుడు).. చర్చలు సానుకూలంగా సాగితే తిరుగుబాటు దళాలు దేనికైనా సిద్ధంగా ఉంటాయ’ని ఆ కథనం ప్రచురించింది. మరోవైపు ఈ కథనాలను మసూద్ కొట్టిపడేశాడు. నిజంగా ఆక్రమించారా? మంగళవారం తాలిబన్లు దక్షిణ్ ప్రావిన్స్కు ఆనుకుని ఉండే అంజుమాన్ పాస్ గుండా పంజ్ షీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, తిరుగుబాటు దళాలు వారిని అడ్డుకున్నాయని, పంజ్ షీర్ బలగాల్లో చేరిన ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ కమాండో వజీర్ అక్బర్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ అయ్యింది. అయితే అది నిజం కాదని తాలిబన్ కమాండర్ ముల్లా ఖాక్సర్ ప్రకటన వెలువరించాడు. ‘మాకింకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే పంజ్షిర్లో అడుగుపెడతాం. మేమేం అతివాదులం కాదు. సామరస్యంగా సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం. చర్చలకే మా మొగ్గు’ అని ఖాక్సర్ ప్రకటనలో ఉంది. చదవండి: భారత్.. మరి తాలిబన్లు ఏమంటారో? -
కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్
ఇస్లామాబాద్: జమ్ముకశ్మీర్ అంశంలో దాయాది దేశం పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్దిని బయటపెట్టుకుంది. జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాలిబన్ల సాయం తీసుకుంటామని ఆదేశ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు. టీవీ చానెల్లో జరిగిన చర్చలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. టీవీ చర్చలో కశ్మీర్ అంశంపై పాకిస్తాన్తో చేతులు కలుపుతామని తాలిబన్లు ప్రకటించారని నీలం ఇర్షాద్ షేక్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో పాకిస్తాన్ సైన్యానికి, తాలిబన్లకు ఉన్న సన్నిహిత సంబంధాలు బహిర్గతం అయ్యాయి. పీటీఐ అధికార ప్రతినిధి నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడగానే అప్రమత్తమైన చానెల్ న్యూస్ యాంకర్.. ‘‘ఈ షో ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం అవుతుంది. భారతీయులు కూడా వీక్షిస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా.. మీరేం చెప్పారో మీకు అర్థం అవుతుందా’’ అని నీలం ఇర్షాద్ షేక్ను ఉద్దేశించి ప్రశ్నించారు. కానీ అతడు ఇవేవి పట్టించుకోకుండా.. ‘‘తాలిబన్లు మాకు సాయం చేస్తారు.. ఎందుకంటే వారిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు’’ అంటూ కొనసాగించాడు. (చదవండి: పాకిస్తాన్ వల్లే తాలిబన్లు ఇలా.. భారత్ మా ఫ్రెండ్: పాప్ స్టార్) 🤦🏽♂️ https://t.co/80wjqELqvY — Husain Haqqani (@husainhaqqani) August 24, 2021 -
తాలిబన్ల రాజ్యంలో తొలి నియామకం.. అఫ్గాన్ క్రికెట్ చీఫ్గా ఫజ్లీ
కాబూల్: అఫ్గనిస్తాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత తాలిబన్లు మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) చైర్మన్గా అజీజుల్లా ఫజ్లీకి పట్టం కట్టారు. కొద్ది రోజుల కిందట అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశమైన తాలిబన్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అఫ్గాన్లో తాలిబన్ల రాజ్యం ఏర్పడ్డాక చోటు చేసుకున్న అతిపెద్ద నియామకం ఇదే కావడం విశేషం. ఫజ్లీ 2018-19లో ఏసీబీ చీఫ్గా వ్యవహరించాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్లో అఫ్గానిస్తాన్ దారుణ ప్రదర్శన(చివరి స్థానంలో నిలవడంతో) కారణంగా అతడు పదవి నుంచి వైదొలిగాడు. ఫజ్లీ హాయంలో అఫ్గాన్ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందని తాలిబన్లు ఆశాభావం వ్యక్తం చేశారు. Former ACB Chairman @AzizullahFazli has been re-appointed as ACB's acting Chairman. He will oversee ACB's leadership and course of action for the upcoming competitions. pic.twitter.com/IRqekHq7Jt— Afghanistan Cricket Board (@ACBofficials) August 22, 2021 ఇదిలా ఉంటే, అఫ్గానిస్తాన్ జట్టు వచ్చేనెలలో పాక్తో మూడు వన్డేల సిరీస్లో తలపడాల్సి ఉండింది. అయితే కారణాలు ప్రకటించకుండా ఈ సిరీస్ను వాయిదా వేస్తున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఓవైపు క్రికెట్కు మద్దతిస్తామని.. క్రికెటర్లు భయపడాల్సిన అవసరం లేదని.. స్వేచ్చగా క్రికెట్ ఆడుకోవచ్చని ప్రకటించిన తాలిబన్లు.. ఒక్కరోజు వ్యవధిలోనే కారణాలు వెల్లడించకుండా సిరీస్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవంగా ఈ సిరీస్ శ్రీలంకలో జరగాల్సి ఉండింది. అయితే, కాబూల్ నుంచి వాణిజ్య విమానాల రాకపోకలను రద్దు చేయడం, కరోనా కేసులు బాగా పెరగడంతో శ్రీలంకలో 10 రోజుల లాక్డౌన్ విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరీస్ను పాక్లో జరపాలని ఏసీబీ తొలుత నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్ వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉండింది. చదవండి: అరుదైన రికార్డుకు చేరువలో టీమిండియా పేసు గుర్రం.. -
అఫ్గనిస్తాన్ ఆక్రమణ: అమెరికాకు చైనా చురకలు
బీజింగ్: తాలిబన్ల ఆక్రమణతో అఫ్గనిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సరిగ్గా 20 ఏండ్ల క్రితం ఆల్ఖైదాను, దానికి ఆశ్రయం కల్పించిన తాలిబన్లను మట్టుబెట్టే లక్ష్యంతో అఫ్గానిస్తాన్లో 2001లో సైనిక చర్యకు దిగింది. ఇక అనుకున్న పని పూర్తి చేసిన అగ్ర రాజ్యం అప్పటి నుంచి ఆఫ్ఘనిస్ధాన్ని తాలిబన్ల నుంచి కాపాడుతూ వచ్చింది. కొన్ని కారణాల వల్ల అమెరికా సేనలు అఫ్గానిస్తాన్ వీడగానే తక్షణమే తాలిబన్లు శరవేగంగా అఫ్గన్ను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అమెరికానే కారణం అని చైనా ఆరోపించింది. ఈ మేరకు డ్రాగన్ జాతీయా మీడియాజిన్హువా న్యూస్ ఏజెన్సీలో ఓ వీడియోని విడుదల చేసింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ‘‘జీవితం ఎటూ కదలడం లేదని మీకు అనిపిస్తుంది.. అయితే ఒక్కసారి ఆలోచించండి నలుగురు అధ్యక్షులు.. 20 ఏళ్లు.. 2 ట్రిలియన్ డాలర్లు.. 2300 మంది సైనికులు జీవితాలు.. పణంగా పెట్టి అఫ్గన్లో తాలిబన్ల పాలన నుంచి తిరిగి తాలిబన్ల పాలనకే చేరుకుంది’’ అనే క్యాప్షన్తో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఇక యాంకర్ కూడా వేళాకోళం చేసే తరహాలోనే మాట్లాడుతుంది. అంతేకాక అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ చెసిన అమెరికా ఈజ్ బ్యాక్ అనే వ్యాఖ్యలు నిజం అయ్యాయి అంటూ ఎగతాళి చేస్తుంది. (చదవండి: అమెరికాకు డెడ్లైన్ విధించిన తాలిబన్లు) ‘‘అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ దళాలు స్వాధీనం చేసుకోవడంతో ఖాళీ చేయడానికి అమెరికా ట్రూప్స్ తర్జనభర్జనలు పడ్డారు’’ అని వీడియోలో పేర్కొంది. ఉగ్రవాద నిరోధక చర్యల పేరుతో అమెరికా అఫ్గన్లో యుద్ధాన్ని రాజేసిందని చైనా విమర్శించింది. అంతేకాక ఈ 20 ఏళ్లలో అమెరికా సాధించిన అభివృద్ధి ఏంటంటే అఫ్గన్లో ఉగ్రమూకల సంఖ్యను సింగిల్ డిజిట్ నుంచి 20 వరకు పెంచింది అని చైనా ఎద్దేవా చేసింది. (చదవండి: అమెరికా చేసిన పొరపాట్లే.. అఫ్గానిస్తాన్కు శాపమా?) అమెరికా చర్యల వల్ల అఫ్గనిస్తాన్లో ఇప్పటి వరకు లక్ష మంది చనిపోయారు.. అంతకుమించి గాయపడ్డారు. దాదాపు 11 లక్షల మంది రోడ్డునపడ్డారు. ఈ యుద్ధం ఒక్కరోజు ఖరీదు 60 మిలియన్ల డాలర్లు(రూ.4,44,78,30,000). వియాత్నం యుద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది అని చైనా వీడియోలో ఆరోపించింది. When you feel life is going nowhere, just think: with 4 U.S. presidents 20 years 2 trillion dollars 2,300 soldiers' lives... the regime of Afghanistan changes from Taliban to... Taliban pic.twitter.com/ZHI2OaIgxk — China Xinhua News (@XHNews) August 22, 2021 -
తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ.. జిల్లా చీఫ్ సహా మరో 50 మంది హతం..?
కాబుల్: అఫ్గానిస్తాన్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లకు పంజ్షీర్ ఫ్రావిన్స్లోని ప్రతిఘటనవాదులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే 300కిపైగా తాలిబన్లను మట్టుబెట్టిన అహ్మద్ మసూద్ నేతృత్వంలోని పంజ్షీర్ రెబెల్స్.. అంద్రాబ్ ప్రాంతంలో సోమవారం జరిగిన ప్రతిఘటన దాడుల్లో తాలిబన్ బాను జిల్లా చీఫ్ సహా మరో 50 మంది తాలిబన్ ఫైటర్లను అంతమొందించారని తెలుస్తుంది. మరో 20 మంది తాలిబన్లను రెబెల్స్ ఫోర్స్ బందీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా సమాచారం. ఈ దాడుల్లో ఓ రెబల్ ఫైటర్ సైతం మరణించినట్లు మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. తాలిబన్ సైన్యం భారీ ఆయుధాలతో పంజ్షీర్ ఫ్రావిన్స్ను చుట్టుముట్టినప్పటికీ.. చర్చల ద్వారానే సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్షీర్ ప్రజలు ప్రకటించడం విశేషం. మరోవైపు తాలిబన్లతో పోరులో పంజ్ షీర్ ఫైటర్స్కు ఆఫ్ఘన్ సైన్యం మద్దతుగా నిలబడింది. తాలిబన్లు, అఫ్గాన్ సైన్యం మధ్య భీకర పోరుతో ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని ఆంద్రాబ్ ఫ్రావిన్స్ అల్లకల్లోలంగా మారింది. చదవండి: అఫ్గాన్ నుంచి భారత్కు వచ్చిన 146 మందిలో ఇద్దరికి కరోనా -
అఫ్గనిస్తాన్లో తాలిబన్ రాజ్యం.. క్రికెటర్తో నిశ్చితార్థం రద్దు: నటి
ముంబై: తాలిబన్ల వశం అయిన నాటి నుంచి అఫ్గనిస్తాన్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా వ్యాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే తాలిబన్ల ఆక్రమణ వల్ల తన నిశ్చితార్థం కూడా రద్దయింది అంటున్నారు హిందీ బిగ్బాస్ సీజన్ 11, 14 కంటెస్టెంట్ అర్షి ఖాన్. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అర్షి ఖాన్ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో అఫ్గనిస్తాన్ క్రికెటర్తో తన నిశ్చితార్థం జరగాల్సి ఉండేనని.. కానీ తాలిబన్లు.. అఫ్గన్ను ఆక్రమించడంతో అది కాస్త రద్దయ్యిందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్షి ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఓ అఫ్గనిస్తాన్ క్రికెటర్తో ఈ ఏడాది అక్టోబర్లో నా నిశ్చితార్థం జరగాల్సి ఉండే. ఆ అబ్బాయిని మా నాన్న సెలక్ట్ చేశారు. సదరు క్రికెటర్ మా నాన్న స్నేహితుడి కుమారుడు. కానీ తాలిబన్లు అఫ్గన్ను ఆక్రమించడంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాం. అయినప్పటికి కూడా మేం మంచి మిత్రులుగానే ఉన్నాం. ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నాకనిపిస్తుంది.. నా జీవిత భాగస్వామి తప్పకుండా భారతీయ వ్యక్తే అయి ఉంటాడు’’ అని తెలిపారు. (చదవండి: సెల్ఫీ అన్నాడు.. ఏకంగా ముద్దే పెట్టేశాడు) ఇక ఈ ఇంటర్వ్యూలో అర్షి ఖాన్ తన అఫ్గనిస్తాన్ మూలాల గురించి కూడా వెల్లడించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను అఫ్గనిస్తాన్ పఠాన్ను. నా కుటుంబం యూసుఫ్ జహీర్ పఠాన్ జాతికి చెందినది. నా తాత అఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చారు.. భోపాల్లో జైలర్గా ఉన్నారు. నా మూలాలు అఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి.. అయినప్పటికి నేను భారతీయ పౌరురాలినే" అన్నారు అర్షి ఖాన్. ఇక ఆమె 4వ ఏట ఉన్నప్పుడు అర్షి ఖాన్ తల్లిదండ్రులు అఫ్గన్ నుంచి ఇండియాకు వలస వచ్చారు. (చదవండి: అఫ్గన్ల నరకయాతన.. పాక్ వికృతానందం!) అర్షి ఖాన్ బిగ్ బాస్ సీజన్ 11 లో పాల్గొన్నారు. ఆ తర్వాత 14వ సీజన్లో ఛాలెంజర్గా షోలో తిరిగి ప్రవేశించారు. అర్షి 'సావిత్రి దేవి కాలేజ్ అండ్ హాస్పిటల్', 'విష్', 'ఇష్క్ మే మార్జవాన్' వంటి టీవీ షోలతో పాటు అనేక ఇతర రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోలలో కనిపించారు. ఇదేకాక 'రాత్ కి రాణి బేగం జాన్', 'ది ఈవిల్ డిజైర్స్' వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించారు అర్షి. చదవండి: మీ మౌనం... మాకు ప్రాణాంతకం! -
Afghanistan: 300 మంది తాలిబన్లు హతం..!
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న నాటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడే దేశం విడిచి పారిపోయాడంటే అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అఫ్గన్ సైన్యం ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. తాలిబన్ల రాక్షస పాలన గురించి తెలిసిన ఆ దేశ ప్రజలు.. అక్కడ నుంచి విదేశాలకు వలస వెళ్తున్నారు. అఫ్గన్ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్షీర్ ప్రావిన్స్ మాత్రం కలవరపెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్ను ఆక్రమించిన తాలిబన్లు.. తమను సవాలు చేస్తున్న పంజ్షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆక్రమణకు యత్నించిన తాలిబన్లను.. పంజ్షీర్ సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్షీర్ సైన్యం ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. బాగ్లాన్, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇక తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్షీర్ వైపు కదులుతున్నట్లు సమాచారం. అంతేకాక పలువురు తాలిబన్లను అరెస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.(చదవండి: Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్ హీరో ఇతడే..!) అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్షీర్ ప్రజలు ప్రకటించారు. పంజ్షీర్ లోయలోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా ఏర్పాటు చేశారు. తాలిబన్లను ఎదుర్కొని.. వారిని ఢీకొడుతున్న పంజ్షీర్ ప్రావిన్స్ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గన్ను విముక్తి చేసేది అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని పంజ్షీర్ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! Update from the Anti-Taliban resistance - they tell me: Taliban ambushed in Andarab of Baghlan province. At least 300 Taliban fighters were killed. The group is lead by #AhmadMassoud & @AmrullahSaleh2 #Afghanistan pic.twitter.com/uJD1VEcHY1 — Yalda Hakim (@BBCYaldaHakim) August 22, 2021 -
అఫ్గన్ల నరకయాతన.. పాక్ వికృతానందం!
Pakistan Supports Talibans: కేవలం 75వేల మంది సభ్యులతో తాలిబన్లు.. నెలన్నర వ్యవధిలో సుమారు నాలుగు కోట్ల జనాభా ఉన్న అఫ్గనిస్థాన్ను వశపర్చుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలో సైన్యం ఉపసంహరణ వల్లే ఈ పరిణామాలకు కారణమైందంటూ అమెరికాపై ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్న అగ్రరాజ్యం.. నిందలను తోసిపుచ్చుకునే ప్రయత్నం ముమ్మరం చేసింది. తాజాగా పాక్ను ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చి తీవ్ర విమర్శలు గుప్పించింది. పాకిస్థాన్, ఆ దేశపు ఇంటెలిజెన్స్ సర్వీస్ వల్లే తాలిబన్లు పాతుకుపోగలిగారు అని రిపబ్లికన్ సభ్యుడు స్టీవ్ చాబోట్ తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. ఇండియా కాకస్కు కోచైర్మన్ హోదాలో ఆదివారం జరిగిన హిందూ పొలిటికల్ యాక్షన్ కమిటీ వర్చువల్ సమావేశంలో ఆయన పాల్గొని ఆయన ప్రసంగించాడు. అఫ్గనిస్థాన్ గడ్డపై ప్రస్తుత పరిస్థితులకు పాక్ ఒక కారణం. తాలిబన్లకు వెన్నుదన్నుగా నిలిచి.. దురాక్రమణకు సహకరించింది పాక్. అంతేకాదు అఫ్గన్ల నరకయాతన గురించి తెలిశాక.. ఇస్లామాబాద్ సహా పాక్లోని పలు ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి. పాక్ రాజకీయ నాయకులు, అధికారులు సంబురంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రోడ్ల మీదకు చేరి నృత్యాలు చేసిన దృశ్యాలు సైతం వైరల్ అయ్యాయని చాబోట్ ఉటంకించాడు. ఇక పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అఫ్గన్ల నుంచి భారీ డబ్బు వసూలు చేసి.. పాక్ భూభాగంలో ఆశ్రయం ఇస్తున్నారని విమర్శించాడు. ‘ఇవి చాలావా! పాక్ తాలిబన్లకు ఎంత సహకారాలు అందిస్తుందో.. అఫ్గన్ల నరకయాతనను చూసి వికృతానందం పొందుతుందో చెప్పడానికి’ అంటూ పాక్ను ఏకీపడేశాడు చాబోట్. చదవండి: తాలిబన్లతో దోస్తీ.. చైనా భారీ పన్నాగం!! పాక్ మంత్రికి అపాయింట్మెంట్ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ అఫ్గనిస్థాన్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. అఫ్గన్ అల్లకల్లోల పరిస్థితుల్లో అక్కడ పర్యటిస్తున్న తొలి విదేశీ నేత ఖురేషీ కావడం విశేషం. హక్కానీ నెట్వర్క్ అఫ్గన్ స్వాధీన ప్రకటన తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సహకరిస్తామని, తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగిస్తామని పాక్ బహిరంగ ప్రకటనచ చేసింది కూడా. దీంతో చైనా, ఇరాన్ తర్వాత తాలిబన్లకు పాక్ మద్దతు ప్రకటించిన దేశంగా నిలిచింది. అయితే తాలిబన్లకు పాక్ సహకారం ఉందన్న బహిరంగ ఆరోపణల నేపథ్యంలోనే .. ఆ దేశ మంత్రి తాలిబన్లతో చర్చలు జరుపుతుండడం విశేషం. -
తాలిబన్లకు మద్దతిచ్చిన 15 మంది అరెస్టు
గువాహటి/హైలకండి: తాలిబన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గానూ అస్సాం పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో అస్సాంకు చెందిన పోలీస్ కానిస్టేబుల్, ఒక ఉపాధ్యాయుడు, ముగ్గురు మౌలానాలు, ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేసినట్లు స్పెషల్ డీజీపీ జీపీ సింగ్ శనివారం ట్వీట్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, ఐటీ చట్టం, సీఆర్పీసీ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తాలిబన్లకు సంబంధించి పోస్టులను లైక్ చేయడం, ట్వీట్ చేయడం, రీట్వీట్ చేయడం వంటి చర్యలను మానుకోవాలని జీపీ సింగ్ హెచ్చరించారు. అలా చేస్తే వారిపై క్రిమినల్ విచారణ జరుపుతున్నామని డిప్యూటీ ఐజీ వయొలెట్ బారువా తెలిపారు. అలాంటి కేసులు ఏవైనా కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
ముప్పు లేకుండా తరలింపు పూర్తి కాదు: బైడెన్
వాషింగ్టన్: తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ నుంచి తమ పౌరులను, భాగస్వామ్య దేశాల పౌరులను సాధ్యమైనంత త్వరగా స్వదేశాలకు చేరుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు. ప్రాణాలకు ముప్పు లేకుండా తరలింపు ప్రక్రియ పూర్తి కాబోదని వ్యాఖ్యానించారు. జూలై నుంచి ఇప్పటిదాకా 18,000కు పైగా అమెరికన్లను సొంత దేశానికి తరలించామని చెప్పారు. సంక్లిష్టమైన పరిస్థితుల మధ్య తరలింపు చేపడుతున్నాం కాబట్టి తుది ఫలితం ఏమిటన్నది చెప్పలేనన్నారు. మరోవైపు, అఫ్గానిస్తాన్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని అన్నారు. -
తాలిబన్ల వెబ్సైట్లు బంద్ !
బోస్టన్: తాలిబన్ల అధికారిక నిర్ణయాలను ప్రపంచానికి ఐదు భాషల్లో అందిస్తున్న వెబ్ సైట్లు శుక్రవారం హఠాత్తుగా ‘ఆఫ్లైన్’లోకి వెళ్లిపోయాయి. తాలిబన్లను ఆన్లైన్ వేదికపై అడ్డుకునేందుకే ఇలా వెబ్సైట్లను క్రియాశీలక స్థితి నుంచి పక్కకు నెట్టారని వార్తలొస్తు న్నాయి. తాలిబన్ల సందేశాలను ఈ వెబ్సైట్లు పష్తో, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, దారీ భాషల్లో ప్రపంచానికి అందిస్తున్నాయి. ఈ వెబ్సైట్లకు శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన కంటెంట్ డెలివరీ నెట్వర్క్, ప్రొటెక్షన్ ప్రొవైడర్ సేవలను ‘క్లౌడ్ఫ్లేర్’ సంస్థ అందిస్తోంది. వెబ్సైట్ల తాజా స్థితిపై ఆరా తీసేందుకు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ వార్తా సంస్థ.. ‘క్లౌడ్ఫ్లేర్’ను సంప్రదించినా ఆ సంస్థ స్పందించలేదు. పలు ‘తాలిబాన్ గ్రూప్’లను వాట్సాప్ తొలగించిందని ఎస్ఐటీఈ నిఘా సంస్థ డైరెక్టర్ రీటా కట్జ్ వెల్లడించారు. ఆన్లైన్ వేదికలపై తాలిబన్ల దూకుడు నుంచి అల్ఖాయిదా, ఇతర ఇస్లామిక్ ఉగ్రసంస్థలు స్ఫూర్తి పొందకుండా కట్టడి చేయాలని టెక్ దిగ్గజాలను ఆమె కోరారు. ఫేస్బుక్, ట్విట్టర్లు కూడా పలు తాలిబన్ల ఖాతాలను తొలగించాయి. తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్కు ట్విట్టర్లో ఏకంగా 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
తాలిబాన్ – 2.0
ఆసియా ఖండానికి అఫ్గానిస్తాన్ ఒక పెద్ద జంక్షన్ వంటిది. ఈ దేశానికి సముద్రతీరం లేదు. చుట్టూ భూభాగమే. ఉత్తర దిక్కున ఉన్న ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, తజకిస్తాన్లు సెంట్రల్ ఆసియా దేశాలు. ఐరోపా ఖండానికి ప్రవేశ ద్వారాలు. ఈశాన్య భాగాన చైనాతోనూ ఓ యాభై కిలోమీటర్ల సరిహద్దు బంధం ఈ దేశానికి ఉన్నది. చైనాకు పక్కలో బల్లెంలా మారిన విగర్ ముస్లిం తీవ్రవాదుల సొంత రాష్ట్రం షింజియాంగ్ అఫ్గానిస్తాన్కు చైనా సరిహద్దు. షింజియాంగ్, టిబెట్లను దాటితే తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాన్ని తాకవచ్చు. పడమటి సరిహద్దు ఇరాన్ గుండా ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్ దేశాలను చేరుకోవచ్చు. పర్షియన్ గల్ఫ్ దాటితే చేరువలోనే అరేబియా ద్వీపకల్పం. తూర్పు నుంచి దక్షిణ సరిహద్దు వరకు విస్తరించిన పాకిస్తాన్ భూభాగం ద్వారా ఇండియా సహా దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాలు దగ్గర అవుతాయి. ప్రపంచంలో అతిఎత్తయిన నాలుగు పర్వత శ్రేణుల్లో మూడు అఫ్గాన్ భూభాగాన్ని తాకుతాయి. మరొకటి కూతవేటు దూరంలో ఉండే హిమాలయ పర్వతశ్రేణి. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్–బాల్టిస్తాన్ కూడా తూర్పు అఫ్గాన్కు సరిహద్దు ప్రాంతమే. భారత అధికారిక మ్యాప్ ప్రకారం మన దేశానికి కూడా అది సరిహద్దే. హిమాలయ శ్రేణులు ఇక్కడ ప్రారంభమై టిబెట్–భారత్ సరిహద్దుగా తూర్పువైపునకు వ్యాపించాయి. కారాకోరం శ్రేణులు అఫ్గాన్కు ఈశాన్యంలో తజకిస్తాన్ సరిహద్దుల్లో ప్రారంభమవుతాయి. హిందూకుష్ పర్వతాలు ఈ దేశాన్ని ఉత్తర – దక్షిణాలుగా విడదీస్తే పామిర్ కనుమలు ఉత్తర సరిహద్దుగా ఆవరించి ఉన్నాయి. చరిత్ర ప్రసిద్ధమైన చైనా సిల్క్ రోడ్డు ఈ కనుమల నుంచే ఐరోపాను కలుపుతుంది. ఆసియా జంక్షన్ మాత్రమే కాదు... అపారమైన సహజ నిక్షేపాలకు అఫ్గానిస్తాన్ ఆలవాలం కూడా! పర్వత ప్రాంతం కావడం వల్ల ప్రజలు సహజంగానే దృఢకాయులు, స్వతంత్ర పిపాసులు. అనేక గిరిజన తెగల నిలయం ఈ దేశం. ఈ తెగలు వేటికవే స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఈ తెగల కామన్ ఎజెండా – ఇస్లామ్ ఒక్కటే. పదికి పైగా ప్రధాన తెగలున్నాయి. వీటిలో సగం మంగోల్, సెంట్రల్ ఏసియా తెగలు. ప్రధానమైన తెగ పష్తూన్. దేశ జనాభాలో వీరి సంఖ్య 42 శాతం. ఈ తెగ ప్రజలు ప్రధానంగా దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో పాక్ సరిహద్దు భూభాగంలో ఉంటారు. వాయవ్య పాకిస్తాన్ పఠాన్లదీ, వీరిదీ ఒకే జాతి. తాలిబాన్ పుట్టింది ఈ తెగ నుంచే! కాబూల్ మళ్లీ తాలిబాన్ల వశమైందన్న వార్త వెలువడిన తర్వాత వారికి వ్యతిరేకంగా తుపాకులుపేల్చిన రాష్ట్రం పంజ్షీర్. ఈ ప్రజలది తజిక్ తెగ. పంజ్షీర్ అంటే ఐదు సింహాలని అర్థమట. (ఈ మాటలో పాంచ్, షేర్ అనే శబ్దాలు వినిపిస్తున్నాయి). ఈ ఐదు సింహాల లోయ... సింహం లాంటి ఒక యోధుడికి కూడా జన్మనిచ్చింది. అతని పేరు అహ్మద్షా మసూద్. ఇంజనీరింగ్ చదివిన మసూద్ సోవియట్ యూనియన్ దురాక్రమణకు వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టాడు. సోవియట్ సైన్యాన్ని గడగడలాడించిన గెరిల్లా కమాండర్గా పేరుపొందాడు. సోవియట్ ఉపసంహరణ అనంతరం ఏర్పడిన ముజాహిదీన్ల ప్రభుత్వంలో రక్షణమంత్రిగా పనిచేశాడు. 1996లో కాబూల్ తాలిబాన్ల వశమైన తర్వాత వారి ఛాందస మత వైఖరితో మసూద్ విభేదించాడు. తాలిబాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టాడు. సెంట్రల్ ఏసియా తెగలను సమీకరించి, నార్తెర్న్ అలయెన్స్ను స్థాపించాడు. తాలిబాన్ల కాలంలో పదిశాతం అఫ్గాన్ భూభాగాన్ని మసూద్ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తాలిబాన్ల తోబుట్టువైన అల్ఖాయిదా కుట్రపూరితంగా ఆత్మాహుతి దళాలను ప్రయోగించి మసూద్ను చంపించింది. మసూద్ హత్య జరిగిన రెండు రోజులకే న్యూయార్క్పై సెప్టెంబర్ 11 దాడి జరిగింది. ఫలితంగా ‘నాటో’ సేనలు రంగప్రవేశం చేసి, మసూద్ సైన్యం సహకారంతోనే తాలిబాన్లను తరిమివేశాయి. ఇప్పుడు మళ్లీ పంజ్షీర్ లోయ నుంచే తాలిబాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు గంటలు మోగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతమేరకు వాస్తవమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగవలసిందే. ఇంకా తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడలేదు. అధ్యక్షుడు ఎవరవుతారో స్పష్టత రాలేదు. ముల్లా ఉమర్తో కలిసి తాలిబాన్ను స్థాపించిన వారిలో ఒకడైన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు ప్రముఖంగా వినబడుతున్నది. శనివారం నాడే ఆయన కాబూల్కు చేరుకున్నారు. వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు ప్రారంభించారు. తాలిబాన్లు, జీహాదీలకే పరిమితం కాకుండా ప్రధాన స్రవంతి పక్షాలను కలుపుకొని ఒక విశాల వేదికగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో బరాదర్ ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. పష్తూన్ పెత్తనం కాకుండా అన్ని తెగల మధ్య సమభావం సాధించే దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. బరాదర్ (ఇంగ్లిష్ బ్రదర్కు పష్తూన్ అర్థం) సోదర భావాన్ని తాలిబాన్ తీవ్రవాద శక్తులు, స్థానిక జీహాదీలు ఏమేరకు ఆమోదిస్తారో చూడాలి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రయత్నాలు ఫలిస్తే పంజ్షీర్ లోయ సమర శంఖారావం చేయకపోవచ్చు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యలుండవనీ, మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చుననీ ఒకపక్క తాలిబాన్ అధికార ప్రతినిధులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరోపక్క అక్కడక్కడా కొన్ని దుందుడుకు శక్తులు ఆగడాలకు దిగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అగ్ర నాయకత్వంలో సామరస్యపూర్వక ధోరణి సమ్మిళిత ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు భావన నిజమే అయితే, అది క్షేత్రస్థాయికి ఇంకడానికి కొంత సమయం పట్టవచ్చు. పాత అలవాట్లు, ఆలోచనా ధోరణి మారడానికి నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసి రావచ్చు. ఈలోగానే పాశ్చాత్య మీడియా గగ్గోలు మాత్రం తారస్థాయికి చేరింది. తాలిబాన్లు అనే రాక్షసులు కోరలూ, కొమ్ములూ మొలిపించుకొని పేగులు మెడలో వేసుకొని నడివీధుల్లో భీకర నాట్యం చేస్తున్నారనే ధోరణిలో మీడియా ప్రొజెక్షన్ జరుగుతున్నది. తాలిబాన్లకూ, అఫ్గానిస్తాన్కూ సంబంధం లేని వీడియోలు సోషల్ మీడియాలో కలవరం కలగజేస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించినందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మీద దుమ్మెత్తిపోసే నెటిజన్లకూ కొదవ లేదు. అసలు ఈ బైడెన్ అనే వ్యక్తి ఎవరు? అమెరికాకు ఉన్న హక్కేమిటి? అఫ్గానిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాలతో వారికి పనేమిటి? అనే ప్రశ్నలు ప్రధాన స్రవంతి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ చూద్దామన్నా కనిపించడం లేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ భూప్రపంచంలోని ప్రతి దేశానికీ దాని పరిధిలో సార్వభౌమాధికార హక్కు ఉన్నది. అమెరికా భూభాగంపై అమెరికాకు ఎంత సార్వభౌమాధికారం ఉన్నదో భూటాన్ భూభాగంపై ఆ దేశానికి అంతే అధికారం ఉన్నది. దేశం చిన్నదయినా, పెద్దదయినా న్యాయం ఒకటే. ఏ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఆ దేశవాసులే తీర్పరులు. సొంత దేశ వ్యవహారాలను సరిదిద్దుకునే నేర్పు, చొరవ అఫ్గానిస్తాన్ ప్రజలకు ఉన్నాయి. శతాబ్దాల తరబడి ఇది రుజువవుతూనే ఉన్నది. మనకు తెలిసిన రెండు సహస్రాబ్దుల చరిత్రలో ఎన్నడూ ఏ సూపర్ పవర్కూ అఫ్గానిస్తాన్ పూర్తిగా తలవంచలేదు. పర్షియన్ చక్రవర్తి డరియస్ కూడా ఈ దేశాన్ని పూర్తిగా పాదాక్రాంతం చేసుకోలేకపోయాడు. డరియస్ను ఓడించిన అలెగ్జాండర్ ద గ్రేట్కు కూడా పూర్ణ అఫ్గాన్ దక్కలేదు. వలసవాద యుగంలో గ్రేట్ బ్రిటన్ ఎన్ని యుద్ధాలు చేసినా సంపూర్ణ ఆధిపత్యం సాధించలేకపోయింది. అయినా అఫ్గానిస్తాన్ క్షేత్ర ప్రాధాన్యత, దాని సహజ నిక్షేపాల సంపద సూపర్ పవర్స్ను ఊరిస్తూనే వస్తున్నది. చరిత్రలో జగద్విజేతలయినవారూ, కావాలనుకున్నవారూ దానిపై కన్నేస్తూనే ఉన్నారు. తన కీలుబొమ్మయిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాపాడే మిషతో సోవియట్ యూనియన్ 1979లో అఫ్గానిస్తాన్పై దురాక్రమణ యుద్ధాన్ని ప్రారంభించింది. లక్షలాది మంది సైన్యాన్ని మోహరించింది. పదేళ్లు యుద్ధం చేసింది. ఆరోజుల్లో పదిహేను బిలియన్ల రూబుళ్లను ఖర్చు చేసింది. ఇరవై వేలమంది రష్యన్లు చనిపోయారు. ఇరవై లక్షలమంది అఫ్గాన్ పౌరులు చనిపోయారు. ముప్ఫై ఐదు లక్షలమంది శరణార్థులయ్యారు. అయినా పదేళ్ల తర్వాత రష్యా తోకముడవక తప్పలేదు. ఆ యుద్ధ భారాన్ని పరాజయ భారాన్ని మోయలేక సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలింది. సోవియట్లో అంతర్భాగంగా ఉన్న 14 రిపబ్లిక్లు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. పది తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కుప్పకూలాయి. బెర్లిన్ గోడ బద్దలైంది. అదీ అఫ్గాన్ దెబ్బ. బిన్ లాడెన్ను వేటాడే వంకతో అమెరికా ‘నాటో’ సపరివారంగా 2001లో అఫ్గాన్లో ప్రవేశించింది. ఇరవయ్యేళ్లు అక్కడ తిష్ఠ వేసింది. దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లు అక్కడ ఖర్చుపెట్టవలసి వచ్చిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంతకు రెట్టింపు ఉండొచ్చని అనధికార అంచనా. వేలాదిమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. జరిగిన నష్టంపై పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇంకో ఇరవయ్యేళ్లున్నా మనం చేయగలిగిందేమీ లేదని బైడెన్ ప్రకటించవలసి వచ్చింది. రష్యా, అమెరికాలు వరసగా చేతులు కాల్చుకున్నాయి. ఇక చైనా వంతు. తాలిబాన్లకు అత్యంత నమ్మకమైన మిత్రుడు పాకిస్తాన్. పాకిస్తాన్తో చైనాకు విశ్వసనీయమైన మైత్రీబంధం ఉన్నది. తాలిబాన్లు దేశంలో రాజకీయ సుస్థిరతను సాధించగలిగినట్లయితే పాక్ ప్రోద్బలంతో చైనా మిత్రబృందంలో అఫ్గానిస్తాన్ చేరవచ్చు. వాణిజ్యపరంగా కూడా చైనా ఉపయోగపడుతుంది. సెంట్రల్ ఆసియా, దక్షిణాసియా, పశ్చిమాసియాల్లో ప్రభావం చూపగలిగే విధంగా చైనా–రష్యా–పాకిస్తాన్ – అఫ్గానిస్తాన్ – ఇరాన్ కూటమి ఉండాలని చైనా ఆశిస్తున్నది. మరి భారత్ సంగతేమిటి? ఇరవయ్యేళ్ల కిందటి తరహా తాలిబాన్ 1.0 ప్రభుత్వం మనకు ప్రమాదకరం. తాలిబాన్ 2.0లో గుణాత్మకమైన మార్పు వస్తే స్వాగతించవలసిందే. మన విదేశాంగ విధానం అమెరికా – చైనా సంబంధాల కోణంలో ఉండకూడదు. దాన్ని భారత్ అవసరాల దృష్ట్యానే నిర్ధారించుకోవాలి. అఫ్గాన్తో భారత్కు ప్రాచీన సాంస్కృతిక బంధమే కాకుండా తాజాగా ఆర్థిక సంబంధాలు కూడా బలపడ్డాయి. కౌరవ మాత గాంధారిది కాందహార్ అని మనవాళ్లు చెబుతున్నారు. గాంధారమే కాందహార్గా రూపాంతరం చెందిందనే వాదన ఉన్నది. గాంధార దేశమనే మాటకు సుగంధాలు వెదజల్లే ప్రదేశమని అర్థమట. తాలిబాన్ 2.0లో నిజంగానే నిఖిల జగతి ఆశిస్తున్న మార్పు ఉంటుందా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పష్తూన్ భాషలో తాలిబ్ అంటే విద్యార్థి అని అర్థం. తాలిబాన్ అంటే విద్యార్థుల సమూహం లేదా సంఘం అని అర్థం. అఫ్గానిస్తాన్లో సోవియట్ దురాక్రమణ తర్వాత దక్షిణ ప్రాంతంలోని పష్తూన్ తెగ ప్రజలు లక్షల సంఖ్యలో పాకిస్తాన్కు శరణార్థులుగా వెళ్లిపోయారు. వారి పిల్లలకోసం అఫ్గాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మదర్సాలను తెరిచింది. అంతర్జాతీయంగా ఇస్లామిక్ తీవ్రవాదం ప్రబలుతున్న సమయం అది. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తీవ్రవాదులను ఉత్పత్తి చేస్తున్న సమయం. మదర్సాలలో చదివే ఒక తరం అఫ్గాన్ విద్యార్థులను అతి ఛాందసవాదులుగా మార్చి ముల్లా ఉమర్ నేతృత్వంలో ఒక మిలిటరీ సమూహంగా తీర్చిదిద్దారు. సోవియట్ల నిష్క్రమణ తర్వాత ఏర్పడిన అంతర్యుద్ధ పరిస్థితుల్లో తాలిబాన్ బలపడింది. దేశంలో 40 శాతానికి పైగా ఉన్న పష్తూన్ల పూర్తి మద్దతు వీరికి లభించింది. ఫలితంగా 1996లో అధికారంలోకి వచ్చారు. ఇస్లామిక్ చట్టం పేరుతో వీరు అమలుచేసిన సాంఘిక విధానాలు, శిక్షలను ప్రపంచమంతా ఖండించింది. మహిళలను అక్షరాలా వంటింటి బానిసలుగా మార్చివేశారు. ఒసామా బిన్ లాడెన్ వంటి తీవ్రవాదులకు దేశాన్ని డెన్గా మార్చారు. అందుకే తాలిబాన్లంటే ప్రజలకు బెదురు. ఇరవయ్యేళ్లలో ప్రపంచ పరిణామాలు చాలా జరిగాయి. ఇప్పుడు తాలిబాన్ నేతలు విద్యార్థులు కాదు. సంస్థ పేరుకే విద్యార్థి సంఘం. విద్యార్థులు ఎవరూ ఇందులో లేరు. ఇరవయ్యేళ్లూ అదొక సైన్యంగా పనిచేసింది. ఇప్పుడు రాజకీయ పార్టీగా పరివర్తన చెందే క్రమంలో ఉన్నది. అన్ని రాజకీయ స్రవంతులనూ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలు ఉన్నట్టు బహిరంగంగానే తాలిబాన్ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ప్రపంచం హర్షిస్తుంది. తాలిబాన్ 1.0 మాదిరిగా వ్యవహరించే భౌతిక పరిస్థితులు ఇప్పుడు లేవు. మహిళలు బాగా చదువుకున్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారు. జనసామాన్యం అభివృద్ధిని కోరుకుంటున్నది. స్వేచ్ఛనూ, స్వాతంత్య్రాన్ని, అభ్యుదయాన్ని వారు కోరుకుంటున్నారు. ఈ మార్పును తాలిబాన్లు గుర్తించకుండా గతంలో మాదిరిగానే ప్రవర్తిస్తే బుద్ధిచెప్పే సాహసం అఫ్గాన్ ప్రజలకు ఉన్నది. ఈ రెండు రోజుల్లోనే అది వెల్లడైంది. అవసరమైతే మరోసారి సమరశంఖం పూరించడానికి పంజ్షీర్లు సిద్ధంగా ఉన్నవి. దేశాల స్వాతంత్య్రాన్ని, జాతుల స్వయం నిర్ణయాధికారాన్నీ గుర్తించి, గౌరవించడం ప్రజాస్వామిక శక్తుల కనీస ధర్మం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అఫ్గనిస్తాన్: మొదలైన తరలింపు.. స్వదేశానికి 85 మంది భారతీయులు
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్ను ఆక్రమించడంతో ఆ దేశంలో ఉన్న భారతీయుల తరలింపు ప్రక్రియ ఇవాళ మొదలైంది. వైమానిక దళానికి చెందిన సీ-130జే ప్రత్యేక రవాణా విమానం బయలుదేరింది. దాంట్లో 85 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం ఆ విమానం రీఫ్యుయలింగ్ కోసం తజకిస్తాన్లో ల్యాండ్ అయినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. స్టాండ్బైగా కూడా మరో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. అలానే మరో ట్రాన్స్పోర్ట్ విమానం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సీ-17 విమానంలో సుమారు180 మంది భారతీయుల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కాబూల్ నగరం తాలిబన్ల ఆధీనంలో ఉన్నది. అయితే ఎంత మంది విమానాశ్రయానికి చేరుకుంటారో చెప్పలేం. ఎయిర్ ఇండియా విమానాలను ఆపరేట్ చేయడం కష్టంగా ఉన్న నేపథ్యంలో కేవలం వాయుసేన విమానాలను నడపనున్నారు. (చదవండి: Afghanistan: ఆశలు ఆవిరి.. వారి 'ఖేల్' ఖతం..) వీలైనంత ఎక్కువ మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దౌత్యకార్యాలయ్యాల్లో పని చేస్తున్న సిబ్బందిని తరలించగా.. మరో 1000 మంది వేర్వేరు అఫ్గన్ నగరాల్లో చిక్కుకున్నటు ప్రభుత్వం భావిస్తోంది. వారందరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది గుర్తించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రస్తుతం అఫ్గన్లో ఉన్న ఓ గురుద్వారాలో 200 మంది హిందువులు, సిక్కులు శరణార్థులుగా ఉన్నట్లు సమాచారం. చదవండి: Afghanistan: ఇంటికి పో.. ఇంకెప్పుడూ రాకు! -
తాలిబన్ల పైశాచికత్వం: ఇకపై పశు వ్యభిచారం
ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండానే అఫ్గనిస్థాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. అధికారం చేపట్టకున్నా దమనకాండను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల హక్కులకు భంగం కలిగించమంటూ ప్రకటిస్తూనే.. అణచివేత ధోరణిని మొదలుపెట్టారు. తాజాగా కాబూల్లోని డజన్లకొద్దీ వేశ్య గృహాలను దగ్గరుండి మరీ ఖాళీ చేయించిన తాలిబన్లు.. ఆ స్థానంలో జంతువుల్ని ఉంచారు. దీంతో జంతు పరిరక్షణ సంఘాలు మండిపడుతున్నాయి. ఒంటెలు, గొర్రెలు, కుక్కలు.. ప్రస్తుతం కాబూల్లోని పాతిక వేశ్యగృహాల్లో ఇవే కనిపిస్తున్నాయి. 1990 సమయంలో తమ పాలనలో వేశ్య వృత్తిని తాలిబన్లు అణిచివేశారు. బదులుగా లైంగిక వాంఛల్ని తీర్చుకోవడానికి జంతువుల్ని వేశ్య గృహాల్లో ఉంచేవాళ్లు. వాళ్ల దృష్టిలో వేశ్య వృత్తిలో మహిళలు కొనసాగడానికి వీల్లేదు. జంతువులతో శృంగారంలో పాల్గొనేందుకు మాత్రం తాలిబన్లు అనుమతి ఇస్తారు. చదవండి: అఫ్గన్ సంక్షోభం-హెల్ప్లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం అఫ్గన్లో అమెరికా సైన్యాల మోహరింపు, ప్రభుత్వ పాలన సమయంలో మహిళలు స్వేచ్ఛగా జీవించారు. చట్టవిరుద్ధం-కఠిన శిక్షలు అమలులో ఉన్నప్పటికీ.. వేలమంది అఫ్గన్లు వేశ్య వృత్తిలో కొనసాగారు. కాబూల్, మజర్ ఏ షరీఫ్, హెరత్, జలాలాబాద్, జోవ్జాన్ ప్రావిన్స్లో కార్యకలాపాలు ఇంతకాలం యదేఛ్చగా సాగాయి. కొన్ని చోట్ల పిల్లలను సెక్స్ బానిసలుగా మార్చేశారు కూడా. అయితే తాలిబన్లు మాత్రం వేశ్య వృత్తిని.. ఇస్లాం వ్యతిరేక వ్యాపారాల్లో ఒకటిగా భావిస్తుంటారు. బదులుగా జంతువులతో పాల్గొని ఒత్తిడి తీర్చుకోవాలంటూ తమ గ్రూపులకు సలహా ఇస్తుంటారు కూడా. చదవండి: పదేళ్లు మగాడి వేషంలో.. ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘం రీజినల్ డైరెక్టర్ మార్గరేట్ స్మిత్ తీవ్రంగా స్పందించారు. ‘‘కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఉంది తాలిబన్ల తీరు. జంతువుల కంటే హీనంగా ఆడవాళ్లను అణిచివేస్తున్నారంటూ తాలిబన్లపై ఆమె మండిపడ్డారు. ‘‘వాళ్ల(తాలిబన్ల) దృష్టిలో ఆడవాళ్లంటే పిల్లలు కనే యంత్రాలు. మూగజీవాల్ని లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటారు. చూస్తుంటే.. ఆడవాళ్ల కంటే మూగ జీవాలకే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉంది’’ అంటూ సెటైర్లు పేల్చారు ఆమె. చదవండి: షరియా.. ఉల్లంఘిస్తే ఉరే! -
భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు
న్యూఢిల్లీ: తాలిబన్ల మాటలకు చేసే చేష్టలకి ఎక్కడా పొంతన కుదరడం లేదు. దేశంలో విదేశీ ప్రతినిధులకు, కార్యాలయాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన వారు తమ నీచ బుద్ధిని బయట పెట్టుకున్నారు. అఫ్గాన్లో భారత దౌత్య కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసేసినప్పటికీ తాలిబన్లు తనిఖీలు నిర్వహించారు. కీలక పత్రాలేమైనా దొరుకుతాయేమోనని కార్యాలయాల్లో అణువణువూ గాలించారు. కాందహార్, హెరాత్లో ఉన్న భారత కాన్సులేట్లలో బుధవారం తాలిబన్లు సోదాలు నిర్వహించి కార్యాలయం అంతటినీ చిందరవందర చేసి పడేశారు.ఆ కార్యాలయాల ఆవరణల్లో పార్క్ చేసి ఉన్న వాహనాలను తమ వెంట తీసుకువెళ్లినట్టు శుక్రవారం దౌత్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు. (చదవండి: ‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’) ‘‘మేము ఈ విషయం ముందే ఊహించాం. తాలిబన్లు భారత కాన్సులేట్లను అణువణువు తనిఖీ చేశారు. కీలక పత్రాలేమైనా లభిస్తాయేమోనని గాలించారు. మేము పార్క్ చేసిన వాహనాలను తీసుకువెళ్లి పోయారు’’అని అ అధికారి వెల్లడించారు. సోదాలకు కొద్ది రోజుల ముందే అఫ్గాన్లో భారత రాయబారి సిబ్బందికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని తాలిబన్ రాజకీయ విభాగం నుంచి సందేశం వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా భారత్ దౌత్య సిబ్బంది, భద్రతా అధికారుల్ని వెనక్కి తీసుకు వచ్చేసింది. 31 వరకు వేచి చూసే ధోరణి అఫ్గానిస్తాన్లో ఏర్పాటయ్యే ప్రభుత్వంపై తాలిబన్లకు ఈ నెల 31 వరకు ఎలాంటి ప్రకటన చేసే ఉద్దేశం లేదని అఫ్గాన్ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా తన సైనిక బలగాలను ఈ నెల 31లోగా ఉపసంహరిస్తామని చెప్పడంతో అప్పటివరకు వారు వేచి చూసే ధోరణిలో ఉంటారని ఆ అధికారి తెలిపారు. అమెరికా బలగాల ఉపసంహరణ గడువు వరకు తాలిబన్లు చేసేదేమీ లేదన్నారు. ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని కొత్త ప్రభుత్వంలో చేర్చుకుంటామని తాలిబన్లు చెప్పినా మాటపై నిలబడతారన్న నమ్మకం ఎవరికీ లేదు. -
Afghanistan: ఇంటికి పో.. ఇంకెప్పుడూ రాకు!
Afghanistan Crisis: కుక్కతోక వంకరేనని మరోమారు తాలిబన్లు రుజువు చేస్తున్నారు. దేశాన్ని అధీనం చేసుకున్న తొలి రోజుల్లో ఎంతో మారిపోయినట్లు ఫొజులిచ్చిన తాలిబన్ మూకలు క్రమంగా తమ పాత నిజ స్వరూపాలను బయటపెడుతున్నాయి. మహిళా హక్కులు కాపాడతామంటూ గంభీర ప్రకటనలిచ్చి రోజులు గడవకముందే మహిళలపై తీవ్ర అణిచివేత చూపుతున్నారు. దేశమంతా పలు ప్రాంతాల్లో స్త్రీలపై తాలిబన్ల అణిచివేత, అకృత్యాలపై వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా తుపాకీ గురిపెట్టి మరీ తనను టీవీలో కనిపించవద్దంటూ తాలిబన్లు ఆదేశించారని ప్రముఖ మహిళా టీవీ ప్రజెంటర్ మెహ్ ముర్సల్ అమిరి వెల్లడించారు. అఫ్గాన్ నేషనల్ టీవీకి చెందిన ఆర్టీఏ స్టూడియోస్లో ఆమె పనిచేస్తున్నారు. ఈ స్టూడియోను ఆక్రమించిన తాలిబన్లు ముర్సల్కు తుపాకీ గురిపెట్టి ‘‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’’ అని బెదిరించారు. మేకప్ వేసుకున్నందుకు, హిజాబ్ ధరించనందుకు ఆమెను తీవ్రంగా దూషించారు. తోటి యాంకర్లను సైతం ఆఫీసుకు రావద్దని హెచ్చరించారు. ఒకపక్క మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చి మారినట్లు చెప్పుకుంటున్న తాలిబన్లు మరోపక్క మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంధకార భవితవ్యం... దేశంలో స్త్రీల భవిష్యత్ అంధకారంలోకి జారిందని ముర్సల్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత దిగజారుతాయని ఆందోళన చెందారు. లా డిగ్రీ చదువుతున్న ముర్సల్ టీవీలో వారానికి ఆరురోజుల పాటు సాగే 2 గంటల లైవ్షో నిర్వహిస్తారు. టీవీ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఆదరణ ఉంది. ఎప్పటిలాగే ప్రోగ్రామ్ చేసేందుకు స్టూడియోకు వెళ్లానని, అనంతరం తాలిబన్లు స్టూడియో ను ఆక్రమించారని ముర్సల్ చెప్పారు. స్టేషన్లో ఉన్న మహిళలందరినీ వెంటనే వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు తెలిపారు. పురుష సిబ్బందిలో చాలామందిని కూడా తాలిబన్లు తొలగించారని ఆమె చెప్పారు. ‘‘టీవీ స్టూడియోను చూస్తుంటే ఏదో మసీదులో కొందరు పురుషులు కూర్చొని షరియా చట్టం గురించి మాట్లాడుతున్నట్లు ఉంది. అసలు మహిళలనే వారు ప్రపంచంలో ఉన్నట్లే అనిపించడంలేదు. నాకు భవిష్యత్పై, ఇప్పుడు జరుగుతున్న విషయం బయటకు చెప్పడంపై భయంగా ఉంది. అయితే ఏమీ చేయ కుండా కూర్చోలేను. ఇదే సమయంలో నా భద్రత కోసం జాగ్రత్తపడాలి’’ అని వ్యాఖ్యానించారు. హక్కులు కోల్పోయాం పౌర పాలనలో తాను హిజాబ్ ధరించడానికి వ్యతిరేకమని, కానీ ప్రస్తుతం తన హక్కును లాగేసుకున్నట్లు అనిపిస్తోందని ముర్సల్ చెప్పారు. షరియా చట్టం అమలైతే తాము స్వేచ్ఛగా సంచరించే వీలుండదని, ఇంట్లోనే ఉండాలని, బయటకు వస్తే ముసుగుతో పాటు ఎవరో ఒక మగవారు తమవెంట ఉండాలని, అలాంటి జీవితాన్ని తాను కోరుకోవడం లేదని వాపోయారు. ఎక్కడికైనా పోదామంటే సరిహద్దులు మూసివేశారన్నారు. తాను ఇస్లాంకు వ్యతిరేకం కాదని, కానీ స్త్రీలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, పాడడంలో తప్పులేదన్నది తన అభిప్రాయమన్నారు. తనకు సైతం ఇదే అనుభవం ఎదురైందని మరో జర్నలిస్టు ఖదీజా చెప్పారు. తాలిబన్లు నియమించిన డైరెక్టర్తో మాట్లాడితే కార్యక్రమాలన్నీ మార్చివేశామని, ఇకపై మహిళా జర్నలిస్టులు, యాంకర్లు అవసరం లేదని చెప్పారని ఖదీజా తెలిపారు. మహిళా రాజకీయవేత్త సలీమా మజారీని తాలిబన్లు బంధించి ఉంటారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈమె తాలిబన్లను తీవ్రంగా విమర్శించేవారు. భయంలో మహిళా క్రీడాకారులు తోటివారిని కాపాడమని ‘ఫిఫా’కు కెప్టెన్ విజ్ఞప్తి అఫ్గానిస్తాన్లో ఉన్న తన బృంద సభ్యులను రక్షించాలని ఆదేశ మహిళా ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ షబ్నం మొబరెజ్ ఫిఫా(ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య)కు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. కానీ తన టీమ్ మెంబర్స్ అఫ్గాన్లోనే ఉన్నారని, వారి భవితవ్యంపై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్లో ఉన్న తన సహచరురాలితో జరిపిన సంభాషణను ఆమె బయటపెట్టారు. వారి పరిస్థితి బాగాలేదని, వారంతా భయంలో ఉన్నారని, ఫిఫా వారిని కాపాడాలని కోరారు. ఫుట్బాల్ ఆడినందుకు వారి అడ్రసులు వెతుక్కుంటూ వెళ్లి తాలిబన్లు చంపేస్తారని ఆందోళనగా ఉందన్నారు. పౌర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2007లో అఫ్గాన్ మహిళా ఫుట్బాల్ టీమ్ ఏర్పాటైంది. 2012లో ఖతార్పై గెలుపుతో ఈ టీమ్ తొలి విజయం నమోదు చేసింది. తాలిబన్ల పాలన వచ్చిన నేపథ్యంలో మహిళా క్రీడాకారులు తమ సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయాలని, ఇంట్లో ఉన్న ప్రాక్టీస్ కిట్స్ను తగలబెట్టి జాగ్రత్త వహించాలని ఫుట్బాల్ మాజీ కెప్టెన్ ఖలీదా పోపల్ సూచించడం మహిళా క్రీడాకారుల్లో భయానికి అద్దం పడుతోంది. –నేషనల్ డెస్క్, సాక్షి -
దిల్లీ... మా చల్లని తల్లీ!
తాలిబన్ల భయంతో ఆ దేశం నుంచి పారిపోవడానికి సాధారణ ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్న తాలిబన్ల ప్రాబల్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే కొందరు మహిళలు పసిగట్టారు. వారికి భవిష్యత్ చిత్రపటం కనిపించింది. ఆ చిత్రంలో ఆయుధాలు, అణిచివేత తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించలేదు. అందుకే ప్రమాదాన్ని ఊహించి దిల్లీకి వచ్చేశారు. దిల్లీ వారి కన్నీళ్లను తుడిచి, వారికో దారి చూపిన తల్లి అయింది. 24 సంవత్సరాల మోష్గన్ మాతృభూమి అఫ్ఘాన్ను వదిలి వస్తున్నప్పుడు ఏంచేసి బతకాలో తెలియదు. బతకాలంటే అఫ్ఘాన్ను వదిలివెళ్లాలనేది మాత్రమే తెలుసు. దిల్లీకి వచ్చిన తరువాత నిస్సహాయంగా దిక్కులు చూడాల్సిన దీనస్థితి రాలేదు. దిల్లీ కేంద్రంగా పనిచేసే ‘సీలైవాలి’ అనే సామాజిక స్వచ్ఛంద సంస్థ మోష్గన్ను ఆదుకుంది. బతకడానికి ఒక దారి చూపింది. ‘సీలైవాలి’ కేంద్రంలో ఆటబొమ్మలు, గృహఅలంకరణ వస్తువులు తయారుచేస్తుంటుంది మోష్గన్. ‘పరిస్థితిని ముందే ఊహించి ఇక్కడ భద్రంగా ఉన్నందుకు సంతోషించాలో, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ప్రమాదం అంచున ఉన్నందుకు బాధపడాలో తెలియడం లేదు. ఈ దేశం మమ్మల్ని కన్నతల్లిలా ఆదుకొని ఆదరిస్తోంది’ అంటుంది మోష్గన్. 45 సంవత్సరాల రజియా, 23 సంవత్సరాల షబానా... మోష్గన్లా భవిష్యత్ను పసిగట్టి దిల్లీకి వచ్చినవారే. వీరు కూడా ‘సీలైవాలి’లో పనిచేస్తున్నారు. బొమ్మలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ‘మనసులో భయం తప్ప, చేతిలో తెలిసిన విద్య అంటూ ప్రత్యేకంగా లేదు. అలాంటి నేను శిక్షణలో బొమ్మలు, ఇతర వస్తువుల తయారీ నేర్చుకున్నాను. నాకు పరాయి దేశంలో ఉన్నట్లుగా లేదు. మాతృభూమిలోనే ఉన్నట్లుగా ఉంది’ అంటుంది రజియా. ‘దిల్లీకి వచ్చే ముందు చాలామంది వారించారు. చావోబతుకో ఇక్కడే అన్నారు. ఎవరూ పరిచయం లేని, ఎప్పుడూ చూడని దేశంలో ఇబ్బందులు పడతావు అని హెచ్చరించారు. అయినా మొండిధైర్యంతో వచ్చాను. ఎలాంటి ఇబ్బందులు పడలేదు. విశాల ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. మరోవైపు అక్కడ మా వాళ్ల పరిస్థితి చూస్తే బాధగా ఉంది’ అంటుంది షబాన. మోష్గన్, రజియా, షబానా... ఇంకా చాలామంది ఆఫ్గాన్ మహిళలకు ‘దిల్లీ’ అనేది దేశరాజధాని కాదు వారి చల్లనితల్లి. -
తాలిబన్ల మిత్రులకు అసలు పరీక్ష?
తాలిబన్లు మళ్లీ అఫ్గాన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆ దేశ భవిష్యత్తు ప్రత్యేకించి అక్కడి మైనారిటీలు, మహిళలు, బాలికల భవిష్యత్తు.. తాలిబన్లలో ఎవరు ఆధిపత్యం నిరూపించుకుంటారు అనే అంశంపై ప్రధానంగా ఆధారపడి ఉంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న బృందాలతో కూడిన సమీకృత శక్తి తాలిబన్లు. అఫ్గాన్ మతగురువుల ప్రాబల్యంతో దోహాలో రాజకీయ కార్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరిక స్వభావం కలిగిన రాజకీయ విభాగానికీ, క్షేత్రస్థాయిలో పనిచేసే యుద్ధప్రభువులకూ మధ్య బోలెడన్ని తేడాలున్నాయి. ఈ తాలిబన్ శక్తుల్లో ఎవరిది పైచేయి అవుతుంది అనే అంశంపైనే అఫ్గాన్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే మరింత మితవాద స్వభావం కలిగిన తాలిబన్ నేతలను గుర్తించి, వారికి మద్దతునివ్వడం ఇప్పుడు చాలా అవసరం. కాబూల్ని తాలిబన్లు కైవసం చేసుకోవడం, అఫ్గాన్ ప్రభుత్వం కుప్పగూలడం జరిగిన తర్వాత కాలం గుర్తించదగినంత ప్రశాంతంగా సాగుతోంది. దుకాణాలు, వ్యాపారాలను చాలా వరకు మూసివేశారు. సాధారణ పౌరులు తమ ఇళ్లలో దాక్కున్నారు. తాలిబన్లు పోలీసు ఫోర్స్గా వ్యవహరిస్తూ నగరాన్ని పరిరక్షిస్తున్నారు. కానీ, ఈ సాపేక్ష ప్రశాంతతలో అఫ్గాన్లు అసాధారణమైన వాస్తవికతను ఎదుర్కొంటున్నారు. వారు ఇప్పుడు పూర్తిగా కొత్త దేశంలో నివసిస్తున్నారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికన్ సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకుంటూ, అమెరికన్ అధికారులు ఊహించిన దానికంటే వేగంగా పరిణామాలు జరిగిపోయాయని అంగీకరించారు. బైడెన్ అభిప్రాయం ప్రకారం, అఫ్గానిస్తాన్ రాజకీయ నేతలు చివరకు ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీతోపాటు చేతులెత్తేసి దేశం వదిలి పారిపోయినందుకే ఇలా జరిగింది. పైగా అఫ్గాన్ సైన్యం కుప్పకూలిపోయిందని, కొన్ని సందర్భాల్లో పోరాటం చేయకుండానే సైన్యం కూడా చేతులెత్తేసిందని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే అఫ్గానిస్తాన్ క్రియాశీల రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా ఖాన్ మహమ్మది తన సైన్యం వైఖరిని సమర్థించుకుంటూ ట్వీట్ చేశారు. ‘వారు మా చేతుల్ని వెనక్కి విరిచి కట్టేసి, దేశాన్ని అమ్మేశారు. ఘనీ, అతడి ముఠానే దీనంతటికీ కారణం’ అని వ్యాఖ్యానించారు. గతవారం కాబూల్ వీధుల్లో జరిగిన పరిణామాలు ఏవైనా కానివ్వండి.. ఇప్పుడు మాత్రం తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న. తాలిబన్లు అంటే ఎవరు? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం 2 లక్షల కోట్ల డాలర్లకంటే ఎక్కువగా వెచ్చించి తాలిబన్లను ఓడించటానికి ప్రయత్నించింది. కానీ ఆ తాలిబన్లే ఇప్పుడు అధికారంలోకి రావడంతో అఫ్గాన్లు, వారి ఇరుగుపొరుగు దేశాల పౌరులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంది? తాలిబన్లు ఒక ఏకీకృత శక్తి కాదు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న బృందాల మొరటైన సమీకృత శక్తి తాలిబన్లు. అఫ్గాన్ మతగురువుల ప్రాబల్యంతో దోహాలో రాజకీయ కార్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరిక స్వభావం కలిగిన రాజకీయ విభాగానికి, క్షేత్ర స్థాయిలో పనిచేసే యుద్ధప్రభువులకు మధ్య గణనీయంగా వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఈ తాలిబన్ శక్తుల్లో ఎవరిది పైచేయి అవుతుంది అనే అంశంపైనే అఫ్గాన్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే మరింత మితవాద స్వభావం కలిగిన తాలిబన్ నేతలను గుర్తించి వారికి మద్దతునివ్వడం ఇప్పుడు చాలా అవసరం. ఇక్కడ మనకు ఒక శుభవార్త. అత్యంత తాజా సమాచారం ప్రకారం, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ అధినేత ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ అఫ్గానిస్తాన్ నూతన నాయకుడు కావచ్చని తెలుస్తోంది. తనకు తానుగా వాస్తవికవాదిగా, అనుభవశీలిగా, ఆలోచనాత్మకమైన నాయకుడిగా బరాదర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. పైగా తన చుట్టూ ఉన్న తాలిబన్ గ్రూపులన్నింటిని ఐక్యంగా ఉంచే శక్తి ఈయనకుంది. పైగా అంతర్జాతీయ శక్తులతో సమర్థంగా చర్చించే సామర్థ్యమూ ఈయనకుంది. ఆగస్టు 17న బరాదర్ చాలా ఏళ్ల తర్వాత అఫ్గానిస్తాన్లో అడుగుపెట్టారు. పైగా, సమీకృత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని రూపొందించాలని తాలిబన్ నేతలు ప్రతిజ్ఞ చేశారు కూడా. తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ తాజా ప్రకటన ప్రకారం, అలాంటి ప్రభుత్వం తాలిబనేతర అఫ్గాన్లను కూడా తీసుకుంటుందని, వీరిలో అందరికీ సుపరిచితులు కూడా ఉండవచ్చు. అఫ్గాన్ మాజీ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా ఈ ప్రముఖులలో ఒకరు కావచ్చు. శాంతియుతంగా అధికార మార్పిడికి ఈయన ఒక సమన్వయ మండలిని కూడా ఏర్పర్చారు. ప్రస్తుతం దోహాలో ఉన్న ఈ కౌన్సిల్ అఫ్గానిస్తాన్ జాతీయ పునర్వ్యవస్థీకరణపై అత్యున్నత మండలి చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా, మాజీ ప్రధాని గుల్బుద్దీన్ హెక్మత్యార్తోపాటు తాలిబన్ నాయకత్వంతో భేటీ కానుంది.అయితే వాస్తవానికి తాలిబనేతర ప్రముఖులు కూడా భాగమై ఉండే ఈ తరహా ప్రభుత్వంలో చాలామంది తాలిబన్ రాడికల్ శక్తులకు తావు ఉండకపోవచ్చు. అంటే ఇలా అధికారంలో భాగం కాని ఈ తీవ్రవాద శక్తులు అల్ ఖయిదా లేదా ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద గ్రూపులతో మళ్లీ జతకట్టే ప్రమాదం కూడా ఉంది. అంతకుమించిన ప్రమాదం ఏమిటంటే, అఫ్గానిస్తాన్ ఏకజాతి (పస్తూన్) ప్రాబల్య దేశంగా మారిపోవచ్చు కూడా. ఇది మళ్లీ దేశంలో అంతర్యుద్ధాన్ని ప్రేరేపించి తీరుతుంది. పైగా, సమీకృత ప్రభుత్వాన్ని స్థాపించాలంటే తాలిబన్లు సైన్యా న్ని, పోలీసు బలగాన్ని బలోపేతం చేయాల్సి ఉంటుంది. అంతకుమించి తక్కిన ప్రపంచంతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాల్సి ఉంది. రష్యా, చైనా దేశాలకే ప్రస్తుతం తాలిబన్లతో సత్వర సంబంధాలు నెలకొల్పుకునే అవకాశమున్నట్లు కనబడుతోంది. తాలిబన్లతో రష్యా అధికార పీఠం సత్సంబంధాలను నిర్వహిస్తోందని అఫ్గానిస్తాన్కి రష్యా అధ్యక్షుడి తరపున రాయబారి జమీర్ కుబులోవ్ చెబుతున్నారు. కాబట్టి అఫ్గాన్లో జరిగిన పరిణామాలు చూసి రష్యా కలవరపడటంలేదు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ఇటీవలే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీయ్ లవ్రోవ్తో ఫోన్లో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్లో తమ రెండు దేశాల చట్టబద్ధమైన ప్రయోజనాలను పరిరక్షించుకోవాల్సి ఉందని చెప్పడం బహిర్గతమైంది. అక్కడి పరిస్థితిని బట్టి తమ రెండు దేశాలు పరస్పరం బలపర్చుకోవలసి ఉంటుందని కూడా వీరు అభిప్రాయపడ్డారు. అఫ్గానిస్తాన్ పొరుగున ఉన్న సెంట్రల్ ఆసియన్ దేశాలను కూడా తాలిబన్లు భాగస్వాములుగా చేసుకోవచ్చు. విస్తృతార్థంలో చూస్తే, మధ్య ఆసియా దేశాలు తాలిబన్ల నేతృత్వంలోని అప్గానిస్తాన్తో సహకారానికి అవకాశముందని ఆశాభావంతో చూస్తున్నాయి. పైగా అఫ్గానిస్తాన్ నుంచి మధ్య ఆసియా దేశాలకు కొత్త ప్రమాదాలు జరిగే అవకాశాన్ని అనుమతించబోమని బరాదర్ ప్రతిజ్ఞ చేశారు. పైగా మజర్ షరీఫ్, కాబూల్ గుండా ఉబ్జెకిస్తాన్ లోని టర్మిజ్ నుంచి పాకిస్తాన్లోని పెషావర్ వరకు కాబూల్ కారిడార్ నిర్మించాలంటూ ఉజ్బెకిస్తాన్ చేసిన ప్రతిపాదనను బరాదర్ స్వాగతించారు. అమెరికా వైదొలిగాక, అఫ్గాన్తో సహా మధ్యాసియా దేశాల మధ్య వాణిజ్య, మౌలిక వసతుల కల్పన మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. అలాగే అమెరికా, దాని మిత్ర దేశాల విధానం పైన కూడా అఫ్గాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అఫ్గాన్లో అమెరికా ఘోర ‡వైఫల్యం, సైనిక బలగాల ఉపసంహరణ అంతర్జాతీయ స్థాయిలోనే అమెరికాను ఘోరంగా అవమానపర్చింది. అఫ్గానిస్తాన్ విధ్వంసంలో అది నిర్వహించిన పాత్ర రీత్యా, అఫ్గాన్ ప్రజల శ్రేయస్సుకు అమెరికా ఏమేరకు బాధ్యత వహిస్తుందన్నది కూడా ప్రశ్నే. సమీకృత∙పాలన, ఉగ్రవాద నిరోధంవైపుగా తాలిబన్లు ఏమేరకు తమ చిత్తశుద్ధిని ప్రదర్శించగలరని తాము వేచి చూస్తున్నామని జో బైడెన్ చెబుతున్నారు. అమెరికా, దాని మిత్రదేశాలు సాధారణ అఫ్గాన్ పౌరులకు చేయవలసిన సహాయం ఎంతగానో ఉంది. అలాగే అఫ్గాన్ పొరుగుదేశాలు, రష్యా కూడా అఫ్గాన్ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవలసి ఉంది. చైనా, రష్యా, మధ్యాసియా దేశాలు ఇలా ఆసక్తి కలిగిన అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసి అఫ్గాన్పై ప్రత్యేక అంతర్జాతీయ సదస్సును ఏర్పర్చాలి. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో సహాయ మందించే దేశాలు కూడా ఒక్కటవ్వాలి. అలాగే ఐరాస, వివిధ అభివృద్ధి బ్యాంకులు కలిసి అఫ్గాన్ పునర్నిర్మాణం కోసం ప్రత్యేక నిధిని ఏర్పర్చాలి. మధ్యాసియా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేయగల రష్యా, అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించగలదు. రష్యాతో సంబంధ బాంధవ్యాలతో పాశ్చాత్య ప్రపంచం కూడా ఈ మొత్తం ప్రక్రియను మెరుగుపర్చవచ్చు. – జూమార్ట్ ఒటోర్బెవ్, కిర్గిజ్స్తాన్ మాజీ ప్రధాని (ప్రాజెక్ట్ సిండికేట్ సౌజన్యంతో) -
Afghanistan: ‘సిగ్గుందా? శవాలపై వ్యాపారమా?’
అఫ్గనిస్తాన్లో తాలిబన్ల దురాక్రమణ తర్వాత.. నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఓవైపు తాలిబన్లు భద్రతా హామీ ఇచ్చినట్లే ఇచ్చి.. అఫ్గన్లపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు భయాందోళన నిండిన పౌరులు.. పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఆడవాళ్ల భద్రత ప్రశ్నార్థకంగా మారగా.. పసిపిల్లలనైనా రక్షించాలనే తాపత్రయంతో కంచె అవతల ఉన్న విదేశీ సైన్యానికి అందిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా అనిపిస్తున్నాయి. అఫ్గన్ పరిస్థితులు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఓ దుస్తుల కంపెనీ.. అఫ్గన్ దుస్థితిని క్యాష్ చేసుకోవాలనుకున్న ప్రయత్నాన్ని దారుణంగా తిప్పికొట్టారు కస్టమర్లు. తాలిబన్ ఆక్రమణ పూర్తయ్యాక అమెరికా సీ-17 విమానం ద్వారా తప్పించుకునే ప్రయత్నంలో.. ఇద్దరు వ్యక్తులు గగనతలం నుంచి ఓ బిల్డింగ్ మీద పడి ప్రాణాలు పొగొట్టుకున్న విషయం తెలిసిందే. అఫ్గన్ల భయానికి అద్దంపట్టే ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. As Afghans are fleeing and clinging to planes out of desperation, someone decided to capitalize on their pain and misery with this repulsive t-shirt. It’s being sold on at least half a dozen t-shirt printing websites right now. Humans can be so cruel. pic.twitter.com/du5cCbD2QA — Holly Dagres (@hdagres) August 18, 2021 అయితే ఈ ప్రాణభీతి ఘటనను ఉద్దేశిస్తూ.. కాబూల్ స్కై డైవింగ్ క్లబ్ పేరుతో ఓ దుస్తుల కంపెనీ లేటెస్ట్ మోడల్స్ను రిలీజ్ చేసింది. ఆకాశంలో విమానం నుంచి కిందపడ్డ పౌరులను ఉద్దేశిస్తూ ఆ టీషర్ట్ ఉంది. Kabul Skydiving Club Est. 2021 పేరుతో లేటెస్ట్ మోడల్స్ను రిలీజ్ చేసింది. కొన్ని ప్రముఖ ఆన్లైన్ స్టోర్లు వీటిని అమ్మకానికి ఉంచడం విశేషం. దీంతో ‘సరదానా? శవాలపై వ్యాపారమా?’ అంటూ విమర్శలు మొదలయ్యాయి. అయితే రాజకీయ ఉద్దేశాలు, అఫ్గన్ల దీనస్థితిని తెలియజేసేందుకు తాము ఆ టీషర్టులను రూపొందించినట్లు కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కానీ, వివరణపై నెటిజన్స్ మాత్రం తగ్గట్లేదు. విషాద ఘటన ద్వారా టీషర్టులను అమ్మే ప్రయత్నాన్ని ‘క్రూరం.. ఘోరం’గా అభివర్ణిస్తూ నెటిజన్స్ మండిపడుతున్నారు. చదవండి: మా కంటి పాపలనైనా కాపాడండి -
తాలిబన్ల నిఘా: సోషల్ మీడియాలో వెతక్కండి
Afghan Social Media Accounts: అఫ్గనిస్తాన్ ఆక్రమణ తర్వాత.. ఎలాంటి హాని ఉండబోదని తాలిబన్లు ప్రకటించినప్పటికీ ప్రతీకార దాడులకు దిగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకుంటున్న తాలిబన్లు.. వీటి ద్వారా అఫ్గన్లను టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ యూజర్ల భద్రతా కోసం వీలైనంత ప్రయత్నాలు చేస్తున్నాయి. అఫ్గన్ యూజర్ల డిజిటల్ హిస్టరీ, ఇతరులతో సోషల్ కనెక్షన్స్పై తాలిబన్ల నిఘా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మానవ హక్కుల సంస్థలు. ఈ తరుణంలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ట్విటర్, లింకెడ్ఇన్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజర్లకు భరోసా ఇస్తున్నాయి. అకౌంట్ల భద్రత కోసం వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించాయి. ఇప్పటికే ఫ్రెండ్స్ సెర్చ్ ఆప్షన్ను తాత్కాలికంగా తొలగించింది ఫేస్బుక్. ఈ మేరకు ఫేస్బుక్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నాథనెయిల్ గ్లెయిచర్ గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు అఫ్గన్లో ఉన్నవాళ్లు.. తాలిబన్ల కంటపడకుండా ఇతర ప్రాంతాలకు, దేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవాళ్లు, సోషల్ మీడియాలో తాలిబన్ల వ్యతిరేక పోస్టులు పెడుతున్న అఫ్గన్లు, ఇతర దేశస్తులు కూడా అఫ్గన్ పౌరుల కోసం ఇంటర్నెట్లో వెతుకులాట చేయొద్దని.. తద్వారా తాలిబన్ల దృష్టిలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. హ్యాకర్ల సాయం మరోవైపు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ట్రేస్ చేసి అఫ్గన్లపై తాలిబన్లు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత కొన్నేళ్లుగా టెక్నాలజీని విపరీతంగా వాడేసుకుంటున్న తాలిబన్లు.. హ్యాకర్ల సాయం తీసుకునే అవకాశాలూ ఉండొచ్చని సైబర్ నిపుణులు చెప్తున్నారు. తద్వారా ఆర్థిక నేరాలకు, భద్రతాపరమైన సమాచారాన్ని తస్కరించే అవకాశాలు కనిస్తున్నాయి. ఇక అఫ్గన్లో విద్యావేత్తలు, జర్నలిస్టులు, అమెరికా దళాలకు సాయం అందించిన వాళ్లు ఇప్పటికే తాలిబన్ లిస్ట్లో ఉన్నారని, కాబట్టి వాళ్లంతా సోషల్ మీడియాకు వాళ్లు కొన్నాళ్లూ దూరంగా ఉండడం మంచిదని హెచ్చరిస్తున్నారు. ఇది చదవండి: తాలిబన్ల కంటపడకుండా ఎలా పారిపోతున్నారంటే.. అకౌంట్ల టెంపరరీ సస్పెన్షన్ దయచేసి సోషల్ మీడియా అకౌంట్లను శాశ్వతంగా తొలగించమని, పబ్లిక్ ఐడెంటింటీలో ఉన్న గుర్తులన్నీ తీసేయాలంటూ అఫ్గన్ ఫుట్బాల్ టీం మాజీ కెప్టెన్ ఆటగాళ్లకు సలహా ఇచ్చింది. మరోవైపు తాలిబన్ల నుంచి ప్రమాదం పొంచి ఉన్న ట్విటర్ అకౌంట్లు, పాత ట్వీట్లను తొలగించేందుకు ట్విటర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ‘రిస్క్ కలిగించే కంటెంట్ ఉన్న అకౌంట్లను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తామని, తిరిగి లాగిన్ కావడమో లేదంటే డిలీట్ చేయడమో యూజర్ ఇష్టమ’ని ట్విటర్ ఇదివరకే పేర్కొంది. ఇక మైక్రోసాఫ్ట్కు చెందిన ప్రొఫెషనల్ ఫ్లాట్ఫామ్ ‘లింకెడ్ఇన్’ అఫ్గన్ యూజర్ల అకౌంట్లను తాత్కాలికంగా కనిపించకుండా చేసినట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: అలెక్సాలో మెగాస్టార్ వాయిస్! -
పెనం మీంచి పొయిలో వేసిన పెద్దన్న!
చికిత్స ఎప్పుడూ రోగం కన్నా ఘోరంగా ఉండకూడదు. అల్ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల తాట తీస్తామని అమెరికా అఫ్గాన్లో చేరింది. ఇదే అఫ్గాన్ నుంచి 1990లలో రష్యా వైదొలగిన నాటి కంటే, 2001లో అమెరికా అక్కడ కాలూనిన నాటికంటే, తాను అర్థాంతరంగా వైదొలగుతున్న నేటి పరిస్థితులే దారుణం. 3 లక్షల మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు, శిక్షణ-ఆయుధాల కోసం తొమ్మిది వేల కోట్ల డాలర్లు (రూ.6.8 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఇంత చేసి అమెరికా, నాటో దేశాలు ఏం సాధించినట్టు? నేలను చీల్చుకువచ్చే పచ్చని పసరికను ఎంతో ఆశావహంగా చూస్తుంది ప్రపంచం. ఆకుల స్వరూపం ఏర్పడని లేతపిలక ఏం మొక్కై ఉంటుందా? అన్న ఆసక్తి చూపరులకు సహజం! ఎవరి సంగతెలాఉన్నా.... విత్తు అలికిన వాడికి తెలుస్తుంది మొలుచుకు వచ్చే మొక్క ఏంటో? అమెరికా అధ్యక్షుడు బైడన్ మాటలు... ‘‘ఇంకా ఒకటో, ఐదో, ఇరవయో.. ఏళ్లు మేం ఇక్కడే ఉండి సహాయం చేసినా, అప్పటికీ తుది ఫలితం ఇలాగే ఉంటుంది’’ అని అఫ్గానిస్తాన్లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకోవడంపై చేసిన వ్యాఖ్యలు సాపేక్షంగా ఇదే వెల్లడిస్తాయి. ‘పుల్లగుంజుడు ఆట’లో నెపం నెత్తిన పడ్డ ఆఖరివాడు బైడన్... ఓ నలుగురు అమెరికా అధ్యక్షులు, ఇరవై ఏళ్ల కాలం, వేల కోట్ల డాలర్ల సాక్షిగా జరుగుతున్న మారణ హోమమిది. పెనంలోంచి పొయ్యిలోకి పడ్డ అఫ్ఘాన్ తాజా దుస్థితి కారణాల్లో అమెరికా మొదటిది. ఎందుకంటే, తమ గూడాచార సంస్థ సీఐఏని వాడి తాలిబన్లను, ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది అమెరికాయే! రష్యా, చైనాలకు వ్యతిరేకంగా మొదట తాలిబన్లను, వారి స్థావరాలను పెంచి పోషించింది. తర్వాత వారు రష్యాకు దగ్గరైన పరిస్థితులు అమెరికా వైఖరిలో మార్పు తెచ్చాయి. ఉగ్రవాద ముప్పు వేడి తమకు తాకిన ‘జంట భవనాల విధ్వంసం’ తర్వాత అఫ్గానిస్తాన్నే స్వాధీనపరచుకుంది. అల్ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల పీఛమణచడానికని నాటో మిత్ర దేశాల సహకారంతో తిష్ట వేసింది. అఫ్గానిస్తాన్ని సుస్థిర–ఆధునిక దేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించి, అందుకు భిన్నంగా గడచిన రెండు దశాబ్దాలుగా చేస్తున్న నిర్వాకం కూడా బైడన్ మాటల వెనుక నుంచి తొంగి చూసింది. తాలిబన్లతో ఒప్పందం, దేశం నుంచి వైదొలగిన సమయం, కార్యాచరణ తీరు, వైఖరి సమర్థన... ఇదంతా ఘోర వైఫల్యాల శృంఖలం. మరోవైపు, ‘ఇప్పుడు మేం మారిన మనుషులం, విధానాలు మార్చుకున్న పాలకులం’ అంటున్న తాలిబన్ల మాటల్ని అంతర్జాతీయ సమాజం వింతగా చూస్తోంది. ఏ మాత్రం ప్రతిఘటన ఎదుర్కోకుండా కాబూల్ని స్వాధీనపరచుకున్న ఆదివారం నుంచి తాలిబన్లు చెబుతున్న మాటలకు భిన్నంగా గత 24 గంటల్లో హింసాత్మక పరిణామాలు, తాలిబన్లు సంయమనం కోల్పోయిన ఉదంతాలు సందేహాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి (యూఎన్) తో సహా ముఖ్య దేశాలు ఒకటొకటిగా స్పందిస్తున్నాయి. (కనీసం మా బిడ్డల్ని అయినా కాపాడండి! బావురుమంటున్న అఫ్గన్లు వైరల్ వీడియో) భారత్ ఒంటరవుతోందా? దక్షిణాసియాలో క్రమంగా భారత్ ఒంటరవుతోందా? విస్తరణ తత్వాన్ని పెంచుకున్న చైనా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ, భారత్ స్థానే దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం ఎత్తులు వేస్తోంది. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) చప్పబడిన ప్రస్తుత పరిస్థితుల్లో, భారత్ను మినహాయించి, మెజారిటీ సార్క్ సభ్యదేశాలతో చైనా కొత్తగా జట్టుకడుతోంది. ఈ దిశలో ‘ఒక బెల్టు, ఒక రోడు’్డ పథకం వారికి కలిసివచ్చిన అదృష్టం! ఇప్పుడు అఫ్గాన్లో స్వేచ్ఛ లభించిందని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ఖాన్ బహిరంగ ప్రకటన చేశారు. (Afghanistan: అశ్రఫ్ ఘనీ స్పందన, ఫేస్బుక్లో వీడియో) ఇటీవలి కాలంలో, భారత్ విదేశీ విధానంలో కొట్టిచ్చిన మార్పు అమెరికాతో అతిగా అంటకాగటం! అలా అని, అమెరికా ఏమైనా భారత్ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటుందా? అంటే, అదేం లేదు. అమెరికాకు ఎంతసేపూ, తన ప్రయోజనాలే ముఖ్యం. అఫ్గాన్ విషయంలోనూ అదే జరిగింది. దేశం విడిచివెళ్లాక కూడా మధ్య ఆసియాపై పెత్తనానికి అమెరికా ఏర్పాటు చేసుకున్న ‘చతుష్ట కూటమి’ (క్వాడ్)లో తనతో పాటు అఫ్గానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్లను చేర్చింది తప్ప భారత్కు చోటు లేదు. అమెరికా శక్తిసా మర్థ్యాలపై అతినమ్మకం, ముఖ్యంగా అఫ్గానిస్తాన్ విషయంలో అమెరికా చర్యలన్నింటికీ మద్దతిచ్చిన మనతీరు దౌత్య వైఫల్యంగానే నిపుణులు చెబుతారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఇప్పటికి రెండు మార్లు భేటీ అయిన రక్షణ మంత్రివర్గ సంఘం (సీసీఎస్) వేచి చూసే «ధోరణికే ప్రాధాన్యతనిస్తోంది. ‘జియోపాలిటిక్స్’ ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఈ రోజుల్లో, పలు దేశాల సరిహద్దులతో భౌగోళికంగా ఎంతో కీలక స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్, రష్యా, చైనాలకు దగ్గరవడం... మనను అస్థిరపరిచేదే! ఎలా చూసినా ఇది భారత్కు ప్రమాదకరమనే భావన వ్యక్తమౌతోంది. ముఖ్యంగా ఉగ్రవాదం–కశ్మీర్ సమస్యల దృష్ట్యా ఈ లెక్కలు. తాలిబన్లతో ఒక దొడ్డిదారి సంపర్కం భారత్కు ఏర్పడిందని, తద్వారానే సురక్షితంగా మన దౌత్య సిబ్బందిని కాబూల్ నుంచి ఢిల్లీ రప్పించగలిగారనీ వార్తలు. కవలలతో ప్రపంచమే కలవరం బయటకు పోరాడుతున్నట్టే కనిపించినా, పరస్పరం పెంచి పోషించుకునే సామ్రాజ్యవాదం, మతోన్మాదం... ఈ రెండూ ప్రమాదకర కవలలే! విస్తరణ తత్వంతో ఆధిపత్య పోరు జరిపే అగ్రరాజ్యాలు వివిధ దేశాల్లో పెట్టే చిచ్చు చరిత్ర చెప్పే సత్యం. జాతి–మత–ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి అంతర్యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధాఓలను ఆయా దేశాలపై రుద్దిన సందర్భాలెన్నో! ఉగ్రవాదాన్ని ఒక్కో సందర్భాన్ని బట్టి పుట్టించడం, పెంచి పోషించడం, పీఛమడచినట్టు వ్యవహరించడం ఈ పెద్దన్నలకు రివాజు! మతోన్మాద సంస్థలు కూడా తమ సంకుచిత ప్రయోజనాలకు, ఆయుధాలు, స్థావరాలు, డబ్బు కోసం సామ్రాజ్యవాద శక్తుల చేతుల్లో సందర్భాన్ని బట్టి పావులుగా మారతాయి. వారి స్థూల ప్రయోజనాలు నెరవేర్చి, తమ పబ్బం గడుపుకుంటాయి. చికిత్స ఎప్పుడూ రోగం కన్నా ఘోరంగా ఉండకూడదు. అల్ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల తాట తీస్తామని అమెరికా అఫ్గాన్లో చేరింది. ఇదే అఫ్గాన్ నుంచి 1990లలో రష్యా వైదొలగిన నాటి కంటే, 2001లో అమెరికా అక్కడ కాలూనిన నాటికంటే, తాను అర్థాంతరంగా వైదొలగుతున్న నేటి పరిస్థితులే దారుణం. 3 లక్షల మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు, శిక్షణ–ఆయుధాల కోసం తొమ్మిది వేల కోట్ల డాలర్లు (రూ.6.8 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఇంత చేసి అమెరికా, నాటో దేశాలు ఏం సాధించినట్టు? నిజానికి ఏమీ లేదు. తన సామ్రాజ్యవాద ప్రయోజనాలు, ఆధిపత్య అవసరాలు, ఆయుధ విక్రయాలు, వ్యాపార లాభాలు... ఇవే అమెరికాకు కావాలి. కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ను 2011, పాకిస్తాన్లో మట్టుపెట్టిన తర్వాత అఫ్గాన్లో అమెరికా మిషన్ ముగిసింది. తర్వాత దశాబ్దం, గడువు మించి ఉండటమే! తాలిబన్ల శక్తి–విస్తరణని, అఫ్గాన్ సైనిక చేవను, అక్కడి కీలుబొమ్మ ప్రభుత్వ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో అమెరికా ఘోరంగా విఫలమైంది. సర్కారు మనుగడ 3 నెలలని జోస్యం చెప్పినా, రెండు వారాల్లో ప్రభుత్వం చేతులెత్తి పలాయనం చిత్తగించింది. ఇదంతా, అమెరికా చరిత్రలోనే హీనమైన ఓటమికి తార్కాణమన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య అక్షర సత్యం! ఇక ఆయన నిర్వాకానికి వస్తే, అఫ్గాన్ ప్రభుత్వాన్ని, ప్రజల్ని భాగం చేయకుండా 2020 ఫిబ్రవరి, దోహా(కతర్)లో తాలిబన్లతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందమే ఓ గుల్ల, ఏకపక్షం! అనుచిత జోక్యాలు, ఆధిపత్య పోకడలు, సొంత మేళ్లు, నికర నష్టాలు, జారుకొని వైదొలగడాలు అమెరికాకు కొత్తేమీ కాదు. 1970లలో వియత్నాం నుంచి, 2011లో ఇరాక్ నుంచి వైదొలగడాలూ వైఫల్యాలే తప్ప వారి ఖాతాలో విజయాలు శూన్యం! (Afghanistan: ఆమె భయపడినంతా అయింది!) అఫ్గాన్లో ఛాందసవాదం వీడిన సమ్మిళిత సర్కారును అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. అప్పుడే... మహిళలు, పిల్లలు, మైనారిటీలకు రక్ష! మానవహక్కులు భద్రం! పాకిస్తాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) అదుపాజ్ఞల్లో, ఇస్తామాబాద్ కనుసన్నల్లో పనిచేసే సర్కారయితే... అఫ్గాన్లో ఇక నిత్యం రగిలేది రావణ కాష్టమే! ప్రపంచంలోని దాదాపు ఉగ్రవాద సంస్థలన్నిటికీ అక్కడ ఇప్పటికే స్థావరాలున్నాయి. తాలిబన్ల వైఖరిని బట్టే వాటి భవిష్యత్ మనుగడ! ఉగ్రవాద పోషణకు, ఎగుమతికి అఫ్గాన్ను కేంద్రం చేస్తే అంతర్జాతీయ సమాజం ఉపేక్షించదు. తాలిబన్లు ఆశిస్తున్నట్టు అధికారం సుస్థిరం కావాలంటే, అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందాలంటే, వారే చెప్పుకుంటున్నట్టు వారి పంథా మారాలి. అప్పుడే తాలిబన్ల విజయం సార్థకం! దిలీప్ రెడ్డి -
విమానం నుంచి పడిపోయిన ఘటన: అన్నదమ్ముల విషాద గాథ
కాబూల్: అఫ్గానిస్తాన్లో ఇటీవల విమానం పైనుంచి ఇద్దరు కిందపడిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని మొత్తం ఆ ఘటన నివ్వెరపరిచింది. తాజాగా ఆ ఇద్దరి వ్యక్తుల వివరాలు తెలిశాయి. తాలిబన్ల పాలనలో తాము నరకం అనుభవిస్తామనే ఆందోళనతో ఆ ఇద్దరు హడావుడిగా విమానం ఎక్కారని సమాచారం. ఆ విమానం నుంచి మొత్తం ముగ్గురు కిందపడగా ఆ వీడియోలో మాత్రం ఇద్దరే కనిపించారు. తాజాగా వారిలో ఇద్దరి వివరాలు తెలిశాయి. చదవండి: నరకయాతన.. విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్లు కిందపడిన ముగ్గురిలో ఇద్దరు రెజా (17), కబీర్ (16). వీరు సొంత అన్నదమ్ములు. వీరి కుటుంబంలో 8 మంది ఉంటారు. అయితే తాలిబన్లు తమ దేశాన్ని వశం చేసుకున్నారనే వార్త తెలుసుకున్న ఈ అన్నదమ్ములు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో కెనడా, అమెరికాలో అఫ్గన్ దేశస్తులకు ఆశ్రయిస్తున్నట్లు స్థానికులు మాట్లాడుకుంటుంటే వీరిద్దరూ విన్నారంట. దీంతో వెంటనే కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా ఇంట్లోని గుర్తింపు కార్డులు పట్టుకుని కాబూల్లోని విమానాశ్రయానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ కదులుతున్న అమెరికా యుద్ధ విమానం ఎలాగైనా ఎక్కాలని భావించి అతికష్టంగా విమానం రెక్కపై ఎక్కి కూర్చున్నారు. ఎగిరిన తర్వాత విమానం పైనుంచి రెజా, కబీర్ ఇద్దరూ కిందపడిపోయారు. ఆ పడిపోతున్న వీడియో ప్రపంచాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. అయితే రెజా మృతదేహం విమానాశ్రయం సమీపంలోని ఓ భవనంపై పడి ఉంది. పైనుంచి కిందపడడంతో రెజా కాళ్లు, చేతులు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. విగతజీవిగా పడి ఉన్న రెజాను కుటుంబసభ్యులు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. మరో యువకుడు కబీర్ జాడ ఇంతవరకు తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్లో ప్రజలు, అఫ్గాన్ సైన్యం తాలిబన్లపై నిరసనగళం వినిపిస్తన్నారు. నిరాయుధులైన ప్రజలను సాయుధ తాలిబన్లు చావబాదుతున్నారు. అఫ్గాన్ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఏం చేయాలో సమాలోచనలు చేస్తున్నాయి. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
తాలిబన్లతో కర్జాయ్ చర్చలు
కాబూల్: తాలిబన్ల నేతృత్వంలో అఫ్గానిస్తాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు వేగం పుంజుకున్నాయి. తాలిబన్ సీనియర్ నాయకుడు, హక్కాని నెట్వర్క్కు చెందిన అనాస్ హక్కానీ బుధవారం అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్తో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో కీలకభూమిక పోషించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ భేటీకి హాజరయ్యారు. శాంతియుతంగా అధికార బదిలీ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగాలనే ఉద్దేశంతో కర్జాయ్ సంప్రదింపులకు నేతృత్వం వహిస్తున్నారు. అనాస్తో భేటీ ప్రాథమిక చర్చల్లో భాగమని కర్జాయ్ ప్రతినిధి వెల్లడించారు. తాలిబన్ల రాజకీయ విభాగం సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్తో తదుపరి కీలకచర్చలకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. అన్ని పక్షాలను కలుపుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. యూఏఈలో అష్రాఫ్ ఘనీ తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించడంతో ఆదివారం దేశం వదిలి పారిపోయిన అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆశ్రయం కల్పించింది. మానవతా దృక్పథంతో ఘనీ, ఆయన కుటుంబాన్ని శరణార్థులుగా అనుమతించా మని యూఏఈ విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. అయితే యూఏఈలో ఎక్కడ తలదాచుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. తొలుత ఆయన తజకిస్తాన్కు పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
తాలిబన్లకు నిరసనల సెగ
కాబూల్: అఫ్గానిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సన్నాహాలు చేస్తుంటే వారికి నిరసనల స్వాగతాలు ఎదురవుతున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా మహిళలు కూడా రోడ్డెక్కి గట్టిగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అఫ్గానిస్తాన్ స్వాతంత్య్ర దినం (ఆగస్టు 19)కి ఒక్కరోజు ముందు ప్రభుత్వ కార్యాలయాలపై అఫ్గాన్ పతాకం ఎగరాలని డిమాండ్లు మిన్నంటాయి. తాలిబన్లపై ప్రజలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో వారు అత్యంత కఠినంగా నిరసనల్ని అణగదొక్కేస్తున్నారు. జలాలాబాద్లో నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాకు బదులుగా తిరిగి అఫ్గాన్ పతాకాన్ని ఎగురవేయాలన్న డిమాండ్తో బుధవారం నిరసన ప్రదర్శనలకు దిగారు. అఫ్గాన్ జెండా పట్టుకొని వందలాది మంది నిరసనకారులు నడిచి వెళుతూ ఉంటే, వారిని చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నిరసనని కవర్ చెయ్యడానికి వచ్చిన జర్నలిస్టుల్ని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలో కాల్పుల శబ్దాలు కూడా స్పష్టంగా వినిపించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని, డజన్ల మంది గాయపడ్డారని అల్జజీరా ఛానెల్ వెల్లడించింది. మహిళల నుంచే తొలి నిరసనలు కాబూల్లో మహిళల రూపంలో తొలిసారిగా తాలిబన్లకు నిరసనల సెగ తగిలింది. సమాన హక్కుల్ని డిమాండ్ చేస్తూ మహిళలు ప్ల కార్డులు పట్టుకొని కాబూల్ వీధుల్లో నిరసనకి దిగారు. వీరి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పక్కనే తాలిబన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా వారు బెదిరిపోలేదు. తమ హక్కుల్ని కాపాడాలని నినాదాలు చేశారు. హిజాబ్ లేదని మహిళని కాల్చి చంపారు! పేరుకే శాంతి మంత్రాన్ని వల్లిస్తున్న తాలిబన్లు ఆచరణలో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. టఖార్ ప్రావిన్స్లో ఒక మహిళ హిజాబ్ (తల కనిపించకుండా వస్త్రంతో చుట్టుకోవడం) లేకుండా బయటకు రావడంతో తాలిబన్లు మంగళవారం ఆమెని కాల్చి చంపినట్టుగా ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. దేశం విడిచి పారిపోవాలని కాబూల్ విమానాశ్రయానికి వస్తున్న వారిపై పదునైన ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. ఎయిర్పోర్టులో జనాల్ని నియంత్రించడానికి గాల్లోకి కాల్పులు జరపడం, మహిళలు, పిల్లలని చూడకుండా కర్రలతో కొట్టడం వంటివి చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. -
అఫ్గానిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా బరాదర్?
కాబూల్: అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా పని చేసిన అష్రాఫ్ ఘనీ తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించడంతో విదేశాలకు పరారయ్యారు. దేశంలో ఇక తాలిబన్ పాలన ఖాయమే అని తేలినప్పటికీ తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఇప్పటికే చర్చ మొదలయ్యింది. తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత డిప్యూటీ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కల్లోల అఫ్గాన్ పాలనా పగ్గాలను బరాదర్కు కట్టబెట్టేందుకు తాలిబన్లు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్ల రాజకీయ విభాగం చీఫ్గా పలుదేశాలతో సంబంధాలు నెరపడం ఆయనకు అనుకూలించే అంశమని భావిస్తున్నారు. ముల్లా ఒమర్కు కుడిభుజం ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ 1968లో అఫ్గానిస్తాన్లోని ఉరుజ్గన్ ప్రావిన్స్లో దే రహ్వోద్ జిల్లాలో వీత్మాక్ అనే గ్రామంలో జన్మించారు. పుట్టుక రీత్యా సదోజాయ్ తెగకు చెందిన దుర్రానీ పుష్తూన్ వర్గానికి చెందినవాడు. యువకులుగా ఉన్నప్పుడే ముల్లా మహమ్మద్ ఒమర్, బరాదర్ మంచి స్నేహితులయ్యారు. 1980వ దశకంలో కాందహార్ ప్రాంతంలో సోవియట్–అఫ్గాన్ యుద్దంలో బారదార్ పాల్గొన్నాడు. అప్పట్లో సోవియట్ యూనియన్ మద్దతుతో కొనసాగుతున్న అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫ్గాన్ ముజాహిదీన్ అనే సంస్థలో చేరి పోరాటం సాగించాడు. నిజానికి మొదట్లో అతడి పేరు చివరన బరాదర్ లేదు. ప్రాణ స్నేహితుడు, తాలిబన్ వ్యవస్థాపకుడైన ముల్లా మహమ్మద్ ఒమర్ అతడి పేరు చివర బరాదర్(సోదరుడు) అని చేర్చాడు. సోవియట్–అఫ్గాన్ యుద్దం తర్వాత కాందహార్ ప్రావిన్స్లోని మైవాంద్లో ఒమర్తో కలిసి ఓ మదర్సాను బరాదర్ నిర్వహించాడు. దక్షిణ అఫ్గానిస్తాన్లో తాలిబన్ ముఠాను స్థాపించేందుకు ఒమర్కు తోడుగా నిలిచాడు. కుడిభుజంగా వ్యవహరించాడు. అఫ్గాన్లో 1996 నుంచి 2001 వరకూ కొనసాగిన తాలిబన్ పాలనలో బరాదర్ ఎన్నో కీలక పదవులు దక్కించుకున్నాడు. హెరాత్, నిమ్రుజ్ ప్రావిన్స్ల గవర్నర్గా పనిచేశాడు. ఆర్మీ స్టాఫ్ డిప్యూటీ చీఫ్గా, సెంట్రల్ ఆర్మీ కార్ప్స్ కమాండర్గానూ సేవలందించినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ డిప్యూటీ మినిస్టర్గా కూడా పనిచేసినట్లు అమెరికాకు చెందిన ఇంటర్పోల్ వెల్లడించింది. ► ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తాలిబన్ల ఆధ్యాత్మిక కేంద్రం, వారి పాలన కొనసాగినప్పుడు రాజధాని అయిన రెండో అతిపెద్ద నగరం కాందహార్కు మంగళవారం చేరుకున్నాడు. ► బరాదర్ గత కొన్న నెలలుగా ఖతార్లోనే గడిపాడు. అమెరికాతోపాటు అఫ్గాన్ ప్రతినిధులతో శాంతి చర్చల్లో పాలు పంచుకున్నాడు. ► అఫ్గాన్ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణపై జరిగిన చర్చల్లో బరాదర్దే కీలక పాత్ర. ► తాలిబన్ మిలటరీ ఆపరేషన్లలో చురుగ్గా వ్యవహరించడంతోపాటు 2004, 2009లో అఫ్గాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలకు చొరవ చూపాడు. ► కాందహార్ ఎయిర్పోర్టులో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు ఘన స్వాగతం లభించింది. తాలిబన్లు అతడికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. బరాదర్ అరెస్టు.. టర్నింగ్ పాయింట్ 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ కాయిదా దాడుల తర్వాత అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్పై దండెత్తింది. అమెరికా మద్దతు ఉన్న నార్తన్ అలయెన్స్కు వ్యతిరేకంగా బరాదర్ పోరాటం ప్రారంభించాడు. 2010 ఫిబ్రవరి 8న పాకిస్తాన్లోని కరాచీలో అరెస్టయ్యాడు. బరాదర్ అరెస్టు తాలిబన్లపై తాము సాగిస్తున్న యుద్ధంలో టర్నింగ్ పాయింట్ అని అమెరికా సైనికాధికారులు వ్యాఖ్యానించారంటే అతడి స్థాయిని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం బరాదర్ను జైలు నుంచి విడుదల చేసినట్లు 2018 అక్టోబర్ 25న తాలిబన్లు ప్రకటించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే పాక్ ప్రభుత్వం అతడిని విడుదల చేసినట్లు సమాచారం. విడుదలైన తర్వాత ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్నాడు. దోహాలోని తాలిబన్ దౌత్య కార్యాలయం అధినేతగా నియమితుడయ్యాడు. అమెరికాతో జరిగిన చర్చల్లో తాలిబన్ల తరపున పాల్గొన్నాడు. 2020 ఫిబ్రవరిలో అఫ్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించిన దోహా ఒప్పందంపై సంతకం చేశాడు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2021 ఆగస్టు 17న ఖతార్ నుంచి స్వదేశం అఫ్గానిస్తాన్కు తిరిగొచ్చాడు. 2001లో తాలిబన్ ప్రభుత్వం పతనమైన తర్వాత అతడు అఫ్గాన్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. -
తాలిబన్ల దెబ్బకు ఇండియాకు భారీ నష్టం
రెండు దశాబ్దాల తర్వాత అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు భారతదేశంతో జరిగే అన్ని దిగుమతులు, ఎగుమతులను నిలిపివేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఇఓ) బుధవారం తెలిపింది. పాకిస్తాన్ రవాణా మార్గాల ద్వారా సరుకు రవాణాను తాలిబన్లు నిలిపివేశారని, ఫలితంగా ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ సహాయ్ తెలిపారు. "వాస్తవానికి, మేము ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద భాగస్వాములలో ఒకటి. అఫ్గనిస్తాన్కు ఎగుమతుల విలువ సుమారు 835 మిలియన్ డాలర్లు, దిగుమతుల విలువ $510 మిలియన్ డాలర్లు. కానీ, వాణిజ్యంతో పాటు అఫ్గనిస్తాన్లో సుమారు 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన 400 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి" అని సహాయ్ తెలిపారు. ప్రస్తుతం భారతదేశం చక్కెర, ఫార్మాస్యూటికల్స్, దుస్తులు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, ట్రాన్స్ మిషన్ టవర్లను అఫ్గనిస్తాన్కు ఎగుమతి చేస్తుంది అని అన్నారు. ఆ దేశం నుంచి భారత్ గమ్, ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
కన్నీటి అభ్యర్థన.. ఆమె భయపడినంతా అయింది!
కాబూల్: ‘‘మీ మౌనం మాకు ప్రాణాంతకం.. త్వరపడండి...వదిలేయకండి.. సాయం చేయండి’’ అంటూ అంతర్జాతీయ సినిమా ప్రపంచానికి సుప్రసిద్ధ అఫ్గాన్ చిత్ర నిర్మాత, దర్శకురాలు సహ్రా కరీమీ లేఖ రాసినట్టుగా ఆమె భయపడినంతా జరుగుతోంది. ఇది అంతర్యుద్ధం కాదు. ప్రచ్చన్న యుద్ధం. ఇది మాపై బలవంతంగా రుద్దిన యుద్ధం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఊహించినట్టుగానే అఫ్గన్ తాలిబన్ల వశమైంది. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గన్ ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తాలిబన్ల కాల్పులు, దాడులతో దేశంలోని అనేక ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. -సాక్షి, వెబ్డెస్క్ (అఫ్గాన్ను సాయుధ తాలిబన్లు కైవసం చేసుకోక ముందు ప్రపంచానికి సహ్రా రాసిన కన్నీటి అభ్యర్థన ఈ వీడియో) -
అఫ్గనిస్తాన్ పునర్ నిర్మాణంలో హైదరాబాద్ కంపెనీ
గతంలో అఫ్గనిస్తాన్ లో జరిగిన యుద్దం వల్ల ఆ దేశ పునర్ నిర్మాణంలో హైదరాబాద్ కు చెందిన కంపెనీ భాగస్వామ్యం అయ్యింది. ఈ సందర్భంగా బీఎస్ సీపీఎల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఛైర్మన్ బొల్లినేని కృష్ణయ్య కొన్ని విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నారు. గతంలో యుద్దం వల్ల దెబ్బతిన్న దేశ పునర్ నిర్మాణంలో భాగంగా నాలుగు కంపెనీలు 360 కిమీ విస్తరణ పనులు చేపట్టాయి. అందులో మూడు టర్కీ దేశానికి చెందినవి. 85 కి.మీ దూరాన్ని పునర్ నిర్మించడానికి హైదరాబాద్ కు చెందిన బీఎస్ సీపీఎల్ కు ఒక సంవత్సరం పట్టింది. ఇదంతా 2003లో జరిగినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తికాగానే ఆ దేశం తనను రాష్ట్రపతి ప్యాలెస్ లో జరుగుతున్న విందుకు ఆహ్వానం లభించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత తర్వాత 8-9 సంవత్సరాల కాలంలో కాబూల్ లోని పార్లమెంటు భవనానికి ఒప్పందం కుదిరే వరకు ఏడు రోడ్డు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. "కాబూల్ లోని పార్లమెంటు భవనానికి నిర్మాణానికి ఐదు స౦వత్సరాలు పట్టి౦ది, కానీ అది ప్రత్యేకమైనది" అని ఆయన అన్నారు. ఆ ఒప్పందం విలువ సుమారు రూ.850 కోట్లు. ఆఫ్ఘనిస్తాన్ లో బీఎస్ సీపీఎల్ 2,300 కోట్ల విలువైన పనులు చేపట్టింది. "ఆ తర్వాత మరో ఉన్నత స్థానం భారత రాయబార కార్యాలయాన్ని నిర్మించడం. ఇది 2008లో బాంబు దాడికి గురైంది. దాన్ని పునర్నిర్మించడం వేరే అనుభవం" అని అన్నారు. అక్కడ ఉన్న ప్రతి రోడ్డు గురుంచి తనకు తెలుసు అని అన్నారు. సవాళ్లతో కూడిన పని "అక్కడ పనులు చేపట్టడం ఎల్లప్పుడూ సవాలుగా ఉండేది కాని ఇంత దారుణం కాదు. మా పని 2013లో మందగించడం ప్రారంభించింది. అప్పటి నుంచి చెడు సంకేతాలు వచ్చినట్లు" అని ఆయన వివరించారు. అప్పటి వరకు శిక్షణ పొందిన స్థానికులతో పాటు అతని స్వంత సిబ్బందిలో 60-70 మంది అక్కడే ఉన్నారు. తొలి దశలో ఇద్దరు ఉద్యోగులను(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరూ) కిడ్నాప్ చేసి ఆ తర్వాత చంపడం ఇబ్బంది కలిగించినట్లు అన్నారు. కార్లు దొంగలించడం, క్లిష్టమైన యంత్రాలను తగలబెట్టడం రాను రాను పరిస్థితి క్షీణించినట్లు పేర్కొన్నారు. -
దెబ్బమీద దెబ్బ.. భారీగా పడిపోయిన అఫ్గాన్ కరెన్సీ విలువ
తాలిబన్లు అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకోవడంతో ఆ దేశ కరెన్సీ ఒక్కసారిగా భారీగా పడిపోయింది. దేశ అధ్యక్షుడు, తాత్కాలిక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పారిపోవడంతో పెట్టుబడిదారులు కూడా ఆ దేశం నుంచి వెళ్లడానికి సిద్దం అవుతున్నారు. దీంతో అఫ్గనిస్తాన్ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన డేటా ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ విలువ నేడు 4.6% పడిపోయి 86.0625కు చేరుకుంది. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్న రోజు నుంచి వరుసగా నాల్గవ రోజు కరెన్సీ విలువ క్షీణించింది. అఫ్గనిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో వేలాది మంది ప్రజలు ఆ దేశం నుంచి బయటకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తాలిబన్లను ఎదుర్కోకుండా దేశాన్ని విడిచిపెట్టి పోవడంతోనే ఈ గందరగోళం ఏర్పడినట్లు అజ్మల్ అహ్మదీ పేర్కొన్నాడు. ప్రస్తుతం "కరెన్సీ విలువ 81 నుంచి దాదాపు 100కు పెరిగి తర్వాత 86కు చేరుకున్నట్లు" అని రాశాడు. అయితే, తాజాగా తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. తాలిబన్ల దూకుడుకు అమెరికా జో బైడెన్ సర్కార్ బ్రేకులు వేసింది. తాలిబన్లకు నిధులు దక్కకుండా స్తంభింప చేసింది. అమెరికా బ్యాంకుల్లోని అఫ్గన్కు సంబంధించిన నిధులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. -
Afghanistan Crisis: తాలిబన్లు సంచలన ప్రకటన
కాబూల్: అఫ్గానిస్తాన్ ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. దేశ ప్రజల్లో తమపై ఏర్పడిన భయాందోళనలు తొలగించే యత్నాల్లో భాగంగా మహిళలు ప్రభుత్వంలో చేరాలని పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే తాము మారిపోయామని చెప్పడానికి తాలిబన్లు యత్నిస్తున్నా, అఫ్గాన్ ప్రజ మాత్రం ఉలిక్కిపడుతూనే ఉంది. ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్ ప్రతినిధి ఎనాముల్లా సమాంగని టీవీలో చెప్పారు. ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవాలని, ప్రభుత్వ అధికారులంతా విధులకు హాజరుకావాలని ప్రకటించారు. దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఎలా ఉండబోతున్నదీ తాలిబన్లు తమ కల్చరల్ కమిషన్లో సభ్యుడైన ఎనాముల్లా ప్రకటనతో స్పష్టం చేశారు. గతంలో తమను వ్యతిరేకించిన వారు, విదేశీయులకు మద్దతునిచ్చిన వారితో సహా అందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ఎనాముల్లా చెప్పారు. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టలేదు. పాత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో తాలిబన్ ప్రతినిధుల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. పౌర ప్రభుత్వాలతో, విదేశీ సేనలతో కలిసి పనిచేసిన వారిపై తాము ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పటికే తమకు వ్యతిరేకంగా పనిచేసినవారి జాబితాను తాలిబన్లు తయారు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. స్త్రీలే ప్రధాన బాధితులు గతంలో స్త్రీల హక్కులకు తీవ్రభంగం కలిగించిన తాలిబన్లు ఈ దఫా ఆశ్చర్యకరంగా మహిళలపై సానుభూతి చూపుతున్నారు. అఫ్గాన్లో 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభంలో మహిళలే ప్రధాన బాధితులని తాలిబన్ ప్రతినిధి ఎనాముల్లా తెలిపారు. ఇకపై తమ పాలనలో మహిళా బాధితులుండరన్నారు. మహిళా విద్య, ఉద్యోగాలకు తగిన వాతావరణం కల్పిస్తామని, ఇస్లామిక్ చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలను నియమిస్తామని చెప్పారు. అయితే ‘ఇస్లామిక్ చట్టం’ అంటే ఏంటనేది ఆయన వివరించలేదు. ప్రజలకు ఈ చట్టం నిబంధనలు తెలుసన్నట్లు మాట్లాడారు. ప్రజల్లో అన్ని పక్షాలు ప్రభుత్వంలో చేరాలన్నారు. స్త్రీలపై తమ వైఖరి మారిందనేందుకు సాక్ష్యం కోసం తాలిబన్ నేత ఒకరు మహిళా విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోవైపు ప్రజా జీవనం నుంచి స్త్రీలను దూరం చేయవద్దంటూ కాబూల్లో పలువురు మహిళలు హిజాబ్ ధరించి ప్రదర్శన చేశారు. తాలిబన్లు తాము చేసే వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, వీరి గత వైఖరి గమనిస్తే అనుమానాలు కలుగుతూనే ఉన్నాయని ఐరాస ప్రతినిధి రూపర్ట్ అన్నారు. రెండు దశాబ్దాల్లో అఫ్గాన్ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ జరిగిందని, వీటిని కాపాడాలని సూచించారు. ఆగిన ఆర్థిక సాయం 2021లో అఫ్గాన్ అభివృద్దికి కేటాయించిన 25 కోట్ల యూరోల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే మానవతా సాయం, రక్షణ సేవలకు అందించే సాయాన్ని మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. అఫ్గాన్కు అందించే సాయాన్ని తగ్గిస్తామని స్వీడన్ మంత్రి పర్ ఆల్సన్ ఫ్రిడ్ చెప్పారు. సైనికుల తరలింపు కోసం అఫ్గాన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరలా తెరిచారు. అఫ్గాన్లో ఉన్న అమెరికన్లు స్వదేశం వచ్చేందుకు ఆన్లైన్లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని యూఎస్ ఎంబసీ సూచించింది. దేశమంతా వేలాదిమంది గాయాల పాలైనట్లు రెడ్క్రాస్ తెలిపింది. తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సురక్షితంగా ఉంచుతాం.. ఇస్లామిక్ చట్టం ప్రకారం స్త్రీలకు హక్కులు అఫ్గానిస్తాన్ను సురక్షితంగా ఉంచుతామని తాలిబన్లు ప్రకటించారు. దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అఫ్గాన్ భవితవ్యంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాలిబన్ ప్రకటన వెలువడింది. ఈ మేరకు తొలిసారి విలేకరులతో మాట్లాడిన తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ హామీ ఇచ్చారు. సంవత్సరాలుగా జబిహుల్లా బయటకు కనిపించలేదు. రహస్యంగా ఉంటూ తాలిబన్ల తరఫున ప్రకటనలు జారీ చేసేవారు. తాజాగా అందరినీ క్షమించామని, స్థానికులపై ఎలాంటి ప్రతీకారాలు తీర్చుకోమని తన ఇంటర్వ్యూలో జబిహుల్లా చెప్పారు. ‘‘ఎవరి ఇంటి తలుపు తట్టి ఎందుకు పాశ్చాత్యులకు సాయం చేశావు అని ఎవరూ అడగరు’’ అని తెలిపారు. తాలిబన్ల మాటపై దేశ ప్రజల్లో నమ్మకం చేకూరడం లేదు. మహిళా హక్కులను ఇస్లామ్ చట్టానికి లోబడి పరిరక్షిస్తామని జబిహుల్లా చెప్పారు. ప్రైవేట్ మీడియా స్వతంత్రంగా వ్యవహరించాలని, జాతీయ విలువలకు వ్యతిరేకంగా పనిచేయకూడదని కోరారు. ఇతర దేశాలతో తాము శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నామని, అంతర్గతంగా, బహిర్గతంగా ఎలాంటి శత్రువులను కోరుకోవడం లేదని తెలిపారు. ఆఫ్గాన్ నుంచి ఏ దేశానికి ముప్పు ఉండదని జబిహుల్లా ప్రకటించారు. ‘ఆఫ్గానిస్తాన్ నుంచి ఏ దేశానికి ముప్పు ఉండదని ప్రపంచదేశాలకు మేము వాగ్ధానం చేస్తున్నాం’ అని అన్నారు. అందరి భాగస్వామ్యం ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు కోరుకుంటున్నారని తెలిపారు. విమానం.. ఓవర్ లోడ్ కిక్కిరిసిపోయిన జనాలతో బస్సులు, రైళ్లు, పడవల్ని ఇన్నాళ్లూ చూశాం. తాలిబన్ల పుణ్యమాని ఇప్పుడు విమానాలను కూడా అలా చూసే రోజు వచ్చింది. విమానం టేకాఫ్కి కాస్త ముందు ప్రాణభయంతో పరుగు పరుగున, ఒకరినొకరు తోసుకుంటూ ప్రయాణికులు ఎక్కే రోజు ఒకటి వస్తుందని మనం కలలో కూడా ఊహించి ఉండం. ఇప్పుడు అలాంటి దృశ్యాలే కాబూల్ విమానాశ్రయంలో కనిపిస్తున్నాయి. అమెరికా తమ దౌత్య సిబ్బందిని తీసుకురావడానికి పంపిన సి–17 రవాణా విమానంలోకి అఫ్గాన్ పౌరులు పరుగులు తీసుకుంటూ వచ్చి ఎక్కారు. పిల్లా పాపలతో విమానం లోపల కిందనే కూలబడ్డారు. కనీసం సామాన్లు కూడా వెంట తెచ్చుకోలేదు. ఎలాగైనా కాబూల్ని విడిచిపెడితే ప్రాణాలు దక్కుతాయన్న ఆందోళన తప్ప వారిలో మరేం కనిపించడం లేదు. 150 మంది సైనికుల్ని తీసుకువెళ్లే ఆ విమానంలో ఏకంగా 640 ఎక్కేశారు. విమానం టేకాఫ్కి కాస్త ముందు సగం తెరిచిన ర్యాంప్ మీదుగా ఒక్క ఉదుటున.. పోటెత్తిన వరదలా లోపలికి వచ్చేశారు. విమానం సిబ్బంది కూడా వారిని తీసుకునే ప్రయాణించడానికి నిర్ణయించారు. ఈ ఫొటోని అమెరికా ఎయిర్ఫొర్స్కి చెందిన సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఒక్కసారిగా వైరల్గా మారింది. వారినందరినీ ఖతర్ విమానాశ్రయంలో దింపినట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులు పరుగులు తీసుకుంటూ విమానంలోకి ఎక్కిన వీడియోలు కూడా వైరల్గా మారి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఎటు చూసినా గందరగోళమే అఫ్గాన్ తాలిబన్ల వశమైన దగ్గర్నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ వారి అరాచక పాలనను భరించే ఓపిక లేని ప్రజలు వేలాది మంది వేరే దేశాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయంలోనే ఉన్నారు. విమానాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రజలందరికీ ఎలాంటి హాని తలబెట్టబోమని తాలిబన్లు హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితిపై తాజాగా మక్సార్ టెక్నాలజీ ఉపగ్రహ ఛాయా చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్రాల్లో తాలిబన్ల నుంచి దూరంగా పారిపోవాలని నిస్సహాయ స్థితిలో ఎదురు చూపులే కనిపిస్తున్నాయి. అయితే కాబూల్ విమానాశ్రయానికి విపరీతంగా జనం వచ్చి పడిపోతూ ఉండడంతో అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరుపుతూ వారిని చెదరగొడుతున్నాయి. రన్వేలపై ఉన్న విమానాలను అదేదో బస్సుల మాదిరిగా కదులుతుంటే కూడా ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. -
మీ మౌనం... మాకు ప్రాణాంతకం!
(సహ్రా కరీమీ సుప్రసిద్ధ అఫ్గాన్ చిత్ర నిర్మాత, దర్శకురాలు. ‘హవా’, ‘మర్యామ్’, ‘ఆయేషా’, ‘పర్లికా’, ‘అఫ్గాన్ విమెన్ బిహైండ్ ది వీల్’ వంటి పలు డాక్యుమెంటరీ చిత్రాలను ఈమె రూపొందించారు. అఫ్గాన్ను సాయుధ తాలిబన్లు కైవసం చేసుకొనక ముందు ప్రపంచానికి సహ్రా రాసిన కన్నీటి అభ్యర్థన ఇది.) ‘‘ప్రపంచంలోని అన్ని సినీ కమ్యూనిటీలకు, సినిమా అభిమానులకు నేనీ విన్నపం చేస్తున్నాను. నా పేరు సహ్రా కరిమి. నేను ఒక చిత్ర దర్శకురాలిని, ప్రస్తుతం అఫ్గాన్ ఫిల్మ్ జనరల్ డైరెక్టర్ని. ఇది 1968లో ప్రభుత్వ యాజమాన్యంలో వ్యవస్థాపితమైన సినిమా కంపెనీ. నా సుందరమైన ప్రజలను, ప్రత్యేకించి తాలిబన్ నుంచి చిత్ర నిర్మాతలను పరిరక్షించడంలో మీరు నాతో చేతులు కలుపుతారని విచ్ఛిన్నమైన హృదయంతో, ప్రగాఢ విశ్వాసంతో మీకు ఇలా విన్నవిస్తున్నాను. గత కొన్ని వారాలుగా తాలిబన్లు దేశంలోని అనేక రాష్ట్రాలపై పట్టు సాధించారు. వారు మా ప్రజలను చంపేశారు. అనేక మంది పిల్లలను అపహరించారు. తాలిబన్ పురుషుల కోసం పిల్లలను బాలవధువుల్లాగా అమ్మేశారు. బిగుతు దుస్తులు ధరించినందుకు ఒక మహిళను పట్టపగలు హత్య చేశారు. ఒక మహిళ కళ్లకు గంతలు కట్టేశారు. మా ప్రియాతిప్రియమైన కమెడియన్లలో ఒకరిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. చరిత్రపై రాసే మా గొప్ప కవులలో ఒకరిని చంపేశారు. ప్రభుత్వ సాంస్కృతిక, మీడియా అధిపతిని కూడా వాళ్లు చంపేశారు. ప్రభుత్వంతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ హత్య చేస్తూ వస్తున్నారు. మాలో కొందరిని బహిరంగంగా ఉరి తీశారు. వందలాది, వేలాది కుటుంబాలను నిరాశ్రయులను చేశారు. తమ తమ రాష్ట్రాలనుంచి పారిపోయి వచ్చిన కుటుం బాలు కాబూల్ లోని శిబిరాల్లో ఉంటున్నారు. ఎలాంటి పారిశుధ్య వసతులు లేని స్థితిలో ఉంటున్నారు. తాలిబన్లు ఈ శిబిరాలను కూడా లూటీ చేస్తున్నారు. పాలు లేని కారణంగా ఈ శిబిరాల్లోని శిశువులు చనిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మానవత్వానికి సంక్షోభ కాలంగా ఉంటోంది. కానీ ఇంత జరుగుతున్నా ప్రపంచం మౌనంగా ఉంటోంది. ఇది అన్యాయం అని తెలిసినప్పటికీ ఈ నిశ్శబ్దానికి, ఈ మౌనానికి అలవాటుపడుతూనే పెరుగుతూ వచ్చాం. మా ప్రజలను ఇలా గాలికి వదిలేస్తూ నిర్ణయం తీసుకోవడం తప్పని మాకు తెలుసు. ఇలా ఉన్నపళాన సైనిక బలగాల ఉపసంహరణ చేపట్టడం మా ప్రజలకు ద్రోహం తలపెట్టడమే అవుతుంది. పశ్చిమ దేశాల కోసం అఫ్గాన్లు ప్రచ్ఛన్న యుద్ధం గెలిచినప్పుడు కూడా ఇలాగే జరిగింది. మా ప్రజలను అప్పుడూ గాలికి వదిలేశారు. ఆ క్షణంలోనే తాలి బన్ల చీకటి పాలనకు దారితీసింది. ఇప్పడు, మా దేశం ప్రత్యేకించి మా యువతరం అపార ప్రయోజనాలు పొందిన 20 ఏళ్ల తర్వాత మమ్మల్ని మళ్లీ గాలికి వదిలేయడంతో ఈ 20 ఏళ్లుగా మేం పొందిన ప్రయోజనాలన్నింటినీ కోల్పోతున్నాం. మాకు మీ వాణి ఇప్పుడెంతో అవసరం. మీడియా, ప్రభుత్వాలు, ప్రపంచ మానవతావాద సంస్థలు కూడా చట్టబద్ధత ఎన్నడూ లేని తాలిబన్లతో ఈ శాంతి ఒప్పందంపై సౌకర్యవంతంగా మౌనం పాటిస్తున్నాయి. తాలిబన్లకు, చట్టబద్ధ పాలనకు ఏరోజూ సంబంధం లేదు. వీరికి గుర్తింపుని వ్వడం అంటే మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి ఇచ్చినట్లే అవుతుంది. చర్చలు జరిగే క్రమం పొడవునా తాలిబన్లు మా ప్రజలను పాశవికంగా హింసిం చారు. ఒక చిత్ర నిర్మాతగా నా దేశానికి నేను కష్టపడి సాధిం చిందంతా ఇప్పుడు కూలిపోయే ప్రమాదంలో పడిపోయింది. తాలిబన్లు అధికారం చేజిక్కించుకుంటే వాళ్లు మొత్తం కళను నిషేధిస్తారు. ఆ తర్వాత నన్నూ నాలాంటి ఇతర చిత్ర నిర్మాతలను తమ హిట్లిస్టులో చేరుస్తారు. వాళ్లు మహిళల హక్కులను లాగేస్తారు. మమ్మల్ని మా గృహాల నీడల్లోకి నెట్టేస్తారు. మా గొంతులు కూడా అంతే. మా వ్యక్తీకరణ మౌనంగా మారి పోతుంది. తాలిబన్లు అధికారంలోకి రాగానే పాఠశాలల్లోకి ఒక్క బాలికకు కూడా ప్రవేశం ఉండదు. ఇప్పుడైతే పాఠశాలల్లో 90 లక్షల మంది బాలికలు చదువుకుంటున్నారు. అఫ్గానిస్తాన్లో మూడో అతిపెద్ద నగరమైన హెరాత్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ నగరం తాలిబన్ల చేతిల్లోకి వెళ్లిపోయింది. ఈ ఒక్క నగరంలోనే 50 శాతం మంది అమ్మాయిలు యూనివర్సిటీల్లో చదువుతున్నారు. ఇవి ప్రపంచానికి పెద్దగా తెలీని మా మహిళలు సాధించిన అపార ప్రయోజనాల్లో కొన్ని. గత కొద్ది వారాల్లోనే తాలిబన్లు అనేక పాఠశాలలను నేలమట్టం చేశారు. దీంతో 20 లక్షలమంది బాలికలు పాఠశాలలకు దూరమైపోయారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని ప్రపంచం నాకు అర్థం కావడం లేదు. ఈ మౌనం కూడా నాకు అర్థం కావడం లేదు. నా దేశంకోసం నేను ఇక్కడే ఉండి పోరాడతాను కానీ ఒంటరిగా ఈ పోరాటాన్ని చేపట్టలేను. మీవంటి మిత్రుల అవసరం నాకు ఎంతగానో ఉంది. మాకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచం సహాయ హస్తం అందించేలా మాకు సహకరిం చండి. అఫ్గాన్లో ఏం జరుగుతోందన్న విషయంపై మీ దేశాలకు చెందిన అతి ముఖ్యమైన మీడియాకు తెలుపడం ద్వారా మాకు సహకరించండి. అఫ్గాన్ వెలుపల మా స్వరాలకు చోటు కల్పించండి. తాలిబన్లు కాబూల్ని చేజిక్కించుకుంటే మాకు ఇంట ర్నెట్ సౌకర్యం లభించదు. ఎలాంటి కమ్యూనికేషన్ సాధనాలు కూడా మాకు అందుబాటులో ఉండవు. మీ దేశాల్లోని చిత్ర నిర్మాతలను, కళాకారులను మా స్వరం వినిపించేలా మాకు సహాయం చేయండి. ఇది అంతర్యుద్ధం కాదు. ఇది ప్రచ్చన్న యుద్ధం. ఇది మాపై బలవంతంగా రుద్దిన యుద్ధం. తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం ఫలితమే ఇది. ఈ సత్యాన్ని మీ మీడియాలో వీలైనంత ఎక్కువగా షేర్ చేయగలరు. మీ సోషల్ మీడియా వేదికల్లో మాగురించి పోస్టు చేయగలరు. ప్రపంచం మాకు ఇప్పుడు వెన్నుముక చూపించకూడదు. అఫ్గాన్ మహిళలు, పిల్లలు, కళాకారులు, చిత్ర నిర్మాతల తరపున మీ మద్దతు, మీ స్వరం మాకు ఎంతగానో అవసరం. మాకివ్వబోయే ఈ మద్దతు ప్రస్తుత సందర్భంలో మాకు అందే అతి గొప్ప సహాయంగా ఉంటుంది. అఫ్గానిస్తాన్ను ప్రపంచం వదిలేయకుండా దయచేసి మాకు సాయ పడండి. కాబూల్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడానికి ముందే మాకు సహాయం చేయండి. మాకు పెద్దగా సమయంలేదు. రోజుల్లోనే అన్నీ ముగిసిపోవచ్చు. మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మీ స్వచ్ఛమైన హృదయాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను... ధన్యవాదాలు..’’ సహ్రా కరీమీ -
విచ్చుకత్తుల... విషాద గాంధారం
భయం... బ్రతుకు భయం. ఎలాగోలా అక్కడ నుంచి బయటపడితే చాలన్నంత భయం. విమానంలో ఖాళీ లేకపోతే కనీసం రెక్కల మీదైనా సరే ప్రమాదాన్ని లెక్కచేయకుండా ప్రయాణించేయాలనే వెర్రి సాహసం. జాగా లేని విమానంలో ప్రాణాలు అరచేత పట్టుకొని, 640 మంది క్రిక్కిరిసిన దైన్యం. పాలు కూడా దొరకని పసిపిల్లలు... మూతబడ్డ షాపులు... బ్యాంకులు... ఎప్పుడెవరు దాడి చేస్తారో, ఎక్కడ దాక్కోవాలో తెలియని ప్రజలు... స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయిన స్త్రీలు... అన్నీ అక్కడే వదిలేసి పిల్లాజెల్లాతో పారిపోతే చాలని విమానాశ్రయంలో పరుగులు తీస్తున్న పౌరులు... సాయుధ తాలిబన్ల పహారాలో శ్మశాన నిశ్శబ్దం. 50 లక్షల మందికి నివాసమైన అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లోని ఈ దృశ్యాలను చూస్తే, గుండె కలుక్కుమంటుంది. అపురూప కళా, సంస్కృతులకు నెలవైన ప్రాచీన విమల గాంధార దేశం (నేటి కాంధహార్తో కూడిన అఫ్గాన్) ఇప్పుడు విషాద గాంధార స్వరాలాపనతో విలపిస్తోంది. అమెరికా తొందరపాటు సైనిక ఉపసంహరణ, అఫ్గాన్ ప్రభుత్వ వైఫల్యం, ఆ దేశసైనికుల అసమర్థత, అంతర్జాతీయ సమాజం నిర్లిప్తత – అన్నీ కలసి అఫ్గాన్ను అప్పనంగా తీవ్రవాద సాయుధ మూక తాలిబన్లకు అప్పగించాయి. అమెరికాపై తాలిబన్ల దాడితో అహం దెబ్బ తిన్న అగ్రరాజ్యం ‘తీవ్రవాదం పోరు’ అంటూ ఇరవై ఏళ్ళ క్రితం మొదలెట్టిన పనికి ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. 3 లక్షల కోట్ల డాలర్ల ఖర్చు, వేలాదిగా సైన్యనష్టం – ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అఫ్గాన్ భవితకు ఏర్పాట్లు చేయకుండానే, అక్కడి పౌర భద్రతకు బాధ్యత వహించకుండానే, తాలిబన్లకు ముకుతాడు వేసే షరతులేమీ లేకుండానే – ఎలాగోలా ఆ దేశం నుంచి తాము వెనక్కి వచ్చేస్తే చాలన్నట్టు అమెరికా వ్యవహరించింది. ఆ వ్యూహాత్మక తప్పిదం ఇప్పుడు ఓ మానవ సంక్షోభానికి దారి తీసింది. అంతర్జాతీయంగా అమెరికాకు తలవంపులు తెచ్చింది. అఫ్గానీయులకు తిప్పలు మిగిల్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో దోహాలో తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అనేక లోపాల పుట్ట. అమెరికా గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయాన్నే కొత్త ప్రెసిడెంట్ బైడెన్ సైతం కొనసాగించడం అఫ్గాన్లో అస్థిరతకు కారణమైంది. తాజా పరిణామాలతో విహారయాత్ర నుంచి హుటాహుటిన తిరిగొచ్చిన బైడెన్ తప్పంతా తాలిబన్లతో పోరాడకుండా లొంగిపోయిన అఫ్గాన్ ప్రభుత్వానిదే అన్నట్టు సోమవారం మాట్లాడారు. తమకెలాంటి ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాల్సింది, పోరాడాల్సింది అఫ్గానీయులే అంటూ సూత్రీకరించారు. ఇరవై ఏళ్ళ క్రితం ఆ సూత్రం తామెలా మర్చిపోయారో మాత్రం చెప్పలేదు. ప్రజాస్వామ్యం పోయి, తాలిబన్ల చేతిలోకి అఫ్గాన్ రావడం సహజంగానే భారత్ లాంటి శాంతికాముక దేశాలకు రుచించదు. కానీ పాక్, చైనా, టర్కీ లాంటివి కొత్త పాలనలో స్వప్రయోజనాలను చూస్తున్నాయి. ఇరవై ఏళ్ళ క్రితంతో పోలిస్తే, ఇప్పుడు తాలిబన్లను 2.0 వెర్షన్ అంటున్నారు. కానీ, వారి మాటలే తప్ప చేతలు మారాయా అన్నది అనుమానమే. ప్రపంచం తమను గుర్తించాలని కోరుతున్న తాలిబన్లు ఎవరికీ హాని చేయబోమంటున్నారు. అందరికీ క్షమాభిక్ష పెడుతున్నామన్నారు. కానీ, కఠిన ‘షరియత్’ చట్టాన్ని అమలు చేస్తామంటున్నారు. స్త్రీలు ఉద్యోగం చేసుకోవచ్చు కానీ, ‘హిజాబ్’ (మేలి ముసుగు) ధరించాలంటున్నారు. పక్కన మగతోడు లేకుండా బయటకు తిరగకూడదంటున్నారు. ఇప్పటికే వివిధ ప్రావిన్స్లలో తాలిబన్ పోరాట యోధులనిచ్చి పెళ్ళి అనే ముసుగులో, మహిళల లైంగిక బానిసత్వానికి తెర తీసినట్టు వార్తలు వస్తున్నాయి. వీధుల్లో మహిళల పోస్టర్లు, సెలూన్లకు రంగులు పులుముతున్నారు. టీవీలో వినోదం స్థానంలో మత ప్రబోధాలు మొదలయ్యాయి. స్వేచ్ఛకు సంకెళ్ళు పడ్డ ఈ వార్తలే ఇకపై అఫ్గాన్ నుంచి వినాలి. అది చేదు నిజం. నిజానికి, తాలిబన్ల గత పాలనకు అమెరికా దళాలు చరమగీతం పాడిన 2001 నాటికీ, ఇప్పటికీ అఫ్గాన్ చాలా పురోగతి సాధించింది. ఒకప్పుడు అక్కడ ఆడపిల్లల చదువులే నిషిద్ధమైతే, ఇప్పుడు విద్యార్థుల్లో వాళ్ళు 39 శాతం వారే. అఫ్గాన్ జీడీపీ 4 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్లకు చేరింది. సగటు ఆయువు 56 నుంచి 65 ఏళ్ళకు పెరిగింది. అఫ్గాన్ అభివృద్ధిలో భారత్ ఇప్పటికి 3 బిలియన్ డాలర్లు పెట్టింది. మన నుంచి ఆ దేశానికి 80 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయి. తాలిబన్ల విజృంభణతో ఇవన్నీ సమస్యల్లో పడినట్టే. అఫ్గాన్ అభివృద్ధికీ, పునర్నిర్మాణానికీ కట్టుబడిన భారతప్రభుత్వం ఇరకాటంలో పడింది. తాలిబన్లను పూర్తిగా దూరం పెట్టి, భౌగోళికంగా కీలకమైన ప్రాంతాన్ని పాక్, చైనాల ఇష్టారాజ్యంగా వదిలేయలేం. అలాగని తీవ్రవాద మూకలతో చర్చించలేం. ఈ సందిగ్ధంలో ఖతార్ లాంటి సన్నిహిత దేశాల సాయం తీసుకోవాలి. అఫ్ఘాన్ పునర్నిర్మాణంలో భారత్కు వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగేలా చూసుకోవడం కొంత తెలివైన పని. ఇక, అఫ్గాన్ వ్యవహారం ప్రపంచానికి మరో పాఠం నేర్పింది. ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదే. కానీ, దాని కోసం పోరాడే నేతలు జనంలో నుంచి రావాలి. బయటి శక్తులు వచ్చి బలవంతాన ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించాలనుకొంటే కష్టం. అఫ్గాన్లో అమెరికా తన సేనలతో చేసిన పొరపాటు అదే. అక్కడి ప్రజలను ఇరవై ఏళ్ళ పాటు బులిపించి, తీరా నడి సంద్రంలో నావలా వదిలేయడం చారిత్రక ద్రోహం. ఈ పరిస్థితుల్లో తాలిబన్లతో పాటు తిరిగొచ్చిన మధ్యయుగపు ఆలోచనలు, మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచం పెదవి విప్పాలి. మౌనంగా ఉంటే అది మరింత విషాదం. -
Afghanistan: తాలిబన్లకు మరో షాక్!
బెర్లిన్:అఫ్గానిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు జర్మనీ షాకిచ్చింది. అఫ్గన్కు డెవలప్మెంట్ సాయాన్ని తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు జర్మన్ డెవలప్మెంట్ మంత్రి గెర్డ్ ముల్లర్ రినిష్ స్థానిక మీడియాకు వివరించారు. దేశానికి అభివృద్ధి సహకారాన్ని ప్రస్తుతానికి నిలిపివేశామని రినిష్ పోస్ట్ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే అక్కడినుంచి వచ్చేయాలని భావిస్తున్న స్థానిక అభివృద్ధి అధికారులు, ఎన్జీవోలకు చెందిన సభ్యులను దేశానికి రప్పించే పని కొనసాగుతుందన్నారు. అంతకుముందు అఫ్గన్ సంక్షోభంపై స్పందించిన జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్మీర్ కాబూల్ విమానాశ్రయంలో వేలాదిమంది ప్రజలు దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సిగ్గుచేటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానవ విషాదానికి అందరమూ బాధ్యులమని వ్యాఖ్యానించారు. అలాగే తమ పౌరులతోపాటు, వారికి అండగా నిలిచిన అఫ్గాన్ ప్రజల క్షేమం కోసం తాము చేయ గలిగిందంతా చేస్తామని హామీ ఇచ్చారు. కాగా సంవత్సరానికి 430 మిలియన్ యూరోలు (506 మిలియన్ డాలర్లు) అప్గానిస్తాన్కు అందించేందుకు జర్మనీ గతంలో అంగీకరించింది. తద్వారా అతిపెద్ద దాతలలో ఒకటిగా నిలిచింది. ఈ సాయాన్ని స్థానిక పోలీసు బలగాల శిక్షణకు, న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి, అలాగే మహిళల హక్కుల రక్షణ, అవినీతిపై పోరుకు ఉద్దేశించబడింది. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్ తాలిబన్ల పూర్తి నియంత్రణలోకి వచ్చి, షరియా చట్టాన్ని ప్రవేశపెట్టి, దానిని ఖలీఫాత్గా మార్చినట్లయితే ఒక్క సెంటు కూడా అందించ బోమని జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్ గతవారం స్పష్టం చేశారు. చదవండి : Aircraft crash: ఆఖరి క్షణాల షాకింగ్ వీడియో Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి! -
అధ్యక్ష భవనంలో తాలిబన్ల జల్సాలు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్
రామ్ గోపాల్ వర్మ.. సంచలనాలకు మారు పేరు ఇది. ఈ వివాదాస్పద దర్శకుడు ఎప్పుడు, ఏం అంశంపై, ఎలా స్పందిస్తారో ఆయనకే తెలియదు. విషయం ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కున్న ఆఫ్గనిస్తాన్ పరిస్థితులపై స్పందించారు. చేతిలో ఆయుధాలు పట్టుకొని అధ్యక్ష భవనంలో జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించన వీడియోని షేర్ చేస్తూ.. వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని ట్వీట్ చేశాడు. U can see what kind of animals the taliban are just by how they are eating food in the Presidential palace pic.twitter.com/lSXb9uyhsJ — Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2021 అలాగే కాబూల్లోని ఓ ఎమ్యూజ్మెంట్ పార్కుకి వెళ్లిన తాలిబన్లు అక్కడ ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలా రైడింగ్ చేస్తూ, ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న వీడియో షేర్ చేస్తూ.. 'ఇది నిజం.. తాలీబన్స్ జస్ట్ కిడ్స్' అంటూ ఆర్టీజీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Finally the truth ..The Taliban are just kids 😂 https://t.co/j8Y5itNo6Y — Ram Gopal Varma (@RGVzoomin) August 17, 2021 చదవండి: ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని కన్నీరు పెట్టుకున్నా: శ్రీముఖి క్యూట్గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా? -
మొదలైన తాలిబన్ల అరాచకం: ఇంటింటికెళ్లి నగదు లూటీ
కాబూల్: ఆఫ్గానిస్తాన్లో ఊహించిన పరిణామాలే జరుగుతున్నాయి. ప్రపంచదేశాలతో పాటు సొంత దేశస్తులు భయపడినట్టే తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వారి అరాచకం తీవ్ర రూపం దాల్చుతోంది. ఎలాంటి దాడులు చేయమని అఫ్గాన్ను చేజిక్కుంటున్న సమయంలో చేసిన హామీని తాలిబన్లు ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఇప్పుడు కాబూల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబూల్లో ఇంటింటిని గాలిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, భద్రతా సిబ్బంది వివరాలు సేకరించారు. ఇంకా ఇళ్లలోకి ప్రవేశించి నగదు లూటీ చేస్తున్నాడు. అడ్డు వచ్చిన వారిపై తీవ్రంగా దాడులు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక జైళ్లలో బందీగా ఉన్న తమ మద్దతుదారులను విడుదల చేస్తున్నారు. ఈ అరాచక దృశ్యాలు సోషల్ మీడియాలో తాలిబన్లు పోస్టు చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా పూర్తిగా మూసివేసింది. అఫ్గాన్ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వెంటనే చొరవ తీసుకోవాలని చాలా దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
హృదయ విదారక దృశ్యాలు: బాలీవుడ్ హీరోయిన్ ఆవేదన
సాక్షి,ముంబై: అఫ్గనిస్తాన్లో నెలకొన్న సంక్షోభంపై బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశ పౌరులు, ప్రధానంగా మహిళల స్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు వేతన సమానత్వం కోసం పోరాడుతోంటే.. అఫ్గన్ మహిళలు మాత్రం అమ్మకానికి గురవుతున్నారన్నారు. వారే ఆదాయవనరుగా మారిపోయి జీవన పోరాటం చేస్తున్నారన్నారు. అఫ్గన్ మహిళలు, మైనార్టీల పరిస్థితిని చూసి హృదయం బద్దల వుతోందని పేర్కిన్నారు. ఈ మేరకు సోమవారం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఈ సంక్షోభంలో అండగా నిలబడాలని రియా గ్లోబల్ నాయకులను కోరారు. "పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టండి...మహిళలు కూడా మనుషులే" అని వ్యాఖ్యానించారు. మరోవైపు అఫ్గన్లో నెలకొన్న పరిస్థితులపై బాలీవుడ్కు చెందిన పలువురు నటులు, ఇతర సినీరంగ ప్రముఖులు స్పందించారు. ‘ప్రపంచం మౌనంగా చూస్తుండగా ఇంతటి సంక్షోభం.. మానవత్వానికి సిగ్గుచేటు’ అంటూ నటుడు కరణ్ టాకర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. అలాగే చిత్రనిర్మాత శేఖర్ కపూర్ కూడా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గనిస్తాన్ ప్రజలకోసం ప్రార్థిస్తున్నాననీ, విదేశీ శక్తుల వలస రాజ్యం ఆశలో అఫ్గన్ నాశనం మైందని కపూర్ ట్వీట్ చేశారు. వీరితోపాటు నటి స్వర భాస్కర్, రిచా చద్దా, అనురాగ్ కశ్యప్, సనమ్ పురి, హన్సల్ మెహతాతో సహా ఇతర చిత్ర పరిశ్రమ పెద్దలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. As the Americans leave Kabul: pic.twitter.com/VLYoOrPGZL — ian bremmer (@ianbremmer) August 16, 2021 కాగా అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే అఫ్గన్ రాజధాని కాబూల్తోపాటు కీలక భూభాగాలను అధీనంలో తెచ్చుకున్న తాలిబన్లు యుద్ధం ముగిసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని కాబూల్ నగరంలో హృదయ విదారక దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపాయి. ముఖ్యంగా దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోయారు. కాబూల్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దీంతో బీతిల్లిన ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిగా తరలి రావడంతో కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు, విమాన చక్రాలను పట్టుకుని మరీ వేళ్లాడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ముఖ్యంగా కదులుతున్న విమానాన్ని అందుకోవాలన్న ఆశతో రవ్వేపై వేలాదిగా పరుగులు పెడుతున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
దుప్పట్లో మిన్నాగు!
ఒక్కొక్క కోట ఒరిగిపోతోంది. ఒక్కో నగరం తీవ్రవాదుల చెరలో చేరిపోతోంది. ప్రతిఘటిస్తున్న అఫ్గానిస్తాన్ సేనలతో భీకరపోరు నడుమనే 34 ప్రొవిన్షియల్ రాజధానుల్లో 10 సాయుధ తాలిబన్ల వశమయ్యాయి. ఆ దేశంలోని 65 శాతం భూభాగం తాలిబన్ల చేతికి వచ్చేసింది. అమెరికా సారథ్యంలోని సేనలు వెనక్కి వచ్చేస్తున్న నేపథ్యంలో, తాలిబన్ల దండయాత్రలో నెల రోజుల్లో అఫ్గాన్ రాజధాని కాబూల్ ఏకాకి కానుంది. మూడు నెలల్లో కాబూల్ కోటపై తాలిబన్ల తీవ్రవాద జెండా ఎగరనుంది. సాక్షాత్తూ అమెరికా గూఢచారి విభాగం వేసిన ఈ అంచనా ఆందోళన రేపుతోంది. వెయ్యిమందికి పైగా పౌరులు నెలరోజుల్లో అక్కడ బలి అయ్యారు. ఈ ఒక్క నెలలోనే 4 వేల మందికి పైగా గాయపడ్డారు. విమాన సేవలు ఆగిపోక ముందే, అఫ్గాన్ను వదిలి వచ్చేయాల్సిందిగా భారత్, అమెరికా సహా అనేక దేశాలు తమ పౌరులకు సూచించాయి. అఫ్గాన్లోని తీవ్రతకు అది దర్పణం. అఫ్గాన్లో హింసకు తెర దించేందుకు చివరకు ఆ దేశ ప్రభుత్వమే దిగివచ్చింది. తాలిబన్లతో అధికారం పంచుకొనేందుకు సిద్ధపడింది. ఆ మేరకు ఓ ప్రతిపాదన చేసినట్టు తాజా సమాచారం. పొరుగుప్రాంతాలపై ప్రభావ రీత్యా ప్రపంచ దేశాలు ఈ అఫ్గాన్ పరిణామాలపై ఇక నిశితంగా దృష్టి పెట్టక తప్పదు. అఫ్గాన్ సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆ మధ్య ‘ఈద్’ వేళ తాలిబన్లు ప్రకటించారు. కానీ, సాయుధ తీవ్రవాద సమూహమైన తాలిబన్లు 2001లో అధికారం కోల్పోక ముందు అఫ్గాన్లో ఎలాంటి ఆటవిక రాజ్యం నడిపారో తెలిసిందే. ఇప్పుడేమో అమెరికా సైన్య ఉపసంహరణ వేళ చేసిన శాంతి బాసలూ తప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు తగినంత చొరవ తీసుకోకుండా, చూసీచూడనట్టున్నాయా అనిపిస్తే ఆశ్చర్యం లేదు. మధ్యప్రాచ్య దేశమైన ఖతార్ మాత్రం అఫ్గాన్లో శాంతి ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తోంది. ఖతార్ రాజధాని దోహాలో వివిధ ప్రాంతీయ దేశాల మధ్య జరుగుతున్న అఫ్గాన్ శాంతి చర్చల్లో ఇటీవలి కాలంలో తొలిసారిగా ఈ గురువారం మన దేశం పాల్గొంది. రష్యా చొరవ, అమెరికా మద్దతు ఉన్నా ఈ చర్చల్లో భారత్ను చేర్చనివ్వకుండా పాక్, చైనాలు గతంలో గండికొట్టాయి. కానీ, ఇప్పుడు ఖతార్ చొరవతో తప్పలేదు. ఖతార్ మధ్యవర్తిత్వం వల్లనే తాజాగా తాలిబన్లతో అధికార పంపిణీ ప్రతిపాదన వచ్చిందని సమాచారం. అలాగే, ప్రతివారం కనీసం 30 వేల మంది అఫ్గాన్లు దేశం విడిచి పోతున్న వేళ, శరణార్థుల అంశం కూడా రేపో మాపో తెర పైకి రానుంది. తీవ్రవాదుల పురుటిగడ్డగా తయారైన అఫ్గాన్లో ‘తీవ్రవాదంపై పోరు’కు అమెరికా గత ఇరవై ఏళ్ళలో ట్రిలియన్ డాలర్ల పైగా ధనం, వేలాది సైనికుల ప్రాణాలు పణంగా పెట్టింది. తీరా సైన్య ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. అందుకు చింతించడం లేదని బైడెన్ ప్రభుత్వం తేల్చేసింది. రెండు దశాబ్దాల పాటు యుద్ధ క్షేత్రంగా మారిన అఫ్గాన్నూ, ఆ దేశ ప్రజలనూ వారి కర్మానికి వారిని వదిలేసింది. ఆడినమాట తప్పిన తాలిబన్లతో ఈ ప్రాంతమంతా అస్థిరమయ్యే అపాయం ఏర్పడింది. కాబట్టి, వారిని అదుపులో పెట్టే తక్షణ మార్గాంతరాన్ని చూడాల్సిన బాధ్యత అమెరికన్ ప్రభుత్వానికి చాలా ఉంది. ఒకపక్క తాలిబన్ ప్రతినిధులు దోహాలో చర్చలకు హాజరవుతున్నారు. మరోపక్క అఫ్గాన్ సర్కారుకు సన్నిహితులని అనుమానం ఉన్న పౌరులనూ, పట్టుబడ్డ సైనికులనూ తాలిబన్లు ఊచకోత కోస్తున్నారు. పులిట్జర్ ప్రైజ్ గెలిచిన ఫోటోగ్రాఫర్ డానిష్ సిద్దిఖీని క్రూరంగా చంపిన వైనం అందుకు ఓ మచ్చుతునక. తాలిబన్ల ద్వంద్వనీతికి ఇలాంటి నిదర్శనాలెన్నో. నిజానికి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)కి ఈ నెల అంతా భారతదేశమే అధ్యక్షస్థానంలో ఉండనుంది. అదే ఆసరాగా మనం చొరవ తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు కీలకమైన అమెరికా, రష్యా, చైనా, ఇరాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఐరోపా సమాజం లాంటి దేశాలన్నిటినీ ఒక తాటి మీదకు తేవచ్చు. తలకు తుపాకీ గురిపెట్టే తాలిబన్ల భయం లేకుండా, అఫ్గాన్ ప్రజలే తమ భవితను నిర్ణయించుకొనేలా ఆ దేశానికి ఒక రక్షణ కవచమిచ్చే ప్రణాళికను యోచించవచ్చు. ఇలా అంతర్జాతీయ సమాజం అంతా కలసి, తక్షణమే అఫ్గాన్లో శాంతిస్థాపనకు అవకాశం వెతకాలి. తాజా అధికార పంపిణీ ప్రతిపాదన ఆ దిశగా తొలి అడుగు కావచ్చు. దీనికి తాలిబన్లు ఎంత ఒప్పుకుంటారో, ఒప్పుకున్న మాటకు ఏ మేరకు కట్టుబడి ఉంటారో చెప్పలేం. అలాగని, ఏ ప్రయత్నమూ లేకుండా తాలిబన్ల చేతికే పూర్తిగా దేశాన్ని అప్పగించి, చేతులు దులుపుకుంటే తీవ్రవాదంపై పోరులో ఇన్నేళ్ళ కష్టం బూడిదలో పోసిన పన్నీరే! ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), అల్–ఖైదా లాంటి తీవ్రవాద మూకలు అఫ్గాన్ను మళ్ళీ తమ అడ్డాగా మార్చుకొని, అంతా ఒక్కటవుతాయి. ఉపఖండంలోనూ, అంతర్జాతీయంగానూ దాడులకు తెగబడతాయి. ఇప్పటికే తాలిబన్లకు పాకిస్తాన్ అండ్ కో నుంచి ఆయుధాలు, ఆర్థిక నిధుల మొదలు దౌత్యసహకారం అందుతోంది. పైకి శాంతిసాధకురాలిగా కనిపిస్తూనే, తీవ్రవాదానికి పాక్ అండగా నిలుస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మాటలూ తాలిబన్లకే వంతపాడుతున్నాయి. పాక్పై, కనీసం అక్కడి సైన్యంపై ఐరాస ఆంక్షలు విధించాలన్న వాదన ఊపందుకొన్నది అందుకే! ఏమైనా, కాబూల్ గనక పూర్తిగా తాలిబన్ల ఏలుబడిలోకే వచ్చేస్తే, ఆ పర్యవసానం మనతో పాటు పరిసర అమెరికా, ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలపైనా పడుతుంది. అఫ్గాన్లోని అస్థిరత ఇరాన్, మధ్య ఆసియా, కాశ్మీర్లకూ విస్తరించవచ్చు. అందుకే దుప్పట్లో మిన్నాగును పెట్టుకొని, కళ్ళు తెరిచి నిద్ర పోతే ముప్పు మనకే! -
అఫ్గాన్ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి
కాబూల్: అఫ్గాన్ భూభాగాలను తాలిబన్ సేనలు మెరుపువేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ప్రావిన్స్లపై పట్టుకోసం అఫ్గాన్ సైన్యం, తాలిబన్ మూకల మధ్య పోరుతో దేశంలో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. తాజాగా మరో మూడు ప్రావిన్స్ల రాజధానులను తాలిబన్ దళాలు ఆక్రమించాయి. తాజాగా బదఖ్షాన్ రాజధాని ఫైజాబాద్, బాగ్లాన్ రాజధాని పోలి–ఖుమ్రీ, ఫరాహ్ ప్రావిన్స్ రాజధాని తాలిబన్ వశమయ్యాయి. దీంతో అఫ్గాన్ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి వచ్చింది. కుందుజ్ ఎయిర్పోర్ట్లోని సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. దీంతో తాలిబన్లపై ప్రతిదాడులు చేసి వారు తోకముడిచేలా చేసేందుకు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రంగంలోకి దిగారు. బాల్ఖ్ ప్రావిన్స్లోని స్థానికసైన్యాల నేతలైన అబ్దుల్ రషీద్ దోస్తుమ్ తదితరులను సాయం కోరేందుకు అక్కడికి చేరుకున్నారు. వారం వ్యవధిలోనే ఆరు ప్రావిన్స్ల రాజధానులు తాలిబన్ చేతచిక్కాయి. మరోవైపు, కీలక దేశ ‘కస్టమ్స్ ఆదాయ మార్గాలను’ తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆర్థికమంత్రి ఖలీద్ పయేందా పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయారని ఆర్థికశాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ రఫీ తబే చెప్పారు. ఉపసంహరణ ఆగదు: బైడెన్ అఫ్గాన్ సైన్యానికి తోడుగా ఉండేందుకు ఆ దేశంలోనే అమెరికా సేనలు ఉండబోతున్నాయని, సేనల ఉపసంహరణకు బ్రేక్ పడుతుందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. ‘మా బలగాలు అమెరికాకు రావడం ఖాయం. ఇప్పటికే అఫ్గాన్లో 20ఏళ్లకాలంలో దాదాపు రూ.74లక్షల కోట్లు ఖర్చుపెట్టాం. 3లక్షల మంది అఫ్గాన్ సైనికులకు శిక్షణ ఇచ్చాం. ఇకపై అఫ్గాన్ సేనలు తమ కోసం, తమ దేశం కోసం పోరాడాల్సిందే’అని బైడెన్ వ్యాఖ్యానించారు. కాగా, దేశ సైన్యంలో మరింతగా పోరాటస్ఫూర్తిని పెంచేందుకు ఆర్మీ చీఫ్ స్టాఫ్గా జనరల్ హిబాతుల్లా అలీజాయ్ను రక్షణశాఖ నియమించినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. Heart breaking scenes from #Kunduz province #Afghanistan 😰 pic.twitter.com/QjRzNa6XwQ — Khalid Amiri - خالد امیري (@KhalidAmiri01) August 8, 2021 -
తక్షణమే భారత్కు వచ్చేయండి