Vanta varpu
-
ఈ వెరైటీ వంటకాలను ఓసారి ట్రై చేయండి..!
బ్రింజాల్ పిజ్జా..కావలసినవి..వంకాయలు– 3 లేదా 4 (కొంచెం పెద్ద సైజువి తీసుకుంటే పిజ్జాలు బాగా వస్తాయి)ఆలివ్ నూనె– 1 టేబుల్ స్పూన్బేబీ టమాటో– 2 (గుండ్రంగా కట్ చేసుకోవాలి)మోజరెలా చీజ్– అర కప్పువెల్లుల్లి తురుము, మిరియాల పొడి– తగినంతఉప్పు– తగినంత, తులసి ఆకులు– కొన్నితయారీ..– ముందుగా ఒక్కో వంకాయను శుభ్రం చేసుకుని గుండ్రంగా మూడు లేదా నాలుగు చక్రాల్లా కట్ చేసుకుని ఆలివ్ నూనెలో ముంచాలి.– అనంతరం వాటిని ఒక ట్రేలో వరుసగా పేర్చుకుని, వాటిపై కొద్దిగా మోజరెలా చీజ్ వేసి, ఐదు నిమిషాల పాటు ఓవెన్లో దోరగా బేక్ చేసుకోవాలి.– అనంతరం ముక్కలను బయటికి తీసి, వాటిపై మిరియాల పొడి, వెల్లుల్లి తురుము, చిన్నచిన్న టమాటో ముక్కలు, మోజరెలా చీజ్ చల్లుకోవాలి.– మరోసారి ఆ ట్రేను ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకోవాలి. వాటిని తులసి ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.పొద్దుతిరుగుడు లడ్డూ..కావలసినవి..పొద్దుతిరుగుడు గింజలు– 1 కప్పుబెల్లం తురుము– 1 కప్పునీళ్లు– పాకానికి సరిపడాకొబ్బరి తురుము– పావు కప్పునెయ్యి– 3 టేబుల్ స్పూన్లుతయారీ..– ముందుగా పొద్దుతిరుగుడు గింజలను నేతిలో దోరగా వేయించి, మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసుకుని పాకం పెట్టుకోవాలి.– చల్లారాక వడకట్టుకుని, అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పొద్దుతిరుగుడు గింజల పొడి, కొబ్బరి తురుము వేసుకుని, ముద్దలా చేసుకోవాలి.– అవసరం అయితే అదనంగా కాస్త నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.టమాటో హల్వా..కావలసినవి..టమాటోలు– 10, పంచదార– 1 కప్పునెయ్యి– అరకప్పు, బొంబాయి రవ్వ– ఒక కప్పునట్స్– రెండు గుప్పిళ్లు, ఫుడ్ కలర్– అభిరుచిని బట్టిఏలకుల పొడి– అర టీస్పూనుతయారీ..– ముందుగా టమాటోలను నీళ్లలో ఉడికించి చల్లార్చాలి. వాటిని మిక్సీలో వేసుకుని గుజ్జులా చేసుకుని, బౌల్లోకి వేయాలి.– ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి నట్స్, బొంబాయి రవ్వలను విడివిడిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.– ఇప్పుడు స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోయాలి.– నీళ్లు మరిగాక వేయించిన బొంబాయి రవ్వ, కొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి.– రవ్వ చిక్కబడుతున్న సమయంలో టమాటో గుజ్జు, పంచదార, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి.– ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఫుడ్ కలర్, ఏలకుల పొడి చల్లి, బాగా కలిపి దించేయాలి.– తరువాత బౌల్ లోపల కాస్త నెయ్యి రాసి, సగానికి పైగా హల్వాని వేయాలి.– తర్వాత నట్స్ చల్లుకుని, మిగిలిన హల్వా కూడా పైన వేసుకుని పరచుకోవాలి. గాలికి చల్లారి దగ్గరపడిన తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: -
క్యాబేజీతో క్రేజీగా...!
క్యా... బే... జీ! పిల్లలు ఈ జోక్ని సరదాగా ఎంజాయ్ చేస్తారు. సిబ్లింగ్స్ ఒకరినొకరు తిట్టుకోనట్లు తిట్టుకుంటారు. పొగడక తప్పనట్లు పొగుడుకుంటారు. క్యాబేజీ తినమంటే మాత్రం ముఖం చిట్లిస్తారు. వారానికి ఒకసారి క్యాబేజ్ తినమంటోంది ఆరోగ్యం. క్యాబేజీతో ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది?క్యాబేజ్ కుల్చా..కావలసినవి..గోధుమపిండి– పావు కేజీ;నూనె– 2 టీ స్పూన్లు;నీరు – ము΄్పావు కప్పు;ఉప్పు – పావు టీ స్పూన్;స్టఫింగ్ కోసం... క్యాబేజ్ – పావు కేజీ;నూనె – టేబుల్ స్పూన్;పచ్చిమిర్చి – 2 (తరగాలి);వాము – అర టీ స్పూన్;అల్లం తురుము – టీ స్పూన్;పసుపు – పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;జీలకర్ర పొడి– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;ఆమ్చూర్ – అరటీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్;నూనె – టేబుల్ స్పూన్.తయారీ..– గోధుమపిండిలో ఉప్పు, నీరు పోసి ముద్దగా కలిపి పైన నూనె వేసి అద్ది పలుచని వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి.– క్యాబేజ్ని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీటిలో వేసి ఐదు నిమిషాల సేపు ఉంచి తీయాలి. నీరు పోయిన తర్వాత తురమాలి.– వెడల్పు పెనంలో నూనె వేడి చేసి వాము గింజలు వేయాలి.– అవి చిటపటలాడిన తర్వాత క్యాబేజ్ తురుము, ఉప్పు వేసి కలిపి మంట తగ్గించి మూతపెట్టాలి.– ఏడెనిమిది నిమిషాలకు క్యాబేజ్ మగ్గుతుంది. అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించాలి.– ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, అల్లం, పసుపు, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా పొడులు వేసి కలిపి మూత పెట్టాలి.– రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించేయాలి. చల్లారే వరకు పక్కన పెట్టాలి.– ఈ లోపు గోధుమ పిండితో చపాతీలు చేయాలి. ఒక చపాతీ మీద ఒక గరిటె క్యాబేజ్ స్టఫింగ్ పెట్టి ఆ పైన మరో చపాతీ పెట్టి అంచులను చేత్తో అతికించాలి.– ఇప్పుడు క్యాబేజ్ సమంగా విస్తరించడానికి అప్పడాల కర్రతో జాగ్రత్తగా రోల్ చేస్తే అదే కుల్చా. ఇలాగే పిండి అంతటినీ చేయాలి.– ఇప్పుడు చపాతీల పెనం వేడి చేసి ఒక్కో కుల్చాను చపాతీలాగానే నూనె వేస్తూ రెండువైపులా కాలనివ్వాలి.– స్టఫింగ్ బరువుతో కుల్చా విరిగిపోకుండా జాగ్రత్తగా తిరగేయాలి.– వేడి కుల్చాలోకి వెన్న, పెరుగు మంచి కాంబినేషన్. కారంగా తినాలంటే నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి బాగుంటుంది.గమనిక: ఆమ్చూర్ పౌడర్ లేకపోతే తాజా మామిడి తురుము టీ స్పూన్ తీసుకోవాలి.క్యాబేజ్ డ్రై మంచూరియా..కావలసినవి..క్యాబేజ్ – 200 గ్రాములు (తరగాలి);ఉల్లిపాయ – 1 (పెద్దది, తరగాలి);క్యాప్సికమ్ – 1 (తరగాలి);క్యారట్ – 1 (తరగాలి);షెజ్వాన్ సాస్ – అర టేబుల్ స్పూన్;అల్లం తురుము – టీ స్పూన్; కశ్మీరీ మిరపొ్పడి– అర టీ స్పూన్;మిరియాల పొడి– పావు టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;శనగపిండి – 100 గ్రాములు;మైదా – 50 గ్రాములు;మొక్కజొన్న పిండి– 50 గ్రాములు;నూనె – వేయించడానికి తగినంత;గార్నిష్ చేయడానికి... క్యాబేజ్ తురుము – టేబుల్ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్.తయారీ..– వెడల్పు పాత్ర తీసుకుని అందులో నూనె మినహా మిగిలిన దినుసులన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి.– నీరు అవసరం లేదు, కూరగాయల్లోని నీటితోనే పిండి ముద్దగా అవుతుంది.– అరగంట తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి.– బాణలిలో నూనె మరిగించి పై మిశ్రమాన్ని చేతి నిండుగా తీసుకుని వేళ్లతో కొద్ది కొద్దిగా నూనెలో వదలాలి.– కాలి కొంచెం గట్టి పడిన తర్వాత చిల్లుల గరిటెతో అన్ని వైపులా బాగా కాలే వరకు తిరగేస్తూ కాలనివ్వాలి.– ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పరిచి మంచూరియా దోరగా కాలిన తర్వాత తీసి పేపర్ మీద వేయాలి.– వేడిగా ఉండగానే క్యాబేజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..! -
Vinayaka Chavithi 2024: బుజ్జి గణపయ్యకు.. బొజ్జ నిండా!
రేపే వినాయక చవితి. ఉదయం చంద్రుడిని చూడవద్దు. చందమామ లాంటి కుడుములు చేద్దాం. వినాయకుడికి నివేదన చేద్దాం. ఓ బొజ్జ గణపయ్యా! నీ బంటు నేనయ్యా!! ఉండ్రాళ్లపై దండు పంపమని స్తోత్రం చదువుదాం!!ఉండ్రాళ్లు..కావలసినవి..బియ్యపు రవ్వ– కప్పు;నీరు – 2 కప్పులు;పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు;నెయ్యి– టీ స్పూన్;ఉప్పు – పావు టీ స్పూన్;పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు (ఇష్టమైతేనే)తయారీ..– శనగపప్పును కడిగి 20 నిమిషాల సేపు నీటిలో నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి అందులో శనగపప్పు వేసి వేయించాలి.– శనగపప్పు దోరగా వేగిన తర్వాత అందులో నీరు పోసి ఉప్పు వేసి మూత పెట్టాలి.– నీరు మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి, రవ్వ వేసి ఉండలు లేకుండా గరిటెతో కలపాలి.– కొబ్బరి తురుము వేసి సమంగా కలిసే వరకు కలిపి నీరు ఆవిరైపోయి రవ్వ దగ్గరగా అయిన తర్వాత దించేయాలి.– వేడి తగ్గిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని గోళీలుగా చేస్తే ఉండ్రాళ్లు రెడీ.పూర్ణం కుడుములు..కావలసినవి..బియ్యప్పిండి– కప్పు;నీరు – కప్పు;నెయ్యి – టీ స్పూన్;ఉప్పు – చిటికెడు. పూర్ణం కోసం... పచ్చి శనగపప్పు – అర కప్పు; నీరు – కప్పు;బెల్లం పొడి– ముప్పావు కప్పు;పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు;యాలకుల పొడి– అర టీ స్పూన్తయారీ..– శనగపప్పును కడిగి రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, చల్లారిన తర్వాత నీటిని వంపేసి శనగపప్పును మిక్సీలో వేసి పొడి చేయాలి.– ఈ పొడి డ్రైగా ఉండదు, కొద్దిపాటి తడిపొడిగా ఉంటుంది.– ఒక పాత్రలో బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కరిగే వరకు మరిగించాలి.– కరిగిన తర్వాత మరొకపాత్రలోకి వడపోయాలి.– బెల్లం నీటిలో శనగపప్పు పొడి, కొబ్బరి తురుము వేసి గరిటెతో కలుపుతూ మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు మరిగించాలి.– చివరగా యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.– చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా చేసి, గోళీలుగా చేస్తే పూర్ణం రెడీ.ఇక కుడుముల కోసం..– ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో ఉప్పు, నెయ్యి వేసి వేడి చేయాలి.– నీరు మరిగేటప్పుడు స్టవ్ ఆపేసి బియ్యప్పిండి వేసి గరిటెతో కలపాలి.– వేడి తగ్గిన తరవాత చేత్తో మర్దన చేస్తూ చపాతీల పిండిలా చేసుకుని ఎనిమిది భాగాలు చేయాలి.– ఒక్కో భాగాన్ని గోళీలాగ చేసి పూరీలా వత్తాలి.– ఇందులో పూర్ణం పెట్టి అంచులు మూసేయాలి. ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి.– ఒక వెడల్పు పాత్రకు నెయ్యి రాసి పూర్ణకుడుములను అమర్చాలి.– ప్రెషర్ కుకర్లో నీరు పోసి కుడుముల పాత్ర పెట్టి మూత పెట్టి ఎనిమిది నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆపేయాలి.– చల్లారిన తర్వాత తీసి వినాయకుడికి నివేదన చేయాలి. -
Tasty Sweet Corn: గింజ గింజలో.. రుచి!
మార్కెట్లో స్వీట్ కార్న్ రాశులుగా పోగయి ఉన్నాయి. బలవర్ధకమే... కానీ రోజూ ఉడికించి తినాలంటే బోర్. కొంచెం వెరైటీగా ప్రయత్నం చేస్తే... పిల్లలు లంచ్బాక్స్ను ప్రేమిస్తారు... ఈవెనింగ్ స్నాక్ కోసం ఎదురుచూస్తారు.చీజ్ బాల్స్..కావలసినవి:బంగాళదుంప – 150 గ్రా (పెద్దది ఒకటి);మొక్కజొన్న గింజలు – వంద గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేతగా ఉండాలి;చీజ్ – 50 గ్రాములు;మిరియాల పొడి– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;ఆరెగానో పౌడర్ – అర టీ స్పూన్;వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్;మైదా లేదా శనగపిండి – 4 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినంత;నూనె – 3 టేబుల్ స్పూన్లు;తయారీ..– బంగాళదుంపను ఉడికించి తొక్క తీసి చిదిమి పక్కన పెట్టాలి.– మొక్కజొన్న గింజలను ఉడికించి నీటిని వంపేసి పక్క పెట్టాలి. చీజ్ను తురమాలి.– ఒక పాత్రలో బంగాళదుంప, మొక్కజొన్న గింజలు, శనగపిండి, చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, ఆరెగానో వేసి కలపాలి.– రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు, మిరియాలపొడి కలుపుకోవచ్చు.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో పావు టీ స్పూన్ నూనె వేయాలి.– పెనం, నూనె బాగా వేడయ్యే లోపు బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న గోళీలంత బాల్స్ చేసి పక్కన పెట్టాలి.– నూనె వేడెక్కిన తర్వాత ఒక్కో గోళీని ఒక్కో గుంతలో పెట్టి మూత పెట్టాలి.– మీడియం మంట మీద ఓ నిమిషం పాటు కాలనిచ్చి మూత తీసి ప్రతి బాల్నీ తిరగేయాలి.– తిరగేసిన తర్వాత మూత పెట్టకుండా రెండో వైపు కూడా ఎర్రగా కాలనిచ్చి తీయాలి.– వేడిగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.గమనిక: గుంత పొంగనాల పెనం లేకపోతే మామూలు బాణలిలో నూనె వేడి చేసి చీజ్ బాల్స్ని ఎర్రగా ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి.ఫ్రైడ్ రైస్..కావలసినవి:బాసుమతి బియ్యం – 200 గ్రాములు;నూనె – అర టీ స్పూన్;నీరు – 3 కప్పులు;మొక్క జొన్న గింజలు – 300 గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేత గింజలు);ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;ఉల్లికాడల ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు;సెలెరీ లేదా కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు;క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు;మిరియాల పొడి– టీ స్పూన్;సోయాసాస్– టేబుల్ స్పూన్;ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నెయ్యి లేదా నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు.తయారీ..– బియ్యాన్ని కడిగి 20 నిమిషాల సేపు నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో మూడు కప్పుల నీరు పోసి వేడి చేసి మరిగేటప్పుడు అందులో పావు టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ ఆయిల్, కడిగి పెట్టిన బియ్యం వేయాలి.– అన్నం ఉడికిన తర్వాత వార్చి అన్నాన్ని ఒక పళ్లెంలో పోసి పక్కన పెట్టాలి.– అన్నం ఉడికేలోపు మరొక స్టవ్ మీద పాత్ర పెట్టి మొక్కజొన్న గింజలను ఉడికించాలి.– ఇప్పుడు స్టవ్ మీద వెడల్పు పాత్ర లేదా పెద్ద బాణలి పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనె వేడి చేయాలి.– అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేసి దోరగా వేయించాలి.– తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, సెలెరీ తరుగు వేసి అవి వేగిన తర్వాత ఉడికించిన మొక్కజొన్న గింజలు, సోయాసాస్ వేసి దోరగా వేయించాలి.– అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి ఇప్పుడు అందులో సగం అన్నం వేసి అన్నం మెతుకులు నలగనంత సున్నితంగా ఒక నిమిషం పాటు వేయించాలి.– ఇప్పుడు మిగిలిన అన్నాన్ని కూడా వేసి అంతా కలిసేటట్లు బాణలిని కదిలించి మూత పెట్టి స్టవ్ మీద నుంచి దించేయాలి. -
ఇవి.. పొరుగింటి దోసెలు!
వారం మెనూలో దోసె ఉండాల్సిందే... దోసె కూడా బోర్ కొట్టేస్తుంటే ఏం చేద్దాం? పక్క రాష్ట్రాల వాళ్ల వంటింట్లోకి తొంగిచూద్దాం. కేరళ వాళ్లు మనదోనెనే కొద్దిగా మార్చి ఆపం చేస్తారు. కన్నడిగులు చిరుతీయటి నీర్దోసె వేస్తారు.కన్నడ నీర్ దోసె.. కావలసినవి..బియ్యం – 2 కప్పులు;కొబ్బరి తురుము – కప్పు;ఉప్పు – చిటికెడు;నూనె – టేబుల్ స్పూన్;తయారీ..– బియ్యాన్ని నాలుగైదు గంటల సేపు లేదా రాత్రంతా నానబెట్టాలి.– బియ్యం, కొబ్బరి తురుము, ఉప్పు కలిపి మిక్సీలో మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం గరుకుగా గ్రైండ్ చేయాలి.– పిండిలో తగినంత నీటిని కలిపి గరిటె జారుడుగా ఉండాలి.– పెనం వేడి చేసి దోసె వేసి కొద్దిగా నూనె వేయాలి. రెండువైపులా కాల్చి వేడిగా వడ్డించాలి.గమనిక: కన్నడ నీర్ దోసెకు పిండిని పులియబెట్టాలిన అవసరం లేదు. రాత్రి నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి వెంటనే దోసెలు వేసుకోవచ్చు. దీనికి సాంబార్, ఆవకాయ– పెరుగు కలిపిన రైతా మంచి కాంబినేషన్.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా – చిటికెడు.తయారీ..– బియ్యాన్ని కడిగి మంచినీటిలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.– మిక్సీలో బియ్యం, కొబ్బరి తురుము వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.– బాణలిలో నీటిని ΄ోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.– మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.– ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి.– ఉదయం ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో కలపాలి.– మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి.– ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి పెనం అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.– మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.– అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.– అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.– ఇందులో నూనె వేయాల్సిన పని లేదు.– ఆపం పెనం లేక΄ోతే దోశె పెనం (ఫ్లాట్గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు. -
మెనూ.. కొద్దిగా మారుద్దాం! అప్పుడే హ్యాపీగా తింటాం!!
బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్ ఫర్ చేంజ్. కూరగాయలతో బ్రేక్ఫాస్ట్... ఇడ్లీతో ఈవెనింగ్ స్నాక్ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.వీట్ వెజిటబుల్ దోసె..కావలసినవి..గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;ఉప్పు – పావు టీ స్పూన్;నీరు – పావు కప్పు;టొమాటో ముక్కలు – పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;క్యారట్ తురుము – పావు కప్పు;పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు;నూనె – 6 టీ స్పూన్లు.తయారీ..– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్ వీట్ వెజిటబుల్ దోసె రెడీ.చిల్లీ ఇడ్లీ..కావలసినవి..ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్లు;తరిగిన అల్లం – 2 టీ స్పూన్లు;తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్లు;తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు;టొమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్లు;చక్కెర– అర టీ స్పూన్;వినెగర్– టీ స్పూన్;సోయాసాస్ – టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 3 టేబుల్ స్పూన్లు.తయారీ..– పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించాలి.– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.– ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! -
ఫ్లఫ్ఫీ పూరీ.. వెజిటబుల్ కాజు సాగ్ కాంబినేషన్తో.. ఆరోగ్యం!
ఫ్లఫ్ఫీ పూరీ ఇందులోకి వెజిటబుల్ కాజు సాగ్ హెల్దీ కాంబినేషన్. దీనిని ఎలా చేయాలో చూద్దాం.కావలసినవి..గోధుమపిండి– కప్పు;నీరు– పావు కప్పు లేదా అవసరాన్ని బట్టి;చక్కెర – పావు టీ స్పూన్;నెయ్యి– 2 టీ స్పూన్లు;నూనె – వేయించడానికి తగినంత.తయారీ..– నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో వేసి పూరీల పిండిని కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన పెట్టాలి.– ఈ పిండిని ఎనిమిది భాగలుగా చేసి పూరీలు వత్తి ఫ్లవర్ మౌల్డ్తో వత్తాలి.– బాణలిలో నూనె వేడి చేసి పూరీలను రెండు వైపులా కాల్చి తీస్తే ఫ్లఫ్ఫీ పూరీలు రెడీ.వెజిటబుల్ కాజు సాగ్..కావలసినవి..జీడిపప్పు – 10;పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్;కొత్తిమీర తరుగు– టీ స్పూన్;పుదీన ఆకులు– 8;ధనియాల సొడి– పావు టీ స్పూన్;పచ్చిమిర్చి – అర కాయ;ఉడికించిన కూరగాయలు – కప్పు (క్యారట్, బీన్స్, బంగాళదుంప, మొక్కజొన్న, పచ్చి బఠాణీలు కలిపి);అల్లం తరుగు– అర టీ స్పూన్;ఉల్లిపాయ ముక్కలు– 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నిమ్మరసం– టీ స్పూన్; నూనె – టీ స్పూన్.తయారీ..కూరగాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి. జీడిపప్పు, కొబ్బరితురుము, కొత్తిమీర, ధనియాల సొడి, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్ట్ చేయాలి ∙బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి అందులో జీడిపప్పుతోపాటు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, కొద్దిగా నీటిని వేసి ఐదు నిమిషాల సేపు ఉడికిస్తే వెజిటబుల్ కాజు సాగ్ రెడీ.పోషకాలు: పూరీలో... ఫ్యాట్ – 9.8 గ్రాములు, ్రసొటీన్ – 2.3 గ్రాములు, కార్బొహైడ్రేట్లు – 12 గ్రాములు. కర్రీలో... ్రసొటీన్– 4 గ్రాములు, కార్బొహైడ్రేట్లు – 13 గ్రాములు, ఫైబర్– 5 గ్రాములు.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
వర్షాకాలం సీజన్లో వేడి వేడిగా ఈ రుచులు.. ఇలా తయారుచేయండి!
వర్షాకాలం సీజన్లో వేడి వేడిగా వంటకాలు చేసుకోవాలనుకుంటున్నరా అయితే ఇవి మీకోసమే.. వేడితో పాటుగా కొంచెం రుచిగానూ, కారంగానూ ఉండటానికి ఈ విధంగా తయారుచేయండి..ఎగ్–చీజ్ అవకాడో..కావలసినవి:అవకాడో – 4 (ఒక్కో అవకాడోను నిలువుగా రెండు ముక్కలుగా చేసి.. గింజ తొలగించి పెట్టుకోవాలి)గుడ్లు – 8 (రెండు బౌల్స్లో తెలుపు సొన, పసుపు సొన వేరు వేరుగా చేసుకోవాలి)చీజ్ తురుము – 2 టేబుల్ స్పూన్లుబటర్ – 1 టేబుల్ స్పూన్ఉప్పు, మిరియాల పొడి – కొద్దికొద్దిగాఉల్లికాడ ముక్కలు – అర టేబుల్ స్పూన్టొమాటో ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా తిరిగి, నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి)తయారీ:– ముందుగా గుడ్డు తెల్లసొనలో కొద్దిగా ఉప్పు, బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి.– పసుపు సొనలో చీజ్ తురుము వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా కలుపుకోవాలి.– అనంతరం ఒక్కో అవకాడో ముక్కలో కొంచెం కొంచెం తెల్లసొన మిశ్రమాన్ని నింపి.. దానిపైన పసుపు సొన మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి.– అనంతరం వాటిపైన కొన్నికొన్ని టొమాటో ముక్కలు, ఉల్లికాడ ముక్కలు వేసుకుని.. వాటిపైన మిరియాల పొడి, కొంచెం ఉప్పు జల్లుకుని.. ఓవెన్లో బేక్ చేసుకోవాలి.– వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి ఈ అవకాడోలు.నూడుల్ చికెన్బాల్స్..కావలసినవి:నూడుల్స్ – ఒకటిన్నర కప్పు (వేడి నీళ్లల్లో ఉyì కించి పెట్టుకోవాలి)గరం మసాలా, ఉప్పు, కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి – 2 టీ స్పూన్ల చొప్పునమిరియాల పొడి – కొద్దిగాచికెన్ – పావు కప్పు (కొద్దిగా మసాలా, కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు పెరుగు జోడించి కాసేపు నానబెట్టాలి. తర్వాత మెత్తగా ఉడికించి, చల్లారనిచ్చి తురుములా చేసుకోవాలి)ఓట్స్ పౌడర్, జొన్న పిండి, గోధుమ పిండి, బీట్రూట్ రసం – పావు కప్పు చొప్పునటొమాటో సాస్ – 6 టేబుల్ స్పూన్ల పైనేకొబ్బరి పాలు – అర కప్పునూనె – సరిపడాతయారీ:– ముందుగా నూడుల్స్, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి.. ఒక్కో టీ స్పూన్ చొప్పున వేసుకుని.. నూనెలో బాగా వేయించుకోవాలి.– 2 లేదా 4 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసుకుని బాగా కలిపి.. çస్టవ్ ఆఫ్ చేసుకోవాలి.– ఈలోపు మరో స్టవ్ మీద కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని.. ఉడికిన చికెన్ తురుము, మిగిలిన గరం మసాలా, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి.. వేసుకుని బాగా కలిపి.. కొబ్బరి పాలు పోసుకుని దగ్గరపడే వరకూ చిన్న మంట మీద ఉడకనివ్వాలి.– అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.– చల్లారిన చికెన్ మిశ్రమంలో ఓట్స్ పౌడర్, జొన్నపిండి, గోధుమ పిండి వేసుకుని బాగా కలిపి.. బీట్రూట్ రసం కొద్దికొద్దిగా వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి.– అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.– ఈ ముద్దను చిన్న చిన్న బాల్స్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.– ఈ సమయంలో కేక్ బౌల్ ట్రే తీసుకుని.. ప్రతి బౌల్కి ఆయిల్ రాసుకుని.. కొన్నికొన్ని నూడుల్స్ వేసుకుని.. గ్లాసు సాయంతో గుంతలా గట్టిగా ఒత్తుకోవాలి.– తర్వాత వాటిని అదే షేప్లో ఓవెన్లో బేక్ చేసుకోవాలి.– అనంతరం ఒక్కో చికెన్ బాల్ను మిగిలిన టొమాటో సాస్లో ముంచి.. ఒక్కో నూడుల్ బౌల్లో వేసుకుని.. సర్వ్ చేసుకోవాలి.మిల్క్– కోకో డోనట్స్..కావలసినవి:మిల్క్ పౌడర్ – 2 కప్పులుకోకో పౌడర్ – 1 కప్పుఫుడ్ కలర్ – అభిరుచిని బట్టిపంచదార పొడి – 1 కప్పుమజ్జిగ – ముప్పావు కప్పుబేకింగ్ సోడా, వైట్ వెనిగర్, వెనీలా ఎసెన్స్ – 1 టీ æస్పూన్ చొప్పున, గుడ్లు – 2, నూనె – సరిపడాఉప్పు – కొద్దిగాతయారీ:– ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మిల్క్ పౌడర్, కోకో పౌడర్, పంచదార పొడి, బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి.– అందులో కొద్దికొద్దిగా మజ్జిగ పోసుకుంటూ కలపాలి.– దానిలో వెనీలా ఎసెన్స్, గుడ్లు, నూనె, వైట్ వెనిగర్, ఫుడ్ కలర్, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి.– డోనట్స్ మేకర్కి కొద్దిగా నూనె రాసి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని, ఓవెన్లో బేక్ చేసుకోవాలి.– అనంతరం నచ్చిన విధంగా చాక్లెట్ క్రీమ్తో లేదా కొబ్బరి తురుము– పాకంతో గార్నిష్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ డోనట్స్.ఇవి చదవండి: త్వరగా.. మేకప్ వేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనిని వాడండి.. -
ఇది పకోడీ కాలం..
ఇది వర్షాకాలం. వాన చినుకులు పడుతుంటే... వేడి వేడి పకోడీలు తింటూ గరం గరం చాయ్ తాగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఏడాదంతా వర్షాకాలమే ఉంటే బావుణ్ననిపిస్తుంది. ఇది వర్షాకాలం కాదు పకోడీల కాలం అనాలనిపిస్తుంది.పోహా పకోడీ..కావలసినవి:అటుకులు– ఒకటిన్నర కప్పులు;బంగాళాదుంప– అర కప్పు(ఉడికించి చిదిమినది);కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;పచ్చిమిర్చి తరుగు– టీ స్పూన్;మిరప్పొడి– టీ స్పూన్;చక్కెర – అర టీ స్పూన్;నిమ్మరసం – అర టీ స్పూన్;జీలకర్ర– అర టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె– వేయించడానికి తగినంత.తయారీ:– అటుకులను ఒక పాత్రలో వేసి (అటుకులు తేలేటట్లు) నిండుగా నీటిని పోసి కడిగి వడపోత గిన్నెలో వేయాలి.– నీరంతా కారిపోయిన తర్వాత తీసి వెడల్పు పాత్రలో వేసుకోవాలి.– అందులో ఉడికించి చిదిమిన బంగాళాదుంప, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరప్పొడి, చక్కెర, జీలకర్ర, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి.– ఈ మిశ్రమం అంతటినీ చిన్న నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి.– బాణలిలో నూనె వేడి చేసి, మరుగుతున్న నూనెలోఒక్కో గోళీని మెల్లగా వేయాలి.– మంటను మీడియంలో పెట్టి దోరగా వేగనివ్వాలి.– అన్నివైపులా ఎర్రగా వేగిన తర్వాత చిల్లుల గరిటతో తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే పోహా పకోడీ రెడీ. వీటికి పుదీన చట్నీ లేదా టొమాటో కెచప్ మంచి కాంబినేషన్.కార్న్ పకోడీ..కావలసినవి:స్వీట్ కార్న్ గింజలు– 2 కప్పులు;అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు;జీలకర్ర– అర టీ స్పూన్;శనగపిండి– 3 టేబుల్ స్పూన్లు;బియ్యప్పిండి– 3 టేబుల్ స్పూన్లు;గరం మసాలా – అర టీ స్పూన్;ఉల్లిపాయ – ఒకటి (తరగాలి);పచ్చిమిర్చి – 2 (తరగాలి);కరివేపాకు – 2 రెమ్మలు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పసుపు – పావు టీ స్పూన్;మిరప్పొడి– అర టీ స్పూన్;నూనె – వేయించడానికి తగినంత.తయారీ:– మొక్కజొన్న గింజలను కడిగి చిల్లుల పాత్రలో వేసి నీరు పోయే వరకు ఉంచాలి.– ఈ లోపు ఒక పాత్రలో నూనె మినహా పైన తీసుకున్నవన్నీ వేసి కలపాలి.– మొక్కజొన్న గింజల్లో గుప్పెడు గింజలను తీసి పక్కన పెట్టి మిగిలిన గింజలను మిక్సీలో కచ్చపచ్చాగా గ్రైండ్ చేయాలి.– ఇప్పుడు పక్కన పెట్టిన గింజలను కూడా శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలి.– బాణలిలో నూనె మరిగించి పకోడీ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని వేళ్లతో కొద్దికొద్దిగా నూనెలో వేయాలి.– దోరగా వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే వేడి వేడి కార్న్ పకోడీలు తినడానికి రెడీ. ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి. -
బెల్లం ఇడ్లీని.. ఎప్పుడైనా తిన్నరా! ఆ టేస్టే వేరు..
ఎప్పుడైనా ఈ వంటకాలను తిని చూశారా..!? తిన్నారంటే వాహ్.. అనాల్సిందే..! ఇంకెందుకు ఆలస్యం.. వాటి తయారీ విధానాలను చూద్దాం..బెల్లం ఇడ్లీ..కావలసినవి:ఇడ్లీ బియ్యం – 2 కప్పులు,మెంతులు – పావు టీ స్పూన్,మినప్పప్పు – పావు కప్పు,బెల్లం – ఒకటిన్నర కప్పులుఉప్పు – తగినంత,శనగపప్పు,కొబ్బరి ముక్కలు – 4 టేబుల్ స్పూన్ల చొప్పున,ఏలకుల పొడి – 1 టేబుల్ స్పూన్,నెయ్యి – కొద్దిగాతయారీ..– ముందురోజు రాత్రి ఇడ్లీ బియ్యం, మెంతులు ఒక బౌల్లో, మినప్పప్పు ఒక బౌల్లో నానబెట్టి.. వేరువేరుగా మిక్సీ పట్టి.. ఒక బౌల్లోకి వేసుకోవాలి.– ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక పెద్ద బౌల్లో వేసుకుని.. బాగా కలిపి 8 గంటల పాటు పక్కనపెట్టుకోవాలి.– మరునాడు ఉదయాన్నే ఇడ్లీ పెట్టుకునే గంట ముందు శనగపప్పు నానబెట్టుకోవాలి.– ఈలోపు బెల్లంలో 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసి.. పాకం పట్టుకుని ఉంచుకోవాలి.– అనంతరం మినప్పప్పు – ఇడ్లీ పిండి మిశ్రమాన్ని మరోసారి బాగా కలిపి.. తగినంత ఉప్పు, ఏలకుల పొడి వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి.– అనంతరం వడకట్టు అడ్డం పెట్టుకుని.. బెల్లం పాకం అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి.– తర్వాత ఇడ్లీ రేకులకు నెయ్యి రాసి, కొంత శనగపప్పు, కొన్ని కొబ్బరి ముక్కలను ప్రతి గుంతలో వేసుకుంటూ.. దానిపైన కొద్ది కొద్దిగా ఇడ్లీ పిండిని వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి.– వేడివేడి ఆ ఇడ్లీలపై నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.రైస్ చికెన్ కట్లెట్స్..కావలసినవి:బోన్లెస్ చికెన్ – పావు కేజీ (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక తురుములా చేసుకోవాలి)కొబ్బరి పాలు – అర కప్పు,గుడ్లు – 4,బియ్యం – ముప్పావు కప్పు (పిండిలా చేసుకోవాలి),పండు మిర్చి – 2 (పేస్ట్లా చేసుకోవచ్చు),కొత్తిమీర – 2 రెమ్మలు (పేస్ట్లా చేసుకోవాలి),పంచదార – 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి)టొమాటో గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు,ఉప్పు – తగినంత,నూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి పాలు, గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి.– తర్వాత అందులో బియ్యప్పిండి, ఉడికించిన చికెన్ తురుము వేసుకుని మరోసారి కలుపుకోవాలి.– ఆ మిశ్రమంలో పండు మిర్చి పేస్ట్, టొమాటో గుజ్జు, పంచదార, ఉప్పు, కొత్తిమీర పేస్ట్ వేసుకుని.. బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి.– ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న కట్లెట్స్లా చేసుకుని.. బ్రష్తో.. ఇరువైపులా నూనె రాసుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి. లేదా – – నూనెలో దోరగా వేయించుకోవచ్చు. నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని.. నచ్చిన చట్నీతో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయివి. -
ఆషాఢంలో.. మునగాకు తినాలని మీకు తెలుసా!?
ఆషాడంలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోతాం. మునగాకు తినాలని కూడా చెప్పారు పెద్దవాళ్లు. మహిళల ఆరోగ్యాన్ని సంప్రదాయాల పట్టికలో చేర్చారు. పెద్దవాళ్లు చెప్పిన పద్ధతులను పాటిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.కొబ్బరి మునగాకు వేపుడు..కావలసినవి..మునగాకు పావు కేజీ;పసుపు – పావు టీ స్పూన్;పచ్చి కొబ్బరి తురుము– పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు;ఉప్పు – అర టీ స్పూన్;మిరప్పొడి– టీ స్పూన్;నూనె – టేబుల్ స్పూన్;ఆవాలు– అర టీ స్పూన్;పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్;వెల్లుల్లి రేకలు– 4;కరివేపాకు– 2 రెమ్మలు.తయారీ..మునగాకులో పుల్లలు తీసివేసి, ఆకును శుభ్రంగా కడిగి నీరు పోయేటట్లు చిల్లుల పాత్రలో వేయాలి.అరగంటసేపు పక్కన ఉంచాలి. బాగా ఆరిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని అందులో కొబ్బరి తురుము, పసుపు వేసి కలపాలి.బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, మిరప్పొడి, కరివేపాకు వేసి వేయించాలి.అవి వేగిన తర్వాత ముందుగా కలిపి సిద్ధంగా ఉంచుకున్న మునగాకు, కొబ్బరి మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి సన్న మంట వేగనివ్వాలి.మధ్యలో మూత తీసి కలుపుతూ ఆకులో పచ్చిదనం, తేమ పోయే వరకు వేగనిచ్చి ఉప్పు సరిచూసుకుని ఆపేయాలి.మొరింగా ఆమ్లెట్..కావలసినవి..కోడిగుడ్లు – 2;మునగాకు – అర కప్పు;ఉప్పు – పావు టీ స్పూన్;మిరియాలపొడి– పావు టీ స్పూన్;వెన్న లేదా నెయ్యి– టేబుల్ స్పూన్.తయారీ..మునగాకులో పుల్లలు ఏరివేసి ఆకును శుభ్రంగా కడిగి నీరంతా పోయేటట్లు చిల్లుల పాత్రలో వేయాలి.నీరు కారిపోయిన తర్వాత తరిగి ఒక పాత్రలో వేయాలి.అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.ఆ తర్వాత కోడిగుడ్లు కొట్టి సొనవేసి కలపాలి.పెనం వేడిచేసి వెన్న లేదా నెయ్యి వేసి కరిగిన తర్వాత మునగాకు, కోడిగుడ్ల మిశ్రమాన్ని వేయాలి.ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి రెండోవైపు కూడా దోరగా కాలనిచ్చి స్టవ్ ఆపేయాలి. గమనిక: కోడిగుడ్డు సొన కాలే సమయంలో మునగాకు కూడా మగ్గిపోతుంది. పచ్చివాసన వస్తుందని సందేహం ఉంటే మునగాకును పెనం మీద పచ్చివాసన పోయే వరకు వేయించి ఆ తర్వాత మిగిలిన దినుసులను కలిపి ఆమ్లెట్ వేసుకోవాలి.ఇవి చదవండి: ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒక గడప దాటకూడదా? -
ఇటువంటి వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా?
మంచూరియా రోల్స్..కావలసినవి..చపాతీలు – 5 లేదా 6,మంచూరియా – అర కప్పు (నచ్చిన ఫ్లేవర్లో తయారుచేసుకోవచ్చు),ఉల్లికాడ ముక్కలు,కొత్తిమీర తురుము – అర టేబుల్ స్పూన్ చొప్పునటొమాటో సాస్,పుదీనా చట్నీ – కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి)నూనె – సరిపడాతయారీ..ముందుగా నచ్చిన విధంగా మంచూరియా చేసి పెట్టుకోవాలి.అదే సమయంలో చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి.అనంతరం చపాతీలు చేసుకుని.. వాటిని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి.ఒక్కో చపాతీపైన టొమాటో సాస్, పుదీనా చట్నీ రాసుకుని.. కొన్ని మంచూరియాలను అందులో పెట్టుకుని.. కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు జల్లుకుని.. రోల్స్లా చుట్టుకోవాలి.వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కమ్మగా ఉంటాయి.అల్లం స్వీట్..కావలసినవి..అల్లం – 2 కప్పులు (శుభ్రం చేసుకుని.. తొక్క తీసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి)పంచదార – 4 కప్పులు,ఏలకుల పొడి – కొద్దిగా,ఉప్పు – తగినంతనీరు – 2 కప్పులు,నెయ్యి – 4 టేబుల్ స్పూన్లుతయారీ..ముందుగా కళాయి వేడి చేసుకుని అందులో బెల్లం, పంచదార వేసి.. నీళ్లు పోయాలి. పంచదార, బెల్లం కరిగి.. సిరప్లా తయారవుతున్న సమయంలో అల్లం పేస్ట్, ఏలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసుకుని.. చిక్కబడే వరకు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.కాస్త దగ్గరపడే సమయంలో నెయ్యి వేసుకుని కాసేపు స్టవ్ మీద ఉంచి.. మరోసారి కలుపుకోవాలి.ఆ మిశ్రమం మొత్తం దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఏదైనా బౌల్కి లేదా ప్లేట్కి ఆయిల్ రాసి ఆ మిశ్రమాన్ని అందులోకి తీసుకోవాలి.సమాంతరంగా పరచి.. సుమారు 30 నిమిషాల పాటు చల్లారబెట్టి.. నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్.. జలుబు, దగ్గును దూరం చేస్తుంది.బ్రెడ్ – పిస్తా లడ్డూ..కావలసినవి..పిస్తా పేస్ట్ – 1 కప్పు (గ్రైండ్ చేసుకోవాలి)పిస్తా – పావు కప్పు (దోరగా వేయించి, పొడిలా మిక్సీ పట్టుకోవాలి)బ్రెడ్ పౌడర్ – పావు కప్పు (పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఓట్స్ పౌడర్ – పావు కప్పు (ఓట్స్ని వేయించి పౌడర్ చేసుకోవాలి)పల్లీలు – పావు కప్పు (దోరగా వేయించి.. తొక్క తీసి.. కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)కొబ్బరి పాలు – సరిపడాబాదం పౌడర్ – 4 టేబుల్ స్పూన్లు నెయ్యి – ఉండ చేసేందుకు చేతులకుబెల్లం లేదా పంచదార పాకం – కొద్దిగాతయారీ..ముందుగా ఒక బౌల్లో బ్రెడ్ పౌడర్, బాదం పౌడర్, ఓట్స్ పౌడర్, కచ్చాబిచ్చాగా చేసిన పల్లీలు, పిస్తా పేస్ట్ వేసుకుని.. కొద్దికొద్దిగా కొబ్బరి పాలు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి.ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని.. ఆ ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని.. పక్కన పెట్టుకోవాలి.ప్రతి లడ్డూకి.. బెల్లం లేదా పంచదార పాకంలో ముంచి.. పిస్తా పొడి పట్టించాలి. కాసేపు గాలికి ఆరనిచ్చి.. సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను.. -
ఆ ఉత్తరం ఈ దక్షిణం అన్ని రుచులూ అద్భుతః
మన వంటగదికి పొరుగింటి రుచిని అద్దుదాం. కేరళ కొబ్బరితో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పెరుగుతో పంజాబీ కడీ చేద్దాం. శనగలతో జైసల్మీర్ చనే కూడా ట్రై చేద్దాం. పిల్లలకు అన్ని రుచులూ అలవాటైతే... పై చదువులకు ఏ రాష్ట్రానికి వెళ్లినా సరే... మన ఇంట్లో భోజనం చేసినట్లే ఉంటుంది.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;నీరు– వంద మిల్లీలీటర్లు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా– చిటికెడు.తయారీ..బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీటలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.మిక్సీలో బియ్యంతోపాటు కొబ్బరి తురుము కూడా వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇది ఆపం పిండి ∙బాణలిలో నీటిని పోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి. రాత్రి గ్రైండ్ చేసి పెడితే ఉదయానికి పొంగుతుంది.ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో బాగా కలపాలి.మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి. అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసుకోవచ్చు.ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.ఈ ఆపం అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.నూనె వేయాల్సిన పని లేదు. ఆపం పెనం లేకపోతే దోశె పెనం (ఫ్లాట్గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు.పంజాబీ కడీ..కావలసినవి..– శనగపిండి మిశ్రమం కోసం: శనగపిండి– కప్పు;పెరుగు– 2 కప్పులు;నీరు– 4 కప్పులు;పసుపు– చిటికెడు.– కడీ కోసం: ఆవనూనె లేదా వేరుశనగ నూనె– టేబుల్ స్పూన్;పసుపు – అర టీ స్పూన్;ఇంగువ– పావు టీ స్పూన్;ఆవాలు – టీ స్పూన్;జీలకర్ర – టీ స్పూన్;మెంతులు – అర టీ స్పూన్;లవంగాలు – 3;ఎండుమిర్చి – 2;కరివేపాకు – 3 రెమ్మలు;ఉల్లిపాయ – 1 పెద్దది (తరగాలి);అల్లం– అంగుళం ముక్క (తరగాలి);వెల్లుల్లి– 4 రేకలు (తరగాలి);మిరపొ్పడి– అర టీ స్పూన్;ధనియాల పొడి –2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్;గరం మసాలా– అర టీ స్పూన్;ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు లేదా పచ్చి మామిడి గుజ్జు టేబుల్ స్పూన్;కసూరీ మేథీ (ఎండిన మెంతి ఆకుల పొడి)– 2 టీ స్పూన్.– తడ్కా కోసం: నూనె – టేబుల్ స్పూన్;ఎండుమిర్చి– 2;కశ్మీరీ మిర్చిపౌడర్– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– టేబుల్ స్పూన్తయారీ..ఒక పెద్ద పాత్రలో పెరుగు, శనగపిండి వేసి బాగా కలిసేటట్లు చిలకాలి. అందులో పసుపు వేసి, నీరు పోసి మళ్లీ చిలికి అరగంట సేపు పక్కన ఉంచాలి.స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి వేగనివ్వాలి.అవి వేగిన తర్వాత మిర్చిపౌడర్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి.ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి– పెరుగు మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించిన తర్వాత ఆమ్చూర్ పౌడర్, కసూరీ మేథీ, గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి.బాణలి పెట్టి నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, కశ్మీరీ మిర్చిపౌడర్ వేసి వేగిన తర్వాత ఉడికించిన కడీ మిశ్రమాన్ని పోసి చివరగా కొత్తిమీర చల్లితే పంజాబీ కడీ రెడీ.ఇది అన్నంలోకి బాగుంటుంది. పంజాబీ కడీలో నీరు ఎక్కువగా కలిపి పలుచగా చేసుకుని సూప్లా కూడా తాగుతారు.వర్షాకాలం, చలికాలం ఈ సూప్ తాగుతుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తేలిగ్గా, హాయిగా ఉంటుంది.జైసల్మీరీ చనే..కావలసినవి..ముడి శనగలు – కప్పు;నెయ్యి – టేబుల్ స్పూన్;ఇంగువ – చిటికెడు;జీలకర్ర– అర టీ స్పూన్;జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి – 2 టీ స్పూన్లు;మిరపొ్పడి – టేబుల్ స్పూన్;పసుపు– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పెరుగు– ఒకటిన్నర కప్పులు;శనగపిండి –3 టేబుల్ స్పూన్లు;కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..శనగలను శుభ్రంగా కడిగి ఆరింతలుగా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయం నీటిని వంపేసి మరోసారి కడిగి ప్రెషర్ కుకర్లో వేసి నాలుగు కప్పుల నీటిని పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.దించేసిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక వెడల్పు పాత్రలో శనగపిండి, పెరుగు, పసుపు, మిరపొ్పడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఇంగువ వేయాలి.జీలకర్ర చిటపట పేలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వేసి అడుగుపట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.ప్రెషర్కుకర్లో ఉడికించి సిద్ధంగా ఉంచిన శనగలను నీటితో సహా ఉడుకుతున్న శనగపిండి, పెరుగు మిశ్రమంలో వేసి కలిపి మరో ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ జైసల్మీరీ చనే కర్రీ రోటీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? -
కిచెన్ టిప్స్.. ఇక కల్తీ కథ కంచికే!
కల్తీ... కల్తీ... కల్తీ. కల్తీ లేని వస్తువు కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోంది. బతకాలంటే రోజుకు మూడుసార్లు తినాలి. హోటల్లో తిందామంటే పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం వంటల్లో రంగులేస్తారు. ఇంట్లో శుభ్రంగా వండుకుని తిందామంటే... వంట దినుసులు కల్తీ. మిరప్పొడి కొందామంటే అందమైన ప్యాకింగ్ మీద నోరూరించే ఎర్రటిరంగు ఫొటో ఉంటుంది.లోపల మిరప్పొడి ఏ రంగులో ఉందో కనిపించదు. ఇంటికి తెచ్చి ప్యాకెట్ తెరిచి చూస్తే ఒక్కోసారి రంపం పొట్టులా, ఇటుక పొడిలా నిర్జీవంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఎర్రటి ఎరుపుతో ఇది కారంపొడేనా లేక గోడలకేసే రంగా అన్నంత చిక్కగా ఉంటుంది. మనం దాదాపుగా వంటల్లో రోజూ వాడే ఐదు దినుసులను ఎలా పరీక్షించుకోవచ్చో చూద్దాం.మిరప్పొడి: ఒక కప్పు నీటిని తీసుకుని అందులో టీ స్పూన్ మిరప్పొడి వేయాలి. మిరప్పొడి నీటిమీద తేలుతూ ఉండి రేణువులు నీటిని పీల్చుకుంటూ మెల్లగా మిరప్పొడి మొత్తం కప్పు అడుగుకు చేరుతుంది. కల్తీ మిరప్పొడి అయితే నీటిలో వేయగానే అడుగుకు చేరుతుంది. అంతేకాదు, కప్పు అడుగుకు చేరేలోపు రంగు వదులుతూ నీటిని ఎర్రగా మారుస్తుంది.ఇంగువ: ఇంగువకు మండే గుణం ఎక్కువ. ఇంగువ కల్తీని తెలుసుకోవడానికి అదే మంచి గీటురాయి కూడా. ఇంగువను చిన్న ముక్క తీసుకుని మంట మీద పెడితే వెంటనే మంట అంటుకుని ఇంగువ ముక్క మండిపోతుంది. కల్తీ ఇంగువ అయితే వెంటనే మండదు. మంట మీద పెట్టి వెలిగించే ప్రయత్నం చేసినా సరే వెలగకుండా మాడిపోతుంది. ఇంగువ పొడి కొనేవాళ్లకు కూడా ఇదే చిట్కా. చిన్న పేపర్ మీద పావు టీ స్పూన్ ఇంగువ వేసి కాగితాన్ని వెలిగించాలి. కాగితంతోపాటే ఇంగువ కూడా మంటను ఆకర్షిస్తే అది అసలైన ఇంగువ. కాగితం మండిపోయి ఇంగువ పొడి నల్లబారి సరిగా మండకపోతే అది కల్తీ ఇంగువ అని అర్థం.మిరియాలు: మిరియాలలో కల్తీ ఎలా జరుగుతుందంటే... బొ΄్పాయి గింజలను కలుపుతారు. ఒక కప్పు నీటిలో టీ స్పూన్ మిరియాలు వేయాలి. మిరియాలు బరువుగా ఉంటాయి నేరుగా నీటి అడుగుకు చేరతాయి. బొ΄్పాయి గింజలు తేలిక. కాబట్టి అవి నీటిలో తేలుతాయి.జీలకర్ర: జీలకర్రలో ఏ గింజలు కలుపుతారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ అసలు జీలకర్ర, అందులో కలిపిన గింజలు ఒకేరకంగా కనిపించడానికి కొద్దిగా నల్లరంగు కలుపుతారు. జీలకర్రను పావు టీ స్పూన్ తీసుకుని అరచేతిలో వేసి బాగా రుద్దాలి. చేతులకు నలుపు అంటితే కల్తీ జీలకర్ర అని అర్థం.పసుపు: పసుపుకు కూడా రంగులద్దుతారు. అర టీ స్పూన్ పసుపును కప్పునీటిలో వేయాలి. మిరప్పొడి వలెనే ఇది కూడా నీటిని పీల్చుకుంటూ మెల్లగా నానుతూ అడుగుకు చేరుతుంది. రంగు కలిపిన పసుపు అయితే నీటి అడుగుకు చేరే లోపే రంగు వదులుతుంది. వేసిన వెంటనే నీరు చిక్కటి పసుపురంగులోకి మారుతాయి. -
చల్లని వాతావరణానికి.. కమ్మని 'గ్రీన్ కర్రీస్'!
వాతావరణం మారింది... వర్షాలు మొదలయ్యాయి. సీజనల్ కోల్డ్... ఇంకా అనుబంధ సమస్యలు కూడా. ఇమ్యూనిటీ పుష్కలంగా ఉండడమే అన్నింటికీ పరిష్కారం. ఆహారంలో రుచికి తోడుగా ఆరోగ్యాన్ని జోడించాలి. రోజూ ఏదో ఒక ఆకు కూర తింటే ఆరోగ్యం పరిపూర్ణం. రోజూ ఆకు కూరలేనా... అని పిల్లలు ముఖం చిట్లిస్తే... పిల్లలు ఇష్టపడే కాంబినేషన్లతో వండి పెట్టండి.ఆలూ మేథీ..కావలసినవి..బంగాళదుంప– 200 గ్రా;మెంతి ఆకు – మీడియం సైజు కట్ట ఒకటి;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 2 టేబుల్ స్పూన్లు;జీలకర్ర – టీ స్పూన్;ఇంగువ – పావు టీ స్పూన్;వెల్లుల్లి తరుగు – టీ స్పూన్;అల్లం తరుగు – టీ స్పూన్;పచ్చిమిర్చి తరుగు – టీ స్పూన్;ఎండుమిర్చి – 2; పసుపు – అర టీ స్పూన్;ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్లుతయారీ..– బంగాళదుంప ఉడికించి తొక్క తీసి ముక్కలు చేయాలి.– మెంతి ఆకులు వలిచి శుభ్రంగా కడిగి, నీరంతా పోయిన తర్వాత తరిగి పక్కన పెట్టుకోవాలి.– బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర వేయాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి సన్నమంట మీద వేయించాలి.– పసుపు, బంగాళాదుంప ముక్కలు వేయాలి. మసాలా దినుసులు ముక్కలకు పట్టేటట్లు మధ్య మధ్య కలియబెడుతూ ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి.– ఇప్పుడు ధనియాల పొడి, మెంతి ఆకు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి సన్నమంట మీద మగ్గనిచ్చి దించేయాలి. పిల్లల లంచ్ బాక్సుకు ఇది మంచి పోషకాహారం.క్యారట్ మొరింగా కర్రీ.. కావలసినవి..క్యారట్ – పావు కేజీ;మునగ ఆకు – వంద గ్రాములు;జీలకర్ర – అర టీ స్పూన్;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;పచ్చిమిర్చి – 4 (తరగాలి);వెల్లుల్లి రేకలు – 3 (తరగాలి);అల్లం తరుగు – టీ స్పూన్;పసుపు – పావు టీ స్పూన్;ధనియాల పొడి – 2 టీ స్పూన్లు;నూనె – 2 టీ స్పూన్లు.తయారీ..– క్యారట్ని శుభ్రం చేసి తరగాలి. మునగ ఆకును కడిగి నీరు పోయేటట్లు చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టాలి.– బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి, వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మీడియం మంట మీద రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి.– మునగాకు కలిపి రెండు నిమిషాలు(పచ్చివాసన పోయే వరకు) వేగిన తర్వాత క్యారట్ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి.– అరకప్పు నీరు పోసి కలిపి మూత పెట్టాలి. రెండు నిమిషాల్లో క్యారట్ ముక్కలు ఉడుకుతాయి.– మూత తీసి నీరు ఆవిరయ్యే వరకు కలిపి దించేయాలి. ఇష్టమైతే కూరలో చివరగా కొబ్బరి పొడి చల్లుకోవచ్చు. గమనిక: మునగ ఆకు లేకపోతే మెంతి ఆకుతో చేసుకోవచ్చు. -
ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?
హనీ– మిల్క్ పౌడర్ కప్ కేక్..కావలసినవి..తేనె– 1 కప్పు;మిల్క్ పౌడర్– 1 కప్పు;మైదా పిండి– అర కప్పు;పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్ స్పూన్లు;తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్ చొప్పున;తయారీ..ముందుగా ఒక బౌల్లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి.చల్లారాక క్రీమ్తో గార్నిష్ చేసుకుని, పైన గార్నిష్ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఎగ్ – బాదం హల్వా..కావలసినవి..గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;కస్టర్డ్ మిల్క్– పావు కప్పు;పంచదార– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);ఏలకుల పొడి– 1 టీ స్పూన్;నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు;కుంకుమ పువ్వు– చిటికెడు;వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;బాదంపప్పు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు);తయారీ..ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.అందులో కస్టర్డ్ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్వీట్కార్న్ ఇడియాప్పం..కావలసినవి..స్వీట్ కార్న్ జ్యూస్ (వడకట్టుకోవాలి);బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;జొన్న పిండి, ఓట్స్ పౌడర్– పావు కప్పు చొప్పున:జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;ఎల్లో ఫుడ్ కలర్– కొద్దిగా (అభిరుచి బట్టి);తయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్కార్న్ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని, మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత ఇడ్లీ పాన్ లేదా పెద్ద బౌల్కి బ్రష్తో నెయ్యి పూసుకోవాలి.అనంతరం మురుకుల మేకర్కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్లో నూడుల్స్లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!? -
చింత చిగురు తోడైతే.. చింత లేని వంట!
సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి... సీజనల్ వెజిటబుల్స్ ఉంటాయి. అలాగే సీజనల్ ఆకులూ ఉంటాయి...చింతచిగురు నోరూరిస్తోంది. ఎప్పుడూ చింతచిగురు పప్పేనా! ఈ సారి ఇలా ట్రై చేద్దాం. ఓ పచ్చడి... ఓ పొడి... ఓ అన్నం... ఓ కూర. వెరైటీగా ఏం వండాలా అనే చింత వద్దు. చింత ఉంది చిరుపుల్లగా... జిహ్వకు హితవుగా.చింతచిగురు కొబ్బరి పచ్చడి..కావలసినవి..చింత చిగురు – 2 కప్పులు (శుభ్రంగా కడగాలి);పచ్చి కొబ్బరి ముక్కలు – కప్పు;పచ్చిమిర్చి – 2;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పోపు కోసం..ఆవాలు – అర టీ స్పూన్;ఇంగువ – చిటికెడు;కరివేపాకు – 2 రెమ్మలు;మినప్పప్పు – అర టీ స్పూన్;ఎండుమిర్చి – 2;నూనె – అర టీ స్పూన్;తయారీ..కొబ్బరిముక్కలు, చింతచిగురు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి.చిన్న పాత్రలో నూనె వేసి చిన్న మంట మీద వేడి చేసి అందులో ఆవాలు వేసి అవి వేగిన వెంటనే ఎండుమిర్చి (విరిచి ముక్కలు చేసి వేయాలి), మినప్పప్పు వేసి ఎర్రగా వేగిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.పోపును స్పూన్తో కలిపి అందులో మిక్సీలో గ్రైండ్ చేసిన కొబ్బరి పచ్చడి వేసి కలపాలి.ఘుమఘుమలాడే కొబ్బరి పచ్చడి రెడీ.ఇది ఇడ్లీ, దోశెలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.చింత చిగురు పొడి..కావలసినవి..చింత చిగురు – కప్పు;ఎండుమిర్చి – 7 లేదా 8;ఎండు కొబ్బరి – అర చిప్ప;వెల్లుల్లి రేకలు – 4;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినంత;తయారీ..చింత చిగురును మంచినీటితో శుభ్రం చేసి నీడలో ఆరబెట్టాలి.స్టవ్ మీద మందపాటి బాణలి వేడి చేసి సన్నమంట మీద చింత చిగురులో తేమ పోయే వరకు వేయించాలి.వేగిన ఆకును ఒక ప్లేట్లోకి తీసుకుని అదే బాణలిలో ఎండుమిర్చి, కొబ్బరి వేసి వేయించాలి.అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం పలుకుగా గ్రైండ్ చేయాలి.ఉప్పు, వెల్లుల్లి వేసి మరో రౌండ్ గ్రైండ్ చేస్తే చింత చిగురు పొడి రెడీ.వేడి అన్నంలో చింతచిగురు పొడి, నెయ్యి కలుపుకుంటే రుచి అమోఘం.ఇడ్లీ, దోశెల్లోకి కూడా బాగుంటుంది.ఈ పొడిని గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే పది రోజుల వరకు తాజాగా ఉంటుంది.ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు. -
ఈ టేస్టీ స్నాక్స్తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..!
క్యాలెండర్ పేజీ తిప్పమంటోంది. జూన్కి స్వాగతం పలకాల్సిందే. కొత్త టైమ్టేబుల్నీ స్వాగతించాల్సిందే. లంచ్ బాక్సు... స్కూల్కి రెడీ అయిపోతుంది. పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఇవిగో వీటిని మన వంటింట్లో ట్రై చేయండి..బ్రెడ్ పొటాటో రోల్..కావలసినవి..బంగాళదుంపలు– 3 (మీడియం సైజువి);క్యారట్ తురుము లేదా పచ్చి బఠాణీలు – అర కప్పు ;మిరప్పొడి– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పసుపు – చిటికెడు;నిమ్మరసం –పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;బ్రెడ్ స్లయిస్లు – 10;వెన్న – టేబుల్ స్పూన్ – 2 టేబుల్ స్పూన్లు;పాలు– అర కప్పు; మొక్కజొన్న పిండి లేదా మైదా లేదా శనగపిండి– 2 టేబుల్ స్పూన్లు (బ్రెడ్ స్లయిస్లను రోల్ చేసి అతికించడానికి).తయారీ..బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్క తీసి చిదిమి ఒకపాత్రలో వేసుకోవాలి.క్యారట్ లేదా బఠాణీలను ఉడికించి పక్కన పెట్టాలి.ఇప్పుడు చిదిమిన బంగాళదుంప గుజ్జులో మిరప్పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం, ఉడికించిన క్యారట్ లేదా బఠాణీలను వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదమాలి.ఉప్పు, కారం సరి చూసుకుని అవసరమైతే మరికొంత చేర్చుకోవచ్చు.ఈ మిశ్రమాన్ని పది సమభాగాలుగా చేయాలి. ఒక్కో భాగాన్ని ఓవల్ షేప్ (దొండకాయ ఆకారం)లో చేయాలి.బ్రెడ్ అంచులు కట్ చేసి తీసేసిన తర్వాత బ్రెడ్ స్లయిస్ని పూరీల పీట మీద పెట్టి రోలర్తో వత్తాలి.ఇలా చేయడం వల్ల గుల్లబారి ఉన్న బ్రెడ్ చపాతీలాగ పలుచగా వస్తుంది.పాలలో బ్రష్ ముంచి ఈ స్లయిస్ల మీద చల్లాలి లేదాపాలలో వేళ్లు ముంచి బ్రెడ్ స్లయిస్ మీద చల్లి తడిపొడిగా ఉండేటట్లు మునివేళ్లతో అద్దాలి.బ్రెడ్ చివర్లు అతికించడం కోసం తీసుకున్న పిండిలో నీరుపోసి గరిట జారుడుగా కలుపుకోవాలి.ఇప్పుడు బ్రెడ్ స్లయిస్ మీద బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి అంచులకు పిండి ద్రవాన్ని అద్దుతూ అతికిస్తే బ్రెడ్రోల్ రెడీ.వీటిని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. బయటే ఉంచినప్పుడు ఒకవేళ కాల్చడం ఆలస్యం అయితే బ్రెడ్ అంచులు ఎండిపోయి రోల్ ఊడిపోతుంది.పెనం వేడి చేసి వెన్న రాసి బ్రెడ్ రోల్స్ను ఒకదాని పక్కన ఒకటిగా అమర్చాలి. దోరగా కాలేకొద్దీ మరొక వైపుకు తిప్పుతూ అన్ని వైపులా కాలేటట్లు చూడాలి.పెనం మీద కాల్చినప్పుడు నూనెలో రోస్ట్ చేసినట్లు రోల్ అంతా సమంగా ఒకే రంగులో ఉండదు. కానీ లోపల మిశ్రమం ఉడికిపోతుంది. రోల్ పై భాగం కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.మొత్తంగా ఒకేరంగులో ఉండాలంటే బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి మరిగించి అందులో నాలుగు రోల్స్ వేసి అవి కాలిన తర్వాత మరికొన్ని వేస్తూ కాల్చుకోవచ్చు.ఇలా చేసినప్పుడు నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే అదనంగా ఉన్న నూనెను పేపర్ పీల్చుకుంటుంది.ఒవెన్లో అయితే... 200 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేసి బేకింగ్ ట్రేలో రోల్స్ను అమర్చి పది నుంచి పన్నెండు నిమిషాల సేపు బేక్ చేయాలి.చీజ్ బాల్స్..కావలసినవి..బంగాళదుంపలు –పావు కేజీ;వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్;ఉప్పు –పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి – అర టీ స్పూన్;మిరియాల పొడి –పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;బ్రెడ్ క్రంబ్స్ – 6 టేబుల్ స్పూన్లు;నూనె – వేయించడానికి తగినంత.స్టఫింగ్ కోసం.. చీజ్ – 100 గ్రాములు;ఎండిన పుదీన – అర టీ స్పూన్ (ఆకులను అరచేతిలో వేసి వేళ్లతో నలిపి పొడి చేయాలి);రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి –పావు టీ స్పూన్;మిరియాల పొడి–పావు టీ స్పూన్, గరం మసాలా పొడి– చిటికెడు.కోటింగ్ కోసం.. కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు;ఎగ్ – ఒకటి (ఎగ్ వేయనట్లయితే మరో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి);బ్రెడ్ క్రంబ్స్– అర కప్పు.తయారీ..బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించి, వేడి తగ్గిన తర్వాత తొక్క తీసి చిదమాలి.అందులో వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, బ్రెడ్ క్రంబ్స్ వేసి సమంగా కలిసేటట్లు చిదిమి ఒకసారి రుచి చూసుకుని అవసరమైతే ఉప్పు, కారం కలుపుకుని మిశ్రమం మొత్తాన్ని బాల్స్ చేసి ఆరిపోకుండా ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలి.స్టఫింగ్ కోసం తీసుకున్న వాటిలో చీజ్ తప్ప మిగిలిన అన్నింటినీ ఒకపాత్రలో వేసి కలపాలి. అందులో చీజ్ ని అర అంగుళం ముక్కలుగా కట్ చేసి వేసిపాత్రను కొద్దిగా కదిలిస్తూ మసాలా పొడులు చీజ్ ముక్కలకు పట్టేలా చేసి వేడి తగలకుండా స్టవ్కు దూరంగా ఉంచాలి.ఇప్పుడు బంగాళదుంప బాల్స్ ఒక్కొక్కటిగా తీసుకుని అరచేతిలో పెట్టి వేళ్లతో చిన్న పూరీలా వత్తి అందులో మసాలా పట్టించిన చీజ్ ఒక ముక్క పెట్టి బంగాళాదుంప మిశ్రమం పూరీ అంచులను మూసేస్తూ బాల్ చేయాలి.ఇలా అన్నింటినీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో కార్న్ఫ్లోర్ వేసి అందులో ఒక్కో బాల్ని వేస్తూ మెల్లగా వేళ్లతో కదిలిస్తూ పిండి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.మరొక ప్లేట్లో బ్రెండ్ క్రంబ్స్ వేసుకుని కార్న్ఫ్లోర్ పట్టించిన బాల్స్ని వేసి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.కోడిగుడ్డు సొనను ఒక గిన్నెలో వేసి గిలక్కొట్టాలి.ఎగ్ వాడనట్లయితే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ను తగినంత నీటితో గరిటజారుడుగా కలుపుకోవాలి.పొడి కార్న్ఫ్లోర్ పట్టించిన బంగాళాదుంప– చీజ్ బాల్స్ని కార్న్ఫ్లోర్ ద్రవం లేదా కోడిగుడ్డు సొనలో ముంచి తీసి పదినిమిషాల సేపు ఆరనివ్వాలి.ఈ లోపు బాణలిలో నూనె వేడి చేయాలి. ఒక్కో బాల్ను జాగ్రత్తగా నూనెలో వేసి మీడియం మంట మీద బాల్ అన్ని వైపులా సమంగా కాలిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.బాల్స్ మీద టిష్యూ పేపర్ని కప్పి ఉంచితే అదనపు ఆయిల్ వదులుతుంది.బంగాళాదుంప– చీజ్ బాల్స్ని టొమాటో సాస్ లేదా కెచప్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: చూపులను కట్టడి చేసేలా! -
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలను గురించి మీరెప్పుడైనా విన్నారా! ఆమ్లెట్ వేయడంలో కొత్తదనం.., బాదం క్రిస్పీ చికెన్ మరెంతో స్పెషల్.., సోయా అంజీరా హల్వాలు నోరూరించే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి వంట వార్పు చేయాల్సిందే!కోకోనట్ ఆమ్లెట్..కావలసినవి..గుడ్లు – 5కొబ్బరి కోరు – పావు కప్పుఉల్లిపాయ ముక్కలు – 2 టీ స్పూన్లు (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)హెవీ క్రీమ్ – అర టేబుల్ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది)పంచదార – 2 లేదా 3 టీ స్పూన్లుబటర్ – 2 టేబుల్ స్పూన్లు (కరిగింది, నూనె కూడా వాడుకోవచ్చు)ఉప్పు – కొద్దిగాతయారీ..– ముందుగా ఒక బౌల్లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, పంచదార, హెవీ క్రీమ్ వేసుకుని.. అందులో గుడ్లు పగలగొట్టి.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం పాన్ లో బటర్ లేదా నూనె వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని.. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్లా పరచి.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి.– ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఈ మిశ్రమంతో మొత్తం ఒకే అట్టులా కాకుండా.. రెండు లేదా మూడు చిన్నచిన్న ఆమ్లెట్స్లా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్.బాదం క్రిస్పీ చికెన్..కావలసినవి..బోన్ లెస్ చికెన్ – 3 లేదా 4 పీసులు (పలుచగా, పెద్దగా కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి)మొక్కజొన్న పిండి – 6 టేబుల్ స్పూన్లుగోధుమ పిండి – 1 టేబుల్ స్పూన్బాదం – అర కప్పు (దోరగా వేయించి.. బ్రెడ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఎండుమిర్చి – 2 (కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలి)గుడ్లు – 2, బాదం పాలు – 3 టీ స్పూన్లుమిరియాల పొడి – కొద్దిగాఉప్పు – తగినంతనూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్లో మొక్క జొన్న పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, ఎండు మిర్చి పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.– మరో బౌల్లో గుడ్లు పగలగొట్టి.. బాగా గిలకొట్టి.. అందులో బాదం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని.. అందులో బాదం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని.. దానికి మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని బాగా పట్టించాలి.– అనంతరం దాన్ని గుడ్డు–బాదం పాల మిశ్రమంలో ముంచి, వెంటనే బాదం పొడి పట్టించి.. నూనెలో దోరగా వేయించి.. సర్వ్ చేసుకోవాలి.సోయా అంజీరా హల్వా..కావలసినవి..డ్రై అంజీరా – 20 లేదా 25 (15 నిమిషాలు నానబెట్టుకోవాలి)కిస్మిస్ – 15 (నానబెట్టి పెట్టుకోవాలి)సోయా పాలు – అర కప్పుఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)జీడిపప్పు, బాదం, పిస్తా – కొద్దికొద్దిగా (నేతిలో దోరగా వేయించి.. చల్లారాక కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)నెయ్యి, పంచదార – సరిపడాగసగసాలు లేదా నువ్వులు – కొద్దిగా గార్నిష్కితయారీ..– ముందుగా అంజీరా, కిస్మిస్ రెండూ కలిపి.. మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి.– ఈలోపు కళాయిలో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని అందులో.. అంజీరా మిశ్రమాన్ని వేసుకుని చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.– దగ్గర పడుతున్న సమయంలో సోయా పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని మళ్లీ దగ్గరపడే వరకు చిన్న మంట మీద.. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి.– అనంతరం సరిపడా పంచదార, ఫుడ్ కలర్ వేసుకుని.. బాగా తిప్పాలి. టేస్ట్ చూసుకుని పంచదార, నెయ్యి అభిరుచిని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చు.– కాస్త దగ్గర పడుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి.. కాసేపు అలానే గాలికి వదిలిపెట్టాలి.– దగ్గరపడి, చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని.. మొత్తం మిశ్రమాన్ని రోల్స్లా చుట్టుకుని.. గసగసాల్లో లేదా వేయించిన నువ్వుల్లో దొర్లించాలి. అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకోవాలి.ఇవి చదవండి: ఈ మినీ మెషిన్తో.. స్కిన్ సమస్యలకు చెక్! -
ఆవురావురుగా... కమ్మని ఆవకాయ!
ఎండాకాలం... మే నెల సగం అయిపోయింది. మామిడి కాయలు టెంక కట్టి ఎదురు చూస్తున్నాయి. జాడీలు స్నానాలు చేసి ఎండలో సేదదీరుతుంటాయి. ఇంట్లో మిక్సీలు గిర్ర్ర్ అంటూ గోల చేస్తుంటాయి. మామిడి కాయలు కొట్టే కత్తి పుల్లబారి పదునుదేలింది. ముక్కలు కొట్టండి... పళ్లెంలో వేయండి... కారం కలపండి. జాడీలకెత్తండి... పళ్లెంలో వేడి వేడి అన్నం వేసి కలపండి. ఇంటిల్లిపాదీ ఆవురావురుమని తినకపోతే అడగండి.ఆంధ్రా ఆవకాయ..కావలసినవి..పచ్చి మామిడి ముక్కలు – కేజీ;పచ్చి శనగలు – 50 గ్రాములు;సన్న ఆవాలు –పావు కేజీ;మెంతులు – రెండు టేబుల్ స్పూన్లు;గుంటూరు మిరపపొడి –పావు కేజీ;ఉప్పు – నూట యాభై గ్రాములు;పసుపు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె –పావు కేజీ.తయారీ..ఆవకాయ పెట్టడానికి ముందు రోజు మిరపకాయలు, ఆవాలు, మెంతులను విడిగా ఎండబెట్టాలి. మరునాడు ఉదయం ఆవాలను మిక్సీలో పొడి చేయాలి. మిరపపొడి రెడీమేడ్ది కూడా తీసుకోవచ్చు. కానీ ఆవాలు స్వయంగా చేసుకోవాలి.మామిడి కాయలను కడిగి తేమపోయే వరకు తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత కాయలకున్న తొడిమ తొలగించాలి.అప్పటికీ సొన కారుతుంటే శుభ్రమైన నూలు వస్త్రంతో తుడిచేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న మామిడికాయలను టెంకతో సహా చిన్న ముక్కలు చేసుకోవాలి.శనగలను శుభ్రమైన వస్త్రంతో తుడిచి పక్కన పెట్టాలి.వెడల్పుగా ఉన్న పెద్దపాత్రలో మామిడి ముక్కలు వేయాలి. అందులో శనగలు, ఆవాల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.మెంతులు కూడా వేసి బాగా కలపాలి. చివరగా నూనెపోసి ముక్కలకు ఒత్తిడికి కలగకుండా అడుగు నుంచి కలిపితే ఆవకాయ రెడీ. దీనిని పింగాణి జాడీలో పెట్టి అంచులకు తెల్లని శుభ్రమైన నూలు వస్త్రాన్ని కట్టాలి.ఆ పైన మూత పెట్టాలి. ఈ జాడీలోని ఆవకాయను రోజూ మూత తీయకూడదు. రోజువారీ వాడుకకు అవసరమైనంత చిన్న జాడీలోకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.బెల్లం ఆవకాయ..కావలసినవి..మామిడి ముక్కలు – అర కేజీ; బెల్లం – అర కేజీ;మిరపపొడి– 200 గ్రాములు;ఉప్పు – 200 గ్రాములు;ఆవపిండి– 100 గ్రాములు;నూనె – 200 గ్రాములు.తయారీ..మామిడి కాయలను శుభ్రంగా కడిగి తుడిచి టెంకతో సహా ముక్కలు చేసుకోవాలి.బెల్లాన్ని తురిమి వెడల్పుపాత్రలో వేసి అందులో మామిడికాయ ముక్కలు, ఆవపిండి, మిరపపొడి, ఉప్పు, కప్పు నూనె వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు ఎండలో పెట్టాలి. బెల్లం కరిగిపాకంలా జిగురుగా వచ్చినట్లనిపిస్తే సరే, లేకపోతే మూడవ రోజు కూడా ఎండలో పెట్టాలి.పాకం వచ్చిన తర్వాత మిగిలిన నూనె కూడా వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి.ఈ బెల్లం ఆవకాయను పిల్లలు బాగా ఇష్టపడతారు. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మహిళలు రోజూ తీసుకోవచ్చు.నువ్వుల ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు – 3 కప్పులు;నువ్వులు – ఒకటిన్నర కప్పులు;మిరపపొడి– ముప్పావు కప్పు;ఉప్పు–పావు కప్పు;పసుపు – అర టీ స్పూన్;వేరు శనగ నూనె – ఒకటిన్నర కప్పులు.తయారీ..నువ్వులను తయారీ దోరగా వేయించి చల్లారిన పొడి చేయాలి.మామిడి ముక్కలను వెడల్పుపాత్రలో వేసి అందులో నువ్వుల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.ఉప్పు, కారం, నువ్వుపిండి సమంగా కలిసిన తర్వాత కప్పు నూనెపోసి మళ్లీ కలపాలి.ఈ మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని, మిగిలిన నూనెను పైన తేలేటట్లుపోయాలి.ఇందులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు –పావు కేజీ లేదా (మీడియం సైజు కాయలు 3);వెల్లుల్లి – 200 గ్రాములు;ఉప్పు – 100 గ్రాములు;మిరపపొడి– 200 గ్రాములు;ఆవాలు – 150 గ్రాములు (ఎండబెట్టి పొడి చేయాలి);పసుపు – టీ స్పూన్;మెంతులు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – కిలో.తయారీ..ఒకపాత్రలో నూనెపోసి మామిడి ముక్కలను వస్త్రంతో తుడిచి నూనెలో వేయాలి.వెల్లుల్లిపాయలను పొట్టు వలిచి ఒక ప్లేట్లో వేసి గాలికి ఆరనివ్వాలి.మరొకపాత్రలో మిరపపొడి, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి సమంగా కలిసేవరకు కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలను వేసి కలపాలి.మామిడి ముక్కల లోని నూనెను ఒక జాడీలోకి వంపాలి. ఇప్పుడు మామిడి ముక్కలలో ముందుగా కలిపి సిద్ధంగా ఉంచిన ఉప్పు, వెల్లుల్లి ఇతర పొడుల మిశ్రమాన్ని వేసి పొడులన్నీ మామిడి ముక్కలకు పట్టేలా కలపాలి.మామిడి ముక్కలను పట్టి ఉన్న నూనె ఈ పొడులను పీల్చుకుని కొంత తడి పొడిగా మారుతుంది.ఈ మిశ్రమాన్ని నూనె వంపుకున్న జాడీలో వేసి అదమాలి.నూనె పైకి తేలుతుంది. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్. రక్తాన్ని పలచబరిచి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ హాయిగా తినవచ్చు. -
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
మే నెల వచ్చేసింది... ఎండలు మండుతున్నాయి. భోజనం చేయాలంటే చెమటలు పడుతున్నాయి. కూరలను చూస్తేనే ఆకలి పోయి దాహం వేస్తోంది. నేరుగా మజ్జిగలోకి వెళ్లాలనిపించేంత దాహం అది. అందుకే పెరుగుతోనే కూరలు చేసుకుందాం. ఇవన్నీ నాలుకకు హితవుగా ఉంటాయి. తిన్న తర్వాత పొట్టను చల్లగా ఉంచుతాయి.దహీ బైంగాన్..కావలసినవి.. వంకాయ – 1 (మీడియం సైజు); నూనె – టేబుల్ స్పూన్ (వంటకు ఉపయోగించే నూనె ఏదైనా) ; ఆవనూనె – టేబుల్ స్పూన్ (పోపు కోసం) ; యాలకులు – 2 ; లవంగాలు – 2 ; పెరుగు – పావు లీటరు (చిలకాలి). గ్రేవీ కోసం: మెంతిపిండి – టేబుల్ స్పూన్ ;అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్ ; కశ్మీర్ మిర్చిపౌడర్ – టేబుల్ స్పూన్ ; నీరు – కప్పు (పై వన్నీ కలపడానికి) ; ఇంగువ– చిటికెడు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; పసుపు – టీ స్పూన్.తయారీ..ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో మెంతిపిండి, మిర్చిపౌడర్, అల్లం పేస్టు వేసి కలపాలి.వంకాయను మందపాటి చక్రాల్లా తరిగి ఉప్పు రాయాలి.నూనె వేడి చేసి వంకాయ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి(ఎయిర్ ఫ్రయర్ ఉంటే నూనె లేకుండా ఫ్రై చేసుకోవచ్చు)అదే బాణలిలో మిగిలిన నూనెలో ఆవ నూనె వేసి వేడెక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, ఇంగువ వేయాలిఇందులో మెంతిపిండి, అల్లం, మిరప్పొడి కలిపిన మిశ్రమం, పసుపు వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలిఆ మిశ్రమం వేడెక్కిన తర్వాత పెరుగు వేసి గరిటెతో కలుపుతూ ఐదారు నిమిషాల పాటు మరిగించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మరో కప్పు నీటిని పోసి కలిపితే చిక్కటి గ్రేవీ తయారవుతుందిఇప్పుడు ఉప్పు కలిపి గ్రేవీ చిక్కదనాన్ని సరిచూసుకుని అవసరమైతే మరికొన్ని నీటిని పోసి మరగనివ్వాలిఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి కలిపి వడ్డించాలిఇది అన్నంలోకి రోటీకి కూడా మంచి కాంబినేషన్.పులిస్సెరి..కావలసినవి.. పెరుగు – పావు లీటరు ; పసుపు – పావు టీ స్పూన్ ; నీరు – పావు లీటరు. కొబ్బరి పేస్టు కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు ; పచ్చిమిర్చి– 3 ; జీలకర్ర– టీ స్పూన్; నీరు – కప్పు లేదా కొబ్బరి పేస్టు చేయడానికి తగినంత.పోపు కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు (వంటకు ఉపయోగించే కొబ్బరి నూనె లేదా ఇతర వంట నూనె) ; ఆవాలు – అర టీ స్పూన్ ; కరివేపాకు – 2 రెమ్మలు ; మెంతులు– పావు టీ స్పూన్ ; ఎండుమిర్చి– 2 ; ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు ; అల్లం – అర అంగుళం ముక్క (సన్నగా తరగాలి) ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీలో గ్రైండ్ చేయాలి. తగినంత నీటిని వేస్తూ మెత్తగా చేసుకోవాలిఒక పాత్రలో పెరుగు, పసుపు, నీరు కలిపి చిలికి అందులో ఉప్పు, కొబ్బరి పేస్టు వేసి కలపాలిఈ పాత్రను స్టవ్ మీద పెట్టి మీడియం మంటమీద మధ్యలో గరిటెతో కలుపుతూ వేడిచేయాలి.దీనిని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మరగడం మొదలైన వెంటనే దించేయాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు వేసి చిన్న మంట మీద మగ్గనివ్వాలిఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత పోపును ముందుగా వేడి చేసి సిద్ధంగా ఉంచిన పెరుగు– కొబ్బరి పేస్టు మిశ్రమంలో కలిపి, కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. ఈ కేరళ వంట అన్నంలోకి రుచిగా ఉంటుంది.గుజరాతీ కడీ..కావలసినవి: శనగపిండి– 4 టేబుల్ స్పూన్లు; అల్లం పచ్చిమిర్చి పేస్ట్– అర టేబుల్ స్పూన్ (అల్లం అంగుళం ముక్క, రెండు పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేయాలి); తాజా పెరుగు – కప్పు ; బెల్లం లేదా చక్కెర – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నీరు – రెండున్నర కప్పులు. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ; ఆవాలు – అర టీ స్పూన్ ; జీలకర్ర– అర టీ స్పూన్ ; దాల్చిన చెక్క – అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; కరివేపాకు – ఒక రెమ్మ ; ఎండు మిర్చి – 2; మెంతులు – పావు టీ స్పూన్ ; ఇంగువ – చిటికెడు ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..ఒక పాత్రలో శనగపిండి, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, బెల్లం, ఉప్పు వేసి బాగా చిలకాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలిఅవి పేలిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, ఎండు మిర్చి (విరిచి వేయాలి), మెంతులు, ఇంగువ వేసి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలిఈ పోపును ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగు – శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలిఇప్పుడు ఆ పాత్రను మీడియం మంట మీద ఉంచి మిశ్రమం అడుగుకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి కలుపుతూ మాడకుండా చూసుకోవాలిశనగపిండి పచ్చి వాసన పోయిన తర్వాత మిశ్రమం మంచి రుచికరమైన వాసన వస్తుంటుంది. అప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలిగుజరాతీ కడీని సూప్లాగ భోజనానికి ముందు తాగవచ్చు. అన్నంలో కలుపుకోవచ్చు, రోటీలోకి కూడా తినవచ్చు. ఇది వేసవి, శీతాకాలాల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారం.గుజరాతీ కడీ, కుకురార్కుకురార్..కావలసినవి.. చికెన్ – అర కేజీ ; చిక్కటి పెరుగు – 5 టేబుల్ స్పూన్లు ; బంగాళదుంప – 2 (ముక్కలుగా తరగాలి) ; అల్లం వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు ; ఉల్లిపాయలు – 3 (తరగాలి) ; ఆవ నూనె లేదా సాధారణ వంటనూనె – 5 టేబుల్ స్పూన్లు ; చక్కెర – చిటికెడు ; ఉప్పు – 2 టీ స్పూన్లు లేదా రుచిని బట్టి ; ఎండు మిర్చి– 5 ; పచ్చిమిర్చి– 3 (నిలువుగా చీరాలి) ; పసుపు – టీ స్పూన్ ; మిరప్పొడి– 2 టీ స్పూన్లు ; గరం మసాలా పొడి – టీ స్పూన్ ; చికెన్ మసాలా పొడి– టీ స్పూన్ ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..చికెన్ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేయాలి.అందులో పసుపు, చికెన్ మసాలా పొడి, మిరప్పొడి వేసి మసాలా పొడులు చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లు కలిపి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలిఈ లోపు ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఇంగువ, చక్కెర, ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలిఇవి చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి.అందులోనే పెరుగు కూడా వేసి సమంగా కలిసేటట్లు ఒకసారి తిప్పి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన పెట్టాలిఉల్లిపాయలు వేయించిన బాణలిలో మిగిలిన నూనెలో బంగాళాదుంప ముక్కలు వేయించి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలిఅదే బాణలిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయించి తీసి పెట్టుకోవాలిఇప్పుడు మిగిలిన నూనెలో మారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలిచికెన్ ముక్కలు ఎర్రగా వచ్చేవరకు వేయించి అప్పుడు ఉప్పు వేసి ముక్కలకు పట్టేటట్లు కలపాలిచికెన్ ముక్కల నుంచి నూనె వేరవుతున్న సమయంలో బంగాళాదుంప ముక్కలను వేయాలిఈ రెండింటినీ కలిపి పది నిమిషాల పాటు వేయించిన తర్వాత అందులో రెండు కప్పుల నీరు పోసి కలిపి మంట పెంచి ఉడకనివ్వాలిచికెన్ ఉడికేటప్పుడు అందులో ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చితోపాటు గరం మసాలా పొడి, చిలికిన పెరుగు మిశ్రమాన్ని వేయాలిఇవన్నీ కలిసి ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. ఈ కుకురార్ అస్సాం వాళ్ల వంట. అన్నం, రోటీల్లోకి రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు.. -
ఈ వంటకాలను ఎప్పుడైనా ట్రై చేశారా..!
మారుతున్న అభిరుచులనుబట్టి వంటకాలలో కూడా కొత్త కొత్త పద్ధతుల అనుసరిస్తున్నారు. ఆ పద్ధతులనుగుణంగా రుచులలో కూడా కొత్తదనం కనిపిస్తుంది. ఎన్నడూ ఇటువంటి కమ్మని రుచులను చూడలేదనే విధంగా సరికొత్త వంటలు ఎదురుపడుతున్నాయి. మరి ఆ విధానాలననుసరించి మనం కూడా తయారుచేద్దామా.. స్వీట్ కార్న్ రైస్ కేక్..కావలసినవి..స్వీట్ కార్న్ – 2 (మెత్తగా ఉడికించి.. చల్లారక గింజలు ఒలిచి పెట్టుకోవాలి); బియ్యప్పిండి – 2 కప్పులు; జొన్న పిండి– పావు కప్పు; గుడ్డు – తెల్లసొన (అభిరుచిని బట్టి); చీజ్ తురుము – కొద్దిగా; బటర్ – కొద్దిగా; పంచదార – ఒకటిన్నర కప్పులు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు); చిక్కటి పాలు – పావు లీటర్ (కాచి చల్లార్చినవి).తయారీ..ముందుగా స్వీట్ కార్న్ గింజల్ని.. పాలతో కలిపి మిక్సీ పట్టుకోవాలి.అందులోనే జొన్నపిండి, బియ్యప్పిండి, చీజ్ తురుము, బటర్ వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి.ఆ మిశ్రమం పలుచగా ఉంటే కొద్దిగా బియ్యప్పిండి, గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్లా చేసుకుని.. ఆ మిశ్రమాన్ని కేక్ బౌల్లో వేసుకుని బేక్ చేసుకోవాలి.అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకుని తినొచ్చు.లేదంటే.. క్రీమ్స్ సాయంతో బర్త్డే కేక్లా కూడా చేసుకోవచ్చు.మీల్మేకర్ సమోసా..కావలసినవి.. మీల్మేకర్ – పావు కప్పు (వేడి నీళ్లల్లో శుభ్రం చేసుకుని, ఉడికించి, చల్లారాక తురుములా చేసుకోవాలి); మైదా పిండి – పావు కిలో; రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్; సోయాసాస్ – 2 టీ స్పూన్లు; వాము – అర టీ స్పూన్; అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్; క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, ఉల్లికాడ ముక్కలు – 3 టీ స్పూన్ల చొప్పున; మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్ (కొద్దిగా నీళ్లు కావాలి); ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడాతయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ, ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఒక కళాయిలో నూనె వేసుకుని, వేడి కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, ఉల్లికాడ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి బాగా వేయించాలి.తర్వాత సరిపడా ఉప్పు, కొద్ది నీళ్లల్లో కలిపిన మొక్కజొన్న పిండి, మీల్ మేకర్ తురుము వేసుకుని.. గరిటెతో నిమిషం పాటు అటూ ఇటూ తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి.పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల ఆ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసెయ్యాలి.అలా తయారు చేసుకున్న సమోసాలను నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.రా బనానా – కోకోనట్ కట్లెట్..కావలసినవి.. కొబ్బరి కోరు – పావు కప్పు; అరటికాయ ముక్కలు – పావు కిలో (బాగా శుభ్రం చేసుకుని మెత్తగా ఉడికించి, చల్లారక ముద్దలా చేసుకోవాలి); అల్లం తరుగు – కొద్దిగా; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; పచ్చిమిర్చి – 3, పెరుగు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత, నూనె – సరిపడా;తయారీ..ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో.. అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి.ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు, పసుపు, పెరుగు, గరం మసాలా, నిమ్మరసం, ఉడికించిన అరటికాయ గుజ్జు, కొబ్బరి కోరు వేసుకుని బాగా కలిపి.. ముద్దలా చేసుకుని.. కట్లెట్స్ చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.అభిరుచిని బట్టి వీటిలో కొన్ని ఇన్గ్రీడియంట్స్ కలుపుకోవచ్చు లేదా చేంజ్ చేసుకోవచ్చు.ఇవి చదవండి: Beauty Tips: చూడటానికి ఇది ల్యాండ్ ఫోన్లాగా.. కానీ ఇదొక బ్యూటీ మసాజర్..! -
సరికొత్త వంటకాలను కోరుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి!
ప్రతీరోజూ తిన్న వంటకాలని మళ్లీ మళ్లీ తినాలంటే.. చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు. కొంచెం కారంగానో, తీయగానో కావాలని కోరుకుంటారు. విశ్రాంతి సమయంలో ఏదో ఒకటి నమిలేవరకూ వారికి పొద్దేపోదు. మరి అలాంటి వారి కోసం ఈ వెరైటీ వంటలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. పుట్టగొడుగు లాలీపాప్స్.. కావలసినవి: పుట్టగొడుగులు – 15 లేదా 20 (వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని పక్కనపెట్టుకోవాలి), మైదాపిండి – 1 కప్పు, ధనియాల పొడి, పసుపు – పావు టేబుల్ స్పూన్, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి – అర టేబుల్ స్పూన్ చొప్పున, కార్న్ఫ్లేక్ మిక్సర్ – 1 కప్పు (కవర్లో వేసి.. చపాతీ కర్రతో అటు ఇటు నొక్కి పొడిపొడిగా చేసుకోవాలి), బ్రెడ్ పౌడర్, ఓట్స్ పౌడర్ – అర కప్పు చొప్పున, అల్లం పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ.. ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ధనియాల పొడి, పసుపు, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, అల్లం పేస్ట్, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పేస్ట్లా చేసుకోవాలి. అనంతరం మరో బౌల్ తీసుకుని కార్న్ఫ్లేక్ మిక్సర్, బ్రెడ్ పౌడర్, ఓట్స్ పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ప్రతి పుట్టగొడుగుకు పుల్ల గుచ్చి.. ఒక్కోదాన్ని మొదట మైదా మిశ్రమంలో తర్వాత బ్రెడ్ పౌడర్ మిశ్రమంలో ముంచి.. మిశ్రమాన్ని బాగా పట్టించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీల్మేకర్ – టొమాటో గారెలు.. కావలసినవి: మీల్మేకర్ – 1 కప్పు (పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), టొమాటో – 3 (మెత్తగా మిక్సీ పట్టుకుని.. జ్యూస్లా చేసుకోవాలి), ఉల్లిపాయ తరుగు – పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్ పౌడర్ – 1 కప్పు చొప్పున, మినుముల పిండి – 2 కప్పులు (మినుములు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి), జీలకర్ర – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా తయారీ.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మినుముల పిండి, మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు అన్ని వేసుకుని టొమాటో జ్యూస్ కొద్దికొద్దిగా వేసుకుంటూ గారెల పిండిలా చేసుకోవాలి. అనంతరం కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని.. గారెల్లా ఒత్తుకుని, కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిపై మజ్జిగ ఆవడ వేసుకుని, నానబెట్టి తింటే భలే బాగుంటాయి. మీల్మేకర్ – టొమాటో, గారెలు చెర్రీ హల్వా.. చెర్రీ హల్వా.. కావలసినవి: చెర్రీస్ – రెండున్నర కప్పులు (గింజలు తీసి శుభ్రం చేసుకోవాలి) యాలకుల పొడి – పావు టీ స్పూన్ మొక్కజొన్న పిండి – రెండుంపావు కప్పులు పంచదార – 1 కప్పు, నట్స్ – కావాల్సినన్ని నెయ్యి – అర కప్పు, నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు డ్రైఫ్రూట్స్ – అభిరుచిని బట్టి తయారీ.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో జీడిపప్పు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం చెర్రీస్ వేసుకుని గరిటెతో తిప్పుతూ మగ్గేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. అనంతరం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత.. మొక్కజొన్న పిండిలో నీళ్లు పోసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చెర్రీస్ మిశ్రమంలో వేసుకోవాలి. కాసేపటికి మరోసారి కొద్దిగా నెయ్యి వేసుకుని తిప్పాలి. దగ్గరపడుతున్న సమయంలో జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి చల్లారాక.. మరిన్ని డ్రైఫ్రూట్స్ తురుముతో సర్వ్ చేసుకోవాలి. ఇవి చదవండి: సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా! -
చూడడానికి పాములా భయపెడుతుంది.. కానీ చల్లగా కాపాడుతుంది..
పొట్లకాయ.. స్నేక్గార్డ్. చూడడానికి పాములా భయపెడుతుంది. కానీ.. ధైర్యంగా నమిలి మింగేస్తే సరి. పొట్టలోకి వెళ్లి చల్లగా కాపాడుతుంది. సమ్మర్ గార్డ్ ఫ్యామిలీలో ఇదీ ఒకటి. పొట్టను కాపాడే కాయ.. పొట్లకాయ. వేడి నుంచి రక్షించే.. కూరగాయ ఇది. దీనినే ఎన్నో రకాలుగా వండవచ్చు. ఎంతో రుచిగా మార్చవచ్చు. అలాగే పచ్చడి చేసి నిల్వ చేయవచ్చు కూడా. మరి ఈ పొట్లకాయ రుచుల తీరేంటో తెలుసుకుందాం.. పొట్లకాయ పెసరపప్పు.. కావలసినవి.. పొట్లకాయ ముక్కలు– 2 కప్పులు; పెసరపప్పు – అర కప్పు ; కొబ్బరి తురుము – అర కప్పు ; ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – 2 టీ స్పూన్లు ; ఎండుమిర్చి – 2 ; కరివేపాకు – 2 రెమ్మలు ; ఇంగువ– పావు టీ స్పూన్ ; నూనె లేదా నెయ్యి – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; చక్కెర – టీ స్పూన్. తయారీ.. బంగాళాదుంపను శుభ్రం చేసి నిలువుగా కోసి గింజలను తొలగించిన తర్వాత ముక్కలు చేయాలి. పెసరపప్పు కడిగి పక్కన పెట్టాలి. పాత్రలో రెండు కప్పుల నీటిని పోసి మరిగేటప్పుడు పొట్లకాయ ముక్కలు, పెసరపప్పు వేసి ఉడికించాలి. పప్పు ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత ఉప్పు కలిపి పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ముక్కలు ఉడకడానికి నీరు సరిపోకపోతే మరికొంత నీటిని చిలకరించి ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. మినప్పప్పు వేగిన తర్వాత చక్కెర, ఉడికించి సిద్ధంగా ఉంచిన పొట్లకాయ – పెసరపప్పును వేసి కలపాలి. తేమ ఆవిరి అయ్యే వరకు కలియబెడుతూ వేయించి చివరగా కొబ్బరి తురుము వేసి కలపాలి. కొబ్బరి రుచి కూరగాయ ముక్కలకు పట్టడం కోసం ఓ నిమిషం పాటు గరిటెతో కలియబెడుతూ వేయించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గే కొద్దీ కూర రుచి ఇనుమడిస్తుంది. ఇది సాంబార్, రసం అన్నంలోకి సైడ్ డిష్గా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పెసరపప్పు, పొట్లకాయ పొరిచ్చ కొళంబు పొట్లకాయ పొరిచ్చ కొళంబు.. కావలసినవి: కందిపప్పు – అరకప్పు; పొట్లకాయ ముక్కలు – 3 కప్పులు ; సాంబారు పొడి – టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మకాయ రసం – ఒక టేబుల్ స్పూన్. పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్లు; పచ్చి శనగపప్పు – 2 టీ స్పూన్లు ; ఎండుమిర్చి – 2; మినపప్పు– టీ స్పూన్ ; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు ; ఇంగువ – చిటికెడు ; నూనె – టీ స్పూన్. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ;ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – టీ స్పూన్ ; కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ.. కందిపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుకర్లో వేసి తగినంత నీటిని పోసి ఉడికించి పక్కన ఉంచాలి. పొడి కోసం తీసుకున్న దినుసులను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. పొట్లకాయను శుభ్రంగా కడిగి తరిగి గింజలు తొలగించి ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఒక పాత్రలో ఉప్పు, సాంబారు, పొట్లకాయ ముక్కలు వేయాలి. ముక్కలు మునిగేటట్లు నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన కందిపప్పు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో ఉడికించిన పొట్లకాయ ముక్కలను, మసాలా పొడి వేసి నీరు పోసి కలిపి ఉడికించాలి. పప్పు, కూరగాయ ముక్కలు, మసాలా పొడి అన్నింటి రుచి కలిసే వరకు ఉడికించి, నిమ్మరసం కలిపి దించేయాలి. రుచి చూసి అవసరమైతే ఉప్పు, నిమ్మరసం మరికొంత చేర్చుకోవచ్చు పోపు కోసం మందపాటి పాత్ర తీసుకోవాలి. పాత్రలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత మినప్పప్పు వేయించి కరివేపాకు వేసి ముందుగా ఉడికించి సిద్ధంగా ఉంచిన కందిపప్పు కూరగాయ ముక్కల మిశ్రమాన్ని పోసి కలిపి దించేయాలి. ఘుమఘుమలాడే పొట్లకాయ పొరిచ్చ కొళంబు రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది. పొట్లకాయ పచ్చడి కావలసినవి: పొట్లకాయ ముక్కలు – కప్పు; ఎండుమిర్చి –3 ; మినప్పప్పు – టేబుల్ స్పూన్ ; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్ ; వేరు శనగపప్పు లేదా నువ్వులు లేదా కొబ్బరి తురుము – పావు కప్పు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి లేదా నూనె – టేబుల్ స్పూన్; చింతపండు– అంగుళం ముక్క ; బెల్లం పొడి– టీ స్పూన్ (ఇష్టమైతేనే). పోపు కోసం: నూనె– టేబుల్ స్పూన్ ; ఆవాలు– టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్ ; ఎండుమిర్చి– ఒకటి; ఇంగువ– చిటికెడు ; కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ.. మందపాటి బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి మినప్పప్పు, పచ్చి శనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చిని దోరగా వేయించి మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. అదే బాణలిలో పొట్లకాయ ముక్కలను వేసి పచ్చిదనం తగ్గేవరకు వేడి చేసి ఆపేయాలి. చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి, అందులోనే చింతపండు, బెల్లం, ఉప్పు కలిపి మరో రౌండ్ తిప్పాలి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసి మరొక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేసి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి పచ్కడిలో వేసి కలపాలి. ఇది అన్నంలోకి ఇడ్లీ, దోసెల్లోకి కూడా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పచ్చడి, పొట్లకాయ వేపుడుకూర పొట్లకాయ వేపుడుకూర.. కావలసినవి: పొట్లకాయ ముక్కలు – పావుకేజీ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; జీలకర్ర– టీ స్పూన్ ; పసుపు– పావు టీ స్పూన్ ; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; ఇంగువ– చిటికెడు ; కారం – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి– టేబుల్ స్పూన్ ; నీరు– పావు కప్పు ; వేరుశనగ పప్పుల పొడి లేదా శనగపిండి– టేబుల్ స్పూన్. తయారీ.. బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ధనియాలపొడి, కారం పొడి, పసుపు, ఇంగువ వేసి కలపాలి. పచ్చిదనం పోయిన తర్వాత ఇందులో ఉప్పువేసి, కొద్దిగా నీటిని పోసి కలపాలి. మసాలా పొడులన్నీ సమంగా కలుస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బాణలిలో పొట్లకాయ ముక్కలు వేసి మసాలా సమంగా పట్టేటట్లు కలపాలి. ముక్కలకు మసాలా సమంగా పట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ముక్కల్లో నీటిని పోసి కలిపి మంట తగ్గించి మూత పెట్టాలి. రెండు నిమిషాలకోసారి మూత తీసి గరిటెతో ముక్కలను కలిపి మళ్లీ మూత పెడుతుండాలి. పది నిమిషాలకు ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. ముక్కలు ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించి మళ్లీ మూత పెట్టి ఉడికించాలి. చివరగా వేరుశనగపప్పు పొడి లేదా శనగపిండి చల్లి బాగా కలిపి దించేయాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి రుచిగా ఉంటుంది. ఇవి చదవండి: Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..? -
'ఇఫ్తార్' విందుకై.. ఇంట్లోనే సులువుగా చేయండిలా..
పగలంతా రోజాతో అల్లా ధ్యానం. రాత్రికి ఇఫ్తార్తో ఆరోగ్యధ్యానం. నీరసించిన దేహానికి శక్తి కావాలి. ఆ శక్తి దేహానికి తక్షణం అందాలి. ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. గార్నిషింగ్తో పదార్థం రుచి పెరగాలి. రుచి.. ఆరోగ్యానికి మేళవింపు కావాలి. ఇఫ్తార్ కోసం పొరుగు దేశాలు ఏం వండుతున్నాయి? దహీ చికెన్ను బ్రెడ్లో పార్సిల్ చేశాయి. నాలుగు పప్పులు.. రెండు ధాన్యాలు.. కలిపి హలీమ్ వండుతున్నాయి. అచ్చం మనలాగే. చికెన్ బ్రెడ్ పార్సిల్.. కావలసినవి: చికెన్ బోన్లెస్ – 200 గ్రా. మారినేషన్ కోసం.. మిరియాల పొడి – టీ స్పూన్; మిరపొ్పడి – టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్; వెనిగర్ – టేబుల్ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; తందూరీ మసాలా పొడి – టేబుల్ స్పూన్; పెరుగు– అర కప్పు. పోపు కోసం.. నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు. పార్సిల్ కోసం.. మిల్క్ బ్రెడ్ – 10 స్లయిస్లు; మైదా – టేబుల్ స్పూన్; కోడిగుడ్లు – 2; లెట్యూస్ – నాలుగు ఆకులు (క్యాబేజ్ని పోలి ఉంటుంది); నూనె – వేయించడానికి తగినంత. తయారీ.. చికెన్ను శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పాత్రలో వేసి మారినేషన్ కోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేసి సమంగా కలిసే వరకు కలిపి (మారినేషన్) అరగంట సేపు కదిలించకుండా పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి. మూత తీసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొంత సేపు చిన్న మంట మీద ఉంచాలి. ఉప్పు కూడా సరి చూసుకుని అవసరాన్ని బట్టి మరికొంత వేసుకోవచ్చు. చికెన్ ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి రెండు నిమిషాల సేపు (తేమ పోయే వరకు) వేయించి స్టవ్ ఆపేయాలి ఒక కప్పులో మైదా పిండి తీసుకుని తగినంత నీటితో గరిట జారుడుగా కలుపుకోవాలి కోడిగుడ్లను పగుల గొట్టి ఒక పాత్రలో వేసి, అందులో మిరియాల పొడి వేసి చిలికి సిద్ధంగా ఉంచుకోవాలి బ్రెడ్ స్లయిస్ల అంచులు చాకుతో కట్ చేసి తీసేయాలి. బ్రెడ్ను అప్పడాల కర్రతో వత్తాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ పొడి పొడిగా రాలిపోకుండా చికెన్ స్టఫ్ పెట్టి నూనెలో వేయించడానికి అనువుగా మారుతుంది. ఇలా చేసుకున్న బ్రెడ్ స్లయిస్లో ఒక స్పూన్ చికెన్ స్టఫ్ పెట్టి, కర్రీ బయటకు రాకుండా బ్రెడ్ అంచులకు మైదా పిండి ద్రవం రాసి అతికించాలి. నలుచదరంగా ఉండే బ్రెడ్ స్లయిస్ సాండ్విచ్లాగ త్రిభుజాకారపు పార్సిల్ తయారవుతుంది. ఇలా అన్నింటినీ చేసుకుని పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ పార్సిల్ను కోడిగుడ్డు సొనలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీసి టిష్యూ పేపర్ మీద వేయాలి. నూనె వదిలిన తరవాత ఈ బ్రెడ్ పార్సిళ్లను, టొమాటో కెచప్, లెట్యూస్తో కలిపి సర్వ్ చేయాలి. చికెన్ హలీమ్.. కావలసినవి: ఎర్ర కందిపప్పు – టేబుల్ స్పూన్; బాసుమతి బియ్యం– టేబుల్ స్పూన్; గోధుమలు– టేబుల్ స్పూన్; బార్లీ– టేబుల్ స్పూన్; కందిపప్పు– టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు– టేబుల్ స్పూన్; అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్లు– ఒక్కొక్కటి టేబుల్ స్పూన్; చికెన్ (బోన్లెస్)– పావు కేజీ; చికెన్ స్టాక్ – అరకప్పు; హలీమ్ మసాలా పొడి– టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – కప్పు; మిరప్పొడి – అర టీ స్పూన్; పసుపు– అర టీ స్పూన్; పెరుగు – అర కప్పు; ఉప్పు – అర టీ స్పూన్. పోపు కోసం.. నెయ్యి– అర కప్పు; జీలకర్ర– టీ స్పూన్; వెల్లుల్లి– 10 రేకలు; పుదీన ఆకులు – టేబుల్ స్పూన్. గార్నిషింగ్ కోసం.. జీడిపప్పు – పావు కప్పు; నిమ్మకాయ– ఒకటి (పలుచగా తరగాలి); అల్లం తరుగు– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – కప్పు. తయారీ.. బియ్యం, కందిపప్పులు, పచ్చి శనగపప్పు, బార్లీ, గోధుమలను ఒక పెద్ద పాత్రలో వేసి శుభ్రంగా కడిగి, మూడింతలు మంచి నీటిని పోసి పది నిమిషాలసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్టులు వేసి కలిపి, పప్పులు, ధాన్యాలు మెత్తబడే వరకు ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత వీటిని మెత్తగా మెదపాలి. గింజలు ఉడికేలోపు బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి తీసి పక్కన సిద్ధంగా ఉంచుకోవాలి చికెన్ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి అందులో హలీమ్ మసాలా పొడి, మిరప్పొడి, పసుపు, ఉప్పు, పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, చికెన్ స్టాక్ను (చికెన్ స్టాక్ లేకపోతే మంచి నీటిని పోయాలి) వేసి ఉడికించాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత అందులోని నీటిని పప్పులు, ధాన్యాలు ఉడికించిన మిశ్రమంలోకి వంపి చికెన్ ముక్కలను మాత్రమే పాత్రలో ఉంచి ఆ ముక్కలను మెదపాలి. మెదిపిన చికెన్ను కూడా ధాన్యాలు, పప్పులు ఉడికించిన మిశ్రమంలో వేసి కలిపి మంట తగ్గించి అన్నింటి రుచి కలవడం కోసం మళ్లీ ఉడికించాలి ఉల్లిపాయ ముక్కలు వేయించిన బాణలిలో మిగిలిన నేతిలో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పుదీన వేసి అర నిమిషం పాటు వేయించి ఈ పోపును చిన్నమంట మీద ఉడుకుతున్న చికెన్, పప్పులు, ధాన్యాల మిశ్రమంలో వేసి కలిపితే హలీమ్ రెడీ గార్నిష్ చేయడానికి ఒక పాత్రలో కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, జీడిపప్పులు, ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పులో వేడి వేడి హలీమ్ వేసి పై గార్నిష్ కోసం సిద్ధం చేసిన మిశ్రమాన్ని కొద్దిగా చల్లి, నిమ్మకాయ ముక్క పెట్టి సర్వ్ చేయాలి. ఇవి చదవండి: కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి! -
ఐస్క్రీమ్ పానీపూరీ! ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి
ఐస్క్రీమ్ పానీపూరీ కావలసినవి: ఐస్ క్రీమ్ – పావు కప్పు చొప్పున 2 రకాలు (ముందుగానే నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్.. కాస్త మెల్ట్ అయ్యాక కవర్లో వేసుకుని.. కోన్ లా చేసుకుని కాసేపు ఫ్రిజ్లో పెట్టుకోవాలి) పానీపూరీ – 10 లేదా 15 డార్క్ సెమీ స్వీట్ చాక్లెట్ – 300 గ్రా. (ఒక వంద గ్రాములు తురుములా కోరి పక్కనే పెట్టుకోవాలి) కమలాపండు తొనలు – 10 (గార్నిష్ కోసం) చాక్లెట్స్ చిప్స్, టూటీ ఫ్రూటీ, డార్క్ స్ప్రింకిల్స్ కలర్ స్ప్రింకిల్స్ – 3 టేబుల్ స్పూన్ల చొప్పున (అభిరుచిని బట్టి) తయారీ విధానం: ముందుగా ఓవెన్ లో 200 గ్రాముల డార్క్ సెమీ స్వీట్ చాక్లెట్ కరిగించి, ప్రతి పానీపూరీని కాస్త చిదిమి, దానికి మొత్తం చాక్లెట్ క్రీమ్ పట్టించి, ఆ పూరీలన్నిటినీ పావుగంట పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం ప్రతి పానీపూరీలో రెండు ఐస్ క్రీమ్స్ నింపుకుని, చాక్లెట్ తురుము, కమలాపండు తొనలతో గార్నిష్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చాక్లెట్స్ చిప్స్, టూటీ ఫ్రూటీ, కలర్ స్ప్రింకిల్స్, డార్క్ స్ప్రింకిల్స్ వాటిపై వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. (చదవండి: సూపర్ స్నాక్స్.. తమలపాకు గారెలు తయారీ ఇలా) -
ముంజులతో కేక్ చేసుకోండి ఇలా..
ముంజలు – రాగి పాన్ కేక్ కావలసినవి: ముంజి కాయలు – 2 (జాగ్రత్తగా ముంజలు తీసి.. తొక్క ఒలిచి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కలిపి.. జ్యూస్లా మిక్సీ పట్టుకోవాలి) రాగిపిండి – 2 కప్పులు మొక్కజొన్నపిండి – పావు కప్పు పంచదార పొడి – అరకప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) నూనె – సరిపడా తయారీ విధానం: ముందుగా బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, రాగి పిండి ఒకదాని తర్వాత ఒకటి పెద్ద బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా ముంజల జ్యూస్ వేస్తూ ఆ మిశ్రమాన్ని కాస్త పలుచగా కలుపుకోవాలి. అవసరమైతే మరిన్ని పాలు పోసుకోవచ్చు. అనంతరం ఐదారు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. తర్వాత పా¯Œ లో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. మందంగా పాన్ కేక్స్ వేసుకుని దోరగా ఇరువైపులా కాల్చుకోవాలి. వాటిపై నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. (చదవండి: చేదు లేకుండా కాకరకాయ ఆమ్లెట్ తయారీ ఇలా..) -
తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్
కావలసినవి: చికెన్ – అర కిలో ; నిమ్మకాయ– ఒకటి ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; ఉప్పు – రెండు టీ స్పూన్లు లేదా రుచికి తగినట్లు. మసాలా కోసం: బాదం – పది ; పిస్తా – పది ; చిరోంజి– 2 టీ స్పూన్లు ; పచ్చిమిర్చి– 3 ; దాల్చిన చెక్క– అర అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; ఏలకులు –4 ; మిరియాలు – అర టీ స్పూన్. గ్రేవీ కోసం: నూనె– 3 టేబుల్ స్పూన్లు ; నెయ్యి – 2 టీ స్పూన్లు ; పెరుగు– పావు కప్పు ; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (వేయించాలి) ; టొమాటో పేస్ట్ – అర కప్పు ; రెడ్ చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్లు ; గ్రీన్ చిల్లీ సాస్ – టేబుల్ స్పూన్; షాజీరా– టీ స్పూన్ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; వేయించిన జీలకర్ర పొడి – టీ స్పూన్ ; కశ్మీర్మిరప్పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; మిరప్పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; కొత్తిమీర తరుగు – కప్పు ; తాజా మీగడ– 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ► చికెన్ను శుభ్రం చేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలపాలి. ► మందపాటి బాణలిలో మసాలా దినుసులన్నింటినీ ఒక్కొక్కటిగా వేసి సన్న మంట మీద దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీలో తగినంత నీటిని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. ► ఈ మసాలా పేస్టును చికెన్కు పట్టించాలి. అందులో నూనె, నెయ్యి, మీగడ మినహా గ్రేవీ కోసం తీసుకున్న అన్నింటినీ వేసి కలిపి రెండు గంటల సేపు ఫ్రిజ్లో పెట్టాలి. ► బాణలిలో నూనె, నెయ్యి వేడి చేసి అందులో ఫ్రిజ్లో నుంచి తీసిన చికెన్ను వేసి మీడియం మంట మీద అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఇరవై నిమిషాల సేపు ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత మీగడ వేసి దించేయాలి. గ్రేవీ చిక్కదనం చూసుకుని అవసరమనిపిస్తే మరిగించిన నీటిని తగినన్ని పోసి కలుపుకోవాలి. నోరూరించే తెలంగాణ రెడ్ చికెన్ కర్రీ రెడీ. ఇది చపాతీ, రోటీ, బగారా రైస్లకు మంచి కాంబినేషన్. (క్లిక్ చేయండి: తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా..) -
జొన్న దోసె.. బరువు తగ్గాలనుకునే వారి కోసం..
కావలసినవి: మినప్పప్పు– కప్పు; జొన్న పిండి –3 కప్పులు ; అటుకులు– పావు కప్పు; మెంతులు– పావు టీ స్పూన్ ; ఉప్పు – అర టీ స్పూన్; నూనె లేదా నెయ్యి – 4 టీ స్పూన్లు. తయారీ: మినప్పప్పు, మెంతులను కడిగి మంచినీటిలో ఐదారు గంటల సేపు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని వంపేసి మిక్సీలో వేసి, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, అదే జార్లో జొన్న పిండి, నీరు వేసి బాగా కలవడం కోసం కొద్దిసేపు గ్రైండ్ చేయాలి. దీనిని మినప్పప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి గట్టిగా మూత పెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయం పిండిని గరిటెతో కలిపి చూసుకుని తగినంత నీరు, ఉప్పు కలిపి దోసెలు వేసుకోవడమే. ఈ దోసెలు వేరుశనగపప్పు చట్నీ లేదా కొబ్బరి– పచ్చి శనగపప్పు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ పేషెంట్లకు మంచి ఆహారం. (క్లిక్ చేయండి: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ!) -
వెజిటేరియన్ హలీమ్.. ఎలా చేయాలో తెలుసా?
కావలసినవి: వేయించిన ఉల్లిపాయ తరుగు – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, పాలు – కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, గులాబీ రేకులు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ – అరకప్పు, ఓట్స్ – పావు కప్పు, బాదం – ఆరు, పచ్చిశనగపప్పు – టీస్పూను, ఎర్ర కందిపప్పు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పెసరపప్పు – టీస్పూను, నువ్వులు – టీస్పూను, జీలకర్ర – అర టీస్పూను, లవంగాలు – టీస్పూను, మిరియాలు – టీస్పూను, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, యాలకులు – ఎనిమిది, షాజీరా – టేబుల్ స్పూను, తోకమిరియాలు – టీస్పూను, పెరుగు – అరకప్పు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, పుదీనా తరుగు – టేబుల్ స్పూను, సన్నగా తరిగిన జీడిపప్పు – 20 గ్రా., పిస్తా పలుకులు – 20 గ్రా., బాదం పలుకులు – 20 గ్రా., మీల్మేకర్ – 100 గ్రా., నిమ్మరసం – టీస్పూను. తయారీ: ► ముందుగా మీల్మేకర్ను ఇరవై నిమిషాలపాటు నీటిలో నానబెట్టాలి. నానాక బరకగా రుబ్బుకోవాలి. ► మిక్సీజార్లో.. తోక మిరియాలు, షాహజీరా, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, పప్పులన్నీ, ఆరు బాదం పప్పులు, ఓట్స్, గోధుమ రవ్వ, నువ్వులు అన్నీ కలిపి పొడిచేయాలి. ► స్టవ్ మీద కుకర్ గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడిపప్పు, పిస్తా, బాదం పలుకులు, పచ్చిమిర్చి వేసి నిమిషం పాటు వేయించాలి. ►ఇవివేగాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బరకగా గ్రైండ్ చేసిన మీల్ మేకర్ మిశ్రమాన్ని కలపాలి. ►ఇప్పుడు పెరుగు, పాలు, గులాబి రేకులు, కొత్తిమీర, పుదీనా తరుగు, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి కలిపి, పొడిచేసుకున్న మసాలా మిశ్రమం వేసి కలిపి, మూడు విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటమీద ఉడికించాలి. ►ఉడికిన మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకుని, నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు చూసి చూసి వేసుకుంటే వేడివేడి వెజ్ హలీమ్ రెడీ. -
నోరూరించే నర్గీస్ కోఫ్తా.. తయారీ ఇలా!
కావలసినవి: గుడ్లు – ఎనిమిది; మటన్ ఖీమా – అరకేజీ; ఉల్లిపాయ – ఒకటి(ముక్కలు తరగాలి; వెల్లుల్లి తరుగు – టేబుల్ స్పూను; పసుపు – టీస్పూను; కారం – అరటీస్పూను; గరంమసాలా – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; బియ్యప్పిండి – అరకప్పు; ఆయిల్ – డీప్ఫ్రైకి సరిపడా. గ్రేవీ కోసం: ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు ; ఉల్లిపాయలు – రెండు (ముక్కలు తరగాలి); వెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు; అల్లంపేస్టు – రెండు టీస్పూన్లు; టొమాటోలు – మూడు(పేస్టు చేసుకోవాలి); ధనియాలపొడి – రెండు టీస్పూన్లు; జీలకర్ర – టీస్పూను; పసుపు – అరటీస్పూను; కారం – అర టీస్పూను; గరం మసాలా – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; పెరుగు – ఎనిమిది టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – గార్నిష్కు సరిపడా. తయారీ: ► ముందుగా ఆరు గుడ్లను ఉడికించి, పెంకు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ► పెద్ద గిన్నెలో మటన్ ఖీమా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, పసుపు, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఒక గుడ్డుసొన వేసి పేస్టులా కలపుకోవాలి ► ఈ మిశ్రమాన్ని ఆరు సమభాగాలుగాచేసి పక్కనపెట్టుకోవాలి ► ఉడికించిన ఒక్కో గుడ్డుకు పూర్తిగా కవర్ అయ్యేలా ఖీమా మిశ్రమాన్ని పట్టించాలి ► అన్ని గుడ్లకు పట్టించాక బియ్యంపిండిలో ముంచాలి మిగిలిన గుడ్డుసొనను బాగా కలపాలి. బియ్యప్పిండిలో ముంచిన గుడ్లను ఈ గుడ్డుసొనలో ముంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ఫ్రైచేసి పక్కనపెట్టుకోవాలి ► వేడెక్కిన బాణలిలో గ్రేవీకోసం తీసుకున్న ఆయిల్ వేయాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలువేసి రంగు మారేంత వరకు వేయించాలి ► ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టులను వేసి మూడు నిమిషాలు వేయించి టొమాటో పేస్టు, కారం, ధనియాలపొడి, గరం మసాలా వేయాలి ► రుచికిసరిపడా ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ► ఇప్పుడు పెరుగు, అరకప్పు నీళ్లు వేసి కలిపి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి, డీప్ఫ్రై చేసి పెట్టుకున్న కోప్తాలను వేసి జాగ్రత్తగా తిప్పుకోవాలి ∙ఐదునిమిషాలు మగ్గాక కొత్తిమీరతో గార్నిష్ చేస్తే నర్గీస్ కోఫ్తా రెడీ. ఇది రైస్,చపాతీల్లోకి మంచి సైడ్ డిష్. (క్లిక్: హనీ చికెన్ కర్రీ..టేస్ట్ అదుర్స్.. ఇలా చేసుకోండి) చికెన్ కాగ్జీకట్ కావలసినవి: చికెన్ – అరకేజీ; చిన్న ఉల్లిపాయలు – ఎనిమిది; బంగాళ దుంపలు – ఎనిమిది; వెల్లుల్లి రెబ్బలు – ఆరు; అల్లం – అంగుళం ముక్క ; పెద్ద ఉల్లిపాయ – ఒకటి; పచ్చికొబ్బరి తురుము – కప్పు; ఎండుమిర్చి – ఏడు; లవంగాలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; మిరియాలు – పది; ధనియాలు – టేబుల్ స్పూను; మెంతులు – టీస్పూను; గసగసాలు – టేబుల్ స్పూను; సోంపు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; జాజికాయ పొడి – టీస్పూను; ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – గార్నిష్కు సరిపడా. తయారీ: ► ధనియాలు, గసగసాలు, మెంతులను పొడిచేకోవాలి ► అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను సన్నగా తరగాలి ► బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు వేసి వేగనివ్వాలి. తరువాత కొబ్బరి తురుము వేసి మూడు నిమిషాలు వేయించాలి ► ఇప్పుడు ధనియాల పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గాక, చికెన్ వేసి సన్నని మంట 10 నిమిషాలు ఉడికాక చిన్న ఉల్లిపాయలు, బంగాళ దంపలు వేసి ఉడికించాలి ► ఆయిల్ పైకి తేలాక జాజికాయ పొడి, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. (క్లిక్: కీమా ఇడ్లీ, బనానా షీరా చాక్లెట్ బాల్స్, బ్రెడ్–ఎగ్ బజ్జీ తయారు చేసేద్దామిలా..) -
రేగు వడియాలు.. ఇలా చేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు!
కావలసినవి: రేగుపండ్లు – యాభై; చింతపండు – నిమ్మకాయంత; రాక్ సాల్ట్ – టేబుల్ స్పూను; బెల్లం – పావు కప్పు; ఎండు మిర్చి – ఆరు; జీలకర్ర – అర టీస్పూను; ఇంగువ – టీస్పూను. తయారీ: ► ముందుగా రేగుపండ్లను తొడిమెలు తీసి శుభ్రంగా కడిగి టవల్తో తుడిచి ఆరబెట్టాలి ► ఇప్పుడు రోట్లో ఉప్పు, ఎండు మిర్చి వేసి దంచాలి ► ఇవి సగం నలిగాక జీలకర్ర ఇంగువ, రేగుపండ్లు వేసి దంచాలి ► రేగుపండ్లను కచ్చాపచ్చాగా దంచి, విత్తనాలను తీసివేయాలి. రేగుపండ్ల గుజ్జులో చింతపండు, బెల్లం వేసి దంచాలి. ఈ మిశ్రమాన్ని ఒక కవర్పై వడియాలుగా పెట్టుకోవాలి ► వీటిని మంచి ఎండలో ఆరబెట్టాలి. రెండు వైపులా బాగా ఎండిన తరువాత తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి నిల్వ చేసుకోవాలి ► నోరు చప్పగా అనిపించినప్పుడు ఈ వడియాలు తింటే పుల్లగా, కారంగా, తియ్యగా తగులుతూ ఎంతో రుచిగా ఉంటాయి. అజీర్తి చేసినప్పుడు, భోజనం సహించనప్పుడు వీటిని చప్పరిస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది. -
రుచులూరే.. షాహీ తుకడా, ఖీమా పన్నీర్ వండేద్దాం ఇలా..
ఈ కొత్త రుచులను ట్రై చేయండి. ఘుమ ఘుమలాడే వంటకాలతో మీ ఇంటిల్లిపాదిని ఆనందపరచండి. షాహీ తుకడా కావల్సినవి పధార్థాలు మిల్క్ బ్రెడ్ స్లైసులు – ఆరు పాలు – లీటరు పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు యాలకులపొడి – అర టేబుల్ స్పూను కుంకుమ పువ్వు – అరటీస్పూను పిస్తా పలుకులు – ఐదు టీస్పూన్లు బాదం పలుకులు – ఐదు టీస్పూన్లు సుగర్ సిరప్ నీళ్లు – అరకప్పు పంచదార – అరకప్పు యాలకులు – రెండు రోజ్ వాటర్ – అరటీస్పూను గార్నిష్ బ్రెడ్స్లైసులు – మూడు నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు డ్రైఫ్రూట్స్ – రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►ముందుగా టేబుల్స్పూను పాలల్లో కుంకుమ పువ్వును నానబెట్టు కోవాలి. ►మందపాటి గిన్నెలో పాలు పోసి వేడిచేయాలి. ►పాలు మీగడ కట్టి, సగమయ్యాక, పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి, బాదం, పిస్తా పలుకులు వేసి, 5 నిమిషాలకొకసారి కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తరువాత దించి పక్కనబెట్టుకోవాలి. ►ఇప్పుడు అరకప్పు పంచదార, నీళ్లు వేసి తీగపాకం వచ్చిన తరువాత రోజ్ వాటర్, యాలకులపొడి వేసి కలపాలి. ►ఈ పాకంలో బ్రెడ్ స్లైసులను వేసి నానబెట్టుకోవాలి. ►గార్నిష్ కోసం తీసుకున్న బ్రెడ్ను త్రికోణాకృతి ఆకృతిలో కట్ చేసి నెయ్యిలో బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►వీటిని కూడా పాకంలో 15 సెకన్ల పాటు ఉంచాలి. ►ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో బ్రెడ్ముక్కలు వరుసగా పేర్చి, కాచి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని వాటిమీద పోసి, గార్నిష్ కోసం తీసుకున్న పదార్థాలను వేసి సర్వ్చేస్తే ఎంతో రుచికరమైన షాహీ తుకడ రెడీ. ఖీమా పన్నీర్ కావల్సినవి పధార్థాలు పన్నీర్ తురుము – కప్పు బటర్ – మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర – అర టీస్పూను లవంగాలు – రెండు దాల్చిన చెక్క – చిన్న ముక్క యాలకులు – రెండు బిర్యానీ ఆకు – ఒకటి మిరియాలు – మూడు ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరగాలి) టొమోటో – రెండు (సన్నగా తరుక్కోవాలి) అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరగాలి) కారం – రెండు టీస్పూన్లు పసుపు – పావు టీస్పూను ధనియాల పొడి – టీస్పూను గరం మసాలా పొడి – అరటీస్పూను కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – అరటీస్పూను నిమ్మరసం – టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద బాండీ వేడెక్కిన తరువాత బటర్, నూనె వేయాలి. రెండూ వేడయ్యాకా జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి నిమిషం వేయించాలి. ►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడనివ్వాలి. ►ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టొమోటో, కొత్తిమీర తరుగు వేసి కలిపి మగ్గనివ్వాలి. ►టొమోటో మగ్గాకా.. పసుపు, కారం, ధనియాల పొడి వేసి సన్నని మంటమీద తిప్పుతూ ఉండాలి. ►ఆయిల్ పైకి తేలిన తరువాత పన్నీర్ తురుము, గరం మసాలా, పంచదార, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి . ►ఇప్పుడు మూతపెట్టి మూడు నిమిషాల ఉడికించి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేస్తే ఖీమా పన్నీర్ రెడీ. చదవండి: గుడ్న్యూస్.. ఈ ప్రొటీన్తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! -
జెండా పండుగ వంటలు
స్వాతంత్య్ర దినోత్సవం... మువ్వన్నెల జెండా దేశమంతా రెపరెపలాడుతుంది. ఇంటింటా దేశభక్తి వెల్లివిరుస్తుంది. పిల్లలంతా మిఠాయిలు పంచుకుంటారు. మువ్వన్నెల వంటలు తయారు చేసి, జాతీయజెండాకు వందనం చేద్దాం. తిరంగా ఢోక్లా కావలసినవి: బియ్యం – 3 కప్పులు; పచ్చి సెనగ పప్పు – ఒకటిన్నర కప్పులు; పుల్ల పెరుగు – కప్పు; అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూను; పుదీనా తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 2; పసుపు – టీ స్పూను; మిరప కారం– టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; నువ్వులు – టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యం, సెనగ పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, విడివిడిగా సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి ∙నీరంతా ఒంపేసి మిక్సీలో వేసి విడివిడిగా గారెల పిండిలా ఉండేలా పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙పుల్ల పెరుగు, కొద్దిగా వేడినీళ్లు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, ఆరుగంటలసేపు పిండిని వదిలేయాలి ∙మిక్సీలో పుదీనా, పచ్చి మిర్చి వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙నానిన పిండికి ఉప్పు, అల్లం తురుము జత చేయాలి ∙పిండిని మూడు సమాన భాగాలుగా చేసుకోవాలి ∙ఒక భాగం పిండికి పసుపు, మిరప కారం జత చేయాలి ∙ఒక భాగానికి మెత్తగా చేసిన పుదీనా, పచ్చిమిర్చి ముద్ద జత చేయాలి ∙ఒక పాత్ర తీసుకుని నూనె పూయాలి ∙ముందుగా పుదీనా జత చేసిన మిశ్రమాన్ని సమానంగా వేసి, ఆవిరి మీద రెండు నిమిషాలు ఉడికించాలి ∙పాత్రను బయటకు తీసి, దాని మీద, తెల్లటి పిండి వేసి మళ్లీ ఆవిరి మీద ఉంచి రెండు నిమిషాల తరవాత ఆ పాత్రను బయటకు తీయాలి ∙పసుపు, మిరపకారం జత చేసిన మిశ్రమాన్ని సమానంగా పరిచి ఆవిరి మీద బాగా ఉడికించి దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక నువ్వులు కూడా వేసి కొద్దిగా వేయించి తీసేసి, ఢోక్లా మీద సమానంగా పోయాలి. కాజు కట్లీ కావలసినవి: జీడి పప్పు – 2 కప్పులు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; పాలు – టేబుల్ స్పూను; పంచదార పాకం కోసం; నీళ్లు – కప్పు; పంచదార – కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఫుడ్ కలర్ – ఆకుపచ్చ, ఆరెంజ్ రంగులు (చిటికెడు చొప్పున) తయారీ: ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి పంచదార కరిగాక, ఏలకుల పొడి జత చేసి, ముదురు పాకం పట్టి పక్కన ఉంచాలి ∙జీడిపప్పును మిక్సీలో వేసి మధ్యమధ్యలో ఆపుతూ తిప్పి, ఆ పొడిని జల్లించాలి ∙ఇలా మొత్తం జీడిపప్పులను మిక్సీ పట్టి జల్లెడ పట్టి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పు పొడి వేసి దోరగా వేయించాలి ∙పంచదార పాకం జత చేసి సన్నటి మంట మీద ఆపకుండా కలుపుతుండాలి ∙బాగా దగ్గర పడి, అంచులను వదిలేస్తుండగా దింపేసి, కొద్దిగా చల్లారనివ్వాలి ∙చేతికి నెయ్యి రాసుకుని, పాలు జత చేసి, మెత్తగా అయ్యేవరకు కలిపి మూడు భాగాలుగా చేసుకోవాలి ∙ఒక భాగానికి ఆకు పచ్చ రంగు రెండు చుక్కలు, ఆరెంజ్ రంగు రెండు చుక్కలు విడివిడిగా కలిపి పక్కన ఉంచాలి ∙ముందుగా ఆకుపచ్చరంగు, ఆ తరవాత తెలుపు రంగు, చివరగా కాషాయ రంగు ఉంచి చేతితో జాగ్రత్తగా అదిమి, సుమారు పది నిమిషాలు ఫ్రిజ్లో ఉంచి తీసి, కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. కోకోనట్ గుల్కండ్ కావలసినవి: తెలుపు కోసం, తాజా కొబ్బరి తురుము – 3 అర కప్పులు; స్వీట్ కండెన్స్డ్ మిల్క్ – 3 పావు కప్పులు; గుల్కండ్ రోజ్ పెటల్ ప్రిజర్వ్ – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – మూడు టీ స్పూన్లు; ఎండు కొబ్బరి తురుము – రోలింగ్ కోసం తగినంత; క్యారట్ ముక్కలు – పావు కప్పు (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఆరెంజ్ ఫుడ్ కలర్ – కొద్దిగా; గ్రీన్ ఫుడ్కలర్ – కొద్దిగా. తయారీ: తెల్ల లడ్డు... స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక క్యారట్ ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక కొబ్బరి తురుము వేసి, సన్నటి మంట మీద దోరగా (రంగు మారకుండా) వేయించాలి ∙కండెన్స్డ్ మిల్క్ జత చేసి, ఆపకుండా కలపాలి ∙అంచులు విడుతుండగా, దింపి చల్లారనిచ్చాక మూడు భాగాలు చేయాలి ∙ఒక భాగం నుంచి కొద్దిగా చేతిలోకి తీసుకుని, మధ్యలో కొద్దిగా గుల్కండ్ ఉంచి లడ్డూ మాదిరిగా చేసి, ఎండు కొబ్బరి పొడిలో దొర్లించి పక్కన ఉంచాలి (ఇలా తెలుపు లడ్లు సిద్ధం చేసుకోవాలి) ∙రెండో భాగానికి క్యారట్ మిశ్రమం, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ జత చేసి లడ్లు చేసి, కొబ్బరి పొడిలో దొర్లించితే కాషాయ రంగు లడ్లు తయారైనట్లే ∙మూడో భాగానికి ఆకు పచ్చ ఫుడ్ కలర్ జత చేసి లడ్లు తయారుచేసుకుని, కొబ్బరి పొడిలో దొర్లించితే మువ్వన్నెల కోకోనట్ గుల్కండ్ రెడీ. -
బిహారీ ఫిష్ కర్రీ.. రుచి మాములుగా ఉండదు
కావలసినవి: రవ్వ చేపముక్కలు–ఆరు; పసుపు–మూడు టేబుల్ స్పూన్లు; కారం–రెండు టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు–పది; పచ్చిమిరపకాయలు–రెండు; ఆవాలు– టీ స్పూను; మిరియాలు–టీ స్పూను; మెంతులు–టీ స్పూను; జీలకర్ర– టీ స్పూను; టమోటా తరుగు–అరకప్పు; ఆవ నూనె–రెండు టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకులు–రెండు; గరం మసాల–టీ స్పూను; ధనియాలు–రెండు టీ స్పూన్లు; ఎండు మిరపకాయలు–నాలుగు; ఆయిల్ –మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు–గార్నిష్కు సరిపడా. తయారీ: ►ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి దానిలో రెండు టీ స్పూన్ల ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి ►వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలు, పసుపు, టమోటా తరుగు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్టు చేయాలి ►స్టవ్పై ప్యాన్ పెట్టి ఆవనూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగాక నానబెట్టిన చేపముక్కలను వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి ► చేపముక్కలు వేగిన ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక.. బిర్యానీ ఆకులు వేసి వేగనిచ్చి, తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాల పేస్టు రుచికి సరపడా ఉప్పువేసి వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలాక వేయించి పెట్టుకున్న చేపముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి పదినిమిషాలపాటు ఉడికించాలి ►పదినిమిషాల తరువాత గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే బిహారీ ఫిష్ కర్రీ రెడీ. వేడివేడి కూర మీద కాస్త కొత్తిమీర తరుగు చల్లి వడ్డిస్తే బిహారీ ఫిష్ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. -
వాన చినుకులు కాదు... నూనె చినుకులు
ఆకాశమంతా మబ్బు ముసిరితే నేల తల్లి నాలుక మీద వర్షపు చినుకులు కురుస్తాయి... మరి మన నోటికి రుచి మబ్బులు ముసిరితే... నూనెలో వేయించిన వంటకాలతో నాలుక మీద చినుకులు కురిపించాల్సిందే.. ఈ వంటకాలు ప్రయత్నించి, రుచి చూడండి... వాన చినుకులు కాదు... నూనె చినుకులు రుచిగా ఉన్నాయి అనకుండా ఉండలేం. పొటాటో లాలీపాప్ కావలసినవి: బంగాళ దుంపలు – 2 (ఉడికించి, తొక్క తీసి మెత్తగా చేయాలి); బ్రెడ్ పొడి – ఒకటిన్నర కప్పులు; పచ్చి మిర్చి తరుగు – టీ స్పూను; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; చాట్ మసాలా – టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; నిమ్మ చెక్క – ఒకటి; మైదా పిండి – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని తయారీ: ► ఒక పాత్రలో బంగాళ దుంప ముద్ద, బ్రెడ్ పొడి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, చాట్మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, నిమ్మ రసం వేసి చపాతీ ముద్దలా బాగా కలపాలి ∙చేతికి కొద్దిగా నూనె పూసుకుంటూ, ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి ► ఒక పాత్రలో మైదాపిండికి కొద్దిగా నీళ్లు జత చేసి దోసెల పిండిలా కలుపుకోవాలి ∙తయారు చేసి ఉంచుకున్న బాల్స్ను మైదా పిండిలో ముంచి, వెంటనే బ్రెడ్ పొడిలో దొర్లించాలి ∙స్టౌ మీద బాణలిలో కాగిన నూనెలో ఈ బాల్స్ను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఈ బాల్స్కి పుల్లలు గుచ్చి లాలీపాప్లా చేసి, టొమాటో కెచప్ తో తింటే రుచిగా ఉంటాయి. వెజ్ స్ప్రింగ్ రోల్స్ కావలసినవి: మైదా పిండి – 8 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉల్లి తరుగు – అర కప్పు; క్యారట్ తురుము – అర కప్పు; సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; రిఫైండ్ ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా; కొత్తిమీర తరుగు – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ తరుగు – అర కప్పు; క్యాబేజ్ తరుగు – అర కప్పు; అల్లం తురుము –టీ స్పూను; మిరియాల పొడి – కొద్దిగా; మైదా పిండి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ► ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, నీళ్లు, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా గిలకొడుతూ కలపాలి ► స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ వేడయ్యాక, కొద్దిగా నూనె వేయాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి గరిటెడు వేసి పల్చటి పాన్కేక్లా అయ్యేలా పాన్ను కొద్దిగా అటూ ఇటూ కదపాలి ► అంచులు విడివడే వరకు మీడియం మంట మీద ఉడికించి (రెండో వైపు తిప్పక్కర్లేదు) ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ► ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి (ఒక్కో పొర మీద కొద్దిగా మైదా పిండి చల్లి, ఆ పైన మరో పొర ఉంచాలి లేదంటే అతుక్కుపోతాయి) ► స్టౌ మీద బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తరుగు, ఉల్లి తరుగు, క్యాబేజీ తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కరకరలాడే వరకు వేయించాలి ► ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి జత చేసి, తడిపోయే వరకు వేయించి దింపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని, చల్లారబెట్టాలి ► ముందుగా తయారుచేసి ఉంచుకున్న మైదా పిండి చపాతీని ఒకటి తీసుకుని, అందులో టేబుల్ స్పూను క్యారట్ తురుము మిశ్రమం ఉంచి జాగ్రత్తగా రోల్ చేయాలి ∙అంచులకు తడి చేసి, మూసేయాలి ► స్టౌ మీద బాణలిలో నూనె పోసి, కాగాక, తయారు చేసుకున్న రోల్స్ను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ► టొమాటో కెచప్ లేదా చిల్లీ సాస్తో రుచిగా ఉంటాయి. స్టఫ్డ్ పనీర్ ఢోక్లా కావలసినవి: సెనగ పిండి – ఒకటిన్నర కప్పులు; పెరుగు – కప్పు; కొత్తిమీర + పుదీనా చట్నీ – ఒక కప్పు; పనీర్ – 200 గ్రా.; నూనె – 3 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; నీళ్లు – కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; పచ్చిమిర్చి – 2 (మధ్యకు సన్నగా కట్ చేయాలి); నువ్వులు – టీ స్పూను; పంచదార – 2 టీ స్పూన్లు; తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ► ఒక పాత్రలో సెనగ పిండి, పెరుగు వేసి బాగా కలపాలి ∙పంచదార, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ► కప్పు నీళ్లుపోసి మెత్తగా అయ్యేవరకు కలిపి, పావు గంట సేపు పక్కన ఉంచాలి ► ఒక ప్లేటుకి కొద్దిగా నూనె పూయాలి ∙స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి వేడి చేసి అందులో ఒక స్టాండ్ ఉంచి, రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి ∙సెనగ పిండి మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి, రెండు విడివిడి పాత్రల్లో పోయాలి ► ఒక పాత్రలో ఉన్న పిండిలో ముప్పావు టీ స్పూను ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి, బాగా పొంగినట్టు కాగానే, పిండిని ప్లేట్లో పోసి, సమానంగా పరిచి, పెద్ద పాత్రలోని స్టాండ్ మీద ఉంచి, మూత పెట్టాలి ► ఐదు నిమిషాల తరవాత మూత తీసి, కొత్తిమీర పుదీనా చట్నీ ఒక పొరలాగ వేసి, ఆ పైన ఒక కప్పు పనీర్ తురుము వేయాలి ► రెండవ ప్లేట్లోని మిశ్రమానికి ఈనో ఫ్రూట్ సాల్ట్ జత చేసి, బాగా కలిపి, పనీర్ మీదుగా ఒక పొరలా పోసి, మూత పెట్టి, సుమారు పావు గంట సేపు పెద్ద మంట మీద ఉడికించాలి (పుల్లతో గుచ్చితే ఉడికినదీ లేనిదీ అర్థమవుతుంది) ► స్టౌ మీద బాణలి లో టేబుల్ స్పూను నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ► కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, నువ్వులు వేసి బాగా వేయించిన తరవాత, కప్పు నీళ్లు, టీ స్పూను పంచదార వేసి పంచదార కరిగేవరకు ఉంచాలి ∙ఢోక్లాను ముక్కలుగా కట్ చేయాలి ► సిద్ధంగా ఉన్న పోపును వాటి మీద సమానంగా పోయాలి ∙చివరగా తాజా కొబ్బరి తురుముతో అలంక రించి, అందించాలి. -
చికెన్ దోశ.. ఇలా వేసేద్దాం!
కావలసినవి: దోశ పిండి, చికెన్ ముక్కలు– 200గ్రాములు, కరివేపాకు– రెండు రెమ్మలు, ఉల్లిపాయ–ఒకటి, జీలకర్ర– అరటేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు–టేబుల్ స్పూను, సన్నగా తరిగిన పచ్చి మిర్చి– ఒకటి, మిరియాలపొడి– టేబుల్ స్పూను, కారం –అరటేబుల్ స్పూను, పసుపు –అరటేబుల్ స్పూన్, గరం మసాల–టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు–టేబుల్ స్పూను, టమోటా ప్యూరీ– టేబుల్ స్పూను, నెయ్యి–రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు, ఆయిల్–తగినంత. తయారీ: ► స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ వేసి కలపాలి ► ఇవన్నీ వేగి కాస్త ఆయిల్ పైకి తేలిన తరువాత గరం మసాల, కారం, కొత్తమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాలు వేగనివ్వాలి ∙వేగాక అరకప్పు నీళ్లు పోసి చికెన్ ముక్కలు వేసి పదిని నిమిషాలపాటు ఉడకనివ్వాలి. చికెన్లో నీళ్లన్నీ అయిపోయి డ్రైగా మారిన తరువాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టాలి దోశ వేసే ప్యాన్ పెట్టి దోశను పలుచగా వేయాలి. దాని మీద చికెన్ మిశ్రమం, నెయ్యి వేసి దోశంతా పరిచేలా రాయాలి. తరువాత దోశను రోల్ చేసి ఐదు నిమిషాలు కాలనిస్తే క్రిస్పి చికెన్ దోశ రెడీ అయినట్లే. -
కోడి పకోడి.. నోరూరించేలా!
నిన్నమొన్నటి దాకా ఎండలు మండిపోయాయి. దాంతో వేపుడు కూరలు, కరకరలాడించే శ్నాక్స్ను దూరం పెట్టిన వాళ్లకు కూడా ఇప్పుడు ముసురు పట్టిన వాతావరణానికి సుయ్యి సుయ్యిమని చేసుకు తినే రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు తినాలనిపిస్తుంది. ఇంకెందుకాలస్యం... ముసురుకు మూకుడు పెట్టండి మరి! కోడి పకోడి కావలసినవి: బోన్లెస్ చికెన్ ముక్కలు–కేజి, శనగపిండి–150 గ్రాములు, బియ్యంపిండి–ఐదు టేబుల్ స్పూన్లు, కారం– టీస్పూను, ఎరుపురంగు ఫుడ్ కలర్ – చిటికడు, గరం మసాల– టీస్పూను, పచ్చిమిర్చి – రెండు, అల్లం – అంగుళం ముక్క, నిమ్మకాయ– ఒకటి, నువ్వుల నూనె– డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు– రుచికి తగినంత. తయారీ: ► ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కను పేస్టులా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో పచ్చిమిర్చి, అల్లంపేస్టు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పువేసి ముక్కలకు పట్టేలా కలుపుకొని గంటపాటు మ్యారినేట్ చేసుకోవాలి. ► శనగపిండి, బియ్యంపిండి, కారం, ఫుడ్ కలర్, గరం మసాల, మ్యారినేట్ చేసిపెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పువేయాలి. ► స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి. సలసల కాగిన నూనెలో చికెన్ ముక్కలు వేసి సన్నని మంటమీద వేగనివ్వాలి. ► ముక్కలు ఎర్రగా క్రిస్పీగా మారితే చికెన్ పకోడి రెడీ అయినట్లే. వీకెండ్స్లో ఈవినింగ్ స్నాక్స్గా ఈ కోడిపకోడి ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్ పాప్కార్న్ కావలసినవి: బోన్ లెస్ చికెన్ ముక్కలు– కేజి; ఆయిల్: డీప్ఫ్రైకి సరిపడా , ఉప్పు: రుచికి సరిపడా. మ్యారినేషన్ కోసం... టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ పసుపు, టీస్పూను మిరియాలపొడి, వెల్లుల్లి తరుగు: రెండు టేబుల్ స్పూన్లు: నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు మసాలా కోటింగ్... వంద గ్రాముల బ్రెడ్ ముక్కల పొడి, టీస్పూను కారం, టీ స్పూను పసుపు, టీ స్పూను జీలకర్ర పొడి, టీస్పూను ధనియాలపొడి, టీస్పూను మిరియాల పొడి, రెండు గుడ్ల తెల్లసొన. తయారీ: ∙ చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలు, టేబుల్ స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి. మూతపెట్టి ఒక గంటపాటు మ్యారినేట్ చేయాలి. ► మసాలా కోటింగ్ కోసం తీసుకున్న పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ► డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాగాక...మ్యారినేట్ అయిన చికెన్ ముక్కలను ఒక్కోటి తీసుకుని ముందుగా గుడ్ల తెల్ల సొనలో ముంచి తరువాత మసాలా కోటింగ్ మిశ్రమంలో ముంచి ఆయిల్లో వేసి వేయించాలి. ► ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చికెన్ పాప్కార్న్ రెడీ అయినట్లే. వేడివేడిగా మీకిష్టమైన సాస్తో కలిపి తింటే చికెన్ పాప్కార్న్ రుచి అద్భుతంగా ఉంటుంది. క్రిస్పి బేక్డ్ చికెన్ స్ట్రిప్స్ కావలసినవి: చికెన్ స్ట్రిప్స్ – పావు కేజి, గుడ్లు– రెండు, బ్రెడ్ తరుగు – కప్పు, మైదా – అరకప్పు, బటర్ – టేబుల్స్పూన్, ధనియాల పొడి – టీస్పూను, జీలకర్ర పొడి– అర టీస్పూను, గరం మసాల – అరటీస్పూన్, కారం – టీస్పూను, కొత్తిమీర, పుదీనా తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. తయారీ: బ్రెడ్ముక్కల తరుగును ఒక గిన్నెలో తీసుకుని దానిలో బటర్, పుదీనా, కొత్తిమీర తరుగు, మైదా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గుడ్ల సొనను మరోగిన్నెలో గిలకొట్టి పెట్టుకోవాలి. ► చికెన్స్ట్రిప్లను ఒకగిన్నెలో వేసి జీలకర్ర పొడి, గరం మసాల, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి చికెన్కు పట్టేలా బాగా కలపాలి. ► చికెన్స్ట్రిప్స్ను బ్రెడ్ ముక్కల తరుగు కలిపిన మిశ్రమంలో ముంచి తరువాత గుడ్ల సొనలో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ► డీప్ ఫ్రై అయిన చికెన్స్ట్రిప్లను పదినిమిషాలు చల్లారనిచ్చి, తరువాత అవెన్లో ఏడు నిమిషాలు ఉంచి తీస్తే, ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ స్ట్రిప్స్ రెడీ అయినట్లే. -
Rajasthani Onion Kachori: రాజస్థానీ ఉల్లి కచోరీ
కావలసినవి: మైదా పిండి – పావు కేజీ; వంట సోడా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కలోంజీ (ఉల్లి గింజలు) – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టీ స్పూన్లు; నూనె – ఒక టేబుల్ స్పూను; నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను (బాగా నలపాలి); పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా; ఉల్లిపాయలు – అర కిలో (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; చాట్ మసాలా – ఒక టీ స్పూను; కారం – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; బంగాళ దుంప – 1 (మీడియం సైజు); కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మ రసం – ఒక టీ స్పూను తయారీ: ముందుగా ఒక పాత్రలో మైదా పిండి, వంట సోడా, ఉప్పు, కలోంజీ, నెయ్యి వేసి బాగా కలపాలి తగినన్ని నీళ్లు జత చేస్తూ, సుమారు పది నిమిషాల పాటు పూరీ పిండిలా గట్టిగా కలపాలి ఒక టీ స్పూను నూనె వేసి మరోమారు బాగా కలిపి, పైన తడి వస్త్రం వేసి సుమారు అరగంట పక్కన ఉంచాలి బంగాళ దుంపను ఉడికించి, తొక్కు తీసి, చేతితో మెత్తగా మెదిపి పక్కన ఉంచుకోవాలి స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి నలిపి ఉంచుకున్న ధనియాలు జత చేయాలి పచ్చి మిర్చి తరుగు, ఇంగువ జత చేసి బాగా కలపాలి ఉల్లి తరుగు వేసి సుమారు పది నిమిషాల పాటు బంగారు రంగులోకి వచ్చేవర కు కలుపుతుండాలి ఉప్పు, చాట్ మసాలా, మిరప కారం, పసుపు, గరం మసాలా జత చేసి మరోమారు కలపాలి ఉడికించి ఉంచుకున్న బంగాళ దుంప ముద్ద జత చేసి మరోమారు కలియబెట్టాలి కొత్తిమీర తరుగు, నిమ్మ రసం జత చేసి కలిపి, దింపి చల్లారనివ్వాలి నానబెట్టి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ఉల్లి తరుగు మిశ్రమాన్ని కూడా ఉండలు చేసి పక్కన ఉంచాలి మైదా పిండి ఉండలను ఒక్కోటి చేతిలోకి తీసుకుని, కొద్దిగా వెడల్పుగా ఒత్తాలి ఉల్లి మిశ్రమం ఉండను మధ్యలో ఉంచి, అంచులు మూసేసి, చేతితో జాగ్రత్తగా కచోరీ మాదిరిగా ఒత్తాలి స్టౌ మీద బాణలిలో నూనె పోసి బాగా మరిగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న కచోరీలు వేసి, స్టౌ ఆర్పేయాలి మూడు నిమిషాల తరవాత కచోరీలు పైకి తేలుతున్న సమయంలో, స్టౌ వెలిగించి, కచోరీలను బాగా వేయించి, కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి. గ్రీన్ ఫిష్ కర్రీ.. ఇలా తయారీ! -
నోటిని తీపి చేస్తూ.. పండుగను సందడిగా చేసుకుందాం
స్వీట్ పొంగల్ కావలసినవి: పాలు – 4 కప్పులు; బియ్యం – కప్పు; బెల్లం పొడి – కప్పు; జీడిపప్పులు – 10; కిస్మిస్ – 2 టేబుల్స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – 6 టేబుల్ స్పూన్లు; కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు తయారి: ముందుగా పాలను మరిగించాలి ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, మరుగుతున్న పాలలో వేయాలి ∙ బాగా ఉడికిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టి, ఉడికించాలి ∙ ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి ∙బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేసి వేయించి, ఉడికిన పొంగల్లో వేసి బాగా కలపాలి వేడివేడిగా వడ్డించాలి. సకినాలు కావలసినవి: బియ్యం – ఒక కప్పు; నువ్వులు – అర కప్పు; వాము – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీటిని ఒంపేయాలి ∙బియ్యాన్ని పొడి వస్త్రం మీద పావు గంటసేపు నీడలో ఆరబెట్టాలి (పూర్తిగా తడిపోకూడదు) ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసి, జల్లెడ పట్టాలి ∙ఒకటిన్నర కప్పుల పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఉప్పు, వాము, నువ్వులు జత చేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ, జంతికల పిండిలా కలిపి, వస్త్రంతో మూసి ఉంచాలి ∙కొద్ది కొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, సకినాలు మాదిరిగా చుట్టాలి (పిండి ఎండినట్టుగా అనిపిస్తే, కొద్దికొద్దిగా తడి చేసుకోవాలి) ∙మొత్తం పిండిని సకినాలుగా ఒత్తి, సుమారు రెండు గంటల పాటు ఆరనివ్వాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ∙ఒత్తి ఉంచుకున్న సకినాలను అట్లకాడ సహాయంతో జాగ్రత్తగా తీసి, కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. పులి పీఠా కావలసినవి: చిక్కటి పాలు – 2 లీటర్లు; బియ్యప్పిండి – 200 గ్రా.; బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – 2 కప్పులు; గట్టి బెల్లం – 800 గ్రా. (సన్నగా తురమాలి). తయారీ: ∙స్టౌ మీద బాణలిలో కొబ్బరి తురుము వేసి, తyì పోయేవరకు బాగా కలపాలి ∙సగం బెల్లం జత చేసి, మొత్తం కరిగి, మిశ్రమం సగం అయ్యేవరకు కలిపి, దింపేసి, చల్లారాక ఈ మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకోవాలి ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ∙వేడి నీళ్లు జత చేస్తూ పిండిని మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి ∙పిండిని సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి ∙ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని గుండ్రంగా చపాతీ మాదిరిగా ఒత్తాలి ∙కొబ్బరి తురుము మిశ్రమాన్ని అందులో ఉంచి, అర్ధ చంద్రాకారంగా ఒత్తాలి ∙స్టౌ మీద పాలు ఉంచి చిక్కగా అయ్యేవరకు మరిగించాలి ∙బెల్లం జత చేసి కరిగించాలి. తయారు చేసి ఉంచుకున్న అర్ధచంద్రాకారంలో ఉన్న పీఠాలను పాలలో వేసి ఒకసారి కలిపి, దింపేయాలి. మకర చౌలా కావలసినవి: ముడి బియ్యం – అర కప్పు; పాలు – ఒక కప్పు; కొబ్బరి తురుము – అర కప్పు; చెరకు ముక్కలు – అర కప్పు; బాగా ముగ్గిన అరటి పండ్లు – 2; పంచదార – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; కాటేజ్ చీజ్ – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; పండ్ల ముక్కలు – అర కప్పు తయారీ: ముందు రోజు రాత్రి బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి నానబెట్టాలి ∙ మరుసటి రోజు ఉదయం బియ్యాన్ని శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద సుమారు గంటసేపు ఆరబెట్టాలి ∙మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా పిండి పట్టాలి ∙స్టౌ మీద ఒక పాత్రలో బియ్యప్పిండి, పాలు, కొబ్బరి తురుము, చెరకు ముక్కలు, పంచదార, అరటి పండ్లు, మిరియాల పొడి, కాటేజ్ చీజ్, అల్లం తురుము, పండ్ల ముక్కలు వేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి ∙అరటి పండ్లను ముక్కలు చేసి, చేతితో బాగా మెత్తగా అయ్యేలా మెదిపి, బియ్యప్పిండి మిశ్రమానికి జత చేసి, రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి ∙వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. చల్లగా కావాలనుకునేవారు కొద్దిసేపు ఫ్రిజ్లో ఉంచితే చాలు. -
అనంతపురం జిల్లా మడకశిరలో వంటావార్పు
-
ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉధృతి
-
ఆర్టీసీ సమ్మె: ఆందోళన ఉధృతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. డిమాండ్ల పరిష్కారం కోసం 18 వరోజూ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిల పక్షం వంటా వార్పునకు పిలుపు నిచ్చింది. సికింద్రాబాద్లోని జేబీఎస్ వద్ద ఆర్టీసీ జేఏసీ, రాజకీయ జేఏసీ నేతలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోవైపు ఆర్టీసీ సమ్మె విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. బస్సుల కొరత కారణంగా వారు నానా పాట్లు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత ఆర్టీసీ కార్మికుల సమ్మె కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. సమ్మెలో భాగంగా కార్మికులు వేకువజామునే కరీంనగర్ బస్ స్టేషన్కు చేరుకొని ఆందోళనకు దిగారు. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో అద్దం ద్వంసమయింది. సమ్మెకు సహకరించాలని బస్సులు నడిపే తాత్కాలిక డ్రైవర్లను కార్మికులు కోరారు. బస్ స్టేషన్లో ఉన్న బస్సును డిపోలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు బస్సులు బయటికి వెళ్లకుండా నిలిచిపోయాయి. బస్సులను అడ్డుకున్న జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీతాలు లేక న్యాయమైన డిమాండ్ కోసం కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని నేతలు విమర్శించారు. -
జగన్ దీక్షకు మద్దతుగా రోడ్లపై వంటావార్పు
చోడవరం/ పులివెందుల : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గుంటూరులో వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా విశాఖ జిల్లా చోడవరంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో భీమిలి-నర్సీపట్నం రోడ్డుపై చోడవరం జంక్షన్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అలాగే వైఎస్సార్ జిల్లా పులివెందులలో కదిరి రింగ్ రోడ్డు, ముద్దనూరు రింగ్ రోడ్డుల వద్ద కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డిల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.జగన్కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు, అభిమానులు నాలుగు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగిన సంగతి తెల్సిందే. -
వైఎస్సార్సీపీ నేతల వంటా-వార్పు
రేగిడి (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండల కేంద్రంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు శనివారం మధ్యాహ్నం వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నేతలు శనివారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జగన్మోహనరావు, ఎమ్మెల్యే జోగులు, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘సమ్మె’ పాట్లు యథాతథం!
-
ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు వంటావార్పు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరింది. ఆర్టీసీ ఎండీతో కార్మిక సంఘాలు శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అందులోభాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముషీరాబాద్ డివిజన్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టనున్నారు. అలాగే నేటి ఉదయం 11 గంటలకు ఎన్ఎంయూలోని కార్మిక సంఘాలు ప్రెస్మీట్ ఏర్పాటు చేయనుంది. ఆర్టీసీ కార్మికులతో ఆ సంస్థ జేఎండీ రమణారావు భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఫిట్మెంట్పై చర్చించే అవకాశం ఉందని తెలిసింది.