VIP
-
విసుగెత్తిస్తున్న వీఐపీలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో వివిధ పదవుల్లో ఉండే నాయకులు, అధికారంలో లేకపోయినా ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా, వ్యాపారం సహా పలు రంగాల్లో అత్యంత ప్రముఖులు.. ఇలా మన దేశంలో వీఐపీ (వెరీ ఇంపార్టెంట్ పర్సన్)లకు కొదవ లేదు. వీళ్లు కాలు తీసి కాలు పెట్టినా.. అత్యంత ప్రాధాన్యం కోరుకుంటారు. ఇది కొన్ని సందర్బాల్లో శ్రుతి మించుతోంది కూడా. ఇటీవల ఝాన్సీ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు చనిపోవడం తెలిసిందే. ఆ చిన్నారుల తల్లిదండ్రులు మృతదేహాల కోసం ఎదురు చూస్తుండగా.. ఓ మంత్రి పరామర్శకు ఆసుపత్రికి వస్తున్నారని సిబ్బంది రోడ్ల వెంట సున్నంతో లైన్లు కొట్టి ఏర్పాటు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. దేశంలో ఈ వీఐపీ సంస్కృతిపై విమర్శలు మొదలయ్యాయి. దేశంలో వీఐపీ సంస్కృతిపై లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 362 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 45 వేల మంది అభిప్రాయాలు సేకరించింది. ఆ సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు.. వీఐపీ సంస్కృతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 64 శాతం మంది దేశంలో వీఐపీ సంస్కృతి తగ్గడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా రోడ్లపై వెళ్తున్నప్పుడు, టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణ, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మితిమీరిన జోక్యం వంటి అంశాలను వారు ఉదహరించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం, బెదిరింపులకు పాల్పడడం, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ల కోసం డబ్బు వసూలు.. ఇలా ఎన్నో విషయాల్లో వీఐపీల ధోరణిని వారు సర్వేలో లేవనెత్తారు. సర్వేలో పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు వచి్చన సమాధానాలివి. -
Bihar: వీఐపీ అధినేత తండ్రి హత్య
బీహార్లో మరో దారుణం చోటుచేసుకుంది. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) అధినేత ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్యకు గురయ్యారు. ఈరోజు (మంగళవారం) ఉదయం దర్భంగా జిల్లాలోని బిరౌల్లోని ఆయన నివాసంలో ఆయన మృతదేహం కనిపించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని పిలిపించారు. ఎస్డీపీఓ మనీష్ చంద్ర చౌదరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి హత్య జరిగిన సమయంలో వీఐపీ అధినేత ముఖేష్ సాహ్ని ముంబైలోని తన కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలియగానే ఆయన దర్భంగాకు బయలుదేరారు.మాజీ మంత్రి ముఖేష్ సాహ్నీకి ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ హత్య గురించి బీజేపీ నేత అజయ్ అలోక్ మాట్లాడుతూ జరిగిన ఘటన అత్యంత ఘోరమని అన్నారు. 72 గంటల్లో హంతకుడిని పట్టుకుంటామన్నారు. నేరాలను ఎలా అరికట్టాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని ఆయన పేర్కొన్నారు. -
ఫ్లిప్కార్ట్ గుడ్న్యూస్.. ఇక హైదరాబాద్లోనూ కొత్త ఆఫర్!
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను ఇప్పుడు హైదరాబాద్కు విస్తరించింది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ వీఐపీ (Flipkart VIP) సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను కొత్తగా హైదరాబాద్తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్ కాయిన్స్ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. క్లియర్ట్రిప్లో ఒక్క రూపాయికే ఫ్లైట్ క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్ట్రిప్ హోటల్ బుకింగ్లపై అదనపు ఆఫర్లు, 48 గంటలలోపు రిటన్ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఎలా నమోదు చేసుకోండి.. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లేదా యాప్ని సందర్శించండి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్ఫామ్కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్ను క్రియేట్ చేసుకోండి. వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్ వీఐపీ బెనిఫిట్స్' బటన్పై నొక్కండి చెల్లింపు, తుది ప్రక్రియ కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్ను కన్ఫర్మ్ చేఏయండి విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్సైట్ లేదా యాప్లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. -
చిన్నారిని చిదిమేసిన కారు.. శోకసంద్రంలో తల్లిదండ్రులు..
రాజన్న సిరిసిల్ల: మండలంలోని గాజులపల్లిలో ఆరేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు చిదిమేసింది. ఈ ప్రమాదంలో చుట్టపుచూపుగా వచ్చిన చిన్నారి మృతితో గాజు లపల్లిలో విషాదం నిండింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన కొట్టెం పద్మ–రామారావు దంపతుల కూతురు స్వాతి(6)తో కలిసి గాజులపల్లిలో ఉంటున్న సమీప బంధువుల ఇంటికి ఆదివారం వచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ ప్రముఖుడు తన కారులో సిరిసిల్ల నుంచి మండల కేంద్రానికి వస్తుండగా రోడ్డు దాటుతున్న స్వాతిని అతివేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల పగిలిపోవడంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్సై రమాకాంత్ అక్కడికి చేరుకొని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం స్వాతి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ కుటుంబీకులు, గ్రామస్తులు సిరిసిల్ల–కామారెడ్డి రోడ్డుపై ధర్నా చేశారు. -
సురోవికిన్ కూడా వాగ్నర్ సభ్యుడే
న్యూయార్క్: రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన అక్కడి మిలటరీలో లుకలుకలను ఒకటొకటిగా బయట పెడుతోంది. తాజాగా, రష్యా టాప్ మిలటరీ కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్ వాగ్నర్ గ్రూప్లో రహస్య వీఐపీ సభ్యుడని తెలిపే కొన్ని పత్రాలు దొరికినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. వాగ్నర్ వీఐపీ సభ్యుడిగా సురోవికిన్ పేరు 2018లో నమోదైనట్లు అందులో తెలిపింది. ఆయనతోపాటు మరో 30 మంది రష్యా సీనియర్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాగ్నర్ వీఐపీ సభ్యులని పేర్కొంది. వాగ్నర్ సభ్యుడిగా సురోవికిన్ ఉన్నారనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేనప్పటికీ, రష్యా సైనిక బలగాల్లోని చాలా మంది సీనియర్ అధికారులు వాగ్నర్ గ్రూప్తో దగ్గరి సంబంధాలు సాగించేందుకు అవకాశం ఉందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్లే వాగ్నర్ కిరాయి సైనికులు రొస్తోవ్లోని కీలక మిలటరీ బేస్నుæ శ్రమ లేకుండా స్వాధీనం చేసుకోగలిగారన్న అనుమానా లున్నాయి. తిరుగుబాటు అనంతరం సురోవికిన్ కనిపించకుండా పోయారు. ప్రిగోజిన్ తిరుగుబాటు విషయం ఆయనకు తెలుసునంటూ న్యూయార్క్టైమ్స్ కథనం పేర్కొంది. ప్రిగోజిన్ను తిరుగుబాటు ఆపేయాలంటూ విడుదల చేసిన వీడియోలో సురోవికిన్ తడబడుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. దీంతో, ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలున్నాయి. జనర ల్ ఆర్మగెడ్డాన్గా పిలుచుకునే సురోవికిన్ అధ్యక్షుడు పుతిన్కు నిన్నటిదాకా నమ్మినబంటు. తాజా పరిణామాలతోనూ ఆయన్ను పుతిన్ నమ్ముతారా అన్నది తేలాల్సి ఉంది. -
సోలో ఫ్లైట్ జర్నీ.. రూ.13 వేలకే ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణం!
ప్రైవేట్ జెట్ అంటే విలాసవంతమైన విమానం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలకు రూ.కోట్ల ఖరీదైన ప్రైవేట్ జెట్ విమానాలు ఉంటాయి. అందులో వారు ఏకాంతంగా ప్రయాణిస్తుంటారు. అలాంటి అనుభూతి ఓ సాధారణ ప్రయాణికుడికి రూ.13వేలకే దక్కింది. అయితే అది ప్రైవేట్ జెట్ కాదు కానీ ఓ విమానానికి అంతటికీ అతనొక్కడే ప్రయాణికుడు. (Mahindra Thar: మహీంద్రా థార్ కావాలంటే మరో రూ.లక్ష కావాలి!) న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం... యూకేకు చెందిన 65 ఏళ్ల పాల్ విల్కిన్సన్ ఉత్తర ఐర్లాండ్ నుంచి తన కుటుంబాన్ని కలవడానికి పోర్చుగల్కు బయలుదేరాడు. విమానం ఎక్కేందుకు ఎయిర్పోర్ట్కు చేరుకున్న పాల్కు గేట్ వద్ద ప్రయాణికులు ఎవరూ కనిపించలేదు. దీంతో విమానం రద్దయిందేమో అనుకుని ఆరా తీయగా మొత్తం విమానానికి తాను ఒక్కడినే ప్రయాణికుడని తెలిసింది. (ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్లో ఉత్పత్తి) ఎయిర్పోర్ట్, విమాన సిబ్బంది విల్కిన్సన్ను వీఐపీ అతిథి, కింగ్ పాల్ అంటూ సంబోధిస్తూ విమానంలోకి స్వాగతం పలికారు. విల్కిన్సన్ విమానంలో తనకు నచ్చిన సీటు ఎంచుకుని కూర్చుని ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణాన్ని ఆస్వాదించారు. ఈ ప్రయాణానికి అతనికి అయిన ఖర్చు కేవలం 162 డాలర్లు (సుమారు రూ. 13,000) మాత్రమే. (New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!) -
హీరో ధనుష్కు హైకోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: నటుడు ధనుష్ కథానాయకుడుగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ). ఆ చిత్రానికి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా, ఈ సినిమాలో పొగతాగే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై టుబాకో నియంత్రణ కమిటీ 2014లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పొగతాగే సన్నివేశాలను ప్రచారం చేయటం చట్ట ప్రకారం నేరమని, ఈ మూవీలో అలాంటి సన్నివేశాలను పొందుపరిచారని ఆరోపించింది. ప్రభుత్వ హెచ్చరికలు పొందుపరిచలేదని ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్థానిక సైదాపేట కోర్టులో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్లపై పిటిషన్ దాఖలు చేశారు. సైదాపేట కోర్టు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్లకు ప్రత్యక్షంగా, హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఐశ్వర్య రజనీకాంత్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అదేవిధంగా ధనుష్ కూడా హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం న్యాయమూర్తి సతీష్ కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. ధనుష్ తరపు న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ హాజరై ధనుష్ సైదాపేట కోర్టుకు హాజరవడంపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి ధనుష్ను సైదాపెట కోర్టులో హాజరవడంపై స్టే విధిస్తూ తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. చదవండి: భూవివాదం కేసు.. కోర్టుకు హాజరైన రానా -
వీఐపీల మ్యాప్ వచ్చేసింది.. టక్కున సమాధానం
ఈ ప్రశ్నకు మీరు బదులిచ్చినా ఇవ్వకున్నా ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ మ్యాప్ (ప్రపంచ పటం) మాత్రం టక్కున సమాధానం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులు పుట్టిన ప్రాంతాలను చిటికెలో చూపిస్తోంది. ఉదాహరణకు లండన్లో పుట్టిన అత్యంత ప్రముఖ వ్యక్తి ఎవరు? అని యూజర్లు అడిగితే చార్లీ చాప్లిన్ పేరును మ్యాప్ సూచిస్తోంది. అమెరికాలోని హోనలులులో పుట్టిన గొప్ప వ్యక్తి ఎవరంటే మాజీ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా పేరు వస్తోంది. అలాగే భారత్ నుంచి టిప్పుసుల్తాన్, ఔరంగజేబు వంటి నాటి రాజులు మొదలు మహాత్మాగాంధీ, నెహ్రూ, రాజీవ్గాంధీ వంటి నేతల వరకు ఆయా వ్యక్తులు పుట్టిన ప్రాంతాలనుబట్టి మ్యాప్ చూపుతోంది. మీ ప్రాంతంలోని ప్రముఖుల వివరాల కోసం ఈ లింక్ను tjukanovt.github.io/notable-people క్లిక్చేయండి. గుర్తించేది ఇలా.. వికీపీడియా, వికీడేటాలోని సమాచా రం ఆధారంగా ప్యారిస్ వర్సిటీకి చెందిన పరిశోధకులు వివిధ రంగాల వ్య క్తుల ప్రాముఖ్యతను ఇటీవల లెక్కగట్టారు. దీని ఆధారంగా ప్రముఖ భూ గోళ శాస్త్రవేత్త, వార్తావెబ్సైట్లు, సంస్థలకు ఆన్లైన్ మ్యాప్లందించే మ్యాప్ బాక్స్ కంపెనీ సీనియర్ డిజైనర్ టోపీ జుకనోవ్ ఇంటరాక్టివ్ మ్యాప్ను రూ పొందించారు. వికీపీడియాలో నమోదైన ఎంట్రీలు, వాటి పొడవు, 2015 నుంచి 2018 మధ్య వికీపీడియాలో ఒక్కో ప్రముఖ వ్యక్తికి లభించిన సగ టు వ్యూయర్షిప్ తదితరాలను పరిగణనలోకి తీసుకొని ఈ మ్యాప్ను రూ పొందించినట్లు జుకనోవ్ చెప్పారు. సంస్కృతి, శాస్త్ర పరిశోధన, నాయకత్వం, క్రీడలు లేదా ఆటలు అనే నాలుగు రంగాలకు చెందిన వ్యక్తుల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. -
కోటిశ్వరులే టార్గెట్ గా చికొటి ప్రవీణ్ క్యాసినో దందా
-
పంజాబ్ ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం..
చండీగఢ్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోగ్యశాఖ మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 424 మంది ప్రముఖులకు సెక్యురిటీ రద్దు చేశారు. ప్రముఖులకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంటున్నట్టు శనివారం సంచలన ప్రకటన చేశారు. గత నెలలో కూడా 184 మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను రద్దు చేస్తూ భగవంత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ల అవసరం లేదు.. రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఉపసంహరించిన వారిలో అకాల్ తక్త్ జాటేదార్గా వ్యవహరిస్తున్న జ్ఞాని హర్ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. ఆయనకు ఇదివరకు 6 మంది అంగరక్షకులు ఉండగా.. సీఎం నిర్ణయంతో ముగ్గురు సేవల నుంచి వెనుదిరిగారు. ఈ విషయమై హర్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంతో తనకు ఇబ్బందేమీ లేదని అన్నారు. మిగతా ముగ్గురిని కూడా వెనక్కి పంపిస్తానని చెప్పారు. తనకు రక్షణ కల్పించేందుకు పంజాబ్ యువకులు చాలునని స్పష్టం చేశారు. మరోవైపు హర్ప్రీత్ సింగ్ సెక్యురిటీ ఉపసంహరణపై విమర్శల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వెనక్కి పిలిచిన ముగ్గురు బాడీ గార్డులను తిప్పి పంపిస్తామని తెలిపింది. అయితే, దీనిని హర్ప్రీత్ సింగ్ తిరస్కరించినట్టు తెలిసింది. With its decision & flip flop on the withdrawal of official security to the highly respected Jathedar Sahiban of Khalsa Panth's venerated Takhts, including Sri Akal Takht Sahib, @AAPPunjab govt has merely exposed itself as a stooge of anti-Punjab & anti-Panth @ArvindKejrival.1/3 pic.twitter.com/cc1Mpg3dKB — Sukhbir Singh Badal (@officeofssbadal) May 28, 2022 -
ఆ 10 రోజులు సిఫారసు లేఖలు పంపొద్దు
తిరుమల: జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం సిఫారసు లేఖలు పంపవద్దని వీఐపీలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం విజ్ఞప్తి చేశారు. 10 రోజుల పాటు చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టడంతో వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు తిరుమలలోని నందకం, వకుళ ఆతిథి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని, తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతిలోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు. తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్లలో శ్రీవాణి ట్రస్ట్కు విరాళమిచ్చిన భక్తులు వసతి పొందాలని తెలిపారు. త్వరలో అన్నమయ్య మార్గానికి టెండర్లు శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు నడిచిన మార్గం ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు వెంటనే సమగ్ర సర్వే చేసి అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. -
వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు సిఫారసు లేఖలు పంపద్దు: వైవీ సుబ్బారెడ్డి
-
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
వీఐపీలే ముఖ్యమా? సామాన్యులంటే లెక్కలేదా..?
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రశాసన్నగర్లోని ఎంపీ, ఎమ్మెల్యేల కాలనీతోపాటు వీఐపీలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ అన్నీ బాగున్నాయి. జీహెచ్ఎంసీకి వీఐపీలే ముఖ్యమా? సామాన్య ప్రజలు తిరిగే రోడ్లను మాత్రం మరమ్మతులు చేయకుండా గాలికొదిలేశారు. అంటే సామాన్యుల ప్రాణాలు పోతున్నా పట్టదా? ఆస్తి పన్ను చెల్లించే వారంటే లెక్కలేదా? మేమూ హైదరాబాద్ పౌరులమే. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు గుంతలతో మేమూ ఇబ్బందులు పడుతున్నాం’’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం జీహెచ్ఎంసీ యంత్రాంగంపై మండిపడింది. వర్షాకాలం ఇప్పటికే ప్రారంభమైందని, రోడ్లకు మరమ్మతులు చేయడానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలని ప్రశ్నించింది. హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని, ఇక్కడ వసతులు బాగుంటేనే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి గంగాధర్ తిలక్ (73) తన కొచ్చే పెన్షన్ డబ్బులతో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లపై గుంతలను పూడ్చుతున్నాడంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని గతంలో సుమోటోగా విచారణకు స్వీకరించిన జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరో సారి విచారించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని, ఇందులో 6,176 కి.మీ. రోడ్లను కాంక్రీట్ రోడ్లుగా మార్చామని, మిగిలిన రోడ్లను త్వరలోనే కాంక్రీట్ రోడ్లుగా మారుస్తామని జీహెచ్ఎంసీ తరఫున సీనియర్ న్యాయ వాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. రోడ్లకు మరమ్మతులు చేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలబారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వీటికి సంబంధించి గత సంవత్సరం తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఏం చేశారో చెప్పమంటే గత ఏడాది చేసింది చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఫిర్యాదుల కోసం యాప్ జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యల ఫిర్యాదుకు ‘మై జీహెచ్ఎంసీ యాప్’ను ఐదేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చామని నిరంజన్రెడ్డి వివరించారు. తమ ప్రాంతంలో ఉన్న సమస్యను ఫొటోతీసి యాప్లో అప్లోడ్ చేస్తే జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఐదేళ్లలో 28 వేల ఫిర్యాదులు రాగా, మెజారిటీ ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. అనం తరం రోడ్ల మరమ్మతులకు తీసుకున్న చర్యలపై తాజాగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
నిమ్స్లో వీఐపీ కరోనా రోగులు
హైదరాబాద్: నిమ్స్లో కరోనాతో బాధపడుతున్న పలువురు ప్రముఖులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. నిమ్స్ పాత భవనంలోని స్పెషల్ రూమ్లో చికిత్స పొందుతున్న వారిలో నిజామాబాద్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కె. సాంబశివరావు చికిత్స పొందుతున్నారు. నిమ్స్ వైద్యులు, ఉద్యోగులకే పరిమితమైన కోవిడ్ సేవలు రాష్ట్రంలోని ప్రముఖులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. నిమ్స్లో పని చేస్తున్న వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా మూడు వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. -
‘ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తోనే ఉన్నారు’
జైపూర్: బహుజన సమాజ్వాది పార్టీ(బీఎస్పీ)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు చెందిన వారేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్నారయణ్ మీనా తెలిపారు. స్పీకర్ వారిని కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలుగా గుర్తించినట్లు చెప్పారు. ఎమ్మెల్యేల సభ్యత్వం గురించి మీనా మాట్లాడుతూ, ‘బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. నేను ఎలాగైతే ఎమ్మెల్యేనో వారు కూడా అంతే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు’ అని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి విప్ జారీ చేయడంపై ఆయన మాట్లాడుతూ, మాయావతి దళిత పార్టీ సమావేశాలకు హాజరుకారని, ఆమె కేవలం ఉపన్యాసాలు మాత్రమే ఇస్తారని అని విమర్శించారు. ఆమె అసలు నాయకురాలు కాదని, కాన్షీరామ్ను ఆమెలో చూసుకోవడం కారణంగా నాయకురాలిగా మారారని ధ్వజమెత్తారు. రాజస్తాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్కు మద్దతుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకూడదని మాయావతి విప్ జారీ చేశారు. దీంతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. చదవండి: మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్కు షాక్ -
‘ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలోనే’
సాక్షి, వైఎస్సార్ కడప: ధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఏపీలో జరుగుతుందని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేవలం రెండు పేజీల్లో యూనిక్గా నవరత్నాల అమలకు.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే నాంది పలికారని తెలిపారు. ఆదేవిధంగా జగన్మోహన్రెడ్డిని ప్రకృతి ఆశీర్వదించిదని, వాతావరణం పులకరించి.. అన్ని డ్యాంలు నిండు కుండలా ఉన్నాయన్నారు. కాగా తొట్టిగ్యాంగ్ పార్టీ అయిన టీడీపీ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ‘70 ఏళ్లు ఉన్నాయి. పెద్ద మనిషివి కొంచెం మైండ్ పెట్టు. పదేళ్ల వెనక్కి వెళ్లావు’ అంటూ పరోక్షంగా చంద్రబాబుపై కొరముట్ల విమర్శలు చేశారు. -
వినోదంలో యాప్లే ‘టాప్’
న్యూఢిల్లీ: బ్యాండ్విడ్త్ కోసం బెగ్గింగ్ చేసే రోజులు పోయాయిప్పుడు. ఒక వీడియోను డౌన్లోడ్ చేసుకుంటే డేటా ఖర్చయిపోతుందేమోననే భయాలు కూడా లేవిప్పుడు. అందుకే... పెన్డ్రైవ్లోకి డౌన్లోడ్ చేసుకుని దాన్నే అలా చేతులు మార్చుకునే రోజులిప్పుడు లేవు. డౌన్లోడ్ చేసుకుంటే స్పేస్ వృథా అవుతుందన్న కారణంతో అంతా తమ సొంత టీవీల్లోనో, మొబైల్లోనో వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇదిగో... ఈ ధోరణి ఎంటర్టైన్మెంట్ రంగ రూపురేఖల్ని మార్చేస్తోంది. డిజిటల్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల టీవీ చానళ్లకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలు అమల్లోకి వచ్చాక ఓటీటీ వేగం మరింత పెరిగింది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సర్వే ప్రకారం మీడియా– వినోద రంగానికి సంబంధించి 2019లో తొలిసారిగా సినిమాను డిజిటల్ విభాగం అధిగమించనుంది. 2021 నాటికి ప్రింట్ను కూడా దాటేసి రూ.35,400 కోట్ల స్థాయికి చేరనుంది. ఈ విభాగంలో ఇంత భారీ స్థాయిలో అవకాశాలుండటంతో ఓటీటీ సంస్థలు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 30 పైచిలుకు ఓటీటీ ప్లాట్ఫామ్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి సినిమాలు, చానల్స్ ప్రసారంతో పాటు సొంతంగా సీరియళ్లు, సినిమాల్లాంటి కంటెంట్ను కూడా రూపొందిస్తూ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గతేడాది ఏకంగా 1,200 గంటల నిడివి ఉండే తాజా కంటెంట్ను ఓటీటీ సంస్థలు నిర్మించాయి. హాట్స్టార్, ఈరోస్ నౌ, సోనీ లైవ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హంగామా, వూట్, ఆల్ట్బాలాజీ, జీ5, సన్నెక్ట్స్ తదితర సంస్థలు ఓటీటీ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దేశీ సంస్థలు అంతర్జాతీయంగానూ విస్తరిస్తున్నాయి. ఈరోస్ డిజిటల్ తాజాగా చైనా సంస్థతో జట్టు కట్టి భారత్, చైనాలో ఒక ప్రోగ్రామ్ను చిత్రీకరిస్తోంది. బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా కో–మార్కెటింగ్ డీల్స్ కుదుర్చుకుంది. చౌకగా చార్జీలు.. ఓటీటీ సంస్థలు వీలైనంత చౌకగా కంటెంట్ను ఆఫర్ చేసేందుకు పోటీపడుతున్నాయి. ఉదాహరణకు హాట్స్టార్ అన్ని స్పోర్ట్స్, అమెరికన్ షోస్, సినిమాలకు వార్షికంగా రూ.999 చార్జీలు వసూలు చేస్తోంది. రూ.299కి నెలవారీ ప్యాకేజీ కూడా అందిస్తోంది. టీవీల్లో ప్రసారం కాకముందే స్పెషల్స్, సీరియల్స్ మొదలైనవి చూడాలనుకునేవారి కోసం హాట్స్టార్ వీఐపీ పేరుతో వార్షికంగా రూ.365 చార్జీలకు అందిస్తోంది. నెట్ఫ్లిక్స్ చార్జీలు నెలకు రూ.500–800 స్థాయిలో ఉంటున్నాయి. అటు అమెజాన్ ప్రైమ్ వీడియో చార్జీలు నెలకు రూ.129, ఏడాదికి రూ.999 స్థాయిలో ఉన్నాయి. నెలవారీగానే కాక వారం వ్యవధికి పనిచేసే చిన్న ప్యాక్లనూ ఓటీటీ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. సోనీలైవ్ 7 రోజులకు రూ.29 ప్యాక్ను ప్రవేశపెట్టింది. ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో హాట్స్టార్ కూడా కేవలం రూ.25 నెలవారీ చార్జీలతో స్పోర్ట్స్ ప్యాకేజీని అందిస్తోంది. జీ5 సైతం ఇదే కోవలో చౌక ప్యాకేజీలను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. సాధారణంగా బడ్జెట్ ప్యాక్లకు వ్యతిరేకంగా ఉండే నెట్ఫ్లిక్స్ కూడా భారత యూజర్లకు చౌక ప్యాక్లపై దృష్టి పెడుతోంది. వారానికి రూ.65కే సర్వీసులు అందించే ప్యాక్ను పరిశీలిస్తోంది. భారీ పెట్టుబడులు.. ఓటీటీ సంస్థలు భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈరోస్ నౌ సంస్థ దగ్గర ఇప్పటికే 12,000 పైచిలుకు సినిమాలున్నాయి. కొత్తగా మరింత కంటెంట్ కొనుగోలు, నిర్మాణం కోసం వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో 50–70 మిలియన్ డాలర్లు వెచ్చించబోతోంది. స్టార్ యూఎస్ హోల్డింగ్స్తో కలిసి స్టార్ ఇండియా తమ ఓటీటీ విభాగం హాట్స్టార్లో దాదాపు రూ.1,066 కోట్ల (153 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. గతేడాది పెట్టిన రూ.516 కోట్ల పెట్టుబడులకు ఇది అదనం. ఇతర సంస్థలూ ఇదే స్థాయిలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. నెట్ఫ్లిక్స్ ఇప్పటికే భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఎనిమిది కొత్త సినిమాలు, 12 వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. సేక్రెడ్ గేమ్స్ లాంటి బ్లాక్బస్టర్ సిరీస్ తరహాలోనే ఇవి కూడా హిట్ అవుతాయని ఆశిస్తోంది. దేశీ సంస్థ ఆల్ట్బాలాజీ కూడా 2019లో 30–40 షోలు నిర్మిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రాంతీయ’ కంటెంట్పై దృష్టి.. సాధారణంగా యువ జనాభాలో ఎక్కువ శాతం వీక్షకులు బస్సులు, రైళ్లు, ట్యాక్సీల్లో ప్రయాణించేటప్పుడో లేదా లంచ్ బ్రేక్లోనూ చూసేందుకు అనువైన 10–15 నిమిషాల తక్కువ నిడివి ఉండే కంటెంట్ను ఇష్టపడుతున్నారని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోస్ నౌ లాంటి సంస్థలు ఇలాంటి కంటెంట్పై దృష్టిపెడుతున్నాయి. ఇక చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచీ వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఓటీటీ సంస్థలు గుర్తించాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వీక్షకులకు మరింత చేరువయ్యే మార్గాలపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లోనూ కంటెంట్ను అందిస్తున్నాయి. వయాకామ్18కి చెందిన వూట్ సంస్థ తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషల్లో కంటెంట్ రూపొందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ కూడా తెలుగు సహా తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ వంటి భాషల్లో ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఓటీటీ జోరు ఇదీ...! ► 2018లో 32.5 కోట్ల మంది ఆన్లైన్ వీడియోలు వీక్షించారు. ఇది అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 25 శాతం అధికం. ► వచ్చే మూడేళ్లలో డిజిటల్ వీడియో వినియోగదారుల సంఖ్య 50–60 కోట్లకు చేరగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ► 2017లో 70 లక్షలుగా ఉన్న సబ్స్క్రయిబర్స్ సంఖ్య 2018 నాటికి 1.2–1.5 కోట్లకు పెరిగారు. ► దేశీయంగా 34 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్ యూజర్లు ఉండగా, డేటా వినియోగం గతేడాది రెట్టింపయ్యింది. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 29న ఏకాదశి,30న ద్వాదశి రానుంది. ఏకాదశి శుక్రవారం రావటంతో శ్రీవారి దర్శనం నాలుగు గంటలు ఆలస్యం కానుంది. ఏకాదశి నాడు ఉదయం ఐదున్నర గంటలకు వీఐపీ దర్శనం,8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. డిసెంబర్ 28 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు దివ్య దర్శనం, ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏకాదశినాడు ఆరు వీఐపీ దర్శన టికెట్లు, రాజ్యాంగేతర వీఐపీలకు నాలుగు వీఐపీ దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులను 28న ఉదయం 10 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి అనుమతిస్తామని జేఈఓ చెప్పారు. తిరుమలలో అదనంగా ఆరు కిలొమీటర్ల క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ద్వాదశి నాడు వీఐపీ దర్శనాలు రద్దు చేశామని, భక్తులకు నిరంతరం ఆహారం, నీరు అందిస్తామని జేఈఓ అన్నారు. -
శ్రీవారి సన్నిధిలో ఆర్కే రోజా
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న రోజా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు రోజాకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. -
వీఐపీ 3,4 సీక్వెల్స్ వస్తాయి
తమిళసినిమా: వీఐపీ చిత్రానికి మూడు, నాలుగు సీక్వెల్స్ తెరకెక్కించనున్నట్లు నటుడు ధనుష్ వెల్లడించారు. ఆయన నటించిన వీఐపీ( వేలై ఇల్లా పట్టాదారి) చిత్రం పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఆ చిత్రం రఘువరన్ బీటెక్ పేరుతో తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. కాగా వీఐపీకి సీక్వెల్గా వీఐపీ–2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నటుడు ధనుష్ కథ, మాటలు అందించి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అమలాపాల్ నాయకిగా నటించారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను వి క్రియేషన్స్, ధనుష్ వండర బార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సౌందర్యరజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. వీఐపీ 2 చిత్రం ఈ నెల 28న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే చిత్ర ఆడియో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. చిత్ర ట్రైలర్ను 8 మిలియన్ల ప్రేక్షకులను అలరించి రికార్డు సాధించిందని చిత్ర వర్గాలు తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక రాయపేటలోని సత్యం సినిమామాల్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నటుడు ధనుష్ మాట్లాడుతూ వీఐపీ చిత్రం గానీ, వీఐపీ–2 చిత్రం గానీ ఒక హీరోనో, హీరోయిన్నో ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రాలు కావన్నారు. ఈ రెండూ తల్లి ప్రేమానుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రాలని తెలిపారు. వీఐపీ చిత్రం మాదిరిగానే వీఐపీ–2 చిత్రం కూడా జనరంజకంగా ఉంటుందని చెప్పారు. దీనికి 3,4 భాగాలు కూడా రూపొందుతాయని తెలిపారు. వీఐపీ చిత్రానికి, రెండవ భాగానికి వైవిధ్యం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రానికి షాన్ రోల్డన్ను సంగీతదర్శకుడిగా ఎంచుకున్నామని వివరించారు. ఇక ఇంతకు ముందు తన దర్శకత్వంలో చక్కని భావోద్రేకాలతో కూడిన కథా చిత్రంగా రూపొందిన పా.పాండి చిత్రానికి సీక్వెల్ చేస్తానని చెప్పారు. ఇకపై తమిళంలో నటిస్తా కాజోల్ మాట్లాడుతూ సుమారు 20 ఏళ్ల తరువాత మళ్లీ తమిళంలో వీఐపీ–2 చిత్రంలో నటించానన్నారు. వీఐపీ 2 చిత్రం వేరే కోణంలో ఉంటుందన్నారు. వీఐపీ 2ను సౌందర్యరజనీకాంత్ చాలా చక్కగా తెరకెక్కించారని ప్రశంసించారు. ప్రస్తుతం సినిమా ఆధునికం వైపు పరుగులు తీస్తోందని, దానితో పాటు మనం మారాలని అన్నారు. ఇకపై తమిళంలో వరసగా నటించాలని ఆశపడుతున్నానని, మంచి కథ, నిర్మాణ సంస్థలు అమరితే తమిళంలో నటిస్తానికి రెడీ అని పేర్కొన్నారు. ధనుష్ నాకు గురువు చిత్ర దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ ధనుష్ తనకు గురువు అని పేర్కొన్నారు.తనకంటే సీనియర్ అని, ఆయనతో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించిన ధనుష్కు, నిర్మాత థానుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్.థాను,సహ నిర్మాత పరంథామన్, సంగీతదర్శకుడు షాన్రోల్డన్, నటుడు సముద్రకని పాల్గొన్నారు. -
కటింగ్.. ఓన్లీ ఫర్ వీఐపీస్
► ఆదర్శం.. నారాయణ అంకితభావం ► సీఎంలు, సినీ హీరోలకు ఆయనే బార్బర్ ► సేవల కోసం విమాన టికెట్ల బుకింగ్ ► అట్టడుగు నుంచి ఉన్నతస్థాయికి పయనం నిబద్ధత, అంకితభావం ఉంటే మనిషి ఏ స్థాయికైనా ఎదగవచ్చని కొందరు నిరూపిస్తుంటారు. మాకు అవకాశం రాలేదే, మా బతుకులింతేనా అని నిట్టూర్చకుండా శ్రమనే నమ్ముకున్నారు. సేవ ద్వారానే ముందుకు నడిచారు. అలా కులవృత్తితోనే ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారు తరచుగా కనిపిస్తుంటారు. ఆ కోవలోకి చెందిన వ్యక్తే ఏజీ నారాయణ. కేజీఎఫ్లో పేద కుటుంబంలో పుట్టిన ఆయన శ్రమతో రాతను మార్చుకుననారు. బెంగళూరులో పేరుమోసిన వీఐపీ క్షురకుల్లో ఒకరయ్యారు. ముఖ్యమంత్రులు, సినిమా సూపర్స్టార్లు ఆయన కోసం వేచి చూస్తారు. ఒద్దికగా కూర్చుంటారు. నారాయణ చక్కగా కటింగ్ చేసేస్తారు. శివాజీనగర(కర్ణాటక): వారు ఏ రంగంలో ప్రముఖులైనా, నెలకోసారి ఆయన వద్ద తలవంచాల్సిందే. ఎందుకంటే ఆయన చేయి తిరిగిన క్షురకుడు. ఆయనే ఏ.జీ.నారాయణ. వృత్తిపైనున్న మమకారంతో ఉన్నతస్థాయికి ఎదిగిన ఆయన ప్రముఖుల సరసన కూర్చుని విందులారగించే దశకు చేరారు. 69 ఏళ్ల నారాయణ 52 ఏళ్లుగా కులవృత్తిని నమ్ముకున్నారు. ఆ క్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు, ముఖ్యమంత్రులు, మంత్రులకు, రాజకీయ నాయకులకు, సినీ హీరోలకు క్షురకునిగా మారారు. నేటికీ అనేకమంది ప్రముఖులు బార్బర్ షాప్కి వెళ్లాలంటే నారాయణ వద్దకే వెళ్తారు. గుండూరావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రతి నెలా నారాయణ కలిసేవారు. ఆ తరువాత ముఖ్యమంత్రులు ఎస్.ఆర్.బొమ్మయ్, వీరేంద్ర పాటిల్, రామకృష్ణహెగ్డే, ఇటీవలికాలంలో ధర్మసింగ్కు కూడా నారాయణ క్షౌ ర సేవలందించారు. చదువుకోలేక, ఉద్యోగం రాక... కోలార్ జిల్లా కేజీఎఫ్ స్వస్థలమైన నారాయణ పీయూసీ వరకు చదివి పై చదువులకు వెళ్లలేక పలు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కులవృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా అనే నానుడి మేరకు క్షురక కళ నేర్చుకున్నారు. సొంతూరిలో కొన్నాళ్లు చేసి బెంగళూరుకు చేరుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అశోక్ హోటల్లోని సెలూన్లో ఉద్యోగం లభించింది. అప్పట్లో ఆయన నెల జీతం రూ.10. హోటల్కు వచ్చే పలువురి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో నారాయణ వృత్తి నైపుణ్యానికి గిరాకీ పెరిగింది. ప్రతి ఒక్కరూ నారాయణ ద్వారా తాము కటింగ్ చేయించుకోవాలని ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖులంతా పిలిపించుకునేవారు. అంతే ఆయన పేరు ప్రముఖులందరికి నచ్చి నేటి వరకు అనేకులకు తన సేవలను అందిస్తూ ప్రస్తుతం బయటికి వెళ్లాలంటే లక్షలు విలువచేసే కారులోనే వెళ్లి తన కస్టమర్లకు సేవలందిస్తూ వస్తున్నారు. ప్రముఖులందరూ క్లయింట్లే ప్రముఖ సినీనటులు అమితాబచ్చన్, రజనీకాంత్,అంబరీష్, విష్ణువర్ధన్, చిరంజీవి, వెంకటేష్, కుమార బంగారప్ప, శ్రీనా థ్, జగ్గేశ్ ఆయన సేవలను అందుకున్నవారిలో ఉన్నారు. సినీ పరిశ్రమకు చెందినవారే కాకుండా బీపీఎల్ చైర్మన్ నంబియార్, ప్రిస్టేజ్ చైర్మన్తో పాటుగా ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు కూడా నేటికి నారాయణ సేవల కోసం ఫోన్లో సంప్రదిస్తున్నారు. ఆయన శివాజీనగర కన్నింగ్ హామ్ రోడ్డులో టచ్ ఆఫ్ క్లాస్ బ్యూటీ పార్లర్ను ప్రారంభించి 8 మందికి ఉపాధిని కల్పించారు. గత 20 సంవత్సరాల నుంచి పార్లర్ నడుస్తోంది. తన సేవలకు గాను 2000 సంవత్సరంలో అప్పటి గవర్నర్ రమాదేవి నుంచి అవార్డును పొందారు. ఇంకా పలు అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం నారాయణతో పాటుగా ఆయన కుమారుడు రాజేశ్ బీకామ్ చదివి, తండ్రి బాటలోనే కులవృత్తిని చేపట్టారు. చేతినిండా ఆదాయం వస్తూ ఇతరులకు కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉండటంతో వేరే ఉద్యోగం ఎందుకని ప్రశ్నిస్తారు. ఇంతటి గుర్తింపును ఊహించలేదు ‘ఇంతటి గుర్తింపు వస్తుందని ఊహించలేదు. హీరో రజనీకాంత్ను అందరూ ఒక్కసారైనా చూడాలని తపిస్తారు. నేను మూడుసార్లు ఆయనకు కటింగ్ చేశాను. దివంగత కన్నడ హీరో విష్ణువర్ధన్ ఒకసారి షూటింగ్ నిమిత్తం హైదరాబాద్కు వెళ్లిన సమయంలో నా కోసం విమానం టికెట్ బుక్ చేయించి పిలిపించారు. నా వృత్తిలో కుమారుడే కాకుండా కుమార్తె, మనవడు కూడా స్థిరపడి చేతినిండా సంపాదిస్తున్నారు. వృత్తిని గౌరవించి శ్రద్ధతో పనిచేస్తే ఏ రంగంలోనైనా అనుకున్నది సాధించవచ్చు, నేటి యువత దీనిని గుర్తించాలి’ – నారాయణ -
ప్రతి ఒక్కరూ వీఐపీనే!
వీఐపీ భావనను తొలగించేందుకే ఎర్రబుగ్గలకు నో చెప్పాం ► పౌరులంతా ముఖ్యమే అన్న భావన గొప్ప శక్తినిస్తుంది ► మాసాంతపు మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: కొందరు వ్యక్తుల మనస్సుల్లోంచి వీఐపీ (వెరీ ఇంపార్టెంట్ పర్సన్) అనే భావన తీసేసేందుకే వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం మాసాంతపు మన్కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వీఐపీ స్థానంలో ఈపీఐ – ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్ (ప్రతి ఒక్కరూ ముఖ్యమే) అనే భావనను చేర్చనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎర్రబుగ్గ ఉన్న వాహనంలో వెళ్లటం కొందరి మనసుల్లో పాతుకుపోయిన వీఐపీ సంస్కృతిని పారదోలేందుకే మే 1 నుంచి కొత్త నిబంధనలను అమలుచేస్తామన్నారు. దేశంలోని 125 కోట్ల మందిలో ప్రతి ఒక్కరికీ సమాన విలువ, ప్రాముఖ్యత ఉందన్నారు. ‘దేశంలో వీఐపీ సంస్కృతిపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ భావన వేళ్లూనుకుపోయింది. ఎర్రబుగ్గ వాహనాల్లో తిరిగే వారు మేమంతా వీఐపీలం అనే మైండ్సెట్తో ఉన్నారు. అందుకే ఇటీవలే మా ప్రభుత్వం.. ఎంతటివారైనా సరే తమ వాహనాలపైనుంచి ఎర్రబుగ్గలు తొలగించాల్సిందేనని నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిషేధం తనతోపాటుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులందరికీ వర్తిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘నవభారతం’ అనే ఆలోచన.. వీఐపీ అనే భావనను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ ముఖ్యమే (ఈపీఐ)ననే భావనకు మరింత ప్రాముఖ్యత కల్పించేందుకేనన్నారు. ‘దేశంలోని 125 కోట్ల మంది ప్రజల ప్రాముఖ్యతను మనం గౌరవించాలి. ఈ భావన ప్రజల కలలను నిజం చేసే దిశగా దేశానికి గొప్ప శక్తినిస్తుంది. మనమంతా సంయుక్తంగా దీన్ని సాధించాలి’ అని చెప్పారు. డిజిటల్ చెల్లింపుల దిశగా.. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ లావాదేవీల నిర్ణయానికి మద్దతుగా.. భీమ్ యాప్ను విరివిగా వినియోగించాలని, ఇతరులకు భీమ్ యాప్ను ప్రతిపాదించటం ద్వారా రివార్డులు పొందాలని యువతను కోరారు. అక్టోబర్ 14 వరకే ఈ పథకం ఉంటుందని.. దీని వల్ల కలిగే లాభాలను యువత అందుకోవాలన్నారు. ‘మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం మీకో గొప్ప అవకాశాన్ని కల్పించింది. కొత్త తరం దాదాపు నగదు రహిత లావాదేవీలకే మొగ్గుచూపుతోంది. డిజిటల్ చెల్లింపులకే విశ్వాసం చూపుతోంది. అందుకే మీరు రోజుకు 20 మందికి భీమ్ యాప్ను వాడటాన్ని సూచిస్తే.. మీరు ఆరోజు రూ. 200 సంపాదించినట్లే. దీని వల్ల మీకు లాభం కలగటంతోపాటు డిజిటల్ ఇండియాకు సహాయం చేసినట్లవుతుంది’ అని మోదీ సూచించారు. బుద్ధుని బోధనల అమలు అవసరం త్వరలో శ్రీలంకలో తన పర్యటన, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ‘వేసాక్ డే’ కార్యక్రమం గురించీ మాట్లాడారు. ప్రపంచంలో హింస, యుద్ధం, విధ్వంసం, ఆయుధ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో బుద్ధుడి బోధనలు చాలా అవసరం అన్నారు. వాతావరణ నియమాలు మారుతున్నాయని.. గతంలో మే, జూన్లలో కనిపించే ఎండలు ఈసారి మార్చి, ఏప్రిల్లోనే భయపెడుతున్నాయన్నారు. వేసవికాలంలో ..పక్షులు, జంతువులపై మానవత్వం చూపించాలన్నారు. వరండాల్లో చిన్న తొట్లలో పక్షుల కోసం నీళ్లుంచాలని సూచించారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు.. ఆటో డ్రైవింగ్, ఇతర భాషలోని కొత్త పదాలు నేర్చుకోవటం వటి కొత్త నైపుణ్యాలు ఒంటబట్టించుకునేందుకు ప్రయత్నించాలని ఆయన అన్నారు. సార్క్ దేశాలకు అమూల్య కానుక మే 5న దక్షిణాసియా ఉపగ్రహాన్ని భారత్ ఆవిష్కరించనున్నట్లు వెల్లడించిన ప్రధాని.. ఇది ఇరుగుపొరుగు దేశాలకు అమూల్యమైన కానుకని పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ ఆలోచనలో భాగంగానే ఇరుగు, పొరుగు దేశాలకూ మేలు జరుగుతుందన్నారు. 8 సార్క్ దేశాల్లో 7(శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్) ఈప్రాజెక్టులో చేరేందుకు అంగీకరించగా.. పాకిస్తాన్ ‘ఈ గిఫ్ట్ మాకొద్ద’ని తిరస్కరించింది. ‘ఇరుగుపొరుగుకు సహకారం కావాలి. వారూ అభివృద్ధి చెందాలి’ అని ప్రధాని అన్నారు. ‘దక్షిణాసియా విషయంలో మా చిత్తశుద్ధికి ఇదే సరైన ఉదాహరణ’ అని పేర్కొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమలలో శ్రీవారిని పలువురు ప్రముఖులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ సాంబశివరావు సతీసమేతంగా ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అలాగే తమిళ నటుడు ఎస్.వి.శేఖర్ స్వామివారిని దర్శించుకున్నారు. -
వీఐపీలకు భద్రత కట్టుదిట్టం
- ఆరు రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు హైదరబాద్: ఏఓబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకారదాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాలను కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ చోటుచేసుకోవడంతో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురువీఐపీలతో పాటు టార్గెట్లో ఉన్న రాజకీయ నేతల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పథకరచన చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులపై దాడులు నిర్వహించేందుకు మావోయిస్టు నేత నంబాల కేశవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో యాక్షన్ టీమ్లు రంగంలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధానంగా చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో వీఐపీల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా అన్ని జిల్లాల ఎస్పీలనూ తెలుగు రాష్ట్రాల డీజీపీలు ఎన్.సాంబశివరావు, అనురాగ్ శర్మ ఆదేశాలు జారీచేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై శాంతి భద్రతల విభాగం అదనపు డీజీలు, నిఘా చీఫ్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మారుమూల ప్రాంతాల పర్యటనలకు వెళ్లరాదని మంత్రులు, ప్రజాప్రతినిధులకు జిల్లా ఎస్పీల ద్వారా సమాచారం పంపారని తెలిసింది. దండకారణ్య సరిహద్దులోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్ పరిధుల్లోని ప్రాంతాలతో పాటు ఏవోబీ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అదనపు గ్రేహౌండ్స్ బలగాలను రంగంలోకి దింపారు. విస్తృతస్థాయిలో గాలింపు, కూంబింగ్ ఆపరేషన్లు జరుపుతున్నారు. దండకారణ్యం, కేకేడబ్ల్యూ జోన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి చొరబాట్లు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మైదాన ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉందని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కీలక/అనుమానిత ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయి. -
అమ్మవారికి ఆలస్యంగా నివేదన
విజయవాడ (ఇంద్రకీలాద్రి ) : దుర్గగుడి అధికారులు వీఐపీల సేవలో తరించడంతో మంగళవారం అమ్మవారికి సమర్పించే నివేదన ఆలస్యమైంది. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించేందుకు ఆలయ అర్చకులు సిద్ధమయ్యారు. మేళతాళాలతో ఆలయ అర్చకులు నివేదనను తీసుకుని అమ్మవారి ముఖ మండపం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆలయం లోపల కొందరు వీఐపీలు ఉండటంతో వారు బయటకు వచ్చే వరకు నివేదనను పట్టుకుని అర్చకులు వేచి ఉండాల్సి వచ్చింది. అర్చకులు ఎంత పిలిచినా అంతరాలయంలో ఉన్నవారు బయటకు రాలేదు. వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ఆగ్రహంతో గట్టిగా కేకలు వేయడంతో వీఐపీలు బయటకు వచ్చారు. ఉద్యోగులపై చర్యలు: ఈవో అమ్మవారికి నివేదన సమర్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఈవో సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశామని, ఇన్స్పెక్టర్, ఏఈవోకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అమె పేర్కొన్నారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని స్థానాచార్యను కోరినట్లు తెలిపారు. -
చండీయాగంతోనే విస్తారంగా వర్షాలు
తుర్కపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగంతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వ విప్ సునీత అన్నారు. శనివారం తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువులో గంగమ్మతల్లికి, కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 10ఏళ్ల నుంచి నిండని చెరువులు నేడ జలకళ సంతరించుకుందని అన్నారు. మిషన్ కాకతీయను ఎద్ధేవా చేసిన ప్రతిపక్షాలు నేడు నిండిన చెరువులను చూసి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని సుభిక్షం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న మహోన్నత నిర్ణయం వల్లే నేడు చెరువులు పకడ్బంధీగా జలకళ సంతరించుకుంటే రైతులు సంతోషాలు వెలుబుచ్చుతున్నారని అన్నారు. ప్రస్తుతం రైతులు వరినాట్లు వేయకుండా నవంబర్లో మెదలు పెడితే పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంటుందని, కంది, మొక్కజొన్న పంటల్లో నీళ్లు నిల్వకుండా రైతుల శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ఎంపీపీ పలుగుల ఉమారాణి, ఎంపీటీసీ తలారి శ్రీనివాన్, జూపల్లి లక్ష్మీ, కొండం రఘురాములు, మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, సర్పంచ్ అనుమూల వెంకట్రెడ్డి, నాయకులు కొమ్మిరిశెట్టి నర్సింహులు, అల్డా డైరెక్టర్ పొగుల ఆంజనేయులు, నాంసాని సత్యనారాయణ, కొమ్మిరిశెట్టి న ర్సింహులు, జక్కుల వెంకటేశం పాల్గొన్నారు. -
అభివృద్ధిని అడ్డుకోవడం తగదు
ఆలేరు : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోవడం తగదని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతలు అన్నారు. ఆలేరులో గత 40 రోజులుగా మూసివేసిన రైల్వేగేట్ను మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ గొంగిడి సునీతలను అడ్డుకునేందుకు విపక్ష నాయకులు ప్రయత్నించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిని స్వాగతించాల్సింది పోయి.. అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైల్వేగేట్ మూసివేతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కేసీఆర్, రైల్వేమంత్రి సురేష్ప్రభు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, రైల్వేజీఎం గుప్తాలను కలిసి వివరించినట్లు పేర్కొన్నారు. గత 40 రోజులుగా నిరంతరం గేట్ను తెరిపించేందుకు తమ శాయశక్తులా కృషి చేశామన్నారు. అలాVó ఆర్యుబీ నిర్మాణానికి రూ. 6.50కోట్లు మంజూరయ్యాయని, ఇందులో రాష్ట్రం వాటా 5.25 కోట్లు, రైల్వేశాఖ 1.25 కోట్లు నిధులు విడుదలయ్యేలా ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. కొలనుపాక బీటీరోడ్డుకు రూ. 1.65కోట్లు, పోచ్చమ్మవాడ ప్రధాన రహదారిపై సైడ్డ్రైనేజీల నిర్మాణానికి రూ. 10 లక్షలు, ఆర్వోబీ వెంట సర్వీస్రోడ్లకు రూ. 30 లక్షలు నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. ఆలేరు అభివృద్ధే «ధ్యేయంగా ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మార్కెట్ చైర్మన్ కాలె సుమలత, ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్, నాయకులు ఆకవరం మోహన్రావు, పోరెడ్డి శ్రీనివాస్, చింతకింది మురళి, సిరమైన వెంకటేష్, మొరిగాడి ఇందిరా, గుత్తా శమంతారెడ్డి, పేరపు సిద్దులు, జల్లి నర్సింహులు, గంపల విజయ్, దూడం మధు, ఎగ్గిడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న విపక్షాలు ఆలేరులో రైల్వేగేట్ను ప్రారంభించేందుకు వస్తున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ గొంగిడి సునీతలను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ఎమ్మెల్యే గో బ్యాక్ నినాదాలు ఇచ్చారు. ఒక వైపు ఎమ్మెల్యే గోబ్యాక్ అంటుంటే.. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జిందాబాద్ అంటు నినాదాలు ఇచ్చారు. యాదగిరిగుట్ట సీఐ రఘువీర్రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష నాయకులను అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆధ్వర్యంలో కొద్దిసేపు రైల్వేగేట్ వద్ద బైఠాయించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు చామకూర అమరేందర్రెడ్డి, ఎండి సలీం, కె సాగర్రెడ్డి, తునికి దశరధ, ఆరె రాములు, ఎంఎ ఎక్బాల్, ఎంఎ ఎజాజ్, జూకంటి ఉప్పలయ్య, వడ్డెమాన్ శ్రీనివాస్, మంగ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్తోనే తెలంగాణాభివృద్ధి
యాదగిరిగుట్ట: సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. మండలంలోని వంగపల్లి, చొల్లేరు. మోటకొండూర్, తాళ్లగూడెం, సైదాపురం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆమె మాట్లాడారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దాలనే ఆలోచనలతో ప్రజలకు సాగు, తాగు నీరు, ఆసరా ఫించన్లు, కల్యాణలక్ష్మీ, షాద్ముభారక్, మిషన్ కాకతీయ వంటి పథకాలను అందరికీ చేరేలా కృషి చేస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ సుమలత, ఆల్డా చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, వైస్ ఎంపీపీ తోటకూరి నర్సయ్య, సర్పంచులు చంద్రగాని నిరోష, కొంతం లక్ష్మీ, కొక్కలకొండ అరుణ, కసావు శ్రీనివాస్గౌడ్, పులెపాక స్వరూప, ఎంపీటీసీలు కానుగు కవిత, బాలమ్మ, బుగ్గ పర్వతాలు, బీర్ల మాధవి, ఆరె యాదగిరిగౌడ్, మండలాధ్యక్షులు వెంకటయ్య, రవీందర్గౌడ్, కలెపల్లి శ్రీశైలం, నిమ్మయ్య, స్వామి, సాయికుమార్, వీరాస్వామి, అశోక్, మోహన్రెడ్డి, రామకృష్ణ, రాజు, దామోదర్ ఉన్నారు. -
అఖిలపక్షంతో సమావేశానికి సిద్ధం
యాదగిరిగుట్ట: మోటకొండూర్ మండల ఏర్పాటును వివిధ గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న తరుణంలో అఖిలపక్షంతో భేటికి సిద్ధమని టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం చొల్లేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోటకొండూర్ను మండల కేంద్రంగా ఏర్పాటయ్యేందుకు కేటాయించిన గ్రామాలు సంసిద్ధత వ్యక్తం చేయని విషయంపై ప్రతిపక్షాలు ఊరికో మాట ప్రచారం చేస్తున్నాయని వాపోయారు. ప్రజాభిష్టం మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్ణయించిన మండల కేంద్రానికి ఆమోదం కోసం తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మోటకొండూర్కు సమీప, దూర గ్రామాలను గుర్తించి ప్రభుత్వానికి అఖిలపక్షం ద్వారా విప్ సునీత ఆధ్వర్యంలో అభిప్రాయాసేకరణను అందిద్దామని ఆయన కోరారు. యాదాద్రి జిల్లాపై... యాదాద్రి జిల్లా ఏర్పాటును టీడీపీ జాతీయ పోలిట్బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పోరాట ఫలితమేనని ఆయన ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జనగామ ప్రాంత వాసులు కూడా జిల్లా కోసం ఉద్యమాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిన్నకందుకూర్ ప్రజలపై పోలీసులు లాఠీ చేయడం భాదకరమని మహేందర్రెడ్డి అన్నారు. -
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
యాదగిరిగుట్ట: మండలంలోని వంగపల్లిలో గ్రామానికి చెందిన ఎడవెల్లి స్రవంతి, గాయత్రిలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు నాణ్యమైన వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ సుమలత, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, పీఆర్డీఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సాంబశివరావు, పీఆర్ ఏఈ సుగుణాకర్, వంగపల్లి సర్పంచ్ చంద్రగాని నిరోష, ఉపసర్పంచ్ రేపాక స్వామి తదితరులున్నారు. -
అంగన్వాడీల బలోపేతానికి కృషి
నల్లగొండ : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో స్త్రీ, శిశుసంక్షేమస్థాయీ సంఘం సమావేశంలో జరిగింది. ఈ సమామావేశానికి కమిటీ చైర్పర్సన్ చుక్క ప్రేమలత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలవుతున్న పథకాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల బలోపేతం చేసేందుకు వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం అందింస్తోందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, జెడ్పీసీఈఓ రావుల మహేందర్రెడ్డి, ఐసీడీఎస్ పీడీ సునంద, జెడ్పీటీసీ సభ్యులు, సీపీడీఓలు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్కు వీఐపీ హోదా
–హోదాకు మించి నిధులు –కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ –ప్యాకేజీని తిరుమల లడ్డూతో పోల్చిన మంత్రి యూనివిర్సిటీక్యాంపస్: ఆంధప్రదేశ్కు కేంద్రం ఇచ్చింది ప్రత్యేకహోదా కాదని, విఐపీ హోదాగా గుర్తించాలని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు మించి నిధులు ఇచ్చామని అన్నారు. తిరుపతిలోని ఐఐటీలో ఆదివారం ఐఐటీ, ఐషర్, ఇతర విద్యాసంస్థల అధ్యాపకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు 2.25 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చామన్నారు. ఏపీ ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వడం పట్ల ఇతర రాష్ట్రాల నుంచి వ్యతిరేఖత వస్తున్నప్పటికీ, రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీ అభివద్దికి కంకణబద్దులై ఉన్నామన్నారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలను ఇచ్చామని, మిగతా వేయి కోట్ల రపాయలను సమయానుకూలంగా అందచేస్తామన్నారు. ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలను కేటాయించామని, ఇందులో 9 సంస్థలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. నెల్లూరు జిల్లాలో తీరప్రాంత విశ్వవిద్యాలయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఏపీలో ఏర్పాటు చేసిన విద్యాసంస్థల ఏర్పాటుకు పదివేల కోట్ల రపాయలు అవసరమవుతాయన్నారు. 3 లేదా 4 సంవత్సరాల్లో వీటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కేంద్ర పన్నుల వాటా క్రింద ఏపీకి ఐదు సంవత్సరాల్లో 2.06 వేల కోట్ల రూపాయలు వస్తాయన్నారు. అమరావతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్కు 1.93 లక్షల గహాలను కేటాయించామన్నారు. ఏపీలో పారిశ్రామిక అభివద్దికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయడానికి కేంద్రం కతనిశ్చయంతో ఉందన్నారు. –అవి తిరుమల లడ్డూలు: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరిట కేంద్రం ఇచ్చింది పాచిన లడ్డూలన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాఖ్యలపై మంత్రి స్పందిస్తూ అవి పాచిన లడ్డూలు కావని, తిరుమల లడ్డూలని పేర్కొన్నారు. తిరుమల లడ్డూలు ఎంతో పవిత్రమైనవని చెప్పారు. -
నూతన భవనాలు ఏర్పాటు చేయాలి
యాదగిరిగుట్ట : మండలంలోని పెద్దకందుకూర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయని, నూతన భవనాలను ఏర్పాటు చేయాలని కోరుతూ యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డికి మంగళవారం ఎస్ఎంసీ చైర్మన్లు, గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్లు విప్తో మాట్లాడుతూ వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డమీది స్వప్నరవీందర్గౌడ్, ఎస్ఎంసీ చైర్మన్లు జుట్టు బాలమణి, దర్శనం శ్రీనివాస్, సీస నర్సింహులుగౌడ్, శంకర్గౌడ్, పత్తి సుజాత, దర్శనం స్వామి, ఆజ్మీర శ్రీనివాస్, సావిత్రి, మంజుల, సుశీల, భాస్కర్, క్రిష్ణ, రాజు, వెంకటేష్గౌడ్, మహేష్ తదితరులున్నారు. -
అభివృద్ధిని అడ్డుకుంటే గుణ పాఠం తప్పదు
ఆలేరు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే గుణపాఠం తప్పదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత హెచ్చరించారు. ఆలేరులో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించేవాళ్లమని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. తుమ్మిyì హెట్టి ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటే ఆ పత్రాలను బయటపెట్టాలని కోరారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కొరవడిందని విమర్శించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్నదే ప్రభ్యుత ధ్యేయమన్నారు. అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తే ప్రజలు ఛీకొడతారన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్, వైస్ ఎంపీపీ కొరకొప్పుల కిష్టయ్య, ఆకవరం మోహన్రావు, మొగులగాని మల్లేశం, చింతకింది మురళి, బెంజారం రవి, బాకీ ఆనందం, మొరిగాడి వెంకటేశ్, కర్రె అశోక్, దూడం మధు, ముస్తాఫా, దానియల్, గిరికుమార్, జల్లి నర్సింహులు, గంపల విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
'నేను వీఐపీని.. నాకు సిగ్నల్ లేదు..తప్పుకో'
-
'నేను వీఐపీని.. నాకు సిగ్నల్ లేదు..తప్పుకో'
న్యూఢిల్లీ: దేశంలో వీఐపీ కల్చర్ పెరిగిపోతోంది. వారి ఆగడాలు రోజుకింత పెరిగిపోతున్నాయి. వారి చేష్టలతో సామాన్య జనాలకు తెగ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ప్రశ్నించినవారిపై దాడికి సిద్ధపడుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్రంమంత్రి మహేశ్ శర్మ కారును ఆపారనే కారణంతో ఆయన ప్రభుత్వేతర సిబ్బంది సెక్యూరిటీ గార్డ్స్ పై దారుణంగా దాడి చేసిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. నోయిడాలో ఈ ఘటన ఆగస్టు 24న జరిగింది. దీనిని రికార్డు చేసిన ప్రశాంత్ సక్సేనా అనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో దానిని పోస్ట్ చేయగా సదరు వీఐపీ నిర్వాకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అందులో రికార్డయిన ప్రకారం నోయిడాలోని ఓ చౌరస్తా వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడింది. దాంతో అన్ని వాహనాలు ఆగాయి. వాటి పక్కన ఓ కారు ఆగింది. అందులోని ఒక వ్యక్తి అతడి కారు ఎదురుగా ఉన్న ఓ మోటారు సైకిలిస్టును పక్కకు జరగమని అడిగాడు. ఇంకా సిగ్నల్ పడలేదుగా అని అతడు ప్రశ్నించగా తాను వీఐపీనని చెప్పాగా.. అంటు దురుసుగా మాట్లాడాడు. ఈ క్రమంలో అతడిపై దాడి చేసినంత పనిచేశాడు. ఇదంత ఓ కారులో కూర్చుని ఉన్న ప్రశాంత్ తన ఫోన్ లో రికార్డు చేస్తుండగా అతడి కూతురు తండ్రికి చెప్పడంతో రికార్డు చేస్తున్న ప్రశాంత్ పైకి దూసుకొచ్చి ఆ ఫోన్ ను కిందపడేశాడు. నోయిడాలోని సెక్టార్ 57లో ఉదయం 8గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
‘మహా’ ఒప్పందం చరిత్రాత్మకం
గుండాల : మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న జల ఒప్పందం చరిత్రాత్మకంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమైక్యాంధ్ర నాయకులు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. 40 సంవత్సరాలుగా వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నప్పటికీ తెలంగాణకు చుక్క నీరు ఇవ్వని అసమర్థులు కాంగ్రెస్ వారు అని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ కుదుర్చుకున్న 3 బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని, అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్కుమార్రెడ్డి, జీవన్రెడ్డి, భట్టి విక్రమార్కలు లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కానుందని కాలేశ్వరం ప్రాజెక్టుతో గంధమల్ల , బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఆలేరు భువనగిరి నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నట్లు ఆమె తెలిపారు. కొత్త ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేసి సాగు నీరు అందిస్తామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిందం ప్రకాశ్, జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ గార్లపాటి సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ రావుల హరితాదేవి, కో–ఆఫ్షన్ మెంబర్ ఎండీ షర్పోద్దీన్, నాయకులు మూగల శ్రీనువాస్, ఇమ్మడి దశరథ, లగ్గాని రమేష్, తదితరులు ఉన్నారు. -
కన్నడ వీఐపీలో అమలాపాల్
కన్నడ చిత్రం వీఐపీలో నటించే అవకాశం నటి అమలాపాల్ తలుపు తట్టింది. వివాహానికి ముందు మాతృభాష మలయాళంతోపాటు తమిళం, తెలుగు భాషల్లో అమలాపాల్కు అవకాశాలు వెల్లువెత్తాయనే చెప్పాలి. అంతే కాదు పెళ్లి తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే భర్త విజయ్ నుంచి విడిపోయి విడాకులకు సిద్ధం అయ్యారో ఆ తరువాత వస్తాయనుకున్న అవకాశాలు కూడా వెనక్కు పోయాయి. ఈ మధ్య నటించిన అమ్మాకణక్కు లెక్క తప్పింది. దీంతో ఆ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ తన తాజా చిత్రం వడచెన్నైలో తనకు నాయకిగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ ఒక్క చిత్రమే అమలాపాల్ చేతిలో ఉంది. ఇంతకు ముందు ధనుష్ సరసన నటించిన సక్సెస్ఫుల్ చిత్రం వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ) ఇప్పుడు కన్నడంలో రీమేక్ కానుంది. రాక్లైన్ వెంకటేశ్ నిర్మించినున్న ఈ చిత్రంలో ప్రముఖ కన్నడ నటుడు రవిచంద్రన్ వారసుడు మనోరంజన్ హీరోగా నటించనున్నారు. ఆయనకు జంటగా చాలా మంది హీరోయిన్లను పరిశీలించారట. ఎవరూ సెట్ కాక పోవడంతో చివరికి ఈ అవకాశం నటి అమలాపాల్ తలుపు తట్టింది. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక పూర్తి కాగానే షూటింగ్ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. అమలాపాల్ ఇంతకు ముందే సుదీప్కు జంటగా హెబులి అనే చిత్రం ద్వారా కన్నడ చిత్ర రంగ ప్రవేశం చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారు
యాదగిరిగుట్ట : జల యజ్ఞాన్ని ప్రవేశపెట్టి ధనయజ్ఞంగా మార్చింది మీరేనని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి శనివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ధ్వజమెత్తారు. యాదగిరిగుట్ట టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలను మింగిన కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. గ్రామాల్లో చిచ్చు రేపుతున్న ఉత్తమ్కుమార్రెడ్డి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోజూస్తున్న ఉత్తమ్ కుమార్రెడ్డి, జానారెడ్డి, రేవంత్రెడ్డి లాంటి నేతనుల తెలంగాణ ప్రజలు తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో అల్డా చైర్మన్ పిచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సుమలత, జెడ్పీటీసీలు కర్రె కమలమ్మ, బోరెడ్డి జ్యోతిఅయోధ్యరెడ్డి, ఎంపీపీలు గడ్డమీది స్వప్న, కాసగల్ల అనసూయ, గుట్ట సర్పంచ్ బూడిద స్వామి, నాయకులు కాటబత్తిని ఆంజనేయులు, గడ్డమీది రవీందర్గౌడ్, పడాల శ్రీనివాస్, ఆకవరపు మోహన్రావు తదితరులున్నారు. -
'నేను బెండ్ అవలేను.. అందుకే లేస్ కట్టాడు'
న్యూఢిల్లీ: 'నేను వీఐపీని.. నా షూలేస్ కట్టు' అంటూ సెక్యూరిటీ అధికారిచే అనుచిత పని చేయించిన ఒడిశా మంత్రి జోగేంద్ర బెహరా మాట మార్చారు. భిన్నవర్గాల నుంచి ఆయన చర్యపై తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే స్వరం మార్చి తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, అందుకే షూ లేస్ కట్టాలని చెప్పానని అన్నారు. తాను కిందికి ఒంగి అలా చేయలేకపోవడం వల్లే ఆ అధికారికి చెప్పినట్లు తెలిపారు. 'నా ఎడమకాలికి బాగా నొప్పి. నేను ఒంగి ఏ పని చేయలేను. ఆ అధికారి నా షూలేస్ కట్టి ఉండొచ్చు.. అతడు నాకు కుమారుడిలాంటివాడు. నేను గత కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్సకు వెళుతున్నాను. కావాలంటే మీకు మెడిసిన్ తీసుకున్న రశీదులు కూడా చూపించగలను' అని అన్నారు. -
యాదాద్రిలో ప్రభుత్వ విప్ పూజలు
యాదగిరికొండ: ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఆమె జన్మదిన సందర్భంగా మంగళవారం కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాల ఆలయంలోని ప్రతిష్టామూర్తులకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి అష్టోత్తరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీస్వామి, అమ్మవార్ల అశీస్సులతో పాటు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆమె వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులున్నారు. -
త్వరలోనే గోదావరి జలాలు : ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట: మిషన్ భగీరథ పథకం ద్వారా త్వరలోనే ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు గోదావరి జలాలు వస్తాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న మిషన్ భగీరథ పథకం ప్రారంభం కాబోతుందని, దీంతో మొదటగా ఈ రెండు ప్రాంతాలకు నీళ్లు రాబోతున్నాయని తెలిపారు. ప్రధాని తొలిసారిగా తెలంగాణకు వస్తున్నందున్న ప్రత్యేక నిధులు కేటాయిస్తార ని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, సర్పంచ్ బూడిద స్వామి, టిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, మండల, పట్టణ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, కాటబత్తిని ఆంజనేయులు తదితరులున్నారు. -
జయశంకర్ ఆశయసాధనకు కృషి చేయాలి
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు టీఆర్ఎస్ పార్టీ, జర్నలిస్టుల ఫోరం, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అమరవీరుల స్థూపం వద్ద జయశంకర్కు ప్రభుత్వ విప్ సునీత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కాటబత్తిని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కమలమ్మ, సర్పంచ్ బూడిద స్వామి, ఎంపీడీఓ సాంబశివరావు, తహసీల్దార్ రామకృష్ణ, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్గౌడ్, సీనియర్ జర్నలిస్టు రాయగిరి పాండు, యాదగిరిగౌడ్, కర్రె వెంకటయ్య, రవీందర్గౌడ్, పుల్లయ్య, వినోద్కుమార్, వెంకటయ్య, సలీం, ఎస్డీ బాబా, బాల్నర్సయ్య, సాయి, వంశీకృష్ణ, అరుణ్, ప్రసాద్ పాల్గొన్నారు. -
వీఐపీ ఘాట్లలో అన్ని ఏర్పాట్లు
(మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల కోసం జిల్లాలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద నిర్మిస్తున్న వీఐపీ, వీవీఐపీల ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి, వీఐపీ ఘాట్ ప్రత్యేక అధికారి అమృతారెడ్డి తెలిపారు. మట్టపల్లి క్షేత్రం వద్ద వీఐపీలకు కేటాయించిన ప్రహ్లాద ఘాట్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఘాట్ వద్ద ఉన్న కొన్ని పాత గోడలను పూర్తిగా తొలగిస్తామని, నూతనంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నది వద్ద ప్రమాదకరమైన ప్రదేశాలకు ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఐబీ ఏఈలు పిచ్చయ్య, భిక్షం, వీఆర్వో వెంకటరామారావు తదితరులు ఉన్నారు. -
పండగలు ఉన్నాయి.. మా రాష్ట్రానికి రావద్దు!
న్యూఢిల్లీ: మిజోరం రాష్ట్ర ప్రభుత్వం చిత్రమైన ప్రకటనను విడుదల చేసింది. 'ఎవరైనా వీఐపీలు డిసెంబర్ 14 నుంచి జనవరి 8 లోపు మా రాష్ట్రంలో పర్యటించే ఉద్దేశంతో ఉంటే దయచేసి ఆ పర్యటనలను వాయిదా వేసుకోవాలి' అని తెలిపింది. మిజోరం ప్రభుత్వం క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వీఐపీలు పర్యటిస్తే వారికి కావలసిన సదుపాయాలను కల్పించడం రాష్ట్రానికి ఇబ్బందిగా ఉంటుందని, అందువల్ల కేంద్రప్రభుత్వ అధికారులు, ఇతర వీఐపీలు ఈ సమయంలో పర్యటనలు వాయిదా వేసుకోవాలని కోరింది. మిజోరం రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తుంది. సాంప్రదాయ పద్దతిలో నిర్వహించే ఈ వేడుకల్లో స్థానిక తెగలు ఉత్సాహంగా పాల్గొంటాయి. డిసెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే క్రిస్మస్ సంబరాలకు ప్రభుత్వం ముందుగానే సమాయత్తమౌతుంది. ఈ వేడుకలు జనవరి మొదటి వారం వరకు కొనసాగుతాయి. -
మూడు రకాల భోజనాలు
- వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక మెనూ - శంకుస్థాపననాడు ఇదీ సంగతి సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని శంకుస్థాపనకు వచ్చే వారి కోసం ప్రభుత్వం మూడు కేటగిరీల భోజనాలను తయారు చేయిస్తోంది. వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేకమైన మెనూ, రైతులు, ప్రజలకు సాధారణ మెనూ ఖరారు చేశారు. దేశవిదేశాల నుంచి వచ్చే అత్యంత ముఖ్యులకు(వీవీఐపీ) ప్రత్యేకమైన తెలుగు సంప్రదాయ వంటకాలను రుచి చూపించనున్నారు. ఒక్కో భోజనం ఖర్చు రూ.1,250 చొప్పున 1,000 మంది కోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. వీఐపీల కేటగిరీలో 10,000 మందికి మరో ప్రత్యేకమైన మెనూను ఆర్డర్ ఇచ్చింది. ఈ భోజనానికి రూ.650 వంతున చెల్లిస్తారు. నిజానికి వీఐపీల కేటగిరీలో 1,500 మందికి ఆహ్వానాలు పంపారు. ఆ సంఖ్య కొంత పెరిగినా ఇబ్బంది లేకుండా వేదిక ముందు 2,000 సీట్లను కేటాయిస్తున్నారు. ఈ కేటగిరీలో 10వేల భోజనాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇందుకు రూ.77.5 లక్షలు ఖర్చు కానుంది. లక్షన్నర మందికి సాధారణ భోజనం శంకుస్థాపన కార్యక్రమానికి లక్షన్నర మంది రైతులు, ప్రజలు హాజరవుతారని అంచనా. వీరికి సాధారణ భోజనమే అందించనున్నారు. ఒక్కో భోజనానికి రూ.150 చొప్పున చెల్లిస్తున్నారు.సాధారణ భోజనాలకు రూ.2.25 కోట్లు ఖర్చవుతోంది. అంటే మొత్తం భోజనాల కోసం ప్రభుత్వం రూ.3 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. -
ప్రొటోకాల్ కష్టాలు
మంత్రులు, వీఐపీల ఖర్చులు తడిసిమోపెడు కీలక శాఖల అధికారులపైనే భారం జనం నుంచి వసూళ్లకుపాల్పడుతున్న వైనం నెలకు రూ.20లక్షలపైనే అనధికారిక ఖర్చు మంత్రులు, వీఐపీల ప్రొటోకాల్ ఖర్చులు పెనుభారంగా పరిణమిస్తున్నాయి. ఇటీవల నగరానికి వీఐపీల తాకిడి పెరగడంతో నెలకు రూ.20లక్షల పైనే అనధికారికంగా ఖర్చవుతోంది. ఒక్కో మంత్రికి రోజుకు రూ.10వేల పైబడే ఖర్చు చేస్తున్నారు. విజయవాడ : నగరానికి ప్రొటోకాల్ తాకిడి ఎక్కువైంది. ముఖ్యమంత్రి మొదలుకుని రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారుల వరకు అందరూ నగరంలోనే ఎక్కువగా ఉండటంతో ప్రొటోకాల్ ఖర్చులు పెనుభారంగా పరిణమిస్తున్నాయి. ఉన్నతాధికారుల సూచనలతో రెవెన్యూ విభాగంలోని అధికారులు ప్రొటోకాల్ను విభజించి సంబంధిత శాఖల అధికారులకే ఆ బాధ్యతలు, ఖర్చులు అప్పగిస్తున్నారు. ఏ శాఖతో సంబంధం లేని కొందరు వీఐపీల ఖర్చును ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. దీంతో జిల్లాలో నెలకు ప్రొటోకాల్ పేరిట సుమారు రూ.20లక్షలపైనే ఖర్చవుతోంది. ఆయా శాఖలపైనే భారం వ్యక్తిగత పర్యటనల నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం వరకూ వివిధ కార్యక్రమాల నిమిత్తం నెలకు సగటున 50 మందికి పైగా వీఐపీలు నగరానికి వస్తున్నారు. ఇవికాకుండా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రోజూ మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు వస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రొటోకాల్ ఖర్చు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. వివిధ శాఖల మంత్రులు వస్తే హోటల్ బస నుంచి రవాణా సౌకర్యం వరకు అన్నీ ఆయా శాఖల అధికారులే చూసుకుంటారు. ఒక్కో మంత్రికి రోజుకు రూ.10వేల ఖర్చు ప్రొటోకాల్ బాధ్యతలు రెవెన్యూ సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. పూర్తి బాధ్యతలన్నీ తహశీల్దార్వే. అమాత్యులు, వారి బంధువుల బస, భోజన, ఫలహారాలను రోజుకు రూ.10వేల వరకు ఖర్చవుతోంది. ఇలా నెలకు ఒక్కో డిపార్టుమెంట్కు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. మరి.. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోందంటే.. జనంపైనే భారం ప్రొటోకాల్ ఖర్చులంటూ కొన్ని శాఖల్లో అధికారులు, సిబ్బంది.. జనాన్ని బాదేస్తున్నారు. అమాత్యుల ఖర్చులకు రెవెన్యూ, ఎక్సైజ్, విజిలెన్స్, రవాణా, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తమ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి నుంచి ఈ సొమ్ము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది ప్రొటోకాల్ ఖర్చులంటూ ప్రతి కాగితానికీ డబ్బు వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ అధికారులు కొరడా ఝళిపించి మరీ వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీస్, రవాణా శాఖ అధికారులు కూడా లారీ యజమానులు, వాహనచోదకుల నుంచి వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వంతులవారీగా తమకు వచ్చే లంచాల నుంచి ఖర్చు చేస్తున్నారు. సమాచార పౌరసంబంధాలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఉద్యానవన తదితర శాఖల్లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది బడ్జెట్ లేక అప్పులుచేసి ఖర్చు చేస్తున్నారు. -
అటు ఆందోళనలు.. ఇటు బీజేపీ విప్
-
పుష్కర స్నానం చేసిన చిరంజీవి
-
పుష్కరాల్లో ఇదేమి వీఐపీ సంస్కృతి
కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మండిపాటు విశాఖపట్నం: గోదావరి పుష్కరాల్లో వీఐపీ సంస్కృతిపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మండిపడ్డారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు స్వయంగా నిర్వహిస్తున్న ఈ పుష్కరాల తతంగంపై తాను ఎంతో ఆవేదన చెందుతున్నానన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. పుష్కర భక్తుల కష్టాలపై సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు కాస్తయినా శ్రద్ధ చూపి ఉంటే 29 మంది ప్రాణాలు పోయేవి కావన్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినా కూడా తమ కుటుంబ సభ్యులు, వందిమాగదులతో వీఐపీలు రాజమండ్రికి వస్తూనే ఉన్నారని విమర్శించారు. వారి వల్ల భక్తులకు ఇబ్బందితో పాటు ప్రభుత్వ ఖజానాపై కూడా పెనుభారం పడుతుందని వివరించారు. -
వీఐపీ దర్శన టికెట్లు బాగా తగ్గించాం
టీటీడీ చైర్మన్ చదలవాడ తిరుపతి అర్బన్: తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులే ఎక్కువ సంఖ్యలో దర్శించుకునే విధంగా వీఐపీ దర్శన టికెట్లను బాగా తగ్గించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. మంగళవారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూచన మేరకు తిరుమలలో అన్ని విభాగాల సమాచారాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పుడు రోజుకు కేవలం పదిహేను వందలనుంచి నుంచి రెండువేల మందికి మాత్రమే వీఐపీ దర్శన టికెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. టీటీడీ-మున్సిపల్ కార్పొరేషన్-తుడాల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో, యాత్రికులు నడిచి వెళ్లే మార్గాల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
'మన అభ్యర్థికే ఓటు వేయండి'
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ విప్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఏకగ్రీవం కాగా.. తెలంగాణలో మాత్రం ఆరు సీట్లకు గాను ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నలుగురిని గెలిపించుకునే సామర్థ్యం ఉండగా మరో వ్యక్తిని కూడా రంగంలోకి దించింది. దీంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని ఊహించిన కాంగ్రెస్ వెంటనే కేంద్రం నుంచి పార్టీ పరిశీలకులు ఆజాద్ను, వయలార్ రవిని రంగంలోకి దించింది. వారు వచ్చిన అనంతమే తాజాగా కాంగ్రెస్ విప్ జారీ చేయడంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు వేడిపుట్టిస్తున్నాయి. జూన్ 1న జరిగే పోలింగ్లో పాల్గొని పార్టీ అభ్యర్థి ఆకుల లలితకు ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ తన విప్లో పేర్కొంది. ఇప్పటికే ఈ విప్ పలువురు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అందినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. -
ప్రొటోకాల్ పోటు
రాజధాని స్థాయిలో విశాఖకు వీఐపీల తాకిడి ఖర్చుల భారంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి {పైవేటు హోటళ్లకు కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు రాష్ర్ట విభజన తర్వాత నవ్యాంధ్రలో విశాఖ నగరానికి ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. పేరుకు మంగళగిరి తాత్కాలిక రాజధాని అయినప్పటికీ కార్యకలాపాలన్నీ విశాఖలోనే జరుగుతున్నాయి. కేబినెట్ మీటింగ్ల నుంచి అంతర్జాతీయ సదస్సుల వరకు అన్నింటికి ఈ పోర్టు సిటీయే వేదికవుతోంది. వేలకోట్ల విలువైన పరిశ్రమల స్థాపనకు అవగాహన ఒప్పందాలన్నీ ఇక్కడే సాగుతున్నాయి. వీఐపీల పర్యటనల కోసం పెట్టే ప్రోటోకాల్ ఖర్చులు ఇక్కడి అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. విశాఖపట్నం : విశాఖకు వీఐపీల తాకిడి విపరీతంగా పెరగడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హద్హుద్ తర్వాత వీఐపీలే కాదు..దేశ విదేశాలకు చెందిన ముఖ్యల రాక బాగా పెరిగిపోయింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలేని నెలంటూ లేదనే చెప్పాలి. ఒక్కో నెలలో రెండు మూడు సార్లు వస్తున్నారు. విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం, ఏపీ టూరిజం గెస్ట్హౌస్లు ఉన్నాయి. అయినా సీఎంతో సహా వీరందరికీ స్టార్ హోటళ్లే కావాలి. నోవటల్ అయితే సీఎంకు క్యాంపుకార్యాలయంగా మారిపోయిందనే చెప్పాలి. అలాగే ప్రోటోకాల్ వాహనాలు మూలనపడ్డాయి. వాటిని బాగు చేయించుకోవడం కాని, కొత్తవి కొనుగోలు చేయడం కానీచేయరు..వచ్చిన ప్రతీ సారివేలకు వేలు పోసి ప్రైవేటు ఏసీ వాహనాలే కావాలి. వీరి పర్యటనల పేరుతో స్టార్ హోటళ్లను, ప్రైవేటు ట్రావల్ ఏజెన్సీలను మేపుతున్నారనే చెప్పాలి. బకాయిలు కోట్లల్లో...వచ్చేది లక్షల్లో సీఎం గత పది నెలల్లో అధికారికంగా 23 సార్లు జిల్లాకు వచ్చారు. ఒకసారి వచ్చివెళితేరూ.30లక్షలు ఖర్చవుతుందని అంచనా. అదే సీఎం పర్యటనలో కాస్తా భారీ కార్యక్రమం ఏదైనా ఉంటే ఖర్చు రూ. కోటి దాటిపోతోంది. అంటే సరాసరిన ట్రిప్పుడు సుమారుగా రూ.50లక్షల చొప్పున లెక్కేసుకున్నా సుమారు రూ.11.5కోట్ల పైమాటే. ఇక వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకు, కేంద్ర బృందాలు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, గవర్నర్లు, కేంద్ర రాష్ర్ట మంత్రులు, సుప్రీం, హైకోర్టు జడ్జిలు ఇలా వీఐపీల పర్యటనలు లెక్కకు మించేఉన్నాయి. వీటిన్నింటికి ప్రోటోకాల్ ఖర్చులు లెక్కలేస్తే రూ.15-20 కోట్ల పైబడే ఉంటోంది. సీఎం పర్యటనల కోసం ఒక్క బాలాజీ సప్లయిర్స్కే అక్షరాల రూ.40 లక్షలు వరకు అధికారులు చెల్లించాల్సి ఉంది. రూ.20లక్షల వరకు హోటళ్లకు, కాన్వాయ్ వాహనాల కోసం ట్రావెల్ ఏజెంట్స్కు 35లక్షల వరకు చెల్లించాలి. అలాగే ఇతర ఖర్చులుగా మరో రూ.50లక్షలవరకు బిల్లులు బకాయిలున్నాయి. వీఐపీల పర్యటనల కోసం హోటళ్లు, కాన్వాయ్, ఇతర ఖర్చుల కింద ఇప్పటి వరకు సుమారు రూ.40లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా అధికారికంగా రెండుకోట్లకు పైగానే బకాయిలున్నాయి. 2014-15 సంవత్సరానికి ప్రోటోకాల్ ఖర్చుకు జిల్లాకు రూ.34లక్షలు మంజూరైతే రూ.22లక్షలు మాత్రమే డ్రా చేసుకోగలిగారు. మిగిలిన రూ.13లక్షలు ఆంక్షలు పుణ్యామని వెనక్కి మళ్లిపోయాయి. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.12లక్షలు మాత్రమే మజూరయ్యాయి. ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. వీఐపీల తాకిడీ ఇంత తీవ్రంగా ఉంటే కలెక్టరేట్లో మాత్రం ప్రత్యేకంగా ప్రోటోకాల్ విభాగమంటూ లేని దుస్థితి నెలకొంది. రాజధాని స్థాయిలో వీఐపీల తాకిడి ఉన్న విశాఖలో ప్రత్యేకంగా డివిజనల్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రోటోకాల్ విభాగం ఉండాల్సి ఉన్నప్పటికీ విశాఖలో మాత్రం ఆ పరిస్థితి లేదు. -
2468మందికి మాత్రమే వీఐపీ దర్శనం
తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం, నూతన సంవత్సరం ఒకేసారి రావడంతో... తిరుమలకు వీఐపీలు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు... ఇరు రాష్ట్ర రాజకీయవేత్తలు, ప్రముఖలు పోటీపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ రోహిణి, వైఎస్ఆర్ సీపీ నేతలు బుట్టా రేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, డీకే అరుణ, మహేందర్ రెడ్డి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తదితరులు వెంకన్నను దర్శించుకున్నారు. 2468మందికి మాత్రమే టీటీడీ వీఐపీ దర్శనం కల్పించింది. అనంతరం రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ఆ ఇద్దరితో మరింత...
సక్సెస్ ఇచ్చే కిక్కే వేరు. ఆ మజాలో ఉన్న వీఐపీ (వేళై ఇల్లా పట్టాదారి) టీమ్ మరోసారి కలిసి నడవనుంది. అయితే ఈసారి మరింత పెద్ద హిట్ సాధించడానికి ప్రయత్నిస్తోంది. నటుడు ధనుష్ నటించి నిర్మించిన చిత్రం వేళై ఇల్లా పట్టాదారి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు వేల్రాజ్ తొలిసారిగా మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో అమలాపాల్, సురభి నాయికలుగా నటించారు. అనిరుధ్ సంగీత బాణీలందించిన ఈ చిత్రం విజయం ధనుష్కు కథా నాయకుడిగాను, నిర్మాతగాను చాలా కీలకమైంది. అంతకుముందు నటుడిగా కాస్త తడబడిన ధనుష్కు వీఐపీ చిత్ర విజయం ఎంతో ఊరటనిచ్చింది. అందుకే ఆ చిత్ర యూనిట్ తోనే మరో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు వేల్రాజ్ మంచి కథను తయారు చేశారు. ధనుష్కు అది నచ్చింది. ఇంకేముంది చిత్రం సెట్స్కు వెళ్లడానికి రెడీ అయ్యింది. అయితే మొదట వీఐపీ టీమ్తోనే చిత్రం చేయాలని భావించారు. కానీ చిన్న మార్పులు చేయక తప్పలేదట. ఆ మార్పులే తీయబోయే చిత్రానికి భారీ విలువలు ఆపాదించనుంది. వీఐపీ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన అమలాపాల్, సురభిలనే తాజా చిత్రంలోనూ నటింప చేయాలని అనుకున్నా అలా జరగడం లేదు. అమలాపాల్ దర్శకుడు విజయ్ను పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. దీంతో ఆమెకు బదులు క్రేజీ స్టార్ సమంతను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే విధంగా సురభికి బదులు ఎమిజాక్సన్ ఎంపికయ్యారు. ఇదరు హీరోయిన్లకూ చిత్రంలో ప్రాముఖ్యత ఉంటుందట. చిత్రం 2015 ఫిబ్రవరిలో సెట్పైకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈలోపు ప్రస్తుతం నటిస్తున్న మారి చిత్రాన్ని ధనుష్ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. -
టీటీడీలో ఏకాదశి ఫీవర్..!
* వెకుంఠ దర్శనం వీఐపీలకేనా * ఉద్యోగులు, స్థానికుల ఆవేదన తిరుపతి సిటీ : తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులకు వైకుంఠ ఏకాదశి జ్వరం పట్టుకుంది. నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి కలసి రావడంతో అటు వీఐపీల నుంచి సిఫార్సులు.. ఇటు స్థానికుల నుంచి నిరసనలు ఎదురవడంతో టీటీడీ అధికారులు ఏమి చేయాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు. ఏర్పాట్ల విషయంలో టీటీడీ ఇప్పటికే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నా భక్తులకు స్వామి దర్శనం కల్పించడంలో మాత్రం ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. వైకుంఠ ఏకాదశిపై జరుగుతున్న సమీక్షలో మాత్రం వీఐపీలను వెనకేసుకొస్తున్నారేగాని సామాన్య భక్తుల విషయంలో వైకుంఠద్వార దర్శనం ఎలా కల్పిస్తారో మాత్రం వివరించకపోవడం గమనార్హం. వైకుంఠ దర్శన టికెట్లలో తొలుత వీఐపీలకే ప్రాధాన్యమివ్వడం, అటు తరువాతనే సామాన్య భక్తులకు ఆలయ ప్రవేశమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. ఉదయం 5 గంటల తరువాత సామాన్య భక్తులను దర్శనానికి వదులుతామని చెప్తున్నారు. అయితే ద్వాదశి టికె ట్లు మాత్రం 10 వేలు మాత్రమే కేటాయించారు. అవి కూడా గంటలోపే అమ్ముడు కావడంతో టీటీడీ అధికారులు ఖంగు తిన్నారు. ద్వాదశి దర్శనానికే ఇలా ఉంటే ఏకాదశి దర్శనం భక్తులకు కేటాయించకపోతే ఎక్కడ నుంచి ఎలాంటి ఉపద్రవం ముంచుకోస్తుందో నన్న భయం అధికారులను పట్టుకుంది. ఇప్పటికే ఈ విషయమై స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా టీటీడీ వీఐపీల సేవలోనే తరిస్తోం దంటూ తిరుపతికి చెందిన కొందరు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. గతంలో ఉద్యోగులకు ఈ పర్వదినాల్లో టికెట్ల కేటాయింపు ఉండేది. ఈ సారి వాటిని రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించడంతో ఉద్యోగ సంఘాలు టీటీడీ తీరుపై గుర్రుగా ఉన్నాయి. -
3 గంటలకు బాలచందర్ అంత్యక్రియలు
-
బాలచందర్ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి
-
చెప్పలేని కష్టం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా ప్రజలకు చెప్పుకోలేని కష్టం వచ్చిపడింది. ఏటా సంభవిస్తున్న తుపాన్లతో జనం అల్లాడిపోతున్నారు. వరుస తుపాన్ల కారణంగా ఓ వైపు పంట నష్టం, మరోవైపు ఆర్థిక కష్టాలు జనాన్ని చుట్టుముడుతున్నాయి. గతేడాది సంభవిం చిన పై-లీన్ తుపాను జిల్లాను అతలాకుతలం చేసి వెళ్లిపోగా సుమారు రూ.1000 కోట్ల నష్టం వాటిల్లినట్టు అప్పట్లోనే ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పటికీ ఆ నష్టాన్ని బాధితులకు అందించలేకపోయారు. రీ సర్వే పేరిట కాలయాపన చేస్తున్నారు. రూ.40 కోట్లు వస్తుందని ఎప్పటినుంచో చెబుతున్నా ఇప్పటికీ అధికారికంగా మంజూరు కాలేదని అధికారులే చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ హుదూద్ తుపాను జిల్లాను ఊడ్చేసింది. ఓ వైపు భీకరగాలులు, మరోవైపు భోరున వర్షం వల్ల జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఐదు రోజులవుతున్నా జనం సాధారణ పరిస్థితులకు రాలేకపోయారు. నిత్యావసరాలకు ఇబ్బందే తుపాను తాకిడికి జనం ఇక్కట్లు పడుతున్నారు. పాలు, నీళ్లతో పాటు కిరాణసరుకులకూ దూరమయ్యారు. వ్యాపారులూ దోపిడీ చేస్తున్నారు. జనరేటర్, చార్జింగ్, గ్యాస్, పెట్రోల్ ఇలా అన్నింటిలోనూ అందినకాడికి దోచుకుంటున్నారు. రైతుబజార్లలో తక్కువ ధరకే కూరగాయలని ప్రభుత్వం చెబుతున్నా అవి తీసుకుంటే ముక్కుమూసుకోకతప్పదని జనం విమర్శిస్తున్నారు. గురువారం తప్పకుండా విద్యుత్ సరఫరా ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఆ పరిస్థితి పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో జనం ఉసూరుమంటున్నారు. మునిసిపాలిటీ ఇస్తున్న నీరు బురదమయంగా మారింది. అంధకారంలో జిల్లా వాసులు మగ్గిపోతున్నారు. సమన్వయ లోపం మరో శాపం జిల్లాలోని 11 మండలాల్లో 237 గ్రామాల్లో తుపాను భీకరం సృష్టిం చింది. 19మండలాల్ని వరద ముంచెత్తింది. 237 గ్రామాల్లో ఇంకా వరద నీరు తగ్గలేదని జనం చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పునరావాస కేంద్రాల్లో పరిస్థితి దారుణ ంగా ఉంది. తామున్నామని భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని తీర ప్రాంత వాసులు గుక్కెడు నీళ్లకూ ఇబ్బందిపడుతున్నా నాయకులు, అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. ప్రత్యేక బృం దాల పేరిట జిల్లాకు 11 మంది ఐఎఎస్లు, జిల్లాకు చెందిన ముగ్గురు మొత్తం 14 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలు, పోలీసులు ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తున్నా తుపాను ధాటికి జనం ఇంకా తేరుకోలేదు. ఈ తరుణంలో నాయకులు, అధికారుల ప్రోటోకాల్ కోసమే జిల్లా అధికారులు తరించిపోవాల్సివస్తోంది. సమీక్షల పేరిట కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినా ఆశించిన స్థాయిలో బాధితులకు భరోసా అందలేకపోయూరనే విమర్శలున్నాయి. గతంలో పరిస్థితి.. గతేడాది అక్టోబర్ 12న ఏర్పడిన పై-లీన్ తుపాను జిల్లాలోని సుమారు నాలుగు లక్షల మందిపై ప్రభావం చూపింది. 350 గ్రా మాల్లో 85 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 382 ఇళ్లు పూర్తిగా, 800 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 1200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 442 గ్రామాలు తుపాను ధాటికి గురయ్యాయి. వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తొమ్మిది వేల హెక్టార్లలో పంట పొలాలు, ఎనిమిది వేల హెక్టార్లలో ఉద్యాన వనాలు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. 84 అడుగుల సామర్ధ్యం ఉన్న వంశధారకు 83.4 అడుగుల మేర నీరు చేరగా, 54 వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న గొట్టా బ్యారేజీకి 52 వేల క్యూసెక్కుల నీరు చేరింది. నాగావళిలో సాధారణ స్థాయికి మించి వరద నీరు చేరింది. 40 చిన్నా, పెద్ద చెరువులు నీటితో నిండిపోగా, 300 లోతట్టు ప్రాంతాల్ని జిల్లా యం త్రాంగం గుర్తించింది. లక్షన్నర ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. తీరం, సరిహద్దుల్లో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచార వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పుడూ అదే పరిస్థితి 11 మండలాల్లో 62 పునరావాస కేంద్రాల్లో 1.32 లక్షల మందిని తరలించారు. 42 పశువులు మృతిచెందగా, చెట్టు పడి ఒకరు మృతి చెం దారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆహారాన్ని సుమారు 33,293 మంది బాధితులకు అందించాల్సి వచ్చింది. ఒడిశాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీకి చెందిన బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాయి. గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, బోట్లు ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. వెద్య బృందాలు వైద్యం అందిస్తున్నాయి. లక్షలఎకరాల్లో వరి, ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. వేలా ది ఇళ్లు నేలమట్టమయ్యాయి. మత్స్యకారులు బాగా నష్టపోయారు. -
రామ్... వీఐపి!
వీఐపి.. అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని అర్థం. కానీ, ఈ మధ్య తమిళ పరిశ్రమలో ఈ మూడక్షరాలకు ఓ కొత్తర్థం చెబుతున్నారు. అదే ‘వేలై ఇల్లాద పట్టదారి’ (వి.ఐ.పి). అంటే.. డిగ్రీ పట్టా పుచ్చుకున్న నిరుద్యోగి అని అర్థం. ధనుష్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. అలాగే, పెళ్లికి ముందు అమలాపాల్ చేసిన చిత్రం ఇదే కావడం విశేషం. అతి తక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందించిన ఈ చిత్రం అక్కడ వసూళ్ల వర్షం కురిపించడం మరో విశేషం. దాంతో ఈ సినిమా హక్కుల కోసం ఇతర భాషలకు చెందిన నిర్మాతలందరూ క్యూ కట్టారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీనే నెలకొంది. ఈ నేపథ్యంలో... ఇంత పోటీని తట్టుకొని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. ‘రవికిశోర్ ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నారు’ అనగానే... ఇందులో నటించే హీరో ‘రామ్’ అని చెప్పకనే చెప్పేస్తున్నారంతా. రామ్తోనే స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని చేయనున్నట్లు ఫిల్మ్నగర్ సమాచారం. కథ రీత్యా ఇందులో హీరో పాత్ర... బోయ్ నెక్ట్స్ డోర్ అన్నట్టుగా ఉంటుంది. ఎలాగూ రామ్కి పక్కింటబ్బాయి ఇమేజ్ ఉంది కాబట్టి, రామ్కి ఈ కథ యాప్ట్గా ఉంటుందని పరిశీలకుల అంచనా. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
వేటు..లే టు!
ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో విప్ ధిక్కరించిన ఎనిమిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై అనర్హత వేటు వేసేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల దెబ్బకు భయపడి వేటుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: ఆయన పేరు రంగన్న. యర్రగుంట్ల మున్సిపల్ ఛెర్మైన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తి. చట్టాన్ని అమలు చేయాల్సిన ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విప్ ధిక్కరించిన 8 మంది కౌన్సిలర్లపై వేటు వేసే విషయంలో ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు. యర్రగుంట్ల మున్సిపాలిటీలో 18మంది కౌన్సిలర్ స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. కేవలం 2 స్థానాలు మాత్రమే టీడీపీ దక్కించుకుంది. అధికారం అండతో 8 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను స్థానిక ‘దేశం’ నేతలు ప్రలోభాలకు గురిచేశారు. దాంతో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన కౌన్సిలర్లు పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఆ మేరకు ఛెర్మైన్, వైస్ ఛెర్మైన్ ఎన్నికలకు లాటరీ అనివార్యమైంది. కాగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విప్ ధిక్కరించడంతో ఆ పార్టీ నేతలు రిటర్నింగ్ అధికారి రంగన్నకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నోటీసులు సైతం జారీ చేశారు. అయితే చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్ని అమలు పర్చేందుకు సైతం వెనుకంజ వేస్తున్నారు. కేవలం ఇద్దరు నేతలను సంతృప్తిపర్చేందుకేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారపార్టీ మెప్పుకోసమే.. అలాంటి పరిస్థితే రాయచోటి మున్సిపాలిటీలోనూ తలెత్తింది. 18 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. వారిలో ముగ్గురు ఆ పార్టీ విప్ ధిక్కరించారు. ఆ కారణంగా అక్కడ కూడా లాటరీనే అనివార్యమైంది. విప్ ధిక్కరించిన వారిపై అక్కడి ఆర్ఓ అనర్హతవేటు వేశారు. రాజంపేట ఎంపీపీ సుహర్లతపై విప్ ధిక్కారం కారణంగా అనర్హత వేటు పడింది. తెలుగుదేశం పార్టీ విప్ ధిక్కరించారని వీరపునాయునిపల్లె ఎంపీపీ పద్మలతపై అన ర్హత వేటు వేశారు. జిల్లా వ్యాప్తంగా విప్ ధిక్కరించిన వారిపై చర్యలున్నా యర్రగుంట్లలో 8 మంది కౌన్సిలర్లపై మాత్రమే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకు కారణం రిటర్నింగ్ అధికారి రంగన్నే అని ఉన్నతాధికారులు సైతం వివరిస్తున్నారు. అధికార పార్టీ నేతలనుంచి ఉన్న ఒత్తిడి ఫలితంగానే చర్యలు తీసుకోవడంలో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కక్కుర్తితోనే పదవులకు ఎసరు.. జిల్లాలో 11 మంది కౌన్సిలర్లు కాసులకు కక్కుర్తి పడ్డారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొంది టీడీపీ నేతల ప్రలోభాలకు లొంగారు. ఇప్పడు వారందరి పదవులకు ఎసరు వచ్చింది. రాయచోటిలో ముగ్గురు కౌన్సిలర్లపై వేటు పడింది. అలాగే రాజంపేట ఎంపీపీ సుహర్లత అనర్హతకు గురయ్యారు. యర్రగుంట్లలో 8 మంది కౌన్సిలర్లపై తర్వలో అనర్హత వేటు పడనుంది. ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సి ఉండగా అధికార పార్టీ ప్రభావంతో కొంత ఆలస్యం అవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం అధికార పార్టీ వారిచ్చే కాసులకు ఆశపడి పదవులు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఆర్వో రంగన్న ఏమన్నారంటే.... యర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో 8మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ విప్ ధిక్కరించారు. వారిపై అందిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేశాం. ఆమేరకు ఆ కౌన్సిలర్ల నుంచి వివరణ కూడా తీసుకుని ఎన్నికల కమిషన్కు వివరించాం. అక్కడి నుంచి ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. ఆదేశాలు అందగానే వేటు వేస్తాం. -
రాజంపేట ఎంపీపీపై అనర్హత వేటు
రాజంపేట: వైఎస్సార్సీపీ జారీ చేసిన విప్ను దిక్కరించి.. రాజంపేట ఎంపీపీగా ఎన్నికైన సుహర్లత పై అనర్హత వేటు పడింది. విప్ ధిక్కరించిన ఎంపీపీపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు సంబంధిత ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సుహర్లతపై అనర్హత వేటు వేస్తూ ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవిషయాన్ని ఎంపీడీఓ వెంకటసుబ్బయ్య ధ్రువీకరించారు. దీంతో ఎంపీటీసీ స్థానంతో పాటు ఎంపీపీ పదవి కూడా సుహర్లత కోల్పోయారు. టీడీపీకి అభ్యర్థి లేకపోవడంతోనే.. రాజంపేట ఎంపీపీ పదవి ఎస్సీ వర్గానికి కేటాయించారు. ఉన్న ఎస్సీ ఎంపీటీసీల స్థానాల్లో ఒక్కటి కూడా టీడీపీ గెలుచుకోలేక పోయింది. దీంతో వారు వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఎస్సీ అభ్యర్థి సుహర్లతను ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకున్నారు. అధికారపార్టీ ఇచ్చిన ఆఫర్తో ఆమె కూడా ఎంపీపీ పదవికి కోసం పార్టీని వదిలి టీడీపీకి మద్దతిచ్చారు. దీంతో ఇరు పార్టీలకు సమాన ఓట్లు ఉండగా.. డిప్లో ఎంపీపీ పదవి టీడీపీ కి, వైస్ ఎంపీపీ వైఎస్సార్ సీపీకి దక్కింది. ప్రస్తుతం వైస్ ఎంపీ పీగా ఆకే పాటి రంగారెడ్డి ఉన్నారు. ధర్మం గెలిచింది: ఎంపీపీ సుహర్లతపై అనర్హత వేటు పడటం వల్ల ధర్మం గెలిచినట్లయిందని వైఎస్సార్సీపీనేత ఆకేపాటి మురళీరెడ్డి అన్నారు.న్యాయం ఎప్పటికైనా నిలుస్తుందని, ఇది వైఎస్సార్సీపీ విజయమన్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది: ఆకేపాటి రాజంపేట: ధర్మం... న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. రాజంపేట ఎంపీపీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆకేపాటి భవన్లో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా సరే గీత దాటితే గుణపాఠం తప్పదని, అందుకు నిదర్శనం రాజంపేట ఎంపీపీ పదవిని కోల్పోవడమేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీటీసీగా గెలిచిన సభ్యురాలును టీడీపీ ప్రలోభాలకు చూపి తమ వైపు తిప్పుకుని ఎంపీపీ పదవిని కేటాయించడం జరిగిందన్నారు. అందువల్ల పార్టీ జారీ చేసిన విప్ ఆధారంగా అనర్హత వేటు పడిందన్నారు. పార్టీలు మారే వారికి ఇది కనువిప్పు కలిగిస్తుందన్నారు. రాజంపేట మండల పరిషత్ ఎన్నికల్లో నైతికంగా ఏనాడో వైఎస్సార్ సీపీ గెలిచిందన్నారు. జిల్లాలో అనేక చోట్ల ఈ విధంగా అవకతవకలకు పాల్పడి పదవులు పొందిన వారికి ఎన్నికల సంఘం వేటుకు పదవులు కోల్పోవడం తప్పదన్నారు. నిబంధనలు పాటించిన ఎన్నికల సంఘానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈయనతో పాటు మండల పార్టీ కన్వినర్ నాగినేని నాగేశ్వరనాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు నాగేశ్వరరెడ్డి, సుబ్బరాజు, సర్పంచ్ బుర్రు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఈదర అవుట్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు పదవి పోయింది. పార్టీ విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేస్తూ సోమవారం సాయంత్రం ప్రిసైడింగ్ అధికారి హోదాలో కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరిషత్కు చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు కో-ఆప్షన్ మెంబర్ల ఎంపికకు గత నెల 13న ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ విజయకుమార్ వ్యవహరించారు. చైర్మన్ ఎన్నిక సందర్భంలో పొన్నలూరు జెడ్పీటీసీ ఈదర హరిబాబు ఇండిపెండెంట్ అభ్యర్థికి, వైస్ చైర్మన్ ఎన్నికలో మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి విప్ ధిక్కరించి చేతులు ఎత్తినందున పార్టీ విప్ ధిక్కరించినట్లు భావించి పంచాయతీరాజ్ చట్టం 2006 ప్రకారంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎలక్షన్ రూల్స్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నం.173, తేదీ 10.5.2006 మేరకు విప్ ధిక్కరించినందున జెడ్పీటీసీ పొన్నలూరు అభ్యర్థి హరిబాబుపై కలెక్టర్ అనర్హత ఉత్తర్వులు జారీ చేశారు.’ అంటూ అధికారిక ప్రకటన వెలువడింది. వేటు పడిందిలా... పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన అంశంలో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణ చేపట్టారు. దీనిపై నోటీసులు జారీ చేసినపుడు తాను పార్టీ విప్ తీసుకోలేదని, అందువల్ల విప్ ధిక్కరించే అవకాశం లేదంటూ ఈదర హరిబాబు, ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అయితే విప్ జారీ చేసిన సమయంలో పెట్టిన సంతకం, గత నెల 13వ తేదీన జరిగిన ప్రత్యేక సమావేశం హాజరు రిజిస్టర్లో సంతకం సరిచూడగా రెండు సంతకాలు ఒక్కటే కావడంతో కలెక్టర్ విప్ ధిక్కరించినట్లు భావించి వేటు వేశారు. కిం కర్తవ్యం... జెడ్పీ చైర్మన్పై వేటు పడటంతో తర్వాత ఏం చేయాలనే దానిపై కలెక్టర్ దృష్టి పెట్టారు. చట్ట ప్రకారం వైస్ చైర్మన్ను ఇన్చార్జిగా నియమించాల్సి ఉంటుంది. దీని కోసం ఎన్నికల సంఘాన్ని స్పష్టత ఇవ్వాల్సిందిగా లేఖ రాశారు. మంగళవారానికి దీనిపై ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆదేశాలు రాగానే వైస్ చైర్మన్గా ఉన్న నూకసాని బాలాజీకి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారు. మళ్లీ ఎన్నిక ఎప్పుడు? జెడ్పీ చైర్మన్పై వేటు పడటంతో ఆయనకు కోర్టు నుంచి ఎటువంటి ఊరట లభించని పక్షంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మళ్లీ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. హరిబాబు జెడ్పీటీసీ సభ్యత్వం రద్దు కావడంతో పొన్నలూరు జెడ్పీటీసీకి ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికను ఆరు నెలల్లోపు ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అప్పటి వరకూ నూకసాని బాలాజీ చైర్మన్గా కొనసాగుతారు. పొన్నలూరు జెడ్పీటీసీ ఎన్నిక జరగకముందే చైర్మన్ ఎన్నిక జరిపించాలని తెలుగుదేశం నాయకులు తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే ఎన్నికల సంఘందే తుది నిర్ణయం కావడంతో అక్కడి నుంచి ఆదేశాలు వచ్చే వరకూ చైర్మన్ ఎన్నిక ఉండకపోవచ్చు. -
ఆమె సరే... వీరి మాటేమిటో..!
సాక్షి ప్రతినిధి, కడప: ‘అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో’ అన్నట్లు అధికార యంత్రాంగం తీరు ప్రస్ఫుటం అవుతోంది. జిల్లాలో ఒకరికిపై మాత్రమే విప్ ధిక్కారణ వేటు వేసి విమర్శలకు తెరతీశారు. తెలుగుదేశం పార్టీ విప్ ధిక్కరించారని వీరపునాయునిపల్లె ఎంపీపీ పద్మలతపై అనర్హత వేటు వేశారు. విప్ ధిక్కరించిన వారికి రాజ్యాంగం ప్రకారం అనర్హత వేటు తప్పదు. ఈ విషయంలో అధికారులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. జిల్లాలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 18మంది కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. కేవలం 2 స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకుంది. అధికారం అండతో 8మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ ప్రలోభాలకు గురిచేసింది. ఆ కారణంగా ఇరుపక్షాల బలం సమానం కావడంతో లాటరీ ద్వారా చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విప్ ధిక్కరించారని ఆ పార్టీ నేతులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నోటీసులు కూడా జారీ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవడంలో ఇప్పటికీ జాప్యం జరుగుతోంది. ఇదే పరిస్థితి రాయచోటి మున్సిపాలిటిలోనూ కొనసాగుతోంది. ఇక్కడ 18మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. వారిలో ముగ్గురు ఆ పార్టీ విప్ ధిక్కరించారు. ఈ కారణంగా అక్కడ కూడా లాటరీ అనివార్యమైంది. విప్ ధిక్కరించిన వారిపై అనర్హతవేటు వేయాల్సిందిగా ఆపార్టీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అయితే ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాజంపేట ఎంపీపీ సుహర్లతపై సైతం అధికారులు అదే ధోరణి అవలంభిస్తున్నారు. పార్టీ ఫిరాయింపు చట్టం వర్తింపజేయడంలో తాత్సారం చేస్తున్నారు. నిబంధనల మేరకు వారందరిపై ఇప్పటికే అనర్హత వేటు వేయాల్సి ఉంది. చట్టం అందరికి సమానమే అన్న విషయాన్ని అధికార యంత్రాంగం రుజువు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించివారిలో ఒకరిపై వేటు వేసిన నేపధ్యంలో అధికారులు చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంది. ఫిరాయింపు దారులకు పదవుల బెంగ.... జిల్లాలో 11 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది కాసులకు కక్కుర్తి పడి టీడీపీ పంచన చేరారు. ఇప్పడు వారందరికీ పదవుల బెంగ పట్టుకుంది. వీరపునాయునిపల్లె ఎంపీపీపై అనర్హత వేటు వేసిన నేపధ్యంలో ఇక తమ పదవులు కోల్పోవాల్సి వస్తోందని ఆంత రంగికుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. డబ్బుతోపాటు, ఐదేళ్ల పదవి పదిలమని చెప్పారని, ఇప్పుడు పదవులు కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై యర్రగుంట్ల కౌన్సిలర్లు అక్కడి టీడీపీ నాయకుడి వద్ద తమ గోడును వెల్లగక్కినట్లు సమాచారం. అధికారం మనదే.. అనర్హత వేటు పడకుండా ప్రయత్నిద్ధాం. ఒకవేళ వేటు వేసినా టీడీపీ తరుపున ఎన్నికల్లో మీరే నిలవండి..గెల్పించుకునే బాధ్యత తమదేనని చెప్పుకొచ్చినట్లు సమాచారం. పార్టీ ఫిరాయించినందుకు జనం ఛీ కొడుతుంటే మళ్లీ ఎన్నికల్లో ఎక్కడ తలపడగలమని ఫిరాయింపుదారుల్లో ఒకరు వాపోయినట్లు తెలుస్తోంది. మీ మాటలు నమ్మి కౌన్సిలర్ పదవి కోల్పోవలసి వస్తోందని అధికారం అండతో ఏదో విధంగా ఆదుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. -
వీఐపీ విజృంభిస్తున్నాడు..
విభిన్న పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ తాజా చిత్రం వీఐపీ తమిళనాట కలెక్షన్లతో విజృంభిస్తోంది. జూలై 18 తేది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వేలయ్ ఇల్లా పట్టధారి (వీఐపీ) చిత్రం ధనుష్ కెరీర్ లో అత్యధికంగా ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డును నెలకొల్పింది. 350 కి పైగా థియేటర్లలో విడుదలైన వీఐపీ చిత్రం తమిళనాడులోనే నికరంగా 4.36 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన టాప్ ఫైవ్ చిత్రాల్లో ఒకటిగా విఐపీ నిలిచి ఓ కొత్త రికార్డును సాధించింది. ఫ్రాన్స్ లో 2014లో విడుదలైన చిత్రాల్లో వీఐపీ ఒకటిగా నిలిచింది. అమెరికాలో విడుదలైన మూడు రోజుల్లోనే వీఐపీ చిత్రం లక్ష డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. -
మీపై ఎందుకు వేటు వేయకూడదు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ ఎన్నికల్లో గీతదాటిన జెడ్పీటీసీ సభ్యులకు ఉచ్చు బిగుస్తోంది. పార్టీ జారీ చేసిన విప్ను ధిక్కరించి టీఆర్ఎస్కు ఓటేసిన ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సంజాయిషీ ఇవ్వాలని శనివారం జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన ముంగి జ్యోతి (రాజేంద్రనగర్), కొంపల్లి యాదవరెడ్డి (నవాబ్పేట)ని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఆ పార్టీనేతలు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్టం-1994 రూల్ 22 కింద ‘మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని’ కలెక్టర్ శ్రీధర్ నోటీసులిచ్చారు. విప్ ఉల్లంఘించారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన ఆధారాలను కూడా నోటీసులతోపాటు జతపరిచారు. దీనిపై ఈనెల 25లోపు సమాధానమివ్వాలని గడువు విధించారు. ఇదిలావుండగా పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన ముంగి జ్యోతిని ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ ప్రకటించింది. విప్ను ధిక్కరించిన మరో జెడ్పీటీసీ యాదవరెడ్డిపై మాత్రం వేటు వేయకపోవడం గమనార్హం. ప్రస్తుత ం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆయనపై చర్య తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక కుల్కచర్ల, ధారూర్, మోమిన్పేట, మర్పల్లి మండల పరిషత్ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించి ప్రత్యర్థి పార్టీలకు ఓటేసిన ఎంపీటీసీలపైనా చర్య తీసుకోవాలని ఆయా పార్టీల అధిష్టానాలు ప్రిసైడింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయాలను శిరసావహించకుండా ఇత ర పార్టీల్లోకి ఫిరాయించిన సభ్యులు వారం రోజుల్లో సమాధానమివ్వాలని అధికారులు తాఖీదులు పంపారు. -
పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయనుంది. పార్టీ అధ్యక్షుడి సంతకాలతో కూడిన లేఖలను ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు పార్టీ కార్యాలయం పంపనుంది. పార్టీ విప్ ధిక్కరించిన వారిపై అనర్హత వేటు పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసేందుకు అనుమతి కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే లేఖ రాసింది. జూలై 3న మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికలు, 4న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. 5వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఎన్నికల సంఘం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తుండటంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హతకు గురవుతారు. -
ఓటమి చవిచూసిన ప్రముఖులు
-
భక్తులకు పాద భాగ్యం
పాడేరు,న్యూస్లైన్: నేటి నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయాన్ని శోభాయమానంగా ఆలయం అలంకరించారు. ఈ నెల 13న అనుపు ఉత్సవం ఉంటుంది. ఉత్సవ విగ్రహం, పాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్సవాల సమయంలో విగ్రహం, పాదాలను నెత్తిన పెట్టుకొని మోసే భాగ్యం ఉంటే అంతా మంచే జరుగుతుందనే నమ్మకం పూర్వం నుంచి భక్తుల్లో నెలకొంది. అయితే వీఐపీల తాకిడి అధికంగా ఉండటంతో సామాన్య భక్తులు ఉత్సవ విగ్రహం, పాదాలను తాకేందుకు కూడా వీలు లేని పరిస్థితి వారిని బాధిస్తోంది. లక్షలాది మంది భక్తులు ఉత్సవానికి తరలి వస్తున్నా అందరికి మోసే భాగ్యం మాత్రం లేదు. కానీ ఈ ఏడాది ఎన్నికల కోడ్ కారణంతో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఉత్సవ కమిటీ వీఐపీలుగా గుర్తించడం లేదు. సామాన్య భక్తులే తమకు వీఐపీలని, అందరికీ ఉత్సవ విగ్రహం, పాదాలను మోసే అవకాశం కల్పిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కురుసా నాగభూషణం, బత్తిన కృష్ణలు ప్రకటించారు. పోలీసుశాఖ కూడా రోప్వే ఏర్పాటు చేసి ఉత్సవ విగ్రహం, పాదాలను భక్తులు తాకే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. దీంతో భక్తులో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
-
ఇక తెరపైకి.. వీఐపీలు
సాక్షి, సిటీబ్యూరో : పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నగరంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. గురువారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్గాంధీ పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేయనున్నారు. చాలాకాలం తర్వాత రాహుల్ నగరానికి వస్తుండటంతో నగర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమైన జనసేన అధినేత, సినీనటుడు పవన్కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లిలలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ నగర శివారు శాసనసభా స్థానాలపై దృష్టి సారించారు. శని, ఆదివారాల్లో నగరంలో వివిధ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. -
వీఐపీలకు ఎర్ర తివాచీ
=సామాన్య భక్తులకు ఇక్కట్లు =అంగప్రదక్షిణం భక్తులను అడ్డుకున్న సిబ్బంది సాక్షి, తిరుమల: టీటీడీ అధికారుల కొత్త నిర్ణయాలు సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. నూతన సంవత్సరంలో వీఐపీల దర్శనానికి అధికారులు ఆలయం వద్ద ఎర్రతివాచితో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఆలయ వీధుల్లో అంగప్రదక్షిణం చేసేందుకు భక్తులకు అవకాశం లేకుం డాపోయింది. ఆలయం వద్ద సామాన్య భక్తులను కట్టడి చేయడంతో వారు అనుకోని ఇబ్బందులకు గురయ్యారు. సామాన్యుల అంగప్రదక్షిణానికి వీఐపీల అడ్డు ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలను ఈసారి సుపథం నుంచి దర్శనానికి అనుమతించారు. వీరు రాంభగీచా వద్ద వాహనాలు నిలిపి ఆలయ ముందు నుంచి సుపథానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసి ఎర్రతివాచీలు పరిచారు. అయితే సామాన్య భక్తులను అడ్డుకోవడంతో పాటు ఆలయ వీధుల్లో మహాంగప్రదక్షిణం చేయకుండా నిలుపుదల చేశారు. భక్తులు స్వామివారికి ఆలయంలో అంగప్రదక్షిణం, ఆలయం వెలుపల నాలుగు మాడవీధుల్లో మహాంగ ప్రదక్షిణం చేస్తుంటారు. అయితే కొత్త సంవత్సరం తొలిరోజున మహాంగప్రదక్షిణ భక్తులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ‘స్వామి దర్శనానికి వీఐపీలు వస్తున్నారు.. వీధుల్లో మహాంగ ప్రదక్షిణం చేయటం కుదరదు. లేవండి లేవండి.. ఇక్కడి నుంచి వెళ్లిపొండి’ అంటూ చేతులు పట్టి పైకిలేపి అక్కడి నుంచి పంపించేశారు. తడివస్త్రాలతో ఆలయ వీధుల్లో పొర్లుదండాలు చేద్దామని వస్తే భద్రతా సిబ్బంది అడ్డుకోవడం దారుణంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం వద్ద భక్తుల కట్టడి కొత్త సంవత్సరం తొలి రోజు ఆలయ పరిసర ప్రాం తాల్లో గడపటం వల్ల పుణ్యంతో పాటు అంతా శుభాలే కలుగుతామని భక్తుల విశ్వాసం. అయితే వీఐపీలకు ఆలయం వద్ద ఎర్రతివాచీ వేసి దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీనివల్ల సామాన్య భక్తులను మంగళవారం రాత్రి 11 గంటల నుంచే అఖిలాండం వద్ద నిలిపివేశారు. దీనిపై భక్తులు టీటీడీపై నిప్పులు చెరిగారు. దర్శనానికి వెళ్లే వీఐపీల కోసం ఆలయం వద్ద గడిపే తమను అడ్డుకోవడం సబబు కాదని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.