Wrestlers Protest
-
‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది!
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది. తన పుస్తకం ‘విట్నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్లకు కల్పించింది. సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్భూషణ్ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్భూషణ్ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది. . -
Vinesh Phogat: తన రాతను తానే మార్చుకుని.. సివంగిలా దూకి!
Vinesh Phogat: ‘ఈ అమ్మాయిని పోలీసు దెబ్బలతో అణచివేశారు... ఈ అమ్మాయిని తన దేశంలోనే రోడ్లపై ఈడ్చుకెళ్లారు... కానీ ఇదే అమ్మాయి ఇప్పుడు ప్రపంచాన్ని గెలుస్తోంది... పోరాటంలో ఎక్కడా తగ్గని మా వినేశ్ సివంగిలాంటిది. ఆమె విజయాలు చూస్తుంటే ఆనందిస్తున్నామో, కన్నీళ్లు వస్తున్నాయో కూడా తెలియడం లేదు.ఆమె ఆడుతున్న తీరు చూస్తే వినేశ్ ఒక్కతే కాదు... దేశంలోని ప్రతీ మహిళ పోరాడుతున్నట్లుగా ఉంది’... భారత మాజీ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మంగళవారం వినేశ్ ఫొగాట్ గురించి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్య ఇది.నిజం... వినేశ్ సాధించిన ఘనత ఇప్పుడు ఒలింపిక్ పతకం మాత్రమే కాదు, అంతకుమించి దానికి విలువ ఉంది. ఆటలో కాకుండా మ్యాట్ బయట ఆమె ఎదుర్కొన్న అవమానం, బాధలు, కన్నీళ్లు ఈ పతకం వెనక ఉన్నాయి. ఏడాదిన్నర ముందు ఆమె ఈ పతకం గెలిచి ఉంటే ఒక ప్లేయర్గానే ఆమె గొప్పతనం కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులను దాటి సాధించిన ఈ గెలుపు అసాధారణం.ఢిల్లీ వీధుల్లో ఆమె జీవితంలో అతి పెద్ద సవాల్ను ఎదుర్కొంది. పోలీసు దెబ్బలు, అరెస్ట్, బహిరంగంగా అవమానాలు, చంపేస్తామనే బెదిరింపులు, అవార్డులను వెనక్కి ఇచ్చే పరిస్థితులు రావడం, గెలిచిన పతకాలన్నీ గంగానదిలో పడేసేందుకు సిద్ధం కావడం... ఇలా ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా వినేశ్ వేదన అనుభవించింది. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే, సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోమని కోరడం వల్లే ఇదంతా జరిగింది.ఈ మొత్తం వ్యవహారంలో వినేశ్ తన కెరీర్ను పణంగా పెట్టింది. రిటైర్మెంట్కు చేరువైంది కాబట్టే ఇలా చేస్తోందంటూ వినిపించిన వ్యాఖ్యానాలను ఆ తర్వాత బలంగా తిప్పి కొట్టింది. మళ్లీ రెజ్లింగ్పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయం నుంచి కోలుకొని మరీ పోరాడింది. ఆరు నెలలు ముగిసేలోపు తానేంటో నిరూపించుకుంటూ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. వరుసగా మూడు ఒలింపిక్స్ ఆడిన భారత రెజ్లర్గా బరిలోకి దిగి మూడో ప్రయత్నంలో తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచింది.ఈ గాయం బాధ చాలా పెద్దదికెరీర్లో ఎన్నోసార్లు గాయాలతో సహవాసం చేసి కోలుకోగానే మళ్లీ మ్యాట్పై సంచలనాలు సృష్టించిన వినేశ్పై ఢిల్లీ ఉదంతం తీవ్ర ప్రభావం చూపించింది. శరీరానికి తగిలిన గాయాలకంటే మనసుకు తగిలిన ఈ గాయం బాధ చాలా పెద్దది అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. బ్రిజ్భూషణ్ శరణ్పై పోరాటం తర్వాత మళ్లీ ఆటలోకి అడుగు పెట్టే క్రమంలో కూడా అడ్డంకులు ఎదురయ్యాయి.సెలక్షన్ ట్రయల్స్కు హాజరు కాకుండా సీనియార్టీ ద్వారా అడ్డదారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ మళ్లీ విమర్శలు. ఈ మనో వేదన వెంటాడినా వినేశ్ బేలగా మారిపోలేదు. మళ్లీ పట్టుదలతో నిలబడింది. కెరీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడిన ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీలకు మారాల్సి వచ్చింది. రెజ్లింగ్లో ఇలా కేటగిరీ మారడం... అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు. కానీ ఎక్కడైనా నెగ్గగలననే పట్టుదల తనను నడిపించగా ఈ సవాల్ను వినేశ్ అధిగమించింది. అప్పుడు అలా చేజారినా2016 రియోలో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన వినేశ్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా... చైనా రెజ్లర్తో బౌట్లో ఎడమకాలు విరిగి కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించింది. స్ట్రెచర్పై ఆమెను బయటకు తీసుకుపోవాల్సి వచి్చంది. 2020 టోక్యో ఒలింపిక్స్ సమయంలో అద్భుత ఫామ్తో అడుగు పెట్టినా క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. దీనికి తోడు టీమ్ యూనిఫామ్ ధరించలేదని, గేమ్స్ విలేజ్ బయట ఉందని, భారత సహచరులతో కలిసి సాధన చేయలేదని క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఫెడరేషన్ ఆమెపై సస్పెన్షన్ విధించింది.తన రాతను తానే మార్చుకొనికొన్నాళ్లకు దానిని ఎత్తివేయడంతో మళ్లీ ఆటలోకి అడుగు పెట్టినా... గత ఏడాది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయంతో దెబ్బ పడింది. ఆపై మళ్లీ శస్త్రచికిత్స, రీహాబిలిటేషన్. మళ్లీ కోలుకొని మ్యాట్పై అడుగు పెట్టిన వినేశ్ ఒలింపిక్ పతకం సాధించే వరకు విశ్రమించలేదు. కొన్నాళ్ల క్రితం తన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్లో ఒక స్ఫూర్తిదాయక వాక్యం రాసుకుంది. ‘ఖుదీ కో కర్ బులంద్ ఇత్నా కే హర్ తఖ్దీర్ సే పహ్లే ఖుదా బందేసే ఖుద్ పూఛే బతా తేరీ రజా క్యా హై’ (నిన్ను నువ్వు ఎంత బలంగా మార్చుకో అంటే అదృష్టం అవసరం పడే ప్రతీ సందర్భంలో నీకు ఏం కావాలని దేవుడే స్వయంగా అడగాలి). దీనికి తగినట్లుగా ఇప్పుడు వినేశ్ తన రాతను తానే మార్చుకొని రెజ్లింగ్లో కొత్త చరిత్ర సృష్టించింది. – సాక్షి క్రీడా విభాగం -
బ్రిజ్ భూషణ్ తరపున నిర్భయ లాయర్
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో.. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తరపున వాదిస్తోంది ఎవరో తెలుసా? నిర్భయ కేసు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ డిఫెన్స్ న్యాయవాదిగా వ్యవహరించనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడేలా చేశారు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్. 2012లో జరిగిన ఆ సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నలుగురు నిందితులకు ఎనిమిదేళ్ల తర్వాత 2020 మార్చిలో శిక్ష పడేంతవరకు అవిశ్రాంత పోరాటం చేసి న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేశారు రాజీవ్. నాడు న్యాయాన్ని గెలిపించారు.. మరి నేడు..? నిర్భయ కేసులో అద్భుతంగా వాదనలు వినిపించి బాధితురాలికి న్యాయం జరగడంలో తనదైన పాత్ర పోషించిన రాజీవ్ ఇప్పుడు మాత్రం ఎంపీ బ్రిజ్ భూషణ్ తరపున కోర్టుకు వాదనలు వినిపించనున్నారు. నాడు నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన అయన ఇప్పుడు వేధింపులకు గురైన రెజ్లర్లకు వ్యతిరేకంగా తన క్లయింట్ తరపున డిఫెన్స్ చేస్తుండటంతో చర్చనీయాంశమైంది. భారత రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ బెయిల్ పై ఈ నెల 20న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ మోహన్ బ్రిజ్ భూషణ్ కు ఊరట కలిగిస్తారో లేదో చూడాలి మరి. ఇది కూడా చదవండి: యూట్యూబర్ ఎఫెక్ట్.. కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేదం.. -
Asian Games: వినేశ్, బజరంగ్లకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందా?
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్లను ఎంపిక చేసేందుకు ఈనెల 22, 23 తేదీల్లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్హక్ కమిటీ ప్రకటించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి... నిరసన చేపట్టిన రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్, సాక్షి మలిక్, సంగీత ఫొగపాట్, సత్యవర్త్, జితేందర్లకు ట్రయల్స్లో ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలా వద్దా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని అడ్హక్ కమిటీ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ బజ్వా తెలిపారు. అభిషేక్కు కాంస్యం బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ తొలి రోజు భారత్కు ఒక కాంస్య పతకం లభించింది. పురుషుల 10 వేల మీటర్ల విభాగంలో అభిషేక్ పాల్ కాంస్య పతకం సాధించాడు. అభిషేక్ 29 నిమిషాల 33.26 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి (59.10 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచింది. -
'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్తో దురుసు ప్రవర్తన
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ తన చర్యతో మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రశ్న అడిగిన పాపానికి ఒక మహిళా జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించడమే గాక మైక్ను విరగ్గొట్టడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బ్రిజ్భూషణ్ చర్యపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విషయంలోకి వెళితే.. ప్రముఖ న్యూస్ చానెల్కు చెందిన రిపోర్టర్.. ''రెజ్లర్లకు లైంగిక వేధింపులపై ఢిల్లీ పోలీసులు మీపై చార్జ్షీట్ దాఖలు చేశారు.. నేరం రుజువైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారా'' అంటూ ప్రశ్నించింది. రిపోర్టర్ ప్రశ్నపై ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిజ్భూషణ్.. ''నేనెందుకు రాజీనామా చేస్తాను.. నా రాజీనామా గురించి ఎందుకడుగుతున్నారు''' అంటూ అసహనం వ్యక్తం చేశారు. ''అనంతరం మీపై చార్జ్షీట్ లు ఫైల్ అయ్యాయి.. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది'' అని అడగ్గా.. బ్రిజ్భూషణ్ రిపోర్టర్వైపు ఉరిమి చూస్తూ ''చుప్(Shut Up)'' అంటూ కారు ఎక్కడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో రిపోర్టర్ తన ప్రశ్నకు జవాబు చెప్పాలంటూ మైక్ను కారు డోరులో పెట్టింది. దీంతో కోపంతో మైక్పై నుంచే డోర్ను గట్టిగా వేశాడు. దీంతో రిపోర్టర్ చేతికి గాయమవ్వగా.. మైక్ విరిగిపోయింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఇదంతా వీడియో తీసి ట్విటర్లో షేర్ చేయగా ట్రెండింగ్గా మారింది. #LIVE कैमरे पर एक महिला पत्रकार से पहलवानों के साथ उत्पीड़न का आरोपी भाजपाई सांसद धमका रहा है, उनका माइक तोड़ रहा है, क्या महिला बाल विकास मंत्री @smritiirani बता सकती है ये किसके शब्द है? किसके संस्कार है? pic.twitter.com/689KVkrBRg — Srinivas BV (@srinivasiyc) July 11, 2023 बृजभूषण का ऑन कैमरा जब एक महिला पत्रकार के साथ ऐसा व्यवहार है तो ऑफ कैमरा आप ख़ुद समझ लें. #BrijBhushanSharanSingh pic.twitter.com/UdvtUhTZSH — Vividha (@VividhaOfficial) July 11, 2023 ఇక మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్ పై ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సుమారు 108 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఆయన శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్షీట్ (chargesheet)లో తెలిపారు. నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఢిల్లీ కోర్టు గత శుక్రవారం బ్రిజ్ భూషణ్ కు సమన్లు జారీ చేసింది. కేసును కొనసాగించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. జులై 18న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే మహిళా రెజ్లర్లు తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ పలుమార్లు ఖండించారు. చదవండి: Ashes 2023: 'అరె శాండ్పేపర్ మరిచిపోయా'.. ఆసీస్ ప్రధానికి రిషి సునాక్ కౌంటర్ Asia Cup 2023: 'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే' -
పక్కా ఆధారాలున్నాయి.. ఇక జైలుకే..
న్యూడిల్లి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై ఇప్పటికే చార్జి షీటు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను కటకటాల వెనక్కు పంపే ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. అందుకు తగిన ఆధారాలను కూడా సేకరించినట్లు చెబుతున్నారు. మైనర్ రెజ్లర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో రెజ్లర్లు ఉధృత స్థాయిలో నిరసనలు తెలియజేయడంతో ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేసి వెయ్యి పేజీల ఛార్జిషీటును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు సుమారు 100 మంది వాంగ్మూలాలను సేకరించినట్లు వారిలో 15 మంది ఇచ్చిన వాంగ్మూలాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపారు. ఈ సాక్ష్యాలను ఢిల్లీ కోర్టులో సమర్పించనున్నట్లు తెలిపిన ఢిల్లీ పోలీసులు నేరం రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని తెలిపారు. ఒకవేళ నేరం రుజువైతే మాత్రం బ్రిజ్ భూషణ్ కు మూడేళ్ళ నుండి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంటుందని అన్నారు. అసలే నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కాస్తంత క్రమశిక్షణతో వ్యవహరించాల్సింది పోయి ఇటీవల ఒక విలేఖరిపైన అనుచితంగా వ్యవహరించడంతో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. జూలై 18 కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు కూడా అందుకున్న బ్రిజ్ భూషణ్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. నేరుగా కోర్టులోనే మాట్లాడతానని అన్నారు. ఇది కూడా చదవండి: విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్ల విరాళాలు -
కీలక పరిణామం.. బ్రిజ్భూషణ్కు ఢిల్లీ కోర్టు సమన్లు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగిక వేదించడంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్కు సమన్లు జారీ చేసింది. జూలై 18న కోర్టుకు హాజరుకావాలని కోరింది. బ్రిజ్ భూషణ్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 2న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లతో పాటు 10 ఫిర్యాదులు నమోదు చేశారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్పై వచ్చిన ఫిర్యాదుల్లో మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకడం, వారి చాతీపై చేయి వేయడం, నడుము బాగాన్ని చేతితో తడమడం లాంటివి చేసేవాడంటూ పేర్కొన్నారు. చదవండి: #ManchesterUnited: ఇంగ్లండ్ స్టార్కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా! #HappyBirthdayMSD: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' -
బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ కీలక నిర్ణయం.. క్రీడా శాఖ ఆమోదం
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్ సెలెక్షన్ ట్రయల్స్కు సమాయత్తమయ్యేందుకు భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ విదేశాల్లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించగా వాటికి ఆమోదం లభించింది. బజరంగ్ 36 రోజుల శిక్షణ కోసం కిర్గిస్తాన్ను... వినేశ్ 18 రోజుల శిక్షణకు హంగేరిని ఎంచుకున్నారు. ఆగస్టు రెండో వారంలో ట్రయల్స్ జరగనుండగా... వచ్చే వారంలో వీరు విదేశాలకు బయలుదేరుతారు. వినేశ్ వెంట ఫిజియోథెరపిస్ట్ అశ్విని జీవన్ పాటిల్, కోచ్ సుదేశ్, ప్రాక్టీస్ భాగస్వామిగా సంగీత ఫొగాట్... బజరంగ్ వెంట కోచ్ సుజీత్ మాన్, ఫిజియోథెర పిస్ట్ అనూజ్, ప్రాక్టీస్ భాగస్వామి జితేందర్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ నిపుణుడు కాజీ హసన్ వెళతారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బ్రిజ్భూషణ్పై లైంగిక ఆరోపణల కేసును కోర్టులోనే తేల్చుకుంటామని బజరంగ్, వినేశ్ ప్రకటించారు. చదవండి: Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్ -
బ్రిజ్భూషణ్ ఎంగిలి మెతుకులు తినే బతుకు తనది!
న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ ఆరుగురు స్టార్ రెజ్లర్లకు ట్రయల్స్లో ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్ల కోసం నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్లో వినేశ్, సంగీత, సాక్షి మలిక్, సత్యవర్త్, బజరంగ్, జితేందర్లకు కేవలం ఒక్క బౌట్ పోటీ పెట్టారు. భారత ఒలింపిక్ సంఘం అడ్హక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం అనుచితమని బీజేపీ నేత కూడా అయిన యోగేశ్వర్ దత్ అన్నాడు. ‘దేని ఆధారంగా ఇలాంటి మినహాయింపు నిర్ణయం తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కమిటీ నిర్ణయం ఏమాత్రం సరికాదు. నా సలహా ఏంటంటే జూనియర్ రెజ్లర్లంతా నిరసన చేపట్టో, ప్రధానికి లేఖ రాసో దీనిపై పోరాడాలి’ అని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులపై నియమించిన కమిటీలో యోగేశ్వర్ సభ్యుడిగా ఉన్నాడు. బ్రిజ్భూషణ్ కీలుబొమ్మ దత్.. తమ విన్నపాన్ని మన్నించి అడ్హక్ కమిటీ ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టిన యోగేశ్వర్ దత్పై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అతనో వెన్నెముక లేని మనిషని, బ్రిజ్భూషణ్ చేతిలో కీలుబొమ్మని విమర్శించింది. ‘బ్రిజ్భూషణ్ ఎంగిలి మెతుకులు తినే బతుకు యోగేశ్వర్ది. అతని అడుగులకు మడుగులొత్తే తొత్తు యోగేశ్వర్. ఇతని చరిత్ర రెజ్లింగ్ లోకానికి బాగా తెలుసు’ అని ట్విట్టర్లో వినేశ్ మండిపడింది. విచారణ కమిటీలో ఉంటూ ఎవరెవరు బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా మాట్లాడారో వారి పేర్లను అతనికి చేరవేశాడని దుయ్యబట్టింది. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్టేట్మెంట్ ఇచి్చన రెజ్లర్లతో రాజీకొచ్చేలా ప్రవర్తించాడని ఆరోపించింది. గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ గెలుపు దుబాయ్: గ్లోబల్ చెస్ లీగ్లో గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ జట్టు రెండో విజయం నమోదు చేసింది. అల్పైన్ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ జట్టు 11–6తో గెలిచింది. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (అల్పైన్ వారియర్స్)తో జరిగిన గేమ్లో గ్యాంజస్ జట్టు ప్లేయర్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్తో 44 ఎత్తుల్లో ఓడిపోయినా... రాపోర్ట్, బెలా గ్యాంజస్ జట్టు తరఫున నెగ్గడంతో ఆ జట్టుకు విజయం దక్కింది. ఇతర మ్యాచ్ల్లో బాలన్ అలస్కాన్ నైట్స్ 14–5తో అప్గ్రాడ్ ముంబా మాస్టర్స్ జట్టుపై, త్రివేని కాంటినెంటల్ కింగ్స్ 8–7తో చింగారి గల్ఫ్ టైటాన్స్పై, అల్పైన్ వారియర్స్ 9–7తో బాలన్ అలస్కాన్ నైట్స్పై గెలిచాయి. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ ఓటమి సించ్ టెన్నిస్ చాంపియన్íÙప్ ఏటీపీ–500 టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ కథ ముగిసింది. లండన్లో జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 6–7 (5/7)తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. బోపన్న జోడీకి 18,190 యూరోల (రూ. 16 లక్షల 24 వేలు) ప్రైజ్మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రణయ్ పరాజయం భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ని్రష్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 19–21, 8–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: KP Chowdary Case: మా బిడ్డకు కేపీ చౌదరితో అసలు పరిచయమే లేదు.. వారం రోజులు ఇల్లు కావాలంటే: సిక్కిరెడ్డి తల్లి -
హర్షనీయం.. ఒక్క బౌట్తోనే అర్హతకు అవకాశం
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై కొన్ని నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్న స్టార్ రెజ్లర్లకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్హక్ కమిటీ గొప్ప ఊరటనిచ్చింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్లలో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం నిర్వహించే ట్రయల్స్లో ఆరుగురు రెజ్లర్లకు కేవలం ఒకే బౌట్ ద్వారా అర్హత పొందే అవకాశం కల్పించింది. స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, బజరంగ్ పూనియా, జితేందర్ కిన్హాలు మిగతా సెలక్షన్ ట్రయల్స్ విజేతలతో తలపడి గెలిస్తే చాలు ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు దీనికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహిస్తారు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు పతకాలు తెచ్చిపెట్టిన వీరంతా కేంద్ర క్రీడాశాఖను నేరుగా ఆయా క్రీడల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించాలని కోరారు. దీంతో స్టార్ రెజ్లర్ల విన్నపాన్ని కేంద్ర క్రీడాశాఖ, ఐఓఏ మన్నించాయి. అయితే ఈ నామమాత్ర బౌట్పై ఇతర ఔత్సాహిక రెజ్లర్లు విమర్శిస్తున్నారు. -
ఇది శూద్రులపై వివక్షా?
రాజ్పుత్ (క్షత్రియ) ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య ఛైర్మన్ అయిన బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. అయితే బ్రిజ్భూషణ్ మాత్రం కేంద్ర ప్రభుత్వం తనపై చర్య తీసుకుంటుందేమోనన్న చీకూచింతా లేకుండా, నేటికీ ఎంపీగా కొనసాగుతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన శూద్ర (జాట్) మహిళా రెజ్లర్లు వేసవి గాడ్పుల మధ్య ఢిల్లీ వీధులలో పోరాడుతూ ఉంటే వారిని పట్టించుకోవడం లేదు. రైతుల ఉద్యమ సమయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనతను చూపింది. అదే విధమైన ఉదాసీనతను ఇప్పుడు మహిళా రెజ్లర్ల విషయంలో చూపిస్తోంది. రెజ్లర్లకు దేశవ్యాప్త మద్దతు లభించడం ఎంతైనా అవసరం. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 2017 మార్చి నుండి ఆ రాష్ట్రంలో 186 ఎన్కౌంటర్లు జరిగాయని ‘ది ఇండి యన్ ఎక్స్ప్రెస్’ జరిపిన పోలీసుల రికార్డుల పరిశీలనలో వెల్లడైంది. అంటే ప్రతి 15 రోజులకు ఒకరికి పైగా! అయితే బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మాత్రం కేంద్ర ప్రభుత్వం తనపై చర్య తీసుకుంటుదేమోనన్న చీకూచింతా లేకుండా, తన సామాజిక వర్గానికే చెందిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి మద్దతుతో నేటికీ ఎంపీగా కొనసాగుతూనే ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ కూడా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన శూద్ర (జాట్) మహిళా రెజ్లర్లు బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా అసాధార ణమైన వేసవి గాడ్పుల మధ్య ఢిల్లీ వీధులలో న్యాయం కోసం పోరా డుతూ ఉంటే పట్టించుకోకుండా బ్రిజ్భూషణ్కే తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజ్పుత్ (క్షత్రియ) ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లు్యఎఫ్ఐ) ఛైర్మన్ బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్ నెలన్నర క్రితమే ఫిర్యాదు చేశారు. ఆయన్ని ఆరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దేహదార్డ్యం కలిగిన భారతీయ క్రీడాకారిణులలో ఎక్కువ మంది శూద్ర, దళిత, ఆదివాసీ కుటుంబాల నుంచి వచ్చినవారే. హరియాణా, ఉత్తరప్రదేశ్ లలోని జాట్ కులం తమ పిల్లలకు కుస్తీలో శిక్షణ ఇప్పించడంలో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత ఉదంతంలో బాధితులైన మహిళా రెజ్లర్ల గోడును ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అగ్రవర్ణ నిందితుడు బ్రిజ్భూష ణ్ను కాపాడేందుకు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గట్టి సంకల్పంతో ఉన్నట్లుగా భావించవలసి వస్తోంది. ‘వికీపీడియా’లోని బ్రిజ్భూషణ్ జీవిత చరిత్రను బట్టి చూస్తే – పోలీసు రికార్డుల ప్రకారం ఆయనపై 1974–2007 మధ్య 38 క్రిమి నల్ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చాలా కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదల అయినప్పటికీ... అంతకుముందు వరకు ఆయనపై దొంగతనం, దోపిడి, హత్య, హత్యాయత్నం, బెది రింపులు, అపహరణలు వంటి పలు ఆరోపణలతో గ్యాంగ్స్టర్స్, గూండాల వ్యతిరేక చట్టాల కింద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. తన రాష్ట్రంలోని నేరస్థులందరినీ అంతమొందిస్తానని ప్రకటించిన యోగి, బ్రిజ్ భూషణ్ని కనీసం అరెస్ట్ చేయించేందుకైనా ఇష్టపడటం లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం... గత కొన్ని రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్న మహిళా రెజ్లర్ల మొర ఆలకించడానికి ముందుకు రాలేదు. దీంతో హరియాణా, ఉత్తర ప్రదేశ్లలోని జాట్లు ధీశాలురైన తమ ఆడబిడ్డల పోరాటానికి మద్దతుగా నిలబడేందుకు నిర్ణయించుకున్నారు. దీనిపై వివిధ ప్రాంతాలలోని ఖాప్ పంచాయితీలను ఆశ్రయించనున్నట్లు వారు ప్రకటించారు. నెమ్మదిగా ఈ ఉద్యమం 2020లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శూద్ర వ్యవసాయ సంఘాలు జరిపిన రైతు ఉద్యమ రూపాన్ని సంతరించుకోనుంది. ఢిల్లీ అంతర్మార్గాలలోని ఇండియా గేట్, జంతర్ మంతర్ వగైరాలు ఇప్పటికే ఈ విధమైన ఘర్షణ ధోరణులకు సాక్షులుగా ఉన్నాయి. ఇప్పుడిక జాట్ రైతులకు, యూపీ క్షత్రియ పాలక దళాల మధ్య యుద్ధ వాతా వరణాన్ని ఆ మార్గాలు వీక్షించబోతున్నాయి. తులసీదాసు రచించిన ‘రామచరితమానస్’లో శూద్రులను అవ మాన పరిచేలా ఉన్న భాషను, భావాన్ని ఖండిస్తూ ఉత్తరప్రదేశ్లో ‘గర్వ్ సే కహో హమ్ శూద్రా హై’ ఉద్యమం జరిగింది. ఇప్పుడేమిటంటే... శూద్ర మహిళలు, అధికారంలో ఉన్న క్షత్రియ పురుషుల మధ్య యుద్ధం మొదలైంది. యూపీ ముఖ్యమంత్రి రాజ్పుత్యేతర నేరస్థులను హతమార్చమని ఆదేశాలు ఇవ్వడం లేదనీ, ఓబీసీ/ఎస్సీ నేరస్థులను చంపమని ఆదేశిస్తున్నారనీ ఆఖిలేష్ యాదవ్ చెబు తున్నారు. ఏమైనా దేశం ఇప్పుడు చూస్తున్నటువంటి గొప్ప మహిళా క్రీడాకారుల ఉద్యమాన్ని మునుపెన్నడూ చూడలేదు. నిందితుడిపై చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించినప్పటికీ నిష్క్రియగా ఉండి పోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కంగనా రనౌత్, మధు కిష్వార్ వంటి వారైనా కనీసం నోరు మెదపలేదు. ఆర్ఎస్ఎస్, బీజేపీలను సమర్థిస్తుండే; ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై మాటలతో దాడి చేస్తుండే ఈ మహిళలు... మహిళా రెజ్లర్లపై జరిగిన లైంగిక వేధింపుల విషయంలో నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా పూర్తిగా మౌనం దాల్చింది. ఎందుకు? ఎందుకంటే వీళ్లంతా తాము అభిమానించే ఆకర్షణీయమైన స్త్రీల దేహాల మాదిరిగా మహిళా మల్లయోధుల శరీరాలు ఉండవని భావిస్తారు. కానీ ఈ రెజ్లర్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చివారు. వారి రెజ్లింగ్ జీవితం ఖరీదైన శిక్షణా సంస్థలలో రూపుదిద్దుకోలేదు. విశ్వ విద్యాలయాలలోని హిందుత్వ మహిళా మేధావులు, లేదా సినీ నటీమణుల మాదిరిగా కారు. ఒలింపిక్స్లో పతకాలు సాధించినప్ప టికీ వారి ఆర్థిక జీవనం మధ్యతరగతి పరిధిని దాటి పోలేదు. వీళ్లపై లైంగిక వేధింపులు జరిగినట్లే... ఆర్థిక స్థోమత, అగ్రకుల మహిళా సినీ నటులపై సాధారణ శ్రామిక వర్గానికి చెందిన పురుషులు వేధింపులు జరిపితే వారిని వెంటనే జైలుకు పంపేవారు. హిందూత్వ జాతీయవాద న్యాయ వ్యవస్థ అన్నది మతం ఆధా రంగా కూడా పని చేయదు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఆవిర్భావం ఉండీ భారతీయ ముస్లిములు, క్రైస్తవులకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని కలిగి ఉంది. అయితే ఇండియాలో జాట్లు కూడా తమను తాము హిందువులుగా పరిగణించుకుంటారు. వారి మహిళలు శతా బ్దాలుగా కఠినమైన శారీరక శ్రమ ద్వారా భారతదేశ నాగరికతను, సంస్కృతిని నిర్మించడంలో భాగస్వాములుగా ఉన్నవారు. జాట్ మహి ళల శారీర శ్రమ వారసత్వం నుండి వారి పిల్లలకు రెజ్లింగ్ నైపుణ్యాలు సంక్రమిస్తున్నాయి. కాగా రైతుల ఉద్యమ సమయంలో కూడా ప్రభుత్వం ఉదాసీన తను చూపింది. ఎందుకంటే వారు కష్టపడి పని చేసే రైతులు మాత్రమే. వారిలో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు లేరు. అదే ఉదాసీన తను ఇప్పుడు మహిళా రెజ్లర్ల విషయంలో చూపిస్తోంది. ఇప్పుడిక హరియాణా, యూపీలలోని జాట్లు తమ మహిళా రెజ్లర్లకు మద్ద తుగా ఖాప్ పంచాయితీలను ఆశ్రయించాలని చూస్తున్నారు. కులాంతర వివాహాలకు వ్యతిరేకంగా గతంలో వారు ఈ పంచాయితీల సహాయాన్నే కోరారు. వ్యక్తిగతంగా నేను సంప్రదాయ కుల పంచా యితీ వివాద వ్యవస్థను సమర్థించనప్పటికీ తమ సొంత సంస్థ ఛైర్మన్ నుంచి ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళా రెజ్లర్లకు దేశవ్యాప్త మద్దతు లభించాలన్నది నా ఆకాంక్ష. భారత రెజ్లింగ్ సమాఖ్య ఛైర్మన్గా బ్రిజ్ భూషణ్ సింగ్ను మోదీ ప్రభుత్వం ఎలా నియమించింది? ఆయన జీవితంలో ఆయనకు క్రీడ లతో సంబంధం లేదు. అతడి నేరమయ జీవితాన్ని కప్పిపుచ్చేందుకు, రామజన్మ భూమి అంశంలో అతడి ప్రమేయానికి గుర్తింపుగా అత్యంత కీలకమైన ఆ పదవిని కట్టబెట్టిన ట్లున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడాభివృద్ధి సంస్థలు ఆర్ఎస్ఎస్, బీజేపీల నెట్ వర్క్ కలిగిన యోగా కేంద్రాల వంటివి కావు. క్రీడలు యవతీయువ కుల జీవన్మరణ సాధనతో ముడివడి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం బ్రిజ్ భూషణ్ను డబ్లు్యఎఫ్ఐ ఛైర్మన్ పదవి నుంచి తొలగించి, ఆయనపై ఇప్పటికే నమోదై ఉన్న ఎఫ్ఐఆర్ ఆధారంగా తక్షణం విచారణ జరిపి శిక్ష విధించాలి. (గురువారం బ్రిజ్భూషణ్పై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఆయనపై ‘పోక్సో’ కేసును తొలగించాలని కూడా నివేదికను సమర్పించారు. - కంచె ఐలయ్య షెఫర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
బ్రిజ్భూషణ్పై చార్జ్షీట్ దాఖలు
మైనర్ను లైంగికంగా వేధించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై రెజ్లర్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టును రిలీజ్ చేశారు. మైనర్ను బ్రిజ్ భూషణ్ వేధించినట్లు ఆధారాలు లేవని పోలీసులు తమ చార్జ్షీట్లో తెలిపారు. బ్రిజ్పై మైనర్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టులో కోరారు. కాగా లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు దాదాపు 1000 పేజీల చార్జ్షీట్ రిపోర్టును తయారు చేశారు. కేవలం మైనర్ కేసు విషయంలో సుమారు 500 పేజీల నివేదికను పొందుపరిచారు. దాంట్లో ఆ కేసును రద్దు చేయాలని పోలీసులు సూచించారు.విచారణలో తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ పోలీసులు అధికారులు రిపోర్టును సమర్పించి 1500 పేజీలతో చార్జ్షీట్ దాఖలు చేశారు. కాగా పోలీసులు సమర్పించిన చార్జ్షీట్పై తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. ఏప్రిల్లో పోక్సో చట్టం కింద బ్రిజ్ భూషణ్పై ఓ మైనర్ అథ్లెట్ కేసు దాఖలు చేసింది. బ్రిజ్పై ఇచ్చిన స్టేట్మెంట్ను ఆ మైనర్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసుల రిపోర్టు ద్వారా తెలుస్తోంది. తనను ఎంపిక చేయకపోవడం పట్ల ఆగ్రహంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్పై కేసును ఫైల్ చేసినట్లు ఆ మైనర్ అథ్లెట్ వెల్లడించింది. చాలా కఠినంగా టోర్నీల కోసం వర్క్ చేశానని, కానీ తనను సెలెక్ట్ చేయలేదని, దాని వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయానని, ఆ కోపంతో బ్రిజ్పై లైంగిక వేధింపుల కేసు పెట్టినట్లు ఆ మైనర్ రెజ్లర్ పేర్కొన్నది. మైనర్ కేసు విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 173 కింద రిపోర్టును రూపొందించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. బాధిత మైనర్ తో పాటు ఆమె తండ్రి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నట్లు తెలిపారు. జూలై 4వ తేదీన మైనర్ కేసుపై కోర్టు విచారణ జరగనున్నది. చదవండి: 'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం' జూలై 3 నుంచి వింబుల్డన్.. ప్రైజ్మనీ భారీగా పెంపు -
జూలై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జూలై 6వ తేదీన నిర్వహిస్తారు. అదే రోజున ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం నియమించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మహేశ్ మిట్టల్ కుమార్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 23 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 28న వాటిని పరిశీలిస్తారు. జూలై 2న ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. -
రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా?
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక అఆరోపణలు చేస్తూ కన్నాట్ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేసిన ఇద్దరు మహిళా రెజ్లర్లకు సమన్లు పంపించారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం ఆరోపణలు చేసినదాని ప్రకారం వీడియోలు, ఆడియోలు, వాట్సాప్ చాటింగ్లు, ఫోటోలు, బెదిరింపు సందేశాలు వంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే స్టేషన్లో పొందుపరచాలని కోరింది. ఫిర్యాదు ప్రకారమే సమన్లు.. ఏప్రిల్ 21న భారత మహిళా రెజ్లర్లు ఇద్దరు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని, ఊపిరి చెక్ చేస్తానంటూ ఇష్టానుసారంగా మీద చేతులు వేస్తున్నారని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కన్నాట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటు తర్వాత ఈ కేసులో సత్వర విచారణ చేసి బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని భారత్ ప్రఖ్యాత రెజ్లర్లు నిరసన తెలుపుతోన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీనివ్వడంతో వివాదం సద్దుమణిగింది. సాక్ష్యాలున్నాయా? తాజాగా కన్నాట్ పోలీసులు కంప్లైంట్లో వారు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తమపై చేతులు వేసినట్టుగా కానీ, తమను ముట్టుకుంటున్నట్టుగా కానీ ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ సందేశాలు ఏమైనా ఉంటే తమకివ్వాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంతకాలు చేసిన నోటీసులను పంపించారు. ఇది కూడా చదవండి: ఆ రెజ్లర్ అసలు మైనరే కాదు.. బ్రిజ్ భూషణ్ కేసులో కొత్త ట్విస్ట్ -
ఆ రెజ్లర్ అసలు మైనరే కాదు.. బ్రిజ్ భూషణ్ కేసులో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షులు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సదరు ఎంపీ లైంగికంగా వేధించినట్టు కేసు నమోదు చేసిన రెజ్లర్ మైనర్ కాదంటూ స్వయంగా ఆమె తండ్రే తెలిపారు. దీంతో ఎంపీపై నమోదైన కేసుల్లో పోక్సో చట్టం కింద ఎంపీపై నమోదైన కేసు నుండి ఆయనకు ఉపశమనం లభించే అవకాశముంది. పతకాలు గంగలో... గత కొంత కాలంగా భారత రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఏప్రిల్ 29న నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరితగతిన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ భారత రెజ్లర్లు నిరవధికంగా నిరసన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నూతన పార్లమెంట్ వద్ద రెజ్లర్లపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం, రెజ్లర్లు దీన్ని అవమానంగా భావించి తాము సాధించిన పతకాలను గంగానదిలో కలిపేయాలనుకోవడం, రైతు సంఘం నాయకులు కల్పించుకుని రెజ్లర్లను వారించడం వంటి వరుస పరిణామాల మధ్య రెజ్లర్లు ఈ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. కేంద్ర మంత్రి హామీ... అనంతరం భారత టాప్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో ఆరు గంటల పాటు చర్చించి విచారణ విషయమై రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో అప్పటికి సమస్య సద్దుమణిగింది. తీరా చూస్తే... ఇంతలో ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణ చేసిన రెజ్లర్ సంఘటన జరిగే సమయానికి అసలు మైనరే కాదని స్వయంగా ఆమె తండ్రే వెల్లడించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు నమోదు చేసిన సమయంలో ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో పుట్టుక వివరాల్లో తప్పులు దొర్లాయని ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఎంపీపై పోక్సో చట్టం కింద నమోదైన కేసు నుంచి ఉపశమనం లభించే అవకాశముంది. ఇది కూడా చదవండి: రాతపూర్వక హామీ.. ఓ మెట్టుదిగిన రెజ్లర్లు -
రాతపూర్వక హామీ.. ఓ మెట్టుదిగిన రెజ్లర్లు
సాక్షి, ఢిల్లీ: రెజ్లర్ల నిరసనలో.. కేంద్రంతో రెజ్లర్ల చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించే ఉద్దేశంతో నిరసనలు కొనసాగిస్తున్న రెజ్లర్లు.. కేంద్రం నుంచి లభించిన హామీతో ఓ మెట్టు దిగారు. జూన్ 15వ తేదీ దాకా ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు బజరంగ్ పూనియా మీడియాకు వెల్లడించారు. బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో ఐదు గంటల పాటు రెజ్లర్లు భేటీ అయ్యారు. బ్రిజ్పై వచ్చిన ఆరోపణలపై జూన్ 15వ తేదీలోపు విచారణ పూర్తి చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన రెజ్లర్లకు స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బజరంగ్ పూనియా బయటకు వచ్చాక మీడియాకు తెలిపాడు. మంత్రి చెప్పిన తేదీ వరకు నిరసనలను ఆపేస్తామని, అప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోతే మాత్రం నిరసనలను ఉదృతం చేస్తామని పూనియా మీడియా ద్వారా తెలిపాడు. అలాగే కేంద్రంతో రెజ్లర్లు ఓ ఒప్పందానికి వచ్చారని, మైనర్ బాధితురాలు కూడా తన ఫిర్యాదును వెనక్కి తీసుకుందంటూ వస్తున్న కథనాలను పూనియా తోసిపుచ్చాడు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామే తప్ప.. వెనక్కి తగ్గబోమని ప్రకటించాడు. మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలను స్వతంత్రగా నిర్వహించాలని, బ్రిజ్ కుటుంబ సభ్యులెవరూ అందులో పాల్గొనకుండా చూడాలని కేంద్రాన్ని రెజ్లర్లు కోరినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తమపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని మంత్రి అనురాగ్ ఠాకూర్ను వాళ్లు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహిళా రెజ్లర్ల భద్రతను ప్రధానాంశంగా పరిగణిస్తామని, అలాగే.. వాళ్లపై ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకుంటామని మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం చర్చల సారాంశాన్ని మీడియాకు తెలిపారు. అయితే.. బ్రిజ్ అరెస్ట్పై మాత్రం ఇరువర్గాలు స్పందించకపోవడం గమనార్హం. ఇక ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక మైనర్తో పాటు ఆరుగురు రెజ్లర్ల ఫిర్యాదులు కూడా అక్కడే నమోదుకాగా.. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిణామాలతో జూన్ 15వ తేదీలోపు ఆ దర్యాప్తు పూర్తి చేసి.. నివేదిక సమర్పించాలని కేంద్రం, ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తెచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. -
కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. ఐదు డిమాండ్లు ఇవే..!
ఢిల్లీ:రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్తో నేడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఐదు డిమాండ్లను కోరినట్లు సమాచారం. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసన చేస్తున్నారు. ఇటీవలే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు కూడా. ఆయనతో చర్చల అనంతరం రెజ్లర్లు తమ విధుల్లోకి చేరారు. ఐతే ఆందోళన మాత్రం విరమించలేదు. దీంతో రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్ల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, దానికోసం రెజ్లర్లను మరోసారి ఆహ్వానించానని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు అర్థరాత్రి ట్వీట్ చేశారు. కేంద్రంతో రెజ్లర్లు సమావేశమవడం ఇది రెండోసారి. రెజ్లర్ల ఐదు డిమాండ్లు ఇవే.. 1.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి. 2.అయితే కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండకూడదు. 3. రెజ్లింగ్ పాలక మండలికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. 4. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున జరిగిన ఉద్రిక్తతలలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలి. 5.లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలి. ఇదీ చదవండి:రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. ఈసారి.. -
రెజ్లర్లతో మరోసారి కేంద్రం చర్చలు
-
రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. ఈసారి..
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసన చేస్తున్న తెలిసిందే. ఇటీవలే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు కూడా. ఆయనతో చర్చల అనంతరం రెజ్లర్లు తమ విధుల్లోకి చేరారు. ఐతే ఆందోళన మాత్రం విరమించడం లేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్ల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, దానికోసం రెజ్లర్లను మరోసారి ఆహ్వానించానని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ఈ ఆహ్వానాన్ని రెజ్లర్లు కూడా మన్నించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ని అరెస్టు చేయడం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు నిర్వహించి కొత్త చీఫ్ ఎన్నుకోవాలని డిమాండ్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. అలాగే క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా తాము ఎవర్నీ రక్షించాలనుకోవడం లేదని రెజ్లర్లకు ఈ సందర్భంగా తెలిపారు. The government is willing to have a discussion with the wrestlers on their issues. I have once again invited the wrestlers for the same. — Anurag Thakur (@ianuragthakur) June 6, 2023 ఇదిలా ఉండగా గత శనివారం అమిత్ షాతో రెజ్లర్ల సమావేశం అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ అమిత్ షాతో సమావేశం అనంతరం తిరిగి విధుల్లో చేరడం కాస్త చర్చనీయాంశంగా మారింది. కానీ రెజ్లర్లు మాత్రం న్యాయం కోసం జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు ఒలింపిక్స్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పునియా అమిత్ షాతో జరిగిన భేటీ గురించి మాట్లాడుతూ..ఆయనతో జరిగిన సమావేశం గురించి మాట్లాడవద్దని ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని అమిత్షా తెలిపారు. ఐతే నిరసన ఉద్యమం మాత్రం ఆగిపోలేదని, అది కొనసాగడమే గాక ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై వ్యూహ రచన చేస్తున్నామని పునియా చెప్పారు. ప్రభుత్వ ప్రతిస్పందనతో తాము సంతృప్తి చెందలేదని తేల్చి చెప్పారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని తెలిపారు. కాగా, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఒక మైనర్తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. అతడిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి సత్వర చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. VIDEO | Wrestler Sakshi Malik arrives at Union Minister Anurag Thakur's residence in Delhi. pic.twitter.com/htPQYKWjOR — Press Trust of India (@PTI_News) June 7, 2023 (చదవండి: అమిత్ షా ఇంటి వద్ద మణిపూర్ మహిళలు నిరసన) -
రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్భూషణ్ ఇంటికి పోలీసులు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి పోలీసులు వెళ్లడం ఆసక్తి కలిగించింది. ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఇంట్లో ఉన్న సుమారు 12 మంది నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. ఆ స్టేట్మెంట్లను రికార్డు చేశారు. వాంగ్మూలం ఇచ్చిన వారి పేర్లను, అడ్రస్, ఐడీ కార్డులను తీసుకున్నారు. సాక్ష్యం కోసమే ఆ డేటాను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్కు అనుకూలంగా ఉన్న అనేక మంది మద్దతుదారులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. బ్రిజ్పై లైంగిక వేధింపుల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటి వరకు 137 మంది నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. అయితే బ్రిజ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనని విచారించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియాలు రైల్వే ఉద్యోగాల్లో చేరడంతో ఆందోళన ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రెజ్లర్లు ఖండించారు. తాము ఆందోళన విరమించే ప్రసక్తే లేదని.. విధులు నిర్వహిస్తూనే తాము నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు. ''హింస లేకుండా ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలని ఆలోచిస్తున్నాం. మా సత్యాగ్రహాన్ని, ఉద్యమాన్ని బలహీనపరిచే కుట్ర ఇది. కేంద్ర హోంమంత్రితో సమావేశంలో తుది పరిష్కారం దొరకలేదు. మాకు హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు.'' అంటూ తెలిపారు. -
నిరసన నుంచి తప్పుకున్నట్లు వార్తలు.. రెజ్లర్ సాక్షి మాలిక్ క్లారిటీ
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు గత రెండు నెలలగా ఆందోళన చేస్తున్న విషయం విధితమే. అయితే ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రెజర్లు కలిసారు. ఈ క్రమంలో అమిత్ షాను కలిసిన తర్వాత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ పోరాటం నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. ఆమె తిరిగి రైల్వేలో తన విధుల్లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై సాక్షి మాలిక్ స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలే అని ఆమె కొట్టిపారేసింది. "ఇవన్నీ రూమర్స్ మాత్రమే. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. మాలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. వెనక్కి తగ్గే ఆలోచన కూడా మాకు లేదు. మేము ఉద్యోగాల్లో చేరనంత మాత్రాన ఈ ఆందోళన నుంచి తప్పుకున్నట్లు కాదు. మాకు న్యాయం జరిగేంతవరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాము. దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు అని ఆమె ట్విటర్లో పేర్కొంది. కాగా స్టార్ రెజర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నారు. ये खबर बिलकुल ग़लत है। इंसाफ़ की लड़ाई में ना हम में से कोई पीछे हटा है, ना हटेगा। सत्याग्रह के साथ साथ रेलवे में अपनी ज़िम्मेदारी को साथ निभा रही हूँ। इंसाफ़ मिलने तक हमारी लड़ाई जारी है। कृपया कोई ग़लत खबर ना चलाई जाए। pic.twitter.com/FWYhnqlinC — Sakshee Malikkh (@SakshiMalik) June 5, 2023 చదవండి: మనసున్న మారాజు వీరేంద్ర సెహ్వాగ్.. ఒడిశా రైలు ప్రమాద బాధిత పిల్లలకు..! -
బ్రిజ్భూషణ్ అరెస్ట్కు రెజ్లర్ల డిమాండ్.. లభించని అమిత్ షా హామీ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలనే ప్రధాన డిమాండ్పై చాలాకాలంగా ఢిల్లీ వీధుల్లో నిరసనలు తెలియజేస్తున్న రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఇవాళ కలిసారు. ఈ సందర్భంగా వారు అమిత్ షాతో తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. బ్రిజ్భూషణ్ తమను లైంగికంగా వేధించాడని వారు హోం మంత్రికి వివరించారు. బ్రిజ్భూషణ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని అమిత్ షాకు విన్నవించుకున్నారు. అయితే బ్రిజ్భూషణ్ అరెస్ట్పై రెజ్లర్లకు అమిత్ షా నుంచి ఎలాంటి హామీ రాలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అమిత్ షా రెజ్లర్లకు చెప్పినట్లు సమాచారం. -
రెజ్లర్లకు న్యాయం జరిగేనా? అమిత్ షాతో భేటీ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్న భారత రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తమ సమస్యను వివరించగా చట్టం తన పని తాను చేస్తుందని వారికి హామీ ఇచ్చారు. తొందరగా విచారణ చేయించండి... కొద్ది రోజులుగా భారత రెజ్లర్లు భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద కొన్నాళ్లపాటు సాగిన ఈ నిరసన నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున కీలక మలుపు తీసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఎలాగైనా ఆయనకు తమ గోడు చెప్పుకుందామని అటువైపుగా వెళ్తుంటే ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు భారత రెజ్లర్లపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. ఇన్నాళ్లుగా న్యాయంకోసం పోరాడుతుంటే ఎవరూ స్పందించకపోగా కేసులు పెట్టడం దారుణమని దీన్ని అవమానంగా భావించిన రెజ్లర్లు తాము సాధించిన పతకాలను గంగలో కలిపే ప్రయత్నం చేశారు. రైతు సంఘం నాయకులు నరేష్ తికాయత్ వారిని వారించగా ఆ ప్రయత్నాన్ని ఐదు రోజులపాటు వాయిదా వేశారు. దీంతో చివరి ప్రయత్నంగా రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియాన్ లు కేంద్ర హోంమంత్రిని కలిసి రెజ్లర్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్ భూషణ్ పై త్వరితగతిన విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. అందుకు హోంమంత్రి స్పందిస్తూ... చట్టంపై నమ్మకముంచండి. చట్టరీత్యా జరగవలసింది జరుగుతుందని హామీ ఇచ్చారు. -
రెజ్లర్లకు 1983 వరల్డ్కప్ విన్నింగ్ బ్యాచ్ మద్దతు..
రెజ్లర్లకు మద్దతు ఇస్తున్నవారిలో 1983 వరల్డ్ కప్ నెగ్గిన భారత మాజీ క్రికెటర్లు చేరారు. కపిల్దేవ్ నేతృత్వంలో ఈ బృందం సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేసింది. ‘మన చాంపియన్ రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే చాలా బాధ వేసింది. వారి ఫిర్యాదులు విని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే తమ పతకాలను పడేయడం వంటి తీవ్రమైన పనులు చేయవద్దని రెజ్లర్లను కోరుతున్నాం. ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల, త్యాగాల ఫలితం ఆ పతకాలు’ అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ‘సంయుక్త ప్రకటన’తో తనకు సంబంధం లేదని, తాను ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని ఈ జట్టులో సభ్యుడైన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పష్టం చేశారు. మరో వైపు నిందితుడిని ప్రధాని మోదీ రక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘25 అంతర్జాతీయ పతకాలు తెచ్చిన మన బిడ్డలు న్యాయం కోసం వీధికెక్కారు. 15 తీవ్ర ఆరోపణలతో రెండు ఎఫ్ఐఆర్లు నమోదైన వ్యక్తి ప్రధాన రక్షణ కవచంలో ఉన్నాడు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. చదవండి: IRE VS ENG One Off Test: టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..? -
రెజ్లర్ల నిరసనపై నోరు విప్పిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే!
ఢిల్లీ: భారత రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు.. కానీ న్యాయ ప్రక్రియ తర్వాతే అది జరుగుతుందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆందోళన చేపట్టి నెలదాటింది. పతకాలను గంగా నదిలో కలిపేస్తామని రెజ్లర్లు బెదిరించిన కొన్ని రోజుల తర్వాత అనురాగ్ ఠాకూర్ ఇలా స్పందించారు. 'ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తును ఆమోదిస్తుంది. బాధితులకు న్యాయం జరగాలని మనమందరం కోరుకుంటున్నాము. అయితే.. అది సరైన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. పక్షపాతానికి అవకాశమే లేదు. నిందితుడు ఎంపీ అయినందున కొంత ఆలస్యమవుతుంది.' అని ఠాకూర్ అన్నారు. దర్యాప్తు వేగంగా జరగాలని అందరం కోరుకుంటున్నామన్నారు. రెజ్లర్ల ప్రతి డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్పై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 'రెజ్లర్ అయినా మహిళ అయినా.. ఏదైనా అఘాయిత్యం జరిగితే బాధితులకు సత్వర న్యాయం జరగాలి' అని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి:రెజ్లర్ల అంశంపై రైతు నాయకుల మధ్య వాగ్వాదం..అరుస్తూ..ఒకరికొకరు వేళ్లు చూపుతూ.. -
రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న భారతీయ మహిళా రెజ్లర్ల ఆందోళనపై ప్రముఖ పారిశశ్రామికవేత్త హర్షగోయెంకా స్పందించారు. మహిళలకు తోటి మహిళలే అండగా లేకపోతే ఎలా? ఇంకెవరుంటారు అంటూ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. అంతేకాదు ప్రస్తుత దిగ్గజ క్రికెటర్లు తోటి క్రీడాకారులకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇదీ చదవండి: ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్! ఇది ఇలా ఉంటే బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు ఢిల్లీలో రెండు ఎఫ్ఐఆర్లు నమదు కావడం సంచలనం రేపింది. ఏళ్లుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులకు స్పందించిన ఢిల్లీ పోలీసులు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ 10 ఫిర్యాదులను నమోదు చేశారు. తమను అనుచితంగా తాకి, లైంగిక వేధింపులతో మనోవేదనకు గురిచేశారని మహిళా రెజర్లు ఆరోపించారు. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ సింగ్ మహిళా రెజ్లర్లను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలో నమోదు చేశారు. 2017, సెప్టెంబర్ లో ఆసియా ఇండోర్ గేమ్స్ కోసం కర్ణాటకలోని బళ్లారిలో శిక్షణ పొందుతున్నప్పుడు, శిక్షణ సమయంలో, గాయపడి దాదాపు మరణశయ్యపై ఉంటే, ఈమెయిల్ ద్వారా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినప్పటికీ నోటీసులు ఇచ్చారని, విచారణ కమిషన్ వేస్తామంటూ బెదిరించారని ఒక రెజ్లర్ వాపోయారు. సింగ్తోపాటు వినోద్ తోమర్పై ఆరోపణలు గుప్పించారు. (సూపర్ ఆఫర్: ఐపోన్13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) If women will not support other women, who will? If the current iconic cricketers not support their brethren, who will? — Harsh Goenka (@hvgoenka) June 2, 2023 -
రెజ్లర్ల అంశంపై రైతు నాయకుల మధ్య వాగ్వాదం..ఒకరికొకరు వేళ్లు చూపుతూ..
హరియాణా:రెజ్లర్ల అంశంపై చర్చించేందుకు హరియాణాలో సమావేశమైన 'ఖాప్ పంచాయతీ' సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వేదికపై సభ్యులు అరుస్తూ.. ఒకరికొకరు వేళ్లు చూపించుకున్నారు. గొడవకు గల కారణాలు తెలియనప్పటికీ ఈ వీడియో వైరల్గా మారింది. రెజ్లర్ల ఆందోళనపై తదుపరి చర్యలు తీసుకోవడానికి రైతులతో పాటు 31 మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఇందులో 9 మందితో కూడిన ప్రత్యేక కమిటి ఆ అంశాలలో దిశానిర్ధేశం చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. #WATCH | Scuffle breaks out between the members of Khap panchayat during their meeting in support of wrestlers' protest in Kurukshetra, Haryana pic.twitter.com/Nj15aQgxZ9 — ANI (@ANI) June 2, 2023 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆరోపించారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్,బజరంగ్ పునియాతో సహా పలువురు అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్న ఆటగాళ్లు బాధిత రెజ్లర్ల తరపున నిరసనలను చేపట్టారు. తమ పతకాలను గంగలో నిమజ్జనం చేస్తామని రెజ్లర్లు ప్రకటించి గత మంగళవారం హరిద్వార్కు వెళ్లారు.రైతు నాయకులు చివరి నిమిషంలో ఒప్పించి మద్దతు తెలపడంతో రెజ్లర్లు తమ ప్రణాళికలను మార్చుకున్నారు. రెజ్లర్లకు పలువురు రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలిపారు. 1983 ప్రపంచ కప్ గెలిచిన క్రికెట్ జట్టు సభ్యులు కూడా రెజ్లర్లకు అండగా నిలబడ్డారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ప్రభుత్వం ఆటగాళ్ల సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఖండించారు. ఆరోపణలు రుజువైతే ఉరివేసుకుంటానని అన్నారు. చదవండి:ఏడుగురిని ఒకే తరహాలో!.. బ్రిజ్ భూషణ్పై సంచలన నిందారోపణలు -
భారత రెజ్లర్లకు బీజేపీ ఎంపీ మద్దతు.. ‘ఒక మహిళగా అభ్యర్థిస్తున్నా’
మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే భారత రెజ్లర్ల వివాదంపై విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా భారత రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అయినా కూడా ఈ కేసులో విచారణ నత్తనడకన సాగడం దురదృష్టకరమని ప్రీతమ్ ముండే ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా కాకుండా ఒక మహిళగా విచారణ వేగవంతం చేయమని కోరుతున్నానని తెలిపారు. పెరుగుతోన్న వ్యతిరేకత... భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ భారత రెజ్లర్లు చేస్తోన్న నిరసన రోజురోజుకీ ఉధృత రూపం దాల్చుతోంది. స్వయంగా సొంత పార్టీకి చెందినవారే బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా ఈ కోవలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే చేరిపోయారు. విచారణ జరుగుతున్న తీరు విచారకరం... ఓ ప్రెస్ మీట్లో ప్రీతమ్ ముండే మాట్లాడుతూ.. ‘ఒక మహిళ నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ముందు విచారణ చేపట్టాలి. అలా చేయకుండా కాలయాపన చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇంతకాలం వారు కష్టపడి సాధించిన పతకాలను గంగానదిలో వేయడానికి సిద్దపడ్డారంటేనే వారు ఎంత వ్యధను అనుభవిస్తున్నారో నాకు అర్ధమవుతోంది. వారి బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నేను బీజేపీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధినే అయినా కూడా ఈ కేసులో విచారణ జరుగుతున్న తీరు పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. దయచేసి విచారణను వేగవంతం చేసి, వీలైనంత తొందరగా నిజానిజాలు తేల్చి వారికి న్యాయం చేయండి. ఒక ఎంపీగా కాకుండా ఒక మహిళగా అభ్యర్ధిస్తున్నాను’ అని అన్నారు. చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్.. -
బ్రిజ్ భూషణ్ పై నమోదైన FIRలో షాకింగ్ వివరాలు
-
బ్రిజ్ భూషణ్పై సంచలన నిందారోపణలు
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై సంచలన నిందారోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా అథ్లెట్లను అసభ్యంగా తాకుతూ.. లైంగికంగా వేధించినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఒకవైపు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఆ ఎఫ్ఐఆర్ కాపీల్లో సారాంశం ఇప్పుడు బయటకు వచ్చింది. మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీ కన్నౌట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో కిందటి నెలలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అందులో ఆరుగురి ఫిర్యాదుతో ఒక ఎఫ్ఐఆర్, మైనర్ తండ్రి ఫిర్యాదు మేరకు మరో ఎఫ్ఐఆర్ను పోలీసులు ఫైల్ చేశారు. ఏప్రిల్ 21వ తేదీన ఫిర్యాదులు అందగా.. వారం తర్వాత వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. दरिया अब तेरी ख़ैर नहीं, बूँदो ने बग़ावत कर ली है नादां ना समझ रे बुज़दिल, लहरों ने बग़ावत कर ली है, हम परवाने हैं मौत समाँ, मरने का किसको ख़ौफ़ यहाँ रे तलवार तुझे झुकना होगा, गर्दन ने बग़ावत कर ली है॥ pic.twitter.com/a5AYDkjCBu — Vinesh Phogat (@Phogat_Vinesh) May 29, 2023 ఇక ఎఫ్ఐఆర్లో.. బ్రిజ్పై రెజ్లర్ల ఫిర్యాదు మేరకు సంచలన నిందారోపణలను పోలీసులు చేర్చారు. శ్వాస పరీక్ష పేరిట అభ్యంతరకరంగా తాకడంతో పాటు, వాళ్లను ఇష్టానుసారం పట్టుకోవడం, వ్యక్తిగత ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టడం, లైంగిక కోరికలు తీర్చమని ఒత్తిడి చేయడం, టోర్నమెంట్లలో గాయాలు అయినప్పుడు ఆ ఖర్చులు ఫెడరేషన్ భరిస్తుందని ఆశజూపి వాళ్లను లోబర్చుకునే ప్రయత్నం చేయడం, కోచ్గానీ.. డైటీషియన్గానీ ఆమోదించని ఆహారం అందించడం, అన్నింటికీ మించి మైనర్ వెంటపడడంతో పాటు ఆమెను లైంగికంగా తాకుతూ వేధించడం లాంటి నిందారోపణలను ఎఫ్ఐఆర్లో చేర్చారు. कभी सोचा नहीं था कुश्ती की रिंग में लड़ते लड़ते एक दिन इंसाफ़ के लिए ऐसे सड़कों पर भी लड़ना पड़ेगा…. देश की बेटियाँ बहुत मज़बूत हैं, जब विदेश में मेडल जीत सकती हैं तो अपने देश में इंसाफ़ की लड़ाई भी जीतके ही मानेंगी। #WrestlerProtest pic.twitter.com/eTHzERBUwb — Sakshee Malikkh (@SakshiMalik) May 28, 2023 ‘‘ఆరోజు(ఫలానా తేదీ..) నేను శిక్షణలో భాగంగా మ్యాట్ మీద పడుకుని ఉన్నాను. నిందితుడు(బ్రిజ్) నా దగ్గరకు వచ్చాడు. అతని ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ టైంలో నా కోచ్ అక్కడ లేరు. నా అనుమతి లేకుండా నా టీషర్ట్ను లాగేశాడు. నా ఛాతీపై చెయ్యి వేశాడు. ఆ చెయ్యిని అలాగే కడుపు మీదకు పోనిచ్చి.. నా శ్వాసను పరీక్షిస్తున్న వంకతో నన్ను వేధించాడు’’ అని అవార్డు సాధించిన ఓ రెజ్లర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగతా ఆరుగురి ఫిర్యాదులన్నీ దాదాపు పైతరహాలో ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ ఆరోపణలన్నింటినీ మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నాడు. ఆరోపణల్లో ఒక్కటి రుజువైనా.. తనను తాను ఉరి తీసుకుంటానని బుధవారం స్టేట్మెంట్ ఇచ్చాడాయన. అలాగే.. రెజ్లర్ల దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని కోర్టుకు సమర్పించాలని, నేరం రుజువైతే శిక్షను తాను అభవిస్తానని అంటున్నాడు. 🙏 pic.twitter.com/4LzKaVTYo4 — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 30, 2023 ఇదీ చదవండి: బీజేపీలో ఉన్నానంటే ఉన్నా.. అంతే! -
రెజ్లర్లకు మద్దతుగా రైతుసంఘాల మహాపంచాయత్
-
Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి!
నెలల తరబడి రెజ్లర్లంతా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు చేయడమే గాక తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తామని హెచ్చరించారు కూడా. ఐనా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నోరు మెదపలేదు. అలాంటిది తొలిసారిగా ఆ విషయమైన సాక్షాత్తు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడటం విశేషం. రెజ్లర్లు రోజుకో డిమాండ్తో వస్తున్నారని ఆరోపణలు చేశారు. క్రీడను, క్రీడాకారులను బాధించే ఎటువంటి చర్య తీసుకోవద్దని పునరుద్ఘాటించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసన చేసిన ప్రాంతానికి రాజకీయ నాయకులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారని మండిపడ్డారు. అయినా ఇది రాజకీయాలు చేయడానికి వేదిక కాదని రెజ్లర్లే చెప్పారు కానీ వారంతా వచ్చారు. ఐనా తాను దీని గురించి పెద్దగా వ్యాఖ్యానించనన్నారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముగిసే వరకు వేచి ఉండమని మాత్రమే అథ్లెట్లను కోరుతున్నా. ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలియజేసేలా ఎఫ్ఆర్ దాఖలు చేశారు దర్యాప్తు వరకు పూర్తి అయ్యింది. దయచేసి క్రీడకు, ఆటగాళ్లకు హాని కలిగించే ఏ చర్య తీసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. అలాగే ఈ సమస్యపై విచారకు కమిటీ వేయాలన్న రెజ్లర్ల డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించింది. వారు నిరసన వ్యక్తం చేస్తున్న ఫెడరేషన్ చీఫ్ని కూడా తొలగించారు. అంతేగాదు క్రీడాకారుల శిక్షణ, క్రీడా మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది. ఇప్పుడు కూడా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పనిచేస్తోంది అని అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ టైంలో నిరసనకు యత్నించిన రెజ్లర్లపై పోలీసుల చర్యకు సంబంధించిన దృశ్యాలు యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేశాయి. ఆ తదనందర ఈ అంశంపై మొట్టమొదటిసారగా ప్రభుత్వం వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎలాంటి శిక్షను స్వీకరించడానికైనా సిద్ధమేనని అన్నారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానని చెప్పారు. రెజ్లర్లను ఉద్దేశిస్తూ.. మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకి సమర్పించండి అని సవాలు కూడా విసిరారు సదరు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్. (చదవండి: కొందరు నేతలు ఆ వ్యాధితో బాధపడుతున్నారు.. ప్రధాని మోదీ కూడా!: రాహుల్) -
Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే
Wrestlers’ protest against Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజధాని ఢిల్లీ వేదికగా మహిళా రెజ్లర్లు, వారికి మద్దతుగా బజ్రంగ్ పునియా తదితరులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. కాగా బ్రిజ్ భూషణ్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను ఆమె అంకుల్నంటూ వీడియో విడుదల చేశాడు. ఆమె మైనర్ కాదంటూ వీడియో అందరూ అనుకుంటున్నట్లు సదరు రెజ్లర్ మైనర్ కాదని, ఆమె వయసు దాదాపు 20 ఏళ్లకు పైనే అంటూ ఆధారాలుగా కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సదరు వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మండిపడ్డ స్వాతి మలివాల్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఈ మేరకు.. ‘‘బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా కేసు పెట్టిన మైనర్కు అంకుల్నంటూ ఓ వ్యక్తి మీడియా ముందు ఆమె ఐడెంటీని బయటపెట్టాడు. చట్టవిరుద్ధ చర్యకు పాల్పడిన అతడిపై పోక్సో చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు నేను నోటీస్ జారీ చేస్తున్నాను. ఎందుకంటే.. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. కాబట్టి ఆయన బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని స్వాతి మలివాల్ బుధవారం ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంలో సింగ్ ప్రమేయం కూడా ఉందేమో విచారించి.. ఆయనను అరెస్టు చేయాల్సిందిగా మహిళా కమిషన్ తరఫున డిమాండ్ చేశారు. రెజ్లర్ల పట్ల పోలీసుల చర్యపై ఆగ్రహం కాగా భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తదితరులు గత కొన్ని రోజులుగా బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలనే డిమాండ్తో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలు సహా కొంతమంది క్రీడాకారులు వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించగా.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో తాము సాధించిన పతకాలు గంగలో నిమజ్జనం చేస్తామంటూ వాళ్లు హరిద్వార్ బయల్దేరగా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఆ ప్రయత్నం విరమించారు. ఇదిలా ఉంటే.. భారత రెజ్లర్లపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య విచారం వ్యక్తం చేసింది. భారత్లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ WTC: నెట్స్లో శ్రమిస్తున్న యశస్వి.. దగ్గరకొచ్చి సలహాలు ఇచ్చిన కోహ్లి! వీడియో -
హరిద్వార్ దగ్గర హైడ్రామా..
-
అదీ.. వాళ్ల వైఖరి: బ్రిజ్ భూషణ్
ఢిల్లీ: ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదిలేస్తామని, ఆఫ్ట్రాల్ మెడల్స్ ఎంతని చెబుతూ.. తమ ఘనతలను గంగలో నిమజ్జనం చేసేందుకు భారత రెజ్లర్లు సిద్ధపడ్డారు. అయితే హరిద్వార్ వద్ద చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఆగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రెజ్లర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్.. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు కదా! అని రెజ్లర్లకు గుర్తు చేశారాయన. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు చేసిన ఆరోపణల్లో ఏమైనా నిజం ఉందని తేలితే.. అప్పుడు అరెస్ట్ జరుగుతుంది కదా పేర్కొన్నారాయన. ఇక గంగలో మెడల్స్ను విసిరేస్తామని రెజ్లర్లు హెచ్చరించడంపైనా ఆయన స్పందిస్తూ.. ‘‘హరిద్వార్కు వెళ్లారు. గంగలో పతకాలను నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. కానీ, తర్వాత వాటిని తికాయత్కు(రైతు సంఘాల నేత) అప్పగించారు. ఇదేనా వాళ్ల వైఖరి.. ఇంతకన్నా మనం ఏం చేయగలం అంటూ పెదవి విరిచారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో ఆవైపుగా ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము సాధించిన మెడల్స్ ను మంగళవారం సాయంత్రం హరిద్వార్లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బ్రిజ్ భూషణ్ పై చర్చలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తమను ‘మా బిడ్డలు’ అని అంటూ ఉంటారని, కానీ ఆయన కూడా తమ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. తమను అణచివేస్తున్న బ్రిజ్ భూషణ్ను నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారన్నారు. ఆయన తళతళ మెరిసే తెల్లని దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చారని మండిపడ్డారు. ఆ కాంతిలో తాము వెలిసిపోయామని చెప్పారు. ఈ క్రమంలో గంగలో మెడల్స్ను నిమజ్జనం చేసేందుకు మంగళవారం సాయంత్రం హరిద్వార్ వద్దకు రెజ్లర్లు చేరుకోగా.. అక్కడ హైడ్రామా నెలకొంది. అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు సైతం ప్రయత్నించాయి. అయితే రైతు సంఘం నేత నరేష్ తికాయత్ జోక్యంతో రెజ్లర్లు శాంతించి.. బ్రిజ్పై చర్యలకు కేంద్రానికి ఐదురోజుల గడువు విధించారు. -
'45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే వేటు తప్పదు'
స్విట్జర్లాండ్: భారత స్టార్ రెజ్లర్లపై పోలీసు చర్యను ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) తీవ్రంగా ఖండించింది. టాప్స్టార్లపై పోలీసు జులుంపై విచారం వ్యక్తం చేసింది. తమ సమాఖ్య కొన్ని నెలలుగా భారత్లోని రెజ్లర్ల నిరసన కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోందని తెలిపింది. లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాలనే డిమాండ్తో ఒలింపిక్, ఆసియా క్రీడల పతక విజేతలు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా తదితరులు చేస్తున్న నిరసన తమ దృష్టికి వచ్చిందని యూడబ్ల్యూడబ్ల్యూ ఈ సందర్భంగా తెలిపింది. గతంలో ప్రకటించినట్లుగా 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని ఈ సందర్భంగా ప్రపంచ సమాఖ్య హెచ్చరించింది. -
Wrestlers Protest: రైతు నేతల విజ్ఞప్తి.. పతకాలు గంగానదిలో వేయడం వాయిదా..
న్యూఢిల్లీ: హరిద్వార్ వద్ద గంగానదిలో పతకాలను విసిరేస్తామన్న రెజ్లర్లు.. తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. రైతు నేతల విజ్ఞప్తితో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు కేంద్రానికి అయిదు రోజుల గడువిస్తూ అల్టీమేటం జారీ చేశారు. అయిదు రోజుల్లో బ్రిజ్ భూషన్ సింగ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మళ్లీ తిరిగి వస్తామని తెలిపారు. రెజ్లర్ల పతకాలను రైతు నేత నరేష్ తన వెంట తీసుకెళ్లారు. కాగా బీజేపీ ఎంపీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరు నెలల నుంచి ఢిల్లీలో నిరసన చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తాము కష్టపడి గెలుచుకున్న మెడల్స్ను పవిత్ర గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు విసిరేస్తామని ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేస్తామని తెలిపారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు.కాబట్టి ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో నిరసనగా తమ పతకాలను నదిలో వేయడానికి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని గంగా నది తీరానికి చేరుకున్నారు. పతకాలను గంగానదిలో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెజ్లర్లు అక్కడే ధర్నాకు దిగారు. అయితే రెజ్లర్లు పతకాలను గంగా నదిలోకి విసిరేందుకు సిద్ధమవుతున్న వేళ రైతు నాయకుడు నరేష్ టికాయత్ హరిద్వార్ హర్ కి పౌరీకి చేరుకున్నారు. ఆయన జోక్యం చేసుకొని పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేయొద్దని నిరసన తెలుపుతున్న మల్లయోధులను కోరారు. దీంతో తమ నిర్ణయాన్ని రెజ్లర్లు వాయిదా వేసుకున్నారు. హరిద్వార్లోని హర్ కీ పౌరి నుంచి వెనక్కి బయల్దేరారు. కాగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. చదవండి: మణిపూర్లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం -
మెడల్స్ ను గంగ లో విసరనున్న రేస్లర్స్ ..
-
పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్కు చేరుకున్న రెజ్లర్లు
భారత అగ్ర రెజ్లర్ల నిరసన రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్త ఘర్షణలకు దారితీయడంతో వారిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని నిరహారదీక్ష చేపట్టేందుకు దారితీసింది. ఈ మేరకు భారత అగ్ర స్థాయి రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తాం, ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్కు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. #WATCH | Uttarakhand: Wrestlers reach Haridwar to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations.#WrestlersProtest pic.twitter.com/WKqSJQyaH0 — ANI (@ANI) May 30, 2023 అంతకుముందు రెజ్లర్ సాకి మాలిక్ ట్విట్టర్ వేదికగా తమ రెజ్లర్లంతా హరిద్వార్ వెళ్లి గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు పతకాలను విసిరేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ట్వీట్ చేశారు. అయిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ మమ్మల్ని వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్ మనిపించడం మమ్మల్ని కలిచివేసింది. అతను అలా తెల్లటి దుస్తులు ధరించడంలో అర్థం తానే వ్యవస్థ అని చెప్పకనే చెప్పినట్లు ఉందని ట్విట్టర్లో రెజ్లర్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. అందుకనే మాకు ఈ పతకాలు వద్దు. ఆ వ్యవస్థ మాకు పతకాలు మెడలో వేసి ముసుగు వేసి గొప్ప ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ పునియా తదితర రెజ్లర్లు ఏప్రిల్ 26 నుచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు శరణ్సింగ్పై రెండు కేసులు నమోదు చేశారు. ఐతే రెజ్లర్లు మాత్రం అతన్నిఅరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో సహ చాలామంది మద్దతు వారికి లభించడం గమనార్హం. అదీగాక ఇటీవల జరిగిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వెలుపలు రెజ్లర్లు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు యత్నించారు. ఐతే ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరవధిక నిరహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. "We will throw our medals in river Ganga in Haridwar today at 6pm," say #Wrestlers who are protesting against WFI (Wrestling Federation of India) president Brij Bhushan Sharan Singh over sexual harassment allegations pic.twitter.com/Mj7mDsZYDn — ANI (@ANI) May 30, 2023 (చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన..వృధా చేసిన నీటికి డబ్బు చెల్లించమంటూ లేఖ) -
Wrestlers Protest: వాళ్లనలా చూశాక నిద్రే రాలేదు: బింద్రా
న్యూఢిల్లీ: పోలీసు నిర్బంధం నుంచి ఆదివారం రాత్రి విడుదలైన భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ‘మా తదుపరి కార్యాచరణ ఏంటనేది త్వరలోనే వెల్లడవుతుంది. మేమంతా ఇంకా కలుసుకోలేదు. మమ్మల్ని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. నన్ను అర్ధరాత్రి దాటాక విడిచి పెట్టారు. మిగతా రెజ్లర్లను రాత్రి 11 గంటలకు విడుదల చేశారు. అందువల్లే అందరం కలువలేకపోయాం. అంతా కలిసి చర్చించుకున్నాకే తదుపరి పోరాటానికి దిగుతాం’ అని బజరంగ్ తెలిపాడు. మరోవైపు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు రెజ్లర్లు మళ్లీ నిరసన చేసేందుకు అనుమతి కోరితే ఇస్తామని, అయితే జంతర్మంతర్ వద్ద మాత్రం శిబిరానికి అనుమతి లేదని, ఢిల్లీలో ఇంకెక్కడైనా దీక్ష చేపట్టవచ్చని ట్విట్టర్లో పేర్కొన్నారు. వాళ్లనలా చూశాక నిద్రే రాలేదు: బింద్రా దేశానికి ఒలింపిక్, ఆసియా క్రీడల్లో పతకాలు తెచ్చిపెట్టిన రెజ్లర్లతో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని బీజింగ్ ఒలింపిక్స్ (2008) చాంపియన్ షూటర్ అభినవ్ బింద్రా అన్నాడు. మహిళా రెజ్లర్లపై దాష్టీకానికి పాల్పడిన దృశ్యాలు తనను కలచివేశాయని రాత్రంత నిద్రేలేకుండా చేసిందని ట్వీట్ చేశాడు. స్టార్ రెజ్లర్లతో ఖాకీల కాఠిన్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కానే కాదని భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి అన్నాడు. రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకెళ్లిన చిత్రాలు తనను బాధించాయని, సాధ్యమైనంత త్వరలో వారి సమస్య పరిష్కరించాలని మాజీ క్రికెట్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్లో కోరారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు -
రెజ్లర్లను అడ్డుకున్న పోలీసులు
రెజ్లర్లను అడ్డుకున్న పోలీసులు -
'అది మేము కాదు.. మా ఫోటోలను మార్ఫింగ్ చేశారు!'
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా టాప్ రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు శాంతియుత ర్యాలీ చేపట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీకి వెళ్తున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫొటోల్లో వినేశ్ ఫోగట్, సంగీత ఫోగట్ పోలీసు వ్యాన్లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉంది. ఈ ఫొటోలపై రెజ్లర్లు స్పందించారు. తమ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపించారు. ''కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI Technology) ఉపయోగించి మొహాలనే మార్చేస్తున్నారు.. మేమెంత చెప్పండి.. మా నిరసనపై బురద జల్లే ప్రయత్నంలో కొందరు గిట్టని వ్యక్తులు ఇలాంటి తప్పుడు చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నకిలీ ఫొటోను పోస్ట్ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తాం'' అని భజరంగ్ పునియా ట్వీట్ చేశాడు. దీనిపై సాక్షి మలిక్ స్పందిస్తూ..''అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు'' అని మండిపడ్డారు. IT Cell वाले ये झूठी तस्वीर फैला रहे हैं। हम ये साफ़ कर देते हैं की जो भी ये फ़र्ज़ी तस्वीर पोस्ट करेगा उसके ख़िलाफ़ शिकायत दर्ज की जाएगी। #WrestlersProtest pic.twitter.com/a0MngT1kUa — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 28, 2023 చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం -
‘కాలుస్తావా.. ఎక్కడికి రావాలో చెప్పు’.. రిటైర్డ్ ఐపీఎస్కు బజరంగ్ పూనియా ఛాలెంజ్
న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ రాజకీయ ప్రముఖుడిపై కేంద్రం సరిగా స్పందించకపోవడంతో రెజర్లు ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు వారి అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద రెజర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై రిటైర్డ్ ఐపీఎస్ ఒకరు ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా..ధీటుగా బదులిచ్చారు. కాల్పుల అంశంపై పునియా అన్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ రిటైర్డ్ ఐపీఎస్, కేరళ పోలీస్ మాజీ చీఫ్ ఎన్ సీ ఆస్తానా ఈ రకంగా ట్వీట్ చేశారు. ‘పరిస్థితులు బట్టి మీపై కాల్పులు జరుపుతారు తప్ప మీరు చెబితే కాదు. ఒక బస్తా చెత్తను పడేసినట్లే.. మిమ్మల్ని లాగి పడవేస్తాం. సెక్షన్ 129 ప్రకారం పోలీసులకు కాల్చులు జరిపే అధికారం ఉంది. సమయం వస్తే ఆ కోరిక నెరవేరుతుంది. అందుకే మీరు ముందుకు చదువుకుని ఉండాలి. పోస్ట్మార్టం టేబుల్పై మళ్లీ కలుద్దాం’’ అంటూ రెజర్లను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ పై పునియా స్పందిస్తూ.. ‘‘ఈ ఐపీఎస్ అధికారి మమ్మల్ని కాల్చడం గురించి మాట్లాడుతున్నారు. సోదరా, మేము మీ ముందు ఉన్నాం, ఎక్కడికి రావాలో చెప్పండి. మీ బుల్లెట్లకు మా చాతీని చూపుతామని మీకు ప్రమాణం చేస్తున్నా. ఇప్పటి వరకు రెజర్లు బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది అదొక్కటే, అది కూడా తీసుకురండి’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. ये IPS ऑफिसर हमें गोली मारने की बात कर रहा है। भाई सामने खड़े हैं, बता कहाँ आना है गोली खाने… क़सम है पीठ नहीं दिखाएँगे, सीने पे खाएँगे तेरी गोली। यो ही रह गया है अब हमारे साथ करना तो यो भी सही। https://t.co/jgZofGj5QC — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 29, 2023 చదవండి: Delhi Shahbad Dairy Case:: గాళ్ఫ్రెండ్తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
ఇక నో మోర్ పర్మిషన్.. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనపై పోలీసుల నిర్ణయం
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన సందర్భంగా నిన్న(ఆదివారం) పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ నిరసనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని 12 మందిపై కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు షాక్ ఇచ్చారు. ఇక నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతుల కోసం గనుక వాళ్లు దరఖాస్తు చేసుకుంటే.. జంతర్ మంతర్ కాకుండా వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. ‘‘వాళ్లు(రెజ్లర్లు) పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్ను చేపట్టి.. చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అందుకే జంతర్ మంతర్ వద్ద వాళ్లు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది!. రెజ్లర్లు గనుక భవిష్యత్తులో మళ్లీ నిరసనకు దరఖాస్తు చేస్తే.. జంతర్ మంతర్ కాకుండా అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తాం అని డీసీపీ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.. कुश्ती पहलवानों का धरना और प्रदर्शन निर्बाध तरीक़े से जंतर मंतर की सूचित जगह पर चल रहा था। कल, प्रदर्शकारियों ने तमाम आग्रह और अनुरोध के बावजूद कानून का उन्मादी रूप से उल्लंघन करा। अतः चल रहे धरने को समाप्त कर दिया गया है। — DCP New Delhi (@DCPNewDelhi) May 29, 2023 ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగాయి. మొత్తం 38 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగింది. భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేదించారని, అతన్ని అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెండు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కానీ, రెజ్లర్లు మాత్రం బ్రిజ్ను అరెస్ట్ చేసే దాకా నిరసనలు ఆపమని చెబుతున్నారు. VIDEO | Security heightened at Jantar Mantar in Delhi ahead of the 'Mahila Samman Mahapanchayat' called by protesting wrestlers today. pic.twitter.com/rP0EXvLuwg — Press Trust of India (@PTI_News) May 28, 2023 Video Source: PTI News అవి మార్ఫింగ్ ఫొటోలు ‘‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావడం లేదు. మాకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’’.. అరెస్టు తర్వాత వ్యానులో వినేష్, సంగీత ఫొగాట్లు నవ్వుతున్నట్లు ఉన్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రెజ్లర్ సాక్షి మాలిక్ పై విధంగా స్పందించారు. ఇదీ చదవండి: రాజదండం ఎవరి కోసం? -
తొలిరోజే 'సెంగోల్' ఒరిగిపోయింది!: స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ ప్రారంభోత్సవం తొలిరోజే ప్రతిష్టించిన చారిత్రాత్మక సెంగోల్ ఒరిగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మక సెంగోల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. సరిగ్గా ప్రారంభోత్సవం రోజే ధర్మానికి ప్రతీక, మన చారిత్రక సంప్రదాయం అపహాస్యం పాలైందంటూ విమర్శలు కురిపించారు స్టాలిన్. భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత రెజ్లర్లు పార్లమెంట్ కొత్త భవనం వెలుపల నిరసన చేసేందుకు యత్నించడంతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్నా ఇంతవరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైగా శాంతియుతంగా పార్లమెంట్ వెలుపల నిరసన చేసేందుకు వచ్చిన రెజ్లర్లను ఈడ్చుకెళ్తూ..వారిని అదుపులోకి తీసుకెళ్లడం అనేది తీవ్రంగా ఖండించదగినదన్నారు. న్యాయం చేయలేక ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ తొలిరోజే వంగినట్లు కనిపించింది అని మండిపడ్డారు. రాష్ట్రపతిని పక్కకు తప్పించి, ప్రతిపక్షాల బహిష్కరణల మధ్య కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున ఇలాంటి దారుణం జరగడం న్యాయమేనా? అని డీఎంకే నేత స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. (చదవండి: శుభోదయం.. నవోదయం) -
శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు కొన్ని వారాలుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించిన రెజ్లర్ సంఘ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్పై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు గత కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి పూర్తి మద్దతు లభించింది. అయితే ఆదివారం రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఆదివారం కొత్త పార్లమెంటు వైపు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఇవాళే కొత్తగా ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్భూషణ్పై చర్యలకు డిమాండ్ చేస్తూ ''మహిళా మహాపంచాయత్'' నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్మంతర్ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నారు. కాగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడుతున్నారు. మేం బారీకేడ్లు విరగొట్టామా..? ఇంకేమైనా హద్దులు మీరామా..? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they try to march towards the new Parliament from their site of protest at Jantar Mantar.Wrestlers are trying to march towards the new Parliament as they want to hold a women's Maha Panchayat in front of… pic.twitter.com/3vfTNi0rXl— ANI (@ANI) May 28, 2023 #WATCH | Mahapanchayat will certainly be held today. We're fighting for our self-respect.They're inaugurating the new Parliament building today, but murdering democracy in the country.We appeal to the administration to release our people detained by police: Wrestler Bajrang Punia pic.twitter.com/VI4kGLxGWV— ANI (@ANI) May 28, 2023 To all my international fraternity Our Prime Minister is inaugurating our new parliamentBut on the other hand, Our supporters has been arrested for supporting us.By arresting people how we can call us “mother of democracy”India’s daughters are in pain.— Sakshee Malikkh (@SakshiMalik) May 28, 2023 जंतर मंतर पर सरेआम लोकतंत्र की हत्या हो रही एक तरफ़ लोकतंत्र के नये भवन का उद्घाटन किया है प्रधानमंत्री जी ने दूसरी तरफ़ हमारे लोगों की गिरफ़्तारियाँ चालू हैं. pic.twitter.com/ry5Wv9xn5A— Vinesh Phogat (@Phogat_Vinesh) May 28, 2023 చదవండి: స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త -
బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయాల్సిందే.. రెజ్లర్లకు బాబా రాందేవ్ సపోర్ట్
ఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్పై భారత్ స్టార్ రెజ్లర్ల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాము చేసిన ఆరోపణలపై న్యాయం చేయాలని కోరుతూ స్టార్ రెజ్లర్లు కొద్దిరోజులుగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ్ తన మద్దతు ప్రకటించారు. రాజస్థాన్లోని భిల్వారాలో మూడు రోజుల పాటు జరుగుతున్న యోగా కార్యక్రమాలకు బాబా రాందేవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ టాప్ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా సిగ్గు చేటు. అలాంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అతడు తల్లులు, బిడ్డలు, అక్క చెల్లెళ్ల గురించి ప్రతిరోజూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అతడి తీరు ఖండించదగినది’ అని కామెంట్స్ చేశారు. అంతకుముందు కూడా రెజ్లర్ల ఆందోళనపై బాబా రాందేవ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘రెజ్లర్లు ఒలింపిక్స్లో దేశానికి ఖ్యాతి తెచ్చినప్పుడు సంబురాలు చేసుకున్నాం. న్యాయం కోసం పోరాడుతున్న ఈ సమయంలో వారికి మనం అండగా నిలవాలి. రెజ్లింగ్ సమాఖ్య చీఫ్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలి’ అని ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్ అరెస్ట్పై కూడా బాబా రాందేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ అరెస్ట్ కాలేదన్నారు. ఈ విషయంలో తాను ప్రకటనలు మాత్రమే చేయగలనన్నారు. అతడిని జైలులో పెట్టే అధికారం తనకు లేదని వ్యాఖ్యలు చేశారు. Wrestlers Protest : Baba Ramdev ने कर दी Brijbhushan Singh को ठोकने की बात! #ramdev #babaramdev #wrestlersprotest #brijbhushansingh #brijbhushansharansingh #vineshphogat #bajrangpunia #sakshimalik @b_bhushansharan @Phogat_Vinesh @SakshiMalik pic.twitter.com/09ECqfVpfy — Haryana Tak (@haryana_tak) May 27, 2023 ఇది కూడా చదవండి: ‘9 ఏళ్ల పాలన.. 9 ప్రశ్నలు.. మోదీపై విద్వేషంతోనే ఇదంతా..’ -
దేశం కోసం పతకం... పతకం కోసం సర్వస్వం: బజరంగ్ పూనియా
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లు సాధించిన పతకాలకు వెలకట్టడంపై స్టార్ల రెజ్లర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెజ్లర్ల పతకాలు 15 రూపాయలు కూడా విలువ చేయవని, పతకాలు తిరిగివ్వడం కాదు... రూ.కోట్లలో పొందిన ప్రోత్సాహకాల్ని తిరిగివ్వాలని బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్భూషణ్ అన్నారు. దీనిపై జంతర్మంతర్ వద్ద ధర్నా చేస్తున్న ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా మాట్లాడుతూ ‘ఆ పతకం ఛారిటీలో బ్రిజ్భూషణ్ ఇచ్చింది కాదు. నేను దేశం కోసం శ్రమిస్తే వచ్చింది. దాని కోసం రాత్రనక పగలనక మా రక్తం ధారపోశాం. ఏళ్ల తరబడి చెమట చిందించాం. దానికి వెలకట్టే అర్హత అతనికి లేనేలేదు’ అని అన్నాడు. మరో రెజ్లర్ సాక్షి మలిక్ కూడా అంతేస్థాయిలో ధ్వజమెత్తింది. బ్రిజ్భూషణ్కు కనపడిన 15 రూపాయల పతకం కోసమే సర్వస్వాన్ని ధారపోశామని చెప్పింది. అతని వ్యాఖ్యలు సిగ్గుచేటని, క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించాలని సూచించింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజభూషణ్ను అరెస్టు చేయాలని రెజ్లర్లంతా నెలరోజులుగా నిరసన చేస్తున్నారు. -
తండ్రి లాంటి వారు చనువుగా, ఏదో తెలిసీ తెలియక తాకితే అపార్థం చేసుకుంటారా?
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. తాము కోరినట్లు అతడిని అరెస్టు చేయకపోతే తమ నిరసన దీక్షను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ హెచ్చరించారు. రుజువులు ఉన్నాయా? ‘మా నిరసనను ఎల్లలు దాటిస్తాం. అంతర్జాతీయ క్రీడాకారులు, ఒలింపియన్ల మద్దతు కోరతాం. విదేశీ ఆటగాళ్లు కూడా ఇందులో గళం విప్పేలా ప్రణాళికతో ముందుకెళ్తాం’ అని వినేశ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. రెజ్లర్ల ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన కమిటీ తమను లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో, ఆడియో రుజువులు అడిగిందని రెజ్లర్లు చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రచురించింది. తండ్రిలాంటి వారు తాకితే కూడా అపార్థాలా? కమిటిలోని ఓ మెంబర్ ఓ మహిళా రెజ్లర్తో మాట్లాడుతూ.. తండ్రిలాంటి బ్రిజ్ భూషణ్ ఏదో తెలియక, చనువుగా మిమ్మల్ని తాకితే దానిని కూడా అపార్థం చేసుకుంటారా అని అన్నట్లు వారు చెప్పారని తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐ సిబ్బంది, కోచ్, బ్రిజ్ భూషణ్కు సన్నిహితంగా ఉండేవాళ్లంతా తమ విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వచ్చి విషయాలు రాబట్టేందుకు ప్రయత్నించారని మరో రెజ్లర్ పేర్కొన్నట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ ఓటమి ఇటాలియన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ పోరాటం ముగిసింది. రోమ్లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–7 (8/10), 10–12తో డిమినార్–కుబ్లర్ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సూపర్ టైబ్రేక్లో బోపన ద్వయం ఒక మ్యాచ్ పాయింట్ చేజార్చుంది. బోపన్న జోడీకి 29,300 యూరోల (రూ. 26 లక్షల 22 వేలు) ప్రైజ్మనీ లభించింది. చదవండి: ICC: హెల్మెట్ కచ్చితం.. ఫ్రీ హిట్కు బౌల్డయితే బ్యాటర్ తీసిన పరుగులు? -
అతన్ని అరెస్టు చేయకపోతే నిరసన జంతర్మంతర్ని దాటి వెళ్తుంది!
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో భారత రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి నిరసనకు రైతు సంఘాలు కూడా మద్దతు తెలపాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి సరైన విధంగా స్పందన రాకపోవడంతో.. రెజ్లర్లు తమ నిరసనను జంతర్ మంతర్ని దాటి మరింత ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్లు సోమవారం ప్రకటించారు. ఇతర దేశాల ఒలింపిక్ పతక విజేతలు, అథ్లెట్లను సంప్రదించి వారి మద్దతును కూడా తీసుకుని తమ ఆందోళన మరింతగా ఉద్ధృతం చేస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ని అరెస్టు చేయాలనే డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోకుంటే ఇలానే చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు భారత స్టార్ రెజ్లర్లు ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు మే 21న పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 23 రోజులుగా భారత రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: అమితాబ్ బచ్చన్ పోస్ట్ వివాదం..రంగంలోకి దిగిన ముంబై పోలీసులు) -
బ్రిజ్భూషణ్ను విచారించిన పోలీసులు..
న్యూఢిల్లీ: పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. కేసు తీవ్రత దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పది మందితో ప్రత్యేక పరిశోధన బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో నలుగురు మహిళా పోలీసు అధికారిణులు కూడా ఉన్నారు. గత నెలలో బ్రిజ్భూషణ్పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని ఇటీవల బ్రిజ్భూషణ్కు నోటీసులు జారీ చేయగా... గురువారం ఆయన హాజరయ్యారని... ‘సిట్’ మూడు గంటలపాటు ఆయనను ప్రశ్నించదన ఢిల్లీ పోలీసు ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారని బ్రిజ్భూషణ్ సమాధానం ఇచ్చినట్లు ఆ పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటికే 30 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నామని, ఈ కేసుకు సంబంధించి మున్ముందు కూడా బ్రిజ్భూషణ్ను విచారణ కోసం పిలుస్తామన్నారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, హరియాణా రాష్ట్రాలకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు ఆ పోలీసు అధికారి వివరించారు. ఇప్పటికైతే మేజిస్ట్రేట్ ఎదుట మైనర్ రెజ్లర్ వాంగ్మూలాన్ని తీసుకున్నామని... త్వరలోనే మరో ఆరుగురు మహిళా రెజ్లర్ల స్టేట్మెంట్ను కూడా మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణ నిమిత్తం ‘సిట్’ ఏర్పాటు చేశామని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ హర్జీత్సింగ్ జస్పాల్కు శుక్రవారం ఢిల్లీ పోలీసులు నివేదిక సమరి్పంచగా.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. చదవండి: ఫైనల్లో బెర్త్ కోసం బరిలో భారత బాక్సర్లు -
‘బ్లాక్డే’ పాటించిన రెజ్లర్లు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్ల నిరసన జంతర్ మంతర్ వద్ద కొనసాగుతోంది. నిరసనకు 18వ రోజైన గురువారం రెజ్లర్లు ‘బ్లాక్డే’గా పాటించారు. బ్రిజ్భూషణ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వీరంతా నల్ల బ్యాండ్లు ధరించి తమ అసంతృప్తిని ప్రదర్శించారు. ‘ఈ రోజు మేం బ్లాక్డే పాటించాం. దేశం మొత్తం మాకు అండగా నిలుస్తోంది కాబట్టి విజయం సాధిస్తామని నమ్ముతున్నాం. న్యాయం దక్కే వరకు మా నిరసన కొనసాగుతుంది’ అని బజరంగ్, సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్ అన్నారు. ఇది కూడా చదవండి: భారత్కు క్లిష్టమైన ‘డ్రా’ దోహా: ఏషియన్ కప్ పురుషుల ఫుట్బాల్ టోర్న మెంట్లో భారత జట్టుకు కఠినమైన ‘డ్రా’ ఎదురైంది. వచ్చే ఏడాది జనవరిలో ఖతర్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. గ్రూప్ ‘బి’లో ఆస్ట్రేలియా (ప్రపంచ 29వ ర్యాంక్), ఉజ్బెకిస్తాన్ (74వ ర్యాంక్), సిరియా (90వ ర్యాంక్) జట్లతో కలిసి భారత్ (101వ ర్యాంక్) ఉంది. వచ్చే ఏడాది జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్లుగా విభజించారు. 67 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో భారత జట్టు 1964లో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత భారత్ 1984లో, 2011లో, 2019లో ఈ టోర్నీకి అర్హత సాధించినా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. -
Video: రైతుల సంఘీభావం.. బారికేడ్లపైకి ఎక్కి, పక్కకు లాగేసి విరగ్గొట్టి..
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చాలా రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రెజ్లర్లకు రైతులు సోమవారం సంఘీభావం తెలిపారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలంటూ ఏప్రిల్ 23 నుంచి వాళ్లు ఆందోళన చేస్తుండటం తెలిసిందే. సోమవారం ఉదయం బంగ్లా సాహిబ్ గురుద్వారా నుంచి వందలాదిగా రైతులు కాలినడకన జంతర్మంతర్కు చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి, వాటిని పక్కకు లాగేసి విరగ్గొట్టారు. వేదిక వద్దకు చేరి రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. ‘పోక్సో చట్టం కింద బ్రిజ్ భూషణ్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. బీజేపీ నేతలు బ్రిజ్ భూషణ్కు అండగా ఉన్నారు. బాధిత రెజ్లర్ల తరఫున పోరాటం కొనసాగిస్తాం’అని రైతు సంఘం నేత ఒకరు చెప్పారు. చదవండి: Manipur Violence: సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. రెజ్లర్ల వద్దకు వెళ్లే హడావుడిలో రైతులు బారికేడ్లను ధ్వంసం చేశారన్నారు. ఇది మినహా మరే ఇతర అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. పోలీసులు అడ్డుపడ్డారంటూ సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ అసత్యాలని తెలిపారు. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మహిళా రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. -
Indian Wrestlers' Protest: విమర్శలపాలై.. ఆలస్యంగానైనా వచ్చిన ఉష! కానీ చేదు అనుభవం!?
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై తాము చేసిన లైంగిక ఆరోపణల విషయంలో మహిళా రెజ్లర్లు తమ వాదనలకు సంబంధించి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తాము ఈ సమాచారాన్ని గురువారం సీల్డ్ కవర్లో అందిస్తామని ఏడుగురు రెజ్లర్లు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన బెంచీ దీనికి అంగీకరించింది. ఈ అఫిడవిట్ కాపీని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కూడా అందించేందుకు తాము సిద్ధమని, అయితే దీనిని బహిరంగపర్చవద్దని రెజ్లర్ల తరఫు న్యాయవాది కోరారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది కాబట్టి విచారణాధికారికి మాత్రం దీనిని అందించవచ్చా అని మెహతా అడగ్గా... అభ్యంతరం లేదని బెంచీ సభ్యులు స్పష్టం చేశారు. గత శుక్రవారం బ్రిజ్భూషణ్పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. హామీ ఏమీ లేదు! భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఎట్టకేలకు రెజ్లర్లను కలిసింది. గత వారం రెజ్లర్ల నిరసన కారణంగా దేశం పరువు పోతోందంటూ వ్యాఖ్య చేసి విమర్శలపాలైన ఉష తాజా భేటీ ఆసక్తిని రేపింది. వారితో ఏం చర్చించిందనే అంశంపై పూర్తి స్పష్టత లేకున్నా... అధికారికంగా ఐఓఏ అధ్యక్షురాలి హోదాలో ఉష నుంచి రెజ్లర్లకు ఎలాంటి హామీ మాత్రం లభించలేదు. పీటీ ఉషకు చేదు అనుభవం ‘ఆలస్యంగానైనా ఉష ఇక్కడకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఐఓఏ అధ్యక్షురాలికంటే ముందు తాను అథ్లెట్నని ఆమె చెప్పారు. మాకు న్యాయం కావాలని, రెజ్లింగ్ మేలు కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పాం. మా పరిస్థితి చూస్తే బాధేస్తుందంటూ సంఘీభావం తెలిపారు. అయితే తక్షణ పరిష్కారం గురించి మాత్రం ఆమె ఏమీ చెప్పలేదు’ అని రెజ్లర్లు వెల్లడించారు. మరోవైపు ఉషపై ఒక మహిళ దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఉషపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపదెబ్బ కొట్టినట్లుగా ఒక వీడియో కనిపిస్తున్నా... దానిపై స్పష్టత లేదు. మరోవైపు బుధవారం రాత్రి రెజ్లర్లు నిరసన చేస్తున్న జంతర్ మంతర్ వద్దకు ఢిల్లీ పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి రెజ్లర్లను తరలించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చదవండి: ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అథ్లెట్.. 32 ఏళ్ల టోరి బోవి హఠాన్మరణం The Castiest frauds asked their Castiest goons to attack Legendary PT Usha at Jantar Mantar Whole Wrestling protest at jantar mantar is a propaganda and all of them are Liars and frauds pic.twitter.com/Fysm2yAp7d — Khushi Singh (@KhushiViews) May 3, 2023 -
Wrestlers Protest: బ్రిజ్భూషణ్ను అరెస్టు చేసే వరకు బరిలోకి దిగేది లేదు..
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ ను అరెస్టు చేసే వరకు... తాము విదేశీ టోర్నీల్లో పాల్గొనేది లేదని భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తెలిపారు. ‘రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా ఇంకా బ్రిజ్భూషణ్ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఫిర్యాదు చేసిన మహిళా రెజ్లర్ల నుంచి ఢిల్లీ పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేయలేదు. విచారణకు రావాలని ఇంకా బ్రిజ్ భూషణ్కు నోటీసులు కూడా జారీ చేయలేదు. కొన్నేళ్లుగా మా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించాం. కానీ ఎవరూ పట్టించు కోలేదు. గత జనవరిలో కేంద్ర క్రీడల మంత్రి అను రాగ్ ఠాకూర్ పర్యవేక్షక కమిటీని నియమించి ఈ వివాదాన్ని ముగించాలని చూశారు. అంతే తప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు’ అని వినేశ్ వ్యాఖ్యానించింది. జూన్ 1 నుంచి 4 వరకు కిర్గి స్తాన్లో జరిగే ర్యాంకింగ్ సిరీస్ టోరీ్నకి దూరంగా ఉన్నామని వినేశ్, బజరంగ్, సాక్షి తెలిపారు. -
1,000 మందిని లైంగికంగా వేధించానా? నేనేమైనా 'శిలాజిత్' రోటీలు తింటున్నానా?
న్యూఢిల్లీ: రెజ్లర్ల నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మొదట 100 మందిని లైంగికంగా వేధించినట్లు ప్రచారం చేశారని, ఇప్పుడేమో ఎకంగా 1,000 మందిని వేధించానని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇంత మందిని అలా చేయడానికి తానేమైనా శిలాజిత్తో తయారు చేసిన రోటీలు తింటున్నానా? అని నోరుజారారు. దీంతో బ్రిజ్ భూషణ్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అని అతనిపై ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్ సత్యవార్ట్ కదియాన్ మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఏడగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసనకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అతనిపై కేసు నమోదు చేసి, పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మొదట బ్రిజ్పై కేసు నమోదు చేయేలదు. కానీ చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు నిరసన చేస్తే తాను రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. కాగా.. మహిళ రెజ్లర్లకు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు. వారి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. నలుపు రంగులో ఉండే శిలాజిత్ పౌడర్ను ఉపయోగిస్తే సామర్థ్యం పెరుగుతుందని అంటారు. ఇవీ క్యాప్సుల్స్ రూపంలో కూడా లభిస్తాయి. ఇది తింటే పురుషుల శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయంటారు. చదవండి: రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..! -
కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన.. ప్రియాంక గాంధీ సంఘీభావం
న్యూఢిల్లీ: భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా... తమ నిరసనను ముగించేందుకు రెజ్లర్లు ఇష్టపడటం లేదు. జంతర్మంతర్ వద్ద శనివారం కూడా ఈ నిరసన కొనసాగింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆటగాళ్లకు తమ సంఘీభావం ప్రకటించారు. అయితే కొందరు బయటి వ్యక్తులు నిరసన వేదిక వద్ద వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని రెజ్లర్ బజరంగ్ పూనియా ఆరోపించాడు. తమ ఉద్యమం రెజ్లర్ల సమస్యలకే పరిమితమని, ఇతర రాజకీయ అంశాల జోలికి తాము వెళ్లడం లేదని అతను అన్నాడు. మరో వైపు తాజా అంశంపై ‘ఫొగాట్’ సోదరీమణుల మధ్య విభేదాలు తలెత్తాయి. నిరసనలోకి రాజకీయ నాయకులను రానివ్వొద్దంటూ బబిత ఫొగాట్ విమర్శించగా... మహిళా రెజ్లర్ల తరఫున నిలవడం ఇష్టం లేకపోతే, కనీసం నిరసనను బలహీనపర్చవద్దని వినేశ్ జవాబిచ్చింది. -
వారిని ఉరితీయాలి.. రెజ్లర్లకు సీఎం కేజ్రీవాల్ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన చేస్తున్న భారత రెజ్లర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. మహిళలను లైంగికంగా వేధించే వారిని ఉరితీయాలని అన్నారు. కాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ లైంగిక వేధింపులపై రెజ్లర్లు మరోసారి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లను కలిసిన సీఎం కేజ్రీవాల్ వారి నిరసనకు సంఘీభావం ప్రకటించారు. దేశం గర్వించేలా చేసిన రెజ్లర్లు గత వారం రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారని తెలిపారు. వారిని అవమానించారని.. మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేసేవారిని ఉరితీయాలని అన్నారు. ఎఫ్ఐఆర్లు నమోదైన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ను కేంద్రం కాపాడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్స్టర్కు పదేళ్ల జైలు.. ‘లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి (బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్) ఎంత శక్తిమంతుడో ఆలోచించాలి. ఆయనపై కేసు నమోదుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టిన అన్నా హజారే దేశ రాజకీయాలను మార్చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రెజ్లర్లు చేస్తున్న నిరసన కూడా క్రీడల్లో మార్పు తీసుకువస్తుందని తెలిపారు. దేశాన్ని ప్రేమించే వారు సెలవు తీసుకుని వారి నిరసనలో పాల్గోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. Delhi CM @ArvindKejriwal पहलवानों से मिलने जंतर-मंतर पहुंचे। BJP के बाहुबली नेता द्वारा महिला खिलाड़ियों के यौन उत्पीड़न के ख़िलाफ़ न्याय की मांग को लेकर सभी Wrestlers 7 दिन से धरने पर बैठे हैं।#KejriwalStandsWithChampions pic.twitter.com/G3Za1u9EqH — Aam Aadmi Party Delhi (@AAPDelhi) April 29, 2023 మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు లైంగిక వేధింపుల కేసునమోదు చేశారు. మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బ్రిజ్ భూషణ్ సింగ్పై కేసు నమోదవ్వడాన్ని స్వాగతించిన రెజ్లర్లు.. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ను అన్ని పదవుల నుంచి తొలగించి అరెస్టు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాను నేరస్థుడిని కానని, ఏ తప్పు చేయలేదని బ్రిజ్ భూషణ్ సింగ్ చెబుతున్నారు. రాజీనామా చేయడమంటే వారి ఆరోపణలను అంగీకరించడమే అవుతుందని, పదవి నుంచి వైదొలగనని పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. ప్రతి సారి ఆ పార్టీ ఖతమైంది: మోదీ ये Jantar Mantar की पवित्र धरती है — हम यहीं से निकले थे। यहां हुए आंदोलन ने देश की राजनीति बदल दी थी। आज मेरा दिल कहता है कि इन बच्चों, इन पहलवानों का ये आंदोलन खेल व्यवस्था में मूल परिवर्तन करेगा। — CM @ArvindKejriwal #KejriwalStandsWithChampions pic.twitter.com/eN1jFyBUmP — Aam Aadmi Party Delhi (@AAPDelhi) April 29, 2023 -
రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు.. బ్రిజ్భూషణ్పై ‘ఎఫ్ఐఆర్’ నమోదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా బ్రిజ్భూషణ్పై ‘ఎఫ్ఐఆర్’ నమోదు చేస్తామని ఇచి్చన హామీని పూర్తి చేశారు. బ్రిజ్భూషణ్పై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటూ ‘పోక్సో యాక్ట్’ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్... ఇతర రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల ప్రకారం మరో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. రెండింటిపై సత్వర విచారణ చేపడతామని పోలీసులు చెప్పారు. ఈ అంశంపై మే 5న మరోసారి విచారిస్తామని, ఆలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఫిర్యాదు చేసిన వారి జాబితాలో ఉన్న ఒక మైనర్ రెజ్లర్ భద్రతకు సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు బాధ్యత తీసుకోవాలని కూడా సుప్రీం సూచించింది. ‘మైనర్ రెజ్లర్కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుంటూ తగినంత భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నాం. ఇతర రెజ్లర భద్రతను కూడా ఆయన సమీక్షించాలి. దర్యాప్తునకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంపై గోప్యత కూడా పాటించాలి’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా బెంచీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బజరంగ్, వినేశ్, సాక్షి తదితర రెజ్లర్లు జంతర్మంతర్ వద్ద తమ నిరసన కొనసాగిస్తున్నారు. బ్రిజ్భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించడం పట్ల రెజ్లర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎఫ్ఐఆర్ మాత్రమే కాదు, బ్రిజ్భూషణ్ అరెస్ట్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని బజరంగ్ స్పష్టం చేశాడు. ‘విజయం దిశగా ఇది మొదటి అడుగు మాత్రమే. అయితే మా నిరసన ఇకపైనా కొనసాగుతుంది. ఆయనను అన్ని పదవుల నుంచి తప్పించడంతో పాటు జైలుకు పంపాల్సిందే. లేదంటే విచారణను ప్రభావితం చేస్తాడు’ అని రెజ్లర్ సాక్షి మలిక్ పేర్కొంది. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా..? : రెజ్లర్ సాక్షి మాలిక్ ‘ఢిల్లీ పోలీసులు మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి నిరసన ముగించమని ఒత్తిడి తెస్తున్నారు. కరెంట్ కట్ చేసి గేట్లు మూసేశారు. భోజనం, నీళ్లు కూడా లోపలికి రానివ్వడం లేదు. నేను ఏసీపీతో మాట్లాడాను. ఏం చేస్తారో చేసుకోండి అని ఆయన జవాబిచ్చాడు. వారు ఏం చేసినా మా ఆందోళన కొనసాగిస్తాం. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా. బ్రిజ్భూషణ్ చట్టంకంటే పెద్దవాడిగా మారిపోయాడు’. సుప్రీం కోర్టు ఆదేశాలను నేను స్వాగతిస్తున్నా: బ్రిజ్భూషణ్ సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నాకూ మంచిదే. విచారణలో వారికి అన్ని విధాలా సహకరిస్తా. విచారణ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ప్రశి్నంచలేదు. రెజ్లర్లు మరికొంత సమయం ఆగాల్సింది. కానీ వారు కోర్టుకు వెళ్లారు. ఎవరి పట్లా తప్పుగా వ్యవహరించలేదు. నాకు నాపై నమ్మకముంది. -
#TopCricketers: 'గెలిస్తే చప్పట్లు కొట్టారు.. ఇప్పుడు మొహం చాటేశారు'
#WrestlersProtest.. లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆరు రోజుల నుంచిధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా అథ్లెట్లతో బ్రిజ్ భూషణ్ ప్రవర్తన సరిగా లేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ.. క్రికెటర్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం పట్ల రెజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత రెజ్లర్ వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. దేశంలోని అగ్రశ్రేణి క్రికెటర్లపై అసంతృప్తి వెల్లగక్కారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ వంటి గేమ్స్లో అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టే క్రికెటర్లు.. ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. ''దేశం మొత్తం క్రికెట్ను ఆరాధిస్తోంది. కానీ, ఒక్క క్రికెటర్ కూడా మా ఆందోళనపై మాట్లాడటం లేదు. పతకాలు గెలిచినప్పుడు చప్పట్లతో అభినందిస్తూ పోస్టులు పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఒక పెద్ద ఆందోళన జరుగుతుంటే మాత్రం మొహం చాటేశారు. వ్యక్తిగతంగా ఇది నన్నెంతో బాధిస్తోంది. మీరు రెజ్లర్లకు అనుకూలంగా మాట్లాడమని మేం చెప్పట్లేదు. కనీసం న్యాయం జరగాలంటూ ఒక్క పోస్ట్ అయినా పెట్టమని అభ్యర్థిస్తున్నాం. క్రికెటర్ అయినా, బ్యాడ్మింటన్ క్రీడాకారులు అయినా, అథ్లెటిక్స్, బాక్సర్ అయినా ముందుకొచ్చి మాకు మద్దతు తెలపండి'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికా లో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’మూవ్మెంట్కు మన క్రికెటర్లు కొందరు మద్దతు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ గుర్తు చేసింది. ఆ మాత్రం మద్దతు పొందేందుకు మేం అర్హులం కామా..? అని నిలదీసింది. మా విషయంలో వారు ఎందుకు భయపడుతన్నారో అర్థం కావడం లేదని పేర్కొంది. క్రికెటర్లు వారి బ్రాండ్ ఒప్పందాలను ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారో.. లేక వ్యవస్థను చూసి భయపడుతున్నారో తెలియట్లేదని వాపోయింది. అలా కాకుండా మాకు జరిగినదే అక్కడ కూడా ఏదైనా జరుగుతోందేమో..? అంటూ అనుమానం వ్యక్తం చేసింది. చదవండి: రెజ్లర్లు వీధుల్లోకి రావడం బాధించింది.. న్యాయం జరగాలి: హర్భజన్ -
రెజ్లర్లు వీధుల్లోకి రావడం బాధించింది.. న్యాయం జరగాలి: హర్భజన్
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా రెజర్లు గత ఆరు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రెజర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఇందులో ప్రముఖ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, సహా ఇతర రెజర్లు పాల్గొన్నారు. ఇక ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు హర్భజన్ సింగ్ సపోర్ట్గా నిలిచాడు. దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చిన రెజర్లు రోడ్డు రోడ్డుపైకి రావడం చాలా బాధాకరమని భజ్జీ అన్నాడు. "సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్లు భారతదేశానికి గర్వకారణం. అటువంటి రెజర్లు మన దేశ వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నందుకు క్రీడాకారిణిగా నేను బాధపడుతున్నారు. వారికి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను" అని హర్భజన్ ట్విటర్లో పేర్కొన్నాడు. భజ్జీతో పాటు జావిలిన్ త్రో స్టార్ నిరాజ్ చోప్రా, సానియా మీర్జా కూడా సపోర్ట్గా నిలిచారు. Sakshi, Vinesh are India's pride. I am pained as a sportsperson to find pride of our country coming out to protest on the streets. I pray that they get justice.#IStandWithWrestlers pic.twitter.com/hwD9dKSFNv — Harbhajan Turbanator (@harbhajan_singh) April 28, 2023 pic.twitter.com/SzlEhVnjep — Neeraj Chopra (@Neeraj_chopra1) April 28, 2023 చదవండి: Wrestlers Protest: దేశ ప్రతిష్టతను దిగజారుస్తున్నారు.. పీటీ ఉష ఘాటు వ్యాఖ్యలు -
దేశ ప్రతిష్టతను దిగజారుస్తున్నారు.. పీటీ ఉష ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో ఐదు రోజులుగా నిరసన కొనసాగిస్తున్న అగ్రశ్రేణి రెజ్లర్లకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నుంచి అనూహ్య స్పందన ఎదురైంది. వారి తీరును తప్పుపడుతూ ఐఓఏ అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారు వీధుల్లోకి వెళ్లకుండా ఉండాల్సిందని ఆమె సూచించింది. ‘లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఐఓఏలో ఒక కమిటీతో పాటు అథ్లెటిక్స్ కమిషన్ కూడా ఉంది. వారంతా వీధుల్లోకి వెళ్లకుండా మా వద్దకు రావాల్సింది. కానీ వారు అలా చేయలేదు. కొంత క్రమశిక్షణ కూడా అవసరం. వారు చేస్తున్న పని ఆటకు మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా భారత్కు మంచి పేరు ఉంది. ఇలాంటి నిరసనల వల్ల దేశం పరువు పోతోంది. ఈ తరహా ప్రతికూల ప్రచారం దేశానికి మంచిది కాదు. ఏదైనా చట్టప్రకారం ఉండాలి. వారంతా ధర్నాలో కూర్చొని రాజకీయ పార్టీల మద్దతు కోరడం నన్ను తీవ్రంగా నిరాశపరుస్తోంది’ అని పీటీ ఉష అభిప్రాయపడింది. ఉష మాటలపై స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఆమె స్వయంగా ఒక అథ్లెట్. పైగా మహిళ కూడా. మేం ఆమె మద్దతు కోరుకున్నాం. కానీ ఆమె నుంచి ఇలాంటి తీవ్రమైన స్పందన ఊహించలేదు. రెజ్లర్ల చర్య వల్ల భారత్ పరువు పోతోంది అని భావిస్తే గతంలో తన అకాడమీలో కొందరు గూండాలు తనను వేధిస్తున్నారంటూ ఆమె అందరి ముందు ఏడవలేదా. అప్పుడేం జరిగింది’ అంటూ బజరంగ్ గుర్తు చేశాడు. వారికీ అవకాశమిచ్చాం: క్రీడల మంత్రి ఠాకూర్ రెజ్లర్ల సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతోందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. తమ వైపు నుంచి అన్ని విషయాలను వెల్లడించేందుకు రెజ్లర్లకు తగినంత అవకాశం ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం తొలిసారి వారు నిరసన జరిపినప్పుడు తాను స్వయంగా 12 గంటల పాటు వారితో చర్చలు జరిపానని... విచారణ కమిటీ 14 సార్లు సమావేశాలు నిర్వహించి ఆటగాళ్లు తమ బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చిందని ఠాకూర్ అన్నారు. -
Wrestlers Protest: మోదీ జీ.. మా ‘మన్కీ బాత్’ వినండి..!
న్యూఢిల్లీ: తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో నిరసన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లు ఇప్పుడు ఈ విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. తాము విజయం సాధించినప్పుడు ఫోటోలు దిగి ఉత్సాహపరచిన ప్రధాని తమ గోడును పట్టించుకోకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని రేడియో కార్యక్రమం ‘మన్కీ బాత్’ (మనసులో మాట)ను ఉద్దేశించి రెజ్లర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని బేటీ బచావో, బేటీ పడావో గురించి మాట్లాడుతారు. చదవండి: లైంగిక వేధింపుల ఆరోపణలు.. రెజ్లర్లకు చేదు అనుభవం! సరైన ఆధారాలు లేనందున.. అందరి మనసులో మాటను వింటారు. కానీ మా ‘మన్కీ బాత్’ను ఆయన వినలేరా. మేం విజయాలు సాధించినప్పుడు ఇంటికి పిలిచి గౌరవించడంతో పాటు మమ్మల్ని తన బిడ్డలంటూ చెప్పుకున్నారు. ఈ రోజు మా బాధ వినాలని ఆయనను అభ్యర్థిస్తున్నాం’ అని 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ వ్యాఖ్యానించింది. నాలుగు రోజులుగా తాము రోడ్లపై పడుకుంటున్నా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కనీసం పట్టించుకోవడం లేదని సాక్షి విమర్శించింది. ‘బహుశా నిజం ఏమిటో ప్రధానికి తెలియకపోవచ్చు. అందుకే వ్యక్తిగతంగా కలిసి సమస్యను చెప్పాలని కోరుకుంటున్నాం. అయితే ఆయనను కలిసే మార్గం ఏమిటో మాకు తెలియడం లేదు’ అని వినేశ్ ఫొగాట్ చెప్పింది. నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లు బుధవారం రోడ్డు పైనే తమ ప్రాక్టీస్ను ప్రారంభించారు. కోచ్ సుజీత్ మాన్ నేతృత్వంలో అక్కడే సాధన చేసిన వారు... తమకు మరో గత్యంతరం లేదని పేర్కొన్నారు. మరోవైపు బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా సోషల్ మీడియా ద్వారా రెజ్లర్లకు తన మద్దతు ప్రకటించాడు. దేశానికే ప్రాతినిధ్యం వహించేందుకు ఎంతో కష్టపడే ఆటగాళ్లు ఇలా రోడ్లపై రావాల్సి రావడం చాలా బాధగా ఉందని అతను అన్నాడు. చదవండి: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం