y visweswara reddy
-
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన చేస్తే గుర్రాలతో తొక్కి చంపించిన చరిత్ర నీది..
-
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం
-
‘అలా చేస్తే పయ్యావుల కూడా టీడీపీలో మిగలడు’
అనంతపురం, సాక్షి: ఎన్నికలొచ్చినప్పుడే పయ్యావుల కేశవ్కు ఉరవకొండ గుర్తొస్తుందని.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం సీఎం జగన్మోహన్రెడ్డి హాజరైన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన విశ్వేశ్వరరెడ్డి.. పయ్యావులపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ గొప్ప ప్రజాస్వామిక వాది. కులాలు మతాలకు అతీతంగానే కాదు.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పార్టీ కండువా కప్పుకుంటేనే లబ్ధి చేకూరుస్తామని చెప్పేవాళ్లు. మీలా వైఎస్సార్ సీపీ కండువా వేసుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తామంటే ఒక్కరైనా ఉండేవారా?.. ఆఖరికి పయ్యావుల కేశవ్ కూడా పార్టీలో మిగలడు. మేం ప్రజాస్వామ్య వాదులం కాబట్టే అలా చేయం. నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్దే. ..ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. వేలాది మంది పేదలకు ఇంటి పట్టాలు రాకుండా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారు అని విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ పరిపాలనలో అనేక సంస్కరణలు జరిగాయి. జగన్ ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి - సంక్షేమం టీడీపీ నేతలకు కనిపించదు. సీఎం జగన్ రాష్ట్ర ఆదాయం పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. సీఎం జగన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు.. అందుకు కృతజ్ఞతలు. ఉరవకొండకు మరిన్ని సమస్యలు ఉన్నాయ్.. అవి తీర్చాలని సీఎం జగన్ను కోరుతున్నా. నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం జగన్ను కోరుతున్నా అని విశ్వేశ్వర్రెడ్డి తన ప్రసంగం ముగించారు. -
సీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు
-
దొడ్డిదారిన గెలిచేందుకు పయ్యావుల కుట్ర
అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ప్రజాశాంతి పార్టీతో కలిసి కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డిని ఎలాగైనా దెబ్బతీసి తాను లబ్ధి పొందేందుకు కుయుక్తులు పన్నారు. ఇందులో భాగంగా కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీకి లక్షల రూపాయలు ఇచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరునే కలిగి ఉన్న మరో వ్యక్తికి బీృఫారం తెప్పించి నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించారు. ఈ రెండు పార్టీల గుర్తులు దగ్గరదగ్గరగా పోలి ఉండడంతోపాటు అభ్యర్థుల పేర్లూ ఒకేలా ఉంటే ఓటర్లను తికమక పెట్టి లబ్ధి పొందవచ్చని కేశవ్ దురాలోచన చేశారు. ఇందులో భాగంగా విశ్వేశ్వరరెడ్డి పేరుగల వ్యక్తుల కోసం గాలించారు. ఈ క్రమంలో సీఆర్ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తితో పయ్యావుల కేశవ్ అనుచరుడు పరమేశ్వర్రెడ్డి చేసిన బేరసారాల ఆడియోలు లీకయ్యాయి. విశ్వేశ్వరరెడ్డి అనే పేరుగల వ్యక్తి ఎందుకు అవసరం.. ప్రజాశాంతి పార్టీ తరఫునే ఎందుకు నామినేషన్ వేయాలి.. అందుకు ప్రతిఫలంగా ఏమిస్తారు.. నామినేషన్ వేసి పొరబాటున విత్డ్రా చేసుకుంటే కలిగే ఇబ్బందులు తదితర అంశాలపై పయ్యావుల కేశవ్ అనుచరుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే.. సీఆర్ విశ్వేశ్వరరెడ్డి పోటీకి అంగీకరించకపోవడంతో చివరికి కే విశ్వనాథరెడ్డి అనే వ్యక్తిని బరిలోకి దింపారు. కాగా, నామినేషన్ గడువుకు ముందురోజు సీఆర్ విశ్వేశ్వరరెడ్డితో పయ్యావుల ప్రతినిధి రెండు దఫాలుగా జరిపిన సంభాషణ ఇదిగో ఇలా ఉంది.. ఇది ఓటర్లను తికమక పెట్టేందుకే.. అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే ప్రజలే ఎదురొచ్చి ఓట్లు వేస్తారు. ఏమీ చేయకుండా కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకుని ఈ రోజు దొడ్దిదారిన గెలవాలని పయ్యావుల కేశవ్ చూస్తున్నారు. ప్రత్యర్థి పేరున్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించి ఓటర్లను తికమక పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నాకు ఫోన్ చేశారు. రెండువేల ఓట్లయినా చీల్చాలనే కుట్ర పన్నారు. - సీఆర్ విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకుడు మొదటి ఆడియో పయ్యావుల ప్రతినిధి : అన్నా.. నేను పరమేశ్వరరెడ్డి అని రవీ వాళ్ల ఫ్రెండ్ సీఆర్ విశ్వేశ్వరరెడ్డి : చెప్పండి ప.ప్ర: నామినేషన్ వేయడానికి చూడమనింటే రవి మీ ఫోన్ నంబరు ఇచ్చాడు సీఆర్: ఎక్కడనా.. ఇంతకుముందు ఏదో మాట్లాడారు ఉరవకొండ నుంచి నామినేషన్ వేయాలని. ప.ప్ర: ఆ.. సీఆర్: ఎవరి తరఫున అన్నా అది ప.ప్ర: అది కేఏ పాల్ సీఆర్: కేఏ పాలా.. ఆయనేదో జోకర్ కదా ఆయన ప.ప్ర: అంటే ఆయన మనకు ముఖ్యం కాదు. పయ్యావుల కేశవన్న ఉన్నాడు కదా వాళ్ల తరఫున సీఆర్: ఓకే. దానివల్ల వీళ్లకేమి ఉపయోగం ఉంటుంది అన్నా ప.ప్ర: ఏమి ఉపయోగమో అనేది కాదు. వాళ్ల ఐడియాలు ఎట్లున్నాయో మనకు తెలియదు కదా? ఆ పేరు మీద ఉన్నోళ్లలో మీ వాళ్లెవరైనా ఉంటే చూడండి అని చెప్పారు. అందుకోసమని రవికి చెప్పింటిని మాట్లాడు అని. రవి ఫోన్ నంబర్ ఇచ్చాడు. బాగుంటుందన్నా భవిష్యత్తులో కూడా ఏదైనా టౌన్లో మంచీచెడ్డ ఉన్నాగాని వాళ్లే చూసిపెడతారు మనకి. దానికోసమని చెబుతున్నా. సీఆర్: దానివల్ల విశ్వనాథరెడ్డి అని పేరుండే వాళ్లకు ఏమి ఉపయోగం? ప.ప్ర: ఈయన (కేశవ్) అపోజిట్ కేండెట్ విశ్వేశ్వరరెడ్డి కదా. సీఆర్: ఎస్.. ఆయన వైఎస్సార్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. ప.ప్ర: అవును వాళ్లది ఫ్యాన్ గుర్తుకదా. హెలిక్యాప్టర్కు కూడా ఫ్యాన్ ఉంటుంది అని ఒక సజేషన్ ఇచ్చారు వాళ్లకు. సీఆర్: ఓటర్స్ మొత్తం కన్ఫ్యూజ్ అయి.. చీలిపోతాయనా ప.ప్ర: ఆ.. ఆ.. కనీసం వెయ్యి రెండువేలు ఓట్లు చేంజ్ అయినాగాని మనకు బెనిఫిట్ అవుతుందనే ఆలోచన అంతే. సీఆర్: సరే ఇక్కడ కంటెస్ట్ చేసే వాళ్లకు ఏమి ఉపయోగం ఉంటుంది అన్నా. విశ్వేశ్వరరెడ్డి పేరుతో కేఏ పాల్ గుర్తుపైన కంటెస్ట్ చేస్తారంటున్నారు కదా.. వారికేమి ఉపయోగం. ప.ప్ర: బెనిఫిట్స్ ఉంటాయి. అంతో ఇంతో డబ్బులైనా ఇవ్వొచ్చు. రేప్పొద్దున వాళ్లను ఉపయోగించుకోవచ్చు మనం. సీఆర్: అంటే ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఏం కతా.. çప.ప్ర: ఏమో వాళ్లతో మాట్లాడితే కదా. మనకు వాళ్లేమీ ముందుగా చెప్పలేదు. సీఆర్: అంటే పయ్యావుల వాళ్లు పాల్తో కాంటాక్ట్లో ఉన్నారా? ప.ప్ర: కాంటాక్ట్ ఏమీలేదు. వాడు డబ్బుకు ఇస్తారు బీృఫారం అంతే. డబ్బుకు ఆశ పడుతున్నాడంట. డబ్బు ఏం మాట్లాడుకున్నారో వాళ్లు ఏం మాట్లాడతారో తెలీదు. బీృఫారం తెచ్చుకోవడానికి వాళ్లతో మాట్లాడతారు అంతే. సీఆర్: అంటే ఓట్లు చీల్చడానికి ఇది వేస్తున్నారు అంతే ప.ప్ర: అంతే కన్ఫ్యూజన్కు సీఆర్ : అవును లెండి ఫ్యాన్కే వేసేదిపోయి హెలిక్యాప్టర్ ఫ్యాన్కు వేస్తారు. మీరు టీడీపీలో మెంబరా ఏంటి అన్నా ప.ప్ర: మాది రాగులుపాడు అని, పరమేశ్వర్రెడ్డి నా పేరు. మామూలు బూత్ కమిటీ మెంబరు. సీఆర్: పోవాలంటే ఎవరు డీల్ చేస్తారు ప.ప్ర: మన బయోడేటా తీసుకుని కేశవ్ వాళ్ల దగ్గరికి పోతే. అంతా వాళ్లే చూసుకుంటారు అంతే. సీఆర్: సరే అన్నా.. ప.ప్ర: ఏమీలేదు మనం ఓకే అంటే రేపే (25వ తేదీ) లాస్ట్ డేట్ కదా. ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. రేపు 3 గంటల దాకా టైం ఉంది. సీఆర్: సరేలే అన్నా.. నేను వన్ అవర్లో కన్ఫామ్ చేస్తా ప.ప్ర: కన్ఫామ్ చేయండి. చెప్పేస్తే మేము వస్తాము. అక్కడికి పోయి నువ్వేమైనా మాట్లాడాలి అనుకున్నా కూడా నేను వాళ్లతో డైరెక్ట్గా కూడా మాట్లాడిస్తా. సీఆర్: సరే అన్నా..ఒకే రెండో ఆడియో ప.ప్ర: నామినేషన్ వేసి విత్డ్రా చేయకూడదు. సీఆర్: నామినేషన్ వేసినాక ఎందుకు విత్డ్రా చేస్తారు ప.ప్ర: వాళ్లు ఎప్పటికైనా ఏ రకంగానైనా హెల్ప్ చేస్తారు. తొక్కాలనుకుంటే తొక్కుతారు రెండూ ఉండాయి వాళ్ల దగ్గర. సీఆర్: అవునులెండి ఉంటాయి మామూలే ప.ప్ర: డబ్బులు ఎంత ఇస్తారనేది కనుక్కుని కన్ఫాం చేస్తాను. సీఆర్: సరేనా.. ఒకే. -
అనంతపురం జిల్లా వజ్రకరూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
పేదలు ఇప్పుడు గుర్తొచ్చారా?
ఉరవకొండ: తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత పేదలు గుర్తొచ్చారా అంటూ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ను ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నిలదీశారు. మరో ఇరవై రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఇంటి పట్టాల పంపిణీ చేపట్టడం పేదలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికేనని ధ్వజమెత్తారు. ఉరవకొండలోని ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం చేపట్టిన ఇంటిపట్టాల పంపిణీ ఉద్రిక్తతల నడుమ సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేదల ఇంటి పట్టాల సాధన కోసం తాను సాగించిన పోరాటాలను, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పట్టణంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలను గతంలో గుర్తించామన్నారు. ఇందులో నివేశన స్థలం, పక్కాగృహాలు లేవని ఎంతోమంది పేదలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. సంప్లు శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా సరఫరా అవుతున్న నీటినే తాగాల్సిన దుస్థితి గురించి వివరించారన్నారు. 2014 నుంచి పేదల ఇంటి పట్టాల కోసం తాను సుదీర్ఘ పోరాటాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైఎస్సార్సీపీతో పాటు సీపీఐ, సీపీఎం కుడా పోరాటాల్లో పాలుపంచుకున్నారన్నారు. 2016లో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు 25 గంటల దీక్ష, ఆ ఏడాది జూలై 29న తహసీల్దార్ కార్యాలయం ముట్టడితో పాటు వేలాది మందితో రోడ్డు దిగ్బంధించి చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కల్గించామన్నారు. 2017 ఫిబ్రవరి 6న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ఉరవకొండలో నిర్వహించిన ధర్నాలో పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. నాలుగున్నరేళ్లుగా పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుందని తెలిసి, ఇప్పడు పట్టాలు ఇవ్వకపోతే తమను ప్రజలు ఎక్కడి అక్కడ నిలదీస్తారోనని భయపడి పట్టాల పంపిణీకి ఎమ్మెల్సీ కేశవ్ శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వ తీరు, ఎమ్మెల్సీ కేశవ్ల తీరును ఎండగడుతుండటంతో జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఎమ్మెల్యే మాట్లాడుతున్న మైక్ను కట్ చేశారు. ఎమ్మెల్యే మహనేత వైఎస్, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ఉచ్ఛరించగానే సభలో తప్పట్లు, ఈలలు వేయడం వేదికపై ఉన్న టీడీపీ నేతలకు మరింత కోపాన్ని తెప్పించింది. దీంతో వాస్తవాలు చెబుతున్న ఎమ్మెల్యే మైకును లాక్కోవడంతో టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో పాటు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు చందా చంద్రమ్మ, సులోచనలు మాట్లాడుతుండగా టీడీపీ నాయకులు కొందరు సభ్యత లేకుండా అడ్డుతగిలారు. దీంతో గుంతకల్లు డీఎస్పీ ఖాసీంసాబ్, సీఐ సయ్యద్ చిన్నగౌస్, ఎస్లు ఇరువర్గాల వారినీ సముదాయించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విప్ చేతుల మిదుగా పేదలకు పట్టాలు అందించారు. కార్యక్రమంలో మార్కెట్యార్డు ఛైర్మన్ రేగాటి నాగరాజు, ఎంపీపీ సుంకమ్మ, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో రైతాంగం కుదేలు
వజ్రకరూరు: చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. వజ్రకరూరును కరువు మండలంగా ప్రటించాలని డిమాండ్ చేస్తూ గురువారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పార్టీ శ్రేణులు షిర్డీసాయి ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తీవ్ర వర్షాభావంతో జిల్లాలో 5.71 లక్షల హెక్టార్లలో పంట తుడుచు పెట్టుకుపోయిందన్నారు. జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు రుణాలన్నింటినీ రీషెడ్యూల్ చేయాలన్నారు. బ్యాంకుల్లో వేలాలు ఆపాలని, పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్రకష్టాల్లో ఉన్నా రుణమాఫీ మొత్తం విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. రైతులు ప్రీమియం చెల్లించినా ఇన్యూరెన్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లవుతున్నా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. సీఎంకు అమరావతి భజన తప్ప మరోటి పట్టడం లేదని విమర్శించారు. వైఎస్ హంద్రీనీవా పనులు 90 శాతం పనులు పూర్తి చేసి జిల్లాకు కృష్ణ జలాలు తీసుకొస్తే టీడీపీ నాయకులు తామే తీసుకొచ్చినట్లు టీడీపీ నాయకులు ఫోజులు కొడుతున్నారన్నారు. కేశవ్ కొత్త నాటకం ఎమ్మెల్సీ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామంటూ రైతులను మభ్యపెడుతున్నారని, ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త నాటకానికి తెరతీశారని విశ్వ ధ్వజమెత్తారు. కాలువ తవ్వి నీరు ఇస్తున్నట్లు కేశవ్ ఆర్భాటం ప్రదర్శిస్తున్నారే తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకపోవడంతో కళ్లముందే హంద్రీ–నీవా పారుతున్నా రైతులు వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. అనంతరం తహసీల్దార్ అనిల్కుమార్కు రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సుశీలమ్మ, మండలాధ్యక్షుడు జయేంద్రరెడ్డి, వైస్ ఎంపీపీ నారాయణప్ప, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్యం ప్రకాష్, పార్టీ జిల్లా కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, జెట్పీటీసీ తిప్పయ్య, ఎంపీటీసీలు వెంకటేశ్నాయక్, రామాంజనేయులు, రవికుమార్, మాజీ సర్పంచులు యోగానంద, రుద్రప్ప,రఘు, లక్ష్మీబాయి, నాగేంద్ర, నాయకులు వెంకటరెడ్డి, నారాయణరెడ్డి, శంకర్రెడ్డి, మన్యం అనిల్, ఉస్మాన్, డిష్సురేష్, రాకెట్లబాబు, ముండాసు ఓబుళేసు, తిరుపాల్శెట్టి, రఘుపతి, కిరణ్, బెస్త ఆది, ప్రభుదాసు, సికిందర్, చిన్నపులికొండ, బత్తిన వెంకట్రాముడు, తిప్పారెడ్డి, ముత్యాల్, సోమశేఖర్రెడ్డి, గూదె అనిల్, కమలమ్మ, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. -
జేసీ బ్రదర్స్కు తొత్తులుగా పోలీసులు
అనంతపురం / గుత్తి: జేసీ బ్రదర్స్ (దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి)కి పోలీసులు తొత్తులుగా మారిపోయారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ తలారి రంగయ్య, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీమ్ ధ్వజమెత్తారు. వారందరూ గుత్తి స్పెషల్ సబ్ జైలులో రిమాండ్లో ఉన్న తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని శనివారం విడివిడిగా పరామర్శించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. జేసీ బ్రదర్స్ ఆడగాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయన్నారు. అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, కదిరి, రాప్తాడు, ధర్మావరం, హిందూపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టడానికి టీడీపీ సర్కార్ పోలీసుల చేత అక్రమ కేసులు బనాయింపజేస్తోందన్నారు. పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మలుగా, మరీ ముఖ్యంగా జేసీ బ్రదర్స్ చెప్పు చేతల్లో ఉన్నారని ఘాటుగా విమర్శించారు. పోలీసులు ఇలా అక్రమ కేసులు బనాయించుకుంటూ పోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందన్నారు. పచ్చని గ్రామాల్లో చిచ్చు రేగుతుందన్నారు. పోలీసు యంత్రాంగం అరాచకాలను, రౌడీ, గూండాయిజాన్ని అణచి వేయడానికి పని చేయాలి తప్ప ఇలా అధికారపార్టీకి తొత్తులుగా మారితే ఇక చట్టం ఎందుకని ప్రశ్నించారు. విచారణ లేకుండా కేసులు పెడుతూ పోతే ప్రజాస్వామ్యం నాశనం అవుతుందన్నారు. ఇప్పటికైనా పోలీసులు చట్టం, న్యాయం ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. పెద్దారెడ్డిని పరామర్శించిన వారిలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పైలా నరసింహయ్య, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు మీసాల రంగన్న, పేరం నాగిరెడ్డి, మంగళ కృష్ణ, బొంబాయి రమేష్, రమేష్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఫయాజ్ బాషా, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, ఉరవకొండ వీరన్న, సీవీ రంగారెడ్డి, సుభాష్రెడ్డి, శాంతి రెడ్డి, పీరా తదితరులు ఉన్నారు. -
పరిహారం ప్రకటించి భరోసా కల్పించాలి
అనంతపురం అర్బన్: ‘‘హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ కింద 60,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకుండా పనులు చేయడం ఏమిటి. చట్ట విరుద్ధంగా పనులు చేస్తున్న కాంట్రాక్టరుపైన, ప్రశ్నించిన రైతులపై దౌర్జన్యం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నీరు రావాలని మేమంతా పోరాటం చేసిన వారిమే. అయితే అది చట్టపరంగా జరగాలే తప్ప ఇలా చట్ట విరుద్ధంగా.. రైతులకు ఆందోళనకు గురిచేసే విధంగా కాదు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేసి, పరిహారం ప్రకటించి రైతులకు భరోసా కల్పించండి.’’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి.. జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావును కోరారు. జాయింట్ కలెక్టర్ను గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తరిమెల శరత్చంద్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి.శివారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న, రైతులు కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు. పరిహారం ఇవ్వకుండానే 36వ ప్యాకేజీ పనులు శరవేగంగా జరుగుతుండడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. పరిహారం చెల్లించకుండా పనులు ముందుకు సాగనివ్వమంటూ బాధిత రైతులు చెబితే.. స్థానిక రాజకీయ నాయకులు, కొంత మంది వారిని భయపెడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారిగా మీరు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి భూములు కోల్పోతున్న రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారం మేరకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 36వ ప్యాకేజీ పనులను చట్టవిరుద్ధంగా చేపట్టిన కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతులు మూకుమ్మడిగా పనులను అడ్డుకుంటారని, తద్వారా చట్టపరమైన అవరోధాలు తలెత్తితే, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కరువు జిల్లాగా ప్రకటించాలి జిల్లా మొత్తం కరువు నెలకొన్నప్పటికీ కేవలం 44 మండాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం సరైన విధానం కాదని, జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని జాయింట్ కలెక్టర్ను ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి కోరారు. 2014 నుంచి రాయలసీమ ప్రాంతం కరువుతో విలవిల్లాడుతోందన్నారు. రైతులు, రైతు కూలీలు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. ఆ కుటుంబాల పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జిల్లాలో మరింత ఇబ్బందికర పరిస్థితి నెలకొందన్నారు. –ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి -
'విశ్వ' రూపం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదంతో ఐఏబీ(సాగునీటి సలహా మండలి సమావేశం) సమావేశం రసాభాసగా మారింది. ఏడాదికి ఒక్కసారి నిర్వహించే సమావేశానికి సగం మంది ఎమ్మెల్యేలు కూడా హాజరుకాని పరిస్థితి. వచ్చిన వారి అభిప్రాయాలను కూడా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓపిగ్గా వినకపోవడం గమనార్హం. పక్ష ఎమ్మెల్యేలతో పాటు స్వపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు చెబుతుండగా మంత్రి జోక్యం చేసుకుని ‘ఓకే.. ఓకే.. అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం. వీలైనంత త్వరలో నీళ్లిస్తాం’ అని అడ్డుపడ్డారు. స్వపక్షపార్టీ నేత కావడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఏమనలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికీ ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, జితేంద్రగౌడ్, ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడేది పూర్తిగా వినాలని మంత్రికి చెప్పారు. ఇంత తతంగం జరుగుతున్నా ఐఏబీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కనీసం పెదవి విప్పలేదు. ప్రేక్షకపాత్ర వహించారు. చివరకు నీటి కేటాయింపుల గురించి కూడా మాట్లాడలేకపోవడం గమనార్హం. ఈ ఏడాది హెచ్చెల్సీ కోటా 25.142 టీఎంసీలు తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది నీటి లభ్యత 164 టీఎంసీలుగా టీబీ బోర్డు నిర్ధారించింది. ఇందులో దామాషా ప్రకారం 25.142 టీఎంసీలు హెచ్చెల్సీకి కేటాయించారు. ఇందులో తొలి ప్రాధాన్యతగా 10టీఎంసీలు తాగునీటికి కేటాయించారు. తక్కిన 15.142 టీఎంసీలు సాగునీటికి కేటాయించారు. తుంగభద్ర మెయిన్ కెనాల్, జీబీసీ(గుంతకల్లు బ్రాంచ్ కెనాల్), ఎంపీఆర్ దక్షిణ, ఉత్తర కాలువలు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్కు కలిపి 6.808 టీఎంసీలు కేటాయించారు. కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్కు 0.742 టీఎంసీలు, వైఎస్సార్జిల్లా మైలవరం బ్రాంచ్ కెనాల్కు 1.253, పులివెందుల బ్రాంచ్ కెనాల్కు 1.378 టీఎంసీలు కేటాయించారు. మొదట పీఏబీఆర్, ఎంపీఆర్లో నీటిని నిల్వ చేసుకుని తర్వాత కోటా మేర కాలవలకు నీటి విడుదల ప్రారంభిస్తామన్నారు. హెచ్చెల్సీ మెయిన్ కెనాల్, జీబీసీకి ఈ నెల 6న నీటిని విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. సమావేశంలో మంత్రి పరిటాల సునీత, మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, విప్ యామినీబాల, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు, హెచ్చెల్సీ ఎస్ఈ మక్బూల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. జీబీసీకి రేపు నీటి విడుదల అసాధ్యం: జీబీసీకి రేపు నీటి విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అయితే కాలవ ఉన్న పరిస్థితుల్లో వెంటనే నీటి విడుదల సాధ్యం కాదని పనులు చూస్తే స్పష్టమవుతుంది. ఈ పనులను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేస్తోంది. వీరికి నీటి విడుదల తేదీ 23 అని ప్రభుత్వం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాలవలో మట్టి ఉంది. దీన్ని తొలగించాలంటే కనీసం 15–20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మంత్రి దేవినేని మాత్రం రేపు జీబీసీకి నీళ్లస్తామని ప్రకటించడం గమనార్హం. ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి: ‘‘జిల్లాలో కరువు తీవ్రంగా ఉంది. కరువు మండలాలను ఏమైనా గుర్తించారా?’’ అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు. మంత్రి కాలవ: మీరు కరువు మండలాల గురించి మాట్లాడకూడదు. ఎమ్మెల్యే విశ్వ: ఏడాదికి ఒకసారి సమావేశం జరుగుతుంది. విపక్షపార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఉంటే కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ఎలా? కాలవ: వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే అనంతపురానికి, రాయలసీమకు నీళ్లు వచ్చేవి కావు. చంద్రబాబే నీళ్లు తీసుకొచ్చారు. విశ్వ: చనిపోయిన వ్యక్తి పేరును ప్రస్తావించకూడదనే సంస్కారం కూడా లేదా. వైఎస్ హయాంలో హంద్రీనీవా 75శాతం పూర్తయితే ఇప్పటి వరకూ మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. 2012లోనే జీడిపల్లికి నీళ్లొచ్చాయి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందా? హంద్రీనీవా సామర్థ్యాన్ని 5టీఎంసీలకు తగ్గించి తాగునీటి ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చారు. 40టీఎంసీలతో వైఎస్ పనులు చేసి నీళ్లు తెచ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 54వేల క్యూసెక్కులకు వైఎస్ పెంచారు. అనంతపురం కరువు జిల్లా అని సొంత జిల్లా కేసీ కెనాల్కు వెళ్లే నీటిలో 10 టీఎంసీలను హెచ్చెల్సీ ద్వారా అనంతకు కేటాయిస్తూ వైఎస్ జీఓ ఇచ్చారు. ఆ నీళ్లే ఇప్పటికీ ‘అనంత’కు అందుతున్నాయి. పోలవరానికి రూ.5వేల కోట్లు వైఎస్ హయాంలోనే ఖర్చు చేశారు. కుడి కాలవను కూడా ఆయన హయాంలోనే పూర్తి చేశారు. నాలుగేళ్లుగా టీడీపీ అధికారంలో ఉన్నా హంద్రీ–నీవా నీళ్లు జిల్లాకు వస్తుంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేక, ఒక్క ఎకరానూ తడపలేకపోయారు. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములైనా మీరు వైఎస్ గురించి మాట్లాడుతారా? .. విశ్వేశ్వరరెడ్డి నేరుగా సంధిం చిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాలవ సహనం కోల్పోయి సంబంధం లేని విషయాలను మాట్లాడారు. ఇంతలో మంత్రి దేవినేని ఉమాతో పాటు ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించారు. -
అనుభవం మోసాన్ని పసిగట్టలేకపోయిందేం?
ఉరవకొండ: ‘‘రాష్ట్రాన్ని పాలించడంలో తనకు అపారమైన అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మోసగించిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. నాలుగేళ్ల పాటు కేంద్రాన్ని భుజానికెత్తుకుని ఎన్నికల వేళ ప్రజల ముందు మొసలి కన్నీరు కార్చడం ఆయనకే చెల్లు. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని గొప్పగా చెప్పుకునే ఆయన అనుభవం ప్రత్యేక హోదాను సాధించడంలో ఏమైంది.’’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనను ప్రజలకు తెలియజెప్పేందుకే ఈనెల 2న అనంతపురంలో ‘వంచనపై గర్జన దీక్ష’ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులు, తమ పదవులను తృణప్రాయంగా వదిలేసిన తాజా మాజీ ఎంపీలు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు దీక్షలో పాల్గొంటారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు గత నాలుగేళ్లుగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారన్నారు. హోదా అంశం ఇప్పటికీ సజీవంగా ఉందంటే అది తమ నేత అంకితభావం వల్లేనన్నారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించిందేమి చంద్రబాబు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 29 సార్లు డిల్లీకి వెళ్లారని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా చెప్పుకుంటున్నారని, అయితే ఆయన ఏమి సాధించారో ప్రజలకు వివరించాలన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కేంద్రాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయని విధంగా మోదీ సర్కారు అభివృద్ధి చేసిందని చెప్పిన నోటితోనే ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అడగటం వెనుక దురుద్దేశం ప్రజలకు తెలియనిది కాదన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోరు ఉద్ధృతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు ప్రాణాలకు తెగించి పోరాడుతామన్నారు. ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ధర్నాలతో పాటు కేంద్రంపై అవిశ్వాసం కుడా ప్రవేశపెట్టామన్నారు. ఐదుసార్లు రాష్ట్ర బంద్లు, ఎంపీల రాజీనామాతో వైఎస్సార్సీపీ పోరాటం ప్రజలను ఆలోచింపజేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తేజోనాథ్, చేనేత విభాగం రాష్ట్ర నాయకులు మిడతల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఈడిగప్రసాద్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
విపక్షంపై బురద చల్లడమే బాబు పని
కూడేరు: రాష్ట్రాభివృద్ధిని మరిచి విపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడమే పనిగా సీఎం చంద్రబాబు పెట్టుకున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి, అనంతపురం పార్లమెంట్ సమన్వయ కర్త పీడీ రంగయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ క్రిష్టప్ప విమర్శించారు. మంగళవారం కూడేరులో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసులకు భయపడే నైజం జగన్లో లేదన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడడం బాబు అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధనకు పలుమార్లు ఢిల్లీలో దీక్షలు, ఆందోళనలు జగన్ చేపట్టారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి ఎంపీల చేత రాజీనామా చేయించిన ఘనత కూడా జగన్దేనన్నారు.ప్రత్యేక హోదా సాధన కోసమంటూ ధర్మపోరాటం పేరిట చంద్రబాబు దీక్ష చేపట్టి రూ.30 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. కేసులకు భయపడకుండా ఉంటే కోర్డు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నారంటూ బాబుని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో కోట్లాది రూపాయలు దోచుకున్నారని, అమరావతి నిర్మాణం డిజైన్ కోసం ఇతర దేశాలకు ప్రత్యేక విమానాల్లో తిరిగి సుమారు రూ.100 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. -
ఎకరాకు రూ. 70వేలు ఇవ్వాలి
సాక్షి, అనంతపురం : పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం బెలుగుప్ప మండలంలోని రామసాగరం, దుద్దేకుంట గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న అరటి, మామిడి తోటలను ఆయన పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వెయ్యి హెక్టార్లలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, గత ఏడాదిలో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 70వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫమైందని ధ్వజమెత్తారు. గత కొద్ది కాలంగా అరటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వమే ఉచితంగా విత్తన మొక్కలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందంటూ విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు. -
29 సార్లు ఢిల్లీకి వెళ్లిఏం సాధించారు..
ఉరవకొండ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరే కారణమని వక్తలు అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల పాటు హోదా మాటెత్తని చంద్రబాబు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు హోదా రాగం అందుకున్నాడన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉరవకొండలోని తొగటవీరక్షత్రియ కళ్యాణ మండపంలో స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ‘‘ఏపీకి ప్రత్యేక హోదా...విభజన హామీల అమలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. విద్యావేత్త డి.ఎర్రిస్వామి అధ్యక్షతన జరిగిన సదస్సులో మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఉద్యమంలో తమపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతున్నారన్నారు. హోదా కోసం రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్రం ప్యాకేజీ అంటే చంద్రబాబుకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోదని కేంద్రం డ్రామా ఆడిందనీ, అప్పుడు చంద్రబాబు కనీసం ఆర్థిక సంఘం సభ్యులతో ఆరా తీశారా అంటూ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసుకు భయపడి 85 రోజులు అసెంబ్లీకు రాలేకపోయారన్నారు. హోదాను ఇంకా సజీవంగా ఉంచింది వైఎస్ జగన్మాత్రమేనన్నారు. అన్నీ వర్గాలను కలుపుకోని చంద్రబాబు పోరాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. హోదా ఉద్యమం మరింత ఉధృతం చేసేందుకు అందురూ ముందుకు రావాలని కోరారు. సదస్సులో విశ్రాంత బ్యాంకు మేనేజర్ ఓబులేసు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, జెడ్పీటీసీ సభ్యులు తిప్పయ్య, లలితమ్మ, చేనేత విభాగం నేతలు చంద్రమౌళి, ఎంసీ నాగభూషణం, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రసూల్సాబ్, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి హనుమప్ప, న్యాయవాదులు ఆదినారాయణరెడ్డి, రామ్మోహన్, అధ్యాపకులు ముండాసు ఓబులేసు, డాక్టర్ ఎర్రిస్వామి, డాక్టర్ నారాయణస్వామి పాల్గొన్నారు. -
బాబూ.. ప్రజల పక్షాన నువ్వెప్పుడున్నావ్..?
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రాష్ట్రం వైపు ఉన్నాయా.. కేంద్రం పక్షమా అని చంద్రబాబు అడగడం సిగ్గుచేటన్నారు. అసలు చంద్రబాబు రాష్ట్ర ప్రజల పక్షానికి ఎప్పుడొచ్చారో చెప్పాలన్నారు. మూడున్నరేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శిస్తే వారి వెనుక బీజేపీ ఉన్నట్లు చిత్రీకరిస్తారా? అని మండిపడ్డారు. ప్రత్యేకహోదా సెంటిమెంటు అందరిలోనూ నాటుకుపోయిందన్నారు. ఈ సమయంలో మేల్కోకుంటే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని భయపడే చంద్రబాబు ప్లేటు ఫిరాయించారన్నారు. తనస్వార్థం కోసం ప్యాకేజీకి అంగీకరించి ఇప్పుడేమో మోసపోయామంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారన్నారు. ముందునుంచి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ ఉద్యమిస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో హోదా ఉద్యమాలు జరిగితే పీడీ యాక్ట్లు, కేసులు పెట్టడమే కాకుండా హేళనగా మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. చీకటిలో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటన్నారు. ఈ విషయంలో ఏ పార్టీతోనైనా కనీసం చర్చించలేదన్నారు. తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అనుకూల మీడియా రక్షిస్తుందన్న అహంకారంతో చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ పర్యటించి ఏం సాధించారని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయిరెడ్డిని విజయ్మాల్యాతో పోల్చడం ఏంటన్నారు. ఆయనేం దేశం వదిలివెళ్లలేదని ౖతనపై బనాయించిన అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలోనే నిర్దోషిగా నిరూపించుకుంటారన్నారు. టీడీపీలో ఉన్న సుజనాచౌదరి, దీపక్రెడ్డి, నారాయణరెడ్డి ఆర్థిక నేరగాళ్లు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి సీఎం సమాధానం చెప్పాలన్నారు. జన్మభూమి కమిటీల నుంచి సీఎం వరకు అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారన్నారు. జనసేన అధినేత పవన్కళ్యాణ్ కూడా చంద్రబాబు కేబినేట్, తనయుడు అవినీతిపై మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రబాబు కొడుకుపై అవినీతి అనేలోగా అమిత్షా కొడుకు గుర్తుకొచ్చాడా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారైనా అఖిలపక్షం వేశారా అని అడిగారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కార్యదర్శులు ఈడిగ ప్రసాద్, నిరంజన్గౌడ్, తేజోనాథ్, నాయకులు రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగా సింగపూర్ సినిమానే
ఉరవకొండ: రాష్ట్రం విభజన అనంతరం ము ఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలన లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి అందరికీ సింగపూర్ సినిమా చూపారని వైఎస్సార్ సీపీ రాయ చోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. సింగపూర్ లాంటి అమరావతి నిర్మిస్తామంటూ అం దరకీ అరచేతిలో స్వర్గం చూపారన్నారు. సాగునీటి కోసం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ‘జల సంకల్పయాత్ర’ బుధవా రం వజ్రకరూరు మండలంలోని పొట్టిపాడు గ్రామం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డిని కలుసుకుని సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి విశ్వతో పాటు పాదయాత్ర చేపట్టారు. అనంత రం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మా న్యం ప్రకాష్ అధ్యక్షతన వజ్రకరూరులో జరిగిన బహిరంగ సభలో శ్రీకాంత్రెడ్డి మాట్లాడారు. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో కేం ద్రం ఇచ్చిన రూ.4,800 నిధులతోనే ఆద ర్శ రాజధానిని నిర్మించగా.. చంద్రబాబు మాత్రం తాత్కలిక రాజధాని కడుతానం టూ కేంద్రం నుంచి వచ్చిన రూ. 3,500 కోట్లును దుర్వినియోగం చేశారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటాలతో భయపడిన చంద్రబాబు హోదాపై యూటర్న్ తీసుకుని డ్రామాలు ఆడుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తారని, అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ఆయన ఎన్నో సార్లు నిలదీశాడన్నారు. రైతుల పక్షాన ఆయన చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. రూ.300 కోట్లు ఖర్చు చేస్తే ఆయకట్టుకు నీరు : ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 90 శాతం పూర్తయిన హంద్రీనీవా కాలువ పనుల్లో మిగిలిన 10 శాతం డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు పూర్తి చేస్తే 80 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయడానికి రూ.300 కోట్లు పెడితే ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్ తన హయాంలో హంద్రీనీవా కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తే... చంద్రబాబు రూ.100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. హంద్రీనీవాకు నీళ్లిచ్చి రైతులకు ఆదుకుంటామని ఎన్నోమార్లు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన చంద్రబాబు...హామీ నిలబెట్టుకోకుండా ప్రజలందరినీ మోసం చేశాడన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు చవ్వా రాజశేఖర్రెడ్డి, తాడిపత్రి నాయకులు పైలా నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో 'ఆయ'కట్
ఉరవకొండ: చంద్రబాబు పాలనలో హంద్రీనీవా పరిధిలోని ఆయకట్టుకు నీరు రాకుండా పోయిందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. అసలు ఆయకట్టుకు నీరివ్వాలన్న చిత్తశుద్ధే ప్రభుత్వానికి లేనట్టుందని దుయ్యబట్టారు. హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో ‘జల సంకల్ప యాత్ర’ పేరిట విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం నింబగల్లుకు చేరింది. సర్పంచ్ వరలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకులు హనుమప్ప, చిదంబరి, రమేష్, ఈశ్వర్, వెంకటేష్, ఓబుళప్ప, శివరాజ్ తదితరులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ మండల కన్వీనర్ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మార్చినాటికి హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని విరుచుకుపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని గతంలో అనేక దీక్షలతో పాటు స్వయంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉరవకొండలో ధర్నాకు దిగినా ఈ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మాకు హక్కుగా ఇవ్వాల్సిన నీటిని ఒక నాయకుడు తాడిపత్రి, మరొకరు బుక్కపట్నం, ధర్మవరానికి తీసుకెళితే మేము చూస్తు ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే కరువు పీడిత అనంతపురం జిల్లాలోని 3.50లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో యువనేత నిఖిల్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ కిసాన్సెల్ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, రైతు విభాగం రాయలసీమ జిల్లాల కన్వీనర్ తరిమెల శరత్చంద్రారెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నారాయణరెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి, వైఎస్సార్సీపీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కె.వి.రమణ, రైతు సంఘం నాయకులు రాజారాం, నరేంద్రబాబు, బీసీ సెల్ నాయకులు అనిల్కుమార్గౌడ్ పాల్గొన్నారు. -
పయ్యావుల కేశవ్ చేతగాని దద్దమ్మ
అనంతపురం : ‘చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కారణమైన అనంత జిల్లాను పూర్తిగా విస్మరించారు. నీళ్లివ్వమంటే మోసపూరిత మాటలు చెప్తున్నారు.. మహానేత వైఎస్ పట్టుదలతో శ్రీశైలం నుంచి జీడిపల్లి రిజర్వాయర్కు నీళ్లొచ్చాయి.. టీడీపీ వాళ్లు ఒక అడుగు కూడా నీరు ఇవ్వలేకపోయారు ఉరవకొండ నియోజవర్గానికి నీళ్లు ఎలా ఇవ్వరో చూస్తాం’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆయకట్టుకు హంద్రీ–నీవా నీరివ్వాలనే డిమాండ్తో తొమ్మిది రోజులు తలపెట్టిన ‘జల సంకల్పయాత్ర’ గురువారం బెళుగుప్ప మండలం గుండ్లపల్లి నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు మోసపు మాటలు ఏవిధంగా ఉన్నాయో తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నీరివ్వకుంటే వేలాది మంది రైతులతో పాదయాత్ర చేసి చంద్రబాబు బండారం బయట పెడతాం. వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేస్తాం. 2004లో సీఎం అయిన ఏడాదికే వైఎస్ ఉరవకొండకు వచ్చి హంద్రీ–నీవా పథకానికి శంకుస్థాపన చేసి జీడిపల్లి వరకు రూ. 2,300 కోట్లు ఖర్చు చేశారు. రెండోదశ కూడా దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు వచ్చే నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగేళ్లలోనే వైఎస్ అంత గొప్ప పనులు చేస్తే చంద్రబాబు మాత్రం జీడిపల్లి నుంచి గుండ్లపల్లికి నీరు తీసుకురాలేకపోయారు. రాష్ట్రం విడిపోయిన నాటికి రూ. 90 వేల కోట్లు అప్పులుంటే ఈ మహానుభావుడు వచ్చిన నాలుగేళ్లలోనే రూ.2.20 లక్షల కోట్లకు అప్పులు పెంచేశారు. -
హోదాతోనే మనుగడ
అనంతపురం: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. ఆ తర్వాత ఏపీ పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతోంది. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం పెట్టినా ఏకగ్రీవం అయ్యేందుకు తాము కూడా మద్దతిచ్చాం. వరుసగా రెండేళ్లు తీర్మానం చేసిన తర్వాత సీఎం యూటర్న్ తీసుకున్నారు. అంతా తానే అన్నట్లు నియంతృత్వ పోకడ కనపరుస్తున్నారు. చంద్రబాబు ఎçప్పుడైతే ప్యాకేజీ విషయంలో రాజీపడ్డారో అప్పటి నుంచి బీజేపీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. కేంద్రం, రాష్ట్రం రెండూ దోషులే. కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవడంలో వైఫల్యం చెంది ప్రతిపక్ష పార్టీపై నిందలు వేయడం సరికాదు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం వల్లే ఇంత నష్టం జరిగింది. ఇందుకు ఆయనే బాధ్యత వహించాలి. తన ఫెయిల్యూర్స్ను ఇతరులపైకి నెట్టడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రత్యేకహోదా విషయంలో వైఎస్సార్సీపీ పంథా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ నీతి.. తదితర అంశాలపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. సాక్షి: హోదాపై మీ పార్టీ వైఖరేంటి? విశ్వ:ప్రత్యేక హోదాపై ప్రారంభం నుంచి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే విధానంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర్రం సమైక్యంగా ఉండాలని అందరం కోరుకున్నాం. అయితే విభజన జరిగిపోయింది. అన్యాయంగా విభజిస్తున్నారని గొంతెత్తాం. రాజధాని లేకుండానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తమ అధినేత ఆది నుంచీ చెబుతున్నారు. సాక్షి: రాష్ట్ర ప్రభుత్వం తప్పంతా కేంద్రంపై నెడుతోందంటారా? విశ్వ: ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు. ఆయన వ్యవహారంపై రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బంద్లు, ఆందోళనలు ఊహించని రీతిలో సక్సెస్ కావడమే అందుకు నిదర్శనం. కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన ముఖ్యమంత్రి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజీకి అంగీకరించకుండా.. మెతకవైకరి ప్రదర్శించకుండా ఉంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తప్పకుండా తలొగ్గేది. సాక్షి: ప్రత్యేక హోదా వల్ల ఒరిగిందేమీ లేదన్న చంద్రబాబే ఈ రోజు హోదా అవసరమనే సంకేతాలు లీకుల ద్వారా ఇవ్వడాన్ని మీరెలా సమర్థిస్తారు? విశ్వ: గతంలో హోదా కలిగిన 9 ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ పొడిగించారు. హోదా విలువ తెలిసే ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మళ్లీ పొడిగించుకున్నాయి. మన ముఖ్యమంత్రి మాత్రం ఇది ముగిసిన అధ్యాయం అని చెబుతూవచ్చారు. ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దాన్ని తగ్గించుకునే క్రమంలోనే హోదా పల్లవి అందుకుంటున్నారు. సాక్షి: కేంద్రం కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటారా? విశ్వ:నిధులు ఇచ్చేటప్పుడు కేంద్రం కూడా తన రాజకీయ ప్రయోజనాలు చూస్తుంది. తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలకు రైల్వే నిధులు కాని, ప్యాకేజీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రంలో పెద్ద ఉపయోగం లేదు కాబట్టి సహజంగానే తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపుతోంది. అలాంటప్పుడు కేంద్రం ఉదారంగా ఇస్తుందని ఆశించలేం. ఒత్తిడి పెంచితే ఏదైనా లాభం ఉంటుంది. తమ అధినేత జగన్ అనేకమార్లు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లండి సపోర్ట్ చేస్తామని చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. సాక్షి: చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించకపోవడం వెనుక ఉద్దేశమేమనుకుంటారు? విశ్వ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సమయంలో పట్టుబడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా లొంగుబాటును ప్రదర్శించారు. పదేళ్లు హైదరాబాద్లో ఉండడానికి అవకాశం ఉన్నా రాత్రికిరాత్రే విజయవాడకు వచ్చేశారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఓటుకు నోటు కేసు భయంతో 85 రోజులు సెక్రటేరియేట్కు వెళ్లలేదు. బహుశా ఇన్ని రోజులు సెక్రటేరియేట్కు వెళ్లని ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరేమో. సాక్షి: ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తామని చెబుతున్న పవన్కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల మీ స్పందనేంటి? విశ్వ: పవన్కళ్యాణ్ గురించి ఈ మూడేళ్లలో చూశాం. ఆయన కష్టపడే మనిషికాదు. ఇతరులపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు డైరెక్షన్లో రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అనేక ఉద్యమాలు నీరుగార్చుతూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారు. సాక్షి: జిల్లాకు వచ్చిన పవన్ కొందర్నే కలవడాన్ని ఏమనుకుంటారు? విశ్వ:ఇక్కడ తీవ్రమైన కరువు ఉంది. అధికారంలో ఉన్న వారి ఇళ్లకు పోవడం వెనుక ఆంతర్యం ఆయనకే తెలియాలి. జిల్లా కరువుపై పోరాటాలు చేసిన అనేక పార్టీలు ఉన్నాయి. స్వతంత్ర సంస్థలు, కవులు, రచయితలు ఉన్నారు. అయితే కేవలం అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలనే కలిశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి మద్ధతుగా నిలవడాన్ని ఆయన అభిమానులు కూడా తట్టులేకపోతున్నారు. సాక్షి: సీమ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందా? విశ్వ: అన్ని రకాలుగా వెనుకబడిన రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాల అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఇవ్వాలని విభజన సమయంలో హామీ ఇచ్చారు. ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో ఆయా ప్రాంతాల విషయాలనే మరిచిపోయారు. సాక్షి: కొత్త రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని ఇచ్చిన హామీ అమలవుతోందా? విశ్వ: రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం అభివృద్ధి కేంద్రీకరించడమే. తెలంగాణ కంటే రాయలసీమ జిల్లాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయంటూ స్వయంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. వేలాది మంది నుంచి వినతులు స్వీకరించి, స్వయంగా పరిశీలించిన శివరామకృష్ణన్ కమిటీ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని స్పష్టం చేసింది. కానీ చంద్రబాబు ఎవరి మాటా వినకుండా అభివృద్ధిని అమరావతికే పరిమితం చేస్తున్నారు. సాక్షి: సీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని జరుగున్న ఉద్యమంపై మీ స్పందన? విశ్వ: చంద్రబాబు పాఠం నేర్చుకోవాలి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చేస్తున్న డిమాండ్ చాలా న్యాయమైనది. దీనిపై సీఎంతో చర్చించడానికి అమరావతికి లాయర్లు వెళితే కలవడానికి కూడా నిరాకరించడం బాధాకరం. న్యాయవాదుల ఉద్యమానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. సాక్షి: హోదాకు ప్రత్యేక ప్యాకేజీ సమానమేనా? విశ్వ: అసలు కానేకాదు. ప్రత్యేక హోదా లేకపోతే పరిశ్రమలు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, వివిధ పన్నుల రూపంలో ఏటా రూ.60 వేల కోట్ల ఆదాయం నష్టపోతాం. ఈ ఏడాది ప్యాకేజీ కింద చంద్రబాబు అడిగింది రూ.3,900 కోట్లు. అందుకే హోదాకు, ప్యాకేజీకి ఎలాంటి సంబంధం లేదు. ప్యాకేజీ అంటే ఏదో కొంత నిధులు వస్తాయి. అదే హోదా ఇన్తే అనేక రాయితీలు వర్తిస్తాయి. తద్వారా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 11 అనుభవ రాష్ట్రాల్లో ఇది నిరూపితమైంది. సాక్షి: రాష్ట్రాభివృద్ధికే విదేశీ పర్యటనలు చేస్తున్నానని సీఎం చెబుతున్నారు? విశ్వ: ప్రత్యేక హోదా రాకుండా ఎన్నిమార్లు విదేశీ పర్యటనలు చేసినా ఫలితం శూన్యం. రాష్ట్ర విభజన తర్వాత చాలా తీవ్రమైన సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. కీలకమైన రాజధాని నిర్మాణం, నదీజలాలు, తెలుగు రాష్ట్రాల మధ్య వచ్చిన సమస్య, విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలోనూ సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. చివరికి అసెంబ్లీ కూడా నడపలేని స్థితికి సీఎం చేరుకున్నారు. -
‘చంద్రబాబు-పవన్ నాటకాలు ఆపాలి’
సాక్షి, అనంతపురం: ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గటం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబును ఆయన పొలిటికల్ పార్టనర్ పవన్ కళ్యాణ్ ఒప్పించాలన్నారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ నాటకాలు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని పునరుద్ఘాటించారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్కు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్ చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 వరకు వివిధ దశల్లో పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఆయన ప్రకటించారు. -
సీమ అభివృద్ధికి ఐక్య పోరాటం
అనంతపురం రూరల్: రాయలసీమ అభివృద్ధికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి అద్యక్షతన గురువారం న్యాయవాదులు చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలకు ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం, నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, రాయలసీమ విమోచన సమితి నాయకులు సీమ కృష్ణ, నిరుద్యోగ సంఘం నాయకులు టి.పి.రామన్న, పీఎస్వో విద్యార్థి సంఘం, కుల సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. శిబిరంలో విశ్వ, అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా సెక్షన్4 ప్రకారం హైకోర్టును రాజధాని ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీమకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో అభివృద్ధిని హైదరాబాద్ చుట్టూ కేంద్రీకరించడం వల్ల విభజన తర్వాత అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని గుర్తు చేశారు. మరోసారి అదే తప్పుని సీఎం చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటయ్యే వరకూ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఫలించిన ఎమ్మెలే విశ్వ పోరాటం
ఉరవకొండ: పట్టణంలోని అర్హులైన పేదలకు జానెడు జాగా ఇప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి దశలవారిగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వైఎస్సార్సీపీ అధినేత, ప్రతి పక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డినే స్వయంగా ఉరవకొండ తీసుకొచ్చి ఇంటి పట్టాల కోసం ధర్నా చేయించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారు. ఓ వైపు ప్రజా పోరాటాలు సాగిస్తూనే.. మరోవైపు పేదలకు న్యాయం చేయడానికి మూడు నెలల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అర్హులైన వారికి ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిల్ దాఖలు చేయాలని కూడా సూచించింది. కోర్టు ఆదేశాలతో స్పందించి ఆర్డీఓ, ఇతర అధికారులు పేదల ఇంటిపట్టాల ప్రక్రియను ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. 2008లో మహనేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వ హయంలో ఉరవకొండ పట్టణంలోని నిరుపేదలకు ఇంటిపట్టాలు ఇవ్వడానికి 88 ఎకరాల స్థలాన్ని రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత పేదలకు పట్టాలు పంచి పెట్టడంలో టీడీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అటు ప్రభుత్వంపై ఇటు ఉన్నతాధికారుల పై ఒత్తిడి తీసుకురావడంతో ఇంటిపట్టాల పంపిణీ ప్రక్రియకు ఇప్పటికి మోక్షం కల్గింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోరాటాల వల్లే తమకు ఇళ్ల పట్టాలకు మార్గం సుగమం అయిందని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఏళ్లు గడుస్తున్నా నీరివ్వరేం?
సాక్షి, అనంతపురం: హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టుకు నీటి ని అందించడంలో టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో 80 శాతా నికి పైగా పనులు పూర్తయ్యాయని, అలాంటిది ఈ మూడేళ్లలో కనీసం స్ట్ర క్చర్లు కూడా నిర్మించలేని దౌర్బాగ్య పరిస్థితిలో టీడీ పీ ప్రభుత్వం ఉందన్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్ట్ పురోగతిపై శనివారం స్థానిక హంద్రీ–నీవా కార్యాలయంలో హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రామకృష్ణారెడ్డితో కలిసి ఆ యన మూడు గంటల పాటు సమీక్షించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైంది? ‘ఉరవకొండ నియోజకవర్గంలోని హంద్రీ– నీవా ఆయకట్టుకు నీటి విడుదల అంశాన్ని గతేడాది అసెంబ్లీలో లేవనెత్తాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. మార్చిలోగా హంద్రీ–నీవా ఆయకట్టుకు నీరిస్తామంటూ అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. అయితే పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఆయకట్టు స్ట్రక్చర్ పనులే ప్రారంభించకుండానే మార్చి నాటికి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం సాధ్యమవుతుందా?’ అని ఎస్ఈని ప్రశ్నించారు. ఎక్కడి పనులు అక్కడేనా? ‘33వ ప్యాకేజీ పనులు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు పనులు నిలిపేస్తే.. అదనపు రేట్లకు టెండర్లు ఇచ్చుకుంటూ ప్రజాధనం లూటీ చేస్తున్నారే తప్ప పనుల్లో పురోగతి చూపడం లేదు. మొత్తం 11 స్ట్రక్చర్లకు గాను ఐదింటిని మాత్రమే పూర్తి చేశారు. ఒక కిలోమీటర్లు కాలువ బ్లాస్టింగ్ చేయాల్సి ఉందన్నారు. 17 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సిన 34వ ప్యాకేజీలో 45 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తి చేయగలుగుతారు. పని చేయని కాంట్రాక్ట్ సంస్థలను వెంటనే బ్లాక్లిస్టులో పెట్టండి. అవసరమైతే బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 5 కోట్లను జప్తు చేయండి. 36వ ప్యాకేజీలో జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా మొత్తం 80 వేల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. మిగిలిపోయిన పనులకు రూ.55 కోట్లతో చేయాల్సి ఉండగా రూ. 275 కోట్లు పెంచుకుని కొత్త కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. పనులు ఎక్కడా చేపట్టకపోతే అధికారులుగా మీరేమి చేస్తున్నారు’ అంటూ నిలదీశారు. అన్ని చెరువులకు నీళ్లివ్వాలి ఆమిద్యాల లిప్ట్ పనులకు వెంటనే టెండర్లు పిలవడంతో పాటు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. వజ్రకరూరు నుంచి గుంతకల్లు వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి 13 చెరువులను నింపాలన్నారు. ఈ పనులు చేపట్టాలని సూచించారు. అవసరమైతే మొబైల్ లిప్ట్లు తెప్పించి మెయిన్ కెనాల్ నుంచి చెరువులకు నీటిని తరలించాలని కోరారు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకు సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. నిధుల దోపిడీకే టెండర్లు హంద్రీ–నీవా మొదటి దశలో ఐదు శా తం పనులు మాత్రమే పూర్తి చేస్తే ఆయకట్టుకు నీరివ్వచ్చునని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ మూడేళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వకుండా ఉరవకొండ నియోజకవర్గ రైతులను మోసం చేసి కు ప్పంకు నీటిని తీసుకుపోవడానికి ప్రత్నిం చిన చంద్రబాబు, ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బైరవాని తిప్ప ప్రాజెక్టు, పేరూరు డ్యాంలకు నీళ్లిస్తామం టూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉం దని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు డ బ్బులు దాచుకునేందుకు ఈ పనులకు టెండర్లు పిలుస్తున్నారని, గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే అవకాశాలు ఉన్నా లిఫ్ట్లు పెడు తూ రూ. వందల కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేశారని విమర్శించారు. -
ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
-
‘చంద్రబాబుకు రాజకీయ సమాధి కడతారు’
సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తనకు ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను సీఎం అయ్యాక చంద్రబాబు నిర్ధాక్షిణ్యంగా మోసం చేశారని విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, నల్లమడలో వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన బహిరంగసభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘శాసనసభలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల నోరు నొక్కడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రజల మద్ధతుతో మేం ముందుకు సాగుతున్నాం. అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు భారీ సంఖ్యలో తరలివస్తున్న ప్రజానీకమే అందుకు నిలువెత్తు నిదర్శనం. తమ సమస్యలను జననేత వైఎస్ జగన్కు చెప్పుకొనేందుకు ప్రతిచోటా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రజా ప్రతినిధులను గౌరవించడం తెలుసుకోవాలని విశ్వేశ్వరెడ్డి హితవు పలికారు. గౌరవం అంటే కేవలం ఇచ్చేది కాదని ఇచ్చి పుచ్చుకునేదని చంద్రబాబు తెలుసుకోవాలి. గతంలోనూ తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు.. ప్రస్తుతం మూడున్నరేళ్లు అధికారంలో ఉన్నారు. అయినా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను చూస్తే ఎందుకు భయపెడున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను, ఎన్నికైన సర్పంచ్, ఎంపీటీసీలను వదిలేసి కేవలం టీడీపీ నేతలు, కార్యకర్తలకు పనులు అప్పగిస్తూ దళారీ వ్యవస్థను నడిపిస్తారు. చంద్రబాబుకు రాష్ట్ర చరిత్ర తెలుసునా.. టంగుటూరి ప్రకాశం పంతులు, తరిమెల్ల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి లాంటి మహామహులు పుట్టినగడ్డ ఆంధ్రప్రదేశ్ కాగా.. ఇక్కడే పుట్టిన చంద్రబాబు మాత్రం ఎంతో నీచంగా వ్యవహరిస్తున్నారు. అనుభవం ఉందని చెప్పుకోవడం కాదు ప్రజల కష్టాలను తీర్చడమే అసలైన అనుభవం. చంద్రబాబు మోసాలను గుర్తించిన జిల్లా వాసులు వైఎస్ జగన్ పాదయాత్రకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశ్వసనీయత కలిగి ఉన్న నేత వైఎస్ జగన్ను గెలిపిస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని’ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. -
బాబుకు రాజకీయ సమాధి కడతారు
-
ప్రత్యేక హోదాకు బాబే అడ్డంకి..
అనంతపురం: ప్రత్యేక హోదాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుగా ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని అన్నారు. అంతేకాకుండా విభజన చట్టం హామీల అమలుకు బాబు ఏమాత్రం కృషి చేయలేదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ నెల 10న జరిగే యువభేరికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్యాలని ఆయన కోరారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. -
ఏపీలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. 1995 నుంచి 2004 వరకు ఏ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టారో, 2004 నుంచి 2014 వరకు ఎంత ఖర్చు అయ్యిందో బయట పెట్టాలన్నారు. ప్రాజెక్టులపై టీడీపీ నేతలు, మంత్రులు వక్రభాష్యాలు మానుకోవాలని హితవు పలికారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం పనులు దాదాపుగా పూర్తయ్యాయని, రాయలసీమ గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదని మండిపడ్డారు. రాయలసీమకు చంద్రబాబు సీఎంగా ఏం చేశారని ప్రశ్నించారు. -
జల హారతి ప్రచార ఆర్భాటమే
- హంద్రీనీవా ఆయకట్టుకు ఈ ఏడాదైనా నీరివ్వాలి - మూడేళ్లలో ఒక్క ఎకరానూ తడపని దౌర్భాగ్యం - సీమను సస్యశ్యామలం చేస్తామని సీఎం గొప్పలు - ఉరవకొండ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి - ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ - ఫ్యాక్స్ ద్వారా సీఎం దృష్టికి జిల్లా సమస్యలు అనంతపురం సెంట్రల్: కృష్ణా, గోదావరి పుష్కరాల సందర్భంగా జలహారతులు ఇవ్వడం ఆనవాయితీ అని.. శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీళ్లు లేకున్నా ఆర్భాటం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం నగరంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.6,500 కోట్లు ఖర్చు చేసి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశను 95శాతం, రెండవ దశ పనులను 75శాతం పూర్తి చేశారన్నారు. ఫలితంగానే గత ఐదు సంవత్సరాలుగా హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీళ్లొస్తున్నాయని తెలిపారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉందని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయిన ఒక్క ఎకరానూ తడపలేని దౌర్భాగ్య స్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, అసెంబ్లీలోనూ గళం వినిపిస్తే 2016 ఆగస్టుకు నీళ్లు విడుదల చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2017 ఆగస్టు పూర్తయినా ఆ ఊసే కరువయిందన్నారు. ఈ రోజు వరకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ను కూడా నిర్మించిన పాపన పోలేదని మండిపడ్డారు. గతేడాది రూ. 350 కోట్ల విద్యుత్ చార్జీలు చెల్లించి హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకొస్తే రూ.3కోట్ల పంట కూడా పండించలేని పరిస్థితి దాపురించిందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 20వేల ఎకరాలకు డ్రిప్ ద్వారా నీరు ఇస్తామని చెబుతున్నారని.. హంద్రీనీవా ఆయకట్టును ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు. ఆయకట్టును రద్దు చేస్తే రైతులు తిరగబడక తప్పదని హెచ్చరించారు. సీమపై చిత్తశుద్ధి కరువు రాయలసీమ ప్రాంత అభివృద్ధి, రైతాంగ సంక్షేమం విషయంలో చంద్రబాబునాయుడుకు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదన్నారు. 2004కు ముందు హంద్రీనీవా ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసి కిలోమీటరు కాలువ కూడా తవ్వలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 100 టీఎంసీలు నిల్వ చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని గొప్పలు చెప్పారన్నారు. గతేడాది 790 అడుగుల వరకు కూడా నీటిని వదల్లేదన్నారు. 1996లో జీఓ నెంబర్ 69 విడుదల చేసి శ్రీశైలంలో 834 అడుగుల వరకు నీటిని తీసుకోవచ్చని నిర్ణయించిన ఘనత సీఎందని వివరించారు. ప్రస్తుతం జలహారతి కార్యక్రమం ద్వారానైనా జీఓలు మార్చాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో 850 అడుగుల వరకే నీళ్లు తీసుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రాయలసీమ ప్రాజెక్టుల స్థిరీకరణ జరుగుతుందని సూచించారు. కృష్ణా డెల్టాను స్థిరీకరించి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుకు నిఖర కేటాయింపులు చేయాలన్నారు. ఉరవకొండ ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి ఉరవకొండలో నిరుపేద ప్రజలకు ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశంతో 2008లో 89 ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. రూ.కోటి రూపాయలు వెచ్చించి స్థలాన్ని సేకరించారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా ఒక్క ఇళ్లు పట్టా మంజూరు చేయలేదన్నారు. అత్యధిక జనాభా కలిగిన ఉవరకొండను మున్సిపాలిటీ చేయకపోవడం వల్ల అభివృద్ధి అట్టడుగున ఉండిపోయిందన్నారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులతో పాటు ప్రతినెలా సబ్సిడీపై పట్టుదారాలు అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్యాక్స్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. -
కులాలను గుర్తించకపోవడం సిగ్గుచేటు
అనంతపురం కల్చరల్: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటినా తోలుబొమ్మలాట వారికి కుల గుర్తింపు లేకపోవడం సిగ్గుచేటని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సంచార విభిన్నజాతుల దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. స్థానిక కృష్ణ కళామందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్మన్ చమన్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి సంచార జాతుల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార జాతుల జీవన శైలి విభిన్నమైనదని, వారికి రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగిన మాట వాస్తవమన్నారు. చాలా మంది ఓసీ జాబితాలలో కొనసాగుతుంటే తోలుబొమ్మలాట కళాకారులకు అసలు కులమే లేకపోవడం దారుణమన్నారు. అయితే సంచార జాతుల వారి ఐక్యత అభినందనీయమని , న్యాయమైన వారి డిమాండ్ల సాధనకు చట్టసభల ద్వారా కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా సీఎం దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్తామన్నారు. సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి మాట్లాడుతూ తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా, ప్రభుత్వాలు తమను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన పోరాటానికి రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంచార జాతుల సంస్థ జిల్లా అధ్యక్షుడు మారెన్న, బుడగజంగం కుళ్లాయప్ప, జోగి సంఘం వెంకటేష్, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమ్మోరయ్య, బుడబుక్కల సంఘం వన్నూరప్ప, డోలప్ప, పిచ్చిగుంట్ల సంఘం అంజనయ్య, దాసరి సంఘం గోపాల్, తోలుబొమ్మలాట సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, గారెప్ప తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న వేషధారణలు అంతకు ముందు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో తరలివచ్చిన వారితో ర్యాలీ నిర్వహించారు. వివిధ జాతుల వారు తమ కులవృత్తులతో కూడిన వేషధారణలతో ఆకట్టుకున్నారు. స్థానిక కృష్ణకళా మందిరం నుండి టవర్క్లాక్ మీదుగా ఎల్కేపి, సుభాష్రోడ్డు వరకు ర్యాలీ జరిగింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేస్తూ వారు ముందుకు సాగారు. -
టీడీపీ నేతలే ఇన్పుట్ సబ్సిడీ కాజేశారు
-
మంత్రి యనమలపై ఫిర్యాదు చేస్తాం: విశ్వేశ్వరరెడ్డి
నంద్యాల: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. 30 ఏళ్ల సర్వీసుకే ఉద్యోగులను ఇంటికి పంపించేలా జీవోలు తయారు చేయడం దారుణమన్నారు. నంద్యాలలోని శిల్పామోహన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఉద్యోగాలను తగ్గించే కుట్రకు ఏపీ ప్రభుత్వం తెరతీయడాన్ని సాక్షి పేపర్ ఆధారాలతో బయటపెట్టినా ప్రభుత్వ వైఖరిలో మాత్రం మార్పు రాలేదన్నారు. మరోవైపు ‘సాక్షి’పై మంత్రి యనమల రామకృష్ణుడు అసత్య ప్రచారం చేస్తున్నారని, యనమల వ్యాఖ్యలపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. వారి కుట్రను ఆధారాలతో బయటపెట్టిన తర్వాత కూడా తమ తప్పును తెలుసుకుని జీవో నిర్ణయంపై క్షమాపణ చెప్పకపోగా ప్రభుత్వం అదే ధోరణితో నడుచుకుంటున్నారు. ఏపీలో ఖాళీగా ఉన్న 1.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రస్తుత ఉద్యోగులపైనే భారం వేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, ఉద్యోగుల పట్ల, వారి పోరాటల పట్ల తీవ్ర చర్యలు తీసుకుంటుంటూ ప్రభుత్వం వారిని అణిచివేయడంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన తీవ్రమవుతుందని చెప్పారు. ప్రస్తుతం తీసుకురానున్న జీవోలపై కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మా వద్ద ఆధారాలు ఉన్నా కూడా టీడీపీ ప్రభుత్వం మాత్రం తప్పును తెలుసుకోకుండా ఇంకా బుకాయించాలని చూస్తోందన్నారు. 50 ఏళ్ల తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ ఆఖరికి ఉద్యోగులపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. -
రెయిన్గన్లతో కరువును తరమలేరు
ఆచరణ యోగ్యమైన పనులనే తలపెట్టండి – రెయిన్గన్ వినియోగాలపై వర్క్షాప్లో ఎమ్యెల్యే విశ్వ – అధికారపార్టీ ఎమ్మెల్యేలు కనిపించని వైనం అనంతపురం సిటీ : రెయిన్గన్లవును తరిమికొడతాం. పంటకు ప్రాణం పోస్తామంటూ ఆచరణ యోగ్యం కాని కోతలతో ప్రజలను మభ్య పెట్టడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్లోని డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెయిన్గన్ల వినియోగంపై వర్క్షాపు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీతతో పాటు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, యామినీబాల, వరదాపురం సూరి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హారిజవర్లాల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘‘రెయిన్గన్లను వినియోగించాలంటే నీరు కావాలి. నీరు లేకుండా రెయిన్గన్లతో పంటకు రక్షక తడులు ఇవ్వడం కుదరదు. గతేడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల ఎకరాలకు రక్షక తడులిచ్చామని చెప్పింది. కనీసం అవగాహన లేకుండా ప్రజలకు ఇలా చెబితే ఎలా అని కూడా ఆలోచించలేదు. ఫలితంగా అభాసుపాలయ్యారు. ఈ క్రమంలో ముందుగానే ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే ప్రయత్నం చేసింది. మంచిదే...దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఈసారైనా ఆచరణ యోగ్యమైన కార్యాలు చేపట్టండి. ఇక పంట కుంటలతో భూగర్భ జలాలు పెరుగుతాయని చెబుతున్నారు. దీనికి ఎక్కడా శాస్త్రీయ ఆధారాలు లేవు.’’ అన్నారు. సమావేశం అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ గతేడాది తలెత్తిన లోటు పాట్లను సరిదిద్దుకునేందుకు రక్షక తడులను ప్రణాళికా బద్ధంగా అందించాలని వర్కుషాపు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి పట్టిసీమ నుంచి నీటిని తెచ్చి జిల్లాలో తాగు, సాగు నీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణం, తేమ శాతం, నీటి లభ్యత వివరాలను తెలుసుకుంటామన్నారు. బెట్టదశలో ఉన్న పంటను వెంటనే కాపాడుతామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు గతేడాది జిల్లాలో పంటలు ఎండినా ప్రభుత్వానికి తెలియని దుస్థితి. ఈ ఏడాది అలా జరక్కూడదని ముందుగా రైతులకు చేరువుగా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనలను అధికారపార్టీ నేతలు బేఖాతరు చేశారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమావేశానికి అధికార పార్టీ నేతలే డుమ్మాకొట్టారు. ముగ్గురు మంత్రులున్న వేదికపై అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా ఎవరూ కనిపించకపోవడం విమర్శలకు తావిచ్చింది. -
ప్రిన్సిపల్ సెక్రటరీతో ఎమ్మెల్యే విశ్వ భేటీ
కూడేరు : మండలంలో నిరుపయోగంగా ఉన్న సమగ్ర గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించాలంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహార్రెడ్డిని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థించారు. రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం జవహార్రెడ్డిని ఆయన ప్రత్యేకంగా కలిసి, మాట్లాడారు. రక్షిత మంచి నీటి పథకానికి పీఏబీఆర్ డ్యాం వద్ద రూ. 56 కోట్ల వ్యయంతో 11 నెలల క్రితం పనులు పూర్తి చేశారన్నారు. దీనిపై పలుమార్లు ట్రయల్ రన్ కూడా చేశారని గుర్తు చేశారు. వేసవిలో దాహార్తితో 90 గ్రామాల ప్రజలు పడిన ఇబ్బందులను ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరిస్తూ.. ఆ సమయంలో ప్రాజెక్ట్ ప్రారంభించాలంటూ ఆందోళనలు చేపడితే అరెస్ట్లు చేశారే తప్ప నీటి పథకాన్ని మాత్రం ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పయ్యావులు కేశవ్ ప్రమేయంతోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి నోచుకోలేకపోతోందని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. -
గుక్కెడు నీరివ్వలేరా?
- నిలదీసిన ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు - వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయ ముట్టడి - ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ వెన్నపూసతో పాటు పలువురు నాయకుల అరెస్ట్ - ప్రజల దాహార్తి తీర్చలేని చేతగాని ప్రభుత్వమంటూ విశ్వ మండిపాటు అనంతపురం సిటీ : తాగునీటి సమస్యపై ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు కదంతొక్కారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురంలోని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే, పోలీసులు అప్పటికే కార్యాలయానికి తాళం వేసి.. భారీగా మోహరించారు. పీఏబీఆర్ వద్దనున్న తాగునీటి ప్రాజెక్టు ద్వారా నీరు వదలకుండా తాళం వేసుకుంటారా అంటూ పాలకులపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. ఖాళీబిందెలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి కూడా హాజరై.. సంఘీభావం ప్రకటించారు. ఆందోళనను ఉద్దేశించి ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు గుక్కెడు నీరు కూడా ఇవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వమిది అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీఏబీఆర్ వద్ద 2013లో ఉరవకొండ నియోజకవర్గంలోని 90 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చడం కోసం చేపట్టిన తాగునీటి ప్రాజెక్టుకు రూ.56 కోట్ల నిధులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అప్పుడే 99 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 2015 నవంబరు నాటికి పూర్తి కావాల్సిన ఒక శాతం పనులను టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరికి పూర్తి చేసిందన్నారు. అయినా ప్రాజెక్టు నుంచి గ్రామాలకు నీటిని సరఫరా చేయకుండా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అడ్డు పడుతున్నారని విమర్శించారు. ఇదేమీ ఒక్క కేశవ్ కుటుంబ సమస్య కాదన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ ప్రాజెక్టును నిరుపయోగం చేయాలని చూస్తే జనం సహించబోరని హెచ్చరించారు. అభివృద్ధికి ఆటంకంగా మారడం ద్వారా కేశవ్ రాజకీయ జీవిత పతనం మొదలైందన్నారు. ప్రాజెక్టును ప్రారంభించాలంటూ గత నెల 13న కార్యాలయాన్ని ముట్టడించామని, 14న మంత్రి కాలవ శ్రీనివాసులును కూడా కలిశామని గుర్తు చేశారు. 15న కలెక్టర్ జి.వీరపాండియన్ ప్రాజెక్టును సందర్శించినా స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి మాట్లాడుతూ తాను వేసిన రోడ్డులో నడుస్తూ.. తానిచ్చే పింఛన్లతో తింటూ టీడీపీకి ఓటు వేయకుంటే ఎలా అంటూ బెదిరింపులకు దిగుతున్న చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పిచ్చాస్పత్రి లేనందున కేసీఆర్తో మాట్లాడి హైదరాబాద్లోని యర్రగడ్డ ఆస్పత్రిలో చంద్రబాబును చేర్చాల్సిందేనన్నారు. పోలీసుల ఓవరాక్షన్... ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని కలిసేందుకు అవకాశం ఇవ్వండి.. లేదంటే వారినే ఇక్కడకు రమ్మనండి అని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు కోరినా పోలీసు అధికారులు స్పందించలేదు. వందల సంఖ్యలో వచ్చిన పోలీసులు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసి వన్టౌన్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో నేతలకు, పోలీసుల మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం అరెస్టయిన వారందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో కూడేరు జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాజశేఖర్, సర్పంచులు రామకృష్ణ, వెంకటరమణ, కిష్టప్ప, అంజమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రైతులకు పార్టీలను అంటగడతారా ?
- ఇన్పుట్ సబ్సిడీలో అన్యాయం చేస్తే సహించం - 12న వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడిస్తాం - ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విడపనకల్లు : రైతులకు పార్టీలు అంట గట్టి ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే వ్యవహరిస్తున్న వ్యవసాయాధికారుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం విడపనకల్లులో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ కనుసన్నల్లో అధికారులు పని చేస్తున్నారని, అధికారిగా ఉంటూ రైతులకు అన్యాయం చేస్తే సహించమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ఇళ్లలో ఊడిగం చేస్తున్నారా అని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ వాళ్లు చెప్పిన వారికి పంటలు హెక్టారు కన్నా తక్కువ ఉన్నా కూడా 2016 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రు.30 వేలు, రూ.29 వేలు, రూ.27 వేలు ప్రకారం మంజూరు చేశారన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి ఒకే ఇంట్లో 5 మంది ఉంటే అలాంటి వారికి కూడా ఒక్కొక్కరికీ రు. 30 వేల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేశారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న రైతులకు మాత్రం 15 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్న వారికి కూడా రూ.3 వేలు, రూ. 5 వేలు, రూ.6 వేలు మాత్రమే ఇన్పుట్ సబ్సీడీ మంజూరు చేశారని ధ్వజమెత్తారు. అధికారులు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రైతులకు ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేయాలే తప్పా రైతులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. డొనేకల్లు, ఆర్.కొట్టాల గ్రామాల్లో దాదాపు 1500 మంది రైతులు ఉంటే టీడీపీకీ అనుకూలంగా ఉన్న 600 మంది రైతులకు మాత్రమే రు. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసి, మిగతా రైతులకు తీవ్ర అన్యాయం చేశారని ఆక్రోశం వ్యక్తం చేశారు. అధికారుల తప్పుడు గా తయారు చేసిన ఇన్పుట్ సబ్సిడీ జాబితాను సరిచేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసేలా ఈ విషయాన్ని వ్యవశాయ జేడీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. టీడీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరించి ‡రైతులకు అన్యాయం చేస్తే మీరే బలి కావాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. గతంలో కూడా వ్యవసాయాధికారులు హావళిగిలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో తీవ్ర అన్యాయం చేశారని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీనా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడిమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ తిప్పయ్య, వైఎస్సార్సీపీ కిసాన్సెల్ నాయకులు గోపాల కృష్ణ, డొనేకల్లు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
కనికరం లేని ప్రభుత్వం
►మూడేళ్లలో ఒక్క ఇల్లూ నిర్మించలేదు ►ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం ►రైతుల కోసం ఎన్ని పాదయాత్రలైనా చేస్తాం : మాజీ ఎంపీ అనంత ►నార్పలకు చేరిన జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర అనంతపురం : ‘వరుస కరువులతో అల్లాడిపోతున్న జిల్లా రైతులు ఉపాధి కోసం కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాలకు వలసలు వెళ్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదు. వారందరూ కార్లు, బైకుల కొనుగోలుకు, అధిక సంపాదన కోసం వెళ్తున్నారంటూ అవమానిస్తోంది. ఈ ప్రభుత్వానికి కాస్తయినా సిగ్గులేదు. కరువు ప్రాంతంపై కనికరం లేద’ని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన ‘మేలుకొలుపు’ పాదయాత్ర సోమవారం సాయంత్రం నార్పల మండల కేంద్రానికి చేరుకుంది. పట్టణ ప్రధాన కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ప్రజలు భారీగా తరలివచ్చారు. వారినుద్దేశించి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు పాలనపై ప్రజావ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో పద్మావతి పాదయాత్రకు లభిస్తున్న విశేష స్పందనే నిదర్శనమన్నారు. టీడీపీకి ఓట్లు వేసి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. చంద్రబాబు ఈ మూడేళ్లలో ఒక్క ఇల్లయినా నిర్మించారా అని ప్రశ్నించారు. అ అంటే అమరావతి, ఆ అంటే ఆదాయం అని మనవడికి నేర్పిస్తున్నాడంటే సంపాదనపై బాబుకు ఎంత యావ ఉందో అర్థమవుతోందన్నారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొల్పేందుకే పద్మావతి పాదయాత్ర చేస్తున్నారన్నారు. కరువు పేరు చెప్పి అధికార పార్టీ నేతలు రూ. కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉపాధి కోసం వలసలు వెళ్తుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే ఆయన కుటుంబంపై ఆరోపణలు చేస్తారా? బెదిరింపు ధోరణికి దిగుతారా? ఏం భయపడతామని అనుకుంటున్నారా? అలాంటి ప్రసక్తే లేద’ని అన్నారు. వైఎస్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉండేవారని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చిన తర్వాత వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కరువు పేరుతో వచ్చిన పనుల్లో జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. రైతులు, ప్రజల కోసం ఎన్ని పాదయాత్రలైనా చేపడతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి మాట్లాడుతూ మాటంటే ముఖ్యమంత్రి సింగపూర్ అంటున్నారని, శింగనమల నియోజకవర్గమంత లేని సింగపూర్ దేశంతో రాష్ట్రాన్ని ఎలా పోలుస్తారని ప్రశ్నిం చారు. చంద్రబాబు దోపిడీకి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో అబద్ధపు హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారన్నారు. బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఆయనకు.. ప్రజలను వెన్నుపోటు పొడవడం పెద్ద సమస్య కాదన్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని, వారిని వేరు చేయలేరని చెబుతుంటారని... అయితే వైఎస్సార్సీపీకి ఓట్లు వేయడం వల్ల వారిద్దరిని వేరు చేసి కరువును కూడా పారదోలవచ్చన్నారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చీపుర్లు పట్టి మరీ దోస్తున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ అవకాశం ఇవ్వరని తెలిసే అందినకాడికి దోచుకుంటున్నారన్నారు. జేసీ సోదరులు సభ్యత,సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత మాట్లాడుతూ చంద్రబాబు వస్తే వర్షం వస్తుందో, రాదో తెలీదుకాని కరువు మాత్రం తప్పకుండా వస్తుందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారన్నారు. జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ పాదయాత్రకు నియోజకవర్గ ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. దారి పొడవునా ప్రజలు సమస్యలపై ఏకరువు పెడుతున్నారన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా...లేరా అనే సందేహం తలెత్తుతోందన్నారు. వైఎస్సార్సీపీ నార్పల మండల కన్వీనర్ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధనుంజయయాదవ్, గువ్వల శ్రీకాంత్రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్పీరా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు పాల్గొన్నారు. -
పాదయాత్రతో ప్రభుత్వాన్ని మేలుకొలపాలి
- ఎమ్మెల్యే విశ్వ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ - ‘మేలుకొలుపు పాదయాత్ర’ పోస్టర్ల ఆవిష్కరణ అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టబోయే పాదయాత్రతో ప్రభుత్వాన్ని మేలుకొలపాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పిలుపునిచ్చారు. శింగనమల నియోజకవర్గంలో ఈనెల 24 నుంచి చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి వాల్పోస్టర్లను బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో శింగనమల నియోజకవర్గాన్ని వందేళ్ల వెనక్కు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. తుంగభద్ర హెచ్ఎల్సీ కింద జిల్లాలో ఉన్న ఆయకట్టులో దాదాపు సగం శింగనమల నియోజకవర్గంలోనే ఉందన్నారు. మూడేళ్లలో ఈ ఆయకట్టుకు కనీసం ఆరుతడి పైరుకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. గతేడాది హెచ్ఎల్సీ, హంద్రీనీవాకు 36 టీఎంసీల నీళ్లు వచ్చినా ఒక ఎకరాకు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎక్కడో ఉన్న గొల్లపల్లికి నీళ్లు పోయాయని, హెచ్ఎల్సీ సిస్టం కింద కూతవేటు దూరంలో ఉన్న శింగనమల, బుక్కరాయసముద్రం చెరువులతోపాటు నియోజకవర్గంలో ఏ ఒక్క చెరువుకూ నీళ్లివ్వలేదని విచారం వ్యక్తం చేశారు. కూలీలను ఇంకుడు గుంతలకు మాత్రమే పరిమితం చేసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ నాయకులు మాత్రం కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఉపాధిహామీ పనులను జేసీబీలతో చేయించి రూ.కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. నిరంతర ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్న అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈనెల 26 నుంచి జూన్ 4 వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. చివరిరోజు గార్లదిన్నెలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యల్లనూరు జెడ్పీటీసీ కేవీ రమణ, పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాకే రామకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్రెడ్డి, నార్పల, పుట్లూరు, శింగనమల మండలాల కన్వీనర్లు రఘునాథరెడ్డి, రాఘవరెడ్డి, చెన్నకేశవులు, మార్కెట్యార్డ్ మాజీ ఉపాధ్యక్షుడు ముసలన్న, జిల్లా కమిటీ మెంబరు అమ్మవారిపేట రామ్మోహన్రెడ్డి, బొమ్మలాటపల్లి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
సీమ నుంచి 10 లక్షల మంది వలసెళ్లారు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చి..రైతులను ఆదుకోవాలి రైతుధర్నాలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి బెళుగుప్ప : వరుస కరువులతో సతమతమవుతున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం బెళుగుప్ప తహసీల్దార్ కార్యాలయం ముందు స్థానిక సర్పంచ్ రామేశ్వరరెడ్డి అధ్యక్షతన రైతుధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా మాట్లాడారు. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అనంతపురం ఒకటని గుర్తు చేశారు. జిల్లా సాధారణ వర్షపాతం 520 మిల్లీమీటర్లు కాగా, గత ఏడాది 250 మి.మీ మాత్రమే నమోదైందన్నారు. దీనివల్ల నల్లరేగడి భూముల్లో విత్తనం కూడా పడలేదన్నారు. కరువు విలయతాండవం చేస్తున్నా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఇప్పటికే రాయలసీమ నుంచి పది లక్షల మంది వలసలు వెళ్లారన్నారు. వారిని ఆదుకోకపోగా, అధిక ఆదాయం కోసమే వెళుతున్నారని అధికార పార్టీ నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఎక్కడైనా ఫ్యాక్టరీలకు నష్టం జరిగితే రూ.కోట్ల బీమా చెల్లిస్తారు గానీ, పంట నష్టపోయే రైతులకు మాత్రం ప్రీమియం కూడా తిరిగివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో పంట రుణాలు రెన్యూవల్ చేయించలేని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. వారు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన మిర్చి, వేరుశనగ, పసుపు, చీనీ, వరి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలన్నారు. హంద్రీ-నీవా మొదటిదశ కింద డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి ఉరవకొండ నియోజకవర్గంలో 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని, ఊటనీటితో ఇబ్బందులు పడుతున్న జీడిపల్లి వాసులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రైతు ధర్నాలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బెళుగుప్ప మండల కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, బెళుగుప్ప సింగిల్విండో అధ్యక్షుడు శివలింగప్ప, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దుద్దేకుంట రామాంజినేయులు, మండల మహిళా అధ్యక్షురాలు అంకంపల్లి యశోదమ్మ, ఎర్రగుడి సర్పంచ్ అనిత, మండల ప్రధాన కార్యదర్శ అశోక్, ఎస్సీసెల్ కన్వీనర్ తిప్పేస్వామి, రైతు విభాగం నాయకులు భాస్కర్రెడ్డి, సుదర్శనరెడ్డి, మచ్చన్న, నంజుండప్ప, రవీంద్ర, కేసీ తిప్పేస్వామి, శ్రీశైలప్ప తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఇంకుడు గుంతల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. అనంతపురంలో రైతులు నానాకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. కరువును తట్టుకోలేక పెడ్డ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కరువు నివారణ చర్యలు చేపట్టి రైతులకు ఉపాధి మార్గం చూపించాలని డిమాండ్ చేశారు. కరువు దెబ్బకు బ్రతకుదెరువు కోసం లక్షల మంది రైతన్నలు పొట్టచేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసవెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. అనంతపురంలో హంద్రీనీవ పెండింగ్ పనులను, డిస్టిబ్యూటరీలను త్వరితగతిన పూర్తిచేసి ఆయకట్టు ద్వారా రైతులకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై ఏది?’
హైదరాబాద్: ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అసమర్థత, మెతక వైఖరి కారణంగా తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు విఫలం అయ్యారని చెప్పారు. నీరు, నిధులు, ఆస్తుల పంపకాల్లో చంద్రబాబు ఇంకా మెతక వైఖరినే అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని, రైతులు కరువు కాటకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దిగజారిన ప్రివిలేజ్ కమిటీ గౌరవం
⇒ రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్కు కమిటీ సిఫార్సు ⇒ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, పుష్పా శ్రీవాణి ధ్వజం సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మె ల్యే ఆర్కే రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడం అత్యంత దురదృష్టకరమైన విషయమని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ నిర్ణయం ప్రివిలేజ్ కమిటీ గౌరవాన్ని దిగజారుస్తుందన్నారు. కక్షసాధింపు, రాజ కీయ వ్యతిరేకతతో చేసిన సిఫార్సులుగా ప్రజ లు భావిస్తున్నారన్నారు. సంవత్సరం నాలుగు నెలలపాటు ఆమె సస్పెన్షన్ పూర్తయ్యాక మరోసారి ఏడాదిపాటు పొడిగించాలనే సిఫార్సులు ఇంత ఆలస్యంగా రావడం దురుద్దేశ పూరితమైనవన్నారు. విజయవాడ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాల్మనీ సెక్స్ రాకెట్ విషయంలో ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆ కేసులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లున్నాయి. ఇవన్నీ గతంలో సభలో చర్చకు రాబోతున్న సమయంలో ఎమ్మెల్యే రోజా గొంతునొక్కాలనే ఉద్దేశంతో ఏడాదిపాటు సస్పెన్షన్ వేటేశారు. ఆమెను ఎదుర్కొనే ధైర్యంలేక పిరికి పందల్లాగా మరో ఏడాది సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీన్ని తక్షణమే విరమించు కోవాలి’’ అని సూచించారు. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారం వ్యక్తం చేసినా మనస్ఫూర్తి గా విచారం వ్యక్తం చేయలేదని కమిటీ చెప్పడం దారుణమన్నారు. ఎమ్మెల్యే రోజా చేసిన తప్పేంటి? ఎమ్మెల్యే రోజా చేయని తప్పునకు 14 నెలలపాటు శిక్ష అనుభవించారని, అసలామె చేసిన తప్పేంటని కురుపాం ఎమ్మెల్యే పుష్పా శ్రీవాణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘టీడీపీ ప్రభుత్వంలో తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఖండించినందుకా? ర్యాగిం గ్కు బలైపోయిన రిషితేశ్వరి కుటుంబానికి అండగా ఉన్నందుకా? ‘కాల్మనీ సెక్స్రాకెట్’ విషయంలో మహిళలపై చేసిన దారుణాల గురించి ప్రశ్నించినందుకా? వైజాగ్లో బీచ్ ఫెస్టివల్లో బికినీషోలు అడ్డుకున్నందుకా? ఎందుకు? మరో ఏడాది సస్పెండ్ చేయాలని చూస్తున్నారు?’’ అని ప్రభుత్వాన్ని నిలదీ శారు. మహిళా ఎమ్మెల్యేను చూసి బాబు ఇంతగా భయపడతారని అనుకోలేదన్నారు. -
'అనంత' సస్యశ్యామలం హామీ ఏమైంది బాబూ?
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఉరవకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీటి విడుదల, స్థానిక సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ నేతృత్వంలో సోమవారం ఉరవకొండలో మహాధర్నా చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. జీవో నంబర్ 22 సవరణ, 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మహాధర్నాను విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. అనంతను సస్యశ్యామలం చేస్తానని చెప్పిన చంద్రబాబు ఎన్నికల హామీ ఏమైందని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రశ్నించారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో అనంతలోని 64 మండలాలు ఉన్నాయన్నారు. దీని బట్టి జిల్లాలో కరువు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. 2012లో చంద్రబాబు అనంతపురం జిల్లా పాదయాత్ర సందర్భంగా రైతులకు పంట రుణాలు, బంగారు రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన హామీని కూడా విస్మరించారన్నారు. వైఎస్ జగన్ మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆదివారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండలో మహాధర్నా ఏర్పాట్లను ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేతలు తలశిల రఘురాం, నాగిరెడ్డి పరిశీలించారు. -
రూ.5వేల కోట్లు కేటాయించాలి : వైఎస్సార్సీపీ నేతలు
అనంతపురం : అనంతపురం జిల్లాకు రూ.5వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కరువు బృందాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. మంగళవారం జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందాన్ని నేతలు కలిసి కరువుతో అల్లాడుతున్న జిల్లాను ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. జిల్లాలో ఉపాధి పనులు పెంచడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర కరువు బృందాన్ని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు ఉన్నారు. -
ఉరవకొండలో మహాధర్నా చేపడుతాం
అనంతపురం: హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మహాధర్నా చేపడుతామని ఆ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహాధర్నా చేయనున్నట్టు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ఆర్ పూర్తిచేసిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను పూర్తి చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షాలను శత్రువులుగా చూస్తున్నారని వై విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన
పార్టీకి, ప్రభుత్వానికి తేడా లేదు ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తున్నారు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వజ్రకరూరు : రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన సాగుతోందని, ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఉరవకొండ మండలం నింబగల్లులో రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే విశ్వ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమాలుగా మార్చుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో శాసన సభ్యులతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలకు గౌరవం లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు, పింఛన్లు, సబ్సిడీ రుణాల మంజూరులో ప్రజాప్రతినిధులకు హక్కులేకుండా చేసి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. వీటితో పాటు ప్రభుత్వ ఆస్పత్రి కమిటీ, అంగన్వాడీ కమిటీ, అసైన్ కమిటీలను నామమాత్రం చేసి విలువలేకుండా చేశారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా సమావేశాల్లో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేస్తుండటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకంలోనూ అధికార పార్టీ నాయకుల జోక్యం ఉన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇటీవల ఉరవకొండ ప్రభుత్వ ఆసత్రిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు పెత్తనం ఎక్కువైపోయిందనీ, చివరికి తాగునీటి పనులను కూడా ఆపుతున్నా రని చెప్పారు. టీడీపీ నాయకులు అన్ని అధికారాలు అనుభవిస్తున్నా ఎంపీ జేసీ దివాకర్రెడ్డి లాంటి వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. వాతావరణ కింద బీమా కూడ ఇవ్వలేదని, వర్షాభావంతో పప్పుశనిగ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇన్సూరెన్సు చేయించడంలో కూడా అధికారులు నిర్లక్షం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి టీడీపీ నాయకులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన అధికారపార్టీ నాయకులు, ప్రభుత్వపెద్దలు ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు. -
నగదు కష్టాలకు చంద్రబాబే బాధ్యుడు
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడేరు : పెద్ద నోట్ల రద్దుతో నగదు కోసం పింఛన్దారులు, సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలకు, ఇబ్బందులకు బాధ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం కూడేరు మండలం ఉదిరిపికొండ తండాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మోదీకి లేఖ రాయడం వల్లే పెద్ద నోట్లు రద్దు జరిగిందని బాబు మొదట్లో గొప్పలు చెప్పుకొచ్చారన్నారు. కానీ చిల్లర నోట్లు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు, కూలీలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మెప్పు పొందేందుకే పింఛన్ నగదును బ్యాంకుల్లోకి జమ చేసి పండుటాకులకు, వికలాంగులకు నరకం చూపిస్తున్నారని సీఎంపై ధ్వజమెత్తారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నెపాన్ని బ్యాంకర్లపై నెట్టి ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రజలకు, ఉద్యోగస్తులకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని మండిపడ్డారు. విద్యావంతులే డిజిటల్ పద్ధతిని పాటించలేకపోతే గ్రామీణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి విరివిగా కొత్త రూ.500 నోట్లను, చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
హంద్రీ – నీవా పనులు వేగవంతం చేయండి
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం : కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరివ్వడంతోపాటు కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించే హంద్రీ–నీవా పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని, త్వరితగతిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను పూర్తి చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రిని కలిశారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి హంద్రీ – నీవాకు వంద టీఎంసీల నీరు కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీ–నీవా కాలువ నుంచి కూడేరు మండలం ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు తాగు, సాగునీటి కోసం ఫీడర్ ఛానెల్ తవ్వేందుకు పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేయాలని అభ్యర్థించారు. అలాగే ఆమిద్యాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసేందుకు వెంటనే టెండర్లు పిలిచి లిఫ్ట్ నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ పనులను వచ్చే ఖరీఫ్లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. = వజ్రకరూరు నుంచి పొట్టిపాడు మీదుగా మకాం వేయడంతో పంటలను కాపాడామని తాము కూడా మాట్లాడామని, కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని వివరించారు. ఇన్ పుట్సబ్సిడీ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం రెయిన్ గన్ లను తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం ’అనంత’ రైతుల్లో జరుగుతోందని, ఈ క్రమంలో పరిహారం ఇవ్వడమే ఉత్తమమని చెప్పినట్లు తెలిసింది. చివరకు జిల్లాలో ఎంత పంట ఎండింది, ఎంత పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే అంచనాలు సిద్ధం చేయించి నివేదికలు పంపితే ఆలోచిద్దామని సీఎం చెప్పారు. ఇన్సూరెన్స్ పైనా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై విచారణ శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో 12 కిలోమీటర్ల మేర పైపులై¯ŒS నిర్మాణంలో అవినీతి జరిగిందని, దానిపై విచారణ చేయించాలని జిల్లానేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణకు కమిటీ వేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. 12కిలోమీటర్లకు అదనంగా నిధులు కేటాయించి పైపులై¯ŒS నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. అలాగే వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో తలెత్తే ప్రమాదముందని, నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లానేతలు చంద్రబాబును కోరారు. దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తనకు నివేదికను పంపాలని ఆయన సూచించారు. వచ్చే నెల 2న గొల్లపల్లిలో గంగపూజ 2012లో జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణా నీళ్లొచ్చినా, ఇప్పటి వరకూ గొల్లపల్లికి చేరలేదు. అయితే.. డిసెంబర్ 2న గొల్లపల్లి రిజర్వాయర్కు నీళ్లొదిలి గంగపూజ చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆరోజు గొల్లపల్లికి నీళ్లివ్వడంతో పాటు చెర్లోపల్లి రిజర్వాయర్కు ఎప్పటిలోగా నీరిస్తామనే తేదీని కూడా ప్రకటిస్తామని, అందుకు వీలుగా పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో తెలుసుకోవడానికి అధికారులు, ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి ఓ నివేదికను పంపాలని మంత్రులను సీఎం ఆదేశించారు. జిల్లానేతల మధ్య విభేదాలపై సీఎం గట్టిగానే హెచ్చరించారు. పార్టీలో వర్గాలను ప్రోత్సహించడం, ఓ నియోజకవర్గంలో మరో నేత జోక్యం చేసుకోవడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని చెప్పారు. ఒకట్రెండుసార్లు చెప్పి చూస్తామని, అయినా మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశానికి అనంత ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి గైర్హాజరయ్యారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సీఎంకు కన్పించి సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. -
‘ఆయన ధ్యాసంతా అమరావతి పైనే’
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పేదల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు అందక పేదప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. చంద్రబాబు ధ్యాసంతా అమరావతిపైనే ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయనున్నట్టు విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. ఉరవకొండలో పేద ప్రజల జాబితా తయారైనా పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం వెనకాడుతోందన్నారు. -
మార్కెట్ విలువ ప్రకారం పరిహారమివ్వండి
అనంతపురం అర్బన్ : విడపనకల్లు మండలం డొనేకల్ గ్రామంలో గుత్తి–బెంగుళూరు జాతీయ రహదారి ఆనుకుని రైతుల భూములు ఉన్నాయని, వాటికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి కోరారు. జాయింట్ కలెక్టర్ను శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి పరిహారం అంశంపై మాట్లాడారు. ఇళ్ల స్థలాల కోసం రైతుల భూముల విలువ బేసిక్ విలువ ఎకరాకు రూ.3.50 లక్షలుగా ధర ను నిర్ధారణ చేశారని తెలిపారు. వాస్తవంగా ఇక్కడ మార్కెట్ విలువ ప్రకారం రూ.15 లక్షలు ఉందన్నారు. ప్రభుత్వం ఇక్కడి భూముల ధరలను తారతమ్యంగా నిర్ణయించిందని, దీని వల్ల రైతులు చాలా నష్టపోతారని చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు జేసీని కలిసిన వారిలో గడేకల్ సర్పంచ్ పంపావతి, ఎంపీటీసీలు ప్రసాద్, ఓబిలేసు, వైఎస్సార్సీపీ నాయకులు డొనేకల్ హనుమంతు, రమేశ్, సురేష్, శివ, నారాయణస్వామి, లాయర్ గోపాల్, లేపాక్షి ఉన్నారు. -
బెదిరింపులకు తలొగ్గేది లేదు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సాక్షి, హైదరాబాద్: శాసనసభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడానికి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఏం నేరం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తే నోటీసులిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రయోజనాలు ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడిపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అధికార టీడీపీ శాసనసభలో ఎన్నో ఘోరాలకు పాల్పడిందని మండిపడ్డారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ అసెంబ్లీలో చంద్రబాబే రెండుసార్లు తీర్మానం చేశారు. ఇది కోట్లాది మంది ప్రజల, నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. హోదా ఇవ్వబోమని చెప్పి కేంద్రం అర్ధరాత్రి ప్యాకేజీ ప్రకటించగానే చంద్రబాబు చీకట్లో స్వాగతం పలికారు. దీన్ని మేం శాసనసభలో వ్యతిరేకించాం. అందుకే మా ఎమ్మెల్యేలు బెంచీలు ఎక్కారు, మేమేమీ శాసనసభ గౌరవాన్ని తగ్గించే పని చేయలేదు’ అని చెప్పారు. స్వీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు అధికార టీడీపీ అరగంటలో శాసనసభ నిబంధనలు మార్చేసి ఓటింగ్ లేకుండా చేసి ఘోరానికి పాల్పడిందని, ఇలాంటి చర్యలతో శాసనసభ గౌరవం ఇనుమడించినట్లా? అని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి బెదిరింపులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదన్నారు. నెహ్రూను ఎందుకు తొలగించలేదు తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంకా ప్రివిలేజ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగించడం ఏ మాత్రం నైతికం కాదని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నెహ్రూ స్థానంలో తమ పార్టీ తరపున చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని నియమించాలని లేఖ రాసినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్నారు. -
'తుంగభద్ర ఎగువ కాలువకు అన్యాయం జరిగింది'
అనంతపురం : తుంగభద్ర ఎగువ కాలువకు ఈసారి అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ను ఆయన పరిశీలించారు. అనంతరం వై.విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ... పంటలు ఎండిపోతున్నా టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. హంద్రీనీవా నీటిని తుంగభద్ర ఎగువ కాలువకు మళ్లించి వెంటనే జిల్లాలోని రైతులను ఆదుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని వై.విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఫీడర్ చానల్ తవ్వకానికి అనుమతించండి
కలెక్టర్ను కోరిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్ర« దాన కాలువ నుంచి కూడేరు మండలం ముద్దలాపురం, ఇ ప్పేరు చెరువులకు తాగు, సాగు నీరు చేరేందుకు ఫీడర్ చా నల్ తవ్వించేందుకు పరిపాలన పరమైన అనుమతి మంజూ రు చేయాలని కలెక్టర్ కోన శశిధర్ను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్ని రెవెన్యూ భవన్లోని కలెక్టర్ చాంబర్లో కలిసి ఈ మేరకు లేఖ అందజేసి ప రిస్థితిని వివరించారు. కూడేరు మండలంలోని ఇప్పేరు, అంతరగంగ, నాగిరెడ్డిపల్లి, కూడేరు, కలగల్ల, ముద్దలాపురం, త దితర పది గ్రామాల ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడితో ఇ బ్బందిపడుతున్నారన్నారు. కూడేరు మండలం ద్వారా వెళుతున్న హంద్రీ–నీవా ప్రధాన కాలువ రెండవ దశ నుంచి ఫీడర్ చానల్ ఏర్పాటు చేసి ముద్దలాపురం చెరువుకి, అక్కడి నుం చి ఇప్పేరు చెరువుకి నీరు వదలడం ద్వారా సమస్యని పరి ష్కరించవచ్చన్నారు. రెండు చెరువులకు నీరు వదలడం ద్వారా పది గ్రామలతో పాటు ఇప్పేరు చెరువుకు దిగువన ఉ న్న గార్లదిన్నె మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలకు కూడా లభించడంతో పాటు దాదాపు 15 గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెంది వ్యవసాయానికి ఉపయోగకరం గా ఉంటుందన్నారు. అలాగే అంతరగంగ గ్రామం చుట్టుపక్కల ఉన్న సుమారు 70 తలిపిరిలు (స్ప్రింగ్స్) కూడా రీచార్జి అవుతాయన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ రెండవ ఫేజ్లోని 232.422 కిలోమీటర్ వద్ద నుంచి ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీరు విడుదల చేయడానికి 2.6 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ని తవ్వాల్సి ఉంటుందన్నారు. సామూహిక మొక్కల పెంపకానికి నిధులివ్వండి :జిల్లా కేం ద్రం నుంచి వయా కూడేరు, ఉరవకొండ మీదుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన చెళ్లగురికి గ్రామం వరకు ప్రస్తుతం కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారని ఆయన కలెక్టర్కు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ‘సామూహిక మొక్కల పంపకం’ కోసం స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కింద పనిని మంజూరు చేయాలని కలెక్టర్ను ఎమ్మెల్యే కోరారు. -
'బాబు పర్యటనంతా సినిమా షూటింగ్లా సాగింది'
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటనంతా సినిమా షూటింగ్లా సాగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. అనంతలో శనివారం పార్టీ సీనియర్ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పర్యటన భూటకమని ఎమ్మెల్యే విమర్శించారు. రెయిన్ గన్స్ ద్వారా పంటలు రక్షించామని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. జిల్లాలో వేరుశనగ పంట మొత్తం ఎండిపోయిందని...పంటలు ఎండిన తర్వాత రెయిన్ గన్స్ ద్వారా నీరందిస్తామని చెప్పడం సరికాదని విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఉద్రిక్తం..
రాగులపాడు లిఫ్ట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుటే రైతులతో బైఠాయింపు హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వండి ప్యాకేజీల కోసం కేశవ్ ఆరాటం ధ్వజమెత్తిన విశ్వేశ్వరరెడ్డి హంద్రీ–నీవా మెుదటి దశ కింద జిల్లాలో ప్రతిపాదిత ఆÄýæుకట్టుకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సోమవారం తలపెట్టిన రాగులపాడు లిప్ట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఉరవకొండ–గుంతకల్లు రహదారిలోని రాగులపాడు గ్రామ సమీపంలో బ్రిడ్జివద్దకు వేలాది మంది రైతులు చేరుకున్నారు. సరిగ్గా 11 గంటల సమయంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని లిఫ్ట్ వైపునకు వెళ్లనీయకపోవడంతో అక్కడే రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే ఉద్వేగంగా మాట్లాడారు. హంద్రీ–నీవా ఆయకట్టుకు శివరావురాజయ్యుయ కమిషన్ ప్రతిపాదించిన విధంగా ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నారు. 2004లో వుహనేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికారంలోకి రాగానే 5 టీఎంసీల సావుర్ధ్యం ఉన్న హంద్రీ–నీవాను 40 టీఎంసీల సావుర్థ్యం పెంచుతూ జీవో జారీ చేశారన్నారు. మెుదటి దశ కింద దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాÄýæుర్కు రెండు సార్లు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. రెండో దశ పనులు పూర్తి చేసి కుప్పంకు నీటిని తీసుకెళ్లడానికిS చంద్రబాబు దృష్టి పెట్టారన్నారు. అపద్ధాలతో ముఖ్యమంత్రి కాలం వెల్లదీస్తున్నారన్నారు. మరుగుదొడ్డిలో లైటు పడకపోయినా నాకు తెలుస్తుందని.. ఆ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశానంటూ గొప్పలు చెబుతున్న బాబుకు జిల్లాలో 27 రోజులుగా వర్షాలు లేక వేరుశనగ దెబ్బతిన్న విషయం తెలీదా? అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ పయ్యావ#ల కేశవ్కు ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ది పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. నియోజకవర్గానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నందున అధికారులు, పోలీసులు ఎవ్వరూ సహకరించొద్దని ఒత్తిళ్లు చేస్తున్నారన్నారు. హంద్రీ–నీవా ఆÄýæుకట్టుకు నీళ్లు తీసుకురావాడనికి ఎలాంటి కృషీ చేయడం లేదు కాని 36వ ప్యాకేజీలో కేవలం రూ. 56 కోట్ల ఖర్చు పెడితే పూర్తి అయ్యే పనులకు రూ. 336 కోట్లకు అంచనాలు పెంచి తన స్వంత జేబులు నింపుకోవడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. అదికూడా టెండర్ లేకుండా కొటేషన్ పద్ధతిలో పనులు కావాలని అడుగుతున్నారన్నారు. తాను నీళ్లు కోసం అడుగుతుంటే ఆయన ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారని కేశవ్పై ధ్వజమెత్తారు. రూ.670 కోట్లతో అంచనాలు వేసిన పనులను తాను కేవలం రూ. 10 కోట్లతోనే చేసి చూపిస్తానంటూ తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చాలెంజ్ చేశారని గుర్తు చేశారు. బలవంతపు అరెస్ట్లు ఓవైపు విశ్వేశ్వరరెడ్డి ప్రసంగిస్తుండగానే మరోవైపు గుంతకల్లు డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వాహనంపై నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో పోలీసులు పైకెక్కి కిందకు దింపి వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు. రైతులు అడ్డుకున్నారు. వాగ్వాదం చోటు చేసుకుంది. విశ్వేశ్వరరెడ్డిని జీపులోకి ఎక్కించుకుని వజ్రకరూరు పోలీస్స్షేషన్కు తరలించారు. అధిక సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకుని పోలీస్స్టేçÙన్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై ఎమ్మెల్యేను విడుదల చేశారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, ఉరవకొండ, విడపనకల్లు, కూడేరు, లలితమ్మ, తిప్పయ్య, నిర్మలమ్మ, వజ్రకరూరు ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మాన్యం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
పంపుహౌస్ ముట్టడి : ఎమ్మెల్యే అరెస్ట్
అనంతపురం : కరువు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే నేతృత్వంలో సోమవారం రైతులు రాగులపాడు పంపుహౌస్ కార్యాలయాన్ని ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డితో సహా పలువురు రైతులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ...హంద్రీనీవా మొదటి దశ వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయినా..ఇప్పటి వరకు పంటపొలాలకు నీరు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హంద్రీనీవాకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్కి పేరొస్తుందనే...
అనంతపురం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందనే.. చంద్రబాబు హంద్రీనీవా పట్టించుకోలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. అనంతపురానికి కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్దే అని ఆయన గుర్తు చేశారు. గురువారం అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్లో ఆయన పుష్కర స్నానం చేశారు. అనంతరం వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఏటా 15 టీఎంసీలు వస్తున్న ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. డిస్ట్రిబ్యూటరీలను వెంటనే పూర్తి చేసి పంటలకు నీరు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలని వై.విశ్వేశ్వరరెడ్డి పూజలు నిర్వహించారు. -
తాగునీటికోసం పోరుబాట
-
ఉరవకొండ సమస్యలపై నేడు నిరవధిక మహాధర్నా
∙తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్న ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి∙రోడ్డు పైనే వంటా వార్పు ఉరవకొండ: ఉరవకొండ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సవుస్యల పరి ష్కారం కోసం స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఉద్యమానికి సిద్ధమయ్యారు. శుక్రవారం వేలాది వుం ది ప్రజలతో కలిసి ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై నిరవధిక వుహాధర్నా చేపడుతున్నారు. ఈయన ఈ నెల ఎనిమిది నుంచి ‘గడప గడపకు వైఎస్ఆర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఉరవకొండలో పలు ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై పోరుబాట కుసిద్ధమయ్యారు. మహాధర్నాలో ప్రజలుపెద్దసంఖ్య లో పాల్గొని.. ప్రభుత్వం కళ్లు తెరి పించే లా చేద్దావుని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రధాన డివూండ్లు ఇవే.. పట్టణంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం 2008 సంవత్సరంలో 83 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అయితే ఇప్పటికీ అర్హులకు స్థలాలు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో అర్హులైన అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించాలి.∙చేనేత అప్పులు రద్దు చేయాలి. కార్మికులకు సబ్సిడీతో రేషం అందించాలి.∙పట్టణ ప్రజలకు పరిశుభ్రమైనlనీటిని సరఫరా చేయాలి. కొత్త ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించడంతో పాటు పాత పైప్లైన్ను వూర్చాలి.∙గతంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు తొలగించారు. దీనివల్ల బహిర్భూమికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ వ్యక్తిగత వురుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలి. ∙అర్హులందరికీ రేషన్కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలి.∙ఉరవకొండలో అభివృద్ధి పనులకు తక్షణమే రూ.50 కోట్లు విడుదల చేయాలి.∙బాలికల జూనియర్ కాలేజీకి పక్కా భవనాలు నిర్మించాలి.∙వంద పడకల ఆస్పత్రి పనులు ప్రారంభించాలి. -
ఎమ్మెల్యే విష్ణు క్షమాపణ చెప్పాలి
రణస్థలం : ఉపాధి హామీ చట్టం, కిలో రూపాయి బియ్యం పథకాల వల్ల వ్యవసాయ కూలీలు, పేదలు సోమరిపోతులౌతున్నారని, వాటిని సత్వరం ఎత్తివేయాలని అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నాయుకుడు విష్ణుకుమార్రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్. అమ్మన్నాయుడు శుక్రవారం డిమాండ్ చేశారు. పేదలు, వ్యవసాయ కూలీలు ఓట్లతో గెలిచి న ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. దేశానికి తిండిని అందిస్తున్న వ్యవసాయ కూలీలు, పేదల పట్ల ఇలా అహంకార పూరితంగా మాట్లాడడం తగదని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో 46.43 హెక్టార్ల భూమి సాగులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇటువంటి పథకాన్ని ఎత్తివేయాలని బీజేపీ నాయుకులు చెప్పడం సమంజసం కాదని విమర్శించారు. -
'వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన బాబు'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. మంగళవారం విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... రూ. 87 వేల కోట్ల రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు రూ. 7 వేల కోట్లు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. నీటిపారుదల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్లు నిర్మిస్తున్న చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడారిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు భయంతోనే రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు తాకట్టు పెట్టారని వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. -
చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ దాడులు'
అనంతపురం: టీడీపీ దాడులపై ఆదివారం అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ దాడుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ధర్నా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ అనంతపురం జిల్లాలో నేడు వైఎస్ జగన్ ధర్నా చేయనున్నట్టు వెల్లడించారు. అయితే వైఎస్ జగన్ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు, టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ దౌర్జన్యాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై. విశ్వేశ్వర్ రెడ్డి ఎండగట్టారు. తాగుబోతులతో వైఎస్ జగన్ యాత్రకు ఆటంకం కలిగించే యత్నం చేస్తున్నారంటూ వారు దుయ్యబట్టారు. చంద్రబాబు దౌర్జన్యాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. రైతుల్లో మనోస్థైరం కల్పించేందుకు వైఎస్ జగన్ చేస్తున్న రైతు భరోసా యాత్రను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని గుర్నాథ్ రెడ్డి విమర్శించారు. -
'ధైర్యం లేని బాబు.. ఢిల్లీకి ఎందుకు?'
గుంటూరు: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఏపీకి అదనంగా నిధులు అడిగే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు. ప్రజల వత్తిడి వల్లే చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళుతున్నారని చెప్పారు. అసలు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబునాయుడు ఏం సాధిస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. -
ప్రజా విశ్వాసం లేకనే ఎమ్మెల్యేల కొనుగోలు
జల జాగరణ దీక్ష ముగింపు సభలో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి బెళుగుప్ప: ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకు అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కాదుకదా ఆయన నాన్న వచ్చినా తనను కొనలేడని అన్నారు. హంద్రీ-నీవా మొదటి దశ ఆయకట్టుకు నీటి సాధన కోసం అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో శనివారం రాత్రి ఎమ్మెల్యే చేపట్టిన జలజాగరణ దీక్ష ఆదివారం ఉదయం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను కూడా టీడీపీలోకి రమ్మన్నారంటూ ఆ పార్టీ నేతలు దుష్ర్పచారం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. తనను కొనుగోలు చేసి, పార్టీ మార్పించే దమ్ము, ధైర్యం ఏ టీడీపీ నాయకుడికీ లేదన్నారు. తాము ఒక తల్లిబిడ్డలుగా పార్టీలు మారే వ్యక్తులం కాదన్నారు. -
ఈ నెల 7,8 తేదీల్లో 'జల జాగరణ'
అనంతపురం: హంద్రీనీవా కింద ప్రతిపాదించబడిన ప్రతి ఎకరాకూ సాగునీరు అందే వరకు పోరుబాటను తీవ్రతరం చేస్తున్నామని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఈ నెల 7, 8 తేదీల్లో బెలుగుప్పలో 'జల జాగరణ' కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. హంద్రీనీవా ఆయనకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
హంద్రీనీవా ఆయకట్టు సాధనకు ఐక్య ఉద్యమాలు
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ : హంద్రీనీవా కింద ప్రతిపాదించబడిన ప్రతి ఎకరాకూ సాగునీరు అందే వరకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం రాత్రి స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో హంద్రీనీవా ఆయుుకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సవూవేశానికి ఎమ్మెల్యే వుుఖ్య అతిథిగా హాజరయ్యారు. హంద్రీనీవా ఆయకట్టు సాధన సమితి సభ్యులు లత్తవరం రావుూ్మర్తి అధ్యక్షతన జరిగిన సవూవేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వూట్లాడుతూ హంద్రీనీవా పూర్తి చేయుడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కాలువ పూర్తి చేసి ఆయుుకట్టుకు నీరు ఇవ్వాలని, ఉన్న నీళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగడుతూ రాయులసీవులోని టీడీపీ ప్రజాప్రతినిధులకు కనువిప్పు కల్గించేలా వురో ఉద్యవూనికి శ్రీకారంచుట్టడానికి అందరు సిద్ధంగా ఉండాలని తెలిపారు. దీనిపై ఈనెల 11న బెలుగుప్పలో జరిగే సవూవేశంలో ఉద్యవు కార్యచరణ హంద్రీనీవా సాధన సమితి రూపొందిస్తుందని తెలిపారు. కార్యక్రవుంలో హంద్రీనీవా ఆయుుకట్టు సాధన సమితి ప్రతినిధులు రాకెట్ల అశోక్, తేజోనాథ్, చిన్నవుూస్టురు సుంకన్న, సభ్యులు మోపిడి తిప్పన్న, కౌకుంట్ల సిద్దారెడ్డి, ఓబన్న, షేక్షానుపల్లి లింగన్న, లత్తవరం గోవిందులు పాల్గొన్నారు. -
'శకుని పాత్ర పోషించిన మంత్రి యనమల'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శకుని పాత్ర పోషించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం అనంతపురంలో వై.విశ్వేశ్వరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిరాశ కలిగించాయని చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే రాజకీయ లబ్ది కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్పై పోరుబాటను మరింత ఉధృతం చేస్తామని వై.విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. -
రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు
36 గంటల ధర్నాలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ అనంతపురం రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆర్డీవో కార్యాలయం ఎదుట 36 గంటల ధర్నాను చేపట్టింది. శుక్రవారం ఎమ్మెల్యే ఈ శిబిర ాన్ని సందర్శించి మద్దతు ప్రకటిం చారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులపట్ల చిత్తశుద్ధి లేదన్నారు. రైతు ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి, రాష్ట్ర ప్రభుత్వానికి అక్షిం తలు వేసినా మార్పు లేదన్నారు. జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించకుండా కమీషన్ల కోసం పాలకులు పాకులాడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమకు ఇప్పటి వరకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అయినా సీమకు చుక్కనీరు రాలేదన్నారు. అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రాయలసీమ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించి రైతు ఆత్మహత్యలను అరికట్టాలన్నారు. ఎ మ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వమే రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అనంతరం ఆర్డీవో మలోలకు డి మాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాం భూపాల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, కార్యదర్శి పెద్దిరెడ్డి, రిడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా, నాయకులు రామాంజినేయులు, రా యుడు, నగేష్, దిల్షాద్ పాల్గొన్నారు. -
'అసెంబ్లీ నుంచి ప్రభుత్వం పారిపోయింది'
హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకంత భయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ...అసెంబ్లీ నుంచి ప్రభుత్వం పారిపోయిందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మాజువాణి ఓటింగ్ నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మెజార్టీ ఉందని బాబు సర్కారు రాక్షసపాలన సాగిస్తోందని విమర్శించారు. బిల్లుపై అధికారముందని తప్పించుకున్న ప్రభుత్వం.. ప్రజలు నుంచి తప్పించుకోలేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. మరో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు సీఎం చంద్రబాబు అవాస్తవాలు, అర్థ సత్యాలు వల్లించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అబద్ధాలతో మభ్య పెడుతున్నారు
► పేరుకే వ్యవసాయ బడ్జెట్ ► ఫారంపాండ్స్ పెయిన్కిల్లర్లా పని చేస్తాయి తప్ప శాశ్వత పరిష్కారం కాదు ► ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం : బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలతో మభ్య పెడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఎమ్మెల్యే రోజాను విమర్శించడానికే టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సమయం మొత్తం కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఇందుకోసం అవసరమనుకుంటే సమయం పొడిగిస్తున్నారు తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో కరువు ఉందన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిందన్నారు. ఉపాధి లేక లక్షలాది మంది వలసలు వెళ్తున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అని ప్రకటించినా కేటాయింపుల్లో మాత్రం గతేడాది కంటే తగ్గించారని విమర్శించారు. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో 500 మండలాల్లో తీవ్ర కరువు నెలకొంటే 360 దాకా మాత్రమే ప్రకటించారన్నారు. 2014 ఇన్సూరెన్స్ ఇప్పటికీ పైసా ఇవ్వలేదన్నారు. 2015-16లో రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి కనిపించలేదన్నారు. దుర్మార్గమైన నిబంధన అమలులోకి తెచ్చారని విమర్శించారు. సగటు ఐదేళ్ల పంట దిగుబడిలో 30 శాతం నష్టపోయి ఉంటేనే పరిహారమని ప్రకటించారన్నారు. మోసపూరిత రుణమాఫీ హామీ వల్ల ఓవర్డ్యూస్ రూ.24 వేల కోట్లకు పెరిగిపోయాయన్నారు. మొండిబకాయిలు రూ.5 వేల కోట్లు పెరిగాయన్నారు. ఫారంపాండ్లతో కరువు పారదోలుతామని చెబుతున్నారని, జిల్లాలో ఇవి పెయిన్ కిల్లర్లా పని చేస్తాయి తప్ప శాశ్వత పరిష్కారం కావని స్పష్టం చేశారు. సీఎంకు కీర్తి కాంక్ష పట్టుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీర్తి కాంక్ష పట్టుకుందని, ఇందుకోసం వేల కోట్ల రూపాయల అప్పులు చేసేందుకు కూడా వెనకాడటం లేదని వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్వాకంతో రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముందన్నారు. కొన్ని పత్రికలు, ఛానెళ్లు పని కట్టుకుని తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మా ఎమ్మెల్యేలెవరికీ లేదన్నారు. రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలను వెలికితీసిన విలేకరులను పోలీసులు విచారించడం బాధాకరమని విలేకరులు అడిగిన ఓప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం బడాయికి పోతోందని విమర్శించారు. -
'మీరు సిద్ధమంటే... మేము సిద్ధమే'
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి శనివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. ఎన్నికలంటే టీడీపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే టీడీపీలోకి వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డబ్బు, అధికార వ్యామోహంతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరుపై చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు వలసలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధమంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామని వై.విశ్వేశ్వరరెడ్డి స్పష్టం సవాల్ విసిరారు. ఎవరి బలం ఏంటో ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని వై. విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. -
రేపు జలజాగరణ
హంద్రీనీవా కోసం వైఎస్సార్ సీపీ నిరసన బాట చంద్రబాబు కపటనాటకం ఆపాలన్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పట్టిసీమపై ఉన్న చిత్తశుద్ధి హంద్రీనీవాపై లేదని ఆగ్రహం అనంతపురం అగ్రికల్చర్: హంద్రీనీవా ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలంటూ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరసన బాట పట్టారు. ఈ సంవత్సరంలోనే హంద్రీనీవా పూర్తిచేసి 80 వేల ఎకరాలకు నీరివ్వాలన్న ప్రధాన డిమాండ్తో రేపు (శనివారం) సాయంత్రం 4 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామం వద్ద రైతులతో కలిసి జలజాగరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం జిల్లాకు సాగునీరు, తాగునీటి కేటాయింపుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కపటనాటకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టుపై ఉన్న చిత్తశుద్ధి జిల్లా వరప్రదాయనిగా భావిస్తున్న హంద్రీ-నీవా సుజల స్రవంతిపై కనబర్చడం లేదని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే హంద్రీ-నీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్నారు. కళ్లముందే కృష్ణాజలాలు జిల్లాకు వస్తున్నా పొలాలకు మాత్రం నీరు రావడం లేదన్నారు. దీంతో ఏటా రూ. వేల కోట్లు విలువ చేసే పంటలు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డిస్ట్రిబ్యూటరీల నుంచి పిల్లకాలువలు, పంట కాలువలు తవ్వితే 33, 34 ప్యాకేజీ కింద వజ్రకరూరు, విడపనకల్, ఉరవకొండ మ ండలాల్లో 40 వేల ఎకరాలకు నీరు అందింవచ్చన్నారు. అలాగే 36వ ప్యాకేజీలో కాలువ పనులు పూర్తీ చేస్తే బెళుగుప్ప మండలంలో 30 వేల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయవచ్చన్నారు. అదే విధంగా హంద్రీ-నీవా రెండో దశ పూర్తీ చేస్తే కూడేరు మండలంలోని అన్ని చెరువులకు నీళ్లు నింపవచ్చని చెప్పారు. పట్టసీమ ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో పది శాతం వ్యయం చేసినా ఇవన్నీ పూర్తీ చేయవచ్చన్నారు. జిల్లాకు నీరివ్వకుండా చిత్తూరు జిల్లా కుప్పంకు నీరు తలరించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. జలజాగరణతో 2016లో బడ్జెట్లో హంద్రీ-నీవాకు ప్రాధాన్యత ఇచ్చేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జీబీసీ కాలువ ఆధునీకరణకు వెంటనే నిధులు ఇవ్వాలని, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే తుంగభద్ర ఎగువకాలువ ఆధునీకరణ పూర్తీ చేయాలని, పీఏబీఆర్ నుంచి ఉరవకొండ నియోజక వర్గంలో గ్రామాలకు తాగునీరు అందించే పైప్లైన్ యుద్ధప్రాతిపదికన పూర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జలజాగరణ కార్యక్రమానికి అన్ని పార్టీలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మద్ధతు ప్రకటించాలని కోరారు. విలేకరుల సమావేశంలో నియోజక వర్గ నాయకులు రాధాకృష్ణ, హెచ్.చౌదరి, జి.ఉమాపతి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
'సీమ రైతులను పట్టించుకోని బాబు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి బుధవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాయలసీమ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీ - నీవా తొలిదశ పనులు పూర్తవుతాయన్నారు. అయితే హంద్రీ - నీవా డిస్ట్రిబ్యూటరీ పనులు ఎందుకు ఆపారో చెప్పాలని ఈ సందర్భంగా చంద్రబాబును డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న బాబుకు రైతుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ఉరవకొండ హంద్రీ - నీవా ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని ప్రభుత్వానికి విశ్వేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
'హంద్రీ-నీవాను తాగునీటికే పరిమితం చేసే కుట్ర'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా సంస్థల హక్కులను కాలరాస్తున్నారని వారు ధ్వజమెత్తారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును తాగునీటికే పరిమితం చేసే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి, అనంతవెంకట్రామిరెడ్డి ఆరోపించారు. -
'చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి శనివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో... బయట అణచి వేయాలని చూస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. రేణిగుంట విమానాశ్రయం సిబ్బందిపై దాడి చేశారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ సీపీ ఎంపీ పి. మిథున్రెడ్డి, పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆ పార్టీ నాయకుడు బి. మధుసూదన్రెడ్డిని అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వై. విశ్వేశ్వరరెడ్డి పై విధంగా స్పందించారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని విచారణ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
తెలుగు తమ్ముళ్లపై వై. విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం
-
తెలుగు తమ్ముళ్లపై వై. విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం హావల్గి గ్రామంలో సోమవారం జన్మభూమి కార్యక్రమంలో ఉద్రికత్త నెలకొంది. టీడీపీ కార్యకర్తలే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దాంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ జన్మభూమి కార్యక్రమాన్ని వై. విశ్వేశ్వేర్రెడ్డి బహిష్కరించారు. -
'ఆ బిల్లుకి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం'
-
'ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుకి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం'
హైదరాబాద్ : 25 మంది కార్పొరేట్ శక్తుల కోటరీ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తోందంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు విలేకర్లతో మాట్లాడారు. ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని వారు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఈ బిల్లును వ్యాపార ధృక్పథంతో తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. ఈ బిల్లు వల్ల విద్యార్థులకు పూర్తిగా నష్టం కలుగుతుందని విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకుండా చేసి ఇంతమందికి అన్యాయం చేసే బిల్లును శాసనసభలో పాస్ చేసుకోవడం దురదృష్టమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుని... కార్పొరేట్ చేతుల్లో పెట్టిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సర్కార్ విద్యా, వైద్యాన్ని పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెట్టేస్తోందని విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి చేతులు రావడం లేదని చంద్రబాబు ప్రభుత్వంపై వారు నిప్పులు చెరిగారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాల్లో జల్సాలు చేయడానికి మాత్రం రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 20 ప్రభుత్వ యూనివర్శిటీలను ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు అన్నారు.