Yellow media campaign
-
చిన్నారిపై లోకేష్ సైకో టీం విషప్రచారం
విజయవాడ, సాక్షి: పచ్చ బ్యాచ్ సైకోలు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీసారి ఆశ్చర్యపరస్తూ వస్తున్నారు. తాజాగా.. మరోసారి విష పడగ విప్పారు. జగన్పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ఛీత్కారాలు వచ్చాయి. దీంతో ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy) .. విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్ను కలిసింది. ఆ సమయంలో ఆయన ఆ పాపను దగ్గరికి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది. అయితే పచ్చ బ్యాచ్కు ఇది ఏమాత్రం సహించనట్లుంది.అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు. ఈ క్రమంలో #Childabuser అంటూ ఆ వెబ్సైట్లను జనం తిట్టిపోశారు కూడా. గతంలో చిన్నపిల్లలతో రాజకీయం చేసింది ఎవరంటూ.. టీడీపీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.టీడీపీ సోషల్ మీడియా(TDP Social Media) ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. గతంలో ప్రభుత్వ స్కూల్లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ సాయం చేశారని చెప్పిన గీతాంజలికి.. సొంతింటి కల నెరవేరిన సంతోషాన్ని లేకుండా చేశారు. ఏకంగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో ఏడ్పించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్ చేయడం చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మరీ శ్రుతిమించడంతో బూమరాంగ్ అయ్యింది. దీంతో ఈసారి అసత్య ప్రచారాలకు దిగారు. చిన్నారి దేవిక డీపీహెచ్ స్కూల్లో చదువుతుందంటూ ప్రచారం చేశారు. పైగా ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు అని, ఆర్థికంగా ఆ కుటుంబ పరిస్థితి ఎంతో బాగుందంటూ విషం చిమ్మారు. దేవిక తండ్రి అద్దె ఇంట్లో ఉంటూనే ఓ షాప్లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ, లోకేష్ సైకో టీం(Nara Lokesh Team) విషప్రచారం ఇంకా ఆ ప్రచారం ఆపట్లేదు.ఇంత జరుగుతున్నా.. టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నవాళ్లపై కూటమి పెద్దల ఆదేశాలతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండడంలో తలమునకలైపోయారు అంతే!. -
Singer Mangli: పాట పాడలేదని ఇంత పగనా?
అమరావతి: ప్రముఖ గాయని మంగ్లీపై టీడీపీ & కో సోషల్ మీడియా వేదికగా మామూలు విషం చిమ్మడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆమె చంద్రబాబుపై పాట పాడమని టీడీపీ కోరింది. అయితే అందుకు ఆమె సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో వైఎస్ జగన్ మీద అభిమానంతో ఓ పాట పాడారు. ఈ క్రమంలో ఆ కోపాన్ని ఇప్పుడు సందర్భం రావడంతో ప్రదర్శిస్తోంది యెల్లో బ్యాచ్. శ్రీకాకుళం అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఈ నెల నాలుగో తేదీన గాయని మంగ్లీ(Singer Mangli) బృందం పాటల కార్యక్రమం ఏర్పాటు నిర్వహించింది. ఆ టైంలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళుతూ.. సింగర్ మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన దృశ్యాలు, చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఇప్పుడు పోస్ట్ చేస్తోంది. చంద్రబాబు పేరును పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తిని వెంట పెట్టుకుని మరీ ఎలా లోపలికి తీసుకెళ్తారంటూ రామ్మోహన్నాయుడును టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో.. అసలు ఆమెకు గుడిలోకి వెళ్లే అర్హతే లేదన్నట్లు అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు. అదే టైంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంగ్లీ టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్కు సలహాదారుగా పని చేశారని గుర్తు చేస్తూ ఆ విమర్శలను ఇంకా తీవ్ర తరం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అనుకూల మీడియా సైతం ఈ విమర్శలను ప్రముఖంగా ప్రచురిస్తుండడం గమనార్హం. మరోవైైపు.. ఒక కళాకారిణిగా ఆమెకు రాజకీయాలను ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని కొందరు ఆమెకు మద్ధతుగా నిలుస్తుండడం విశేషం.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విలువల్లేని ఎల్లో మీడియా.. వివరణ ఇచ్చినా విషం చిమ్ముతూనే ఉంది!
తిరుపతి, సాక్షి: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టీడీపీ అనుకూల మీడియా ఇస్తున్న కథనాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పని గట్టుకుని ఈ విష ప్రచారం చేయిస్తోందని ఆరోపించారాయన. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని ఎల్లో మీడియా ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విష ప్రచారం చేస్తోంది. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించక పోయినా ఉద్దేశ్య పూర్వకంగా మీ రాసిన చెల్లుతుంది విషం చిమ్ముతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన పనిగట్టుకుని అసత్య కథనాలు రాస్తున్నారు. తప్పుడు కథనలుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ కూడా విసిరారు. ఈ అసత్య ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(peddireddy ramachandra reddy) కడిగిన ముత్యంలా బయట పడతారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చకుండా మాపై విషం చిమ్ముతున్నారు. ఎల్లో మీడియా పత్రికలు కనీసం వివరణ ఇచ్చినా పత్రిక విలువలు పాటించడం లేదు. కూటమి ప్రభుత్వం పై మా పోరాటం చేస్తూనే ఉంటాం , ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది అనేది స్పష్టం అవుతోంది అని భూమన అన్నారు. -
నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్ల దావోస్ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులేవీ తేకపోయినప్పటికీ ఒక రకంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే అంతటి ముఖ్యమైన కార్యక్రమాలనూ రాజకీయాలకు వేదికగా చేసుకోవచ్చునని, తమకు కావాల్సిన విధంగా ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చునని టీడీపీ ప్రభుత్వం నిరూపించింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా, ఏపీ బ్రాండ్ అంటూ కొత్త డైలాగుతో మీడియా మేనేజ్మెంట్లో తమకు తామే సాటి అని చెప్పుకోవడం హైలైట్!. దావోస్లో చంద్రబాబు, లోకేష్లు చాలా కష్టపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాత్రం లోకేషే భావి ముఖ్యమంత్రి అని పొగడటంలో బిజీ అయిపోయారు. ఏపీలో లోకేష్లాగా చదువుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడగడం ఒక హైలైట్ అయితే.. ఆ మిషతో భావి ఉప ముఖ్యమంత్రి ఆయనే అని జనసేన అధినేత పవన్కు సిగ్నల్స్ ఇవ్వడం ఇంకో హైలైట్. అయితే దావోస్ పర్యటనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఇచ్చిన కవరేజీ బహుశా బాబు, లోకేష్లను ఇరకాటంలో పెట్టేసి ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి రావడమే తరువాయి అన్నట్టుగా సాగింది ఈ మీడియా బ్యాండ్ బాజా. తీరా పర్యటన ముగిసిన తరువాత చూస్తే.. సున్నకు సున్నా.. హళ్లికి హళ్లి!! ప్రతిపక్షంలో ఉండగా పవన్.. 'దావోస్ వెళ్లి సాధించే పెట్టుబడులు ఏముంటాయి? సూటు,బూటు వేసుకువెళ్లి హడావుడి చేయడం తప్ప.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటే పారిశ్రామికవేత్తలే ఏపీకి వస్తారు’ అని చెప్పినట్లే.. ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం పుణ్యమా అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అనుకోవాలి. మహారాష్ట్రకు రూ. 15 లక్షల కోట్లు, తెలంగాణకు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడమేమిటి.. ఏపీకి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదరక పోవడం ఏమిటి? కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి బాబు, లోకేష్లు సాధించింది ఏమిటీ అంటే.. ‘‘ఏపీ బ్రాండ్’’ను ప్రచారం చేసి వచ్చారట! మరి.. చంద్రబాబు గతంలోనూ చాలాసార్లు దావోస్ వెళ్లివచ్చారే? అప్పట్లో ఏపీకి బ్రాండ్ ఇమేజీ రానట్టేనా? పైగా అప్పట్లో దావోస్ వెళ్లిన ప్రతిసారి అదిగో పెట్టుబడులు.. ఇదిగో ఇన్వెస్ట్మెంట్లు అని ఎల్లోమీడియా భలే బాకాలూదేదే? బాబు స్వయంగా తనను చూసి బోలెడన్ని కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు కదా? ఈసారి ఏమైంది? విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినప్పుడు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రచారం జరిగింది. అయితే.. వీటిల్లో అధికమొత్తం బోగస్ ఒప్పందాలన్న విమర్శ వచ్చింది. దారిన పోయేవారిని కూడా కంపెనీ సీఈవోలుగా ముస్తాబు చేసి ఫొటోలు దిగారు అని ససాక్ష్యంగా నిరూపితమైంది. ఇప్పుడు ఆ డ్రామా కూడా ఆడలేకపోయారు. చంద్రబాబు, లోకేష్లు కంపెనీలతో చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. మంచిదే. కానీ అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం గురించి, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి కంపెనీల్లో అనుమానాలు రేకెత్తించారా? ఈ అనుమానం ఎందుకొస్తుందంటే.. జగన్ మళ్లీ వస్తాడేమో అని పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు లోకేష్ చాలాసార్లు వ్యాఖ్యానించారు మరి!. అలాగే ‘జగన్ రాడు’ అని బాండ్ రాసి ఇమ్మంటున్నారని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతుంటారు. పారిశ్రామికవేత్తలు ఆ బాండ్లను నమ్మలేదా? జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్లు నమ్మారని అనుకోవాలా?.. ఇదీ చదవండి: దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్యమూడేళ్ల క్రితం జగన్ దావోస్ వెళ్లినప్పుడు రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఈ పారిశ్రామికవేత్తలే. విశాఖలో సదస్సు పెడితే అంబానీ, అదాని వంటివారూ వచ్చి జగన్ను అభినందించి వెళ్లారే? ఆ తరువాత అదానీ పెద్ద ఎత్తున సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో విద్యుత్ ఉత్తత్తి ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యారే? కూటమి అధికారంలోకి వచ్చాక అదానీ సిబ్బంది పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లాలో దాడులు చేశారే? ఆ విషయం ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయేందేమో!. ఇక లోకేష్ రెడ్ బుక్ ఉండనే ఉంది. ఏపీలో కూటమి అదికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ వారు వైసీపీ వారిపై చేసిన దాడులు, హింసాకాండ, అరాచకాల సమాచారం కూడా వారికి అందిందేమో! ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జగన్ టైమ్ లో ముందుకు వచ్చారు. కాని కూటమి అధికారంలోకి రావడంతోనే ఎవరో మోసకారి నటిని పట్టుకొచ్చి ఏపీలో పోలీసు అధికారులపైనే కాకుండా, జిందాల్ పై కూడా కేసుపెట్టి అరెస్టు చేసే ఆలోచనవరకు వెళ్లారే..సహజంగానే ఒక పారిశ్రామికవేత్తను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా హింసించే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా?. అందువల్లే పైకి కబుర్లు చెప్పినా, పెట్టుబడి కింద వందల, వేల కోట్లు వ్యయం చేయడానికి ఏపీకి రావడానికి భయపడ్డారేమో! దాని ఫలితంగానే ఏపీకి జిందాల్ గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. జిందాల్ను ఇబ్బందిపెట్టకపోయి ఉంటే ఆయన ఇక్కడ కొన్ని వేల కోట్లు అయినా పెట్టుబడి పెట్టడానికి సిద్దమై ఉండేవారేమో కదా? ఆ రకంగా ఏపీకి పెట్టుబడి రాకుండా ఒక పారిశ్రామికవేత్తను తరిమేశారన్న అపఖ్యాతిని చంద్రబాబు, లోకేష్లు మూటకట్టుకున్నట్లయింది కదా! ఎల్లో మీడియా ఇప్పటికి జగన్ పై తప్పుడు రాతలు రాస్తుంటుంది. ఆయన టైమ్లో పరిశ్రమలను తరిమేశారని పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేశాయి. కాని ఫలానా పరిశ్రమ వెళ్లిపోయిందని మాత్రం చెప్పలేదు. కేవలం వదంతులు సృష్టించి ప్రజలలో అనుమానాలు రేకిత్తించడంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా బాగా కృషి చేసింది. ఇదీ చదవండి: దావోస్లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారుదావోస్లో యూరప్ లోని టీడీపీ అభిమానులుగా ఉన్న ఏపీ ప్రవాసులతో సమావేశం అయి కూడా రెడ్ బుక్, అందులో రాసుకున్నవారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ స్వయంగా చెప్పినట్లు వీడియోలు వచ్చాయి కదా!. కక్ష సాధింపు లేదంటూనే ఈ మాట చెప్పాక, ఎవరైనా పరిశ్రమలవారు భయపడకుండా ముందుకు వస్తారా? పోనీ వచ్చిన తెలుగువారిలో ఎవరైనా పరిశ్రమలు పెడతామని ఎందుకు ఆసక్తి చూపలేదు? అమరావతి ప్రపంచం అంతా ఆకర్షితమవుతోందని చెబుతారు కదా. అక్కడ కూడా ఏమైనా పెట్టుబడులు పెడతామని ఎవరూ చెప్పలేదే?. ఇప్పుడేమో దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయని అనడం మిథ్య అని బాబు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. అంతకాడికి కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి వెళ్లడం ఎందుకు! అక్కడేదో అద్భుతం జరగబోతోందని బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నట్లు? ఎవరూ ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఏపీ పరువును అంతర్జాతీయంగా నడిబజారులో తీసేసినట్లు కాలేదా! చంద్రబాబు మాటలు ఎప్పటికీ మిథ్య అన్నది మరోసారి తేలినట్లే కదా!!!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అబద్ధాలను అందంగా అల్లటంలో ఆరితేరారే!
ఆంధ్రప్రదేశ్లో పాలన రోజు రోజుకూ అధ్వాన్నమవుతోంది. ఈ మాట ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అధికార పక్షానికి వత్తాసుగా నిలుస్తున్న పచ్చమీడియానే అప్పుడప్పుడూ తన కథనాల ద్వారా చెబుతోంది. చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు కొందరు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతికి హద్దుల్లేకుండా పోయాయని టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు తమ కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వారు తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే.. రింగ్ మాస్టర్లు అదేనండి.. చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్లకు ఎక్కడ మకిలి అంటకుండా నెపం ఇతరులపైకి నెట్టేయడం!. కిందటేడాది ఆగస్టు 28న చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ మాట్లాడుతూ ఒక మాటన్నారు.. ‘‘ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు తాను ఇటుక ఇటుక పేరుస్తూంటే.. ఎమ్మెల్యేలు కొందరు జేసీబీలతో కూలగొడుతున్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నా ఒకరిద్దరి తప్పుల వల్ల పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. బాబుగారి నేర్పరితనం ఏమిటంటే తన వైఫల్యాలు మొత్తాన్ని దారిమళ్లించేందుకు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులను మందలించినట్లు పోజ్ పెట్టారు. సరే అనుకుందాం కాసేపు. మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చిందా? ఊహూ అదేమీ కనబడదు. చంద్రబాబు కూడా ఏ చర్య తీసకోకుండా కథ నడుపుతూంటారు. ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు అధికారుల బదిలీలు, పొస్టింగ్లలో భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు... ఒక మంత్రి హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో మకాం వేసి మరీ ఈ దందా చేస్తున్నారని టీడీపీ పత్రిక తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలియ చేసిందని కూడా ఆ మీడియా పేర్కొంది. బ్లాక్మెయిలింగ్లో దిట్టగా పేరొందిన ఆ మీడియా బహుశా ఆ మంత్రిని బెదిరించడానికి ఏమైనా రాశారా? లేక నిజంగానే మంత్రి అలా చేశారా? అన్నది ఇంతవరకు అటు ఏపీ ప్రభుత్వం కాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాని వెల్లడించలేదు. ఈ రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పార్టీలకు అతీతంగా సాగుతున్న బంధాన్ని ఈ విషయం తెలియ చెబుతుంది. సదరు మంత్రి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని సోషల్ మీడియాలో ప్రచారమైంది. సీపీఎం నేతలు ఓపెన్గానే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ మంత్రి ఖండించలేదు. చంద్రబాబు కాని, ఆయన పేషీ కానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా ఈ మధ్య తిరుపతి సందర్శనలో కూడా చంద్రబాబు ఆ మంత్రిని పక్కన పెట్టుకుని తిరగడం విశేషం. మరో కథనం ప్రకారం.. ఆ మంత్రికి హైదరాబాద్ శివార్లలో ఉన్న భూమి విషయంలో ఏర్పడిన వివాదం రీత్యా తరచు ఇక్కడకు వచ్చి పంచాయతీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తున్నది చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా?. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి అధికారి అంటూ మరో జాకీ పత్రిక ఈ మధ్య ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే అచ్చెన్నాయుడుకు సంబంధం లేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చినట్లు కనిపించినా, కేవలం ఒక అధికారి సొంతంగా అవినీతికి పాల్పడతారా? అలాగైతే ఆ మంత్రి అంత అసమర్థుడా అన్న ప్రశ్న వస్తుంది. ఈ కథనం ఇచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా స్పందించినట్లు కనబడదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పీఏపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ పీఏ ని తొలగించానని, తను ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తి అని అనిత వివరణ ఇచ్చినప్పటికీ, ఆ ఆరోపణలకు మంత్రికి సంబంధం లేదని అంటే ఎలా నమ్ముతారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఈ విషయమై బీజేపీ పెద్దలకు ఢిల్లీలో ఫిర్యాదు చేసి వచ్చారని అంటారు. ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితుడునని చెప్పుకుంటూ ఒక ప్రముఖుడు మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగ్ లలో హవా సాగిస్తున్నారని, తనకు కావల్సింది తనకు ఇచ్చి, మీకు కావల్సింది మీరు తీసుకోండని ఓపెన్ గా చెబుతున్నారంటూ జాకీ పత్రిక చానా ముదురు శీర్షికన కథనాన్ని ఇచ్చింది. 'చానా" అనగానే అది సానా సతీష్ గురించే అని, అతను లోకేష్ తరపున వ్యవహారాలు చక్కదిద్దుతుంటారని టీడీపీలో ప్రచారం అయింది. అది రాజ్యసభ ఎన్నికల సమయం కావడంతో అతనికి టిక్కెట్ రాకుండా ఉండడానికి ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలింగ్ వార్త రాసిందని కూడా టీడీపీ వర్గాలు భావించాయి. ఈ వార్త లోకేష్ కు తీవ్ర అప్రతిష్ట తెచ్చింది. దాంతో లోకేష్ కు, ఆంధ్రజ్యోతి యజమానికి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీని నడిపే శక్తి ఇంకా రాలేదని వ్యాఖ్యానిస్తూ ఆ ఓనర్ తన వ్యాసంలో రాసి ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమి నుంచి విడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆందోళన చెందారు. విశేషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సానా సతీష్ పై అంత దారుణమైన కథనం ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసినందునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ పేషీ గురించి నేరుగా రాయకపోయినా, అక్కడ జరిగేవి ఇతర మంత్రులకు తెలియవా? అందుకే ఏ మంత్రిని మందలించే పరిస్థితి చంద్రబాబుకు లేదని కొందరి వాదనగా ఉంది. మరికొందరు మంత్రులపై కూడా పలు అభియోగాలు వస్తున్నాయి. చంద్రబాబు స్టైల్ ఏమిటంటే రహస్యంగా ఎవరు ఏమి చేసినా వారి జోలికి పద్దగా వెళ్లరు. అదే మరీ అల్లరైతే, తాను మందలించనట్లు ప్రచారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు, కూటమి నేతలు మద్యం, ఇసుకలలో ఎలా దండుకుంది బహిరంగమే. నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైపోయినా ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పెదవి కదపలేదు. మద్యం వ్యాపారంలో అనేక మంది ఎమ్మెల్యేలు 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి ఏ మాత్రం భయం లేకుండా తనకు నిర్దిష్ట శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మద్యం షాపులకు హెచ్చరిక పంపించారు. అఅంతేకాదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ మధ్య పవర్ ప్లాంట్ బూడిద రవాణాపై చెలరేగిన గొడవ తెలిసిందే. చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేయడానికి యత్నించారు. ఇక ప్రభాకర రెడ్డి కొందరు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి లేదు. కాకపోతే జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మైనింగ్ లీజుల దందాపై సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు వినాల్సిందేనని టీడీపీ ముఖ్యనేత ఆదేశించడంపై కూడా మైనింగ్ యజమానులు మండిపడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అరాచకంపై నిత్యం కథలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్టీ కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి. చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టిన రోజు వేడుకకు పోలీసులు హాజరై కేక్ కట్ చేయించడం పై విమర్శలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కూడా పోలీసు అధికారులపై రుసురుసలాడిన తీరు అందరికి బహిరంగ రహస్యమే. మదనపల్లె నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే ఒకరికి నెలకు 30 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక మహిళా తహశీల్దార్ మంత్రి లోకేశ్కు ఫిర్యాదు చేసిన విషయం సంచలనమైంది. సదరు ఎమ్మెల్యే ఖండించినా నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా అంతా భావించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి దౌర్జన్యాలపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడలో ఒక దళిత ఫ్రొఫెసర్ ను ఆయన తన అనుయాయులతో కలిసి వెళ్లి బెదిరించారు. అలాగే ఒక టీషాపు ను కూల్చి వేయించిన విషయం వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ కడపలో ఒక మండల అధికారిపై వైసీపీ నేత ఎవరో దౌర్జన్యం చేశారంటూ అక్కడకు వెళ్లి హడావుడి చేసి వచ్చారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేనని, రేషన్ షాపుల వారిని, మధ్యాహ్న భోజనం ఏజెన్సిల, ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించారు. ఇక కాంట్రాక్టర్ లను బెదిరించడం వంటివి నిత్య కృత్యమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఏకంగా అదానీ కంపెనీ సిబ్బందిపైనే దాడి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళా టీడీపీ నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. వారి మధ్య టీడీపీ నేతలు రాజీ చేశారు తప్ప ఆయనపై చర్య తీసుకోకపోవడం విశేషం. కృష్ణపట్నం ఓడరేవు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మద్యం దుకాణాలలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వలేదని నరసరావుపేటలో ఆయన అనుచరులు రెస్టారెంట్ పై దాడి చేసి వధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మట్టి దందాకు పాలపడుతున్నాడని కథనాలు వచ్చాయి. రోజూ ఇలాంటి స్టోరీలు పుంఖానుపుంఖాలు గా వస్తున్నా కూటమి అధినేతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. మరో వైపు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు ఐదువేల ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చారంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కంపెనీ యజమాని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్డర్ ఇవ్వరాదట. ఆ ఆర్డర్ చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారని ఈ పత్రిక చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. అంత పెద్ద ఆర్డర్ ముఖ్యమంత్రికి తెలియకుండా వెళుతుందా? ఇవన్ని చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన సాగిస్తోందన్న అభిప్రాయం రాదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సెకి ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పిన వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరుగుతున్న కుట్రలను.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని.. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లుతూ రాతలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారాయన. తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘రైతులకు ఉచిత కరెంట్ అనేది ఒక కల. దీనివల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. బాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారింది. డిస్కంలను నిర్వీర్యం చేశారాయన. చంద్రబాబు చేసిన సోలార్ పవర్ ఒప్పందాలు రూ.5.90తో చేసుకున్నారు. డిస్కంల అప్పులను 86 వేల కోట్లకు పెంచారు. మా హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పగటి పూటే రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వగలిగాం. ఉచిత కరెంట్ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆ టైంలో యూనిట్ను 2.40 నుంచి 2.50 రూ. చొప్పున సప్లై సేందుకు 24 బిడ్లు వచ్చాయి. కానీ, చంద్రగ్రహణం(చంద్రబాబును ఉద్దేశించి).. ఆ ప్రక్రియకు అడ్డం పడింది. కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికోసం మేం వివిధ కోర్టులో పోరాడాల్సి వచ్చింది. అలాంటి టైంలో.... 2021 సెప్టెంబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం (సెకి) నుంచి తియ్యటి కబురుతో ఓ లేఖ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పొగుడుతూ.. రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధను సెకి అభినందించింది. యూనిట్కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్ను అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇందులో 2024 సెప్టెంబర్లో 3 వేల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించిన పవర్ ఆఫర్ ఇది... కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసిస్తూ.. ఆ సంకల్పానికి తోడుగా ఉంటామని లేఖ రాసింది. మేమే పవర్ సప్లై చేస్తామని చెప్పింది. ఇక్కడ మూడో పార్టీ ఎక్కడుంది?. రెండోది.. రూ.2.49కి అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించే ఒప్పందం. ఐఎస్టీఎస్ (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు) ఛార్జీలు లేకుండా(యూనిట్కు రూ.1.98పైసా చొప్పున).. స్పెషల్ ఇంటెన్సివ్ ఇస్తానంది. ఇక్కడ.. యూనిట్ రూ.2.61 మనకు కలిసి వస్తుంది. ఏడాది 4,400 కోట్లు కలిసి వస్తాయి. ఒప్పందం ప్రకారం పాతికేళ్లకు.. లక్షల కోట్లు కలిసి వచ్చేవి... ఏపీ చరిత్రలోనే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇది. లక్షల కోట్లు ఆదాయం ఆదా కావడం సంపద సృష్టి కాదా?. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం. ఇలాంటి ఒప్పందానికి స్పందించకున్నా.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఊరుకునేవా?. నన్ను ఏమనేవారు.ఇంకా జగన్ ఏమన్నారంటే.. 👉ఆరోజుల్లో దాదాపు 18 లక్షల పంప్సెట్లు. దానికి ఉచిత కరెంటు కోసం దాదాపు రూ.9 వేల కోట్ల ఖర్చు.అలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు 5 ఏళ్ల పాలన చూస్తే.. విద్యుత్ రంగం దారుణం. డిస్కమ్లు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. డిస్కమ్ల పరిస్థితి చూస్తే, చంద్రబాబు రాకముందు రూ.29 వేల కోట్ల అప్పులు, బకాయిలు ఉంటే, ఆయన దిగిపోయేనాటికి అవి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకాయి. దాదాపు 23.88 శాతం సీఏజీఆర్. డిస్కమ్ల నష్ట పరిస్థితి.ప్రభుత్వం నుంచి డిస్కమ్లకు సపోర్టు చూస్తే.. రూ.13255 కోట్లు మాత్రమే చేయగా, మా ప్రభుత్వ హయాంలో రూ.47,800 కోట్లు. ఆ విద్యుత్ను 20 ఏళ్లపాటు ఉచితంగా ఇచ్చేలా, ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది.👉టెండర్లు. చంద్రగ్రహణం2020 నవంబర్ లో 6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, సోలార్ పార్కులు రాష్ట్రంలో పెట్టాలని టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరాకు ఎన్టీపీసీ వంటి పెద్ద సంస్థలన్నీ పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలంటే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి, రకరకాల పద్ధతుల్లో కోర్టుల్లో ఈ ప్రక్రియ అంతా ఆపేసే కార్యక్రమం జరిగింది. కోర్టుల ద్వారా ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి.2020 నవంబరులో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి, ఆ తర్వాత వివిధ కోర్టుల్లో దీని కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.👉సెకి లేఖ రాక. తీపి కబురు2021, సెప్టెంబరు 15న, రాష్ట్ర ప్రభుత్వానికి తీయటి కబురు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి నుంచి లేఖ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుంచి వచ్చిన లేఖ సారాంశం చూస్తే..6400 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధమని ప్రకటించింది. ప్రభుత్వానికి వచ్చిన అతి తక్కువ ధర రూ.2.49 చూశాం. మీరు రైతులపై చూపుతున్న శ్రద్ధను అభినందిస్తున్నాం. డిస్కమ్ల మీద భారం తగ్గిస్తూ, రైతులను ఆదుకుంటున్న విధానాన్ని, వారికి ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ, ఆ విద్యుత్ను తామే రూ.2.49కే ఇస్తామని సెకి వెల్లడించింది.అంతే కాకుండా, వారు చెప్పిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. ఒక స్పెషల్ ఇన్సెంటివ్గా.. ఐఎస్టీఎస్ (ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్)ను 25 ఏళ్లపాటు రద్దు చేస్తామని వెల్లడించారు.అలా 2026 నాటికి మొత్తం మీద 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేస్తామని సెకి వివరించింది.👉నేను ఒక్కటే అడుగుతున్నాను. ఆ లెటర్లో టేక్ ఎవేస్ చూస్తే..కేంద్ర సంస్థ సెకితో ప్రభుత్వం నేరుగా జరిపిన లావాదేవీ ఇది. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విషయం.యూనిట్ రూ.2.49కే. ఇది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్.ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఐఎస్టీఎస్ (ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్) ఉండదు. ఇది స్పెషల్ ఇన్సెంటివ్గా ఇస్తున్నామని చెప్పడం. 👉సంపద సృష్టి అంటే ఏమిటి? మీరే చెప్పండి:గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర రూ.5.10. అదే మనకు 17 వేల మిలియన్ యూనిట్లు కేవలం రూ.2.49కే ఇవ్వడానికి కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది.అంటే ఒక్కో యూనిట్ ధర ఇక్కడ రూ.2.60 తగ్గింది. దీని వల్ల ఏటా రూ.4400 కోట్లు. 25 ఏళ్లలో ఆ మొత్తం దాదాపు రూ.1.10 లక్షల కోట్లు. మరి అది సంపద సృష్టి కాదా?👉అలాంటి ఆఫర్ కాదంటే.. కేంద్రం నుంచి ఇలాంటి ఆఫర్ వస్తే.. అతి తక్కువ ధరకు విద్యుత్. ఐఎస్టీఎస్ మాఫీ. 25 ఏళ్లలో మీకు లక్ష కోట్లకు పైగా ఆదా. రైతులకు మంచి చేసేందుకు మీతో కలిసి వస్తామని అంటే..అలాంటి లెటర్ను పక్కన పెడితే, మీరంతా నన్ను ఏమనేవారు? ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏమని విమర్శించేవారు. ఆలోచన చేయమని కోరుతున్నాను. రాష్ట్రానికి మంచి చేయాలని నేను అడుగులు ముందుకు వేస్తే, బురద చల్లుతున్నారు. వారు చేస్తోంది ధర్మమేనా? మనమంతా అడగాలి. చంద్రబాబుకు అన్నీ తెలుసు. అయినా ఆయనే ఆ నింద వేస్తున్నారు.రూ.2.49కే యూనిట్ పవర్. ఇది ఒక చరిత్ర. కేవలం మా ప్రభుత్వం వల్లనే సా«ధ్యమైంది. అది చరిత్రాత్మక ఒప్పందం. అలాంటి ఒప్పందాన్ని తప్పుబడుతున్నారు. ఆరోపణలు చేస్తున్నారు.👉చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోళ్లుచంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014ృ19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. ఆ పీపీఏలు గమనిస్తే.. రూ.4.84 నుంచి రూ.4.83 వరకు ఉన్నాయి. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చింది. సోలార్ కు సంబంధించి.. 2500 మెగావాట్లకు ఆయన పీపీఏ చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ 6.49కు కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. రూ.5.25 నుంచి 6.99 మధ్య ఒప్పందం చేసుకున్నారు.2015లో రూ.5.96 కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం. 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50 కి కొనుగోలు చేశారు. ఆయన సోలార్ ఎనర్జీని యావరేజ్ గా రూ.5.90కి కొనుగోలు చేశారు.👉అతి తక్కువ రేట్కు పీపీఏ చేయడం తప్పా?: చంద్రబాబు హయాంలో విండ్ పవర్ యావరేజ్ యూనిట్ ప్రైస్ రూ.4.63 అయితే.. సోలార్ యూనిట్ రూ.5.90. మరి నేను రూ.2.49కు అంటే చంద్రబాబు పెట్టిన దానిలో సగం రేటుకు కొనుగోలు చేస్తే.. చీపెస్ట్ రేట్ కి పవర్ సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే.. ఐఎస్ టీ ఎస్ చార్జెస్ మాఫీ చేస్తామని చెబితే.. నేను స్పందించకపోయి ఉంటే నన్ను మీరేమని ఏమనేవారు?.స్పందించిన నేను మంచి వాడినా.. అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు మంచి వాడా?👉ఎవరికి సంపద సృష్టి. ఎవరికి ఆవిరి?:చంద్రబాబు హయాంలో సంపద ఎలా ఎరోడ్ (ఆవిరైపోయిందో) అయిందో చెబుతాను.చంద్రబాబు సోలార్, విండ్ పీపీఏలను వైయస్సార్ సీపీ చేసుకున్న సోలార్ ఒప్పందంతో పోలిస్తే.. అవన్నీ 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంపై మోపుతున్న భారం.. రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం ఇది. ఇదే మాదిరిగా చూస్తే.. 3500 విండ్ పీపీఏలకు సంబంధించి ఆయన చేసుకున్న రూ.4.84లు మైనస్ మనం చేసుకున్న రూ.2.49. అంటే రూ.2.35 రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇంటూ 3500 మెగావాట్లు అంటే 9000 మిలియన్ యూనిట్లు..అంటే రూ.2.35 ఇంటూ 9000 మిలియన్ సంవత్సరానికి రూ.2వేల కోట్లు.. 25 ఏళ్లలో రూ.50 వేల కోట్లు కేవలం చంద్రబాబు చేసుకున్న విండ్ యూనిట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం.సోలార్ ఎనర్జీ ఒప్పందాలు చూస్తే.. చంద్రబాబు 2400 మెగావాట్లు ఆయన చేసుకున్న ఒప్పందం.. యావరేజ్ ప్రైస్ రూ.5.90.అదే మేము ఒప్పందం చేసుకున్నది రూ.2.49. అంటే రూ.3.41 ఆయన చేసుకున్న పీపీఏల వల్ల రాష్ట ప్రభుత్వం అదనంగా కట్టాలి కదా? 2400 మెగావాట్లు అంటే.. 4200 మిలియన్ యూనిట్లు ఇంటూ రూ.3.41. ఏడాదికి 1500 కోట్లు సంవత్సరానికి భారం పడుతుంది. 1500 కోట్లు ఇంటూ 25 ఏళ్లు అంటే.. 37500 కోట్లు.. జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరుగుతుంటే.. చంద్రబాబు చేసుకున్న సోలార్, విండ్ ఒప్పందాల వల్ల.. 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల సంపద ఆవిరవుతుంది. తేడా గమనించండి.👉సెకి లేఖ. పరిణామాలు. ఒప్పందం:సెకి నుంచి 2021, సెప్టెంబరు 15న లేఖ రాగా, ఇటువంటి మంచి ఆఫర్ రావడంతో, ఆ మర్నాడే క్యాబినెట్ మీటింగ్ ఉండగా, దాన్ని టేబుల్ ఐటెం కింద పెట్టాం. అంటే సెప్టెంబరు 16న క్యాబినెట్లో చర్చించాం. ృ ఎనర్జీ శాఖ అన్నీ అధ్యయనం చేసి వచ్చే క్యాబినెట్ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాదాపు 40 రోజుల పాటు అన్నీ అధ్యయనం చేసిన ఇంధనశాఖ కమిటీ, 2021, అక్టోబరు 25న నివేదిక సమర్పించారు.ఆ తర్వాత అక్టోబరు 28న క్యాబినెట్ జరగ్గా, ఆ నివేదికను క్యాబినెట్ ముందు ఉంచడం జరిగింది. అన్నీ చర్చించిన తర్వాత క్యాబినెట్ ఏం చెప్పిందంటే, ఏపీఈఆర్సీ అనుమతి కూడా తీసుకోవాలని నిర్దేశించి, ఆమోదం తెలిపింది.ఆ తర్వాత నవంబరు 11న ఏపీఈఆర్సీ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ క్రమంలో డిసెంబరు 1, 2021న ప్రభుత్వం, సెకి మధ్య పవర్సేల్ అగ్రిమెంట్ జరిగింది.దాంట్లో ఎవరెవరు సైన్ చేశారంటే.. సెకి, రాష్ట్ర ప్రభుత్వం, నాలుగు డిస్కమ్లు సంతకాలు చేశారు. ఇక్కడ ఎక్కడా థర్డ్ పార్టీ లేదు.స్పష్టంగా చెప్పాలంటే.. అది సెకి, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్ల మధ్య జరిగిన ఒప్పందం. దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ముందే ఇచ్చింది.👉ఆ ఒప్పందం కనుక చేసుకోకపోయి ఉంటే..:ఒక చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంటే.. రూ.2.49కే విద్యుత్ మన రాష్ట్రానికి దొరుకుతుంటే, ఇంకా స్పెషల్ ఇన్సెంటివ్గా ఐఎస్టీఎస్ మాఫీ. అదెంతో తెలుసా? ఒక్కో యూనిట్కు రూ.2. అంటే ఒక్కో మెగావాట్కు నెలకు దాదాపు రూ.4 లక్షలు. అంటే ఏడాదికి దాదాపు రూ.50 లక్షలు అన్నమాట. అంత తక్కువ ధరకు మనకు సోలార్ విద్యుత్ వచ్చింది. ఆత్మ నిర్బల్ భారత్ కింద, సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తూ, కేంద్రం మనకు ఆ ఇన్సెంటివ్ ఇచ్చింది.అంత మంచి ఆఫర్ను నేను పక్కనపడేసి ఉంటే, అదే మీరు ఏమనేవారు? 25 ఏళ్లలో దాదాపు రూ.1.10 లక్షల కోట్లు ఆదా. అంటే అది సంపద సృష్టి కాదా? నిజానికి అది ఒక రోల్మోడల్ కేసు.అప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధర:ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఇదే సెకి, అదే ఆత్మ నిర్బల్ భారత్ కింద.. తమిళనాడుకు కూడా విద్యుత్ సరఫరా చేసింది.చత్తీస్గడ్ రూ.2.61. ఒడిషా రూ.2.61. తమిళనాడు రూ.2.61అదే మన రాష్ట్రానికి 12 పైసలు తక్కువగా రూ.2.49కే తెస్తే, నన్ను సన్మానించాల్సింది పోయి, ఏం విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు సంపద ఆవిరి చేస్తే, నేను సృష్టించాను. మరి ధర్మం, న్యాయం ఎక్కడుంది?ఎల్లో మీడియా పిచ్చి రాతలు:ఇక ఎల్లో మీడియా రాతలు. వారికి తోడు తానా అంటే తందానా అంటూ, చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, ఇతర పార్టీల్లో ఉన్న ఆయన మనుషులు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ల పిచ్చి విమర్శలు. గుజరాత్లో రూ.1.99కే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే, మనం రూ.2.49కి ఎందుకు కొన్నామని అంటున్నారు.అక్కడి పరిస్థితులు వేరు. ఇర్రేడియేషన్ స్థితి. ఎడారి ప్రాంతాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువ.కానీ, చంద్రబాబు, ఎల్లో మీడియా అతి తెలివి ప్రదర్శిస్తూ.. గుజరాత్, రాజస్థాన్లో ఉత్పత్తి వ్యయం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఎంతో తెలుసా? యూనిట్కు రూ.1.98.మరి ఈనాడు గుజరాత్ గురించి రాశారు. అక్కడ యూనిట్ ఉత్పత్తి వ్యయం రూ.1.99 అంటున్నారు. మరి ఎక్కడ ఉత్పత్తి? ఎక్కడ వినియోగం? చూడాలి కదా?అంటే గుజరాత్లోనే ఉత్పత్తి చేసి, ఆ రాష్ట్రంలోనే సరఫరా చేస్తున్నారు. అంటే మొత్తం అంతా రాష్ట్రంలోనే. అందుకే వారికి ఆ రేట్లు వర్తిస్తున్నాయి.వారికి అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్ వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూ.1.99.రాజస్థాన్లో చూస్తే, అదే స్థితి. ఉత్పత్తి, సరఫరా అంతా ఒకే రాష్ట్రంలో. అయినా ఈనాడులో అది రాయరు. కేవలం ఉత్పత్తి వ్యయం తక్కువ అని మాత్రమే చెబుతారు. అక్కడ కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు. మరి అలా రాయడం వక్రీకరణ కాదా?👉కోవిడ్ తర్వాత, తాజాగా గుజరాత్లో సెకి టెండర్లు చూస్తే.. 2024, మార్చి 15న టెండర్ల బిడ్లు చూస్తే, రూ.2.62 నుంచి రూ.2.67 వరకు ధర. అంటే గుజరాత్లోనే ఉత్పత్తి. ధర.రాజస్థాన్లో కూడా బిడ్లు చూస్తే.. దాదాపు అవే ధరలు. అంటే ప్రస్తుత రెన్యూవబుల్ ఎనర్జీ రేట్లు ఇలా ఉన్నాయి.👉ఆ లెక్కన రూ.1.50కే రావాలి కదా?:మనకు అక్కడి జనరేషన్ కాస్ట్ కంటే తక్కువకు రూ.2.49కే వచ్చాయని సంతోషపడాలి.ఈనాడులో ఏం రాశారు? ఏళ్లు గడుస్తున్న కొద్దీ కొత్త మోడళ్ల టీవీల ధరలు తగ్గుతాయి. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత తగ్గాలి కదా? అంటున్నారు.ఆ ప్రకారం, ఈనాడు థియరీ ప్రకారం చూస్తే.. అదే గుజరాత్లో సోలార్ పవర్ ఇవాళ రూ.1.50కే రావాలి కదా? మరి రూ.2.67 వరకు ఎందుకు పోయింది? అంటే ఏ స్థాయిలో అబద్ధాలు చెబుతున్నారనే దానికి ఇవన్నీ ఉదాహరణలు.👉మీడియా ప్రశ్నలకు సమాధానంగా..చంద్రబాబు ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటే..ఎవరూ అంత తెలివి తక్కువగా ఆ పని చేయరు. అంత తక్కువ ధరకు విద్యుత్ దొరకదు. పైగా 25 ఏళ్లలో లక్ష కోట్లకు పైగా ఆదా. 2009 నుంచి చూస్తే.. రూ.3.70 మొదలు చంద్రబాబు హయాంలో రూ.6.99 వరకు చేరింది.మా హయాంలో ఒకే అగ్రిమెంట్. యూనిట్ ధర రూ.2.49.అంత తక్కువ ధరకు ఎవరూ కొనుగోలు చేయలేరు. ఇది వాస్తవం.ఇంకా చెప్పాలంటే చరిత్రాత్మకం. డిస్కమ్లు కరెంటు కొంటున్నాయి. సెకి సరఫరా చేస్తోంది. మేము యూనిట్కు రూ.2.49 చొప్పున సెకికి చెల్లిస్తున్నాం. అది అప్పట్లో చాలా తక్కువ ధర. పైగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల మాఫీ. అంత మంచి ఆఫర్ ఎవరైనా వదులుకుంటారా? మీరే చెప్పండి. దాని వల్ల ఏటా రూ.4400 కోట్లు ఆదా. అంటే 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా. ఇది ముమ్మాటికీ సంపద సృష్టే.సెకితో ఏపీ ప్రభుత్వ ఒప్పందం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇంత మంచి చేసిన నన్ను అభినందించి సత్కరించాల్సింది పోయి.. రాళ్లు వేస్తునన్నారు. అయినా.. చంద్రబాబు, ఆయన సోషల్ మీడియా ఇంతలా వక్రీకరించి మాట్లాడడం ధర్మమేనా?. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఇంతలా వకక్రీకరించాలా?. టీవీ రేట్లు తగగ్గినట్లు కరెంట్ రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. ఇక్కడే వక్రీకరణ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని జగన్ అన్నారు. -
అప్పుడు తప్పుబట్టి.. ఇప్పుడేమో ఆకాశానికెత్తి మరీ!
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ పలు పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఓకే చేయడం, దానికి అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగింది. డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో జగన్ ప్రభుత్వ విధానాల ప్రకారం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించింది. అందుకోసం ప్రభుత్వం భూముల కేటాయింపు చేసింది. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న ఎనిమిది శాతం వాటాను అదాని గ్రూప్ కొనుగోలు చేసింది. అలాగే ప్రైవేటు రంగంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు కూడా అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చింది. ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఏమని ప్రచారం చేసిందో గుర్తుందా?జగన్ ఏపీని అదానీకి రాసిచ్చేస్తున్నారని.. అదానీకి జగన్ రెడ్ కార్పెట్ వేస్తున్నారని.. ఏపీ అంతా దోపిడీ జరిగిపోతోందని వదంతులు సృష్టించారు. అదానీ పెట్టుబడులను జగన్ స్వాగతిస్తే దారుణమైన వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఎల్లో మీడియా.. ఏదో రకంగా విమర్శలు చేసిన తెలుగుదేశం ఇప్పుడు మొత్తం ప్లేట్ మార్చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంంతోనే అదానీ ఇప్పుడు మంచి పెట్టుబడిదారుడు అయిపోయారు. అదానీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవ్వగానే మొత్తం ఏపీ ముఖచిత్రం మారిపోయినట్లు తెలుగుదేశం మీడియా డాన్స్ చేస్తోంది.ఇక తెలుగుదేశం పరిశ్రమలు పెట్టేసినంతగా ఊదరగొడుతుంది. అదానీ అప్పుడైనా, ఎప్పుడైనా పరిశ్రమలు పెట్టి ఏపీకి ఉపయోగపడితే మంచిదే. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు రాకుండా, వచ్చిన వాటిని భయపెట్టేలా అటు తెలుగుదేశం ప్రచారం చేసింది. ఇటు ఎల్లో మీడియా అడ్డంగా దుష్ప్రచారం చేసింది.అప్పుడు పరిశ్రమల స్థాపనకు భూములిచ్చినా, నీళ్లిచ్చినా, రాయితీలిచ్చినా దోచుకోవడమన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విధానం తయారు చేస్తేనే వరాల వర్షం కురుస్తోందని , స్వర్ణాంధ్ర సాకారం అవుతోందని బాకా వూదుతున్నారు. జగన్ టైంలో షిరిడీ సాయి సంస్థ కొత్త ప్రాజెక్టును చేపట్టడానికి వీలుగా ప్రభుత్వంనుంచి భూమిని తీసుకుంది. అలాగే నెల్లూరు జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు భూమి తీసుకుంది. రామాయపట్నంవద్ద ఇండోసోల్ అనే సంస్థ సోలార్ ప్యానెల్స్ తయారీకి పూనుకుంటే.. ఈనాడు మీడియా ఎంత విష ప్రచారం చేసిందో చెప్పలేం.కొద్ది రోజుల క్రితం అదానీతో భేటీ సందర్భంగా వచ్చిన కథనాలను గమనిస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్ ను రాసిచ్చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతోందా? అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఒకటేమిటి !అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలు చేస్తోందని ఈనాడు మీడియా బాజా వాయించింది.ఇవేగాదు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా అదానీ కంపెనీయే నిర్మిస్తుందట. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ప్రాజెక్టులు పెడుతుంటే.. పచ్చి అబద్ధాలను వండివార్చిన ఎల్లో మీడియా ఇప్పుడు మొత్తం ఏపీలో అన్నిరకాల పెట్టుబడులను గుజరాత్ కు చెందిన అదానీ తెస్తే బాగుందన్నట్టుగా రాస్తున్నారు. వారు అడిగినంత మేర వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందట. టెండర్లు లేకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం అదానీకి ఎలా అప్పగిస్తారో తెలియదు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నీచమైన రాజకీయం జరుగుతున్నదో ప్రజలు ఆలోచించుకోవచ్చు.తమకు నచ్చని పారిశ్రామికవేత్తలపై బురద చల్లడం, తమకు ఇష్టం లేని పార్టీ అధికారంలో ఉంటే వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని అసత్య ప్రచారాలను చేయడం ఇవ్వన్నీ చూస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద మాఫియా గుప్పిట్లో చిక్కుకున్నదనే అభిప్రాయం కలుగుతోంది.జగన్ ప్రభుత్వం రామాయపట్నం , మచిలీపట్నం, మూలపేట పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వపరంగా నిర్మాణం సాగించింది. ఆ పోర్టులను కూడా అదానీకే అప్పజెప్పాలన్న ఆలోచన జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కృష్ణపట్నం, గంగవరం పోర్టులలో అదానీ పెట్టుబడులను పెడితేనే ఏదో ఘోరం జరిగిపోయినట్టు ప్రచారం చేసిన వీళ్లు.. ప్రస్తుతం ఆ పోర్టుల విస్తరణకు అవసరమైన వందల వేల ఎకరాల భూములను కట్టబెట్టి ఆ కంపెనీపోర్టుల విస్తరణకు ప్రతిపాదించింది అని ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు.ఇక మంత్రి లోకేష్ అమెరికాలో ఆయా కంపెనీల సీఈవోలను కలవడాన్ని హైలైట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. టెస్లా కార్ల కంపెనీకి లోకేష్ ఆహ్వానం పలికారని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో భాగస్వాములు కావాలని కోరారని రాశారు. వీటిలో నిజంగా ఏదైనా జరిగితే మంచిదే. కానీ ఇదే లోకేష్ కొద్ది సంవత్సరాల క్రితం టెస్లా కంపెనీ ఏపీకి వచ్చేస్తున్నదన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు నిజంగానే దాన్ని సాధించగలిగితే స్వాగతించవచ్చు. అలా కాకుండా ప్రచార ఆర్భాటానికి సూపర్ సిక్స్ హామీల అమలు వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి యాత్రలు చేస్తుంటే అది ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది.ఎల్లో మీడియాలో మరో మోసపూరిత కథనం ఇచ్చింది. స్కిల్ హబ్ గా ఏపీ మారుతోందని నైపుణ్య శిక్షణతో ఏడాదికి 1.24 లక్షల ఉద్యోగాలు వస్తాయని 92వేల మందికి స్వయం ఉపాధి కలుగుతుంది సిడాప్ వార్షిక ప్రణాళిక తెలిపిందంటూ ఆహా,ఓహో అంటూ భజనం చేసింది. ఒక వైపు ఉన్న ఉద్యోగాలను ఊడగొడతూ ఇంకోవైపు లక్షల ఉద్యోగాలు వస్తాయని నివేదికలు తయారు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు గమనించలేరా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోల
సాక్షి, అమరావతి: తన వంద రోజుల పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో ఆ వ్యవహారం నుంచి వారి దృష్టి మళ్లించడానికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కల్తీ అయిందని చంద్రబాబు చెబుతున్న నెయ్యిని అసలు వాడనప్పుడు లడ్డూ ఏ విధంగా కల్తీ అవుతుందని.. ఈ లెక్కన ఏ విధంగా అపచారం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు అండ్ గ్యాంగ్ నుంచి సమాధానం లేదు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ మూలాలున్నాయని గుర్తించిన వెంటనే.. ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించామని, ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమక్షంలో స్పష్టంగా ప్రకటించారు. ఆ ట్యాంకర్లు కనీసం టీటీడీ గోడౌన్ వరకు కూడా రాలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ తలకెక్కించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేయడం ద్వారా లబ్ధి పొందాలని కుట్ర పన్నారు. ఆ వెంటనే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిందని నింపాదిగా ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పచ్చిగా అబద్ధం చెప్పారు. ఇందుకు కారణం గత ప్రభుత్వమేనని నింద మోపుతూ దుష్ప్రచారం ప్రారంభించారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఎల్లో గ్యాంగ్ ఇదే పాటను అందుకున్నారు. అసలు కల్తీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తు ఈవోనే చెబుతున్నప్పుడు.. కల్తీ అయిన నెయ్యితో లడ్డూ తయారు చేశారని ఎలా చెబుతారంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, కోట్లాది మంది భక్తులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్డు సిటింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానికి లేఖ రాసిన వైఎస్ జగన్ పచ్చి అబద్ధాలు చెప్పే అలవాటున్న సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బ తీసే స్థాయికి దిగజారారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. జరగని తప్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగించనప్పుడు తప్పు జరిగే అవకాశమే లేదని చెప్పారు. చంద్రబాబు చర్యలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీని, ఆ సంస్థ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను, టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్న చంద్రబాబును గట్టిగా మందలించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆదివారం లేఖ రాశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం 100 రోజుల్లో ఇచి్చన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారన్నది స్పష్టమైంది. కల్తీ జరిగిందనే ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. అలా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. తద్వారా కోట్ల మంది తిరుమల భక్తుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. వాస్తవానికి ఆలయంలోనికి వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్ నుండి మూడు నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. గతంలో కూడా ఈ వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. వాస్తవంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా ప్రారంభించింది జూన్ 12 నుంచి అని టీటీడీ ఈవోనే చెబుతున్నారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన రెండు నెలల తర్వాత చంద్రబాబు ఆ విషయం గురించి రాద్ధాంతం చేయడాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. ఆ ల్యాబ్ నివేదికను టీడీపీ కార్యాలయం నుంచి విడుదల చేయడాన్ని బట్టి ముమ్మాటికీ ఇది రాజకీయం కుట్రేనని స్పష్టమవుతోంది. మరో వైపు కల్తీకి ఆస్కారమే లేదని ఆహార రంగ నిపుణులు సైతం తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం తన జేబులోని అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. -
ఆ రెండు బోట్లు ఎవరివి? ఏమయ్యాయి?
ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనలో కుట్ర కోణం ఉంది. కావాలనే వీటిని పంపించారు. ఆ బోట్లపై వైఎస్సార్సీపీ రంగులు ఉన్నాయి. కాబట్టి, ఇది ఆ పార్టీ నేతల కుట్రే.. అంటూ గత వారం రోజులుగా సీఎం చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ నేతలు.. వీళ్లకు తోడైన అనుకూల మీడియా-సోషల్ మీడియా పేజీలు కథనాలను అరిగిపోయేలా ప్రచారం చేస్తున్నాయి. అదే టైంలో బోట్ల యాజమానుల్ని పోలీసులు అరెస్ట్ చేయగానే.. వాళ్లు వైఎస్సార్సీపీ నేతలంటూ ప్రచారం మొదలుపెట్టాయి. అయితే..ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటన కేసులో అరెస్టైన ఇద్దరూ టీడీపీకి చెందినవాళ్లే. ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది వైస్సార్సీపీ. దీంతో ఎల్లో బ్యాచ్కు దిమ్మతిరిగిపోయింది. అయినా కూడా వైఎస్సార్సీపీపై బుదర జల్లడం ఆపలేదు టీడీపీ. ఇంకోవైపు.. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు బ్యారేజీని ఢీ కొట్టిన మరో రెండు బోట్ల గురించి మాత్రం పెదవి విప్పడం లేదు.ఆగస్ట్ 30, 31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్ 1 రాత్రి నాటికి ప్రకాశం బ్యారేజీకి దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో 70 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఆ సమయంలోనే ఆ వరద ప్రవాహంలో గొల్లపూడి వైపు నుంచి బోట్లు కొట్టుకుని వచ్చాయి. అందులో రెండు బోట్లు అప్పటికే దిగువకు వదులుతున్న నీటితో పాటు కొట్టుకుపోగా.. మరో మూడు బోట్లు మాత్రం బ్యారేజ్ పిల్లర్లను ఢీకొట్టి అక్కడే పిల్లర్లు, గేట్ల మధ్య ఇరుక్కుపోయాయి. ఆ బోట్లు ఢీకొట్టడంతో పిల్లర్ నెంబర్ 69కి సంబంధించిన కౌంటర్ వెయిట్ (కాంక్రీట్ బీమ్) విరిగింది.ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ను బోట్లు ఢీకొట్టిన ఘటనలో విజయవాడ వన్ టౌన్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్లే కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి, సూరాయపాలేనికి చెందిన కోమటి రామ్మోహన్ను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరూ వైఎస్సార్సీపీ వాళ్లంటూ టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. అయితే వైఎస్సార్సీపీ అసలు విషయాన్ని బయటపెట్టింది.కోమటి రామ్మెహన్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధి కోమటి జయరాం బంధువు. రెండో నిందితుడు ఉషాద్రి కూడా టీడీపీకి చెందిన వ్యక్తే. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ గెలిచాక విజయోత్సవ ర్యాలీలు సైతం ఆ బోట్లలో నిర్వహించారు కూడా. అయితే..ఘటన జరిగి ఇన్నిరోజులైనా పోలీసులు, ప్రభుత్వం, టీడీపీ అనుకూల మీడియా.. ఇలా అందరి ప్రకటనలు నిలిచిపోయిన ఆ మూడు బోట్లపైనే నడుస్తోంది. కేవలం వాటి రంగు ఆధారంగా కుట్రకోణంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించాలనే కుట్ర బలంగా నడుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో ఇదే కోణాన్ని హైలెట్ చేస్తున్నారు. మరి బ్యారేజ్ కౌంటర్ వెయిట్స్ను ఢీ కొట్టిన ఆ రెండు పడవలు ఎవరివి?.. ఇక్కడ దిగువకు కొట్టుకుపోయిన ఆ రెండు బోట్లను పోలీసులు గుర్తించలేదు. వాటి యాజమానులను అదుపులోకి తీసుకుని విచారించలేదు. వాస్తవానికి వరద ఉధృతిని ఆ బోట్లతో పాటు టూరిజంకు చెందిన చిన్నాచితకా బోట్లు కూడా కొట్టుకుపోయాయి. కానీ, ప్రభుత్వం కళ్లు మాత్రం ఆగిపోయిన ఆ బ్లూ రంగు బోట్ల మీదే ఉండిపోయింది. అందుకే ఇది వైఎస్సార్సీపీ పనేనంటూ అసత్య ప్రచారం చేస్తోంది. దానికి తగ్గ కోణంలోనే.. ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తు సాగింది. మరోవైపు.. వాస్తవాల్ని మరుగున పెట్టి విషప్రచారం కొనసాగిస్తూనే ఉంది ఎల్లో మీడియా. -
సజ్జలపై దుష్ప్రచారం.. తీవ్రంగా హెచ్చరించిన వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించిన మీడియా సంస్థపై, వాటి ఆధారంగా విమర్శలకు దిగిన తెలుగు దేశం పార్టీపై వైఎస్సార్సీపీ తీవ్రంగా మండిపడింది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించింది. ‘‘తనను చూసుకునేవారు లేక ఒక నాయకుడు వివాహం చేసుకుంటే…, ఆ మహిళనుద్దేశించి మీరు నడిపిన కథలు, కథనాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. మీ రాజకీయ ప్రత్యర్థులపైన, మీ వ్యతిరేక పార్టీలపైన మీరు ప్రయోగించే అనైతిక సూత్రమే “వ్యక్తిత్వ హననం’’. మీరు నమ్మిన సిద్ధాంతమే ఇది. ఇదీ చదవండి: నారా లోకేష్ లేడుగా.. అందుకే క్యాన్సిల్!.. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంపేస్తే దాన్ని ప్రజాస్వామ్యమని రాశారు. బాలకృష్ణ తుపాకీతో కాల్పులు జరిపితే, ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ ఫీజులను ఒక పారిశ్రామిక వేత్తతో కట్టించి, అది నారా లోకేష్ ప్రతిభ అన్నారు. మహిళలతో అసభ్యంగా తైతక్కలాడితే అవి చిన్ననాటి సరదాలు అంటారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోతే కనీసం వాయిస్ శాంపిల్ ఇవ్వకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు తప్పించుకున్నారు. మీలో నీతి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు, నైతికత ఇసుమంతైనా మీలో కనిపించడం లేదు అంటూ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచింది.‘‘తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి’’రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా నిరాధార ఆరోపణలా @JaiTDP?తనను చూసుకునేవారు లేక ఒక నాయకుడు వివాహం చేసుకుంటే…, ఆ మహిళనుద్దేశించి మీరు నడిపిన కథలు, కథనాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. మీ రాజకీయ… https://t.co/v8xK6Q3lqe— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
అదేనా మా తప్పు?: టీడీపీకి ఆర్కే రోజా సూటి ప్రశ్న
విశాఖపట్నం, సాక్షి: రుషికొండలో గత జగన్ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు.. అక్రమ కట్టడాలని ప్రచారం చేస్తున్న టీడీపీకి గట్టి ఎదురు దెబ్బలే తగులుతోంది. చంద్రబాబు మాదిరి జగన్ తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయలేదని.. ప్రజా ధనంతో పటిష్టమైన ప్రభుత్వ భవనాలే నిర్మించారని ఇటు వైఎస్సార్సీపీ, అటు నెటిజన్లు కౌంటర్లు ఇస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఈ అంశంపై స్పందించారు. రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా.. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా? అని టీడీపీ శ్రేణుల్ని గట్టిగా ప్రశ్నించారు. ‘‘విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా?. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా?’’ అంటూ సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం.. 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..?. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టం...ఇందులో అక్రమం ఎక్కడుంది..?. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..?. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...?. ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా..... హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..?. ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..?. హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా...ఈరోజు విమర్శలు చేసేది..?. .. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..?. జగనన్నపైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు...వెనకడుగు వేసేది లేదు.. జై జగన్ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. -
నారావారి కిరాయి ముఠాలు.. తస్మాత్ జాగ్రత్త!
పచ్చపార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని వారి సర్వేల్లోనే తేలిపోయింది. జనసేన-బీజేపీలతో ప్రత్యక్షంగానూ కాంగ్రెస్ తో పరోక్షంగానూ కమ్యూనిస్టులతో సీక్రెట్ ఒప్పందాలతోనూ బరిలో దిగినా లాభం ఉండేలా లేదని తేలిపోయింది. దింపుడు కళ్లెం ఆశలు కూడా అడుగంటేశాయని అర్ధమైపోతోంది. ఇంత ఫ్రస్ట్రేషన్ లో వలంటీర్లపై కక్షసాధింపు కోసం తాము పన్నిన పాచిక తమనే లాగి లెంపకాయ కొట్టేయడంతో దవడ వాచిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో జనం అంతా జగన్ మోహన్ రెడ్డి యాత్రలోనే ఉన్నారని అర్ధం అయిపోయింది. మరేం చేయాలి? ఈ కష్టాల్లోనే చంద్రబాబు నాయుడికి ఓ దిక్కుమాలిన ఐడియా వచ్చింది. దాంతో పాలక పక్షం ఓడిపోతోందంటూ ప్రచారం చేయించడానికి మౌత్ టాక్ మల్లిగాళ్లకు కిరాయి డబ్బులిచ్చి ఊళ్లపైకి వదిలారు. అయితే వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులుగా మాయదారి ముఠాలు ఊళ్లల్లో తిరుగుతున్నాయి స్టూవర్ట్ పురం దొంగల ముఠాలకన్నా ప్రమాదకరమైన ముఠాలవి.చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం..ఆయన రాజకీయ ప్రత్యర్ధులపై విష ప్రచారం చేయడం ఈ ముఠాల పని. దీనికోసం వీరికి కిరాయి చెల్లిస్తున్నారు. ఈ ముఠాల అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందంటే... తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. చంద్రబాబు నాయకత్వానికి కూడా. ఈ ఎన్నికల్లో కూడా ఓడి ఇంట్లోనే ఉండాల్సి వస్తే టీడీపీ దుకాణానికి తాళాలు వేయాల్సిందే. ప్రస్తుత వాతావరణం చూస్తోంటే ఈ సారి కూడా వైఎస్సార్సీపీ విజయమే ఖాయమని రక రకాల సర్వేలు చెబుతున్నాయి. టీడీపీకి ఈసారి మరింత ఘోర పరాభవం తప్పదని క్లారిటీ ఇస్తున్నారు అంతా. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల మనసులు మార్చడం తన వల్ల కాదని తెలిసిపోయింది. టీడీపీ గెలుస్తుందని చెప్పించుకున్నా ఎవరూ నమ్మరని అర్ధమైపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు తనకే సాధ్యమైన ఓ క్షుద్ర ఆలోచనను మెదడులోంచి బయటకు తీశారు. ఆ ఆలోచన ఏంటంటే.. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి గెలుస్తందని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి. వైఎస్సార్సీపీ గెలవదని చెబితే ఏమైనా వర్కవుట్ అవుతుందేమో అని ఓ పుచ్చు ఐడియాను అమలు చేస్తున్నారు. జనం ఎక్కువగా తచ్చాడే కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రైళ్లల్లో కొన్ని గుంపులను పంపిస్తున్నారు చంద్రబాబు. ఈ గుంపుల పని ఏంటంటే.. మేం వైఎస్ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలమే కానీ.. ఈ సారి మా పార్టీ ఓడిపోయేలా ఉంది" అని ప్రచారం చేస్తున్నారు. అంటే మౌత్ టాక్ పబ్లిసిటీ అన్నమాట. దీనికి గానూ ఈ గుంపులకు రోజుకింత అని కిరాయి ముట్టజెబుతున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచులను ఆరు బయట పెయిడ్ ఆర్టిస్టులను మేపినట్లే..ఈ మౌత్ టాక్ మల్లిగాళ్లను ఎన్నికల వరకు మేపాలని డిసైడ్ అయ్యారు. పీకే ఫ్యామిలీపై విషం చిమ్మినోళ్లే.. జనం రద్దీగా ఉండే చోట వీళ్లు అమాంతం వచ్చి.. వాళ్లే మాటలు కలిపి ఈ సారి వైఎస్సార్సీపీ రాదండి అనేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ చచ్చు ఐడియా కూడా వర్కవుట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ గుంపుల్లో ఉండే వారంతా పచ్చ కార్యకర్తలే. గతంలో ఇటువంటి కార్యకర్తలే పవన్ కల్యాణ్ కుటుంబంపైనా విషం చిమ్మారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కష్టం వచ్చినా మల్లిగాళ్లను పిలిపించి ఇటువంటి అసైన్ మెంట్లు ఇప్పిస్తారు చంద్రబాబు. మౌత్ టాక్తోనే పాలక పక్షాన్ని దెబ్బతీయాలన్న పిచ్చి ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. అసలింతకీ ఈ అయిడియా రావడానికి కారణాలేంటి? చంద్రబాబు అంతగా ఓటమి భయంతో కుంగిపోడానికి కారణాలు ఉన్నాయి. జనం తమ వైపు లేరు. విజయం తమ వైపు లేదు. అధికారం తమకు దక్కేలా లేదు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ నాటి పూర్వ వైభవం వచ్చేలా లేదు. చంద్రబాబు, లోకేష్ లు సభలు పెడితే జనం కనపడ్డం లేదు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్ధమా అని సభలు పెడితే ఇసకేస్తే రాలని జనంతో నేల కనపడ్డం లేదు. ఈ రెండు దృశ్యాల మధ్య తేడా చూసి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అధిపతులకు కళ్లు బైర్లు కమ్మి కళ్లముందు ఏమీ కనపడ్డం లేదు. తమ ఓటమి ఖాయమని స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా తమ పార్టీ కుప్పకూలిన రోజునే చంద్రబాబుకు అర్ధం అయిపోయింది. పార్టీయే కాదు తన సొంత నియోజక వర్గంలో తనకు కూడా ఓటమి తప్పదన్న భయం చంద్రబాబు గుండెల్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది. గుణపాఠం తప్పదా? పేరుకి ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. కాలం కలిసొచ్చినపుడు..తమ పెంపుడు మీడియా తమకి బాకా ఊదిన రోజుల్లో ఢిల్లీలో చక్రాలు తిప్పామని చెప్పించుకున్న చంద్రబాబు ఇపుడు ఏపీలో కాదు తన సొంత నియోజక వర్గంలోనే సైకిల్ చక్రాన్ని కూడా తిప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నారు. అది సరిపోదని బిజెపి నేతలు ఛీ ఛీ అంటోన్న కాళ్లబేరాలాడి పొత్తు పెట్టుకున్నారు. తాము ముగ్గురం కలిసి బరిలో దిగినా ఒరిగేదేమీ లేదని తేలడంతో కాంగ్రెస్ తో రహస్య పొత్తు పెట్టుకున్నారు. వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయం ఉండాలని 2014 నుంచి ఏపీలో ఏ ఎన్నికలోనూ బోణీ కొట్టని కమ్యూనిస్టులతో సీక్రెట్ డీల్స్ పెట్టుకున్నారు. అయినా వర్కవుట్ అయ్యే లా లేదని.. స్వయం ప్రకటిత మేథావులను తీసుకొచ్చి వారికి ఓ దుకాణం తెరిచి ఆ దుకాణం తరపున పాలకపక్షంపై విషం చిమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఆ దుకాణం తరపునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించారు. మండు టెండల్లో అవ్వా తాతలను మంచాలపై తీసుకెళ్లి పింఛన్లు ఇప్పించుకుంటోన్న దృశ్యాలు చూసి యావత్ ఆంధ్ర ప్రదేశ్ ... చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లతో పాటు వలంటీర్లపై ఫిర్యాదు చేయించి పింఛనుదార్ల పొట్ట కొట్టించిన నిమ్మగడ్డ రమేష్ పై నిప్పులు చెరుగుతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లోనే విపక్ష కూటమికి గూబ గుయ్యిమనేలా గుణపాఠం చెబుతామని అంటున్నారు. దిక్కుమాలిన ఐడియాలు రక రకాల సర్వేలు ఏపీలో YSRCP అఖండ విజయం ఖాయమని తేల్చాయి. చంద్రబాబు నాయుడు సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ అదే తేలింది. రెక్కలు ముక్కలు చేసుకుని.. సిగ్గు లజ్జ వదిలేసి బిజెపి నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్నా తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేలడంతో చంద్రబాబుకు చలి జ్వరం వచ్చేసినట్లయ్యింది. ఏం చేయాలో పాలుపలోలేదు. ఎల్లో మీడియా ఇచ్చిన చచ్చు సలహాతో వాలంటీర్ల పై ఆంక్షలు విధిస్తే ఇపుడు 66 లక్షల మంది పింఛను దార్లు తనపై పీకలదాకా కోపంతో ఉన్నారని తెలిసి చంద్రబాబుకు నవ రంధ్రాల్లోంచి భయం కారిపోతోంది. అయితే కొద్ది మంది మనసుల్లో అయినా విషం చిమ్మితే ఆ మేరకు అయినా వైఎస్సార్సీపీ ఓట్లకు గండి కొట్టచ్చన్న చిల్లర ఐడియాతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు పేద ప్రజల తెలివితేటల ముందు ఎందుకూ పనికిరావంటున్నారు రాజకీయ పండితులు. అయితే ప్రస్తుతం ఏపీలో మెజారిటీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అయిదేళ్లుగా తమ ఖాతాల్లో నేరుగా జమ అయిన సంక్షేమ పథకాల నిధులు తమ ఇళ్లల్లో తెచ్చిన వెలుగులను తమ జీవితాల్లో తెచ్చిన మార్పులను వారు మర్చిపోలేదు. తమ జీవితాలు ఇలానే హాయిగా కొనసాగాలంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి కొలువు తీరాలంటున్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర లో దారి పొడవునా లక్షలాదిగా తరలి వచ్చిన పేదలు ఈ విషయాన్నే ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టాయి. ఆ తర్వాత ఆయన బస్సుయాత్ర ఆరంభించగానే రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీస్తోన్న భీకర వేడి వాతావరణంలోనూ ఆరేళ్ల కుర్రాడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు మరోసారి జగన్ మోహన్ రెడ్డినే సిఎంని చేసుకోడానికి తామంతా సిద్ధం సిద్ధం అంటున్నారు. చంద్రబాబు నాయుడి తరపున పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరిగినట్లు.. వైఎస్సార్సీపీ విజయంపై దుష్ప్రచారం చేసే ముఠాలు ఎక్కడైనా కనిపిస్తే జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు పాలక పక్ష నేతలు. -
ఈనాడు అత్యుత్సాహం.. లోకేష్ సహా బకరాలైన యెల్లో బ్యాచ్
సాక్షి, గుంటూరు: తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పరు. మంచి చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. గత 58 నెలల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను ఏరకంగా బద్నాం చేయాలి? అనే ఆలోచనతోనే కుట్రలు పన్నుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ తమ అసత్య ప్రచారాల మోతాదును ఒక్కసారిగా పెంచేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది ? అంటూ ఈనాడు తాజాగా ఓ కథనం ప్రచురించింది. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, అలాగే బయటకు వచ్చిందని, భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వాహన వివరాలంటూ.. రకరకాల డైరెక్షన్లలో కంటెయినర్ను హైలెట్ చేస్తూ ఓ గాలి వార్త రాసేసింది. ఇంకేం ఐ-టీడీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. తమకు చెందిన అకౌంట్లతో ఏవేవో ట్వీట్లు వేయించింది. దీనికి తోడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు.. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్ సంగతేంటి?’’ అంటూ ఓ ట్వీట్ కూడా వేశారు. దానికి ఆ ఈనాడు పేపర్ కట్టింగ్ క్లిప్పులను జత చేశారు. అయితే.. బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామానులు తీసుకు వచ్చింది ఆ పాంట్రీవాహనం. ఏపీ16జడ్ 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. పైగా ఈ ఉదయం ఆ వాహనం ఆళ్లగడ్డకు సైతం చేరుకుంది. అసలు అదేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. అత్యుత్సాహంతో ఆ కంటెయినర్ వాహనం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏదో తెచ్చిందంటూ నిస్సిగ్గుగా రాతలు రాయించారు రామోజీ రావు. ఈ క్రమంలో.. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ నుంచి ఈటీవీ ప్రతినిధి మకాం వేసిన దృశ్యాలు కనిపించాయి. ఆ పాంట్రీ వాహనం విజువల్స్, ఫోటోలు తీసినట్టు సీసీటీవీ పుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా... సదరు పోటోలను, వీడియోను వాడుకుని.. దురుద్ధేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసిన ఈటీవీపై చర్యలకు అధికారులు ఇప్పుడు సిద్ధం అయ్యారు. -
Ramoji, RK: సైకోల నుంచి సైతాన్లుగా ప్రమోషన్!
రోజు-రోజుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దిగజారిపోయి పాఠకులను హింసిస్తున్నాయి. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఈ రెండు సంస్థల యజమానులు రామోజీరావు, రాధాకృష్ణలు సైకోల నుంచి సైతాన్ల స్థాయికి ప్రమోషన్ పొందినట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రడ్డిపై విద్వేషంతో ఏపీపై పగబట్టి రాస్తున్న వార్తలు దారుణంగా ఉంటున్నాయి. ఈ శాసనసభ ఎన్నికల వరకు ఈ బాధ తప్పదని తెలిసినా, మరీ నీచంగా మారడం అత్యంత శోచనీయం అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఈనాడు పచ్చి మోసపూరిత వార్తలు రాసింది. రామోజీరావు ఈ విధానం కరెక్టు అని భావిస్తే దానినే ధైర్యంగా రాసి బీజేపీని తీవ్రంగా విమర్శించాలి. కాని అంత ధైర్యం లేదు. పైగా వారు ఈయనకు పద్మ విభూషణ్ బిరుదు కూడా ఇచ్చారు కదా! దానికి సదా కృతజ్ఞతగా లొంగి ఉండాలి కదా! బీజేపీ తనకు ఎన్నికల నిధులు ఇవ్వడం లేదనుకున్నవారిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ వంటివాటిని ప్రయోగిస్తోందన్న ఆరోపణ వస్తోంది. అది నిజమా? కాదా? కొన్ని ఆంగ్ల పత్రికలలో ఏ ఏ కంపెనీలపై దాడులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏ కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయి. వాటిలో అత్యధిక భాగం బీజేపీకే దక్కాయా? లేదా? అన్నది ఆ వార్తల సారాంశం. బీజేపీకి మొత్తం విరాళాలలో ఏభై శాతం నిధులు దక్కితే ఆ తర్వాత టీఎంసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎమ్కే వంటి పార్టీలు ఉన్నాయి. తదుపరి వైసీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ విరాళాలపై విశ్లేషిస్తే బీజేపీకి నిదులు ఇచ్చిన కంపెనీలు ఏవి? స్వచ్చందంగా ఇచ్చాయా? లేక భయపడి ఇచ్చాయా? అన్న అంశాలపై పరిశోధన చేయవచ్చు. కొన్ని ఆంగ్ల పత్రికలు ఈ విషయంలో వివరణాత్మక స్టోరీలు ఇచ్చాయి. ఈనాడు మీడియాకు, దాని అదినేత రామోజీరావుకు దేశం అంతా ఎటు పోయినా ఫర్వాలేదు. ఎవరికి ఎన్నివేల కోట్ల రూపాయల నిధులు వచ్చినా ఇబ్బంది లేదు.. కాని ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్కు నిదులు వస్తే మాత్రం ఏదో ఒక చెత్తరాసి బురదచల్లుతారు. ఈ కధనంలో అవేవో కంపెనీలకు భూములు ఇచ్చి ఫేవర్ చేసినందుకే అవి విరాళాలు ఇచ్చాయని రాశారు. వైసీపీకి అందుకే ఇచ్చారని అనుకుందాం. మరి తెలుగుదేశంకు ఎందుకు విరాళాలు ఇచ్చారు. అధికారంలో ఉన్న వైసీపీకి 499 కోట్లు విలువైన బాండ్లు వస్తే, తెలుగుదేశంకు 320 కోట్ల మేర బాండ్లు వచ్చాయి. అంటే ఆయాకంపెనీలను తెలుగుదేశం బ్లాక్ మెయిల్ చేసి ఆ డబ్బును సంపాదించిందా? తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలోని కంపెనీలే ఎందుకు వచ్చాయి? చంద్రబాబు అంటే భయపడి ఇచ్చాయా? లేక ఆయన బెదిరించి సంపాదించారా? ఉదాహరణకు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిది అని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు కదా? వారు ఎక్కడ ఏ పరిశ్రమ పెడుతున్నా అటు తెలుగుదేశం కాని, ఇటు ఈనాడు రామోజీరావు కాని దానిని అడ్డుకోవడానికి నానా ప్రయత్నాలు చేసేవారు కదా! ఎంతో విషం చిమ్మేవారు కదా! అదే కంపెనీ నుంచి తెలుగుదేశం పార్టీకి నలభై కోట్ల విరాళం ఎలా అందింది. నిజంగానే అది వైఎస్సార్సీపీ సంబందించిన వారిది అనుకుంటే టీడీపీ తిరస్కరించి ఉండవచ్చుకదా! అంటే బ్లాక్ మెయిల్ చేసి ఆ కంపెనీ నుంచి విరాళం రాగానే టీడీపీ నోరు మూసేసుకుందా? బీజేపీకి రూ.8,250 కోట్ల బాండ్లు, కాంగ్రెస్కు రూ.1,951 కోట్లు, టీఎమ్సీకి రూ.1,716 కోట్లు, బీజేడీకి రూ.1,019 కోట్లు, డీఎంకేకి రూ.656 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. బీఆర్ఎస్కు రూ.1,408 కోట్ల బాండ్లు లబించాయి. చివరికి ఒక్క అసెబ్లీ సీటు మాత్రమే గెలుచుకున్న జనసేనకు కూడా 21 కోట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి కదా! వీరందరికి ఏ రకంగా వచ్చాయో ఎందుకు విశ్లేషించలేదో రామోజీ చెప్పగలరా! టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన ఒక విశ్లేషణ ప్రకారం డీఎమ్కే , వైఎస్ ఆర్ కాంగ్రెస్లకు వాటికి రావాల్సిన వాటా రాలేదని వెల్లడించింది. వైఎస్సార్సీపీ, డీఎంకేల కన్నా చిన్న పార్టీ అయిన బీఆర్ఎస్కు రెండు, మూడు రెట్ల నిదులు ఎందుకు వక్కువ వచ్చాయి? వైసీపీకి 23 మంది లోక్ సభ, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రావల్సినంత రాలేదన్నది దీని అర్ధం. అదే టైమ్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 లోక్ సభ , ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్న టీడీపీకి 320 కోట్ల బాండ్లు ఎలా దక్కాయో చెప్పాలి కదా! కొన్ని కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు జరిగిన తర్వాతే అవి బీజేపీకి బాండ్ల రూపంలో నిదులు సమకూర్చిన విషయాన్ని కొన్ని ఆంగ్ల పత్రికలు సమగ్రంగా ఇచ్చాయి. ఇవన్ని పక్కనబెట్టి రామోజీరావు వైసీపీపైనే పడి ఎందుకు ఏడుస్తున్నారు? విశేషం ఏమిటంటే ఒకపక్క వైఎస్ జగన్మోహన్రడ్డి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను తరిమేశారని పదే, పదే రాస్తుంటారు కదా? అదంతా అబద్దమని శనివారం నాడు రాసిన పత్రికలో రాసిన ఈ బాండ్ల కధనంతో తేలిపోయింది. వైసీపీకి 96 కంపెనీల నుంచి విరాళాలు అందితే అందులో 26 విద్యుత్ కంపెనీలు అని ఈ పత్రిక రాసింది. అంటే కొత్తగా కేవలం విద్యుత్ రంగంలోనే 26 కంపెనీలు వస్తున్నట్లు ఒప్పుకున్నట్లే కదా? వారు విరాళం ఇచ్చారంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెడుతున్నట్లే కదా! 30826 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, ముఖ్యంగా సౌర, పవన, పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారని తెలిపింది. వీటి స్థాపనకు లక్ష ఎకరాలు అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీకి ఉపయోగం లేదని మరో దిక్కుమాలిన రాత రాసింది. అదే వార్తలో మెగావాట్కు లక్ష రూపాయల చొప్పున గ్రీన్ టాక్స్ వస్తుందని తెలిపింది. విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులు దేనికి కూడా భూమిని ప్రభుత్వం కేటాయించలేదు. రైతుల నుంచి ఈ పరిశ్రమలవారు లీజుకు తీసుకుని ఏటా ఏకరాకు ముప్పైవేల రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని ఆదేశించింది. దీనివల్ల రాష్ట్రంలో, ప్రత్యేకించి రాయలసీమలో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా రైతులకు మేలు చేస్తే, అదేదో తప్పు అయినట్లు ఈ పత్రిక దరిద్రపు గొట్టు వార్త రాసింది. ఈ భూములు ఇచ్చారు కనుక విరాళాలు పొందిందని నీచమైన విశ్లేషణ చేసింది. గ్రీన్కో కంపెనీకి 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇస్తే, ఆ కంపెనీ వైసీపీకి పది కోట్లు ఇచ్చిందట. ఏమన్నా మతి ఉండి ఈనాడు రామోజీ ఇలా రాస్తారా? కొన్ని వేల కోట్ల కంపెనీ కేవలం పది కోట్లు ఇస్తే అది కూడా ఫేవర్ చేసినట్లా? ఇక మెఘా కంపెనీ ఇచ్చిన 37 కోట్ల మీద కూడా ఇలాంటి చెత్తనే రాశారు. ఆ కంపెనీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కలిపి సుమారు 900 కోట్లు ఇచ్చింది. అదే వైసీపీకి 37 కోట్లే. కాని టీడీపీకి 25 కోట్లు ఇచ్చింది. దీనిపై ఈనాడు రాసిన వార్త చదివితే ఎంత బుద్ది, జ్ఞానం లేకుండా ఈ పత్రిక విషం చిమ్ముతోందా అనిపిస్తుంది. సీలేరు, పోలవరం హైడల్ ప్రాజెక్టులతో పాటు తాజాగా 12 వేల కోట్ల రూపాయల విలువైన ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఇచ్చినందుకే ఈ విరాళం ఇచ్చిందని రాశారు. మరి తెలుగుదేశం కూడా మరి పాతిక కోట్లు ఎందుకు ఇచ్చింది రాయలేదు. ఏమీ లేని జనసేనకు 21 కోట్లు ఎలా వచ్చాయని ఈ పత్రిక ప్రశ్నించలేదు. తెలుగుదేశంకు భారత్ బయోటెక్ పది కోట్లు, పశ్చిమ యుపి పవర్ ఇరవై కోట్లు, నాట్కో పద్నాలుగు కోట్లు, రెడ్డి లాబ్స్ పదమూడు కోట్లు ఎందుకు ఇచ్చాయో విశ్లేషించాలి కదా! అధికారం లేదు కనుక ప్రతిపక్షంగా ఉండి టీడీపీ వారిని బ్లాక్ మెయిల్ చేసిందని రామోజీ ఎందుకు చెప్పడం లేదు? ఇక టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన రాజ్యసభ సబ్యుడు సీఎమ్.రమేష్ కాంగ్రెస్, జేడీఎన్లకు కలిపి 40 కోట్లు ఎలా ఇచ్చారు? టీడీపీకి ఐదు కోట్లు ఎలా ఇచ్చారు. అంటే ఈ పార్టీలతో కూడా సంబంధ బాంధవ్యాలు మెయిటెన్ చేస్తున్నట్లే కదా! రామోజీ వికృత రాతలకు, పక్షపాత కధనాలకు ఇదో పెద్ద ఉదాహరణగా తీసుకోవాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Shameless TDP: దమ్ముంటే సమాధానాలు చెప్పాలి
ఆంధ్రప్రదేశ్లో విద్వేషపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ప్రతిపక్షాలు ఏకమై.. సంక్షేమ ప్రభుత్వంగా ప్రజల మన్ననలు అందుకుంటున్న వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ, జనసేనకు బాకా ఊదే యెల్లో మీడియా పత్రికలు, పేపర్లు ఈ విషప్రచారానికి తమవంతు కృషి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పచ్చ మంద చేస్తున్న హడావిడికి హద్దు లేకుండా పోతోంది. మరోవైపు మౌత్ టాక్ పేరిట నడుస్తున్న యవ్వారం.. టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో CM జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరిగే కుట్ర.. నీచ రాజకీయాలకు పరాకాష్టగా నిలుస్తోంది. బస్సులు, రైళ్లు, ఆటోలు.. ఆఖరికి జనం గుమిగూడే టీ స్టాల్ లాంటి చోట్లా మౌత్ టాక్ పేరిట హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ మీద లేని ప్రజా వ్యతిరేకత చూపించేందుకు నానా తంటాలు పడుతోంది పచ్చ బ్యాచ్. అయితే ప్రశ్నించే ముందు.. తమ దగ్గరా వాటికి సమాధానాలు లేవనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతోంది. స్టేట్మెంట్ 1 : రాష్ట్రం నాశనం అయ్యిందట! సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని.. అప్పుల ఊబిలో ఉందని.. శ్రీలంక అయ్యిందని.. ఏవేమో ప్రచారాలు చేస్తారు. మరి రాష్ట్రం ఎలా నాశనం అయ్యింది? అది ఎలాగో చెప్పమని అడిగితే మాత్రం మౌనంగా ఉండిపోతారు స్టేట్మెంట్ 2 : ప్రజల్ని సోమరిపోతుల్ని చేశారంట! సంక్షేమ విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలానికి.. సీఎంగా జగన్ అందించిన సంక్షేమానికి అసలు పోల్చడానికి కూడా వీలు లేదు. అన్ని వర్గాలకు ఆసరాగా నిలిస్తే.. ఇదిగో ప్రజల్ని సోమరిపోతుల్ని చేశారనే మాట అంటారు. సంవత్సరానికి నీకు ఒక 15 వేలు ఇస్తా నువ్వు ఏమి పని చెయ్య కుండా ఉంటావా అంటే ఏమి పలకరు. స్టేట్మెంట్ 3 : ఎన్నికల్లో 160 సీట్లు టీడీపీవేనట! ఏపీలో పొత్తు రాజకీయాలకు ఓ నీతి అంటూ లేకుండా పోయింది. జనసేన టీడీపీ పోటీ స్థానాల కోసం కొట్లాడుకునే స్టేజ్కి వచ్చేశాయి. కుదరితే ఒకపార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేసైనా పోటీ చేయాలని ఆ రెండు పార్టీల వాళ్లు ప్రయత్నాలు చేయడం కొసమెరుపు. అసలు సైకిల్ సింబల్ మీద ఎన్ని పోటీ చేస్తారు అంటే చెప్పరు, పందెం ఉంటే పెట్టు అంటే పారిపోతారు. స్టేట్మెంట్ 4 : స్కూల్స్కి జగన్ రంగులు మాత్రమే వేశాడట! నాడు-నేడు ఆ కళ్లకు కనిపించడం లేదేమో. ఏపీలో స్కూల్ డ్రాపింగ్ సంఖ్య తగ్గి.. కేరళతో పోటీ పడే స్థాయికి చేరిందని గుర్తిండం లేదేమో. ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్లి విజిట్ చేద్దాము అంటే రాడు స్టేట్మెంట్ 5 : రోడ్లు నాశనం అయ్యాయట! గతంలో సంగతి ఏంటి? మరి 2014 - 2019 అంత బాగా రోడ్స్ వేస్తే ఎందుకు నాశనం అయ్యాయి? అసలు ఎవరి హయాంలో రోడ్స్ కోసం ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు? అంటే మాత్రం మాట్లాడరు. స్టేట్మెంట్ 6 : ఉద్యోగాల్లేవ్.. వలంటీర్ వ్యవస్థ దగ్గరి నుంచి పరిశ్రమల స్థాపన దాకా.. ఉద్యోగాల రూపకల్పనలో సీఎం జగన్ చొరవకు దేశమే హ్యాట్సాఫ్ చెప్పింది. అయినా కూడా జాబ్ క్యాలెండర్ పేరిట బాబు అనుచరులు చేసే విమర్శలకు అంతే లేకుండా పోతోంది. వచ్చిన ఉద్యోగాల గురించి మాట్లాడితే.. అక్కడి నుంచి జంప్ అవుతారు స్టేట్మెంట్ 7 : పరిశ్రమలు పారిపోతున్నాయట! ఏ పరిశ్రమలు.. ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాయి? ఎందుకు పారిపోయాయి? అంటే సమాధానం ఉండదు. ఆ సమాచారం ఇవ్వమన్నా.. ఇవ్వరు. తన హెరిటేజ్ మాత్రం పారిపోకుండా అలాగే ఉండిపోతుందా? మరి. స్టేట్మెంట్ 8 : ఐటీ కంపెనీలు రావట! ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు 2014-2019 ఎక్కువ వచ్చాయా ? 2019 - 2024 లో ఎక్కువ వచ్చాయా అంటే పలకడు, ఉలకడు, జారుకుంటారు స్టేట్మెంట్ 9 : రాజధాని ఏది? రాజధాని కోర్టులో ఉంది అంటే ఏమి పలకడు, సుప్రీం కోర్టుకి వెళ్లారు వాళ్ళు డిసైడ్ చేస్తారు.. కానీ, మాకు రియల్ ఎస్టేట్ అమరావతి కావాలి అంటారు. స్టేట్మెంట్ 10 : ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందట! 2014-2019లో రాష్ట్రానికి ఏమి చేశారు అంటే మాత్రం పలకరు. ఎందుకంటే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయలేనిది, ఈ ఐదేళ్లలోనే సీఎం జగన్ ఎన్నో రెట్లు ఎక్కువ చేసి చూపించారు కాబట్టి. ఇదీ చదవండి: కుట్రదారు.. లబ్ధిదారు అంతా చంద్రబాబే! -
బాబు,పవన్లే అలా రాయిస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు, సాక్షి: ప్రజారంజకమైన పాలన అందిస్తున్నాం కాబట్టే వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు ఉందని.. ఈసారి ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి.. తనపైనా యెల్లో మీడియాలో వస్తున్న కథనాలపైనా ఈ సందర్భంగా ఆయన స్పందించారు. ‘‘ఎవరి కోసమూ నేను షర్మిలతో రాయబారం చేయటం లేదు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమం వలన ప్రజలు మాకు నీరాజనం పలుకుతున్నారు. ఇది చూడలేక ఎల్లోమీడియా వారిష్టం వచ్చినట్టు రాస్తున్నారు. రెండు మూడు వారాలకొకసారి నేను హైదరాబాదు వెళ్తుంటా. కుటుంబ సభ్యులను కలుస్తుంటా. విజయమ్మ అమెరికా నుండి వచ్చాక వెళ్లి కలిశాను. కానీ యెల్లో మీడియా రాతలు పరాకాష్టకు చేరాయి. కుటుంబ సభ్యులనూ కూడా బజారుకీడ్చే పని చేస్తోంది. చంద్రబాబు, పవన్ అందరూ కలిసి కుట్రలు పన్ని ఇలాంటి వార్తలు రాయిస్తున్నారు. షర్మిళ మూడేళ్ల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టారు. ఈమధ్య కాంగ్రెస్లో చేరుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దానిపై మాకు క్లారిటీ లేదు. షర్మిళ కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. మాకు ప్రజా మద్దతు ఉంది కాబట్టి. ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలతో పేదల కుటుంబాల్లో మార్పు వచ్చింది. మాకు ప్రజలే దేవుళ్లు అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. దాడి అయినా వినలేదు ఇక.. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 175 స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి. ‘‘సీట్ల విషయంలో అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కోచోట సీటు ఇవ్వలేకపోతే వేరేది చూస్తామని కూడా చెప్తున్నాం’’ అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్సీపీకి దాడి వీరభద్రం రాజీనామా చేసిన పరిణామంపైనా సుబ్బారెడ్డి స్పందించారు. సీట్ల విషయంలో అందరికీ ప్రాధాన్యతలు ఉంటాయి. అనకాపల్లిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఓపిక పట్టాలని దాడి వీరభద్రంతో మాట్లాడాం. అయినా వినకుండా ఆయన రాజీనామా చేశారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూడా మార్పులు ఉంటాయి అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: పిల్లలు తినే తిండిపైనా ఈనాడు విషం! -
జగనన్న గోరుముద్ద పైనా విషమేనా రామోజీ!?
గుంటూరు, సాక్షి: పేదలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. కానీ, యెల్లో మీడియా మాత్రం విషపు రాతలతో ద్వేషం ప్రదర్శిస్తోందని ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి మండిపడ్డారు. తాజాగా జగనన్న గోరుముద్దపై ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ‘‘జగనన్న గోరుముద్ద మీద విషం చిమ్మడం ఘోరమైన విషయం. గోరుముద్దకు బడ్జెట్ పెంచడంతో పాటు మంచి మెనూను రూపొందించాం. ప్రతీ రోజూ వెరైటీ మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. ఈ మెనూని రూపొందించింది స్వయంగా సీఎం జగనే. ఈ పథకం విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. నేను స్వయంగా అనేక గ్రామాల్లో నేరుగా విద్యార్ధులను అడిగి తెలుసుకున్నా.. .. గతంలో వంట ఖర్చులకు రూ. 3.50 పైసలిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.6.50 రూపాయలిస్తోంది. దేశంలో ఎక్కడా ఏ పాఠశాలలోనూ లేనట్లుగా గోరుముద్ద ద్వారా మంచి భోజనం విద్యార్థులకు అందిస్తున్నాం. గతంలో 32 లక్షల మందికి మాత్రమే భోజనం పెట్టేవారు. మా ప్రభుత్వంలో 43 లక్షలకు పైచిలుకు విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. విద్యార్ధులకు మంచి భోజనం అందించేందుకు సంవత్సరానికి రూ. 1,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అయినా అసత్యపు రాతలతో విద్వేషం ప్రదర్శించడం సరికాదని అన్నారాయన. ఇంకా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఏమన్నారంటే.. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థులు తినే తిండిపైనా రామోజీ విషం చిమ్ముతున్నాడు. మీడియాను అడ్డంపెట్టుకుని వారి కడుపు కొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో విద్యార్థులకు ఖర్చు చేసిన దానికంటే, జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక, 50-60 శాతం నిధులు పెంచి, 16 రకాల మెనూతో 43 లక్షలకు విద్యార్థులకు(గతంలో కంటే11లక్షల మంది విద్యార్థులకు అదనంగా) శుచి, శుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందిస్తుంటే, పనిగట్టుకుని రామోజీ కట్టకథలు రాయడంపై పార్థసారథి తూర్పారబట్టారు. ఎల్లోమీడియా పైత్యపు రాతలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందజేసే జగనన్న గోరుముద్ద కార్యక్రమం చాలా అద్భుతంగా సాగుతోంది. రోజుకో మెనూతో, శుచి, శుభ్రమైన పౌష్టిక ఆహారంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన మంచి కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని గోరుముద్ద కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు మధ్యాహ్నభోజనంగా నూకలతో వండిన అన్నం పెట్టేవారు. ఉడికీ ఉడకని అన్నంతో, సాంబారు పేరుతో పల్చటి నీళ్లచారుతో మమ అనిపించేవారు అలాంటిది, మా ప్రభుత్వం ఇప్పుడు నాణ్యమైన, విట్మిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ను వాడుతున్నామని అందరూ గమనించాలి. పిల్లలకు పాఠశాలల్లో బలవర్థకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తుంటే.. ఎల్లోమీడియా మాత్రం ప్రభుత్వంపై పనిగట్టుకుని కల్పిత కథనాల్ని రాస్తుంది. దేశానికే ఆదర్శమైనటువంటి ఒక మంచి కార్యక్రమంపై ఎల్లోమీడియా పైత్యం చూపించే రాతలు రాయడం ఎంతమాత్రం తగదు. 16రకాల మెనూతో వారానికి 5 రోజులు గుడ్డు జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగానే ప్రతీ రోజూ రాగిజావతో సహా రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నాం. ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అందించడం ద్వారా విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు, ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో బెల్లంతో కూడిన రాగిజావను విద్యార్థులకు అందిస్తున్నాము. మిగిలిన మూడురోజులు గోరుముద్దలో భాగంగా చిక్కీలను అందజేయడం జరుగుతోంది. ప్రతీరోజూ స్వీట్, ఆకుకూర పప్పు, సాంబార్లాంటి రుచికరమైన పదార్థాలతో పాటు వారానికి ఐదురోజుల పాటు ఉడికించిన కోడిగుడ్డు కూడా విద్యార్థులకు అందిస్తున్నాం టీడీపీ హయాంలో కంటే 50శాతం పెంపు ఖర్చుతో.. కూరగాయల ధరలు పెరిగిన క్రమంలోనూ ప్రభుత్వం మరింత శ్రద్ధగా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా విద్యార్థులకు వడ్డించే పదార్థాల్లో రాజీ పడటం లేదు. గత ప్రభుత్వం వంట ఖర్చుల నిమిత్తం విద్యార్థికి రూ.3.50పైసలు ఇస్తే.. మా ప్రభుత్వం మాత్రం దాన్ని రూ.6.50పైసలకు పెంచింది. అదేవిధంగా వంటసిబ్బందికి అందజేసే గౌరవ వేతనం విషయంలో గత ప్రభుత్వం కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చింది. అదే మా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రూ.3వేలు చేసిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక తరగతుల్లో చదివే ప్రతీ విద్యార్థికి భోజన ఖర్చు రూ.11.26పైసల నుంచి 50 శాతం పెంచి రూ.16.07పైసలు ఖర్చు చేస్తున్నారు. అదే ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు గత ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం కంటే 50 నుంచి 60 శాతం పెంచి, ప్రతి విద్యార్థికి రూ. 18.75, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ. 23.40 చొప్పున ఆహార నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అందజేస్తున్నాం. వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు గత ప్రభుత్వహయాంలో వంట ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగేది. దాదాపు 9 నెలల నుంచి ఏడాది దాటినా వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లించే పరిస్థితిలేదు. అదే జగన్ గారు ప్రభుత్వం వచ్చినదగ్గర్నుంచీ గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మూడురెట్లు అధికంగా వంటసిబ్బందికి గౌరవ వేతనాలు పెంచడంతో పాటు వంట ఏజెన్సీలకు క్రమం తప్పకుండా సకాలంలో బిల్లుల్ని చెల్లిస్తున్నాం 11 లక్షల విద్యార్థులకు అదనంగా.. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 32 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అందజేస్తే.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు 43 లక్షల 46వేల 299 మందికి జగనన్న గోరుముద్దను అందజేస్తున్నాం. అంటే, గతం కన్నా 30 నుంచి 40 శాతం విద్యార్థులు పెరిగిన సంగతిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి చేసిన సగటు వ్యయం రూ.450 కోట్లు అయితే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపులు దాదాపు రూ.7,244 కోట్లకు పైగా ఉన్నాయి.2023-24 బడ్జెట్ లోనూ రూ. 1,689 కోట్లు గోరుముద్ద కోసం ప్రభుత్వం కేటాయించింది. అంటే పేద పిల్లల ఆహారంపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. ఎల్లోమీడియా రాతల్ని అంతా ఖండించాలి జగనన్న గోరుముద్ద లాంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తోన్న ప్రభుత్వాన్ని అభినందించకపోగా.. ప్రభుత్వంపైనే ఎల్లోమీడియా విషం చిమ్ముతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరూ ఇలాంటి రాతల్ని హర్షించరు. అమ్మ ఒడితో పాటు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెనలాంటి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ.. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడంలో జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం అందరి మన్ననలు అందుకుంటోంది. జగన్గారు రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా ఇప్పటికే డీబీటీ ద్వారా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రూ.2.42 లక్షల కోట్లల్లో దాదాపు 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక, మంచి పరిపాలన అందజేస్తోన్న ప్రభుత్వంపై విషం చిమ్మే విధంగా ఎల్లోమీడియా రాతలు రాయడాన్ని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ ఖండించాలని కోరుతున్నాను. -
‘నా భర్త ఆత్మహత్యాయత్నంపై రాజకీయాలొద్దు’
సాక్షి, అనంతపురం: ఎల్లో మీడియా కుట్ర మరోసారి బట్టబయలైంది. జగనన్న ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాల్లో.. బాబు అనుకూల మీడియా సంస్థలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. తాజాగా టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం కేసును ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశాయి. అయితే ఆ ఆరోపణల్ని బాధిత కుటుంబమే స్వయంగా ఖండించింది. వేతనం రాలేదని.. సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్ తో టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. దీన్ని మల్లేష్ భార్య శివలక్ష్మి సాక్షితో మాట్లాడుతూ ఖండించారు. ‘‘ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తిలేదు. జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. నా భర్త డిప్రెషన్తో బాధపడుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశారు. నా భర్త ఆత్మహత్యాయత్నంపై దయచేసి రాజకీయాలు చేయొద్దు’’ అంటూ ప్రతిపక్ష పార్టీలను కోరారామె. మరోవైపు బావ ఆదినారాయణ కూడా సోషల్ మీడియాలో, యెల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం జగన్ (CM Jagan) మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడంటూ ఈనాడు, యెల్లో మీడియాలు హైలెట్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లేష్ కుటుంబం ఈ ప్రచారాన్ని ఖండించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేశ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పందేలతో లక్షలు పొగొట్టుకోవడంతో పాటు కుటుంబ పోషణకు, రుణాలను చెల్లించడానికి చిట్టీలు వేయడంతో పాటు బ్యాంక్ల్లో, యాప్ల్లో రుణాలు తీసుకున్నారు. ఈ రుణ భారాలు భరించలేక ఫోన్ స్విచాఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. -
చంద్రబాబు, రామోజీ, ఎల్లో బ్యాచ్ సమర్పించు.. 'అసత్యం.. నిత్యావసరం'
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ చేరుతున్న సంక్షేమాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని టీడీపీ–ఈనాడు సహిత ఎల్లో కూటమి సరికొత్త కుట్రలకు తెరతీస్తోంది. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పెరిగిన ధరలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారానికి దిగుతున్నారు. మరోవైపు వారు చేస్తున్న ప్రచారాన్నే ‘ఈనాడు’ కూడా పతాక శీర్షికల్లో అచ్చువేస్తోంది. నిజానికి ధరల పెరుగుదల చాలావరకూ రవాణా రంగంపై ప్రభావం చూపించే ముడి చమురు, బొగ్గు, గ్యాస్ వంటి ఇంధనాలపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కేంద్రం నియంత్రణలోనే ఉంటాయి. కొన్నేళ్లుగా వీటి ధరలు అటు అంతర్జాతీయంగా... ఇటు దేశీయంగా పెరుగుతూనే వస్తుండటంతో వీటి ప్రభావం వల్ల నిత్యావసరాల ధరలూ పెరుగుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిణామం. ఇవన్నీ రామోజీరావుకు తెలియక కాదు. ఆయన అజెండా వేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనంలో ఏదో ఒకరకంగా వ్యతిరేకత పెంచేసి... అర్జెంటుగా చంద్రబాబును గద్దెనెక్కించేయాలన్నది ఆయన ముప్పొద్దులా కంటున్న కల. దానికోసమే ఈ ప్రయాస అంతా. వాస్తవానికి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా చాలా సరుకుల ధరలు మన రాష్ట్రంలోనే తక్కువ. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చినా అదే పరిస్థితి. కాకపోతే బాబును గద్దెనెక్కించటమే లక్ష్యంగా రోజూ ‘ఈనాడు’లో ప్రతి పేజీలోనూ విషం కక్కుతున్న రామోజీరావుకు వాస్తవాలతో పనే లేదు. అందుకే ధరల విషయంలోనూ అదే చేశారు. ప్రజాదరణలో ‘ఈనాడు’దీ బాబు పరిస్థితే! అబద్ధాల చంద్రబాబును గత ఎన్నికల్లో జనమంతా ఛీకొట్టి ఓడించినట్లే రామోజీరావు పత్రిక ‘ఈనాడు’నూ పాఠకులు ఛీకొడుతున్నారు. ఈ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో ప్రజలకు మేలు జరుగుతున్న పనులను కూడా వక్రీకరిస్తూ కాలకూట విషం చిమ్మటాన్ని జనం సహించటం లేదు. దీంతో చంద్రబాబు మాదిరిగానే ‘ఈనాడు’ ప్రజాదరణ కూడా దారుణంగా పడిపోయింది. పత్రికను కొనుక్కుని చదివేవారు చాలామంది దాన్ని మానేశారు. ఎన్నికల వేళ పాఠకులు తగ్గిపోతే ఎలాగని మథనపడ్డ రామోజీరావు... చివరకు రాష్ట్రంలో ఇంటింటికీ ‘ఈనాడు’ను ఫ్రీగా పంచిపెట్టడం మొదలెట్టారు. పత్రికను కొనుక్కుని చదివేవారికి ఈ సంగతి తెలిసి... ఎలాగూ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని సబ్్రస్కిప్షన్లకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఈ పరిస్థితి అంతకంతకూ పెరుగుతోందని, కొనుక్కుని చదివేవారంతా మానేసి ఫ్రీగా అడుగుతున్నారని, దీన్ని తట్టుకోవటం కష్టమవుతోందని ‘ఈనాడు’ వర్గాలే వాపోతుండటం గమనార్హం. దేశ సగటు ధరలతో పోలిస్తే ఏపీలోనే తక్కువ.. నిత్యావసర సరుకుల ధరలకు వస్తే... దేశ వ్యాప్తంగా సగటు ధరలతో ఆంధ్రప్రదేశ్లోనే రేట్లు తక్కువగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, తెలంగాణలోనూ ఒకటి రెండు మినహా నిత్యావసరాల రేట్లు అధికంగానే ఉన్నాయి. జాతీయ స్థాయిలో కిలో సాధారణ బియ్యం రూ.43.17 ఉంటే ఏపీలో స్థానికంగా 39.84గా ఉంది. జాతీయంగా ధరలు ఏపీ కంటే సన్ఫ్లవర్ నూనెపై రూ.11.61, వేరుశనగా రూ.20, పామాయిల్ రూ.10, ఉల్లి రూ.6, టామాటా రూ.10 ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో చూసినా కందిపప్పుపై రూ.14.65, మినపప్పు రూ.11, పెసరపప్పు రూ.5.33, శనగపప్పు రూ.5.42, ఉల్లి రూ.6.74 రేటు ఎక్కువే. కానీ, రామోజీరావు ఈ ప్రభుత్వం వచ్చాకే రేట్లు పెరిగిపోతున్నట్టు తప్పుడు కథనాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డిమాండ్, సప్లై ఆధారంగా మార్కెట్లో రేట్ల హెచ్చుతగ్గులు సహజం. దీనికి తోడు ఏటా పంటలకు మద్దతు ధర పెరుగుతోంది. ఆ ప్రభావం కూడా మార్కెట్పై పడుతోంది. ఈ వాస్తవాలను దాటిపెట్టి ‘ఈనాడు’ సోమవారం నాడు ‘నిప్పుల్లా నిత్యావసరాలు’ అంటూ ప్రజలను మభ్యపెట్టే కథనాన్ని వండివార్చటం వెనక పెద్ద కథే ఉంది. ఎందుకంటే ‘ఈనాడు’ కథనానికి ముందే టీడీపీ డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు జనమంతా తమకు అందుతున్న పథకాలపై సంతృప్తిని వ్యక్తం చేయటంతో... పథకాల ద్వారా అందిన మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరగటం వల్ల కోల్పోతున్నారంటూ వారి మెదళ్లలో విషం నింపే ప్రయత్నం చేశారు ఎల్లో బ్యాచ్. దీన్ని సహించలేక చాలాచోట్ల జనం ఎదురుతిరిగారు. అలాంటి సంఘటనే ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ చోటు చేసుకుంది. దీంతో తమ కుట్రలో భాగంగా సోమవారం ‘ఈనాడు’లో కథనాన్ని రాయించింది ఎల్లో ముఠా. దీన్నే సోషల్ మీడియాలోనూ పలువురు టీడీపీ బ్యాచ్ వైరల్ చేయటం గమనార్హం. అన్ని రాష్ట్రాల్లోనూ ధరలు పెరిగాయనే వాస్తవాన్ని కావాలని మరుగునపరిచి వైఎస్సార్సీపీ విధానాల వల్లే పెరుగుతున్నాయని ప్రచారం చేస్తుండటంపై టీడీపీలోనే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు చెప్పుకునేందుకు తమ పార్టీ తరఫున ఏ అంశాలు దొరక్క చివరికి ఇలాంటి అపోహలపైనే తమవారు ఆధారపడ్డారంటూ ఓ టీడీపీ కార్యకర్తే అసహనం వ్యక్తం చేయటం గమనార్హం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి... ఏ వస్తువు ధరలైనా దెబ్బతింటే రైతును ఆదుకోవటంలోను... ధరలు పెరిగిపోతే వినియోగదారుకు సాంత్వన కలిగించటంలోను దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఏపీ ముందుంటోంది. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిర్దేశిత పంటలకు గనక ధర పడిపోతే, మార్కెట్లో జోక్యం చేసుకుని ఈ నిధితో వాటిని కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. ఊహించని రీతిలో ధరలు పెరిగినపుడు ఆ సరుకుల్ని అందుబాటు ధరల్లో వినియోగదారుకు అందించటానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధ సమయంలో వంటనూనెల ధరలు కొండెక్కిన పరిస్థితుల్లో వాటిని రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరలకే విక్రయించింది. ఇక రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి సీఎం యాప్ ద్వారా ప్రతిరోజు గ్రామ స్థాయిలో మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తోంది. ఇలా పొగాకు సహా ప్రధాన వ్యవసాయ వాణిజ్య పంటలకు ధరలు పతనమైన ప్రతిసారీ జోక్యం చేసుకుని మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు రూ.7712 కోట్ల విలువైన 21.55 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిజానికి టీడీపీ తన ఐదేళ్ల పాలనలో ఇలా ధరలు పతనమైన సమయంలో రైతుల కోసం వెచ్చించింది కేవలం రూ.3322 కోట్లు. ధరల నియంత్రణలో భాగంగా తాజాగా రైతు బజారాల్లో సుపర్ఫైన్ బియ్యం, కందిపప్పు విక్రయాలకు ఈ ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 8,990 క్వింటాళ్ల బియ్యం, 1206 క్వింటాళ్ల కందిపప్పును విక్రయించారు. ఈ మూడేళ్లలో రూ.69.10 కోట్లు విలువైన 9462.49 టన్నుల ఉల్లిపాయలను సేకరించి రైతు బజార్లలో విక్రయించారు. దేశం కంటే మిన్నగా.. ఏపీలోనే మిల్లెట్ల పంపిణీ ప్రస్తుతం రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలకు ఎమ్మెస్పీ కంటే మార్కెట్ రేటు ఎక్కువగా ఉంది. ఆరోగ్య రీత్యా ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు చిరుధాన్యాలను ఆహారం తీసుకోవడంతో డిమాండ్ పెరిగింది. అయితే వినియోగానికి తగినంత పంట ఉత్పత్తులు లేకపోవడంతో చిరుధాన్యాల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే పేదలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ ద్వారా జొన్నలు, రాగులు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మే నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రలో పైలెట్ ప్రాజెక్టుగా కార్డుదారులకు గరిష్టంగా రెండు కిలోల చొప్పున జొన్నలు, రాగులను సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 3,303 టన్నుల జొన్నలు, 13,052 టన్నుల రాగులను అందించింది. చిరు ధాన్యాలకు మార్కెట్లో మంచి రేటుండటంతో కావలసిన సరుకును సేకరించడం సవాల్గా మారింది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం రైతులను చిరుధాన్యాల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తోంది. రైతులు పండించిన పంటను స్థానికంగానే పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసి వాటిని పీడీఎస్లో ప్రజలు అందించేలా కార్యచరణ రూపొందింది. ఈ ఖరీఫ్లో జనవరి నుంచి జొన్నలు, రాగులను నేరుగా రైతుల నుంచి సేకరించనుంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరల జాబితాలో లేని కొర్రలను సైతం రాష్ట్రంలో రైతుల నుంచి సేకరించేలా ప్రత్యేక అనుమతులు సైతం తీసుకుంది. తొలిసారిగా కొర్రలను మద్దతు ధరకు అవసరమైతే మార్కెట్ ధరకు కొనుగోలు చేయనుంది. కిలో రూ.67కే కందిపప్పు.. పేదలకు నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసరాలు అందిస్తోంది. రాష్ట్రంలో 1.48 కోట్ల రైస్ కార్డులుంటే రేషన్ తీసుకునే వారి శాతం 90కిపైగా చేరింది. మార్కెట్లో లభించే సన్నబియ్యం మాదిరే రేషన్ బియ్యం ఉండటంతో ఎక్కువ మంది ప్రజలు వాటిని ఆహారంగా వినియోగిస్తున్నారు. దీనికి తోడు కందిపప్పు సైతం సబ్సిడీపై కిలో రూ.67కు పంపిణీ చేస్తోంది. గడిచిన 4 నెలలుగా సరుకు అందుబాటులో లేకపోవడంతో సరఫరాల అవరోధం ఏర్పడింది. తాజాగా హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ అసోసియేషన్ ద్వారా పౌరసరఫరాల శాఖ సుమారు 10వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. దశల వారీ సరఫరాలో భాగంగా నవంబర్ నుంచే సరుకును అందించడంతో కార్డుదారులకు ఊరటలభించింది. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కార్డుదారులుందరికీ పంపిణీ చేయనుంది. ఇకపై కందిపప్పు సరఫరాలో జాప్యం లేకుండా డిసెంబర్ చివరినాటికి నుంచి స్థానిక రైతుల ద్వారా కందులు కొనుగోలు చేయడంతో పాటు ప్రాసెసింగ్ చేసి అందించనుంది. అంతేకాక కేంద్రం కంటే మిన్నగా గడిచిన మూడు నెలల నుంచి పౌరసరఫరాల శాఖ ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరాల చేస్తోంది. కేంద్రం మాత్రం తాజాగా భారత్ బ్రాండ్ పేరుతో కిలో గోధుమ పిండిని రూ.27.50 ఇస్తున్నట్టు ప్రకటిచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.16కే అందిస్తోంది. ఇప్పటి వరకు 10,625 టన్నులు పంపిణీ చేయగా డిసెంబర్లోనూ 4వేల టన్నులకు పైగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాకపోతే... వైఎస్ జగన్ ప్రభుత్వంపై విష ప్రచారమే నిత్యావసరంగా మారిపోయిన ‘ఈనాడు’కు ఈ వాస్తవాలతో పనేముంది!!. -
ఈనాడు కథనంపై ఏపీ గనుల శాఖ ఆగ్రహం
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్పై ఈనాడు దినపత్రిక ఇచ్చిన కథనంపై ఏపీ రాష్ట్ర గనుల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఒక పారదర్శక విధానం రూపొందించి అమలు చేస్తుంటే.. అపోహ, అసత్య కథనాన్ని ఈనాడు ఇచ్చిందని పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీ ఇసుక ఆపరేషన్స్పై ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంవోనా?’’ అనే శీర్షికన ఓ కథనం ఈనాడులో ప్రచురితమైంది. అయితే అందులో ఉన్నవి అవాస్తవాలేనని వీజీ వెంకటరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థం లేని రాతలు రాయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇసుక విధానాన్ని పారదర్శకంగా రూపొందించి మరీ అమలు చేస్తోందని, పొంతనలేని అంశాలతో ఈనాడు అసత్య కథనాన్ని వండివార్చిందని అన్నారాయన. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు గతంలో టెండర్లు నిర్వహించాం. ఈ టెండర్లలో జెపీ సంస్థ సక్సెస్ ఫుల్ బిడ్డర్ గా ఎంపికయ్యింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ఇసుక ఆపరేషన్స్ జరిగాయి. తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ చేస్తోంది. మరోవైపు కేంద్రప్రభుత్వరంగ సంస్థ MSTC ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నాం. ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. అప్పటి వరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాం. .. వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయాయి. ఎండాకాలంలో జేపీ సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్లలో నిల్వ చేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి. అలాగే తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్ల్లో పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఇసుక తవ్వకాలకు సిద్దమవుతోంది. కానీ, దీనంతటిని వక్రీకరిస్తూ.. బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంవో నుంచి మాకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు దినపత్రిక కథనాన్ని ప్రచురించడం ఎంత వరకు సమంజసం?’’ అని ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. .. ‘ఇసుక ఆపరేషన్స్కు గనులశాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయి. మైనింగ్ రంగంలో ఉన్నప్రతి ఒక్కరికీ ఇది తెలుసు. అటువంటిది సీఎంవో అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎలా అంటారు?. ఒక అంశంపై వార్తాకథనం ప్రచురించే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇటువంటి అసత్య కథనాలను ఎలా ప్రచురిస్తారు? ’అని ఈనాడుపై ఆయన మండిపడ్డారు. ‘‘గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకుంది. ఆరోజు ఈనాడు దినపత్రికకు ఆ అక్రమాలు కనిపించలేదా? జగన్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఇసుక విధానంను తీసుకువచ్చారు. ప్రజలకు అందుబాటు ధరలో.. పైగా వర్షాకాలంలోనూ ఇసుక కొరత లేకుండా ఇసుకను అందిస్తున్నారు. ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, మినిరత్న గా గుర్తింపు పొందిన MSTC ద్వారా ఇసుక టెండర్లు నిర్వహణ జరగుతోంది. ఆసక్తి ఉన్న ఎవరైనా సరే ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అయితే వాస్తవాలు ఇలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, జిల్లా కో ఇంఛార్జిని నియమించారని.. ఈనాడు పత్రిక తన ఊహలన్నింటినీ పోగు చేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించింది. ఇకనైనా మరోసారి ఇలాంటి కథనాలు ఇస్తే.. ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రకటనలో రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. -
జగన్ పాలన చూసి రోజూ ఏడుపేనా?
ఈనాడు మీడియాకు పిచ్చి రోజు రోజుకి ముదురుతోంది. అది పరాకాష్టకు చేరుతోంది. కర్నాటకలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో శ్రీసత్యనాయి జిల్లాకు చెందిన పదిమంది మరణించారు. అది దురదృష్టకరమైన ఘటన. అందుకు ఎవరమైనా బాధపడతాం. కానీ ఈనాడు మీడియా మాత్రం అలాంటి ప్రమాదాలు జరుగుతున్నందుకు రాక్షసానందం పొందుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్లను తన దిక్కుమాలిన రాజకీయాలకు, తను జాకీ లేసి లేపుతున్న తెలుగుదేశం పార్టీకి ఎంతోకొంత ఉపయోగపడేలా చేయవచ్చన్నది వారి ఆలోచన. అక్టోబర్ 27వ తేదీన ఇక్కడ ఉపాధి ఉంటే ఈ ఘోరం జరిగేదా! అనే కథనాన్ని ఈనాడు పత్రిక బానర్గా వండి వార్చింది. తద్వారా ఏపీ జనాలు పొద్దున లేవగానే ఇలాంటి చెత్త వార్తలు చూడవలసి వస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగింది డ్రైవర్ పొరపాటువల్ల. నిద్ర మత్తులో ఉండడం వల్ల. ఇందులో ఏపీకి సంబంధించినవారితో పాటు కర్నాటక వాసులు కూడా ఉన్నారు. ఉపాధి లేక వలస వెళుతూ ఏపీవాళ్లు ప్రమాదంలో మరణిస్తే మరి కర్నాటక వారు ఎందుకు మృతి చెందినట్లు? అర్థం,పర్థం లేని వార్తలు రాసి ఏపీ ప్రజలను మోసం చేయాలన్నదే వారి ఉద్దేశం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాలు కరువుకు గురయ్యేవే. కాదనం. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతానికి కొంత మేర నీరు ఇచ్చిన సంగతి మర్చిపోకూడదు. అయినా అది సరిపోకపోయి ఉండవచ్చు. గత నాలుగేళ్లుగా వర్షాలు బాగానే పడ్డాయి. పంటలు పండాయి. అప్పుడు ఎవరూ వలస వెళ్లలేదని ఈనాడు ఎప్పుడైనా రాసిందా? మరి చంద్రబాబు టైమ్ లో దాదాపు ఐదేళ్లు కరువు తాండవించిందే. అప్పుడు ఎందుకు ఇలా రాయలేదు?. హిందుపూర్ తదితర ప్రాంతాల నుంచి ఏదో లెక్కగట్టినట్లు ఇన్నివేల మంది నిత్యం బెంగుళూరు,తదితర ప్రాంతాలకు వెళతారని రాసింది. అంటే ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన విషయమా? ఎప్పటి నుంచో ఉన్నదే కదా!కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లోనే ఇలా జరుగుతుందని రాయడం ఎంత దుర్మార్గం. ✍️చంద్రబాబు టైమ్ లో కరువు ప్రాంతాల నుంచి వందలాది మంది కేరళలో భిక్షాటనకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మరి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని బాధ్యుడ్ని చేస్తూ ఎందుకు వార్తలు రాయలేదు. పైగా అప్పట్లో కరువు వల్ల స్వస్థలాలు వీడినవారిని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి రప్పించిందని పచ్చి అబద్దం రాయడం. అసలు వారంతా ఎందుకు అప్పుడు వెళ్లవలసి వచ్చింది?. ప్రజలు ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి పనులు చేసుకోవచ్చు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పం నుంచి నిత్యం వేలాది మంది బెంగుళూరు వెళ్తుంటారు. మరి కుప్పంలో ఎందుకు ఉపాధి కల్పించలేకోయారు? చంద్రబాబు వైఫల్యం చెందినట్లు ఎందుకు రాయలేదు. సమస్యను రాయడం వేరు. ఆ ప్రాంతంలో మార్పులు, అభివృద్ది కోరుకోవడం వేరు. కాని ప్రస్తుత ప్రభుత్వంపై దుర్మార్గంగా విషం చిమ్మి, ప్రజల మెదళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని నీచ యత్నాలు చేయడం వేరు. ఈనాడు మీడియా ఆ నీచమైన పని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేస్తోంది కాబట్టి ఈ విషయాలను రాయవలసి వచ్చింది. చంద్రబాబు టైమ్ లో విజయనగరం, శ్రీకాకుళం లకు చెందిన కొందరు భవన నిర్మాణ కార్మికులు తమిళనాడులో స్లాబ్ కూలి మరణించారు. అప్పుడు ఈనాడు మీడియా ఇలాగే ప్రభుత్వాన్ని తప్పు పడుతూ వార్తలు ఇవ్వలేదే!. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనే ఏపీలో ఉంది కదా! అప్పుడు ఎందుకు ఆయన పుట్టపర్తి, గోరంట్ల ప్రాంతాలలో పరిశ్రమలు పెట్టించలేకపోయారు. ఉపాధి అవకాశాలు పెంచలేకపోయారు? అలా చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా! నిజంగానే ఆ విషయాన్ని ఈనాడు రామోజీరావు చిత్తశుద్దితో నమ్మితే ఏపీలో వివిధ ప్రభుత్వాల కాలంలో ఏమి జరిగిందో, ఇప్పుడు ఏమి జరుగుతోందో విశ్లేషణ ఇస్తే తప్పు కాదు. కాని అందుకు విరుద్దంగా జగన్పై పడి ఈనాడు నిత్యం ఏడవడమే బాగోలేదు. ✍️ఈనాడు చెప్పేదాని ప్రకారం.. ఎవరూ వేరే చోటకు వెళ్లకూడదు. మరి అమెరికా వెళ్లిన తెలుగువారంతా చంద్రబాబువల్లేనని ఎందుకు ప్రచారం చేశారు?. ఏపీలో ఎందుకు వారందరికి ఉపాధి కల్పించలేకపోయారు. అక్కడ ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలలో తెలుగువారు చనిపోయారే! ఆ మధ్య పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఒక తెలుగు యువకుడిని దుండగులు కాల్చి చంపారు. ఆ యువకుడికి ఇక్కడే ఎందుకు ఉపాధి కల్పించలేకపోయారని ఈ పత్రిక రాసిందా?. నీటి పారుదల ప్రాజెక్టులు కట్టివేస్తేనే వలసలు ఆగిపోతాయా? పోనీ అదే కరెక్టు అనుకున్నా రాయలసీమ నీటి ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నది తెలుగుదేశం, ఈనాడు మీడియానే కదా!. ఏ ప్రాజెక్టును ముందుకు పోనివ్వకుండా రకరకాల పుల్లలు వేస్తోంది వీరే కదా!. కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతం నీటికళతో సస్యశ్యామలంగా ఉంటుంది. అయినా ఆ ప్రాంతం నుంచి వేలాది మంది గల్ఫ్ ప్రాంతానికి ఉద్యోగాల రీత్యా వలస వెళ్లారు. ✍️తెలంగాణలో బొగ్గు గనులు ఉన్న కరీంనగర్ ,ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల ప్రాంతాల నుంచి కూడా అనేకమంది చిన్న,చిన్న పనులకోసం విదేశాలకు వలస వెళ్లారు.నూరు శాతం అక్షరాస్యత ఉన్న కేరళ నుంచి లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు.వారిలో పలువురు అష్టకష్టాలు పడుతున్నట్లు వార్తలు వస్తుంటాయి. మరి వారంతా వెళ్లడం తప్పా?ప్రభుత్వాల వైఫల్యమా? ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేక స్టోరీలు ఇవ్వలేదు! బీహారు, యూపీ, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి వేలాది మంది తెలుగు రాష్ట్రాలలో పనులకు వస్తుంటారు. వారిని ఏమంటారు?ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో ప్రాధమిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు చేపట్టాలని రాయడం తప్ప కాదు .అవి లేనందునే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని, దానికి కారణం ప్రభుత్వాలేనని వార్త ఇవ్వడం కేవలం ఏపీ ప్రభుత్వంపై అక్కసు, ద్వేషం తప్ప మరొకటి కాదు. వచ్చే ఎన్నికల వరకు ఈనాడు మీడియా ఇలాంటి చెత్త కథనాలు ఇస్తూనే ఉంటుంది. తద్వారా ఆ మీడియా తన విశ్వసనీయత కోల్పోతున్నప్పటికీ, ఆ కథనాలకు కౌంటర్ ఇవ్వాల్సిందే!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
వర్షాభావంపై పచ్చ మీడియావి పిచ్చిరాతలు: నాగిరెడ్డి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో వర్షాభావంపై యెల్లో మీడియా రాస్తున్న విద్వేషపూరిత రాతలను వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర అగ్రిమిషన్ వైస్చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఖండించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ వాటిని పిచ్చిరాతలుగా కొట్టేశారాయన. అలాగే.. నాడు చంద్రబాబు హయాంలో ఏర్పడిన కరువు పరిస్థితులను.. నేడు రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు చూస్తే.. రాష్ట్రంలో నిరంతరం కరువు కాటకాలే కొనసాగాయి. ఆయన ఐదేళ్లలో సరాసరి 273 కరువు మండలాల్ని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. ఆనాడు రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల నుంచి లక్షలాది రైతుల కుటుంబాలు బెంగుళూరు, చెన్నై, కేరళకు దినసరి కూలీల్లా వలసలు పోయారు. అప్పట్లో ప్రభుత్వం కరువు ప్రాంత రైతుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయంటే.. మిమ్మల్ని పంటలు వేసుకోమని ప్రభుత్వం చెప్పలేదుగా.. ఎవరు వేయమన్నారో వాళ్లదగ్గరకెళ్లి సాయం కోరండని .. రైతులకు తగిన శాస్తి జరగాలని ఆనాడు ఎద్దేవా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే, విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపించిన దుర్మార్గుడు చంద్రబాబు. కృష్ణాడెల్టాలోనే నీరులేక ఊడ్చిన పొలాలు ఎండిపోయిన పరిస్థితుల్ని రైతులు ఇప్పటికీ మరిచిపోలేరు. 2018–19లో పది లక్షల ఎకరాల్లో పంటసాగు చేస్తే.. ఆ పంటంతా ఎండిపోయిన పరిస్థితిని అందరూ కళ్లారా చూశారు. అలాంటి దౌర్భాగ్యమైన, నికృష్టమైన పాలన చంద్రబాబుది. చంద్రబాబు, కరువు కవలపిల్లలే! నిత్యం కరువు కాటకాలను అధికారికంగా ప్రకటించుకున్న చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. అందుకే, చంద్రబాబు, కరువు అనేవి కవల పిల్లలంటూ టీడీపీ నాయకులే మనసులో అనుకుంటున్నా.. తమ అధినేత ఎదుట ఏనాడూ బహిరంగంగా అనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే, బాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టులో నీరుండదని వాళ్లకు తెలుసుకాబట్టి. సాగునీటి ప్రాజెక్టులు దండగన్నది చంద్రబాబే! రాష్ట్రంలో ప్రాజెక్టులపై మనసులో మాట పుస్తకం రాసుకున్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులు దండగ అని అన్నది వాస్తవం కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. సాగునీటి ప్రాజెక్టులకు పెట్టిన డబ్బుకు బ్యాంకుల రుణాలు కూడా రావని ఈ చంద్రబాబే అన్నాడు. ఆనాడు తన మనసులో మాట పుస్తకంలో అలా రాసుకోలేదని గుండెలమీద చెయ్యేసుకుని బాబు చెప్పగలడా..? ఆయన్ను భుజానెత్తుకుని మోస్తున్న పచ్చమీడియా సమాధానం ఇవ్వగలదా..? ఉచిత విద్యుత్ సాధ్యంకాదన్న బాబు రైతుల శ్రమ, సాగుపెట్టుబడులపై అవగాహన కలిగిన మహానేత, దివంగత వైఎస్ఆర్ ఆనాడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానంటే.. అది సాధ్యం కాని హామీ అన్నది చంద్రబాబు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలారేసుకోవడమేనని బాబు వేళాకోళమాడింది నిజంకాదా..? వ్యవసాయం దండగమారిదని అన్న వ్యక్తి చంద్రబాబు. నేడు భూగర్భజలాల సద్వినియోగంతో.. సాగు, తాగునీటికి సంబంధించి ప్రకృతివనరులపై ఆధారపడటమనేది సహజం. వర్షపాతంపై ప్రధానంగా చెప్పుకోవాలంటే, ఈ ఏడాది ఆగస్టు మాసంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. సరిగ్గా ఇదే లోటు వర్షపాతం గతంలో 1899, 1913లలో నమోదైనట్లు రికార్డులు న్నాయి. ఇలాంటి విపత్కర సమయాల్లోనూ ప్రభుత్వపరంగా రైతులకు నీటి సౌకర్యం కల్పించే విషయంలో మనం ముందున్నాం. భూగర్భ జలమట్టాలున్న ప్రతీచోటా రాష్ట్రవ్యాప్తంగా 19.7 లక్షల పంపుసెట్లుకు 9 గంటల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం నిరంతరాయంగా అందిస్తున్నాం. ఇందుకు దాదాపు రూ.1800 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది. అదే సమయంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉచిత బీమా పథకం కింద రైతు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించనవసరం లేకుండా ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు సాగులో ఉన్న భూమినంతటినీ బీమా పరిధిలోకి తీసుకువచ్చాం. రాష్ట్రంలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా అందించాం. ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో.. అక్కడ సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుంటుంది. రైతుల్ని ఆదుకోవడంలో శ్రమిస్తోన్న జగన్ చంద్రబాబు ఐదేళ్ల హయాంలో అతితక్కువ వర్షపాతం నమోదైనప్పుడు రైతుల్ని మభ్యపెట్టే విధంగా కోతలు కోశాడు. రెయిన్గన్లతో కరువును జయించామనే మాటల్ని ఆనాడు ఆయన వినిపించాడు. అదే సీఎం జగన్ ప్రభుత్వ పెద్దలు గానీ అలాంటి మెహర్భానీ మాటల్ని ఎన్నడూ చెప్పుకోలేదు. వాస్తవ పరిస్థితుల్ని ఎదుర్కొనడంలో ఎప్పటికప్పుడు సమీక్షలతో అహర్నిశం శ్రమిస్తున్నారు. ప్రకృతి సహజసిద్ధ వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ సీజన్ కు తగ్గ పంటలకు అవసరమైన ఇన్ఫుట్స్ అందించడంలో ఈ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా పనిచేసింది. ఈఏడాది జూలై మాసంలో అధిక వర్షపాతానికి సంబంధించి కృష్ణాడెల్టాలో దెబ్బతిన్న పంటలకు ఇన్ఫుట్ సబ్సిడీనీ కూడా ఇప్పటికే విడుదల చేశాం. రైతుభరోసా సాయం కూడా ప్రకటించిన తేదీనే రైతులకు పంపిణీ చేస్తున్నాం. భేషరతుగా రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని.. బ్యాంకుల్లో కుదువపెట్టిన మీ పుస్తెలతాళ్లు తెచ్చిస్తానని అనంతపురంలో మాట ఇచ్చిన చంద్రబాబు రూ.87వేల కోట్లకు పైగా రుణాలుంటే.. రూ.14వేల కోట్ల మాఫీతో సరిపెట్టాడు. అదే జగన్గారు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రూ.31వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. వ్యవసాయ వృద్ధిరేటులో ముందంజ వ్యవసాయ వృద్ధిరేటులో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది. గతంతో పోల్చుకుంటే, ధాన్యం పండించడంలో 7.78 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తి 153.95 లక్షల టన్నుల నుంచి 165.77 లక్షల టన్నులతో దాదాపు 11.58 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఉద్యానపంటలు 95.55 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగాయి. అలాగే వ్యవసాయ వృద్ధిరేటు బాబు హయాంలో 2018–19లో (మైనస్) – 11.7 శాతం ఉంటే, 2022–23లో (ప్లస్) 22.7శాతంలో ఉంది. 4ఏళ్లలో పోతిరెడ్డిపాడు నుంచి సీమకు 553 టీఎంసీల నీరు సీఎం జగన్ అధికారం చేపట్టాక నాలుగేళ్ల కాలంలో ప్రతీ సాగునీటి ప్రాజెక్టు జలకళతో తొణికిసలాడుతుంది. రాయలసీమకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటిని మనం ఒకసారి పరిశీలిస్తే.. 2014–15లో బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59.56 టీఎంసీలు, 2015–16లో 0.95 టీఎంసీలు అంటే, సాగునీటికి కూడా రాయలసీమకు నీళ్లువెళ్లలేని పరిస్థితి అది. 2016–17లో 67.94 టీఎంసీలు, 2017–18లో 91.97 టీఎంసీలు, 2018–19లో 88.87 టీఎంసీలు కాగా, మీ ఐదేళ్లలో 310 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు వెళ్లింది. అదే మా జగన్ గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాలుగేళ్లను చూస్తే.. 2019–20లో 179.29 టీఎంసీలు, 2020–21లో 134.41 టీఎంసీలు, 2021–22లో 111.07 టీఎంసీలు, 2022–23లో 123.44 టీఎంసీలు కాగా ఈ నాలుగేళ్లలోనే 553 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు అందాయి. అంటే, బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే రెండింతల నీరు జగన్గారి హయాంలో రాయలసీమకు వెళ్తున్నాయి. పచ్చమీడియా పిచ్చిరాతల్ని రైతులు నమ్మొద్దు రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని.. సీఎం జగన్ ఆ దిశగా సంకల్పంతో ముందుకెళ్తున్నారని మనవి చేస్తున్నాను. చంద్రబాబును మోస్తున్న పచ్చమీడియాలో పిచ్చి రాతల్ని మాత్రం రైతులెవరూ నమ్మరనేది సుస్పష్టం. పట్టిసీమ, పులిచింతల నీళ్లు తాగు, సాగు అవసరాలకు సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోందని, రైతులు కూడా అందుకు సహకరిస్తున్నారని నాగిరెడ్డి అన్నారు. -
చంద్రబాబు, లోకేష్ బాటలోనే నారా బ్రాహ్మణి!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేయడంలో నెంబర్ వన్ అని ఆయన విమర్శకులు తరచూ చెబుతుంటారు. ఆ బాటలోనే ఆయన కుమారుడు లోకేష్ కూడా నడుస్తుంటారు. వారికి తోడుగా ఇప్పుడు లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా అసత్యాలు చెప్పడానికి పోటీ పడుతున్నట్లుగా ఉంది. ఆమె స్వయంగా చేశారో.. లేక ఆమె తరపున ఎవరైనా చేశారో కాని.. ఏపీకి పరిశ్రమలు రావడం లేదని, ఉన్నవాటిని తరిమేశారని ఒక ప్రకటన వచ్చింది. దానికి ఆమె లులూ సంస్థ హైదరాబాద్ లో పెట్టిన ఒక మాల్ను చూపుతున్నారు. అలాగే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా సంస్థ తెలంగాణలో పెట్టుబడుల ప్రతిపాదనలు చేయడం. అయితే.. ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉంటే ఆమె చెప్పే విషయాలను వినబుద్ది అవుతుంది. అబద్దాలు ఆడడంలో మామ చంద్రబాబుకు తగ్గ కోడలు అనిపించుకుంటోంది నారా బ్రాహ్మణి. లులూ కంపెనీ విశాఖలో ఒక మాల్ పెడతామని ముందుకు వచ్చినా, చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో ఎందుకు పెట్టలేకపోయారో ఆమె వివరించగలగాలి. ఆ సంస్థవారు ఇప్పుడు హైదరాబాద్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో మాల్ పెట్టుకున్నారా?.. లేదంటే వాళ్ల సొంత స్థలంలో లేదంటే ఒక మూత పడ్డ మాల్ స్థానే పెట్టారా?.. మాల్ పెడితే పరిశ్రమలు వచ్చేసినట్లే చెప్పాలనుకుంటే, జగన్ ప్రభుత్వ హయాంలో.. ఏపీలో రామాయపట్నం వద్ద శరవేగంతో ఒక ఓడరేవు నిర్మాణం అవుతోంది. వేలాది మందికి అక్కడ ఉపాధి వస్తోంది. మరి దానిని ఏమనాలి?. విశాఖపట్నంలో ఒక భారీ డేటా సెంటర్ వస్తోంది. ఇన్ఫోసిస్ శాఖ వస్తోంది. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ , కర్నూలులో గ్రీన్ ఎనర్జీ ..ఇలా అనేకం వస్తుంటే.. బ్రాహ్మణికి హైదరాబాద్లో పెట్టిన లులూ మాల్ గొప్పదిగా కనిపిస్తోంది. ఇది.. చూసే కళ్లను బట్టి ఉంటుంది. ✍️ఇక జయదేవ్ కు చెందిన అమరరాజా కంపెనీని ఎవరు ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని చెప్పారు? ఆ మాటకు వస్తే ఆయన చంద్రబాబు టైమ్లో ఎందుకు ఏపీలో కొత్త పెట్టుబడులు పెట్టలేదో బ్రాహ్మణి చెప్పగలరా? అంతెందుకు.. అసలు తమ కంపెనీ హెరిటేజ్ ను చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీలో ఎందుకు విస్తరించలేదు?. కొత్త ప్లాంట్లు పెట్టలేదు?. కేవలం అమరావతి రాజధాని లో తమకు అనుకూలంగా రింగ్ రోడ్డును ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించి తాము కొన్న భూముల విలువ పెంచుకోవడానికి ప్రయత్నించారే తప్ప.. ఏపీలో ఏమైనా కొత్తగా హెరిటేజ్ పరిశ్రమ యూనిట్ పెట్టారా?. ఆమె అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలలో వచ్చే చెత్త కధనాల ఆధారంగా వ్యాఖ్యానించినట్లు అర్ధం అవుతుంది. ✍️ఆ మీడియానే చంద్రబాబును, లోకేష్ ను ముంచాయి. ఇప్పుడు బ్రాహ్మణి వంతు వచ్చినట్లుంది. ఆమె మేలుకోకపోతే ఆమెకే నష్టం అని చెప్పాలి. బ్రాహ్మణి పేరుతో ఈనాడు మీడియా ప్రకటన రాయడం , ఆ తర్వాత వారి సొంత పైత్యాన్ని జోడించి జగన్ ప్రభుత్వం మీద బురద చల్లడం చేసేసింది. చంద్రబాబు టైమ్ లో పరిశ్రమలకు స్వర్గమట. ఇప్పుడు కాదట. అప్పుడు వచ్చిన ఒక కియా పరిశ్రమ తప్ప ఇంకో పేరు చెప్పే పరిస్థితి లేదు. కియా కు కూడా టిడిపి ప్రభుత్వం రెండువేల కోట్లకు పైగా రాయితీలు ఇచ్చిన సంగతి మర్చిపోయినట్లు ఉన్నారు. తెలంగాణలో వంద కోట్ల పెట్టుబడి వచ్చినా మొదటి పేజీలో ప్రముఖంగా అచ్చేయడం, ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబడి వచ్చినా దానిని కనిపించకుండా రాయడం, పైగా శాపనార్ధాలు పెట్టడం ఈనాడుకు అలవాటైపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పిన చంద్రబాబు వల్ల.. ఏపీకి నష్టం జరగలేదట. అయినా పరిశ్రమలు వచ్చేశాయట. అబద్దాలు రాయడానికి కూడా అంతు ఉండాలి! ✍️విదేశీ పెట్టుబడులకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఈనాడులో వచ్చిన కదనం చదివితే ఆంధ్రప్రదేశ్ పై ఎంత ద్వేషంతో ఈ మీడియా ఉన్నదీ అర్దం అవుతుంది. విదేశీపెట్టుబడులు ఎపి కంటే తెలంగాణకు పది రెట్లు ఎక్కువ అంటూ తాటికాయంత హెడ్డింగ్ పెట్టి ఈనాడు పత్రిక తన వికృతానందాన్ని ప్రకటించుకుంది. ఎంత సేపు ఆంధ్రప్రదేశ్ పై పడి ఏడవడం, శాపనార్దాలు పెట్టడం నిత్య కృత్యాలుగా చేస్తున్న ఈనాడు.. ఈ వార్త రాయడానికి మాత్రం ఎంత సంతోషపడి ఉంటుందో. దీనిలోనే వారి రాక్షసత్యం కనిపిస్తుంది. ఈ వార్తలో నిజం ఎంత , అసలు ఇలా విశ్లేషించవచ్చా? అనేవాటిని పక్కనపెడితే ఆ వార్త రాసిన తీరు చూస్తే ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రజల మెదడులో విషం నింపే యత్నం చేసింది. ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు అంటే కేవలం విదేశీపెట్టుబడులే కాదు. స్వదేశీ పెట్టుబడులు కూడా లెక్కే. కాని ఈనాడు కావాలని ఈ దిక్కుమాలిన వార్త ఇచ్చింది. ఈ మధ్యనే ఒక సమాచారం వచ్చింది. పెట్టుబడుల విషయంలో ఏపీ ముందంజలో ఉందన్నది దాని సారాంశం. తెలంగాణ కన్నా, కొన్నివేల కోట్ల రూపాయల పెట్టుబడులు అధికంగా వస్తున్నట్లు కేంద్రమే తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ లో ఏపీ నెంబర్ ఒన్ స్థానాన్ని గత మూడేళ్లుగా పొందుతోంది.ఈ వార్తను తన మీడియాలో ఎన్నడైనా రాసిందా? అది రాయడానికి చేతులు రాని ఈనాడుకు ఈ విదేశీపెట్టుబడుల గురించి రాసే నైతిక హక్కు ఉంటుందా? కేవలం ద్వేషంతో ఈ వార్త వండారని తెలుస్తూనే ఉంది. ✍️ఇదే వార్తలో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వాటి ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మహారాష్ట్రలో 36634 కోట్ల విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. తెలంగాణకు 6829 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ఈనాడు ఎపిపై రాసినట్టుగా ఈ రెండు రాష్ట్రాల పెట్టుబడులను ఎందుకు పోల్చలేదు. తెలంగాణకన్నా ఆరు రెట్లు అదనంగా మహారాష్ట్రకు పెట్టుబడులు వస్తున్నాయని ఎందుకు రాయలేదు. నిజానికి అలాంటి పోలికలు సరికాదు. మొత్తం సంవత్సరం అయిన తర్వాత ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందన్నది రాస్తే రాయవచ్చు. అలాగే మొత్తం అన్ని రకాల పెట్టుబడులు కలిపి ఏ విదంగా ఉన్నాయన్నది కథనంగా ఇవ్వవచ్చు. కాని ఈనాడు మాత్రం ఏపీ ద్వేషంతో ఇలాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు. మొదటి ఆరు నెలల ప్రతిపాదనలను చూస్తే మహారాష్ట్ర కు 69870 కోట్లు వస్తే, డిల్లీకి 27680 కోట్లు,కర్నాటకకు 25680 కోట్లు గుజరాత్ కు 10702 కోట్లు, హరియానాకు 8904 కోట్లు, తెలంగాణకు 8655 కోట్ల ప్రతిపాదనలు వచ్చినట్లు వివరించారు.. ఆ తర్వాత స్థానం తమిళనాడు ఉంది. రాష్ట్రాల మధ్య దీనిని పోల్చి చూస్తే తెలంగాణకన్నా మహారాష్ట్ర ఏడురెట్లు, డిల్లీ మూడు రెట్లు, కర్నాటకకు దాదాపు మూడు రెట్లు అధికంగా విదేశీపెట్టుబడులు వస్తున్నట్లు అంచనా వేశారు. మరి ఆ సంగతిని ఎందుకు పోల్చి చెప్పలేదు. కేవలం తెలంగాణ, ఏపీల మధ్యనే విదేశీ పెట్టుబడులపైనే ఎందుకు పోల్చారు?అంటే దానర్దం జగన్ ప్రభుత్వంపై ఉన్న అక్కసే అని వేరే చెప్పనవసరం లేదు.. ఇక్కడితో ఆగలేదు. టీడీపీ హయాంలో బాగా విదేశీపెట్టుబడులు వచ్చినట్లు కూడా ఈ పత్రిక ప్రచారం చేసింది. తీరా చూస్తే ఆ పెట్టుబడుల వివరాలు ఇవ్వకుండా ఏదో శాతం అంటూ సరిపెట్టింది. అంటే అప్పుడు వచ్చిన పెట్టుబడుల వాస్తవ అంకెను ఇస్తే అసలు విషయం అర్దం అయిపోతుందని, టిడిపి పాలన బండారం బయటపడుతుందని ఈనాడు భావించి ఉండాలి. విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకు ఆ స్థాయిలో రావడానికి, ఇతర రాష్ట్రాలకు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. పారిశ్రామిక వాతావరణం ఉన్న తమిళనాడు కూడా ఎందుకు వెనుకబడిందన్నదానిపై విశ్లేషణ చేయాలి. అవేవి చేయకుండా గుడ్డ కాల్చి ఎపిపై ఈనాడు పడేసింది. ✍️అన్నిరకాల పెట్టుబడులు పరిశీలిస్తే ఏపీకి సుమారు రూ. 25 వేల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయి. అప్పుడు తెలంగాణకు చాలా తక్కువ పెట్టుబడి వచ్చినట్లు ఆ వివరాలు వెల్లడించాయి.అంత మాత్రాన తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదని కాదు. తెలంగాణలో హైదరాబాద్ ఉండడం కీలక విషయం. ఆ నగరం చుట్టూరా ఐటి ,ఇతర సాప్ట్ తరహా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి వేయించిన రింగ్ రోడ్డే మూలకారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఏపీలో తీర ప్రాంతం అధికంగా ఉంది. అందువల్ల ఇక్కడకు రెన్యుబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు అధికంగా వస్తున్నాయి. ఏపీలో కొత్తగా నాలుగు ఓడ రేవులు నిర్మాణం అవుతున్నాయి. పది ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. వాటన్నిటిని పెట్టుబడుల కింద చూడరా?ఈ ఓడరేవుల ఆధారంగా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. కొత్తగా కొప్పర్తి వద్ద పారిశ్రామిక క్లస్టర్ వస్తోంది. విశాఖలో డేటా సెంటర్ పదిహేనువేల కోట్ల పెట్టుబడితో వస్తోంది.కడప జిల్లాలో 8800 కోట్లతో జిందాల్ స్టీల్ ప్లాంట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి అయింది. శ్రీ సిటీలో ఎసి యూనిట్లు వచ్చాయి. అచ్యుతాపురంలో కొత్త ఫార్మా యూనిట్లు వస్తున్నాయి. మరి ఇవేవి తెలంగాణలో ఏవి అని ఎవరైనా అడిగితే అది తెలివి తక్కువతనం అవుతుంది.ఎందుకంటే తెలంగాణకు తీర ప్రాంతం లేదు. ✍️అలాగే ఏపీకి హైదరాబాద్ వంటి నగరం లేదు. అంత ఖాళీ ప్రదేశం ఉండదు. ఏపీ ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. అయినా దానికి తగిన విదంగానే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి.విశాఖలో ఇన్ ఫోసిస్ తన కార్యకలాపాలు ఆరంభిస్తోంది. అలాగే మరికొన్ని ఐటి యూనిట్లు వస్తున్నాయి. ఐటి రంగం కోసం ఒకప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నారు. నిజమే ..ఇంకా ఎక్కువగా ఏపీకి పెట్టుబడులు వస్తే బాగుంటుందని రాస్తే ఫర్వాలేదు. కానీ, ఏపీని అవమానించే విధంగా అబద్దపు వార్తలు రాయడం ఈనాడుకే చెల్లింది. ఇదంతా కక్ష తప్ప ఇంకొకటికాదు. ప్రజలు అర్ధం చేసుకోలేని అమాయకులు కారు. ఈ మీడియాలో వచ్చే వార్తలనే చంద్రబాబు, లోకేష్ లు ప్రచారం చేస్తుంటారు. సరిగ్గా అదేదారిలో బ్రాహ్మణి కూడా నడుస్తున్నట్లుగా ఉన్నారు. భర్త,మామ మాదిరి తన పరువు కూడా పోగొట్టుకుంటారా?లేక హేతుబద్దంగా మాట్లాడి విలువ నిలబెట్టుకుంటారా?అన్నది ఆమె ఇష్టం. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
చంద్రబాబు లూటీకి పాన్ ఇండియా ప్రచారం
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఆధారాలతో సహా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకెళ్లారు. పార్టీ ఇమేజ్ ఢమాల్ మని పడిపోయింది. దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి టిడిపి నేతలు పాలక వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న కుట్రతో ఢిల్లీ సాక్షిగా టీడీపీ నేతలు తవ్వుకున్న గోతుల్లో వారే పడ్డారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. టీడీపీ నేతలు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్తో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. తప్పు చేశారు కాబట్టే చంద్రబాబును జైలుకు పంపారని వారికి అర్ధమైంది. మరిన్ని కేసుల్లోనూ చంద్రబాబు పాత్రకు ఆధారాలు ఉన్నాయని తేలడంతో టీడీపీ నాయకత్వానికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. చంద్రబాబు నాయుణ్ని ఏపీ ప్రభుత్వమై వేధించుకు తింటోందని జాతీయ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా ప్రచారం చేసి.. వైఎస్సార్సీపీ ప్రతిష్ఠ దెబ్బతీయాలని టీడీపీ నేతలు స్కెచ్ గీశారు. ✍️చంద్రబాబు నాయుడి ఆదేశాలతోనే నారా లోకేష్ అమాంతం ఢిల్లీ వెళ్లారు. అక్కడ జాతీయ మీడియాలో మాట్లాడుతూ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తన తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. అయితే టీడీపీకి ఎప్పుడూ అనుకూలంగా వ్యవహరించే ఆ జాతీయ ఛానెల్ లోనూ.. షో రన్ చేసే ప్రెజంటర్ అడిగిన ప్రశ్నలు లోకేష్కు ముళ్లల్లా గుచ్చుకున్నాయి. ప్రైవేటు కంపెనీతో ఒప్పందం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ముందస్తుగా రూ. 371 కోట్లు ఎందుకు విడుదల చేసింది? అది అక్రమమే కదా అని అర్నబ్ గోస్వామి ప్రశ్నిస్తే లోకేష్ నీళ్లు నమిలారు. అసలు ఈ ఒప్పందం చూస్తోంటే ఇది సజావుగా చేసుకున్నట్లు కనపడ్డం లేదని అర్నబ్ గోస్వామి అనేసరికి లోకేష్కు ముచ్చెమటలు పట్టాయి. అనవసరంగా ఢిల్లీ వచ్చి అర్నబ్ ఛానెల్ లో డిబేట్ లో పాల్గొన్నానేమో అని లోకేష్ కుమిలిపోవలసి వచ్చింది. ✍️ఈ భంగపాటు చాలదన్నట్లు అవినీతిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చంద్రబాబు తనయుడే ఢిల్లీ వెళ్లి తమని వేధిస్తున్నారని యాగీ చేయడంతో.. ఏపీ సీఐడీ కూడా ఈ కుంభకోణంలో చంద్రబాబు ఎంత స్కిల్ చూపించారో జాతీయ మీడియా ద్వారా దేశమంతటికీ తెలిసేలా చేయాలని నిర్ణయించుకున్నారు. సీఐడీ చీఫ్ తో పాటు ఈ కేసులో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి జాతీయ మీడియా కు మొత్తం కుంభకోణాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు. చంద్రబాబు నాయుడు ఎలా షెల్ కంపెనీల ద్వారా డబ్బులు తన ఇంటికి రప్పించుకున్నారో ఆధారాలతో సహా వివరించారు. అప్పటిదాకా ఒకటీ అరా ఆంగ్ల పత్రికల్లోనే వచ్చిన స్కిల్ కార్పొరేషన్ లూటీ గురించి.. ఈ ప్రెస్ మీట్ ద్వారా దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ స్పష్టంగా అర్దమయ్యేలా చెప్పారు. దీంతో టీడీపీ పరువు యమునా నదిలో కలిసిపోయింది. టీడీపీ నేతలు ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచినట్లు.. ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకుంటే.. చేసిన రెండు ప్రయత్నాలూ టీడీపీ ప్రతిష్ఠనే మసకబారేలా చేశాయి. ✍️ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అనవసరంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంను కెలికి.. చంద్రబాబు నాయుణ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. దానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి గట్టి కౌంటర్ ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో షెల్ కంపెనీల ద్వారా ఎలా దోచుకున్నారో వివరించారు. గల్లా జయదేవ్ కొన్ని సెకన్లు మాట్లాడితే.. చంద్రబాబు దోపిడీ గురించి మిథున్ రెడ్డి నిముషానికి పైగా వివరించడంతో టీడీపీ పరువు పోయింది. చంద్రబాబు అక్రమాల గురించి జనంలోకి బాగా వెళ్లింది. ఈ మూడు నిర్ణయాలూ కచ్చితంగా సెల్ఫ్ గోల్సే . :::CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు -
‘రామోజీ.. చంద్రబాబులాగా అనుకున్నావా?’
తెలుగుదేశంను భుజాన వేసుకున్న ఈనాడు మీడియా ఎలాగైనా ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని పడరాని పాట్లు పడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేజీల కొద్ది వార్తలను తన పత్రికలోను, గంటల కొద్ది వార్తలను తన టీవీలోను ఇస్తూ జర్నలిజం విలువలను మంటకలుపుతూ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తోంది. ప్రజలలో జగన్కు ఉన్న అనుకూలతను తగ్గించాలన్న తాపత్రయంలో అబద్దాలను ప్రచారం చేస్తూ తాను నగ్నంగా తిరుగుతున్నానన్న సంగతిని ఆ మీడియా యజమాని రామోజీరావు మర్చిపోతున్నారు. తామే ప్రధాన ప్రతిపక్షం అనుకుని ఇష్టారీతిన కధనాలు నింపుతున్నారు. ఇది ఇవాళ ఒక్కరోజుది కాదు.. గత నాలుగేళ్లుగా సాగిస్తున్న దందా. కానీ, ఈ మధ్య అది మరింతగా పెరిగిపోయింది. పిచ్చి పతాక స్థాయికి చేరిందన్నట్లుగా నానా చెత్త అంతటిని పోగు చేసి ప్రజలపై కక్కుతున్నారు. ఆ విషపు రాతలను జనం నమ్ముతారా? లేదా? అనే సంబంధం లేకుండా పచ్చి పాపంగా దీనిని సాగిస్తున్నారు. జూలై 20వ తేదీ ఈనాడు పత్రికను పరిశీలిస్తే.. ఆ పత్రికలో రాష్ట్ర ,జాతీయ స్థాయి వార్తలు ఇవ్వడానికి ఆరు పేజీలు కేటాయిస్తే, అందులో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు అరపేజీలో కూడా లేవు. అదే టైమ్ లో నాలుగు పేజీలకు పైగానే జగన్ ప్రభుత్వంపై బురదచల్లే వార్తలతో నింపేశారు. వాటిని జాగ్రత్తగా చదివితే అవన్ని చాలావరకు తప్పుడు రాతలేనని తేలిపోతుంది. ✍️ ఉదాహరణకు ఇసుక మీద ఒక ఫుల్ పేజీ వార్త రాశారు. నిజానికి అంతకుముందు రోజు కూడా ఒక పేజీడు వార్తను ఇసుక అక్రమ తవ్వకాలు అంటూ రాశారు. దానిపై సాక్షి లో ప్యాక్ట్ చెక్ పేరుతో వార్త వస్తుందని తెలుసు కాబట్టి,మళ్లీ మరుసటి రోజు కూడా ఇలా కథనాలు వండి వార్చారన్నమాట. ఒక్కసారి గతాన్ని గుర్తుకు చేసుకోండి. ఇసుకకు సంబంధించి టీడీపీ హయాంలో జరిగిన అరాచకం, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ముఠాలను ఏర్పాటు చేసి ఇసుక దందా సాగించిన రోజుల్లో నూటికి,కోటికి ఒకటో,అరో వార్త రాసి సరిపెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ దందాను తీసేసి, ఒక సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నించగానే.. ఇంకేముంది ఇసుక తవ్వకాలు ఆపేశారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయి అని ప్రచారం చేశారు. ప్రభుత్వం ఒక విధానం ఏర్పాటు చేశాక దానికి వ్యతిరేకంగా వార్తలు ఇచ్చారు. అసలు రాష్ట్రంలో అభివృద్దే ఆగిపోయిందని అన్నారు. ఇటీవలికాలంలో ఏమి రాశారు. ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు.దానివల్ల పర్యావరణం దెబ్బతినిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు సి.ఎమ్.గా ఉన్నప్పుడు ఆయన కరకట్ట ఇంటికి సమీపంలోనే లారీలకు,లారీల ఇసుక తవ్వుతుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా విధించింది. అయినా అప్పుడు ఇలా ఇన్ని పేజీల వార్తలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇసుకను స్టాక్ చేసుకుని ప్రజలకు సరఫరా చేస్తుంటే ,అది కూడా అక్రమంగా తవ్విందేనని తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ఎక్కడైనా ఒకటి,అర చోట అక్రమంగా తవ్వుతుంటే వార్తలు ఇవ్వడం వేరు. ఉన్నవి,లేనివి కలిపి నానా చెత్తంతా రాస్తే,చివరికి ప్రజలు వాటిని నమ్మని పరిస్థితిని ఈనాడు తెచ్చుకుంది. ✍️ అసలు వీరి ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా చేయడమే. తద్వారా ఇసుక కొరతను సృష్టించి, ప్రభుత్వం ఇసుక ఇవ్వలేకపోతోందని దుష్ప్రచారం సాగించాలన్నదే వారి కుట్ర. పోనీ ఇంకో కోణం చూద్దాం. రాష్ట్రంలో అభివృద్దే లేదని,అన్నీ ఆగిపోయాయని వీరే చెబుతారు. కాని ఇసుకను మాత్రం లక్షల టన్నులలో తోడేస్తున్నారని వీరే అంటారు. అంటే ఇంత ఇసుకను రాష్ట్రంలో వినియోగిస్తున్నట్లే కదా?అభివృద్ది జరుగుతున్నట్లే కదా!ఒకవేళ వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటే ఇంకా గగ్గోలు పెట్టేవారు కదా! గత ప్రభుత్వ హయాంలో పేరుకు ఉచితం కాని ప్రజల జేబులకు బాగానే చిల్లు పడేది. నాయకుల జేబులు మాత్రం ఫుల్ అయ్యేవి. ఇప్పుడు దానిని అరికట్టి ప్రభుత్వానికి ఏటా రూ. 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా చేసినందుకు అభినందించవలసింది పోయి,అక్రమ ఇసుక తవ్వకాలు, కోర్టు ఆదేశించినా ఇసుక తవ్వుతున్నారు అంటూ తప్పుడు వార్తలు ఇస్తున్నారు. ఇలాంటి వార్తలు ఇచ్చినా పేజీలకు,పేజీలు ఇవ్వడం ఇటీవలికాలంలోనే చూస్తున్నాం. అదే తెలంగాణలో జరుగుతున్న ఇసుక తవ్వకాల గురించి ఈనాడు మీడియాకు దమ్ముంటే రాయమనండి చూద్దాం. అక్కడ మాత్రం రామోజీ ఎందుకు వణుకుతారో అందరికి తెలుసు. ✍️ మరికొన్ని వార్తలు చూద్దాం. మెడికల్ కాలేజీలలో బి,సి కేటగిరిల సీట్లను అధిక ఫీజులకు ఎన్.ఆర్.ఐలకు, ఇతరులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వైద్య విద్యలో నాణ్యత పెంచాలన్నది ప్రభుత్వ భావన. ప్రభుత్వంలో డబ్బు లేక కాలేజీలు పెట్టినా అవి సరిగా నడవని పరిస్థితులు ఏర్పడరాదన్నది సంకల్పం.కాని ఈనాడు ఈ వార్తను ఎలా చిత్రీకరించి వైద్య విద్యను వ్యాపారంగా మార్చేశారంటూ జగన్ పై విషం కక్కింది. నిజంగానే ఈనాడుకు ఈ విధానాల మీద నమ్మకం లేకపోతే గతంలో జరిగిన వాటి గురించి,ఆయా రాష్ట్రాలలో ఉన్న పద్దతుల గురించి రాయాలి కదా! అసలు మెడికల్ కాలేజీలలో ఎన్.ఆర్.ఐ కోటాను సృష్టించింది. డోనేషన్ సీట్లను కేటాయించడంం మొదలు పెట్టింది తెలుగుదేశం హయాంలోనే. ఎన్.టి.ఆర్.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆరోగ్య యూనివర్శిటీ నుంచి ఈ సిస్టమ్ అమలు చేయడం ఆరంభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినప్పుడు ఆయన కాబట్టి విజన్ తో అలా చేశారని రాశారు. అదే అంతకుముందు నేదురుమల్లి జనార్ధనరెడ్డగి ప్రభుత్వం ప్రైవేటు రంగంలో వైద్య ,ఇంజనీరింగ్ కాలేజీలను ఇస్తే ఇదే టిడిపి విద్యను అమ్ముతారా అంటూ కోర్టుకు వెళ్లింది. చంద్రబాబు టైమ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలలో మేనేజ్ మెంట్ కోటాను పెట్టి అధిక ఫీజులను వసూలు చేస్తున్నప్పుడు ఈనాడుకు అది వ్యాపారంగా కనిపించలేదు. ఇలాంటి వార్తలు ఇవ్వదలిస్తే ఏ ప్రభుత్వ హయాంలో ఎలా జరిగింది రాస్తూ విశ్లేషించాలి.అలాకాకుండా జగన్ ప్రభుత్వమే ఇలా మొలు పెట్టిందన్నట్లుగా ప్రజలలో అపోహ సృష్టించడానికి ఈనాడు పాట్లు పడింది. ✍️ తెలుగు భాష కు సంబంధించి హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తే ,అదేదో ఈ ప్రభుత్వ టైమ్ లోనే జరుగుతుందేమోనన్న అనుమానం కలిగించడం కోసం మొదటి పేజీలో అంత ప్రముఖంగా వార్తను ఇచ్చారు.ఏకంగా సంపాదకీయాన్నే ఇచ్చి కన్నీళ్లు కూడా పెట్టేశారు. ఇంత తెలుగుమీద ప్రేమ ఉన్నవారు తమ సొంత స్కూల్ లో ఆంగ్ల మీడియం నే ఎందుకు పెట్టారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. బూ ఆక్రమణ అభియోగంతో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి సంబంధించిన సంస్థలు ఆక్రమించాయని ఎవరో హైకోర్టులో కేసు వేశారు. దానిని వార్తగా ఇవ్వవచ్చు. దానికి పెట్టిన హెడింగ్ చూడండి..175 ఎకరాల భూ ఆక్రమణ అంటూ పెద్ద హెడింగ్ పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేశారు. వీరే తీర్పు ఇచ్చేసిన చందంగా రాశారు. ✍️ ‘‘మా భూమిని అమ్మేశారు..’’ అంటూ వైఎస్సార్సీపీ వాళ్లపై ఆరోపిస్తూ ఇంకో వార్త.. ఏ గ్రామంలో చిన్న ఘటన జరిగినా,దానిని వైసిపికి పులిమి రాష్ట్రస్థాయిలో ప్రచారం చేయడమే పనిగా ఈనాడు మీడియా పెట్టుకుంది.లోకేష్ పాదయాత్రలో ఆయన మాట్లాడిన విషయాలకు తప్పనిసరిగా ప్రధాన్యత ఇచ్చి ఆయనను పెద్ద నాయకుడిగా చేయడానికి ఈనాడు,తదితర ఎల్లో మీడియా పనిచేస్తోంది.ఆయనకాని, మరెవరైనా ఇతర పార్టీల నేతలు కాని జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాటిని భారీగా ప్రచురిస్తారు. బిజెపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అవినీతి, అంధకార,అప్పుల ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానిస్తే మొదటి పేజీతో పాటు చివరి పేజీలో కూడా వార్తను ఇచ్చారు. అదే ఆమె టీడీపీని విమర్శించి ఉంటే దాని జోలికి పోరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటిఆర్, హరీష్ రావు వంటివారు ఎపికి వ్యతిరేకంగా ,వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ప్రకటనలు చేస్తే ఏపీ ఎడిషన్ లోకూడా భారీగా ప్రచురించే వీరు. అదే టీడీపీని, చంద్రబాబును ఉద్దేశించి అంటే మాత్రం ఒక్క ముక్క రాయరు. ఉదాహరణకు కెటిఆర్, హరీష్ రావులు తెలంగాణలో ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్ అని, వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే, వ్యవసాయానికి విద్యుత్ అక్కర్లేదని రేవంత్ అంటున్నారని విమర్శిస్తే, ఆ వార్తను తెలంగాణ ఎడిషన్ లోనే కనీ,కనిపించకుండా ఇచ్చారు. ఏపీలోకి వచ్చేసరికి అసలు కనిపించలేదు. ఇంత పక్షపాతంగా వార్తలు ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగానే ఎల్లో మీడియా యత్నిస్తోంది. ✍️ ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి, టివి 5వంటివి సరేసరి. ఇంత దారుణంగా ఈనాడు మీడియా తయారైనా,దీనిని ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కోగులుగుతున్నారంటే అది ఆయన ధైర్యం. అది ఆయన సత్తా. వీరందరికి దుష్టచతుష్టయం అని ఆయన పేరు పెట్టి ప్రజలలోకి వెళుతున్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ ఎల్లో మీడియా చేస్తున్న దుర్మార్గపు అబద్ధాల వార్తల ప్రచారానికి ఎప్పుడో దెబ్బతినిపోయేవారు. ఏది ఏమైనా ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా, ఇతరత్రా వాస్తవాలు చాలావరకు తెలుసుకుంటున్నారు. అందుకే ఈ ఎల్లో మీడియా పప్పులుడకడం లేదు. ::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు?
‘ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. అది బయటి వారికి చాలా అసహ్యంగానూ అనిపిస్తోంది. రాజకీయాలు మరీ ఇంతలా దిగజారిపోవాలా? అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. అవినాష్ రెడ్డిని సిబిఐ ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి? సిబిఐ ఇంత బలహీనంగా ఉందా? అంటూ ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. టిడిపి అనుకూల మీడియాల్లో డిబేట్స్ చూస్తోంటే సీబీఐ అరెస్ట్ చేయకపోతే మీడియా ప్రతినిథులే వెళ్లి అవినాష్ ను అరెస్ట్ చేసేలా కనిపిస్తున్నారు. ఇటువంటి ట్రెండ్ గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.‘ ఏపీలో 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న అయిన వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈ హత్య జరిగే నాటికి ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. కొంతకాలంగా ఈ హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితులను విచారించిన సీబీఐ.. ఆ తర్వాత మరి కొందరిని పిలిచి విచారిస్తోంది. ఈ క్రమంలో భాగంగా వివేకా మరో సోదరుడు వైఎస్ భాస్కర రెడ్డి తో పాటు ఆయన తనయుడు.. కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. భాస్కర రెడ్డిని రిమాండ్ లో తీసుకున్న సీబీఐ.. అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలు దఫాలు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు పిలిచింది. అయితే.. అవినాష్ రెడ్డి తల్లికు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించేందుకు వెళ్లాల్సి రావడం.. తాను విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సిబిఐ కి లేఖ రాశారు. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తన బెయిల్ పిటిషన్ ను విచారించాల్సిందిగా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరారు. అవినాష్ రెడ్డి తల్లికి కర్నూలు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు కూడా బులెటిన్ విడుదల చేశారు. ఐసీయూ లో కొద్ది రోజులు చికిత్స అందించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. తన తండ్రి భాస్కర రెడ్డి అరెస్ట్ అయి ఉన్నందున తన తల్లిని తానే చూసుకోవాలి కాబట్టి ఈ నెల 27 వరకు తనకు గడువు నివ్వాలని.. ఆ తర్వాత తాను విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి సిబిఐకి రాసిన లేఖలో కోరారు. అంతే.. ఈ వార్తలు మీడియాలో ప్రసారం అవుతుండగానే అటు టీడీపీ నేతలు, ఇటు టీడీపీ అనుకూల ఛానెళ్లూ కూడా.. ‘‘అదేంటీ?.. అవినాష్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి?.. ఏం! సీబీఐ మరీ అంత బలహీనంగా ఉందా?’’ అంటూ డిబేట్స్ నడపడం మొదలు పెట్టారు. అటు టిడిపి నేతలు అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలంటే డిమాండ్లు చేయడం మొదలు పెట్టారు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోగా.. వ్యతిరేకంగా పావులు కదుపుతోందంటూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీనిపై న్యాయ రంగ నిపుణులు మండి పడుతున్నారు. 👉 ‘అసలు ఎవరిని అరెస్టు చేయాలి?..’ అది చెప్పడానికి మీడియా ఎవరు? సీబీఐ ఎవరిని అరెస్ట్ చేయాలో ఎప్పుడు అరెస్ట్ చేయాలో అసలు చేయాలో చేయకూడదో మీడియా చెప్పడం ఏంటి? దర్యాప్తు సంస్థకు దమ్ము ఉందా లేదా అన్నది కూడా మీడియానే తేల్చేయడం ఏంటి? తమ రాజకీయ ప్రత్యర్ధులు అయితే వెంటనే అరెస్ట్ చేసేయాలి అదే తమపై కేసులు వచ్చి తమని అరెస్ట్ చేస్తే రాజకీయంగా కక్షసాధిస్తారా? అంటూ దబాయింపు సెక్షన్ విరుచుకు పడిపోతారు . ఇదేం పద్ధతి? అంటున్నారు న్యాయ రంగ నిపుణులు. 👉 వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు కారు. ఆయనపై ఉన్న అభియోగం అల్లా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలు తారు మారు చేయించారని. అది కూడా ఆయన చేశారని కాదు. అసలు వివేకానంద రెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితుడు దస్తగిరి బెయిల్ పై హాయిగా బయట తిరుగుతున్నాడు. అనుమానాలు మాత్రమే ఉన్న అవినాష్ రెడ్డిని మాత్రం.. తక్షణమే అరెస్ట్ చేసేయాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ ఓ పత్రిక రాసి పారేసింది. నిజానికి సీబీఐ ఇంత వరకు దీనిపై ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. ప్రభుత్వంపై కానీ అవినాష్ రెడ్డిపై కానీ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. అవినాష్ రెడ్డి అడిగింది కూడా నాలుగు రోజుల పాటు విచారణకు గడువు ఇమ్మనమనే. అది కూడా తల్లి ఆరోగ్యం బాగా లేదు కాబట్టి. అయితే టీడీపీ నేతలు.. వారి అనుకూల ఛానెళ్లు సీబీఐకి ఏదో అపచారం జరిగిపోతోన్నట్లు.. ధర్మాన్ని ఎవరో అడ్డుకుంటోన్నట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. 👉 కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి సహకరించకపోవడం క్షమించరాని నేరం అంటున్న ఆ పత్రిక.. గతంలో చంద్రబాబు నాయుడు, ఇదే సీబీఐ ఏపీలో అడుగు పెట్టనివ్వకుండా ఏకంగా జీవో జారీ చేస్తే అపుడు సిబిఐ దుర్మార్గమైన దర్యాప్తు సంస్థ అన్నట్లు.. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తోందన్నట్లు కథనాలు వండి వార్చింది. అపుడు టిడిపి నేతలు కూడా సీబీఐని పనికిమాలిన సంస్థగా ఏకి పారేశారు. ఇపుడు తాము ప్రతిపక్షంలోకి వచ్చే సరికి తమ ప్రత్యర్ధులపై ఓ కేసు వచ్చింది కాబట్టి టిడిపి నేతలు ఇపుడు సిబిఐని కీర్తిస్తున్నారని న్యాయ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని అవినాష్ అంటోంటే ‘అదంతా నాటకం.. డ్రామా..’ అంటూ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ‘‘2019లో టిడిపి ప్రతిపక్షంలోకి జారుకున్నాక వారి హయాంలో చేసిన అవినీతికి సంబంధించిన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసే సందర్భాల్లో టిడిపి నేతలు కూడా ఆసుపత్రుల్లో చేరారు. అచ్చెంనాయుడు అయితే తనకి పైల్స్ ఆపరేషన్ అయ్యిందని నెలల తరబడి ఆసుపత్రి బెడ్ దిగలేదు. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోనని చెప్పి టిడిపి అనుకూల వర్గీయులది అయిన రమేష్ హాస్పిటల్ లో ఆయన కాలక్షేపం చేసి విచారణ నుండి తప్పించుకున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి.. టిడిపి తరపున వ్యవహారాలు నడుపుతోన్న రఘురామ కృష్ణం రాజు కులాల మధ్య చిచ్చు రేపేలా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే తనని కొట్టేశారంటూ ఆరోపణలు చేసి బెయిల్ తెచ్చుకుని తనకు అనుకూలంగా ఉండే ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందారే తప్ప ఏపీలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందలేదు. మార్గదర్శి చిట్స్ లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సిఐడీ అధికారులు సోదాలకు వెళ్లినపుడు ఆ సంస్థ అధినేత రామోజీ రావు అమాంతం మంచం పై పడుక్కుని ఆరోగ్యం బాగా లేదని చెప్పుకున్నారు. విచారణకు కూడా సిద్ధంగా లేనని చెప్పించారు. అయితే అలాగని లిఖిత పూర్వకంగా రాసి ఇస్తారా అని డాక్టర్లను సిఐడీ అధికారులు అడగడంతో వాళ్లు నీళ్లు నమిలి విచారణకు హాజరు కావచ్చునని ఒప్పుకున్నారు. టిడిపి నేత సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసంలో ఓ సినీ నిర్మాతపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనలో బాలయ్యను అరెస్ట్ చేయాల్సి వచ్చినపుడు అమాంతం బాలయ్యకు మానసిక పరిస్థితి బాగా లేదని మతి చలించిందని వైద్యుల చేత సర్టిఫికెట్ పుట్టించుకుని అరెస్ట్ నుండి తప్పించుకున్నారు.’’ ఇపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు వీటినే గుర్తు చేస్తున్నారు. అప్పట్లో.. ఆస్పత్రిలో అచ్చెన్న 👉 టిడిపి నేతలను అరెస్ట్ చేసే సందర్భాల్లో వాళ్లకి మాయరోగాలు వస్తాయి.. వాళ్లు తమకు అనుకూలమైన ఆసుపత్రులనే ఆశ్రయిస్తారు.. చివరకు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు.. అదే అవినాష్ రెడ్డి తల్లి పరిస్థితి బాగా లేక విచారణకు సమయం కావాలని అడిగితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయరు? అంటూ టిడిపి నేతలు, టిడిపి అనుకూల పత్రికలు ప్రశ్నించడంలో అర్ధం లేదని పాలక పక్ష నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్లో విచారణలు జరక్కుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడి పార్టీ నేతలు గురివింద గింజలాగా నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు. 👉 ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా తెలంగాణా హై కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. హై కోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించాల్సిందిగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులను సూచించింది. ఈఘటనలో టిడిపి నేతలతో సమానంగా మీడియా ప్రతినిథులు కూడా తామే న్యాయమూర్తులు అయినట్లు, దర్యాప్తు సంస్థల అధికారులు అయినట్లు విచారించేసి తీర్పులు ఇచ్చేస్తున్నారనే చర్చ కూడా ఒకటి నడుస్తోంది. ఈ పద్ధతి మారాలని అంటున్నారు కొందరు. అసలు సీబీఐని ఏపీలోకి అనుమతించాలా? అడ్డుకోవాలా? అన్న అంశంపై టిడిపి నేతలు తమ వైఖరి ఏంటో ఇప్పటికైనా స్పష్టం చేయాలంటున్నారు పాలక పక్ష నేతలు. అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే అందుకు పూర్తి భిన్నంగా యూటర్నులు తీసుకోవడం చంద్రబాబు నాయుడికి మొదట్నుంచీ అలవాటే అంటున్నారు రాజకీయ పండితులు. ::: CNS యాజులు, సాక్షి టీవీ ఇదీ చదవండి: ఆ టీడీపీ ఎమ్మెల్యే వస్తే ఊరంతా హడల్! -
‘టీడీపీలోకి వెళ్లే ఆలోచనే లేదు’
హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్ నేత రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. బీజేపీపై అసంతృప్తితో ఉన్న ఆయన సైకిల్ ఎక్కుతారంటూ ఆ ప్రచారంలో ఉంది. అయితే.. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో చేరతానన్న వార్తలు అవాస్తవం. బీజేపీలోనే కొనసాగుతాను. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ స్థానం నుంచి పోటీ చేస్తా. నా మెంటాలిటీకి బీజేపీ తప్ప వేరే పార్టీ సెట్ కాదు అంటూ జంపింగ్ వార్తలకు పుల్స్టాప్ పెట్టారాయన. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీడీపీలోకి రాజాసింగ్ అంటూ ఆంధ్రజ్యోతి తాజాగా ఓ కథనం ప్రచురించింది. సస్పెన్షన్ తర్వాత బీజేపీ పట్టించుకోవడం లేదని, అందుకే ఆయన పార్టీ మారతారని, ఈ మేరకు ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపారంటూ సుదీర్ఘంగా ఆ కథనంలో చర్చించింది. కానీ, ఆంధ్రజ్యోతిది తప్పుడు ప్రచారమేనని రాజాసింగ్ తేల్చేశారు. ఇదీ చదవండి: వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే.. మన ఉద్యోగాలు -
ఆయనే ఓ పెద్ద లాబీయిస్ట్.. దానికి తోడు పిచ్చి రాతలు
కొద్ది రోజుల క్రితం వరకు యెల్లో మీడియా ఏమని ప్రచారం చేసిందో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లారని. ఇప్పుడు ఏమి రాస్తున్నారో చూడండి. కర్నాటకకు చెందిన ఒక స్వామీజీని ఆశ్రయించారని, ఆయన్ని పిలిపించుకుని మంతనాలు జరిపారని. వీటిలో ఏది వాస్తవం? దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది?.. ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రమే కాదు.. ఈనాడు, ఆంద్రజ్యోతి , టీవీ5.. తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. వాళ్లు రాసేవన్నీ అబద్దాలేనని ఈ వార్తలే రుజువు చేస్తున్నాయి. పైగా ఆ స్వామీజీ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వంటివారు తిరుమలకు వచ్చినప్పుడు వాళ్ల పక్కనే ఉంటారని , ఆయన లాబీయిస్టు అని టీడీపీ కోసం బట్టలు ఊడదీసుకుని తిరిగే ఓ పత్రిక ప్రకటించేసింది కూడా. రాష్ట్రపతికి , అలాగే న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నవారికి కూడా ఉద్దేశాలు ఆపాదించడానికి కూడా వీళ్లు బరితెగిస్తారు. అదే వైఎస్సార్సీపీ వాళ్లు ఎవరినైనా ఏమైనా అంటే చాలు.. ఇంకేముంది నానా యాగీ చేస్తారు. మరి ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ను ఉద్దేశించే ఇంత దారుణంగా రాశారంటే వారిది ఎంత తెంపరితనం అనుకోవాలి!. పైగా తిరుమలలో స్వామీజికి ఎవరో సహకరించకపోతే అలా వారి పక్కన ఉండగలుగుతారా అని పిచ్చి ప్రశ్న ఒకటి. రాష్ట్రపతిగాని, అత్యున్నత స్థానంలో ఉన్నవారెవరైనా, తాము ఎవరిని వెంటబెట్టుకుని వెళ్లదలిస్తే వారి జాబితాను పంపితే సరిపోతుంది. అంతే తప్ప తిరుమలలోనో, ప్రభుత్వంలోనో ఉన్నవారు పంపితే వారు అనుమతిస్తారా?. ఈ మాత్రం విజ్ఞత లేకుండా చేతిలో పేపర్ ,టీవీ ఉన్నాయని నానా చెత్త అంతా రాస్తున్నారు. దీనివల్ల వారికే నష్టం జరుగుతోంది. పొరపాటున టీడీపీ అనుకూల మీడియా నిజం రాసినా.. ఎవరూ నమ్మని పరిస్థితిని తెచ్చుకున్నారు. దీనిని గమనించే ముఖ్యమంత్రి జగన్ ఈ పత్రికలను దుష్టచతుష్టయంలో భాగం చేశారు. ఆయన అలా గట్టిగా ఎదిరించి ఉండకపోతే, వీరు రాసే అబద్దాలన్నిటినీ నిజాలని ప్రజలు భ్రమించవలసి వచ్చేదేమో!. 👉 గతంలో తమకు నచ్చని రాజకీయ పార్టీలను ఇలాగే భ్రష్టుపట్టించేవారు. వాటిని ఎదుర్కోలేక అవి నానా తంటాలు పడుతుండేవి. ఇప్పుడు జగన్కు ఆ ఇబ్బంది లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి వాటిని ఆయన శత్రుకూటమిలో భాగమనే ప్రజలకు గట్టిగానే చెప్పేశారు. కొంతకాలం క్రితం న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం టాప్ చేస్తోందని ఒక తప్పుడు కధనాన్ని ప్రచారం చేశారు. దానిపై హైకోర్టు కూడా కొంత స్పందించింది. కానీ, ఆ తర్వాత ఆ పత్రిక అవాస్తవాలు రాసిందని అర్ధం చేసుకుని, ఆ గొడవను పక్కనపెట్టేసినట్లనిపిస్తుంది. ఇలా ఒకటి కాదు. ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఎంత వీలైతే అంత అగాధం సృష్టించడానికి ఈ టీడీపీ మీడియా చేయని విష ప్రయత్నం లేదంటే ఆశ్చర్యం కాదు. 👉 దీనికి తోడు అప్పట్లో ఉన్న ఒకరిద్దరు గౌరవ న్యాయమూర్తులు ఏ కారణం వల్లనన్నా కాని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంచెం వ్యాఖ్యానం చేసేవారన్న అభిప్రాయం ఉండేది. ఆ వ్యాఖ్యల్ని ఈ టీడీపీ మీడియా పతాక శీర్షికలలో ప్రచురించడమే కాదు.. ఏదో జరిగిపోతోందన్న భావన కలిగించే యత్నం చేసేది. అలాగే ఇప్పుడు ఏకంగా న్యాయ వ్యవస్థను అప్రతిష్టపాలు చేసేలా ఈ కధనాలు రాశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ కోరిక మేరకు సాయం చేయబోతున్నారని రాసింది వీరే. ఇప్పుడు ఎవరో స్వామీజీ ద్వారా లాబీయింగ్ చేస్తున్నారని రాసింది వీరే. తీరా చూస్తే ఆ లాబియిస్టుగా వీరు చెప్పిన విజయకుమార్ స్వామీజీ వెంట ఉన్న పారిశ్రామికవేత్త చింతా శశిధర్ ఈనాడు అధినేత రామోజీరావు సమీప బంధువని తేలింది. కానీ, ఆయన ఫలానా అని రాయకుండా యెల్లో మీడియా జాగ్రత్తపడింది. కేవలం పారిశ్రామికవేత్త అని రాసి సరిపెట్టింది. 👉 చింతా శశిధర్ అనే ఈ పారిశ్రామికవేత్త నవయుగ కంపెనీ అధినేత విశ్వేశ్వరరావు కుమారుడు. విశ్వేశ్వరరావుకు ఈ కథనాన్ని వండిన మీడియా అధినేతకు మధ్య ఆర్దిక సంబంధాలు కూడా ఉండేవి. అందుకేనేమో టిటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పిన విషయాలలో కొన్నింటిని ఎడిట్ చేసి.. ఆయన ప్రస్తావన రాకుండా వార్త ఇచ్చారు. ఇక్కడ మరో సంగతి కూడా చెప్పాలి. లాబీయిష్టు అంటూ కథనాలు ఇచ్చిన పత్రికాధిపతి కూడా లాబియిస్టే. 👉 గతంలో ఆయా రాజకీయ పార్టీలు బ్రోకర్ అని కూడా ఆయన్ని విమర్శించేవి. దానికి కారణం ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్న టైమ్ లో సచివాలయంలో పైరవీలలో చక్రం తిప్పేవారని అంటారు. అలాగే గత టరమ్ లో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు లావాదేవీలలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారని చెబుతారు. మరి అలా చేసిన వ్యక్తిని లాబియిస్టు అంటారా? రాజకీయ బ్రోకర్ అంటారా?. ఎదుటివారిని అనడం కాదు.. తాము ఎలా ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోకూడదు. నీతులు చెప్పేస్తే జనం అంతా చెవిలో పూలు పెట్టుకుని వింటారన్నది కొందరి నమ్మకం. 👉 విజయకుమార్ స్వామీజీ గతంలో రామోజీకి సంబందించిన ఒక ఫంక్షన్ కు కూడా హాజరై ఆశీర్వదించారట. వైవి సుబ్బారెడ్డి చాలా స్పష్టంగా విజయకుమార్ స్వామీజి తమకు తెలుసునని, ఆయనను సీఎంగారికి ఆశీర్వచనం ఇప్పించడానికి ఆహ్వానించామని వెల్లడించారు. ‘‘రామోజీ సమీప బంధువు ఆయన్ని వెంటబెట్టుకు వచ్చారు. కాబట్టి మార్గదర్శి కేసు నుంచి బయట పడేయించడానికే తీసుకు వచ్చారని అనవచ్చా?’ అని వైవీ సుబ్బారెడ్డి ముక్కుసూటిగా ప్రశ్నించారు. ఒక పక్క సీబీఐ తన మానాన తాను ఏకపక్షంగా విచారణ సాగిస్తూ, వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేసి, ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలా అరెస్టు చేయాలా? అనే ఆలోచన చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోపక్క ఈ టీడీపీ మీడియా ఇలాంటి దిక్కుమాలిన రాతలు రాసి ముఖ్యమంత్రి జగన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. చివరికి తానే వివేకాను హత్య చేశానని చెప్పిన వ్యక్తితో మాట్లాడి పేజీలకొద్ది వార్తలు ఇచ్చే దుస్థితికి ఈనాడు వచ్చింది. హత్య చేసిన తర్వాత ముందస్తు బెయిల్ పొంది, అప్రూవర్ గా మారి బయట తిరిగి ఎవరో ఒకరిపై ఆరోపణలు చేస్తూ.. మీడియాతో మాట్లాడే సదుపాయం ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో ఆలోచించాలి. 👉 ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. నటుడు , టీడీపీ నేత బాలకృష్ణ తన ఇంటిలో కాల్పులు జరిపినప్పుడు ఆయన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి, బావ వెంకటేశ్వరావులు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి సాయం చేయాలని కోరారని చెబుతారు. మరి వారిని లాబియిస్టులుగా ఆనాడు ఈ మీడియా ఎందుకు రాయలేదు?. వివేకా కేసులో అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని కోరుతున్నవారిని ఎలాగోలా బద్నాం చేయాలని వీరు తంటాలు పడుతున్నారు. గతంలో వైఎస్ జగన్ ను ఇబ్బంది పెట్టడానికి సీబీఐని వాడుకున్నట్లు.. ఇప్పుడు అవినాష్రెడ్డిని కూడా ఇరుకున పెట్టాలని టీడీపీ, ఆ పార్టీ మీడియా విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. అవినాష్కు హైకోర్టులో వారం రోజులపాటు అరెస్టు కాకుండా ఊరట లభించింది. ఈ సందర్భంగా జరిగిన వాదనలలో వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించి షేడీ వ్యవహారం వెలుగులోకి రావడం ఆయనకు అప్రతిష్ట తెచ్చింది. దీనికి ఆయన కుమార్తె, అల్లుడు కారణం అవుతున్నారా!. పైగా వివేకా కుమార్తె తండ్రి హత్య జరిగినప్పుడు మాట్లాడిన విషయానికి, ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకు ఎంత తేడా ఉంది! మరి దీనికి కారణం ఏమిటో!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
వివేకా కేసు.. ‘టీడీపీ నీచ స్థాయికి దిగజారింది’
సాక్షి, గుంటూరు: వివేకా హత్య కేసులో యెల్లో మీడియా యథేచ్ఛగా ట్రయల్ చేస్తోందని, అధికారం ఉంటే తీర్పు కూడా ఇచ్చేదేమోనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాజా పరిణామాలపై తాడేపల్లిలో ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. వివేకా హత్యపై ఎల్లో మీడియా కల్పితాలు ప్రచారం చేస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే దస్తగిరి మాటల్ని పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది. అతని మాటలకు అధిక ప్రచారం కల్పిస్తున్నారు. కానీ, అతని స్టేట్మెంట్లు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే.. కావాలనే దస్తగిరిని ఆర్గనైజ్ చేసి మాట్లాడించినట్లు కనిపిస్తోందని సజ్జల పేర్కొన్నారు. విపక్షాల పొలిటికల్ ఎజెండాలో భాగంగానే అవినాష్కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారాయన. బాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే.. వివేకా కేసును రాజకీయ ఎజెండాలో భాగంగానే టీడీపీ వాడుకుంటోందని.. తద్వారా నీచ స్థాయికి దిగజారిందని సజ్జల విమర్శించారు. ‘‘చంద్రబాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే ఇదంతా నడుస్తోంది. ఓ ప్లాన్ ప్రకారమే పొలిటికల్ ఎజెండాగా మార్చుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డిలను ఇరికించే కుట్రకు తెరలేపారు. నేరం మోపాలని ముందుగానే నిర్ణయానికి వచ్చారు. తమ పాలనలో ప్రజలకు ఏం చేశామన్నది చెప్పుకోవడానికి టీడీపీ దగ్గర ఏం లేదు. అందుకే వివేకా కేసును ఓ ప్రథకం ప్రకారమే వాడుకుని.. సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా కుట్ర చేస్తోంది. జగన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియకే ఈ నాటకాలు. రాబోయే ఎన్నికల కోసం ఓ కథను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో పని చేస్తుందేమోనని టీడీపీ దురాశ అని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష సాక్షిని పట్టించుకోదా? వివేకా కేసులో టీడీపీ అనుకూల ఎల్లో మీడియా కల్పితాలు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక కుట్రలు చేస్తోంది. కట్టుకథలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఎలా హత్య చేశాడన్నది దస్తగిరి స్వయంగా చెప్పాడు. అసలు దస్తగిరిని అప్రూవర్గా మార్చి బెయిల్ ఇప్పించిందెవరు?. ప్రత్యక్ష సాక్షి వాచ్మన్ రంగన్న ఉండగా.. అప్రూవర్ మాటల్ని ఎందుకు సీబీఐ పట్టించుకుంటోంది. కేసు తేలని సమయంలోనే అప్రూవర్గా మార్చారని, విచారణ పేరుతో ఓ డ్రామా నడిపిస్తున్నారని సజ్జల అన్నారు. వివేకా కేసులో ఇష్టానుసారం సీబీఐ పేర్లు చేరుస్తుంటే.. ఎల్లో మీడియా ప్రింట్లు వేస్తోందని సజ్జల ఎద్దేవా చేశారు. కొత్త బృందం ఏం చేసింది? మరోవైపు ఈ కేసులో సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో హడావిడి చేస్తోందని సజ్జల అసహనం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు పూర్తైనట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ, స్టేట్మెంట్లు తీసుకోవడం తప్ప సీబీఐ దర్యాప్తు చేయడం లేదు. విచారణ పేరుతో డ్రామా జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు పేరుతో ఓ తతంగం నడిపిస్తున్నారు. కీలక విషయాల్ని పట్టించుకోలేదనే దర్యాప్తు అధికారిని మార్చారు. కానీ, కొత్త బృందం ఒక్క ఆధారాన్ని అయినా సేకరించిందా? అని సజ్జల ప్రశ్నించారు. ఊహాజనితంగా మేం ప్రశ్నించడం లేదు. ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నారనే మా బాధ. దర్యాప్తు పేరుతో జరుగుతున్న తతంగాన్ని ఎదుర్కొంటాం. వైఎస్ భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డిలపై కేసులు నిలవడవు. కొంతకాలం ఇబ్బంది పెడతారేమో కానీ చివరకు న్యాయమే గెలుస్తుందని సజ్జల అన్నారు. -
‘చంద్రబాబు టైంలోని చట్టంపైనే రామోజీ ఉల్లంఘనలు’
ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు కొన్ని లెక్కలు చెబుతుండేవారు. జర్నలిస్టులతో ఆయన సమావేశం అయినప్పుడు తన పత్రికలో ప్రతి సెంటీమీటర్ ఎంత విలువైనదో వివరించేవారు. అదెలాగంటే ఎవరిదైనా అనవసరమైన ప్రకటన వేసినట్లు భావించినా, ఆయనకు నచ్చని వార్తను ప్రచురించినా, దానికి ఆయన లెక్క. కట్టేవారు. సెంటిమీటర్ విలువ ఇన్నివందల రూపాయలు అని, మొత్తం ఎన్ని సెంటీమీటర్లు ఆ వార్త నిడివి ఉంటే దానిని బట్టి హెచ్చించి ఇన్నివేల రూపాయల నష్టం జరిగిందని చెప్పేవారు. మొదట అర్ధం అయ్యేది కాదు. అడ్వర్టైజ్మెంట్ వేసిన తర్వాత మిగిలిన స్పేస్ లోనే కదా వార్తలు వస్తున్నదని జర్నలిస్టులు అనుకునేవారు. ఆయన ఆలోచన భిన్నంగా ఉండేది. అంత వార్త బదులు ప్రచార ప్రకటన (యాడ్) వేసి ఉంటే ఇంత డబ్బు వచ్చేది కదా అన్నది ఆయన భావన. అంటే.. తన పత్రికలోని స్పేస్ అంత విలువైనది అని ఆయన అనేవారు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు ఈనాడులో నిత్యం మార్గదర్శి అక్రమాలను సమర్ధిస్తూ కొందరు తెలుగుదేశం, కాంగ్రెస్, ఇతర నేతలు, రామోజీరావు మద్దతుదారులు, చేస్తున్న ప్రకటనలను ఒక పేజీలో సగంపైగా వేస్తున్నారు. అవసరమైతే ఇంకా అదనంగా కూడా ఇస్తున్నారు. దీని ప్రకారం ఎన్ని కోట్ల రూపాయల విలువైన స్పేస్ ను మార్గదర్శి కోసం వాడుకున్నట్లో అంచనా వేయండి. మరేదైనా ప్రైవేటు సంస్థపై ఇలాంటి కేసులు వస్తే ఎవరైనా ఖండన ఇస్తే ఈ స్థాయిలో వార్తలు ఇచ్చేవారా? పైగా ఆ సంస్థ వాదనతో నిమిత్తం లేకుండా ఇదే ఈనాడు మీడియా ఎన్ని కథలు, కధనాలు వండి వార్చేది. జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి పెట్టిన కేసులలో సీబీఐ చేసిన విచారణపై ఎన్ని వేల పేజీల వార్తలు ముద్రించి ఉంటుంది. సాక్షి పత్రికను ఎన్ని రకాలుగా అప్రతిష్టపాలు చేయడానికి యత్నించింది వారికి గుర్తుకు లేదా? మాట్లాడితే జగన్ ను తీహారు జైలుకు పంపుతారు అంటూ తప్పుడు కధనాలు రాశారే. మార్గదర్శికి మద్దతు గా చేస్తున్న ప్రకటనలలో ఎవరైనా రామోజీరావు ఫలానా తప్పు చేయలేదని నిర్దిష్టంగా చెబుతున్నారా? అంటే.. అదేమీ కనిపించదు. రొడ్డకొట్టుడు స్టేట్ మెంట్స్ తప్ప. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామోజీ రాస్తున్నారు కనుక మార్గదర్శిపై కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. 1982 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చిట్ ఫండ్ చట్టం వచ్చింది. ఆ చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకే రామోజీరావు, ఆయన కోడలు శైలజ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లపై కేసులు పెట్టారు. అవి వాస్తవమైనవి కాకపోతే ఫలానా రకంగా అవి అక్రమ కేసులు అని చెప్పవచ్చు. వీరెవ్వరూ అలా అనడం లేదు. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తెలుగుదేశం నేతలతో పోటీ పడి మార్గదర్శి కేసులో రామోజీకి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. దానికి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలివితక్కువగా చిట్ పండ్ నియంత్రణ చట్టం తెచ్చిందని చెబితే బాగుంటుంది కదా!. రామోజీరావు చేతిలో ఒక పెద్ద పత్రిక ఉంది కనుక, అందులో తమకు ఉచిత ప్రచారం కావాలని అనుకునేవారు ఇలా మద్దతు ప్రకటనలు చేస్తున్నారని అనుకుంటే తప్పేముంటుంది? చంద్రబాబు నేరుగా మాట్లాడుతున్నట్లు కనిపించడం లేదు. కాని మిగిలిన టిడిపి నేతల ద్వారా పోటీ పడి రామోజీని భుజాన వేసుకుని మోయిస్తున్నారు. అలా చేయకుంటే రామోజీరావుకు తమపై ఎక్కడ కోపం వస్తుందోనన్నది వారి భయం కావచ్చు. ఇక్కడ మరో ఆసక్తికరమైన సంగతి చెప్పుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం నడుస్తున్న 1999 లోనే డిపాజిట్దారుల రక్షణ చట్టం వచ్చింది. దాని ప్రకారమే ఇప్పుడు రామోజీ చేసిన ఉల్లంఘనలపై కేసు పెడుతుంటే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. దానికి ముందుగా.. రామోజీ తాము తీసుకు వచ్చిన చట్టం ప్రకారం తప్పు చేయలేదని టీడీపీ వారు వివరించాలి కదా! రామోజీపై కక్షపూరితంగా కేసులు పెట్టారని అంటున్నవారు కూడా మార్గదర్శిపై కేసులు పెడితే అది ఏరకమైన కక్షో చెప్పలేకపోతున్నారు. మార్గదర్శి డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిందా? లేదా? ఏపీలో బ్రాంచ్ కార్యాలయాలలో ఉండవలసిన డబ్బును నిబంధనలకు విరుద్దంగా హైదరాబాద్ కు తరలించేవారా? కాదా? బాలెన్స్ షీట్లలో బోగస్ చెక్కులు చూపించారా?లేదా? అన్నవాటికి వీరెవరైనా జవాబు ఇస్తారేమోనని చదివితే అలాంటిదేమీ దొరకదు. జగన్ రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సాక్షి మీడియాను స్థాపించినప్పటి నుంచి రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియా అంతా కక్ష కట్టి రాసిందని టీడీపీ, కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారా? అది కక్ష కానప్పుడు ఇప్పుడు మార్గదర్శిపై కేసులు వస్తే అవి ఎలా కక్షపూరితం అవుతాయి?. నిజానికి చంద్రబాబును ఓడించి జగన్నును ప్రజలు ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఈనాడు మీడియా ఎంత నీచంగా వార్తలు ఇస్తోంది. అదంతా కక్షతో కాదా?. తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనతోనే కదా రామోజీ వార్తలు ఇస్తున్నారని అనుకోవచ్చని వీరు చెబుతున్నారా?. ఒక వేళ ఈ మద్దతుదారులు చేస్తున్న ప్రకటనలకు ఆదారాలు ఉంటే వాటిని సీఐడీకి అందచేయవచ్చు కదా? ఆ రకంగా సీఐడీని ఇరుకున పెట్టవచ్చే! ఆ అవకాశాన్ని వదలుకుని ఎందుకు కేవలం ప్రచారానికే పరిమితం అవుతున్నారు?. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పత్రాల లీక్ కేసులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు చేసిన ఆరోపణలపై అక్కడి దర్యాప్తు బృందం వారికి నోటీసులు ఇచ్చి విచారించింది కదా?. అప్పుడు అది కక్ష అని ఈ టీడీపీ మద్దతుదారులు ఎందుకు అనలేదు?. దీని అర్ధం ఏమిటంటే రామోజీ మీడియాలో తమకు ఉత్తి పుణ్యానికి ప్రచారం వస్తుందని వీరు వారికి కావల్సిన రీతిలో ప్రకటనలు చేస్తున్నారన్నట్లే కదా!. ఒకప్పుడు కొన్ని ఫైనాన్స్ సంస్థలు 24 శాతం ,అంతకు మించి వడ్డీ ఇస్తామని ప్రచార ప్రకటనలు ఈనాడు మొదటి పేజీలో ఇచ్చేవి. వాటిని నమ్మి ఎంతో మంది నష్టపోయారు.అలాంటి ప్రకటనలను ఈనాడు అంగీకరించవద్దని కొందరు పెద్దలు సలహా ఇచ్చినా , తన వ్యాపారం కోసం రామోజీ ఆ పనిచేయలేదు. తదుపరి కాలంలో అలాంటి ఫైనాన్స్ సంస్థలు మూతపడి వేలాది మంది నష్టపోయారు. కృషి బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్ వంటి చిన్న బ్యాంకులు మూతపడినప్పుడు కూడా వేలాది మంది డిపాజిటర్లు చాలా మొత్తాలను వదలుకోవలసి వచ్చింది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం డిపాజిట్ల రక్షణ చట్టం తెచ్చింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ తీసుకు వచ్చిన చట్ట సవరణ 45 ఎస్ ప్రకారం కూడా హిందూ అన్ డివైడెడ్ ఫ్యామీలి సంస్థలు ఇతరుల నుంచి డిపాజిట్ లు వసూలు చేయరాదు. వీటన్నిటిని ఉల్లంఘించి డిపాజిట్లు తీసుకున్న సమాచారంతో ఆనాటి వైఎస్ ప్రభుత్వం కొంత చర్య తీసుకుంది. రాజమండ్రి ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ కేసు వేయడం, అది ఇప్పటికీ కొనసాగుతుండడం తెలిసిన సంగతే. ఈ సందర్భంగా కీలక వ్యవస్థతో సహా ఆయా వ్యవస్థలలో, రాజకీయ పార్టీలలో రామోజీకి ఉన్న పరపతిని ఉండవల్లి వివరిస్తుంటారు. తద్వారా రామోజీ ఎలా రక్షణ పొందేది చెబుతుంటారు. అయినా తాను అక్రమంగా తీసుకున్న డిపాజిట్లను ఆయన అప్పటికప్పుడు చెల్లించక తప్పలేదు. రూ. 2,600 కోట్ల మొత్తం చెల్లించడానికిగాను ఆయన తన టీవీలను అమ్ముకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ అనుభవం ఉన్నా, మళ్లీ మరో రూపంలో రామోజీ ఇలా డిపాజిట్లు సేకరించగలిగారంటే ఎంత ధైర్యం ఉండాలి. అందుకే ప్రభుత్వాలు తన గుప్పిట్లో ఉండాలని ఆయన కోరుకుంటారన్నమాట. కాంగ్రెస్ వ్యతిరేకత మా విధానమని ఆయన చెప్పినా, ఆయా సమయాలలో కాంగ్రెస్ లోని కొందరు నేతలతో ఆయన చెట్టపట్టాలేసుకోగలరు. ఉదాహరణకు జైపాల్ రెడ్డి తదితరులు ఆయనకు ఎంత సన్నిహితులో చెప్పనవసరం లేదు. అలాగే బిజెపిలోని పెద్దల సంగతి సరేసరి. కీలక వ్యవస్థలోని ప్రముఖులు రామోజీ ఇంట్లో కార్యక్రమానికి క్యూ కట్టిన వైనం సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అయింది. ఇవన్ని పత్రికా విలువలేనా? అసలు తప్పు చేయలేదని చెప్పలేక ఇలా డొంక తిరుగుడు పద్దతిలో పేజీల కొద్ది తమకు అనుకూల కధనాలు రాయడం ద్వారా వందల కోట్ల రూపాయల విలువైన మీడియా స్పేస్ను ఆయన దుర్వినియోగం చేస్తున్నారా? సద్వినియోగం చేస్తున్నారా? ఇవేనా జర్నలిజం విలువలు?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ -
యెల్లో బ్యాచ్ డ్రామాకు సీఎం జగన్ చెక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ నేతలకు, తెలుగుదేశం మీడియాకు చాలా నిరాశ మిగిల్చారు. ఆయన మంత్రివర్గంలో మార్పులు చేస్తారని, తద్వారా కొందరిలో కొత్తగా అసంతృప్తి వస్తుందన్న వాళ్ల ఊహలకు జగన్ గండి కొట్టారు. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ తన సొంత బలంతో గెలవాలని అనుకోవడం లేదు. తన సొంత ఆలోచనలతో ముందుకు రావాలని అనుకోవడం లేదు. అంతెందుకు తనకంటూ ఒక విధానాన్ని కూడా నిర్దేశించుకోలేకపోతోంది. తెలుగు దేశం పార్టీ.. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని చెబుతూనే వాటిని ఎలా వ్యతిరేకించాలా? అనే తర్జనభర్జన పడుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారానికి జగన్ తెర వేయడం వల్ల టీడీపీకి చాలా నష్టం కలిగినట్లే ఉంది. ఆ ప్రచారం జనంలో ఉంచగలిగితే, టీడీపీ కేడర్లో కొంత ఉత్సాహం నింపవచ్చన్నది బహుశా వారి ఆశ కావచ్చు. అలాగే విదేశాలలో స్థిరపడిన టీడీపీ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడానికి ఇది ఒక మార్గంగా అనుకుని ఉండవచ్చు. కానీ, ముందస్తు ఎన్నికలు లేవని తేలిపోవడంతో విరాళాలు ఇచ్చేవారు కూడా ఇప్పటికిప్పుడు ముందుకు రావకపోవచ్చు. పైగా.. శాంతంగా సీఎం జగన్.. మరో ఆరునెలలపాటు పార్టీ ఉనికిని రక్షించుకోవడానికి తంటాలు పడవలసి వస్తుంది. ఇది ఒక కోణం అయితే.. జగన్ కనుక కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వడం లేదని చెప్పే అవకాశం ఉందని ఒక వర్గం మీడియా ఏకధాటిగా ప్రచారం చేసింది. ఎమ్మెల్యేలు కొందరిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయవచ్చని భావించింది కూడా. కానీ పరిస్థితి అలా లేకుండా పోయింది. జగన్ చాలా శాంతంగా తన అభిప్రాయాలను చెప్పిన తీరు అందరిని ఆకట్టుకుంది. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేని పోగొట్టుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపరచుకోవాల్సిన విషయాన్ని కూడా ఆయన వదలిపెట్టలేదు. ఈ మొత్తం వ్యవహారంలో నిరుత్సాహానికి గురైన తెలుగుదేశం మీడియా రివర్స్ లో వార్తలు రాసింది. చంద్రబాబుకు బూమరాంగ్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారని, ఎమ్మెల్యేలను ఏమీ అనుకుండానే సమావేశం ముగించారని , స్వరం మార్చారని ఇలా తోచిన వార్తలు రాశారు. నిజానికి ఇందులో జగన్ డిఫెన్స్ లో పడింది ఏముంది? ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయన ట్రయల్ గా భావించి తనను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు వచ్చే శాసనసభ ఎన్నికలకు టిక్కెట్ ఇవ్వలేనని ఫెయిర్ గా చెప్పేశారు. దాంతో వారు తెలుగుదేశం ట్రాప్ లోకి వెళ్లారు. వారు అమ్ముడుపోయారన్న ఆరోపణలను వైసిపి చేసింది. చంద్రబాబు ఎప్పటిమాదిరే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న విమర్శను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ రకంగా ఆయన అఫెన్స్ గేమ్ ఆడితే , టిడిపి మీడియాకు మాత్రం అది డిఫెన్స్ గా కనిపించిందని అనుకోవాలి. ఏ ఎమ్మెల్యేలతో ఎలా మాట్లాడాలో జగన్ కు మాత్రం తెలియదా!. పన్నెండేళ్లుగా అన్నిటిని కాసి వడపోశారు. తమను మించి ఉద్దండులు లేరనుకునే చంద్రబాబు అండ్ కో కి జగన్ చుక్కలు చూపించి అధికారంలోకి వచ్చారు. అలాంటి నేతకు ఎవరితో ఎలా ఉండాలో టీడీపీ మీడియా చెప్పాలా? యాభై ,అరవై మందికి టిక్కెట్లు ఇవ్వరని లిస్టు కూడా తయారు చేసి ,వారిలో ఇంతమంది పార్టీ నుంచి వెళ్లిపోతారని కూడా ప్రచారం చేస్తారని ఎల్లో మీడియా గురించి వైఎస్సార్సీపీ నేతలకు జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. పైగా వైసీపీ ఎమ్మెల్యేలను శత్రువులుగా ప్రొజెక్టు చేయడానికి యత్నిస్తున్నారని జగన్ తెలిపారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని, దుష్టచతుష్టయం మారీచుల ముఠా వంటిదని ఆయన నొక్కి చెప్పారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెంచుకోవాలని ఆయన స్పష్టంగానే పేర్కొన్నారు. ఆ ప్రచారాలన్నీ.. ప్చ్ గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ,లేనప్పుడు ఎమ్మెల్యేలకు , ఇన్ చార్జీలకు తన సర్వేలలో వచ్చిన గ్రేడ్ లు ఇచ్చేవారు. అప్పుడు చంద్రబాబు వ్యూహరచన , పార్టీని నడిపే తీరు వేరని ప్రచారం చేసేవారు. అదే జగన్ తన ఎమ్మెల్యేలపై సమీక్షలు చేస్తే మాత్రం భిన్నమైన కధనాలు ఇస్తున్నారు. ముందస్తు ఎన్నికలపై ఎంత ప్రచారం చేశారో చెప్పలేం. నిజంగానే జగన్ అందుకు సిద్దం అవుతున్నారేమో అన్నంతగా ప్రజలను నమ్మించే యత్నం చేశారు.జగన్ డిల్లీ వెళితే చాలు.. అక్కడ కేంద్ర పెద్దలతో ముందస్తు ముచ్చటే మాట్లాడారన్నట్లుగా వదంతులు సృష్టించారు. కాని అవేవి వాస్తవం కాదని, దూది పింజల మాదిరి తేలిపోయింది. నిజానికి తెలుగుదేశం పార్టీనే గతంలో ముందస్తుకు వెళ్లే ఆలోచనలు చేసింది. 1984లో టిడిపిలో తిరుగుబాటు తర్వాత ఎన్.టి.ఆర్. అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. తదుపరి 1989 లో అసెంబ్లీ రద్దు చేసి లోక్ సభతో పాటు ముందస్తు ఎన్నికలకు ఎన్.టి.ఆర్.సిద్దం అయ్యారు. 1985లో గెలుపొందినా, 1989లో మాత్రం దారుణంగా పరాజయం కావల్సి వచ్చింది. గతంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద నక్సల్స్ బాంబులు పేల్చారు. అదృష్టవశాత్తు ఆయనకు పెద్దగా దెబ్బలు తగలలేదు. అయితే నక్సల్స్ దాడివల్ల తనకు సానుభూతి వస్తుందని ఆశించి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆయన ప్రభుత్వం ఓటమిపాలైంది. సంక్షేమంతోనే జనాల్లోకి సీఎం జగన్ .. తెలంగాణ లో గత టర్మ్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరునెలల ముందుగా ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఏపీలో జగన్ ఎప్పుడూ ఇంతవరకు అలాంటి ఆలోచన ఉన్నట్లు చెప్పలేదు. కనీసం సంకేతం కూడా ఇవ్వలేదు. కాని వదంతులు మాత్రం విస్తారంగా సృష్టించారు. వీటన్నిని ఆయన కొట్టిపారేశారు. జగన్ తన ప్రభుత్వం వల్ల లబ్దిపొందిన వారంతా తనకు మళ్లీ మద్దతు ఇస్తారని గట్టిగా విశ్వసిస్తున్నారు. 87శాతం మంది సంక్షేమ పథకాల ఫలాలను అనుభవించారని ఆయన వివరించారు. అందువల్ల తనకు పాజిటివ్ ఓటు వస్తుందని జగన్ భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా ప్రస్తావించి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గ ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు తేడా ఉందని ఆయన విశ్లేషించారు. ఇది నిజమే. జగన్ కొత్తగా మరో రెండు కార్యక్రమాలు చేపట్టడం విశేషం. జగనన్నకు చెబుదాం అన్నది ఒకటైతే, జగనన్నే మన భవిష్యత్తు అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇవి వచ్చే ఎన్నికలనాటికి అత్యంత ప్రజాదరణ పొందే విధంగా రూపొందించారు. ఇలా జగన్ తన సొంత ఆలోచనలతో కార్యక్రమాలు స్కీములు అమలు చేసుకుని పోతుంటే, తెలుగుదేశం పార్టీ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలో తెలియక కొట్టుమిట్టాడుతోది. ఆ నేపధ్యంలో ఆ పార్టీ స్పష్టతను కొరవడి గందరగోళంగా రాజకీయం చేస్తోంది. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ -
రామోజీ.. వ్యక్తిగతస్వేచ్ఛ మీకు మాత్రమేనా?!
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు బెడ్ మీద ఉన్న ఫొటో ఒకటి బయటకు రావడం.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కిందే వస్తుందని ఈనాడులో వార్త వచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తన దాకా వస్తే కానీ ఈనాడుకి అర్థం కాలేదు. మరి సీబీఐ విచారణ జరిగిన ప్రతిసారి, అదంతా కళ్లతో చూసినట్టు, వినినట్టు వార్తలు రాయడం వ్యక్తిగత స్వేచ్ఛ హరించడం కాదా? దర్యాప్తు సంస్థలు అధికారికంగా నిర్ధారించక ముందే బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాయడం ఏ చట్టం ప్రకారం కరెక్ట్?. జనం డబ్బులతో మార్గదర్శి ఎదిగింది. ఇది అందరికీ తెలుసు. ఈనాడుని అడ్డం పెట్టుకుని మార్గదర్శి సిబ్బంది అధికారులు, వ్యాపారులతో చీటీలు వేయించింది. లొంగని అధికారులపై ఈనాడులో వార్తలు వచ్చేవి. చీటీ కట్టిన వారికి మార్గదర్శి డబ్బు కరెక్ట్గా చెల్లించింది. ఇది మాత్రమే నిజం. మధ్యలో కట్టలేక ఆగిపోయిన వాళ్లు, డబ్బులు ఇరుక్కుపోయి ఎన్ని బాధలు పడ్డారో వాళ్లకి మాత్రమే తెలుసు. జర్నలిజం బలంతో ప్రభుత్వాల్నే ఒక ఆట ఆడించే ఈనాడుపై చీటీదారులు కానీ, రిజిస్టార్లు కానీ ఫిర్యాదు చేయడానికి సాహసిస్తారా?. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి కాకుండా, అనేక చిట్ఫండ్ కంపెనీలు ఉండేవి. వాటన్నింటిని పథకం ప్రకారం తొక్కేశారు. చిన్న అవకతవక జరిగినా, పెద్ద అక్షరాలతో ఈనాడులో వేసి జనాల్లో అపనమ్మకం పుట్టించి వాటిని దివాళా తీయించేవాళ్లు. మార్గదర్శిలో ఏం జరిగినా, బయటకు రాదు. వచ్చినా రాసే దమ్ము ఎవరికీ లేదు. ఈనాడు అనే ఆయుధంతో ఎంత మంది పరువు ప్రతిష్టలు బజారుకీడ్చారో?. ఎందరి వ్యక్తిగత స్వేచ్ఛ హరించారో, అవమానాలకి గురి చేశారో బాధితులకే తెలుసు. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడమే ఎన్టీఆర్ నేరమైనట్టు, ఆయన్ని కూడా వేధించారు. లక్ష్మీపార్వతిని రకరకాలుగా అవహేళన చేయడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కాదా? ఊరందరి భూకబ్జాల గురించి రాసే ఈనాడుకి, రామోజీ ఫిల్మ్ సిటీ కబ్జాల గురించి తెలియదా? అదంతా రైతులు న్యాయంగానే ఇచ్చారా? భయపడి ఇచ్చారా?. ఆ రోజుల్లో సోషల్ మీడియా వుంటే మీ సామ్రాజ్యం పునాదులు అప్పుడే కదిలేవి. ఇతరుల మీద విచారణ జరిగినప్పుడు మీరు బ్యానర్ ఐటమ్లు రాశారు. మీ మీద విచారణ జరిగితే మాత్రం వేధింపులు అవుతాయా?.. చెప్పండి రామోజీ.. :::పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ ఇదీ చదవండి: చట్టం ముందు దేవుడైనా.. రామోజీ అయినా సమానమే! -
వీధికుక్కల ప్రచారం పట్టించుకోను: విక్రమ్రెడ్డి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీపై అసంతృప్తితో పార్టీ మారబోతున్నారంటూ పచ్చ బ్యాచ్ చేస్తున్న ప్రచారంపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి తీవ్రంగా స్పందించారు. వీధికుక్కల ప్రచారం పట్టించుకోనన్న ఆయన.. సీఎం జగన్ వెంటే తన ప్రయాణమని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్నిస్థానాలను కైవసం చేసుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘పార్టీ మారబోతున్నట్లు వస్తున్న ప్రచారం ఉత్తదే. వీధి కుక్కల ప్రచారం నేను పట్టించుకోను. బాబాయ్ చంద్రశేఖర్రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీని, అలాగే ఇంటి పేరు వదిలేసి వెళ్తే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలిసి వస్తుంది. పార్టీ లైన్ దాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవ’’ని విక్రమ్రెడ్డి పేర్కొన్నారు. అలాగే మేకపాటి కుటుంబం ఎప్పుడూ సీఎం జగన్తోనే ఉంటుందని, ఆయన వెంటే నడుస్తుందని ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడు.. ఎప్పుడూ.. సీఎం జగన్ తోనే మా ప్రయాణం. ఆయన్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకే టీడీపీ తన అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని ప్రచారం చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా ఎవరు కలిసొచ్చినా సరే.. ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్న సీఎం జగన్ స్థానాన్ని చెరపలేరు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలితం లేదన్నారాయన. ఇక.. జిల్లా పరిణామాలపైనా స్పందించిన మేకపాటి విక్రమ్రెడ్డి.. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పదికి పది స్థానాలు గెలిచి సీఎం వైఎస్ జగన్కు కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రశేఖర్రెడ్డి.. నువ్వు మళ్లీ గెలుస్తావా? -
లోకేష్కు కలిసిరాని కొత్త ప్లాన్.. చట్టపరంగా చర్యలకు దిగిన ఏపీఎస్ఆర్టీసీ!
సాక్షి, విజయవాడ: టీడీపీ తప్పుడు ప్రచారాలకు కేరాఫ్ మారింది. ఉన్నది లేన్నట్టుగా.. జరగనిది జరిగినట్టుగా చూపిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. తాజాగా మరో తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అక్కస్సు వెళ్లగక్కింది. కానీ, తీరా అది ఫేక్ అని తేలడంతో టీడీపీని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. అటు, ఏపీఎస్ఆర్టీసీ కూడా టీడీపీ తప్పుడు ప్రచారంపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నారా లోకేష్ను కలిసిన ఓ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ను విధుల నుంచి తొలగించారని టీడీపీ, లోకేష్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టి వైరల్ చేశారు. అయితే, ఈ పోస్టుపై ఏపీఎస్ఆర్టీసీ యాజ్యమాన్యం స్పందించింది. తాము ఆ డ్రైవర్ను తొలగించలేదని స్పష్టం చేసింది. ఇది అస్యత ప్రచారం అని ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారానికి బాధ్యులైన టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక, టీడీపీ పోస్టు చేసిన వార్త ఫేక్ అని తేలడంతో నారా లోకేష్ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. #FakeNewsAlert This is absolutely false News. We strongly deny these claims made in media. APSRTC will initiate suitable legal action on the responsible social media administrators for such fake propaganda https://t.co/g5HveEE2R0 — APSRTC (@apsrtc) February 8, 2023 -
తోడేళ్ల మందతో తస్మాత్ జాగ్రత్త!
వాడి పేరు మారీచుడైతేనేమి.. సుబాహుడైతే నేమి? ఆవిడ పేరు తాటకైతేనేమి... శూర్పణఖ అయితేనేమి? అందరూ దైత్యులే! రావణభృత్యులే! అతడు రామోజీ అయితేనేమి... చంద్ర బాబు అయితేనేమి? ఆ గొట్టాలు ఏబీఎన్ అయి తేమీ, టీవీ5 అయితేమీ? ఈ వ్యవస్థలో మొలకెత్తిన విషపు విత్తులే! పెత్తందారీ వ్యవస్థ తొత్తులే! తోడేళ్ల గుంపును అదుపులో పెట్టుకొని వాటి వికృతమైన, భయంకరమైన అరుపులతో సమాజంపై పెత్తనం చేయడానికి అల వాటుపడిన కూటమి ఇది. లోక కల్యాణార్థం అలనాటి రుషులు తలపెట్టిన యజ్ఞ యాగాదులను రాకాసి మూకలు ఏనాడూ సహించలేదు. యజ్ఞ వాటికలపై నెత్తురు గుమ్మరించి మాంసం ముద్దలను విసిరి భగ్నం చేసేవారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే మనుషుల సుఖసంతోషాలు రాక్షసగణ ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక. ఇప్పుడూ అదే జరుగు తున్నది. అడవి లోని తోడేళ్లు మనిషిని పెంచుకుంటే వాడు మోగ్లీ (జంగిల్బుక్) అవుతాడు. కానీ పెత్తందార్లు తోడేళ్లను తయారు చేసుకొని పోషిస్తే అవి రాక్షసత్వం సంతరించుకుంటాయి. మేఘనాథ, కుంభ కర్ణ, అతి కాయ, ప్రహస్త వంటి రావణ సేనాపతులవుతారు. ఎంతోదూరం వెళ్లడం దేనికి? గడిచిన వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న§ ó మిటి? తోడేళ్ల గుంపు మొరుగుతున్న దేమిటి? వచ్చేనెల మూడు నాలుగు తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ విశాఖలో జరగబోతున్నది. ఇందుకు సన్నాహకంగా ఢిల్లీలో జరిగిన భేటీకి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఏకంగా 48 దేశాల రాయబారులు, ప్రతినిధులూ ఈ సమావేశంలో పాల్గొనడం ఒక విశేషం. కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ముసురుకుంటున్న మాంద్యం పరిస్థి తులను ఎదిరించి తమ రాష్ట్రం 11.48 శాతం ఆర్థిక వృద్ధిని ఎలా నమోదు చేసిందో, దేశంలోనే అగ్రస్థానంలో ఎలా నిలబడిందో వివరిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం ప్రతినిధులను ఆకట్టుకున్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరసగా తమ రాష్ట్రం ఎలా ముందువరసలో కొనసాగుతున్నదో కూడా ఆయన వివరించారు. రాజకీయ నాయకుడి మాటల్లోని నిజాయితీని అంచనా వేయడంలో వ్యాపార వేత్తల కంటే నిపుణులైన వారు ఎవరూ ఉండరు. అందుకే గతంలోనే ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని బహిరంగంగా మెచ్చుకున్నవారిలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ, డిక్సన్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ, సెంచురీ ప్లైవుడ్ చైర్మన్ సజ్జన్ భజాంకా తదితరులున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కియా, టోరే, క్యాడ్బరీస్, సెయింట్ గోబియాన్, అపాచీ – హిల్టాప్, ఎవర్టన్ టీ ఇండియా వగైరా కంపెనీల ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సహకారాన్ని కొనియాడారు. అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డే పెద్ద ఆస్తిగా అభివర్ణించారు. భారత్ బయోటెక్ కో– ఫౌండర్ సుచిత్ర ఎల్లా కూడా సీఎంని ప్రశంసించారు. మొన్నటి యూనియన్ బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన అనేక కార్యక్రమాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అమలవుతుండటం ఒక విశేషం. చిరు ధాన్యాల ప్రోత్సాహానికి బడ్జెట్లో ‘శ్రీఅన్న’ పథకాన్ని ప్రకటించారు. ఈ తరహా మిల్లెట్ (చిరుధాన్యాలు) పాలసీ ఆంధ్ర ప్రదేశ్లో అమలవుతున్నది. ‘పీఎం మత్స్య సమృద్ధి యోజన’ పథకానికి కూడా అడుగుజాడ ఆంధ్రప్రదేశ్దే. రాష్ట్రం ఇప్పటికే 26 ఆక్వా హబ్లు, 14 వేల అవుట్లెట్ల ఏర్పాటుకు అడుగులేస్తున్నది. ప్రతి పంచాయతీలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు లక్ష్యాన్ని బడ్జెట్లో ప్రకటించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభమైంది. 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ప్రతిపాదించారు. రాష్ట్రంలో 30 స్కిల్ హబ్స్, 26 స్కిల్ కాలేజీలు, రెండు యూనివర్సిటీల ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్న బడ్జెట్ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు–నేడు’ కార్య క్రమమే ప్రేరణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కదా విజినరీ లక్షణం. మరికొన్ని రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ తన ఆలోచనలేనని మన ఎల్లో విజినరీ ప్రకటించుకున్నా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు. ఈ బడ్జెట్లో కేంద్రం ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రకటిం చింది. ఈ కార్యక్రమానికి కూడా స్ఫూర్తి ఆంధ్రప్రదేశే కావడం మరో విశేషం. ప్రభుత్వ అండదండలతో రాష్ట్రంలో ఏడు లక్షల మంది రైతులు ప్రకృతి సాగును అనుసరిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ప్రేరణా నిపుణుడు నిక్ వుజిసిక్ గురించి చాలామందికి తెలిసి ఉండవచ్చు. కాళ్లూ చేతులూ లేకుండా పుట్టిన తనను లోకమంతా చిన్నచూపు చూసినా చలించకుండా తనను తాను ఒక అద్భుతమైన ఆయుధంగా మలుచుకున్న ధీరుడు. తన జీవిత కథను దీపంగా మలిచి ప్రపంచవ్యాప్తంగా యువతీ యువకుల మనసుల్లోని చీకట్లను పారద్రోలుతున్న వ్యక్తిత్వ నిపుణుడు. దేశాటనలో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణను చూసి ఆయన చకితుడయ్యారు. పాఠశాల నిర్వహణ మీద ప్రభుత్వాలు ఇంత శ్రద్ధ పెట్టడాన్ని తాను మరెక్కడా చూడలేదని ఆయన చెప్పారు. చెప్పడమేకాదు స్వయంగా సీఎంని కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేసే ఇన్ని పరిణామాలు గడిచిన ఒక్క వారంలోనే చోటుచేసుకున్నప్పటికీ ఇవి మన ఎల్లో మీడియాకుగానీ, దాని వెనకనున్న తోడేళ్లకు గానీ ససేమిరా కనిపించవు. వాళ్లు చూడరు. లోకాన్ని చూడనివ్వరు. లోకం చూడకుండా ఉండటానికి వాళ్ల దగ్గర కొన్ని నైపు ణ్యాలున్నాయి. మధుబాబు డిటెక్టివ్ నవలల్లోంచి, చందమామ భేతాళ కథల్లోంచి, పేదరాశి పెద్దమ్మ కథల్లోంచి కొన్ని ఘట్టాలను లేపేసి వాటికి తాజా రంగులద్ది వార్తలుగా ప్రచారంలో పెడతారు. ఈవారం కూడా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి లభించిన మెచ్చుకోళ్లను పూర్వ పక్షం చేయడానికి కుళ్లిన కోడిగుడ్డు వాసన వెదజల్లే హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్తో వండి వార్చిన కొన్ని కథలను ఎల్లో మీడియా జనంలోకి వదిలింది. ఎల్లో మీడియాకూ, సీబీఐ దర్యాప్తు సంస్థకూ మధ్యన ‘ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు పెనవేసి ముడివేసెనో’ అనే అనుమానం ఎవరికైనా వస్తే తప్పుపట్టలేము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని అప్పటి కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ భాగస్వాములుగా చేరి జగన్మోహన్రెడ్డిపై రాజకీయ కేసులు బనాయించి సీబీఐ దర్యాప్తు వేయించిన దరిమిలా జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు కారణాలు. ఆనాడు దర్యాప్తు అధికారుల మనసులో మాటేమిటో ఎల్లో మీడి యాకు క్షణాల్లో తెలిసిపోయేది. ఎల్లో మీడియా ఏ కవిత్వం రాసినా దర్యాప్తు సంస్థకు అభ్యంత రాలుండేవి కాదు. అంతటి దృఢమైన బంధం ఇప్పుడైతే ఉన్నదో లేదో తెలియదు కానీ, ఎల్లో మీడియా కవిత్వం మాత్రం ఆగడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమ యంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గుర య్యారు. ఈ విషయం వివేకానందరెడ్డి బావమరిది ఫోన్ చేసి చెబితే అవినాశ్రెడ్డికి తెలిసింది. జమ్మల మడుగు ప్రయాణంలో ఉన్న అవినాశ్రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది మీడియా ద్వారా అందరికీ తెలిసిన సమాచారం. అక్కడికి వెళ్లిన తర్వాత ఈ సమాచారం చెప్పడానికి సహజంగానే ఆయన ఫోన్లు చేసి ఉండవచ్చు. చనిపోయిన వివేకానందరెడ్డి స్వయాన జగన్ మోహన్రెడ్డి బాబాయ్ కనుక ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించడంలో విశేషమేమున్నది. ఆ ఫోన్ను ఇంట్లో అటెండరో, మరొకరో రిసీవ్ చేసుకుంటే వింతేమున్నది? ఇందులో కుట్రకోణం గానీ, కుంభకోణం గానీ ఎక్కడున్నది? అటువంటి లంబకోణం ఏదైనా వుంటే అప్పుడున్న తెలుగు దేశం ప్రభుత్వం ఎందుకని ఉచ్చు బిగించలేదు. మృతదేహం దగ్గర దొరికిన లేఖను దాచిపెట్టమని వివేకా అల్లుడు మృతుని పీఏని ఎందుకు ఆదేశించాడు? వెంటనే పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? ఇలా ఇవ్వకూడదనే సలహా ఆయనకు ఎవరు ఇచ్చారు? ఇక్కడ కదా దర్యాప్తు ప్రారంభం కావలసింది. హత్యలో తమ పార్టీవారి ప్రమేయం ఉన్నందువల్ల వారిని తప్పించడం మీదనే దృష్టిపెట్టి తెలుగుదేశం ప్రభుత్వం దర్యా ప్తును తాత్సారం చేసిందా? ఇప్పుడు జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రతిష్ఠతో కడుపు మండి కాకమ్మ కథలతో చెలరేగుతున్నారా? విచారణ కోసం, సమాచారం కోసం సీబీఐ నోటీసులు ఇస్తే ఎవరైనా వెళ్తారు. తమకు తెలిసిన సంగతులు చెప్తారు. దీన్ని ఆసరా చేసుకొని వీవీఐపీ కుటుంబం మీద బురద జల్లడానికి బరితెగిస్తారా? వైసీపీ నాయకుడు కొడాలి నాని చేసిన డిమాండ్కు ప్రజాస్వామ్య ప్రేమికులందరూ మద్దతు పలకవలసి వస్తున్నది. కొన్ని సంవత్సరాల క్రితం తన సోదరుడైన చంద్రబాబు మీద విమర్శలు చేసిన తర్వాత నారా రామ్మూర్తి నాయుడు ప్రజల్లో కనిపించడం లేదట! రామ్మూర్తి నాయుడు ఒక దఫా శాసన సభ్యుడిగా కూడా పనిచేశారు. కనుక ఆయన ఉనికిని, బాగోగులను తెలుసుకోవలసిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉన్నది. అట్లాగే ఎన్టీఆర్ మరణంపై తనకు అనుమానాలున్నాయనీ, విచారణ జరిపించాలనీ ఆనాడే హరికృష్ణ కోరినట్టు కొడాలి నాని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మరణం వల్ల ప్రధానంగా లబ్ధి జరిగింది చంద్రబాబుకే కనుక ఆయన విచారణకు అంగీకరించలేదని కూడా నాని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఎనిమిదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి, అగ్రశ్రేణి కళాకారుడైన ఎన్టీ రామారావు మృతిపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికైనా విచారణ జరగాల్సిందే. మకుటం లేని మహారాజులాగా వెలుగొందిన వ్యక్తి దయనీయ స్థితికి దిగ జారడానికి కారకులైన వ్యక్తులు ఎవ రెవరున్నారో లెక్క తేలవలసిందే. ఆలస్యమైనా సరే న్యాయం జరగవలసిందే. తప్పుడు ప్రచార దుర్గంధాన్ని వెదజల్లడంలో భాగంగా కొన్ని పాచిపోయిన పాతకాలపు ఎత్తుగడలను కూడా ఆశ్రయిస్తున్నారు. అందులో ఒకటి వైసీపీ నుంచి వలసలు ప్రారంభ మయ్యాయనీ, చాలామంది బయటకు రాబోతున్నారనే ప్రచారం. సర్వేలు చెబుతున్నాయి తెలుగుదేశం గెలవ బోతున్నదని మరో ప్రచారం. ఎల్లో మీడియాకు పాఠకులు విజ్ఞప్తి చేయ వలసిన విషయం ఒకటున్నది – ‘2019 ఎన్నికలకు ముందు మీరు అచ్చేసిన సర్వే ఫలితాలను ముందుగా ప్రకటించండి. ఆ తర్వాత కొత్త సర్వేల గురించి రాయాల’ని డిమాండ్ చేయాలి. పార్లమెంట్ ఎన్నికలకు ఓ రెండేళ్ల ముందే బీజేపీ తన ఎన్నికల కసరత్తును ప్రారంభిస్తుంది. తమ పార్టీ ఇమేజ్ పెరిగినట్టు నిరూపించడానికి కొన్ని సర్వే సంస్థలను (ట్రాక్ రికార్డ్ సరిగా లేని) రంగంలోకి దించుతుంది. ఇప్పుడా కాంట్రాక్టు ‘సీ వోటర్’ అనే సంస్థకు దక్కింది. బీజేపీ బలం చెక్కు చెదరలేదని చెప్పడం కోసం ఆ సంస్థ ప్రధానితో సహా బీజేపీ ముఖ్యమంత్రులందరి రేటింగ్ను పెంచేసింది. ఆమేరకు నాన్–బీజేపీ ముఖ్యమంత్రుల రేటింగ్ను కొంచెం తగ్గించేసింది. ఇంకేముంది మన కోతికి కొబ్బరికాయ దొరికింది. జగన్ మోహన్రెడ్డి రేటింగ్ తగ్గిందనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. నూటికి నూరుపాళ్లు సక్సెస్ రేటు ఉన్న అత్యంత విశ్వస నీయమైన ఒక సర్వే సంస్థ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2019 ఫలితాలు దాదాపు పునరావృతం కానున్నాయి. ప్రతి పక్షాల పొత్తుల వల్ల పాలక పార్టీకి నష్టం కంటే లాభమే ఎక్కువ జరుగుతుందని ఆ సంస్థ అభిప్రాయపడినట్టు సమాచారం. బహుశా అందువల్లనే ప్రతిపక్ష తోడేళ్ల మందను ముఖ్యమంత్రి పెద్దగా ఖాతరు చేస్తున్నట్టు లేదు. ఆ ధీమాతోనే మొన్న ఒక సభలో సింహం–తోడేళ్ల ప్రస్తావన కూడా తెచ్చి ఉండొచ్చు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా నిత్యం ప్రజల్లో ఉండాలనీ, అలా ఎవరైనా లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం కుదరదనే సందేశాన్ని ఇస్తున్నాడనీ ఎల్లో మీడియానే చాలాసార్లు రాసింది. టికెట్ లభించడం కష్టమని సెల్ఫ్ ఎసెస్మెంట్ ద్వారా నిర్ధారణకు వచ్చిన వాళ్లు కొందరు పక్క చూపులు చూడవచ్చు. అటువంటి వాళ్లను చేరదీసి టిక్కెట్ ఇస్తామనే హామీని తోడేళ్ల మంద ఇవ్వ వచ్చు. ఆ తోడేళ్లను నమ్మడానికి కొన్ని గొర్రెలు సిద్ధపడితే ఎవరేం చేయగలరు? చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న లోకేశ్బాబు పాదయాత్ర తుస్సు మన్నది. దాన్ని పైకి లేపడం తమ వల్ల కాదని ఎల్లో మీడియా పెద్దలు కూడా తేల్చేశారట. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమా లను మసకపరచడానికి రాక్షస యుద్ధానికి తోడేళ్ల మంద తెగించింది. ‘అక్క ఆరాటం తప్ప బావ బతికేది లేద’నే సామెత ఉండనే ఉన్నది. ఎన్ని కోట్ల అరచేతుల్ని అడ్డం పెడితే సూర్యకాంతి ఆగుతుంది? ఎన్ని అబద్ధాలను పోగేసి కప్పినా నిప్పులాంటి నిజం దాగుతుందా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పచ్చ పత్రికల దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: ‘దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయండి’ అన్నట్టుగా ఉంది పచ్చ నేతలు, ఎల్లో మీడియా తీరు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీకి చెందిన అర్జి పార్వతి (65) కుక్క కాటు ఇంజక్షన్ రెండో డోస్ వేయించుకునేందుకు మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తిరిగి ఇంటికి బయలు దేరుతుండగా రంగంపేట నుంచి రాజమహేంద్రవరం వైపు వస్తున్న ఏపీ29 జెడ్–355 నంబరు గల ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయపడింది. ఆర్టీసీ ఔట్సోర్సింగ్ డ్రైవర్ నూలు హరీష్ స్థానికుల సాయంతో తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అయితే వలంటీర్.. 70 ఏళ్ల వృద్ధురాలిని బలవంతంగా సీఎం సభకు తీసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. సీఎం సభలో అపశ్రుతి.. అని పచ్చ మీడియా తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప తదితరులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్లి ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేశారు. ఇంతలో వైద్య సేవలతో తేరుకున్న పార్వతి.. జరిగిన విషయాన్ని ఔట్ పోస్టు పోలీసులకు వెల్లడించింది. దీంతో ఎల్లో మీడియా, టీడీపీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు. టీడీపీ నేతలకు బుద్ధిరాదు: ఎంపీ భరత్ ప్రజలు ఎంతగా బుద్ధి చెప్పినా, టీడీపీ నేతలకు కనువిప్పు కలగడం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ మండిపడ్డారు. చంద్రబాబు సభల్లో ప్రమాదాలు జరుగుతున్నట్టే సీఎం సభల్లో కూడా జరగాలనే దుర్బుద్ధిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. నగరంలో ఎక్కడో రోడ్డు ప్రమాదం జరిగితే దానిని సీఎం సభతో ముడిపెడుతున్నారంటే టీడీపీ చిల్లర, శవ రాజకీయం స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
ఇంతవరకూ ఓపిక పట్టా.. ఇకపై సహించే ప్రసక్తే లేదు: కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం: ‘‘నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. అందువల్లే జనమంతా మా వెంట నడుస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని పచ్చ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా నాకు ఆపాదిస్తున్నారు. అయినా ఇంతవరకూ ఓపిక పట్టాను. ఇకపై సహించే ప్రసక్తే లేదు. అవాస్తవాలతో బురదజల్లుడు రాజకీయాలు చేస్తే ఊరుకోను’’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎల్లో మీడియా, టీడీపీ నాయకులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ►ఇటీవల కందిపంట ధ్వంసం... వైకాపా నాయకుడి దౌర్జన్యం అనే కథనాన్ని ఓ ఎల్లో మీడియా వండి వార్చిందన్నారు. కందిపంట సాగు చేసిన భూమిని 2004లోనే ప్రభుత్వం సేకరించి రైతు గోనుగుంట్ల రమణప్ప అనే టీడీపీ కార్యకర్తకు పరిహారం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత భూమిలో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో కొందరు ఆ భూమిలో కందిపంట సాగుచేయగా, అధికారులు తొలగించారన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యమంటూ తప్పుడు కథనాలు రాస్తారా అని మండిపడ్డారు. ►ధర్మవరం పట్టణం సర్వే నంబర్ 661లోని స్థలం ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉండగా, ఈ స్థలాన్ని ‘అమృత్’ పథకంలో భాగంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు కేటాయించామన్నారు. కానీ ఎల్లో మీడియా మాత్రం దర్జాగా కబ్జా అంటూ కథనం అల్లేసిందన్నారు. అలాగే ఓ సర్వేనంబర్ 536లో స్థలాన్ని ఎవరో శుభ్రం చేయిస్తుంటే దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరులంటూ అసత్య కథనాలు ప్రచురిందని కేతిరెడ్డి మండిపడ్డారు. అలాగే అప్రాచెరువు సర్పంచ్ ఈశ్వర్రెడ్డి మార్కెట్ ధరకు స్థలం కొనుగోలు చేస్తే కబ్జా చేశారంటూ కథనాలు రాశారన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా తప్పుడు రాతలు రాయడం ఎల్లో మీడియాకు దాని వెనుక ఉన్న పచ్చ నేతలకు అలవాటైందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నిరాధార కథనాలు రాయడం మానుకోవాలన్నారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉనికి కోసమే విమర్శలు.. ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ నాయకులకు కేతిరెడ్డిని విమర్శిస్తే తప్ప ఉనికిలేదన్నారు. భూకబ్జాల గురించి పరిటాల శ్రీరామ్ మాట్లాడటం చూస్తే నవ్వు వస్తోందన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్గా మారిన వరదాపురం సూరి... చివరకు అక్రమంగా డీజిల్ను అమ్ముకునే స్థాయికి దిగజారారన్నారు. తాను ఆధారాలతో సహా సూరి అవినీతిని బయటపెడుతున్నానన్నారు. అనంతపురం నడిబొడ్డున రూ.వంద కోట్ల ప్రాపరీ్టని తన సొంత ఊరికి చెందిన సబ్ రిజి్రస్టార్తో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని భూమిని కొట్టేయడం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. అలాగే ముదిగుబ్బ మండలంలో 151 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని స్వాహా చేయలేదా...? మీరా నన్ను విమర్శించేది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
Viral Video: నిజమే.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. చంద్రబాబే స్వయంగా!
ఇవే ఆఖరు ఎన్నికలంటూ తరచుగా ప్రకటనలు చేస్తోన్న చంద్రబాబుకు అసలు మనసులో ఏముంది? ఎందుకు ఆఖరు ఎన్నికలని చెబుతున్నారు? ఇంతకీ ఆఖరు ఎన్నికలు రాష్ట్రానికా? లేక చంద్రబాబుకా? ఇవన్నీ ఆయన సొంత పార్టీ తెలుగుదేశంలోనే తమ్ముళ్లకు వస్తోన్న సందేహాలు. వీటికి జవాబుగా ఆయన తన మదిలో మాటను బహిరంగంగా ప్రకటించారు. దానికి సంబంధించిన వీడియో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లోనే చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు మాటలు ►రోజురోజుకు పార్టీ నిర్వీర్యమైపోతుంటే.. మీరు అక్కడ పోరాడకుండా.. చెప్పిన పని చేయకుండా.. ఇక్కడికి వచ్చి నాపై ప్రెషర్ చేస్తారా? ఎనకాల ఎల్లో ఉండగా.. పాడాలి అబద్దాల పాట టిడిపి గ్రూప్ల్లో సర్క్యులేట్ అవుతోన్న ఈ వీడియో 13సెకన్ల నిడివి ఉంది. అందులో చంద్రబాబు.. సొంత పార్టీ నేతలపై రుసరుసలాడుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు వ్యవహారశైలి మొదటి నుంచి ఇంతే అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సొంత పార్టీకి అంత సీన్ లేదన్న విషయం తెలిసిన చంద్రబాబు.. ఆ విషయం దాచిపెట్టి ఎల్లోమీడియా సహకారంతో జనాల్లో బాకాలు ఊదుతున్నారని తమ్ముళ్లు అనుకుంటున్నారు. పార్టీ లేదు బొక్కా లేదు.. అని అచ్చన్న చెప్పినప్పుడే సగం అర్థమయిందని, ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోందనుకుంటున్నారు. చదవండి: (ఆయుష్ ఔషధాల ప్రమాణాల నియంత్రణకు చర్యలు) -
పసుపురంగు దేవతావస్త్రం!
రాజుగారి దేవతా వస్త్రాల కథ మనందరికీ తెలిసిన వృత్తాంతమే. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు డంబాచారం ఎక్కువ. అందరికంటే తానే గొప్పవాడని ప్రజలంతా నమ్మాలని అతనికి బలమైన కోరిక. ఒకసారి ఆయన కొలువుకు వచ్చిన ఒక పరదేశి మన రాజుగారికి ఒక వింత విషయం చెబుతాడు. ‘రాజా! నాకు కొంత బంగారం, వెండి ఇప్పించండి. వాటితో నేను అద్భుతమైన దేవతా వస్త్రాలను జరీ అంచుతో తయారు చేస్తాను. అటువంటి వస్త్రాలను ధరించడానికి తమరు మాత్రమే యోగ్యులు. అయితే అవి తెలివైన వారికి మాత్రమే కనిపిస్తాయ’ని నమ్మబలుకుతాడు. దేవతా వస్త్రాలను ధరించే అవకాశం తనకే వస్తుందన్న ఆత్రంతో రాజుగారు సదరు పరదేశీకి కావలసి నంత బంగారాన్నీ, వెండినీ ఇప్పించాడు. కొన్నాళ్ల తర్వాత పరదేశి రాజుగారి దగ్గరకొచ్చి ‘రాజా! ఇదిగో వస్త్రాలు. ధరించండం’టాడు. దుస్తులు కనిపించడం లేదంటే తననందరూ తెలివితక్కువ వాడనుకుంటారన్న భయంతో రాజుగారు ‘వాటిని’ ధరించినట్టు నటిస్తాడు. అందరూ వింతగా చూస్తారే తప్ప ఎవరూ కనిపించడం లేదని చెప్పరు. తన రాజ్యంలో తెలివితక్కువ వాళ్లను గుర్తించాలన్న కోరికతో అవే ‘వస్త్రాలతో’ రాజుగారు రథం మీద కూర్చుని ఊరేగింపుగా బయల్దేరుతారు. వీధుల్లో గుమికూడిన జనం గుడ్లప్పగించి చూస్తారే తప్ప ఎవరూ మాట్లాడరు. నిజం చెబితే తెలివితక్కువ ముద్ర పడుతుందన్న భయంతో నటిస్తుంటారు. ఈ గొడవలేమీ తెలియని ఒక చిన్న పిల్లాడు మాత్రం పిల్లి మెడలో గంట కడతాడు. ‘రాజుగారికి బట్టల్లేవోచ్... పప్పు షేమ్’ అని అరుస్తాడు. జనంలో సంచలనం మొదలవుతుంది. నిజమే... రాజుగారికి బట్టల్లేవు. ఏమైందీయనకు అనుకుంటూ అందరూ నవ్వడం మొదలుపెడతారు. రాజుగారికి విషయం అర్థమవుతుంది. పరాభవ భారంతో మందిరానికి వెళ్లిపోతాడు. క్రీస్తుశకం 1995. యువ నామ సంవత్సరం శ్రావణ మాసంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అంతఃపుర కుట్ర జరిగింది. ఎల్లో మీడియాకు గ్యాంగ్ లీడర్గా లబ్ధప్రతిష్ఠులైన రామోజీరావు పౌరోహిత్యానికి పూనుకోగా చంద్రబాబు నాయుడు ఓ పచ్చల పిడిబాకును పూజించి, దాన్ని ఎన్టీ రామారావు వెన్నులో దించడం, ఆయన్ను సింహాసనంపైనుంచి తోసేయడం జగమెరిగిన గబ్బు వ్యవహారం. ఆ గబ్బును కప్పేయ డానికి అదేరోజు నుంచి ఎల్లో మీడియా చంద్రబాబు చేత దేవతా వస్త్రాన్ని ధరింపజేయడం మొదలుపెట్టింది. ఆ దేవతా వస్త్రం పేరు – ‘అభివృద్ధి’. కథలోని రాజుకు దేవతా వస్త్రం వెనుక ఉన్న మోసం గురించి తెలియదు. ఇక్కడ ఆ వస్త్రాన్ని కప్పించుకున్న కథానాయకుడూ, కప్పిన కథా రచయితలూ మోసంలో భాగస్వాములే! అభివృద్ధి దేవతా వస్త్రాన్ని ఎల్లో మీడియా ఎంతగా ప్రచారంలో పెట్టిందంటే... ఎవరూ కూడా బుర్రను ఉపయో గించి ‘ఏదీ... కనపడదే’ అని గట్టిగా అడగలేనంతగా! ‘చూడూ... మా చూపుడు వేలు వైపే చూడు... మరోవైపు చూడకూ’ అన్న చందంగా ఎల్లో మీడియా నాటి తెలుగు పాఠక మహాశయులకు దిశానిర్దేశం చేసింది. ఒకవేళ ఎవరైనా ధైర్యంచేసి ఆ దేవతా వస్త్రాన్ని తదేకంగా చూసి ఉంటే అరివీర భయంకర నిజరూప దర్శనంతో మూర్ఛ రోగానికి లోనయ్యే వారు. తెలుగు ప్రజల కోసం ఎల్లో మీడియా ఒక కొత్త డిక్షనరీని తయారుచేసింది. అందులో అభివృద్ధి అనే మాటకు చంద్రబాబు అనే అర్థాన్ని తగిలించింది. ‘అన్న అడుగేస్తే అభివృద్ధి, అన్న మడతేస్తే అభివృద్ధి’ అనే బృందగానాన్ని జనంలోకి వదిలింది. హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ హయాం లోనే శంకుస్థాపన చేసిన సైబర్ టవర్ భవనాన్ని అనివార్యంగా కట్టాల్సి వచ్చింది. ఆ కట్టడాన్ని రెండేళ్లు ఆలస్యం చేసి, ఈలోగా తనవాళ్ల చేత చుట్టుపక్కల భూములన్నీ కారుచౌకగా కొనిపిం చారు. అమరావతి స్కెచ్కు హైటెక్ సిటీ మినియేచర్ అన్న మాట. సొంత మనుషుల చేత ఆ ప్రాంతంలో వెంచర్లు వేయిం చారే తప్ప మౌలిక వసతుల కల్పనపై పదేళ్ల దూరదృష్టిని కూడా ఆయన ప్రదర్శించలేదు. పదేళ్లు నిండకుండానే అక్కడ రోడ్లను విస్తరింపజేయాల్సి వచ్చిందంటేనే వారి విజన్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈమాత్రం ఘనకార్యానికే బాబును ఐటీ యుగకర్తగా ఎల్లో మీడియా కీర్తించడం మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్కు వస్తే అది బాబు ఘనతేనని ప్రచారం చేసింది. అమెరికా అధ్యక్షుడంతటోడు హైదరాబాద్కు రావడ మేమిటి... బాబుగారి తావీజు మహిమ కాకపోతే... ఈతరహా ప్రజాభిప్రాయాన్ని వండి వార్చింది. ఆ కాలంలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అన్ని రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభమయ్యాయి. వీటిని కనిపెట్టిన వ్యక్తిగా చంద్రబాబు పేరునే ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమై పూర్తయిన ఔటర్ రింగ్రోడ్డు, షంషాబాద్ ఎయిర్ పోర్టులను కూడా బాబు ఖాతాలోనే వేసుకున్నారు. మరీ ఘోరమేమిటంటే కేసీఆర్ పట్టాలెక్కించిన మెట్రో ప్రాజెక్టు కూడా బాబు మెదడుకు పుట్టిన బిడ్డేనని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్లలో వాస్తవానికి ఏం జరిగింది? సగం జనాభాను అక్కున చేర్చుకునే వ్యవసాయరంగం కుదేలైంది. పంటచేలలో మృత్యు కంకులు పాలు పోసుకున్నాయి. సస్య క్షేత్రం శ్మశానమైంది. వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసు కున్నారు. కులవృత్తులు కూలిపోయాయి. వందలాదిమంది నేతన్నలు బలవన్మరణాన్ని ఆశ్రయించారు. పేద బిడ్డలు చదు వుకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు పాడుబడ్డాయి. లక్షలాది జనం వలసబాట పట్టారు. పల్లెలు బీళ్లయ్యాయి. ఇదీ నాటి సామాజిక నిజరూపం. దీనిపై ఎల్లోమీడియా ‘అభివృద్ధి’ అనే అంగవస్త్రాన్ని కప్పింది. ప్రచారం చేసింది. ప్రజలు నమ్మ లేదు. ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు. అలిపిరి దాడి సాకుతో సానుభూతి డ్రామా నడిపినా జనం కనికరించలేదు. మళ్లీ ఇప్పుడు ఆ దేవతా వస్త్రం చంద్రబాబుకు అవసర మైంది. ఎల్లో మీడియా ఇప్పుడు మరోసారి ఆ దేవతా వస్త్రాన్ని జనానికి చూపెట్టే ప్రయత్నం మొదలైంది. ఈసారి ఆయన అధికారంలోకి రాకపోతే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే తప్ప ఆయన కాదట! ఎల్లో మీడియా ప్రజలను బెదిరించడం మొదలుపెట్టింది. సంకేతాన్ని గ్రహించిన చంద్రబాబు కూడా బెదిరిస్తున్నారు. ‘నేను గెలవకపోతే మీకే నష్టమ’ని ప్రజల్నే దబాయిస్తున్నారు. ప్రజలు ఏరకంగా నష్టపోతారన్న ప్రశ్నకు అభివృద్ధి ఆగిపోతుందనేది వారి జవాబు. అసలు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమిటి? ఈ ప్రశ్నకు వారి దగ్గర నుంచి వచ్చే సమాధానం పిట్టలదొర సంభాషణకు సరితూగుతుంది. పీవీ సింధుకు బ్యాడ్మింటన్ నేర్పారట! సెల్ఫోన్ ఇండియాకు రావడానికి ఆయనే కారణమట! ఆయన లేకపోతే సెల్ఫోన్లను హిమాలయ పర్వతాలు అడ్డగించేవట! సానియా మీర్జాను టెన్నిస్లో ప్రోత్సహించిందీ, సత్య నాదెళ్లకు కంప్యూటర్లో ఆసక్తి కలిగించిందీ ఆయనేనని స్వయంగా వారే ప్రచారం చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారం భించిన గ్రామ సచివాలయాలు కూడా తన ఐడియాయేనని ఈమధ్యనే చంద్రబాబు ఓ న్యూక్లియర్ మిసైల్ను జనం మీదకు వదిలారు. సచివాలయాలను ప్రారంభించినప్పుడు అదో పనికిరాని కార్యక్రమమని తానే దుమ్మెత్తి పోసిన వైనాన్ని ఆయన మరిచిపోయారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి ఈ వ్యవస్థను పరిశీలించి ప్రశంసిస్తుండటంతో బాబు బాణీ మారింది. ఇంకో రెండు మూడేళ్ల తర్వాత సచివాలయాలను, ఆర్బీకే కేంద్రాలను, వలంటీర్ వ్యవస్థను, ఫ్యామిలీ డాక్టర్ను, ‘నాడు–నేడు’ కార్యక్రమాలనూ ఎల్లో మీడియా చంద్రబాబు ఖాతాలో వేయకపోతే ఆశ్చర్యపడవలసిందే! ‘అభివృద్ధి’ అంటే ఏమిటనే ప్రశ్నకు ఈ ముఠా స్పష్టమైన సమాధానం ఎప్పుడూ చెప్పదు. అభివృద్ధి అనగా చంద్రబాబు అంతే! జగన్మోహన్రెడ్డి మూడేళ్ల కాలంలోనే (రెండేళ్లు కరోనా) ప్రభుత్వరంగంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిం చారు. అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తిచేసుకొని వచ్చే యేడు తరగతులను ప్రారంభించబోతున్నాయి. చంద్రబాబు పధ్నాలుగేళ్ల కాలంలో కట్టిన మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా లేదు. 30 వేల కోట్ల ఖర్చుతో జగన్ ప్రభుత్వం నాలుగు గ్రీన్ఫీల్డ్ రేవు పట్టణాలను, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. పధ్నాలుగేళ్ల బాబు పరిపాలనలో నిర్మించిన పోర్టు ఏమైనా ఉన్నదా? ఫిషింగ్ హార్బర్ ఒక్కటైనా ఉన్నదా? మత్స్యకారులు గుజరాత్ లాంటి దూరతీరాలకు వెళ్లి దోపిడీకి గురికావడమే కదా చంద్రబాబు హయాంలో జరిగింది. భారీ పరిశ్రమలు, ఎమ్ఎస్ఎమ్ఈలు కలిసి ఈ మూడు న్నరేళ్లలో కల్పించిన ఉద్యోగాలు 2,35,000. చంద్రబాబు మొన్నటి ఐదేళ్లలో ఇందులో సగం ఉద్యోగాలను కూడా పారి శ్రామికరంగంలో కల్పించలేదు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో సగటున ఏటా 11 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, ఈ మూడు న్నరేళ్లలో సగటున ఏటా 13 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కోవిడ్ విజృంభించిన కాలం కూడా ఇదేనని గమనంలో ఉంచు కోవాలి. ఇవి కాకి లెక్కలు కావు, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గణాంకాల ఆధారంగా చెబుతున్నవి. ఇక ప్రభుత్వరంగంలో చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన మొత్తం నియామకాలు 34 వేలు. ఈ మూడు న్నరేళ్లలో ప్రభుత్వం చేసిన రెగ్యులర్ నియామకాలే 1,55,000. వీటికి అదనంగా 51 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వో ద్యోగులుగా మార్చడం జరిగింది. అదనంగా 38 వేల కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. ఔట్సోర్సింగ్ ద్వారా 1,10,000 మందిని నియమించారు. గౌరవ వేతనంపై నియమితులైన 2,60,000 మంది వలంటీర్లు వీరికి అదనం. ఎక్కడైనా పోలిక ఉన్నదా? ఈ లెక్కలేవీ చంద్రబాబు పార్టీకీ, మీడియాకూ అవ సరం లేదు. లెక్కల్లోకి పోతే బొక్కబోర్లా పడతామని తెలుసు. అభివృద్ధి అంటే చంద్రబాబు అనే నిర్వచనం చెప్పడం, దాన్ని బ్రాండింగ్ చేయడం, అమ్ముకోవడం, ‘జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న’ అనే భజన గీతాన్ని పాడు కోవడం! ఎదుటి పక్షం మీద గోబెల్స్ ప్రచారం. అంతే! అదే వారి ఎజెండా! అభివృద్ధి అంటే ఏమిటి? కొందరు కోటీశ్వరులు శత కోటీశ్వరులు, సహస్ర కోటీశ్వరులు కావడమా? బహుళ అంత స్తుల భవనాలు లేవడమా? ఇది కాదు అభివృద్ధి నిర్వచనమని ఇప్పుడు విజ్ఞులందరూ చెబుతున్నారు. ఈ భూమి, భూమిపై ఉన్న గాలి, నీరు, వెలుతురు, చెట్టూ పుట్ట గుట్ట అన్నిటిపై సమస్త మానవాళితో పాటు జీవరాశి యావత్తు కూడా హక్కుదారులే. ఈతరం జీవులే కాదు, రానున్న వేలవేల తరాలకూ ఈ భూమాత ఆశ్రయం కల్పించవలసి ఉన్నది. అందువలన పర్యావరణ హితమైన అభివృద్ధి నమూ నాను ఎంచుకోవలసి ఉన్నది. అభివృద్ధి కూడా సమ్మిళిత అభివృద్ధి కావాలి. సమాజ పరిణామ క్రమంలో వెనకబడిన జనసమూహా లన్నీ సాధికారతను సంతరించుకోవాలి. వారి శక్తి మేరకు పని దొరకాలి. అవసరం మేరకు భుక్తి దొరకాలి. ఈ భూగ్రహం అంద రికీ ఉమ్మడి గృహం కావాలి. ఈ సదాశయం తోనే ఐక్యరాజ్య సమితి వారు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డిజి) పేరుతో ఒక ఆచరణీయ కార్యక్రమాన్ని 17 అంశాలతో ప్రతిపాదించారు. 2030లోగా అన్ని దేశాలూ ఈ లక్ష్యాలను సాధించాలని సూచిం చారు. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకూ – మన రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని అంశాలతో సాపత్యం కుదురుతుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దిక్సూచిగా ఎంచు కుంటూ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఏకైక రాష్ట్రం మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. బడ్జెట్లకు ప్రేరణగా నిలుస్తున్న ‘నవ రత్నాల’ కార్యక్రమం గానీ, విద్యా రంగంలో, వైద్యరంగంలో, వ్యవసాయంలో తీసుకొస్తున్న విప్లవాత్మక సంస్కరణలు కానీ, ఇంటి గడపకు చేరుకుంటున్న పరిపాలనా, రాజకీయ సంస్కర ణలు గానీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలవైపు పడుతున్న అడుగులే! ఈ అడుగుజాడల్లో బురదను కూర్చడానికి బాబు సమేత ఎల్లో మీడియా ప్రయత్నిస్తున్నది. వారి అభివృద్ధి లక్ష్యం ఒక్కటే – 30 వేల ఎకరాల్లో తలపెట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్ పునః ప్రారంభం కావడం! వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com -
అవన్నీ తప్పుడు వార్తలు.. మీరు నమ్మకండి
-
Fact Check: గుంటూరు అభివృద్ధికి యెల్లో మీడియా వంక!
సాక్షి, తాడేపల్లి: యెల్లో మీడియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అడ్డగోలు అసత్యాలను తెర మీదకు తీసుకొస్తోంది. తాజాగా గుంటూరు చంద్రయ్య కాలనీలో కూల్చివేతల కలకలం అంటూ జనాల్ని తప్పుదోవ పట్టించే ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అయితే.. ఆ కూల్చివేతల వెనుక ఉన్న వాస్తవాల్లోకి వెళ్తే.. గుంటూరు డొంక రోడ్డు కూడలిలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కారానికి డోంక రోడ్డు విస్తరణ చేపట్టిన అధికారులు.. ఇందుకు అంగీకరించిన వారి ప్రహారీ గోడలను మాత్రమే కూల్చారు. వీరికి నష్టపరిహారం కూడా చెల్లిస్తున్నారు కూడా. మరోవైపు రోడ్డు ఆక్రమించి.. నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగించారు. పరిహారానికి అనర్హులైన వాళ్లు చేసే రాద్ధాంతాన్నే ఇప్పుడు యెల్లో మీడియా హైలెట్ చేసింది. బుధవారం జరిగిన కూల్చివేతల్లో కేవలం పది కాంపౌండ్ వాల్స్ మాత్రమే పోయాయి. అదీ వాళ్ల అంగీకారంతోనే. ఇక కూల్చివేతలను అడ్డుకున్న వాళ్లలో అత్యధికులు అక్రమదారులేనని, రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా.. నష్టపరిహారానికి అనర్హులుగా మరికొందరు తేలారని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతేకాదు.. ఇవి హఠాత్తుగా చేపట్టిన కూల్చివేతలనే ప్రచారాన్ని సైతం అధికారులు తిప్పి కొట్టారు. ‘‘గుంటూరులో కూల్చివేతల కలకలం. నోటీసివ్వకుండా కూల్చివేత’’ అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం. చంద్రయ్య కాలనీలో రోడ్డు విస్తరణకు 2015లోనే అధికారులు నోటీసులు ఇచ్చారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి ప్రహరీలు, రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లనే ఇప్పుడు తొలగించారు. 1/2 pic.twitter.com/nMgN24JFTv — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) November 24, 2022 ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి టూ టౌన్, ఏపీఎస్ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వన్ టౌన్ మధ్య కీలకమైన ఈ రోడ్డు అభివృద్ది పనుల ప్రతిపాదన పదేళ్ల కిందటి నాటిదేనని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు గుర్తు చేస్తున్నారు. పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని, చంద్రయ్య కాలనీలో రోడ్డు విస్తరణకు 2015లోనే అధికారులు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి ప్రహరీలు, రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లనే ఇప్పుడు తొలగించారు అని అధికారులు చెప్తున్నారు. అయితే.. నోటీసులు ఇవ్వకుండా నోటీ మాట మీదే కూల్చివేతలు చేపట్టారంటూ అసత్యాలను ప్రచారం చేస్తోంది. -
బీజేపీతో పొత్తు కోసం తహతహ.. ఎల్లో మీడియాకు నిద్ర కరువైందా? ఎందుకీ ఫేక్ న్యూస్
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో... తాను రాష్ట్రానికి సీఈఓ అని చెప్పుకునేవారు. ఎవరినైనా మేనేజ్ చేస్తారని కూడా పేరు పొందారు. ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులోని పాత ఆలోచనలు, పాత బుద్ధులు మాత్రం పోలేదు. తనకు సింగిల్గా గెలిచే సత్తా లేదని కూడా మరోసారి రుజువు చేసుకుంటున్నారు. అందుకే బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారు. దానికనుగుణంగా తనకు అనుకూలమైన మీడియాలో వార్తలు వండించుకుంటున్నారు. చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన రోజు.. అదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్షాతో నారా లోకేష్ రహస్యంగా సమావేశమయ్యారట. ఇది నిజం. మీరు నమ్మాల్సిందే. ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్త ఇది. అమిత్ షా హైదరాబాద్ వచ్చినపుడు జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందుగా చంద్రబాబుతో భేటీ అయ్యారట... అదీ రామోజీ ఫిల్మ్ సిటీలో.. ఇది కూడా మీరు నమ్మాల్సిందే. ఇవన్నీ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలు. అయితే అమిత్ షాతో ఢిల్లీలో లోకేష్ భేటీ, హైదరాబాద్లో చంద్రబాబు భేటీలు రహస్యంగా జరిగాయంట. ఢిల్లీలో అందరితో పాటు రెండు మూడు నిమిషాలు మాట్లాడినందుకే పచ్చ మీడియా టాం టాం చేసింది. బీజేపీతో తెలుగుదేశానికి పొత్తు కుదిరిందన్న రేంజ్లో హడావుడి చేశాయి. చంద్రబాబు, లోకేష్లతో అమిత్ షా రహస్యంగా చర్చలు జరపాల్సిన అవసరం ఏముంటుంది? రహస్యంగా సమావేశమైనట్లు తెలిసిందని వార్తలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? చంద్రబాబుతో ప్రధాని భేటీ, లోకేష్ తో అమిత్ షా మీటింగ్. రామోజీ ఫిలింసిటీలో అమిత్ షాతో బాబు చాటింగ్. ఢిల్లీ రావాలని, పీఎంఓ తన ఇల్లే అనుకోవాలని బాబును కోరిన మోదీ. టైం లేక తర్వాత చూద్దాం అన్న బాబు. ఎల్లో కుల మీడియా నిండా ఇలాంటి ఫేక్ వార్తలే. జనం నమ్మేస్తారని పిచ్చి భ్రమల్లో టీడీపీ. pic.twitter.com/SXiWMc8gzJ — Vijayasai Reddy V (@VSReddy_MP) September 1, 2022 మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరిగి వెళ్లే సమయంలో శంషాబాద్లోని హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ను కలవడం తెలుగుదేశానికి, పచ్చ మీడియాకు మింగుడు పడటంలేదు. జూనియర్ను అవసరానికి వాడుకుని తర్వాత పక్కకు నెట్టేసిన చంద్రబాబుతో దశాబ్దానికి పైగా జూనియర్ దూరంగానే ఉంటున్నారు. అటువంటి సినీ నటుడిని కేంద్ర హోం మంత్రి అమిత్షా కలవడమా? ఇదే టీడీపీకి, ఎల్లో మీడియాకు కంపరంగా ఉంది. అందుకే ఢిల్లీలో మోదీ ఏకాంతంగా చంద్రబాబుతో మాట్లాడారంటూ కథనాలు వండారు. సమావేశానికి హాజరైన అందరినీ పలకరించినట్లుగానే చంద్రబాబును మోదీ పలకరించారు. దీనికే ఎల్లో మీడియా చంకలు గుద్దుకుంటూ వార్తలు వండి వార్చేసింది. ఇంకేముంది పసుపు, కాషాయం కలిసిపోయాయన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. అందుకే రహస్య భేటీల వార్తలు తయారు చేయించుకుంటున్నది తెలుగుదేశం. 1995లో చంద్రబాబు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకున్న తర్వాత ఏనాడూ ఒంటరిగా గెలిచిన ఉదంతమే లేదు. వామపక్షాలతోనో..బీజేపీతోనో పొత్తు పెట్టుకునే ఆయన అధికారంలోకి వచ్చారు. ఒంటరిగా పోటీ చేసినపుడు ఓటమి చెందారు. సింగిల్గా గెలిచే సత్తా లేదు గనుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలంటే అటు బీజేపీ, ఇటు జనసేన మద్దతు అవసరమని గ్రహించారు. అయితే టీడీపీని కలుపుకుందామంటున్న జనసేననే కమలనాథులు దూరం పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు పరాయివాడైన, కుటుంబానికి, పార్టీకి దూరంగా ఉంచుతున్న జూనియర్తో అమిత్ షా భేటీ కావడంతో అటు చంద్రబాబుకు, ఇటు ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. అందుకే తమతో కూడా అమిత్షా భేటీ అయినట్లుగా వార్తలు రాయించుకుంటున్నారు. అసలు చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని ఆ పార్టీ వారే చెప్పకుంటున్నారు. అందుకే అనేక చోట్ల చంద్రబాబు వెళ్లినపుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. దీంతో చంద్రబాబు, లోకేష్కు మరింత భయం పట్టుకుంది. బీజేపీ తమతో పొత్తుకు రెడీగా ఉందని, తమతో రహస్యంగా ముఖ్య నేతలు సమావేశమయ్యారని వార్తలు రాయించుకోవడంలో టీడీపీకి, ఎల్లో మీడియాకు రెండు ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం ఎంతగా తహతహలాడుతున్నదో అర్థమవుతోంది. అదే సమయంలో పచ్చ పార్టీని, కాషాయ పార్టీని కలపడానికి ఎల్లో మీడియా ఎంతగా తాపత్రయపడుతున్నదో తెలియచేస్తోంది. కాగా, పీఎం నరేంద్ర మోదీని చంద్రబాబు కలవడంపై రిపబ్లిక్ కూడా ఆర్టికల్ రాసింది. తాజా పరిణామాల నేపథ్యంలో చివరికి తాను ఇచ్చిన వార్తలు నిజం కాలేదంటూ రిపబ్లిక్ కూడా ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. 'Even Lord Krishna met Duryodhan': BJP downplays PM Modi-Naidu meet, rules out TDP tie-up https://t.co/7sF8cEIKJJ — Republic (@republic) August 31, 2022 ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సింహం సింగిల్గా వస్తుందని ఏపీలో వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. కానీ తాను సింగిల్గా వస్తే గెలవలేనని నిర్థారణకు వచ్చిన చంద్రబాబు బీజేపీతో అంటకాగేందుకు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం కూడా ఇక్కడ స్సష్టమవుతోంది. అయితే ఈ ప్రచారాలపై బీజేపీ నేతలు స్పందించారు. టీడీపీతో పొత్తుకు సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అవన్నీ ఫేక్ వార్తలని కొట్టిపడేశారు. -
గుడ్డి రాతల ఈనాడు.. పీక్స్కు చేరిన బరి‘తెగింపు’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగుదేశం పార్టీ తాన అంటే ఈనాడు తందాన అంటుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించాలని ప్రయత్నించే చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలను గుడ్డిగా అచ్చేస్తుంది. నిజానిజాల పట్టింపు లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పైనా తప్పుడు కథనాలను వండివార్చి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఎంతకైనా బరితెగిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తోంది. పదుగురూ నవ్వుకుంటారన్న సోయే ఉండదు. ఇందుకు నిదర్శనమే ఈ ‘చిత్రం’. అచ్చేసిందిదీ.. ‘కొండలను కొల్లగొడుతున్నారు’ శీర్షికతో గురువారం ఈనాడు ప్రధాన సంచికలో అభూతకల్పనలతో కూడిన ఈ ‘వార్తా చిత్రం’ ప్రచురించింది. ఇందులోని ఫొటో బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లోనిది. మైనింగ్లో కొండను తవ్వేయగా మిగిలిన పై భాగంలో ఉన్న చేతి పంపుతో కూడిన చిత్రం. కాకినాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అక్రమ మైనింగ్కు నిలువెత్తు నిదర్శనమంటూ టీడీపీ ఈ ఫొటోను ప్రదర్శించింది. దానినే ఈనాడు యథాతథంగా అచ్చేసింది. వైఎస్సార్సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పెద్దాపురంలో కొండలను తవ్వేసి గ్రావెల్తో కోట్లు కొల్లగొడుతున్నారంటూ బురదజల్లే ప్రయత్నం చేసింది. వాస్తవం ఇదీ.. వాస్తవానికి 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే పెద్దాపురంలోని కొండలను తవ్వేసి కోట్లు కొల్లగొట్టారు. బాబుకు అత్యంత సన్నిహితుడైన నాటి హోంమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో కొండలను అడ్డగోలుగా తవ్వేశారు. చినరాజప్ప కనుసన్నల్లో కోనసీమకు చెందిన ఆయన అనుచరులు ఈ అక్రమ దందాకు పాల్పడి నాడు కొండలను తవ్వేశారు. అందులో రామేశ్వరంమెట్ట చిత్రమిది. ఇది 2018లోనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకొచ్చింది. నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కోట్లు కొల్లగొట్టేసిన వైనాన్ని తెలిపింది. దానిని ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి ఆపాదించే యత్నానికి ఒడిగట్టారు. ఈనాడు గుడ్డిగా అచ్చేసింది. -
కంతేరు ఘటనలో సునీత ఆత్మహత్యాయత్నం
తాడికొండ/మంగళగిరి: గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో జరిగిన ఘటనలో టీడీపీ శ్రేణుల వికృత చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు నల్లపు సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎల్లో మీడియాలో మంగళవారం ఉదయం వచ్చిన కథనాలు చూసి గుట్టుగా సంసారం చేసుకుంటున్న తనపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. మంచి చెడులు ఆలోచించకుండా మీడియా కూడా తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయడంతో ఎవరూలేని సమయంలో ఉ.8 గంటలకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు, పోలీసుల సాయంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు.. తన కుమార్తెతో వెంకాయమ్మ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించడంతో వచ్చిన వివాదాన్ని టీడీపీ నేతలు పెద్దదిగా చేసి తమ కుటుంబ పరువు బజారున పడేశారని మీడియా ఎదుట సునీత ఆవేదన వ్యక్తంచేసింది. ఆడపిల్లల జీవితాలతో ఇలా ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. అయినా టీడీపీ నాయకులు తమ దుష్ప్రచారాలు ఆపకపోవడంతో విరక్తి చెందిన సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సునీత ఆత్మహత్యాయత్నానికి బాబే కారణం చంద్రబాబు నీచ రాజకీయాల కారణంగానే సునీత ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఆస్పత్రిలో సునీతను పరామర్శించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఎల్లో మీడియా తమ స్వార్థ రాజకీయాల కోసం రెండు కుటుంబాల మధ్య గొడవను రాష్ట్ర వివాదంగా మార్చడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. సునీత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆడపిల్లపట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే దానిని రాజకీయం చేసేందుకు ఎక్కడెక్కడ నుంచో టీడీపీ నాయకులు రావడమేమిటని ఆమె ప్రశ్నించారు. మరోవైపు.. స్థానిక టీడీపీ నేత వాసిరెడ్డి జయరామయ్య కారణంగానే వివాదం పెరిగి తన సోదరి సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సునీత సోదరి పక్కర కుమారి వెల్లడించింది. వెంకాయమ్మకు డబ్బులిచ్చి నాటకాలు ఆడిస్తున్నారని, మంగళగిరి రూరల్ సీఐ తమను బూతులు తిడుతూ వెంటపడి కొడుతున్నారని ఆమె వాపోయింది. -
‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం?
‘పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది’..ఈ వ్యాఖ్యలు.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరదీప్సింగ్ పూరి ఎప్పుడో కాదు.. తాజాగా ఆదివారం చేసినవి. పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ఇలా కితాబిస్తుంటే.. చంద్రబాబుకు అడ్డగోలుగా కొమ్ముకాసే ఈనాడు, ఈటీవీ మాత్రం పథకం నత్తనడకన నడుస్తోంది, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఎప్పటిలాగే దుష్ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర పథకాలకు జాతీయ స్థాయిలో ఎక్కడాలేని గుర్తింపు, ప్రశంసలు లభిస్తుంటే పచ్చమీడియా మాత్రం ప్రజలపై పచ్చివిషం కక్కుతోంది. ‘పునాదే దాటని పేదిల్లు’.. అంటూ సోమవారం ఆ విషపత్రిక ఓ కథనం వండి వార్చింది. ఈ కథనంలో పలు అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అక్కసు, కడుపుమంటను అక్షరం అక్షరంలో ప్రదర్శించింది. ఆ కథనంలో ప్రస్తావించిన అంశాలు.. వాటి వెనకున్న ఈనాడు చెప్పని అసలు వాస్తవాలపై ‘ఏది నిజం’ చదవండి.. సాక్షి, అమరావతి: ఈనాడు : పథకం నత్తనడకన సాగుతోంది.. నిజం : తొలిదశ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరలో గత ఏడాది మార్చి నుంచి జూన్ మధ్య కరోనా రెండో దశ వ్యాప్తితో పనులకు ఆటంకం ఏర్పడింది. కరోనా వ్యాప్తి నెమ్మదించి పనులు సజావుగా సాగుతున్న సమయంలో టీడీపీ నాయకులు కుట్రపూరితంగా కోర్టులకు వెళ్లి పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తిరిగి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య పథకం పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒమిక్రాన్ రూపంలో మరోమారు కరోనా వ్యాపించింది. ఈ కారణాలతో ఏడాదిన్నరలో అధిక కాలం ఇళ్ల నిర్మాణాలు సజావుగా సాగలేదు. ఇక ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల నుంచి పనులు చకచకా సాగుతున్నాయి. దీంతో ఒక్క మే నెలలోనే 30 వేల ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రోజుకు రూ.25 కోట్ల మేర పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60,783 ఇళ్లు పూర్తయ్యాయి. ఈనాడు: లేఅవుట్లలో విద్యుత్, నీటి సరఫరా లేదు. సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.. నిజం: 17వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పథకం కింద 30.60 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా లేఅవుట్లలో తాత్కాలిక సదుపాయాల కల్పనకు రూ.1,200 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా లేఅవుట్లలో విద్యుత్ సరఫరా, బోర్లు వేయడం, మోటార్లు బిగించడం చేపడుతున్నారు. ఇప్పటికే రూ.450 కోట్లు ఖర్చుచేసి తొలిదశ నిర్మాణాలు చేపడుతున్న లేఅవుట్లలో తాత్కాలిక సదుపాయాల కల్పన చేపట్టారు. రూ.32వేల కోట్లతో కాలనీల్లో శాశ్వత సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఇందులో భాగంగా విద్యుత్ సదుపాయాల కల్పనకు రూ.4,260 కోట్లు కేటాయించారు. విద్యుత్ సదుపాయాల కల్పనకు ఇప్పటికే టెండర్లు పూర్తయి, పనులు కూడా ప్రారంభించారు. ఈనాడు : కేంద్ర సాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.. నిజం: కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షల చొప్పున సాయం చేస్తోంది. ఇందుకు అదనంగా రూ.30 వేలను రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తోంది. ఇది కాకుండా.. పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల రిజిస్ట్రేషన్ విలువ గల ప్లాట్లను 30.60 లక్షల మంది పేదలకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ మొత్తం ప్లాట్ల మార్కెట్ విలువను పరిశీలిస్తే.. రూ.56,102 కోట్ల మేర ఉంటుందని అంచనా. ప్లాట్లు పంపిణీ చేసిన లేఅవుట్లు మెజారిటీ శాతం ఊళ్లకు దగ్గరగా, ప్రైమ్ ఏరియాల్లోనే ఉన్నాయి. ఉదా.. బాపట్ల జిల్లా కేంద్రంలోని ప్యాడిసన్పేటలో కత్తిపూడి–ఒంగోలు నేషనల్ హైవే 216కు పక్కనే లేఅవుట్లో ప్లాట్ మార్కెట్ ధర రూ.10 లక్షలు పలుకుతోంది. అలాగే, తిరుపతి–శ్రీకాళహస్తి జాతీయ రహదారి పక్కన 5,896 మందికి 220 ఎకరాల్లో ప్లాట్లు పంపిణీ చేశారు. ఇందులో నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా 30 బోర్లు వేసి వాటికి విద్యుత్ మోటార్లను బిగించి, ప్లాట్లకు పైప్లైన్లు వేశారు. దీంతో నేటి వరకూ చిల్లిగవ్వ ఆస్తిలేని పేదలకు ఒక్కసారిగా రూ.10లక్షలకు పైగా ఆస్తి సమకూరుతోంది. ఇక ఊళ్లకు దగ్గరగా భూములు లభించని చోట మాత్రమే విధిలేని పరిస్థితుల్లో కొంతదూరంగా ప్రభుత్వం లేఅవుట్లను ఏర్పాటుచేసింది. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు 3 శాతం వడ్డీకి రూ.35వేలు బ్యాంకు రుణసాయం చేస్తోంది. రుణాలు పొందేందుకు వీలుగా సిబిల్ స్కోర్ నుంచి పేదలకు మినహాయింపు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటివరకూ 3,70,826 మంది పేదలకు రూ.1,370.39 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం అందించింది. రూ.15వేలు విలువ చేసే 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తోంది. అదే విధంగా సబ్సిడీపై ఇనుము, సిమెంట్, ఇతర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. తద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.40వేల మేర లబ్ధి చేకూరుతోంది. మొత్తంగా 12 రకాల వస్తువులను సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సుమారు 2000 మంది లబ్ధిదారులకు నిర్మిస్తున్న లే అవుట్ ఈనాడు : ధరల పెరుగుదలతో పేదలపై భారం.. నిజం: గత కొద్దినెలలుగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రభావం పేదలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 20 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు, బస్తా సిమెంట్ రూ.225 చొప్పున ఇటీవల వరకూ ప్రభుత్వం సరఫరా చేసింది. ఇటీవల కాలంలో సిమెంట్ ధరలు మళ్లీ విపరీతంగా పెరగడంతో బస్తా సిమెంట్ను రూ.260కు అందిస్తున్నారు. ఇనుమును కంపెనీని బట్టి కిలో రూ.53, రూ.63, రూ.72లతో సరఫరా చేస్తున్నారు. మా ర్కెట్ ధరలతో పోలిస్తే కిలోకు రూ.20 తక్కువ. ఈనాడు: ఆప్షన్–3 లబ్ధిదారుల కుదింపు.. నిజం: ప్రారంభంలో ఆప్షన్–3 ఎంచుకున్న లబ్ధిదారులు చాలావరకూ స్వచ్ఛందంగా విరమించుకున్నారు. చివరకు 3.27 లక్షల మంది మాత్రమే ఆప్షన్–3కి కట్టుబడి ఉన్నారు. దీంతో వీరి ఇళ్ల నిర్మాణ బాధ్యతను గృహ నిర్మాణ శాఖ చేపట్టింది. లబ్ధిదారులను గ్రూపులుగా ఏర్పాటుచేసి కాంట్రాక్టర్లను అనుసంధానించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. ఈనాడు చెప్పినవి అసత్యాలు డబ్బుల్లేక ఇంటి నిర్మాణం ఆగిపోయిందని ఈనాడులో వచ్చిన కథనం అసత్యాల పుట్ట. నాకు ప్రభుత్వం నుంచి రుణం మొదటి వాయిదా పడింది. ఇప్పటివరకు నాకు రూ.70వేలు మంజూరైంది. 10 టన్నుల ఇసుక అందించారు. 343 కేజీల ఇనుము, 40 బస్తాల సిమెంట్ సబ్సిడీపై ఇచ్చారు. అంతేకాక.. స్త్రీ నిధి నుంచి రూ.50 వేల రుణం మంజూరైంది. జగనన్న సాయంవల్లే నేను ఇల్లు కట్టుకుంటున్నాను. ఈ విషయాలే ఈనాడు వారికి చెప్పాను. అయితే, వారు ఎలా రాసుకున్నారో నాకు తెలీదు. – జుత్తిగ పద్మావతి, పాలకోడేరు, పశ్చిమ గోదావరి జిల్లా లబ్ధిదారు జుత్తిగ పద్మావతితో మాట్లాడుతున్న భీమవరం ఆర్డీఓ దాసిరాజు (ఇక జుత్తిగ పద్మావతి విషయాలనే భీమవరం ఆర్డీఓ దాసిరాజు కూడా చెప్పారు. ఈనాడులో వచ్చిన వార్తలు నిజం కావని ఆయన స్పష్టంచేశారు. భీమవరం ఆర్డీఓ దాసిరాజు ఆమెను కలిసి వివరాలు సేకరించారు.) ఇమాములు ఇంటికి రూ.70వేల మేర సాయం ఈనాడులో పేర్కొన్న కర్నూల్ జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన ఇమాములు భార్య కవిత పేరిట ఇల్లు మంజూరైంది. వీరికి ఇప్పటివరకూ 10 టన్నుల ఇసుక ఉచితంగా, 25 బస్తాల సిమెంట్ సబ్సిడీపై సరఫరా చేశారు. దీనితో పాటు ఇంటి నిర్మాణ బిల్లు రూ.64,200 మంజూరు చేశారు. ఇలా మొత్తంగా రూ.70,875 మేర ఇమాములుకు లబ్ధి చేకూరింది. సబ్సిడీతో తగ్గిన భారం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణాలకు కావాల్సిన సిమెంట్, ఐరన్ను సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. దీంతో మాపై చాలా భారం తగ్గుతోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో నా సొంతింటి కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. – జె. రేణుక, కడప, వైఎస్సార్ జిల్లా పదేళ్లుగా మాకు ఇల్లు లేదు గతంలో మాకు ఎవ్వరూ ఇల్లు మంజూరు చేయలేదు. జగనన్న సీఎం అయ్యాక మా కల నెరవేరింది. గత ఏడాది ఇంటి కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోగానే స్థలం ఇచ్చారు. అలాగే.. ఇల్లు కట్టుకునేందుకు సహాయం చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి పునాది వేసుకున్నాం. బిల్లు కూడా పడింది. సిమెంటు ఇచ్చారు. గ్రూప్ తరఫున రుణం కూడా అందించారు. – నస్రీన్, యాదమరి, చిత్తూరు జిల్లా జగనన్నకు రుణపడి ఉంటాం నాకు వివాహమై దాదాపు 20 ఏళ్లు అయింది. ఒక కుమారుడు, కుమార్తె. పెళ్లయి నప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటి స్ధలం కోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇంటి స్థలం మంజూరైంది. – దోమ లక్ష్మి, మార్టేరు, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా విలువైన స్థలం ఇచ్చారు పల్నాడు జిల్లా వినుకొండ రోడ్డులోని జగనన్న కాలనీలో ఎంతో విలువైన స్థలం ఇచ్చారు. కలలో కూడా నేను ఇల్లు కట్టుకుంటానని అనుకోలేదు. ఇంటి స్థలమిచ్చి,æ నిర్మాణం కోసం డబ్బులిస్తున్నారు. ఇల్లు మొదలు పెట్టాను. పూర్తిచేసి ఆ ఇంట్లోకి వెళ్తాను. చాలా సంతోషంగా ఉంది. – చెరుకూరి లక్ష్మి, లబ్ధిదారురాలు, నరసరావుపేట -
‘నాన్న మరణం కంటే తాగుబోతు అనే మాటే ఎక్కువ బాధిస్తోంది’
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన పైడేటి సత్యనారాయణ (73)ది సారా మరణం అంటూ తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడాన్ని అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. తమ తండ్రి మరణం కన్నా సారా తాగి చనిపోయారన్న ప్రచారం తమను ఎక్కువ బాధిస్తోందని, బయటకు రావాలన్నా ఇబ్బందిగా ఉందని, దయచేసి దుష్ప్రచారం ఆపి తమను వదిలేయాలని వారు వేడుకున్నారు. మృతుడు సత్యనారాయణ కుమారుడు మహేశ్వర శ్రీనివాస్, కుమార్తె నాగమణి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తన తండ్రికి కాఫీ అలవాటు కూడా లేదని, చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఒక్కరోజు కూడా ఆయన మద్యం సేవించలేదని చెప్పారు. అలాంటి తమ తండ్రిని తాగుబోతుగా చిత్రీకరించి, తమను మానసికంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా తమ తండ్రికి బీపీతో పాటు ఆయాసం ఉందని చెప్పారు. ఈ నెల ఆరో తేదీ తెల్లవారుజామున ఆయాసం ఎక్కువగా రావడంతో బుట్టాయగూడెం క్లస్టర్ ఆస్పత్రికి తీసుకువెళ్లామని, అక్కడ సెలైన్లు పెట్టిన రెండు గంటల తర్వాత తిరిగి ఇంటికి తీసుకువచ్చామని వివరించారు. మధ్యాహ్న సమయంలో తీవ్రమైన దగ్గు, ఆయాసం వచ్చి మృతిచెందారని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో దహన సంస్కారాల అనంతరం ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచి తమ తండ్రి సారా తాగి మరణించినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారాన్ని దయచేసి ఇకనుంచైనా ఆపేయాలని, తమను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని కోరారు. అసలేం జరిగిందంటే... పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడేనికి చెందిన పైడేటి సత్యనారాయణ 40 ఏళ్లుగా కిళ్లీ షాపు నిర్వహిస్తున్నారు. 10 ఏళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆరో తేదీన హైబీపీ రావడం, ఆస్తమా ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఇంట్లోనే మృతి చెందారు. మధ్యాహ్నం దాటిన తరువాత మృతి చెందడంతో బుట్టాయగూడెంలో అంత్యక్రియలు నిర్వహించడానికి వసతులు లేక మానవత అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వాహనంలో జంగారెడ్డిగూడెం శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. దీంతో ఇది సారా మరణమంటూ విష ప్రచారానికి తెర తీశారు. ఎక్కడెక్కడినుంచో ఎవరో ఫోన్లు చేసి మీ తండ్రి సారా తాగి చనిపోయారు కదా ఇబ్బంది పడవద్దు మేము చూసుకుంటామని మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో మానసికంగా వ్యధ చెందిన ఆ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే టీడీపీ ఇలాంటి శవరాజకీయాలు చేస్తోందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. -
పీఆర్సీపై పచ్చపత్రికల విషం
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు పీఆర్సీపై ‘ఈనాడు’ మరోసారి తన మార్కు విషం వెళ్లగక్కింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలో అత్యధిక రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ప్రకటించింది. తద్వారా ఏటా రూ.11,707 కోట్ల ఆర్థిక భారం భరించేందుకు సిద్ధపడింది. కానీ, ఈనాడు పత్రిక మాత్రం ‘అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులకు వక్రభాష్యం చెబుతూ ‘ప్రభుత్వంపై పీఆర్సీ భారం రూ.3,181 కోట్లే’ అనే శీర్షికన అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనదైన శైలిలో కమిటీ నివేదికకు వక్రభాష్యాలు చెబుతూ అసత్యాలతో కథనాన్ని వండివార్చింది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే ఈ కథనం. ఏటా అదనపు ఆర్థికభారం రూ.11,707 కోట్లు 23 శాతం ఫిట్మెంట్ అమలుచేస్తూ ఈ ఏడాది జనవరి 17న జారీచేసిన రెండు జీఓల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, హెచ్ఆర్ఏతో పాటు, అదనపు పెన్షన్ మొత్తం (ఏక్యూపీ) చెల్లింపుల వల్ల ప్రభుత్వంపై అదనంగా పడిన ఆర్థిక భారం రూ.10,247 కోట్లు. ఆ తర్వాత ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు, వేతనాల సవరణపై ఉద్యోగులకు ఉన్న అపోహలు తొలగిస్తూ, వారి సందేహాల నివృత్తి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఆ ఉప సంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం హెచ్ఆర్ఏ, ఏక్యూపీతో పాటు, సీసీఏలు సవరించాలని సిఫార్సు చేసింది. దీంతో ప్రభుత్వంపై మరో రూ.1,460 కోట్ల భారం పడుతోంది. దీంతో 11వ పీఆర్సీ అమలువల్ల ప్రభుత్వంపై అదనంగా పడుతున్న మొత్తం భారం రూ.11,707 కోట్లు. ► అలాగే, 2019 జూలై నుంచి 2020 మార్చి వరకు ఇచ్చిన ఐఆర్ను తిరిగి వసూలు చేయకూడదని తీసుకున్న నిర్ణయంవల్ల ప్రభుత్వంపై ఒకేసారి రూ.5,156 కోట్ల భారం పడింది. ► ఐఆర్తో పాటు, కొత్తగా ఫిట్మెంట్ ఇస్తూ అమలుచేసిన వేతనాల సవరణ వల్ల ప్రభుత్వంపై పడుతున్న మొత్తం భారం రూ.11,707 కోట్లు. వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ అనుకూల పత్రిక ఈనాడు మాత్రం పీఆర్సీతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఏటా రూ.3,181 కోట్లేనంటూ అవాస్తవాలను ప్రచురించి ఉద్యోగులు, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కేవలం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు వాస్తవాలను వక్రీకరిస్తూ బురదజల్లేందుకు యత్నించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం, భారతీయ కార్మిక సదస్సు (ఐఎల్సీ) నియమాలకు అనుగుణంగా వేసిన గణాంకాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని 11వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సూచించింది. అయితే, ఉద్యోగులకు అప్పటికే 27 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్) ఇస్తున్నందున అంతే ఫిట్మెంట్ ఇవ్వాలని 11వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వివిధ శాఖల కార్యదర్శుల కమిటీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఎందుకంటే అంతకుముందు ఎక్కువ మొత్తంలో ఇచ్చిన ఫిట్మెంట్స్వల్ల ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) గణనీయంగా పెరిగి రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతోంది. ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్ఓఆర్) కంటే కూడా ఉద్యోగుల జీతభత్యాల వ్యయం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో.. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలు సవరించాలన్న ప్రక్రియ కార్యరూపం దాల్చడం కష్టమని కమిటీ భావించింది. అందుకే కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సంఘం (సీపీసీ) సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసింది. సిఫారసు చేయకపోయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 23శాతం ఫిట్మెంట్ ఇక మరో పచ్చపత్రిక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ 30శాతం స్కేల్ పెంచాలని పీఆర్సీ కమిటీ సిఫార్సులంటూ అవాస్తవాలను ప్రచురించడం విస్మయపరుస్తోంది. వాస్తవం ఏమిటంటే.. 11వ పీఆర్సీ కమిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై ఎలాంటి సిఫార్సులూ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సానుకూల దృక్పథంతో స్పందించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 23శాతం ఫిట్మెంట్ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తద్వారా ఏటా రూ.430కోట్ల ఆర్థిక భారాన్ని వహించేందుకు సిద్ధపడింది. ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల సంక్షేమానికే పెద్దపీట ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి పీఆర్సీ విధానాన్ని అమలుచేస్తూ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. దేశంలో చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాన్నే అమలుచేశాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ప్రకటించాయి. కేరళ ప్రభుత్వం అంతకంటే తక్కువగా 10 శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులు, పింఛనర్ల సంక్షేమానికి మరింత ప్రాధాన్యమిచ్చి సానుకూల దృక్పథంతో వ్యవహరించింది. 23 శాతం ఫిట్మెంట్ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్మెంట్ కంటే ఇది చాలా ఎక్కువ. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వం ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుచేస్తామని కూడా చెప్పింది. -
ఎల్లో సిండికేట్ మరో దుష్ప్రచార కుట్ర
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ, ఎల్లో మీడియా కూటమి నిత్యం అసత్య కథనాలు వండి వారుస్తున్నాయి. తాజాగా.. వారికి వైఎస్సార్ కడప జిల్లా జైలు అదనపు సూపరింటెండెంట్గా బదిలీపై వచ్చిన పి. వరుణారెడ్డి టార్గెట్ అయ్యారు. ఆయనను సాకుగా చేసుకుని ప్రభుత్వంపై ఆ దుష్ట కూటమి బురద జల్లుతోంది. ఈ విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి పూర్తి భిన్నంగా వాస్తవాలు ఉన్నట్లు జైళ్ల శాఖ వర్గాలే చెబుతున్నాయి. అవేమిటంటే.. అప్పుడు వరుణారెడ్డి జైలు సూపరింటెండెంట్ కాదు 2008లో అనంతపురం జైలులో మొద్దు శ్రీను హత్యకు జైలర్గా ఉన్న వరుణారెడ్డి నిర్లక్ష్యమే కారణమని ఎల్లో మీడియా ఓ అసత్య కథనాన్ని వండివార్చింది. కానీ, వరుణారెడ్డి అప్పుడు అనంతపురం జైలు సూపరింటెండెంట్ కాదు. మొద్దు శ్రీను హత్య వెనుక కుట్ర కోణం ఏమీలేదని మెజిస్టీరియల్ విచారణలో కూడా వెల్లడైంది. వరుణారెడ్డిపై ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే శాఖాపరమైన చర్యలను ఉపసంహరించిందని ఎల్లో మీడియా మరో దుష్ప్రచారానికి తెరలేపింది. నిజానికి ఆయనపై రెండేళ్లపాటు ఇంక్రిమెంట్ వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని 2013లోనే అప్పటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం సవరించి ఊరట కలిగించింది. క్యుమిలేటివ్ ప్రభావం లేకుండా ఏడాదిపాటు ఆయన వార్షిక ఇంక్రిమెంట్ను నిలుపుదల చేసింది. ఇక రెండో ఇంక్రిమెంట్ వాయిదా నిర్ణయాన్ని కూడా ఉపసంహరిస్తూ 2019, ఫిబ్రవరిలో అంటే చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. శాఖాపరమైన చర్యలను ఉపసంహరిస్తూ సస్పెన్షన్ కాలాన్ని కూడా ఆన్ డ్యూటీగా పరిగణించాలని టీడీపీ హయాంలోనే హోంశాఖ సంబంధిత ఫైలును క్లియర్ చేసింది. వరుణారెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా అన్ని కోణాల్లో పరిశీలించే ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం.. కోడ్ కారణంగా హోంశాఖ ఉత్తర్వుల జారీని వాయిదా వేసింది. ఎన్నికల అనంతరం కోడ్ తొలగించాక ఉత్తర్వులు జారీచేసింది. అంతేగానీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వరుణారెడ్డికి అనుకూలంగా ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కీలక పోస్టింగ్ ఇచ్చింది టీడీపీనే.. నాన్ ఫోకల్ (అంతగా ప్రాధాన్యతలేని) పోస్టులో ఉన్న వరుణారెడ్డికి కడప జైలు అదనపు సూపరింటెండెంట్గా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక పోస్టింగు ఇచ్చిందని ఎల్లో మీడియో మరో దుష్ప్రచారం చేస్తోంది. కానీ, రాయలసీమలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న కర్నూలు జైలు అదనపు సూపరింటెండెంట్గా ఆయనకు టీడీపీ ప్రభుత్వమే 2016లో పోస్టింగ్ ఇచ్చింది. అంతటి కీలక స్థానంలో ఆయన వరుసగా ఐదేళ్లపాటు కొనసాగారు. దాంతో సాధారణ బదిలీల్లో భాగంగానే వరుణారెడ్డిని కడప జైలుకు బదిలీ చేశారు. వృత్తిపరంగా ఆయన నిబద్ధతను టీడీపీ కూడా గతంలో ఏనాడూ ప్రశ్నించలేదు. మొద్దు శ్రీను హత్య కేసు అంశంలో ఆయనపై టీడీపీకి సందేహాలు ఉండి ఉంటే ఆయనకు ఎందుకు కీలక పోస్టింగ్ను ఇచ్చింది? విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు వరుణారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఇండియన్ పోలీస్ మెడల్ను ప్రకటించింది కూడా. ఇలాంటి అధికారిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని జైళ్ల శాఖ వర్గాలుఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కడప సెంట్రల్ జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ బదిలీ కడప అర్బన్: కడప కేంద్ర కారాగారం ఇన్చార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ఒంగోలు కారాగారం సూపరింటెండెంట్గా ప్రభుత్వం నియమించింది. ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఐఎన్హెచ్ ప్రకాష్ను కడప కేంద్ర కారాగారానికి బదిలీ చేసింది. -
కవ్వించి కయ్యానికి.. టీడీపీ నిజ నిర్ధారణ ఆంతర్యం ఇదే
సాక్షి, అమరావతి: అధికారం పోయింది.. నాయకులు కరువైపోతున్నారు.. కేడర్ కనుమరుగైపోతోంది.. జనంలో పరపతి పోయింది.. దీంతో ఏంచేయాలో పాలుపోని టీడీపీ అధినాయకత్వం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలతో కవ్వించి మరీ కయ్యానికి కాలు దువ్వుతోంది. అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఏదో ఒక అంశంపై వివాదం సృష్టించడం, రెచ్చగొట్టడం, ప్రశాంతంగా ఉన్న పల్లెలు, పట్టణాల్లో చిచ్చు రాజేయడం పనిగా పెట్టుకుంది. నిజ నిర్థారణ కమిటీల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రాద్ధాంతాలకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇటీవల కృష్ణాజిల్లా గుడివాడలో కాసినో నిర్వహించినట్లు ఎల్లో మీడియా కథనాలు వండి వార్చగా, వెంటనే చంద్రబాబు దానిపై నిజ నిర్ధారణ కమిటీని నియమించారు. వర్ల రామయ్య, నక్కా ఆనంద్బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, తంగిరాల సౌమ్యను కమిటీ సభ్యులుగా గుడివాడ పంపారు. వీరు అక్కడకు వెళ్లక ముందే టీడీపీ నేతలు మంత్రి కొడాలి నాని కాసినో నిర్వహించారని మూకుమ్మడి దాడి మొదలు పెట్టారు. శుక్రవారం కమిటీ గుడివాడ వెళ్లింది. వాస్తవానికి కమిటీ సభ్యులే అక్కడికి వెళ్లి, నిజానిజాలు వెలికితీయాలి. కానీ, గుంటూరు, విజయవాడ నుంచి వందల మందిని పంపించారు. వారంతా గుడివాడ వెళ్లి వైఎస్సార్సీపీ నేతలను కవ్వించారు. ఎల్లో, సోషల్ మీడియాల ద్వారా సవాళ్లు విసురుతూ, ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నానీపై విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. దీంతో రెండు గ్రూపుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే ఇరు వర్గాలను నియంత్రించారు. లేకపోతే గుడివాడలో రణరంగాన్ని సృష్టించాలని టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఇంతకు ముందు కూడా అధికార వైఎస్సార్సీపీకి సంబంధం లేని పలు అంశాల్లో టీడీపీ ఇదే విధంగా వ్యవహరించింది. ► ఇటీవల గుంటూరు జిల్లా నర్సరావుపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని మాయం చేసి ఘర్షణలు సృష్టించడానికి టీడీపీ విఫలయత్నం చేసింది. ► గుంటూరు జిల్లా మాచర్ల మండలం వెల్దుర్తిలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయం చేసేందుకు చంద్రబాబు స్వయంగా అక్కడికి వెళ్లి అభాసుపాలయ్యారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వందలాది మందిని అక్కడికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ పన్నాగం ఆడియో టేపులు బహిర్గతమవడంతో టీడీపీ బండారం బయటపడింది. టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్న గతంలో మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఉదంతాలున్నాయి. ► తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప తదితరులతో నిజ నిర్థారణ కమిటీని వేసి అక్కడ హైడ్రామా సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇలా ఎక్కడ ఏ చిన్న విషయం దొరికినా దాన్ని రాష్ట్ర స్థాయి వివాదంగా మార్చి, వైఎస్సార్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అంటగట్టి బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అయితే, వాస్తవాలను గమనిస్తున్న ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదు. కనీసం ఆయన పార్టీ కేడర్ కూడా మద్దతివ్వడంలేదు. ఇందుకు శుక్రవారం గుడివాడలో కమిటీ పర్యటనే ఉదాహరణ. అక్కడకు వెళ్లిన టీడీపీ నేతలకు స్థానిక కేడర్ అండ లేకుండా పోయింది. స్థానిక నేతలు కూడా దూరంగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం, టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలత లేకపోవడంతో చంద్రబాబు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. -
ఉద్యోగ కల్పనపై ఎల్లో మీడియా విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగ కల్పనపై ఎల్లో మీడియా విష ప్రచారం సాగిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ధ్వజమెత్తారు. రోజూ పనిగట్టుకొని అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఏదో విధంగా నిలబెట్టేలా ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్ర విభజన నాటికి ఉమ్మడి రాష్ట్రంలో 2.57 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. ఇందులో తెలంగాణలో 1.07 లక్షలు, ఏపీలో 1.5 లక్షల ఖాళీలు ఉన్నాయని ఉద్యోగుల పంపకాలపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ తేల్చిందని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ఇంకో 50 వేల మందికి పైగా పదవీ విరమణ చేశారన్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం ఉద్యోగ ఖాళీలు 2 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. కానీ ఇంటికో ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు ఐదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34 వేలు మాత్రమేనని గుర్తు చేశారు. ఇందులో కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చినవే ఎక్కువన్నారు. అలాగే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అది కూడా బాబు ఇవ్వలేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. మరో 51 వేల మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. అలాగే వైద్య శాఖలో 40 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారని వివరించారు. ఇందులో 10 వేల మందిని ఇప్పటికే తీసుకున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు 20 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు తన పాలనలో వీరందరికీ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. జీతాలు, పింఛన్ల ఖర్చు 2018 –19లో రూ.52,513 కోట్లు ఉంటే 2020–21లో రూ.67,340 కోట్లుగా ఉందన్నారు. -
పీఆర్సీతో ఉద్యోగులకు డబుల్ లాభం
సాక్షి, అమరావతి: పీఆర్సీ అమలు వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు వచ్చే దాని కంటే అదనంగా ప్రతి నెలా దాదాపు రూ.1,000 కోట్ల లబ్ధి చేకూరనుంది. 23 శాతం ఫిట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇది కాకుండా ఇంకా పలు ప్రయోజనాలు కలుపుకుంటే ప్రతి నెలా ఉద్యోగుల ఖాతాల్లో రూ.1,000 కోట్లకు పైగా జమ కానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జనవరి నెల జీతంతోపాటే ఈ పెరుగుదల ఉండనుంది. ఉద్యోగులు డిసెంబర్ నెలలో తీసుకున్న జీతం కంటే జనవరి జీతం కచ్చితంగా పెరుగుతుంది. 23 శాతం ఫిట్మెంట్ అమలు వల్ల మూల వేతనం (బేసిక్ పే) కనీసం 53.84 శాతం పెరుగుతుంది. అంటే గత పీఆర్సీలో రూ.13 వేల మూల వేతనం ఉన్న ఉద్యోగికి అది ఇప్పుడు రూ.20 వేలకు పెరుగుతుంది. గత పీఆర్సీలో ఉన్న గరిష్ట మూల వేతనం రూ.1,10,850 ఇప్పుడు రూ.1.79 లక్షలకు పెరుగుతుంది. అంటే ప్రతి ఉద్యోగి మూల వేతనాన్ని బట్టి రూ.7 వేల నుంచి రూ.68,150 వరకు పెరుగుతుంది. దీన్ని బట్టే ఉద్యోగుల జీపీఎఫ్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్సు, డీఏ, ఇతర ఆలవెన్సులన్నింటినీ లెక్కిస్తారు. తద్వారా పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ప్రయోజనం సంతృప్తికర స్థాయిలో ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనివల్లే రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పడే అదనపు భారం రూ.10,247 కోట్లకు రెట్టింపు భారం ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి అనేక ప్రయోజనాలు ► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే పీఆర్సీతోపాటు ఉద్యోగులకు ఒకేసారి అనేక రకాల ప్రయోజనాలు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. ► రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఇంత ఫిట్మెంట్ ఇవ్వడం గొప్ప విషయమని ఉద్యోగ సంఘాల నాయకులే చెబుతున్నారు. ఫిట్మెంట్తో పాటు ఒకేసారి ఐదు డీఏలను ఇవ్వడం వల్ల ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల సంతృప్త స్థాయిలో ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ► ఉద్యోగుల హెల్త్ స్కీమ్కు సంబంధించి రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సీఎస్ను ఆదేశించడం.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా తాజా పీఆర్సీ వస్తుందని ప్రకటించడం పట్ల ఉద్యోగులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ వయసు పెంపుతో భారీగా లబ్ధి ► ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయంగా ఉద్యోగులు అభివర్ణిస్తున్నారు. తెలంగాణలో 60 నుంచి 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచారు. అక్కడికన్నా ఇక్కడ మరో ఏడాది పెంచడం వల్ల వేలాది మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ► లబ్ధి పొందే ప్రతి ఉద్యోగికి అదనంగా 24 నెలల ఉద్యోగ సమయం ఉంటుంది. దీనివల్ల మధ్యస్థాయి ఉద్యోగికి రూ.30 నుంచి రూ.40 లక్షలకుపైగా లబ్ధి చేకూరుతుందని అంచనా. రెండేళ్ల సర్వీసు పెరగడం వల్ల పెన్షన్ కూడా ఆదే స్థాయిలో పెరుగుతుంది. అడక్కపోయినా ఇళ్ల స్థలాలు ► సొంతిల్లు ప్రభుత్వ ఉద్యోగుల కల. వాస్తవానికి ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఇది లేదు. అసలు సంఘాలు దీని గురించి ప్రభుత్వాన్ని అడగలేదు. అడక్కపోయినా ఉద్యోగులకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్లోని ఎంఐజీ లేఅవుట్లలో పది శాతం స్థలాలు రిజర్వు చేస్తామని సీఎం ప్రకటించారు. వాటిలో 20 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ► ఇళ్ల స్థలాలపై గత టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఇళ్ల స్థలాలు వస్తాయని ఉద్యోగులు ఎంతో ఎదురు చూశారు. కానీ చంద్రబాబు మాయ మాటలతో కాలక్షేపం చేశారు. తుదకు రాజధానిలోనూ ఉద్యోగులకు ఇళ్లు ఇస్తానని నమ్మించి రంగుల కలలు చూపించి మోసం చేశారు. వైఎస్ జగన్ మాత్రం ఉద్యోగులు అడక్కుండానే నియోజకవర్గాల వారీగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రకటించడం పీఆర్సీలో ప్రత్యేక అంశంగా నిలిచింది. పలు కీలక నిర్ణయాలతో మరింత లబ్ధి ► మానిటరీ బెనిఫిట్స్ 21 నెలల ముందు నుంచి ఇస్తుండడం వల్ల ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరనుంది. కార్యదర్శుల కమిటీ పీఆర్సీ బెనిఫిట్స్ను 2022 అక్టోబర్ నుంచి ఇవ్వాలని సిఫారసు చేసింది. దీనివల్ల కొందరు ఉద్యోగులు నష్టపోతారని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడంతో 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ఉద్యోగులకు 21 నెలల బకాయిలు దక్కనున్నాయి. ► సీఎస్ నేతృత్వంలోని కమిటీ చెప్పినట్లు ఈ ఏడాది అక్టోబర్ నుంచి కాకుండా, 2020 ఏప్రిల్ నుంచి అమలు చేయడం వల్ల 31 నెలల ముందే పీఆర్సీ అమలయినట్లు అవుతుందని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. ► కోవిడ్తో మరణించిన ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాలు, ఉద్యోగుల హెల్త్ స్కీంపైనా ఉద్యోగులకు భరోసా ఇచ్చే నిర్ణయాలు ప్రకటించారు. ► సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక అయిన గ్రామ సచివాలయ వ్యవస్థలోని 1.38 లక్షల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ను జూన్ లోపు పూర్తి చేసి, జూలై నుంచి పే స్కేల్ వర్తింప చేయనున్నారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలకు ఉద్యోగ భద్రత సమకూరనుంది. ఇలా ఉద్యోగులకు మేలు చేయడమే లక్ష్యంగా అడిగిన వాటిని, అడగని వాటిని రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చేందుకు నడుం బిగించింది. దీనిపై ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని ప్రయోజనాలు చిన్న విషయం కాదు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీతో సహా అనేక ప్రయోజనాలను ఒకేసారి కల్పించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. 5 డీఏలను ఒకేసారి విడుదల చేయడం సామాన్య విషయం కాదు. 23 శాతం ఫిట్మెంట్, రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెంపు, ఇళ్ల స్థలాలు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్లో ప్రొబేషన్ డిక్లరేషన్ వంటివన్నీ సీఎం జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు. ఉద్యోగులకు రూ.10 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూరనుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. కళ్ల ముందు వాస్తవాలు కనపడుతున్నా తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసం కాదు. – ఎన్.చంద్రశేఖర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) వాస్తవాలకు మసి పూస్తున్న ఎల్లో మీడియా ► పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.వేల కోట్ల భారం పడుతున్న విషయం వాస్తవమని తెలిసినా.. ఎల్లో మీడియా, కొన్ని ప్రభుత్వ వ్యతిరేక శక్తులు దుష్ప్రచారం చేస్తూ ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వాస్తవాలను వక్రీకరిస్తూ పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని అదేపనిగా అబద్ధాలు చెబుతున్నాయి. ► ఉద్యోగులకు జీతాలు పెరగకపోతే ప్రభుత్వంపై ఇంత భారం పడే అవకాశం ఉండదు. రకరకాల లెక్కలు వేసి ఉద్యోగుల జీతాలు తగ్గుతున్నాయంటూ ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తోంది. సోషల్ మీడియాలోనూ, ఉద్యోగుల గ్రూపుల్లోను తప్పుడు ప్రచారాలను వైరల్ చేస్తుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
మతి పోయి 'రివర్స్' రాతలు
సాక్షి, అమరావతి: ‘చదివితే ఉన్న మతి పోయింది’ అన్నట్లుగా.. రాన్రాను ఎల్లో మీడియా విష ప్రచారం పిచ్చికి పరాకాష్టగా మారింది. నిద్దర లేస్తే ప్రభుత్వంపై విష ప్రచారం చేయాలి, ప్రజలను రెచ్చగొట్టే రాతలతో పబ్బం గడుపుకోవాలన్న యావలో వాస్తవాలకే మసి పూస్తోంది. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి కార్యదర్శుల కమిటీ నివేదికపై ఆ మీడియా రాసిన రాతలే నిదర్శనం. కార్యదర్శుల కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగకపోగా తగ్గిపోతాయని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఈ విష ప్రచారంపై ఉద్యోగుల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. ఈ నివేదికతో ఒక్కో ఉద్యోగి జీతంలో రూ.10 వేలు తగ్గిపోతాయని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఉద్యోగుల్లో భయాందోళనలు రేకెత్తించడం కోసం వండినదేనని ఆగ్రహం వ్యక్టం చేస్తున్నారు. దానికి టీడీపీ వంతపాడటంపై మండిపడుతున్నారు. అదంతా విష ప్రచారమే తప్ప వాస్తవాలు వేరుగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. 14.29 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగుల జీతాలు రివర్స్లోకి వెళ్తున్నాయన్న ప్రచారం పచ్చి అబద్ధమని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ అమలు చేస్తోందనే విషయాన్ని గుర్తించాలని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఏడాదికి సుమారు రూ.7,200 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై ఇప్పటికే పడుతోందని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. సీఎస్ కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏడాదికి సుమారు రూ.11,200 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించాయి. అంటే ఐఆర్కన్నా ఫిట్మెంట్ అమలు వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.4 వేల కోట్ల భారం పడుతుంది. ఇది రివర్స్ ఎలా అవుతుందో ఎల్లో మీడియానే చెప్పాలని పలువురు ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ.4 వేల కోట్లలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు రెగ్యులర్ స్కేలులోకి రావడంవల్ల, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వల్ల పడుతున్న భారం రూ.2 వేల కోట్లని నివేదిక చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. దీన్ని కూడా మినహాయించినా ఫిట్మెంట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న అదనపు భారం దాదాపు రూ.2 వేల కోట్లు. ఈ వాస్తవాలకు మసి పూసి ఉద్యోగులను రెచ్చగొట్టేలా తోక పత్రిక విషం కక్కడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళలో కూడా 2019 జులైలో ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ 10 శాతమేనని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు సైతం కేంద్ర ప్రభుత్వ సిఫార్సులనే అమలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ 14.29 శాతమే. వీటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా, టీడీపీ రక రకాల వక్రీకరణలతో విష ప్రచారం చేయడం ఏమిటనే ప్రశ్నలు సామాన్యుల నుంచి కూడా వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి అంగన్వాడీ, ఆశా వర్కర్లు, శానిటరీ వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, కుకింగ్ హెల్పర్లకు జీతాలు పెంచిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులకు 70 శాతం మేర జీతాలు పెంచడం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇవేమీ పీఆర్సీ పరిధిలోకి రావు. వాళ్లకు పెంచిన జీతాల వల్ల కలగుతున్న భారం, ఫిట్మెంట్ అమలు వల్ల కలుగుతున్న భారానికి అదనంగా ఉన్నదేనని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. -
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడదాం
సాక్షి, అమరావతి: వ్యాక్సినేషన్పై ప్రజల్లో అలజడి సృష్టించి, భయాందోళనలు రేకెత్తించడానికి ప్రతిపక్ష నేతలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారి దుష్ప్రచారాన్ని ప్రతి సందర్భంలో తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రుయా ఘటనతో పాటు కోవిడ్–19 నియంత్రణ, చికిత్స, వ్యాక్సినేషన్ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 23 నెలల్లో పేదలకు రూ.87 వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం వ్యాక్సిన్ల కోసం రూ.1600 కోట్లు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కావాలనే రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇవి ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తున్నామన్నారు. వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటో రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్ల డోసులనే విషయం ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్షం అధికారంలో లేదని జీర్ణించుకోలేక.. ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయ పడే ఎల్లో మీడియాకు తెలుసన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. వ్యాక్సిన్ల ఉత్పత్తి – డిమాండ్ ► దేశంలో నెలకు వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం 7 కోట్ల డోసులు అయితే ఇందులో 6 కోట్ల డోసులు కోవిషీల్డ్ను సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. కోటి డోసులను భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తోంది. భారత్ బయోటెక్ ఎవరిది అంటే.. సాక్షాత్తు ఈ చంద్రబాబు బంధువు.. రామోజీరావు కొడుకు వియ్యంకుడిది. ► అక్కడ ఏం జరుగుతోందన్న సంగతి వీళ్లందరికీ తెలుసు. దేశంలో నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే తయారయ్యే పరిస్థితి ఉంటే.. దేశం మొత్తానికి ఇప్పటి వరకు ఇచ్చిన డోసులు కేవలం 17 కోట్లు మాత్రమే. ► దేశం మొత్తం అవసరాలను చూస్తే.. 45 ఏళ్లకు పైబడిన 26 కోట్ల మందికి 2 డోసులు చొప్పున 52 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. 18 నుంచి 45 సంవత్సరాల లోబడి ఉన్న వాళ్లు మరో 60 కోట్లు ఉన్నారు. వారికి రెండు డోసులు చొప్పున మొత్తం 120 కోట్ల డోసులు ఇవ్వాలి. అంటే 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే.. ఇప్పటి వరకు కేవలం 17 కోట్ల డోసులు మాత్రమే ఇవ్వగలిగాం. అంటే 10 శాతం లోపు మాత్రమే ఇవ్వగలిగాం. రాష్ట్రంలో డిమాండ్ ఇలా.. ► మన రాష్ట్రం విషయానికొస్తే 45 సంవత్సరాలు పైబడి ఉన్న వారు, హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు కలుపుకుని రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఉన్నారు. వీరికి 2 డోసులు చొప్పున దాదాపుగా 3 కోట్లు డోసులు ఇవ్వాలి. ► 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న వారు రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది ఉన్నారు. వీరికి దాదాపు 4 కోట్ల డోసులు అవసరం. అంటే మొత్తంగా 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి. ► మనం డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా వ్యాక్సిన్ కంపెనీ వాళ్లు తీసుకోవడం లేదు. మాకు సప్లై చేయండని చెప్పినా కూడా చేయడం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో నడుస్తున్నాయి. కేంద్రమే స్పష్టం చేసింది.. ► ఇదే విషయమై కేంద్రం నిన్న (సోమవారం) సుప్రీంకోర్టుకు అఫడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రాలు ఎంత కొనుగోలు చేయాలంటే అంత వ్యాక్సిన్లు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కంపెనీలు మా నియంత్రణలోనే సాగాలి అని చెప్పింది. మేం ఎంత కోటా కేటాయిస్తే.. ఆ కోటా మేరకు వ్యాక్సిన్ కంపెనీలు ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలని, అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదని చెప్పింది. ► డబ్బులు ఇచ్చే రాష్ట్రమైనా, డబ్బులు ఇవ్వని రాష్ట్రమైనా ఒకే మాదిరిగా ఉండాలని.. జనాభా ప్రాతిపదికన కోటాను నిర్ధారిస్తామని, ఆ కోటా మేరకు కంపెనీలు వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని అఫిడవిట్లో స్పష్టం చేసింది. బాధ్యతారహిత విమర్శలు ► ఈ వాస్తవ పరిస్థితి తెలిసి కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటివి చేస్తున్న ప్రచారాలు చూస్తే ఇవాళ నాకు బాధ అనిపిస్తోంది. వ్యాక్సిన్లకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఆంధ్రరాష్ట్రం ఇస్తామని చెప్పిందంటున్నారు. ► వ్యాక్సిన్లకు రూ.1,600 కోట్లు ఖర్చు చేయడానికి మనసు రావడం లేదు.. కమీషన్ల కోసమని చెప్పి.. ఇలా చేస్తున్నారంటూ చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలను ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికల్లో వేస్తారు. ► వాళ్లవే వ్యాక్సిన్ కంపెనీలు. అక్కడ ఏం జరుగుతుందో వీరికి తెలుసు. అయినా కూడా వక్రీకరించడానికి, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి, కలెక్టర్ల మీద దుష్ప్రచారం చేయడానికి, ప్రజల్లో అలజడిని సృష్టించడానికి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సందేశాన్ని అందిస్తున్నారు. సిబ్బంది పనితీరు పట్ల గర్వపడుతున్నా ► వ్యాక్సినేషన్ కానివ్వండి, హెల్త్కేర్ కానివ్వండి, ఆక్సిజన్ సప్లై కానివ్వండి.. ఎక్కడా కూడా దేశంలో జరగని విధంగా ప్రజలకు సేవలందిస్తున్నాం. ఈ విషయాన్ని గొప్పగా, గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే.. రాష్ట్రానికి టయర్ –1 సిటీ లేదు. ► హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు లేకపోయినా దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అందించగలుగుతున్నాం. కోవిడ్ కారణంగా మరణాల రేటు పరిశీలిస్తే చాలా రాష్ట్రాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్గా ఉన్నాం. ఇందుకు కారణం.. కలెక్టర్ల స్థాయి నుంచి ఆశా వర్కర్, వలంటీర్ స్థాయి వరకు ఎంతో కమిట్మెంట్తో, ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. అందుకే ఈ ఫలితాలు వస్తున్నాయి. సిబ్బంది పనితీరు పట్ల చాలా గర్వపడుతున్నా. ► ఇన్ని మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కొందరు రాజకీయ నాయకులు, ఎల్లో మీడియా యాజమాన్యాలు ఉన్నాయి. వీరందరినీ మనం ఎదుర్కోవాల్సి ఉంది. మరింత అప్రమత్తంగా ఉందాం. మరింత మానవత్వంతో సేవలు అందిద్దాం. సానుభూతితో పనిచేద్దాం. వాస్తవాలేమిటో ప్రజలకు చెబుదాం ► వ్యాక్సినేషన్కు సంబంధించిన దుష్ప్రచారాన్ని ప్రతి సందర్భంలో కూడా తిప్పికొట్టాలి. ప్రజలను రెచ్చగొట్టి, వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ.. ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గుమిగూడే పరిస్థితిని సృష్టిస్తున్నారు. అందరికీ ఉచితంగా టీకా అందుతుందని స్పష్టంగా చెప్పండి. ► వ్యాక్సిన్ల కొరత ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపుల ప్రకారం వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి, మీ వంతు వచ్చేంత వరకు ఓపిగ్గా ఉండాలని ప్రజలకు చెప్పాలి. ► 45 ఏళ్లకు పైబడి రెండో డోసు ఇవ్వాల్సిన వారు 33 లక్షలకు పైగా ఉన్నారు. ఈ నెలలో వీరికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మొదటి డోసు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత 45 ఏళ్ల పైబడి ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉంటే వారికీ కంప్లీట్ చేస్తాం. ► వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే సరఫరాను బట్టి.. ప్రాధాన్యత క్రమంలో అందిస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ► ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సిన్, ఆక్సిజన్, మందుల సరఫరాపై విపక్షనేత చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి కుట్రపూరితంగా విషప్రచారం చేస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్తో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. వ్యాక్సిన్ పంపిణీపై సర్వాధికారాలు కేంద్రానివేనని ఆ అఫిడవిట్లో ఉందని చెప్పారు. అలాంటప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు చెప్పడం అసత్య ప్రచారం కాదా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల పంపిణీ కేంద్ర టాస్క్ఫోర్స్ ద్వారానే జరుగుతున్నాయని కేంద్రమే ఒప్పుకొందని చెప్పారు. చంద్రబాబు మాత్రం ప్రభుత్వం వీటికి డబ్బులు కేటాయించలేదని దు్రష్పచారం చేస్తున్నాడని, ఇలా భయపెట్టడం వల్లే వ్యాక్సినేషన్ సెంటర్లకు జనం పెద్దఎత్తున పోగవుతూ కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ అనుకూల మీడియా ప్రజలను రెచ్చగొట్టి రోడ్లమీదకొచ్చే పరిస్థితి తీసుకొస్తోందన్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ పచ్చ గుంపునకు ఏ శిక్ష వేయాలని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అనుక్షణం జనం కోసమే జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటిపెద్దలా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయికి పరుగులు పెట్టిస్తున్నారు. వ్యాక్సిన్ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచారు. ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రుల్లో బెడ్లు పెంచడం, డాక్టర్లు, సిబ్బందిని నియమించడం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ డీ లైసెన్సింగ్ చేసేందుకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో)లోనూ చర్చలు జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పేటెంట్పై కేంద్రానికి కూడా హక్కుంది. భారత్ బయోటెక్ పేటెంట్ను డీ లైసెన్సింగ్ చేసి ఉత్పత్తి పెంచేందుకు.. కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ లేఖ కూడా రాస్తారు. చంద్రబాబు మాత్రం.. జూమ్లో ప్రజలను రెచ్చగొడుతున్నాడు. చేతనైతే రామోజీరావు బంధువు భారత్ బయోటెక్ నుంచి వ్యాక్సిన్ ఇప్పించవచ్చు కదా. ప్రజల ప్రాణాలే ముఖ్యం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైఎస్ జగన్ చేస్తున్న కృషిని విపక్షనేత చంద్రబాబు అభినందించాలి. జగన్.. కోవిడ్ను కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చి, పేదలకు వైద్యం అందిస్తున్నారు. 104 వాహనాల ద్వారా 24 గంటల వైద్యం అందుతోంది. 10 వేల నుంచి 15 వేల ఆక్సిజన్ బెడ్స్ పెంచి, 16 వేల నుంచి 20 వేలమందికి పైగా డాక్టర్లను, సిబ్బందిని రిక్రూట్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చిత్తశుద్ధిగా కృషిచేస్తున్నారు. కేంద్రం వ్యాక్సిన్ ఇస్తే రోజుకు 6 లక్షల డోస్లివ్వగల సామర్థ్యం రాష్ట్రానికి ఉండేలా జగన్ చేశారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను రిస్క్ ఎక్కువగా ఉండే 45–60 ఏళ్ల వాళ్లకు ముందుగా వేస్తున్నారు. 18–45 ఏళ్ల వారికి ఎందుకు వేయరంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా రాజకీయం చేయడం దుర్మార్గం. చంద్రబాబు, లోకేష్ వ్యాక్సిన్ వేసుకున్నారా? వ్యాక్సిన్ వేయాల్సి వస్తే లోకేష్ ముందుగా తన తల్లిదండ్రులకు ప్రాధాన్యం ఇవ్వడా? అలాకాకుండా ఆయనే వేయించుకుంటాడా? ఒకవేళ 45 ఏళ్లలోపు వయసు ఉన్న తను దొడ్డిదారిన వ్యాక్సిన్ వేసుకున్నా అది తప్పే కదా? చంద్రబాబు విషపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన పెంపకంలో పెరిగిన కొడుకూ అంతే. చివరకు టీడీపీ నేతలు, అనుకూల మీడియాదీ విషపు ఆలోచనలే. మురికిగుంటలో మాత్రమే శ్వాస పీల్చగలిగే క్రిమి తెగకు చెందిన వ్యక్తి చంద్రబాబు. కేంద్రం నియంత్రణలో ఉన్న వ్యాక్సినేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దురుద్దేశాలు ఆపాదించి విమర్శలు చేయడం ఏమిటి? నోరు తెరిస్తే చంద్రబాబు, ఆయన కొడుకు.. జగన్రెడ్డి అనడం న్యాయమేనా? మేం కూడా ఆయనను బాబునాయుడు అని పిలిస్తే..? కేసులు పెట్టండి.. నిలదీయండి చంద్రబాబు వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయాలని చూస్తున్నాడు. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద జనం తాకిడి ఉంది. ఇది దేశద్రోహం, రాజద్రోహం. కోవిడ్ వ్యాప్తికి కారణమై, మాస్ మర్డర్స్ వైపు చంద్రబాబు రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. వీటిమీద ఎక్కడికక్కడ కేసులు పెట్టండి, నిలదీయండి. సమాజం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న కొన్ని మీడియా సంస్థలపై కేసులు పెడతాం. విజ్ఞులు, మేధావులు, పౌర సమాజం కూడా చంద్రబాబు కుట్రలను ప్రశ్నించాలి. -
టీటీడీపై మరోసారి ఎల్లో మీడియా కుట్ర
సాక్షి, అమరావతి/తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానాల (టీటీడీ)పై ఎల్లో మీడియా దుష్ప్రచారం మరోసారి బెడిసి కొట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిజోరం రాష్ట్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న తలనీలాలను అస్సాం రైఫిల్స్ బలగాలు జప్తు చేయగా, దాదాపు నెలన్నర తర్వాత ఆ సంఘటనను టీటీడీకి ఆపాదిస్తూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేయడం విస్మయ పరుస్తోంది. కాగా జప్తు చేసిన తలనీలాలు టీటీడీకి చెందినవి కావని కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేయడంతో ఇది ఎల్లో మీడియా కుట్ర అని స్పష్టమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న మిజోరాం నుంచి మయన్మార్కు 120 బస్తాలలో ఓ వాహనం ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న తలనీలాలను అస్సాం రైఫిల్స్ బలగాలు జప్తు చేశాయి. ఐజ్వాల్కు చెందిన ముంగ్సీయన్ సింగ్ అనే వ్యక్తి జీపులో వీటిని తీసుకెళ్తుండగా, అనుమతి పత్రాలు ఉన్నాయా అని అడిగితే లేవని చెప్పాడు. దాంతో మొత్తం రూ.18,17,089 విలువైన 3,240 కేజీల తలనీలాలను జప్తు చేశారు. ముంగ్సీయన్ సింగ్ను పోలీసులు విచారించగా ఐజ్వాల్లో మరుయతి అనే మహిళ తో ఆ తలనీలాలను తన వాహనంలో మయన్మార్కు రవాణా చేసేందుకు కిరాయికి ఒప్పుకున్నానని చెప్పారు. దాంతో అతన్ని అరెస్టు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దేశంలో ఎన్నో దేవాలయాలు, ప్రైవేట్ ప్రదేశాల్లో తలనీలాలు సమర్పిస్తుండగా, అవి టీటీడీకి చెందినవే అని ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారానికి తెర తీసింది. ఈ నేపథ్యంలో ఆ తలనీలాలతో టీటీడీకి సంబంధం ఉన్నట్టు తమ విచారణలో వెల్లడి కాలేదని కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మాకు సంబంధం లేదు : టీటీడీ మిజోరాంలో జప్తు చేసిన 120 బ్యాగుల తలనీలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది. తిరుమలలో భక్తులు సమర్పించే తలనీలాలను ఈ– టెండర్ల ద్వారా వేలం నిర్వహించి విక్రయిస్తుంటామని తెలిపింది. టెండర్లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్ నుంచి జీఎస్టీ కట్టించుకుని తలనీలాలు అప్పగిస్తున్నామని వివరించింది. కొనుగోలు చేసిన బిడ్డర్కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులున్నాయా? లేక దేశంలో ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదని తెలిపింది. దేశంలోని అనేక ఆలయాల్లో తలనీలాల విక్రయాలు జరుగుతుంటాయని, టీటీడీ కూడా ప్రతి 3 నెలలకోసారి ఈ–టెండర్ ద్వారా తలనీలాలు విక్రయించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని పేర్కొంది. తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే వాటిని బ్లాక్ లిస్ట్లో పెడతామని తెలిపింది. ఎల్లో మీడియాపై భక్తుల ఆగ్రహం వాస్తవాలు ఇలా ఉంటే ఎల్లో మీడియా మాత్రం ఆ తలనీలాలు టీటీడీకి చెందినవని దుష్ప్రచారానికి ఒడిగట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతో తిరుమల ఆలయం పవిత్రతను దెబ్బతీసేందుకు, భక్తుల మనోభావాలకు భంగం కలిగించేందుకు ఎల్లో మీడియా కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై బుదర జల్లేందుకు టీటీడీపై దుష్ప్రచారం చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు ఓ రాజకీయ వ్యూహంగా మార్చుకున్నాయని, ఇందుకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు భక్తులు సమర్పించిన తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందని ఫేస్ బుక్, మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై మంగళవారం రాత్రి తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీకి చెందిన రామ రాజ్యం మళ్లీ మొదలైంది (టీడీపీ పొలిటికల్ వింగ్), గంగా ప్రకాష్, ప్రియాంక రెడ్డి స్వచ్ఛ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయా వ్యక్తులు, సంస్థలు ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, దుష్ప్రచారం చేయడం లాంటి చర్యలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సమర్పించారు. -
అప్పులపై పచ్చ మీడియా దొంగ డప్పు!
కొండంత అప్పులున్న మాట నిజం.. అధికారం చేపట్టే నాటికి చిల్లిగవ్వ లేకపోగా భారీ బకాయిలూ నిజం..వట్టిపోయిన ఖజానా వెక్కిరింపులూ ముమ్మాటికీ నిజం.. అడపాదడపా అప్పులూ, అంతకుమించి ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమ చప్పుడూ నిజమే..! మరి ఇంత అప్పులుండటానికి ఎవరు కారణం?.. అప్పు డప్పు కొట్టిందెవరు?ఊహల్లో విహరిస్తూ ఆర్భాటపు ప్రచారాలతో ఖజానా దివాళాకు బాటలు వేసిందెవరు? సాక్షి, అమరావతి: గత పాలకుల తరహాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుండటం, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా నెరవేర్చి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇక చెప్పుకునేందుకు ఏమీ లేక టీడీపీ నేతలతో పాటు కొన్ని పత్రికలు హఠాత్తుగా రాత్రికి రాత్రే అప్పులు పెరిగిపోయినట్లు కట్టు కథనాలు అల్లుతున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా అప్పులు చేయడమే కాకుండా భారీగా బకాయిలు మిగల్చడం, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం తీవ్ర కష్టాల్లో చిక్కుకుందని గుర్తు చేస్తున్నాయి. దీనికితోడు 2020–21లో కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. వైరస్ను నివారించేందుకు అన్ని ప్రభుత్వాలు దీర్ఘకాలం లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. కరోనా కారణంగా ప్రాణనష్టంతో పాటు ఆర్ధికంగానూ నష్టపోవాల్సి వచ్చింది. ఆదాయాలు పడిపోయినప్పటికీ ఎక్కువగా వ్యయం చేయాల్సి వచ్చింది. కేంద్రం దేశ చరిత్రలో తొలిసారిగా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.18,48,655 కోట్ల మేర అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇవే కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి అదనంగా చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు, మిగిల్చిన బకాయిలు గుదిబండలా మారాయి. అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట మేరకు రెండేళ్లలోనే 90 శాతానికి పైగా హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఇందుకోసం గత సర్కారు తరహాలో నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా అప్పులు చేయలేదు. విచక్షణతోనే వ్యవహరించింది. కోవిడ్–19 కారణంగా ఆదాయం పడిపోయినప్పటికీ ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి అత్యుత్తమ చికిత్సలు, కష్టకాలంలో పేదలను ఆదుకోవడం, హామీలు అమలు చేసేందుకు విచక్షణతోనే కొంతమేర ఎక్కువగా రుణాలు చేయాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రాన్ని తలదన్నేలా బాబు అప్పులు... చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నాడు కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులకు మించి రెండు రెట్లు ఎక్కువగా అప్పులు చేయడం గమనార్హం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వ తరహాలోనే అప్పులు చేసింది కానీ భారీగా రుణాలు తీసుకోలేదు. 2014 మార్చి 31 నుంచి 2019 మార్చి 31 వరకు పరిశీలించినప్పుడు కేంద్ర ప్రభుత్వ అప్పులు 49.92 శాతం పెరగ్గా అదే సమయంలో నాడు చంద్రబాబు సర్కారు అప్పులు 132.31 శాతం మేర ఎగబాకడం గమనిస్తే రాష్ట్రాన్ని ఆయన ఎలా అప్పుల ఊబిలో ముంచారో అర్థమవుతుంది. మరోవైపు గత రెండేళ్లలో (31–03–2019 నుంచి 31–03–2021) కేంద్ర అప్పులు 32.85 శాతం పెరిగితే ఇదే సమయంలో రాష్ట్రం అప్పులు 34.70 శాతమే పెరగడం ఆర్థిక క్రమశిక్షణ, విచక్షణను రుజువు చేస్తోంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గురించి అధికార వర్గాలు, ఆర్థిక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇదే అంశాన్ని బలపరుస్తున్నాయి. పులిమీద పుట్రలా కోవిడ్.. కోవిడ్కు ముందు కూడా 2019–20లో దేశ ఆర్థిక వృద్ధి ఘోరంగా దెబ్బతింది. దేశ స్థూల ఉత్పత్తి ముందస్తు అంచనాలు 2019–20లో 4.18 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్ర పన్నుల ఆదాయం గణనీయంగా తగ్గింది. అంతకు ముందు సంవత్సరం కంటే 2019–20లో దేశ స్థూల పన్ను ఆదాయాలు 3.39 శాతం తగ్గాయి. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కష్ట సమయంలోనే పులిమీద పుట్రలా కరోనా మహమ్మారి వచ్చి పడింది. దేశంలో దీర్ఘకాలిక లాక్డౌన్తో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రియల్ జీడీపీ –23.9 శాతానికి పడిపోయింది. ఈ సమస్యలు, సవాళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్ మరెన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. విభజనతో పాటు చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అసంబద్ధమైన విధానాలతో 2014 – 19 మధ్య విపరీతమైన అసమానతలకు గురైంది. గత సర్కారు హయాంలో చేసిన రుణాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. టీడీపీ సర్కారు 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు ఏప్రిల్లో కేవలం పది రోజుల్లోనే రూ.6,000 కోట్లను పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేసి గట్టి గుణపాఠం చెప్పారు. నాడు అందినకాడికి అప్పులు.. 2014–19 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన రుణాలను మించి చంద్రబాబు సర్కారు రెండింతలు ఎక్కువగా రుణాలను తీసుకుంది. నాడు కేంద్ర ప్రభుత్వం అప్పులు 49.92% పెరిగితే చంద్రబాబు సర్కారు 132.31 శాతం మేర అప్పులు ఎక్కువగా చేసినట్లు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఆయన అస్తవ్యస్థ విధానాలు, ఆర్భాటపు ఖర్చులు, అసంబద్ధ నిర్ణయాలు రాష్ట్రంపై మరింత ఆర్థిక భారాన్ని మోపాయి. ఇక గత సర్కారు 2019 మార్చి 31వతేదీ నాటికి రూ.39,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది. అంతేకాకుండా బడ్జెట్ బయట వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో రూ.58,000 కోట్ల మేర అప్పులు చేసింది. విద్యుత్ రంగ సంస్థల అప్పులు 2014–19 మధ్య కాలంలో రూ.33,587 కోట్ల నుంచి రూ.70,254 కోట్లకు పెరిగాయి. దీనికి అదనంగా విద్యుదుత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలు (డిస్కంలు) చెల్లించాల్సిన బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెరిగిపోయాయి. 2014–19 మధ్య కాలంలో రుణాలపై వడ్డీ చెల్లింపుల భారం రూ.25 వేల కోట్లకుపైగా పెరిగింది. అనుత్పాదక వ్యయాలు.. అప్పులను ఉత్పాదక రంగాలపై వ్యయం చేసి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడేది. అందుకు విరుద్ధంగా అనుత్పాదక రంగాలపై అస్తవ్యస్తంగా వ్యయం చేశారు. మరోపక్క వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్య రంగాలను చంద్రబాబు సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. 2014 మార్చి 31 నాటికి 184వ ఎస్ఎల్బీసీ మినిట్స్ ప్రకారం వ్యవసాయ అప్పులు రూ.87,612 కోట్లున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీని పలు షరతులతో రూ.24,000 కోట్లకు కుదించింది. కనీసం ఆ మొత్తాన్ని కూడా మాఫీ చేయకుండా దాదాపు రూ.8,500 కోట్లను రైతులకు బకాయిపెట్టింది. 2016–17లో వ్యవసాయ కుటుంబాల అప్పులు దేశంలో సగటున 47 శాతం ఉండగా మన రాష్ట్రంలో అత్యధికంగా 77 శాతంగా ఉన్నట్లు నాబార్డు సర్వే వెల్లడించింది. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ సర్కారు రుణ మాఫీ పేరుతో రైతులను వంచించడమే. అస్తవ్యస్థ విధానాలతో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి కూరుకుంది. 2014 ఎన్నికల ముందు టీడీపీ పలు మోసపూరిత హామీలిచ్చింది. స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చకుండా వంచించింది. ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గ్రాస్ ఎన్రోల్మెంట్ దేశంలో అతి తక్కువగా 83.2 శాతం మాత్రమే ఉంది. పథకాల అమలులో పారదర్శకత.. నేరుగా నగదు బదిలీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ విప్లవాత్మక చర్యలు చేపట్టింది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం కల్పించింది. విద్యా రంగంలో మౌలిక సదుపాయాలు, ఆధునీకరణతో పాటు ఇంగ్లీష్ మీడియం కోసం చర్యలు తీసుకుంది. వైద్య కళాశాలలను మెరుగుపరచడంతో పాటు కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తోంది. పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల తల్లులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందచేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు మహిళా సాధికారత దిశగా కృషి చేస్తోంది. కోవిడ్ నియంత్రణ, చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఆర్థిక ఒడిదొడుకుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలను యథాతథంగా అమలు చేసింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా ఆసరాగా నిలిచింది. వివిధ పథకాలు అమలులో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చింది. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా నగదు బదిలీ విధానాన్ని అమలు చేసి లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసింది. సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా వ్యవహరించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం భారీగా రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, అయినప్పటికీ గత సర్కారు మాదిరిగా విచ్చలవిడిగా కాకుండా విచణక్షతో అప్పులు తీసుకుందని, గత రెండేళ్లలో కేంద్రం అప్పుల పెరుగుదలతో పోలిస్తే రాష్ట్రం అప్పులు పెద్దగా పెరిగినట్లు కాదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రూ.21,500 కోట్ల ఆదాయం కోల్పోయినా.. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలోనే ఇచ్చిన హామీల్లో 90 శాతం కంటే ఎక్కువగా అమలు చేసింది. కోవిడ్ కారణంగా రాష్ట్రం దాదాపుగా రూ.21,500 కోట్లు ఆర్థికంగా నష్టపోయినట్లు అంచనా. కేంద్ర పన్నుల వాటా రూపంలో రావాల్సిన రూ.7,780 కోట్లు కోల్పోయింది. రాష్ట్ర సొంత పన్నుల్లో రూ.6,961 కోట్లు నష్టపోయింది. మొత్తం మీద రూ.14,741 కోట్లు ఆదాయం నష్టపోవాల్సి వచ్చింది. దీనికితోడు కోవిడ్–19 నియంత్రణకు రూ.6700 కోట్లు అదనంగా వ్యయం చేయాల్సి వచ్చింది. ఇక కోవిడ్ కారణంగా రాష్ట్రం కోల్పోయిన పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటే వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లవుతుంది. -
వీరులూ.. విదూషకులూ!
కళ్లకు గంతలు కట్టారు. తిమ్మిని బమ్మిని చేశారు. రాళ్లను రత్నాలన్నారు. ఆయన ఆలోచనలు అద్భుతం అన్నారు. తనంతవారిక లేరండీ అన్నారు. పత్రికలు ఊదరగొట్టాయి. టీవీలు భజన్స్ వినిపించాయి. ఆయన ఇరవయ్యేళ్లు ముందుగానే ఆలోచిస్తారని మీడియా అబ్బురపడింది. సదరు మీడియా పాతికేళ్లుగా అబ్బుర పడుతూనే ఉంది. ప్రజలందరూ కూడా తనలాగే బేషరతుగా అబ్బుర పడాలని ఆ మీడియా నిరంతరాయంగా డిమాండ్ చేస్తూ వస్తు న్నది. పెంపుడు మీడియా కోరిక మేరకు తన దగ్గరున్న కాలజ్ఞాన భూతద్దంలోంచి ఆయన ఒక ఇరవయ్యేళ్లు ముందుకు లుక్కే శారు. ఇదీ నా విజన్ అని ప్రకటించారు. పెంపుడు మీడియా ‘ట్వంటీ ట్వంటీ’ అని కోరస్ పాడింది. ‘అన్న విజిలేస్తే...’ అన్న స్టయిల్లో ‘ఆయన విజనేస్తే...’ అంటూ దరువేసింది కూడా. ఆ విజన్ ట్వంటీ ట్వంటీని కళ్లతో చూచిననూ, చేతులతో తాకి ననూ, చెవులతో విన్ననూ జన్మ చరితార్థమవుతుందని పచ్చ మీడియా ప్రమాణ పూర్తిగా హామీ పడింది. ట్వంటీ ట్వంటీ రానే వచ్చింది. తనవెంట ఓ మహమ్మారిని కూడా తీసుకొని వచ్చింది. దీని ప్రస్తావన మన విజన్లో లేదు. ఇప్పుడాయన అధికారంలో కూడా లేరు. అయిననూ... విజనరీ కదా! ఆయనేమంటారో... ‘ఆయనుంటేనా, ఆయనుంటేనా’ అని పెంపుడు మీడియా టీజర్లు వదిలింది. ఆయన ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు భౌతిక దూరం పాటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జూబిలీ హిల్స్లోని సొంత ప్రాసాదంలో ఐసోలేషన్లో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చకచకగా పూర్త య్యాయి. ఏం చెబుతారో? విజనరీ కదా! అభిమానులు చూస్తున్నారు. ఆయన ప్రారంభించారు. ‘ఇది చాలా ప్రమాదకరమైన వైరస్’ అని ప్రకటించారు. ప్రజలందరూ భౌతికదూరం పాటించాలని పిలుపునిచ్చారు. కొత్త విషయం కాకున్నా మంచి విషయమే కదా. సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సూచించారు. అప్పటికే చాలామంది చెప్పారు. కనీసం ఐదారువేలమంది. చివరగా జనతా కర్ఫ్యూకు మద్దతు నీయాలని కోరుతూ ముగించారు. విజన్ బయటకు రాలేదు. కేడర్లో ఒకింత నిరాశ. ఆ తదుపరి రోజు నుంచి మీడియా సమావేశాన్ని దినసరి కార్యక్రమంగా మార్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అస్సలు పనిచేయడం లేదనీ, కరోనా విజృంభి స్తున్నదని, ఇలాగే వుంటే పరిస్థితి అదుపుతప్పడం ఖాయమనీ, అందుకోసమే ఎదురుచూస్తున్నంత ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. గ్రామ వలంటీర్ల ద్వారా పెన్షన్ డబ్బులను అందజేస్తుంటే ఆయన గదమాయించారు. వలంటీర్ల ద్వారా కరోనా వ్యాప్తి చేస్తున్నారంటూ కసురుకున్నారు. ఉచిత రేషన్ సరుకులను అందజేయడం కోసం ప్రజలకు టైమ్ స్లాట్స్ కేటాయించి భౌతికదూరం పాటించేలా చూస్తూ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక్కడాయన రివర్స్ వైఖరి తీసుకున్నారు. ఏం మీ వలంటీర్లు ఏం చేస్తున్నారు. ప్రజలొచ్చి తీసుకోవడం ఏమిటంటూ ప్రభు త్వంపై విమర్శలు కురిపించారు. ఆయన థియరీ ప్రకారం వలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్లొద్దు. సరుకులు ఇవ్వడానికి మాత్రం ఇంటికే వెళ్లాలి. ఇందులో లాజిక్ ఏమిటని అడగొద్దు. రసపట్టులో తర్కం కూడదంటాడు మాయాబజార్లో శ్రీకృష్ణుడు. రాజకీయంలో కూడా తర్కం కూడదనేది మన విజనరీ నేత ఫిలాసఫీ. అందువల్ల తర్కరహితమైన లేదా కుతర్కపూరితమైన విమర్శలను మండల దీక్ష బూనినంత నిష్టగా గత నలభై రోజుల నుంచి ఆయన సంధిస్తున్నారు. మధ్యలో మన నాయకుని ముఖ్య అనుచరులకు ఒక బ్రిలి యంట్ ఐడియా వచ్చింది. కరోనా వైరస్ను ఆంధ్రప్రదేశ్ ఆవలకు తరిమికొట్టే ‘క్రిమివ్యూహ’ ఛేదనా విద్య ఆయన కొక్కరికే తెలుసు కనుక ఒక వారం రోజులపాటు సీఎం కుర్చీ అప్పగించాలనే డిమాండ్ను ముందుకు తెచ్చారు. సీనియర్ అర్జున్ హీరోగా నటించిన ఒకే ఒక్కడు సినిమా స్టోరీ లైన్ అది. ఆ సినిమా అంటే ఒకరకమైన అబ్సేషన్ ఆయనకు. తాను రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఆ సినిమా వచ్చింది. సినిమాలో ముఖ్యమంత్రి క్షేత్ర పర్యటనలు చేస్తూ పనిలో అలసత్వం చూపే అధికారులను మీడియా సమక్షంలో నిలదీ స్తుంటాడు. నిజజీవిత ముఖ్యమంత్రిగా అర్జున్ను మించి నటించాలన్న కోరిక ఈయనకు కలిగింది. అత్తవారి తరపున అందరూ నటులు కావడం కూడా ఆ కోరికకు కారణం కావచ్చు. పైపెచ్చు మహానటుడు ఎన్టీ రామారావు చనిపోవడానికి ముందు ‘నమ్మించి గొంతుకోసే గొప్ప నటుడు’ అనే కితాబును కూడా ఇచ్చి వున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటన శిఖ రాగ్రాలకు చేరుకొని యంత్రాంగాన్ని నిలదీసే లక్ష్మణరేఖను దాటి నిందించే స్థాయికి వెళ్లిపోయింది. ఈ ఘటనలు ఆయనను ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అపఖ్యాతి పాలుచేశాయి. ఇటువంటి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన సినిమా కథను పార్టీ నేతలు ముందుకు తేవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీన్ కట్ చేస్తే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారత సంతతికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త బీఆర్ శెట్టి. ఆయన దాదాపు 80 బ్యాంకులకు ఇండియన్ కరెన్సీలో సుమారు 45 వేల కోట్ల రూపాయలను ఎగవేసి దేశం నుంచి ఉడాయించాడు. అతని పేరు మీద ఉన్న ఆస్తులను జప్తు చేసే కార్యక్రమం మొదలైంది. ఆ ఫలానా శెట్టి గారికి విజనరీ నేత అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతంలో 100 ఎకరాల భూమిని చౌకగా కట్టబె ట్టారు. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ మురికి డీల్ రద్దయింది. సదరు శెట్టి వ్యాపార రహస్యాలేమిటి? ఆయ నకు ఎవరెవరితో ఎటువంటి సంబంధాలున్నాయనే విచారణ సహజంగానే ప్రారంభమవుతుంది. మన అమరావతి తీగకూ, దుబాయ్ డొంకకూ ఒకవేళ ఏదైనా సంబంధం వుంటే అదీ ముంచుకొస్తుంది. శెట్టిగారి వ్యాపార బండారం, మనవారి ‘వారం కుర్చీ’ కోరిక ఒకదాని తర్వాత ఒకటి రావడంలో అనేక మందికి అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. కేవలం తాము వాదన కోసమే కుర్చీ అడిగామనీ, దానివెనుక ఎటువంటి దురుద్దేశాలు లేవనీ శెట్టిగారి మీద ఒట్టేసి చెబితే వారి పిచ్చి డిమాండ్ నవ్వుకోవడానికి పనికి వస్తుంది. లేకుంటే అనుమా నించవలసి వస్తుంది. కరోనా సంక్షోభ సమయంలో తమ నాయకుడిలో దాక్కొని వున్న విజనరీ బయటకు ఎప్పుడు వస్తాడోనని ఎదురు చూస్తున్నారు కేడర్. ఆరోజు రానే వచ్చింది. రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాజిటివ్ కేసుల ప్రాతిపదికగా రాష్ట్రంలోని మండలాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ అనే మూడు జోన్లుగా విభజించినట్టు తెలిపారు. మరుసటి రోజు కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా కేసుల ఆధారంగా దేశంలోని జిల్లాలను పైన పేర్కొన్న మూడు జోన్లుగా విభజించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భౌగోళికంగానూ, జనాభాపరం గానూ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు పెద్దవి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలను కాకుండా మండలాలను వర్గీకరించింది. కేంద్రం జిల్లాలుగా ప్రకటించింది. అంతే తేడా. కేంద్ర ప్రకటన రాగానే ఆగమేఘాలమీద మన విజనరీ మీడియాను పిలిచారు. ప్రధానమంత్రికి జోన్ల సలహా తానే ఇచ్చినట్టు చెప్పుకున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో, ఏ హోదాలో... ఇత్యాది ప్రశ్నలకు తావు లేదు. అనగనగా ఒకరోజు ఒక కార్డు ముక్క రాసి పడేసినట్టు మాత్రం చెప్పారు. ఆయన ఆ తర్వాత కేంద్ర మంత్రులకూ, అధికారులకూ లేఖలు రాశారు. మీడియాకు విడుదల చేశారు. ముఖ్యమంత్రికీ, రాష్ట్ర అధికారులకూ లేఖలు రాశారు. మీడియాకు విడుదల చేశారు. ఐదుకోట్ల మంది ప్రజలకు టోకున ఒకే ఉత్తరం రాసి కూడా మీడియాకు విడుదల చేశారు. కానీ, ప్రధానమంత్రికి అప్పుడెప్పుడో రాసిన సలహా ఉత్తరాన్ని ఎందుకు ప్రకటించుకోలేదో మాత్రం ఆయన చెప్పనేలేదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం పెను సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పటికీ దానికి వైద్యం లేదు. వ్యాక్సిన్ లేదు. ఇది యథార్థం. కనుక దానితోనే కలిసి జీవించవలసిన అనివార్యత మానవ సమాజం ముందున్నది. అటువంటి జీవన దశను ప్రపంచవ్యాప్తంగా ‘న్యూ నార్మల్’ అంటున్నారు. నయా దునియా. కొత్త జీవితం. దీనికి వ్యాక్సిన్ లభించినా మరో ప్రమాదకరమైన వైరస్ దండెత్తబోదనే గ్యారంటీ ఏమీ లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ‘కరోనాతో కలిసి జీవించవలసిన పరిస్థితిలో ఉన్నాము. అంతమాత్రాన జీవితమంతా నాశనమైపోయిందని చింతించనవసరం లేదు, వచ్చినా జ్వరం మాదిరిగా వస్తుంది, పోతుంది. మందులు తీసు కుంటే చాలు. ఇమ్యూనిటీని పెంచుకోవాలి. కరోనా వచ్చిన వాళ్ల పట్ల ఎటువంటి వివక్షా చూపకండి’ అని చెప్పారు. అది నిజం. ప్రపంచవ్యాప్తంగా జరిపిన అధ్యయనం ప్రకారం నూటికి 81 మందికి కరోనా సోకినట్లు కూడా తెలియడం లేదు. ఏ మందులూ వాడకుండానే వెళ్లిపోతున్నది. మిగిలిన వాళ్లలో 15 శాతం మందికి ఇంట్లో జాగ్రత్తగా వుండి మందులు తీసుకుంటేనే సరిపోతున్నది. మరో నాలుగైదు శాతంమందిపైనే ఇది తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నది. ఎక్కువగా వయోవృద్ధులూ, ఇతరత్రా జబ్బులున్న వారిపైనే దాని ప్రతాపం కనబడుతున్నది. ఈ దుస్థితిలో విజ్ఞులెవరైనా ఏం చెబుతారు. వైఎస్ జగన్ ప్రసంగం పూర్తికాగానే ‘విజన్ ట్వంటీ ట్వంటీ’ స్పందించారు. ‘కరోనాతో కలిసి జీవించాలంటున్న వ్యక్తి గురించి ఏం చెప్ప గలను? ఇక ఆంధ్రప్రదేశ్ను దేవుడే కాపాడాలంటూ’ ట్వీట్ చేశాడు. అక్కడే కథ అడ్డం తిరిగింది. గడిచిన నాలుగైదు రోజు లుగా ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానవేత్తలూ, ప్రముఖులూ సహ జీవనానికి సిద్ధపడాలని ప్రజలకు బోధిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ మాటే చెప్పింది. అందులో చీఫ్ సైంటిస్టుగా పనిచేస్తున్న సౌమ్యా స్వామినా«థన్ అదే మాట అన్నారు. రఘురామ్రాజన్, నారాయణమూర్తిల సారాంశం అదే. మోదీ మాట అదే. మరో ఆరు నెలలకో అంతకంటే ముందుగానో ఏదో ఒక ఎల్లో మీడియాలో ఒక వార్తో వ్యాఖ్యో వస్తుంది. కరోనాతో కలిసి సహజీవనం సాగించక తప్పదనీ, అందువలన లాక్ డౌన్ను సడలించాలని మన విజనరీ నేతే ప్రధానికి సలహా ఇచ్చాడని అందులో ఉంటుంది. ఆయన మెడలో మరో వీర తాడును ఎల్లో మీడియా వేస్తుంది. కానీ, ఎంత ప్రయత్నించినా ప్రజలకు తెలిసిపోతూనే ఉన్నది. అవి మీడియా తగిలించిన భుజకీర్తులే తప్ప నిజకీర్తులు కావని స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఈ సంక్షోభాల వలన ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిలో కూడా ఒక సుగుణం ఉంది. వీరుడెవరో... విదూషకుడెవరో నిగ్గు తేల్చే సత్తా సంక్షోభాలకు ఉన్నది. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
ఎల్లో మీడియా తప్పుడు వార్తలు
చోడవరం/ చోడవరం టౌన్/గుడివాడ : వృద్ధురాలి సహజ మరణానికి కూడా రాజకీయ రంగు పులిమి ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నాయకులు ప్రచారం చేయడంపై స్థానికుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. విశాఖ జిల్లా చోడవరం పట్టణంలోని ద్వారకానగర్కు చెందిన షేక్ మీరాబీ (68) అనే వృద్ధురాలు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో రేషన్ దుకాణానికి వెళుతూ మార్గం మధ్యలో స్పృహ తప్పి పడిపోయిందని, ఇంటికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మీరాబీ రేషన్ షాపు వద్ద లైన్లో నిలబడటం వల్లే చనిపోయిందనే ప్రచారం చేస్తున్నారని, ఇది అవాస్తవమని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ తెలిపారు. ఆమె అసలు రేషన్ దుకాణానికే చేరుకోలేదన్నారు. మధ్యలోనే కుప్పకూలిపోయిందని, మణికంఠ అనే గ్రామ వలంటీర్ ఆమె ముఖంపై నీరు చల్లితే లేచి కూర్చుందన్నారు. ఆమె మనవడు ఇంటికి తీసుకువెళుతుండగా మృతి చెందిందని చెప్పారు. అయితే ఓ వర్గం మీడియా అసత్య ప్రచారం చేసిందన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించినట్టు తెలిపారు. అసత్య ప్రచారంపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం విశాఖ జిల్లాలో షేక్ మీరాబి అనే వృద్ధురాలు రేషన్ సరుకుల కోసం ఎండలో క్యూలో నిలబడి మృతి చెందినట్లు జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. -
'చైనా ప్రెసిడెంట్కు ధైర్యం చెప్పిన బాబు'
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. 'కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి. ఎల్లో మీడియా తుమ్ములు, దగ్గులతో పచ్చ వైరస్ను వదులుతూనే ఉంది. అధికార పీఠం నుంచి తరిమివేసినా చంద్రబాబు బ్యాచ్ తమ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది. తస్మాత్ జాగ్రత్త! అంటూ ప్రజలకూ సూచించారు. మరో ట్వీట్లో.. అత్యంత బాధ్యతతో వ్యవహరించే జగన్ గారి పాలనలో ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సంతోషించాలి. అనుభవజ్ఞుడు అని చెప్పుకునే వ్యక్తిని తరిమేసి ఉండకపోతే ఇవాళ కరోనా నియంత్రణ కంటే తన ప్రచారం ఎక్కువగా ఉండేది. జాగ్రత్తల పేరుతో వాణిజ్య ప్రకటనలు జారీ చేసి పచ్చమీడియాకు వేల కోట్లు దోచి పెట్టేవాడు' అంటూ చంద్రబాబుపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు భయపడిందక్కడే.. కాగా మరో ట్వీట్లో.. 'పవర్ పోయిన దిగులులో ఉన్నాడు కానీ లేకపోతే జనతా కర్ఫ్యూ ఐడియా ప్రధానికిచ్చింది తనేనని బొంకేవాడు. చైనా ప్రెసిడెండ్కు ధైర్యం చెప్పిన బాబు అంటూ ఎల్లో మీడియా రోజంతా దంచేది. వీడియో కాన్ఫరెన్సులతో అధికారులను ఏడిపించేవాడు. నిధులు నాకేందుకు రకరకాల స్కీమ్స్ మొదలయ్యేవి' అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. -
ఆయన పత్తిగింజని నమ్మించడానికి ఏ స్థాయికైనా..!
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు టీడీపీ అధినేత పీఏపై ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్ల బాగోతం బయటపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్ధేశించి ట్విటర్ వేదికగా ఎంపీ విమర్శలు ఎక్కుపెట్టారు. 'చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయింది. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా మరో ట్వీట్లో.. 'వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేక పోతున్నారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితం లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడు. పిఎస్ శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదట. కట్టప్పను మించి పోయాడు' అంటూ పవన్ కల్యాణ్పై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: చంద్రబాబు ‘పాస్ వర్డ్’ వదిలేశాడు... -
ఎల్లో మాయ.. అదో ఫూల్స్ ప్యారడైజ్
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): నిజం! ఎల్లో మీడియాకిది అలవాటే!!. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజల మధ్యలోకి వెళ్లే కార్యక్రమం ఏదైనా ఆరంభిస్తే... దానికొచ్చే జన స్పందనకు భయపడో లేక జనం దృష్టిని దాన్నుంచి మళ్లించటానికో.. కారణం ఏదైతేనేం..!! ఎల్లో మీడియా ఆ రోజు జగన్కు వ్యతిరేకంగా పతాక శీర్షికల్లో ఏదో ఒక కథనాన్ని వండి వారుస్తుంది. తాజాగా ప్యారడైజ్ పేపర్స్ లీకులంటూ జగన్మోహన్రెడ్డి ఫొటో ప్రచురించిన తీరు కూడా ఇలాంటిదే. కావాలంటే మీరే చూడండి... ప్యారడైజ్ పత్రాలుగా పిలుస్తున్న బెర్ముడా పత్రాల్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావనే లేదు. ఆయన పేరుగానీ, ఆయనకు సంబంధించిన కంపెనీల పేరు గానీ బెర్ముడా పత్రాల్లో అణుమాత్రమైనా లేదు. మరి ఆయన పేరు, ఫొటోను ఎల్లో మీడియా సహా కొన్ని పత్రికలు, చానళ్లు ఎందుకు ప్రసారం చేస్తున్నాయి? నిజానికి ఈ పత్రాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన హెటెరో గ్రూపు ప్రమోటర్ల పేర్లున్నాయి. హెటెరో డ్రగ్స్ సంస్థ ‘హెటెరో మాల్టా’ పేరిట అక్కడో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. దాన్లో డైరెక్టర్లుగా హెటెరో ప్రమోటర్లు ఎ.నరసారెడ్డి, బి.పార్థసారథి రెడ్డి పేర్లున్నాయి. దీనిపై వారిద్దరూ వివరణ కూడా ఇచ్చారు. ఆ కంపెనీ ఉన్న మాట నిజమేనని, అది తమ వ్యక్తిగతం కాదని, హెటెరోకు అనుబంధ సంస్థ అని, యూరప్ కార్యకలాపాల కోసం ఆ కంపెనీని తమ సంస్థే ఏర్పాటు చేసిందని, ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్తో సహా వివిధ రెగ్యులేటరీ సంస్థలకు తెలియజేస్తూనే ఉన్నామని స్పష్టం చేసింది. ఈ వివరణను కూడా ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రిక ప్రచురించింది. అంటే! దీన్లో ఎలాంటి అక్రమాలకూ తావులేదనే అనుకోవాలి. పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సైతం తన విదేశీ కంపెనీలకు సంబంధించి సమస్త సమాచారాన్నీ దర్యాప్తు, నియంత్రణ సంస్థలకు అందజేసినట్లు గతంలోనే చెప్పారు. మరి జగన్మోహన్రెడ్డి ఫొటోను ఎందుకు ప్రచురించినట్లు? ప్యారడైజ్ పత్రాల్ని ఐసీఐజే బయటపెట్టింది. ఐసీఐజేకు ఇండియాలో భాగస్వామి అయిన ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రిక ఈ వివరాలను ప్రచురించింది. వివిధ కేసులతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తుల పేర్లు ఈ రికార్డుల్లో ఉన్నాయని పేర్కొంటూ.... సన్ టీవీ– మ్యాక్సిస్ కేసు; ఎస్సార్ –లూప్ 2జీ కేసు; ఎస్ఎన్సీ – లావాలిన్ కేసు (ఈ కేసులో కేరళ సీఎం విజయన్ పేరుంది కానీ తరవాత క్లీన్చిట్ ఇచ్చారు); రాజస్తాన్ అంబులెన్స్ స్కామ్ (ఈ స్కామును ఇటీవలే సీబీఐకి అప్పగించారు. దీన్లో జిక్విస్టా హెల్త్కేర్ అనే కంపెనీ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కంపెనీలో తొలినాళ్లలో సచిన్ పైలట్, కార్తీ చిదంబరం ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు); వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై సీబీఐ దాఖలు చేసిన కేసు..’’ అంటూ కేసుల్ని ఉదహరించింది. అదీ జగన్ పేరు ప్రస్తావనకు వచ్చిన తీరు. ఇప్పటికైనా అర్థమయిందా? అసలు జగన్మోహన్రెడ్డిపై సీబీఐ కేసు... అంటే ఏంటి? అది ‘సాక్షి మీడియా’లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం. ‘సాక్షి’లో ఇండియా సిమెంట్స్, అరబిందో ఫార్మా, రాంకీ వంటి లిస్టెడ్ సంస్థలే కాక... హెటెరో వంటి అన్లిస్టెడ్ సంస్థలు, నిమ్మగడ్డ ప్రసాద్ వంటి పారిశ్రామికవేత్తలూ పెట్టుబడులు పెట్టాయి. దీనికి సంబంధించి హెటెరోపై, నిమ్మగడ్డ ప్రసాద్పై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. అంటే... జగన్మోహన్రెడ్డి కేసుతో సంబంధం ఉన్న హెటెరో సంస్థకు బెర్ముడాలో కంపెనీ ఉన్నదనేది ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ ప్రచురించిన వార్త తాత్పర్యం. మరి దాన్ని ఎల్లో మీడియా ఎలా తీసుకుంది? జగన్కే బెర్ముడాలో కంపెనీలున్నట్లుగా... భూమి బద్దలైపోయిందా అన్న రీతిలో పతాక శీర్షికల్లో ఆయన ఫొటోను ప్రచురించేశారు. కొన్ని గంటల పాటు ఎల్లో చానళ్లలో కథనాలు నడిపించారు. ఇంతా చూస్తే... మొదటి పేజీలో ఆయన ఫొటో తప్ప బెర్ముడా పేపర్లలో ఆయన పేరు ఎక్కడ ఉందో చెప్పిన కథనం ఒక్కటీ లేదు. దీనర్థమల్లా ఒక్కటే!! వారికి కావాల్సింది సెన్సేషన్! ఆ సెన్సేషన్లో జగన్మోహన్రెడ్డి ఏదో చేసేశారన్నట్లుగా జనానికి చూపించటం. కానీ జనాలు ఆ మాత్రం నిజాలు తెలుసుకోలేరా? నిజానికి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ప్రతి కంపెనీకీ అక్కడ అనుబంధ సంస్థలుండటమనేది సహజం. అంతర్జాతీయ దిగ్గజం గూగుల్తో మొదలెడితే దేశీ ఐటీ అగ్రగాములు ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా దాదాపు ప్రతి కంపెనీకీ విదేశాల్లో అనుబంధ సంస్థలుంటాయి. వాటి వార్షిక నివేదికల్లో అవన్నీ బయటపెడతాయి కూడా!!. ‘మోటపర్తి’ – చంద్రబాబు లింకుల్ని ఏం చేశారు? ఇదే ఐసీఐజే ఇంతకుముందు ‘పనామా’ పత్రాల పేరిట పనామాలో రిజిస్టరయిన ఆఫ్షోర్ కంపెనీల పేర్లు, వ్యక్తుల చరిత్రలు బయటపెట్టింది. ఆ వ్యవహారంతో కొన్ని దేశాల్లో అధ్యక్షులు కూడా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఆ పత్రాల్లో రాష్ట్రానికి చెందిన మోటపర్తి శివరామ కృష్ణ ప్రసాద్ పేరు స్పష్టంగా బయటపడింది. ఆయనకు బోలెడన్ని కంపెనీలున్నట్లు వెల్లడైంది. నిజానికి ఆయనెవరో కాదు. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు వ్యవస్థాపకు డిగా ఏర్పాటు చేసిన ఆయన కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన చేత హెరిటేజ్ ఫుడ్స్ రాజీనామా చేయించేసింది. చిత్రమేంటంటే ఆ రోజున ఏ ఎల్లో పత్రిక, చానల్ కూడా చంద్రబాబు నాయుడి పేరును ప్రస్తావించింది లేదు. కనీసం హెరిటేజ్ ఫుడ్స్ పేరునూ ప్రస్తావించలేదు. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. బాబుతో నేరు గా సంబంధాలున్న... బినామీగా ఉండి పలు దేశాల్లో వ్యాపారాలు నడిపిస్తున్నారన్న ఆరోపణలెదుర్కొంటున్న ఎంవీఎస్ఆర్కే ప్రసాద్ పేరు పనామా పత్రాల్లో వస్తే ఏ ఎల్లో మీడియా కూడా ప్రచురించ లేదు. అదే ప్యారడైజ్ పత్రాల్లో హెటెరో డ్రగ్స్ అనుబంధ కంపెనీ పేరొస్తే... అది చట్టబద్ధమైనదే అని తెలిసీ జగన్ ఫొటో ప్రచురించారు. అదీ ఎల్లో మాయ!! ప్యారడైజ్ పత్రాలంటే... పన్నులు తక్కువగా ఉండే బెర్ముడాలో పలువురు సంపన్నులు, అంతర్జాతీయ కంపె నీలు తమ అనుబంధ సంస్థల్ని రిజిస్టరు చేసుకు న్నారు. ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు కూడా చేశారు. ఇవన్నీ యాపిల్బై అనే రిజిస్ట్రా్టర్ ద్వారా జరిగాయి. ఆ యాపిల్బై తాలూకు పత్రాల్ని ఐసీఐజే సంపాదించింది. అవే ప్యారడైజ్ పేపర్స్. విదేశాల్లో కంపెనీలు, ఖాతాలు ఉండటం తప్పేమీ కాదని, అవన్నీ అక్రమమని చెప్పలేమని కూడా ఐసీఐజే తన కథనంలో ముందే చెప్పింది. కాకపోతే కొన్ని అక్రమమైనవి కూడా ఉండి ఉండొచ్చని... వాటిపై దర్యాప్తు చేయాల్సింది ఆయా దేశాల సంస్థలేనని కూడా ఐసీఐజే స్పష్టంచేసింది. -
ఎల్లో మీడియా రాతలవల్లే టీడీపీ గెలిచింది: బొత్స
విజయవాడ: ఎల్లో మీడియా కల్పిత రాతల వల్లే టీడీపీ గెలిచిందని మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాజా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై సమీక్ష సమావేశంలో బొత్స పాల్గొన్నారు. భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభావం రాష్ట్ర ప్రజలపై ఎక్కడా లేదు అని బొత్స వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బొత్స అన్నారు. తీవ్ర వ్యతిరేకతే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమని బొత్స విశ్లేషించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా లభించని సంగతి తెలిసిందే.