Airbus
-
విమానంలో మంటలు.. 176 మంది ప్రయాణికులు సురక్షితం
సియోల్: దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ బుసాన్ ఎయిర్బస్ ఏ321 ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది. దీనిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై విమానంలోని 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 176 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం విమానం హాంకాంగ్కు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి 10.15 జరిగింది. గాలితో నిండిన స్లయిడ్లను ఉపయోగించి ప్రయాణీకులను ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. Fire breaks out on an Air Busan A321 bound for Hong Kong at Gimhae International Airport in Busan, South Korea.At around 10:30 p.m. on Tuesday, a fire broke out in the tail section of the aircraft.All 170 passengers and crew evacuated, and there were no casualties,… pic.twitter.com/GqzIkrUx85— Breaking Aviation News & Videos (@aviationbrk) January 28, 2025ఈ విమానం 17 ఏళ్ల క్రితం నాటి ఎయిర్బస్ ఏ321 సీఈఓ మోడల్ అని దాని టెయిల్ నంబర్ హెచ్ఎల్ 7763 అని ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ మీడియాకు తెలిపింది. గత నెలలో కూడా ఇటువంటి ప్రమాదం చోటుచేసుకుంది. 2024 డిసెంబర్ 29న మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్ బోయింగ్ 737-800 విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 181 మందిలో 179 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా.. -
మరో 100 విమానాలకు ఎయిరిండియా ఆర్డరు
విమానయాన సంస్థ ఎయిరిండియా మరో 100 ఎయిర్బస్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో వైడ్–బాడీ ఏ350 రకం ఎయిర్క్రాఫ్ట్లు 10, ప్రాంతీయ రూట్లలో ఉపయోగించే నారో–బాడీ ఎ320 రకం విమానాలు 90 ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఎయిర్బస్, బోయింగ్ సంస్థలకు ఇచ్చిన 470 విమానాలకు ఇవి అదనం.అలాగే ఎ350 ఎయిర్క్రాఫ్ట్ల విడిభాగాలు, నిర్వహణ సహకారం కోసం ఎయిర్బస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తాజా ఆర్డరుతో కలిపి ఎయిర్బస్ నుంచి ఎయిరిండియా కొనుగోలు చేసే మొత్తం ఎయిర్క్రాఫ్ట్ల సంఖ్య 350కి చేరుతుంది. 2023లో కంపెనీ 250 విమానాల కోసం ఆర్డరిచ్చింది."భారత ప్రయాణికుల వృద్ధి ప్రపంచంలోని ఇతర దేశాలను అధిగమించడం, గణనీయంగా మెరుగుపడుతున్న దేశ మౌలిక సదుపాయాలు, ఆకాంక్షతో కూడిన యువ జనాభా అంతర్జాతీయంగా ఎదుగుతుండటం వంటి పరిణామాలతో ఎయిర్ ఇండియా విస్తరణకు స్పష్టమైన సందర్భాన్ని చూస్తున్నాం" టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియాలోకి మరో 100 ఎయిర్బస్ విమానాలు
టాటా గ్రూప్ యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) మరో వంద కొత్త విమానాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 10 ఏ350 వైడ్బాడీ, మరో 90 ఏ320 ఫ్యామిలీ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి.ఎయిర్ ఇండియా గతేడాది ఎయిర్బస్కు 250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 40 ఏ350 విమానాలు, 210 ఏ320 విమానాలు ఉన్నాయి. కొత్తగా చేరనున్న విమానాలతో కలిపి ఎయిర్బస్కు ఇచ్చిన ఆర్డర్ల సంఖ్య 350కి చేరింది.కొత్త విమానాల కోసం ఆర్డర్ చేయడం మాత్రమే కాకుండా.. ఎయిర్ ఇండియా ఏ350 విమానాలను సంబంధించిన విడి భాగాలు, నిర్వహణ కోసం ఎయిర్బస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్బస్తో 250 విమానాల కోసం గతంలో ఆర్డర్ చేసినప్పుడే.. 220 విమానాల కోసం బోయింగ్తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కంపెనీ ఆర్డర్ చేసిన మొత్తం కొత్త ఎయిర్క్రాఫ్ట్ల సంఖ్య 570కి పెరిగింది.కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన సందర్భంగా టాటా సన్స్ అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. మన దేశంలో మౌలిక సదుపాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం చాలామంది యువత ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎయిర్ ఇండియాలో విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు, సేవలను ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.100 more @Airbus aircraft! ✈️We are happy to announce new orders for 10 A350s and 90 A320 Family aircraft, adding 100 more aircraft to our firm orders for 250 Airbus aircraft placed last year.With this, the total number of new aircraft we have ordered rises to 570, of which… pic.twitter.com/OmfSWbJwbi— Air India (@airindia) December 9, 2024 -
ఎయిర్బస్ @ ఓరుగల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ రూపొందబోతోంది. ఐదారేళ్ల తర్వాత ఎట్టకేలకు అవరోధాలు పరిష్కారం కావటంతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంసిద్ధత ప్రకటించింది. దీనిని సొంతంగానే నిర్మించాలని నిర్ణయించగా, అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి టెండర్లు పిలవబోతోంది. ఎయిర్బస్ దిగేలా.. నాలుగేళ్ల క్రితం ఏఏఐ ఆధ్వర్యంలో జరిగిన టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ సర్వే రెండు రకాల నివేదికలు సమర్పించింది. చిన్న విమానాశ్రయం నిర్మించేందుకు 724 ఎకరాల భూమి, రూ.248 కోట్ల వ్యయం అవుతుందని, పెద్ద విమానాలను ఆపరేట్ చేసే స్థాయిలో నిర్మించాలంటే 1053 ఎకరాల భూమి, రూ. 345 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. తొలుత చిన్న విమానాశ్రయంగానే నిర్మించాలని నాటి ప్రభుత్వం సూచించింది. కానీ భవిష్యత్లో విస్తరణ ఇబ్బందిగా ఉంటుందని, కనీసం 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒకేసారి పెద్ద విమానాశ్రయమే నిర్మించాలని గతేడాది చివరలో ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం సరే అనటంతో పెద్ద విమానాశ్రయమే రూపొందబోతోంది. ఇక్కడ ఎయిర్బస్ విమానం దిగేలా దాదాపు 2,800 మీటర్ల పొడవైన్ రన్వే నిర్మించబోతున్నారు. మామునూరులో నిజాం ప్రభుత్వం నిర్మించిన ఎయిర్్రస్టిప్ శిథిలం అయినా, నాటి రెండు రన్వేల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో పెద్దది దాదాపు 1,400 మీటర్ల పొడవు ఉంది. ఇప్పుడు అదే డైరెక్షన్లో దానిపైనే కొత్త రన్వే నిర్మించనున్నారు. దాని పక్కన గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్వే కూడా ఉంది. దానిని కూడా పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. సొంతంగానే నిర్మాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. ఎయిర్పోర్టుకు 150 కి.మీ. పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ ఎయిర్పోర్టుకు ఇది అడ్డంకిగా మారటంతో జీఎమ్మార్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ విమానాశ్రయాన్ని కూడా దానికే కేటాయించేలా కూడా చర్చలు జరిగాయి. చివరకు ఆ నిబంధనపై అభ్యంతరం పెట్టకూడదన్న దిశలో చర్చలు సానుకూలంగా జరిగాయి. ఆ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ తీసుకుంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కేటాయించకుండా సొంతంగానే వరంగల్ ఎయిర్పోర్టును చేపట్టాలని అది నిర్ణయించింది. – విమానాశ్రయానికి 700 మీటర్ల దూరంలో ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిని మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు కిలోమీటరు నిడివితో భారీ సొరంగమార్గం నిర్మించి వాహనాలను దాని గుండా మళ్లించాలని ప్రతిపాదించారు. కానీ దీనికి భారీ ఖర్చు అవుతున్నందున, దాని బదులు బైపాస్రోడ్డు నిర్మించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై ఇప్పుడు పరిశీలిస్తున్నారు. – వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో జపాన్, తైవాన్ లాంటి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కార్గో ఫ్లైట్ సేవలు కోరుతున్నాయి. కార్గో ఫ్లైట్ ఆపరేషన్ జరగాలంటే పెద్ద రన్వే ఉండాలి. దీంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగానే దీనిని రూపొందించబోతున్నారు. మూడేళ్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్.. మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్’లోని రీజినల్ కనెక్టివిటీ స్కీంతో అనుసంధానించనున్నారు. ఇందులో మూడేళ్ల కాలానికి కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందిస్తుంది. రూట్ల వారీగా బిడ్డింగ్ నిర్వహిస్తే వాటిల్లో ఎంపికైన ఆపరేటర్లకు ఆయా రూట్లు కేటాయిస్తారు. ఆ ఆపరేటర్లు మాత్రమే ఆ రూట్లలో మూడేళ్లపాటు విమాన సర్వీసులు నిర్వహిస్తారు. ఈ కాలంలో సీట్ల వారీగా నష్టాలను బేరీజు వేసి.. డిమాండ్ అంచనా–వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉండే గ్యాప్ను కేంద్రం భర్తీ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వేయి ఎకరాలు అవసరం కొత్త విమానాశ్రయానికి వేయి ఎకరాలు కావాలి. నిజాం కాలం నాటి పాత విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాలు ప్రస్తుతం ఏఏఐ అధీనంలోనే ఉన్నాయి. మిగతా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం నిర్మించేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. త్వరలో ఏఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. -
వడోదరలో టాటా- ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్ అసెంబ్లింగ్ ప్లాంట్
-
బెలూగా.. భలేగా..
శంషాబాద్: ఆకాశ తిమింగలంగా పేరొందిన ప్రపంచంలోని అతిపెద్ద అయింది. ఈ నెల 27న ఫ్రాన్స్లోని టూలూజ్ నుంచి థాయ్లాండ్ వెళ్లేందుకు బయలుదేరిన ఈ విమానం 28న ఫ్రాన్స్లోని మార్సెల్లే, 29న ఈజిప్టు రాజధాని కైరో, కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్బస్ బెలూగా (ఏ300–608ఎస్టీ3) మరోసారి భాగ్యనగరాన్ని పలకరించింది. గురువారం అర్ధరాత్రి 12:23 గంటలకు ముచ్చటగా మూడోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ ఒమన్ రాజధాని మస్కట్ మీదుగా ప్రయాణించి ఇంధనం నింపుకోవడంతోపాటు సిబ్బంది విశ్రాంతి కోసం హైదరాబాద్ చేరుకుంది. దాదాపు 15 గంటల హాల్టింగ్ అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు థాయ్లాండ్ బయలుదేరింది. బెలూగా–3 విమానం 2022 డిసెంబర్లో తొలిసారి, 2023 ఆగస్టులో రెండోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైంది.ప్రత్యేకతలు ఇవీ..రష్యన్ భాషలో బెలూగా అంటే తెల్ల తిమింగలం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం విమానాలు కేవలం ఐదే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది. సాధారణ కార్గో విమానాల్లోతరలించలేని భారీ సామగ్రిని ప్రత్యేకించి విమానాల విడిభాగాలు, రక్షణ రంగ పరికరాలను ఈ విమానంలో తరలిస్తారు. దీని పొడవు పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, కార్గో మోసుకెళ్లే సామర్థ్యం 47 టన్నులు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో అరుదైన విమానం
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం(ఆగస్టు29) అర్ధరాత్రి అరుదైన విమానం ల్యాండ్ అయింది. ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన విమానం సైజు భారీగా ఉండటంతో దీనిని వేల్ ఆఫ్ ది స్కైగా పిలుస్తారు. ఇది ఎయిర్బస్కు చెందిన A300-608ST బెలుగా రకం విమానం.ఇంధనం నింపుకోవడంతో పాటు సిబ్బంది విశ్రాంతి కోసం బెలుగా విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. మస్కట్ నుంచి థాయిలాండ్ వెళ్తుండగా మార్గమధ్యలో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఈ లోహవిహంగం వాలింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళుతుందని అధికారులు చెప్పారు. -
ఎయిర్బస్తో టాటా అడ్వాన్స్డ్ జత
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తాజాగా ఎయిర్బస్ హెలికాప్టర్స్తో చేతులు కలిపింది. తద్వారా దేశీయంగా ఒకే ఇంజిన్గల హెచ్125 చోపర్స్ తుది అసెంబ్లీ లైన్(ఎఫ్ఏఎల్) ఏర్పాటుకు తెరతీయనున్నాయి. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో దేశీ వైమానిక రంగానికి భారీస్థాయిలో ప్రోత్సాహం లభించనుంది.ఎఫ్ఏఎల్ ద్వారా దేశీయంగా ప్రయివేట్ రంగంలో తొలిసారి హెలికాప్టర్ అసెంబ్లీ సౌకర్యం ఏర్పాటు కానుంది. వెరసి ఎయిర్బస్ అత్యధికంగా విక్రయిస్తున్న హెచ్125 చోపర్స్ను దేశీ అవసరాలతోపాటు.. ఇరుగుపొరుగు దేశాలకు సరఫరా చేసేందుకు వీలు చిక్కనుంది. ఫార్న్బరో ఇంటర్నేషనల్ ఎయిర్షోలో కాంట్రాక్టుపై సంతకాలు చేసినట్లు రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి.నిజానికి ఎఫ్ఏఎల్ ఏర్పాటుకు ఈ ఏడాది జనవరి 26న ఎయిర్బస్ సీఈవో గిలౌమ ఫారీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తొలిసారి వెల్లడించారు. తొలి మేడిన్ ఇండియా హెచ్125 చోపర్స్ డెలివరీలు 2026లో ప్రారంభంకావచ్చని అంచనా. -
గతి శక్తి విశ్వవిద్యాలయం, ఎయిర్బస్ మధ్య ఒప్పందం.. ఎందుకంటే..
భారత విమానయాన పరిశ్రమను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గతి శక్తి విశ్వవిద్యాలయం (జీఎస్వీ), ఎయిర్బస్ పరస్పరం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. సెప్టెంబర్ 2023లో జరిగిన ఎంఓయూను అనుసరించి ఎయిర్బస్ ఎండీ రెమి మెయిలార్డ్, జీఎస్వీ వైస్ ఛాన్స్లర్ మనోజ్ చౌదరి మధ్య న్యూదిల్లీలోని రైల్ భవన్లో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరించింది.మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం..భారత్లోని విమానయాన పరిశ్రమను విస్తరించేందుకు జీఎస్వీ, ఎయిర్బస్ మద్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా విమాన రంగంలో రాణించాలనుకునే వారికి ఎగ్జిక్యూటివ్ శిక్షణ, నైపుణ్యాలు అందిస్తారు. మొత్తం ప్రోగ్రామ్ వ్యవధిలో 40 మందికి పూర్తి స్కాలర్షిప్తో కూడిన శిక్షణ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘సబ్కా సాథ్ సబ్కా వికాస్.. అనే స్ఫూర్తితో కేంద్రం విమానయానం, హైవేలు, రైల్వేలు, రోడ్డు రవాణాను అభివృద్ధి చేస్తోంది. దానికి అందరి సహకారం అవసరం. అన్ని రవాణా రంగాలను ఏకీకృతం చేసేందుకు ఒక ప్రత్యేక సంస్థ ఉండాలని జీఎస్వీని ఏర్పాటు చేశాం. ఆయా రంగాల్లో తయారీ పరిశ్రమను ప్రోత్సహించేలా అందులో ఎగ్జిక్యూటివ్ శిక్షణ, నైపుణ్యాలు అందిస్తున్నాం. ఇప్పటికే ఇందులో రైల్వే శిక్షణ ఇచ్చాం. విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. అందులో విప్లవాత్మక మార్పులు రావాలి. కాబట్టి ప్రస్తుతం సివిల్ ఏవియేషన్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. తర్వాత షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగంలో శిక్షణ ఇస్తాం. ప్రస్తుతం జరిగే శిక్షణకు ఎయిర్బస్ సహకరిస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్తో ఒప్పందం రద్దు.. రూ.100 కోట్లు ఆదా!ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘పదేళ్ల కాలంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి రెట్టింపయింది. ఉడాన్ పథకం ద్వారా విమాన సర్వీసులు టైర్ II, టైర్ III నగరాలకు విస్తరించాయి. ఈ రంగం పురోగతికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గతి శక్తి విశ్వవిద్యాలయానికి పూర్తిగా సహకరిస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో జయవర్మ సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్బస్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావంఏటీఆర్తోపాటు ఎయిర్బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్లో 30 ఎయిర్బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్ చేసింది. -
లండన్ ఎయిర్పోర్టులో ప్రమాదం.. రెండు విమానాల ఢీ..
లండన్: అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. శనివారం లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో వర్జిన్ అట్లాంటిక్ బోయింగ్ 787 విమానం.. బ్రిటిష్ ఎయిర్వేస్ ఎయిర్బస్ A350 విమానాన్ని అనుకోకుండా ఢీ కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. Just witnessed a plane crash at Heathrow! A tug pushing back a Virgin 787, crashed the wing into a BA A350 #Heathrow #BritishAirways #VirginAtlantic pic.twitter.com/9VmiP6uwQr — Alex Whittles (@PurpleFrogAlex) April 6, 2024 ఈ ప్రమాదం జరిగిన వెంటనే బృందం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నాయి. ఇంజినీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వాటిని సర్వీసు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ విమానం అందించినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. Accident at #heathrow involving a #virginatlantic #boeing787 and a #britishairways #A350 #bigjettv @BigJetTVLIVE pic.twitter.com/Hm5Vh6ehrc — specialise cyclists (@slaytor_roger) April 6, 2024 -
భారత కంపెనీకి విమాన డోర్లు తయారుచేసే కాంట్రాక్ట్
ఎయిర్బస్కు చెందిన ఏ220 విమానాల డోర్లు ఇకపై భారత్లోనే తయారవనున్నాయి. ఈ మేరకు దేశీయ సంస్థ డైనమెటిక్ టెక్నాలజీస్తో ఒప్పందం జరిగినట్లు యూరప్కు చెందిన విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ గురువారం ప్రకటించింది. భారతీయ విమానయాన రంగ తయారీ సంస్థకు దక్కిన అతిపెద్ద ఎగుమతి కాంట్రాక్టుల్లో ఇది కూడా ఒకటని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. విమానాల విడిభాగాల తయారీలో భారత్ కీలకంగా మారుతుందని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ ఏగుమతి చేసే సేవలు, విమాన విడిభాగాల విలువను 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. ప్రస్తుతం ఈ మార్కెట్ 750 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు. ఇదీ చదవండి: లిథియం బ్లాక్ల వేలంలో పాల్గొననున్న ప్రముఖ కంపెనీ? ఈ కాంట్రాక్టులో భాగంగా డైనమెటిక్ టెక్నాలజీస్ ఎయిర్బస్ 220 కార్గో, ప్యాసింజర్ విమానాల డోర్లను తయారీచేయనుంది. అందుకు సంబంధించి సర్వీసింగ్ను అందించనుంది. ఒక్కో విమానానికి 8 డోర్లుంటాయి. ఈ డోర్లతోపాటు వాటికి సంబంధించిన అన్ని విడిభాగాలనూ సంస్థ తయారు చేస్తుంది. ఇప్పటికే ఎయిర్బస్కు చెందిన ఏ330, ఏ320 విమానాల ఫ్లాప్ ట్రాక్ బీమ్లనూ ఈ సంస్థే తయారు చేస్తుండటం విశేషం. అలాగే ఏ220 విమానాల్లో కాక్పీట్ ఎస్కేప్ హ్యాచ్ డోర్లనూ ఉత్పత్తి చేస్తోంది. -
ఇక మేడిన్ ఇండియా హెలికాప్టర్లు!
ముంబై: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజ గ్రూప్ టాటాతో ఎయిర్బస్ హెలికాప్టర్స్ చేతులు కలిపింది. ఇరు సంస్థలు దేశీయంగా హెలికాప్టర్స్ తయారీకి భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నాయి. టాటా గ్రూప్తో జత కట్టడం ద్వారా హెలికాప్టర్స్ తయారీలో తుది అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్) యూనిట్ను నెలకొల్పనున్నట్లు ఎయిర్బస్ హెలికాప్టర్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ప్లాంటు ద్వారా పౌర విమాన శ్రేణిలో దేశీయంగా ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. వీటిలో కొన్నింటిని పొరుగు దేశాలకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా హెలికాప్టర్ తయారీకి ప్రైవేట్ రంగంలో తొలి ఎఫ్ఏఎల్ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఇది భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమానికి భారీస్థాయిలో ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించింది. డెలివరీలవరకూ.. భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్బస్ హెలికాప్టర్స్తో కలసి టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) ఎఫ్ఏఎల్ను ఏర్పాటు చేయనుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మేక్రన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఎయిర్బస్ హెలికాప్టర్ తాజా ప్రకటన జారీ చేసింది. గణతంత్ర దినోత్సవాలలో ప్రధాన అతిథిగా పాల్గొనేందుకు మేక్రన్ భారత్కు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రధాన విడిభాగాల అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ నియంత్రణల ఇన్స్టలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్లు, విమాన కంట్రోళ్లు, ఇంధన వ్యవస్థతోపాటు ఇంజిన్ కూర్పు తదితరాలను జేవీ నిర్వహించనున్నట్లు ఎయిర్బస్ హెలికాప్టర్స్ వివరించింది. అంతేకాకుండా భారత్ తదితర ప్రాంతాలలో హెచ్125ల టెస్టింగ్, క్వాలిఫికేషన్తో సహా.. డెలివరీలను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. 24 నెలల్లోగా ఎఫ్ఏఎల్ ఏర్పాటవుతుందని, 2026లో దేశీయంగా తయారైన తొలి (మేడిన్ ఇండియా) హెచ్125ల డెలివరీ చేసే వీలున్నట్లు అంచనా వేసింది. తయారీ యూనిట్ ఏర్పాటుచేసే ప్రాంతాన్ని సంయుక్తంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. కీలక పాత్ర... జాతి నిర్మాణంలో హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని ఎయిర్బస్ సీఈవో గిలామ్ ఫారీ పేర్కొన్నారు. నవ భారత సామర్థ్యాలపై గల నమ్మకానికి మేడిన్ ఇండియా పౌర హెలికాప్టర్ ప్రతీకగా ఉంటుందని అభివర్ణించారు. తద్వారా దేశీయంగా హెలికాప్టర్ మార్కెట్కున్న భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ప్రయివేట్ రంగంలో తొలి హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటుకు సంతోషిస్తున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తుది అసెంబ్లీ లైన్ ద్వారా ప్రపంచంలోనే ఎయిర్ బస్కు చెందిన అత్యుత్తమ హెచ్125 సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ను భారత్తోపాటు, ఇతర మార్కెట్లకు కూడా అందించనున్నట్లు తెలియజేశారు. -
భారత్లో ఫ్రాన్స్ ప్రధాని..టాటా - ఎయిర్ బస్ల మధ్య కీలక ఒప్పందం
దేశంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైతం హాజరయ్యారు. ఈ తరుణంలో భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు ఊపందుకున్నాయి. దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా - ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ల మధ్యం ఒప్పందం జరిగింది. ఈ రెండు సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో హెచ్ 125 హెలికాప్టర్లను తయారు చేసేందుకు సిద్ధమయ్యాయి. అందుకు సంబంధించిన ఒప్పందాలు సైతం చివరి దశకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య పలు ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏ320, ఏ350 వంటి కమర్షియల్ జెట్ల కోసం ఎయిర్బస్కు విడిభాగాలను తయారు చేయడానికి, సరఫరా చేస్తున్నట్లు ప్రకటించింది. అదనంగా భారత వైమానిక దళం కోసం టాటా, ఎయిర్బస్లు సీ295 సైనిక రవాణా విమానాన్ని తయారు చేయనున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఎగిరిన కొత్త ఫ్లైట్.. దేశంలోనే తొలిసారి!
దేశంలో కొత్త ఫ్లైట్ ఎగిరింది. తొలిసారిగా ఎయిర్బస్ A350-900 వాణిజ్య విమానాన్ని ఎయిర్ ఇండియా బెంగళూరు, ముంబైల మధ్య ప్రారంభించింది. అలాగే ప్రత్యేకమైన యూనిఫాంను సైతం ఈ సందర్భంగా ఆవిష్కరించింది. AI 589 ఫ్లైట్ నంబర్తో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిర్దేశిత సమయానికి బయలుదేరిన ఎయిర్బస్ A350-900.. కొత్త అనుభూతిని ఆస్వాదించేందుకు సిద్ధమైన ప్రయాణికులను గమ్యస్థానానికి తీసుకెళ్లింది. మంగళవారం మినహా ప్రతిరోజు ఈ విమాన సర్వీస్ను నడపనున్నారు. రోజూ ఉదయం 7.05 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 8.50 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. సిబ్బందికి అలవాటు కావడానికి, అలాగే రెగ్యులేటరీ సమ్మతి కోసం తొలుత దేశీయ మార్గాల్లోనే ఈ విమానాన్ని నడపనున్నారు. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఎయిర్బస్ A350 విమానంలోని అత్యాధునిక సౌకర్యాలను ఆస్వాదించే అవకాశం కలగనుంది. తదుపరి దశలో అంతర్జాతీయ సర్వీసుల్లో వీటిని నడుపుతారు. సౌకర్యాలివే.. ఎయిర్బస్ A350లో ఉన్న ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ (IFE) సిస్టమ్, ప్రత్యేకమైన సౌకర్యాలను హైదరాబాద్లో ఇటీవల జరిగిన వింగ్స్ ఇండియా గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్లో ప్రదర్శించారు. త్రీ-క్లాస్ క్యాబిన్ లేఅవుట్తో కాన్ఫిగర్ చేసిన A350లో 316 సీట్లు ఉన్నాయి. ఇందులో 28 ప్రైవేట్ బిజినెస్ సూట్లు, 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, 264 విశాలమైన ఎకానమీ సీట్లు ఉన్నాయి. అన్ని సీట్లు లేటెస్ట్ జనరేషన్ పానాసోనిక్ eX3 ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, హెచ్డీ స్క్రీన్లతో అమర్చబడి ఉంటాయి. రోల్స్ రాయిస్ ట్రెంట్ ఎక్స్డబ్ల్యూబీ ఇంజన్ల ద్వారా ఆధారితమైన ఈ విమాన ఇంధన సామర్థ్యం, ఇతర విమానాలతో పోల్చితే 20 శాతం మెరుగ్గా ఉంటుంది. ఇంధన ఉద్గారాలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది. -
WINGS INDIA 2024: 20 ఏళ్లలో 2,840 విమానాలు కావాలి
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఏవియేషన్ రంగానికి భారత్ దన్నుగా నిలుస్తుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ ఇండియా ప్రెసిడెంట్ రెమి మిలార్డ్ తెలిపారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్కు వచ్చే 20 ఏళ్లలో 2,840 కొత్త విమానాలు అవసరమన్నారు. అలాగే 41,000 మంది పైలట్లు, 47,000 మంది టెక్నికల్ సిబ్బంది కావాల్సి ఉంటుందని గురువారం వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంలో ఆయన చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందతున్న దేశంగా భారత్ నిలుస్తుందని అంచనాలు ఉన్నట్లు రెమీ తెలిపారు. భారత్ నుంచి రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు రెమీ వివరించారు. ప్రస్తుతం 750 మిలియన్ డాలర్లుగా ఉన్న సోర్సింగ్ను ఈ దశాబ్దం చివరికి 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. భారత్ నుంచి గతేడాది 750 విమానాలకు ఆర్డర్లు రాగా 75 ఎయిర్క్రాఫ్ట్లను దేశీ విమానయాన సంస్థలకు డెలివరీ చేసినట్లు వివరించారు. వీటిలో 41 విమానాలు ఇండిగో సంస్థకు, ఎయిరిండియాకు 19, విస్తారాకు 14, గో ఫస్ట్కు ఒకటి చొప్పున అందించినట్లు రెమీ చెప్పారు. తమ ఏ350 రకం విమానాలు భారత్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఊతమివ్వగలవని పేర్కొన్నారు. గతేడాది ఎయిరిండియాకు ఆరు ఏ350 విమానాలను అందించినట్లు చెప్పారు. భారత్లో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవరాలింగ్ వ్యవస్థ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా హైలైట్స్ ► హెరిటేజ్ ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్ చార్టర్ కంపెనీ హెరిటేజ్ ఏవియేషన్ తాజాగా హెచ్125, హెచ్130 హెలికాప్టర్ల కోసం ఎయిర్బస్కు ఆర్డరు ఇచి్చంది. వీటిని ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్ కింద సరీ్వసుల కోసం ఉపయోగించనున్నట్లు సంస్థ సీఈవో రోహిత్ మాథుర్ తెలిపారు. ఎత్తైన, వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణాల్లో ప్రయాణాలకు హెచ్125 హెలికాప్టర్ ఉపయోగపడుతుంది. ఇక సైట్ సీయింగ్, అత్యవసర వైద్య సరీ్వసులు మొదలైన వాటి కోసం హెచ్130 సహాయకరంగా ఉంటుంది. ► ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్తో పైలట్లకు శిక్షణ. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్తో పైలట్లకు శిక్షణ. జీఎంఆర్ ఏరో జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏవియేషన్ స్కూల్ వర్చువల్గా ప్రారంభం. టీఏఎస్ఎల్ విడిభాగాల తయారీకై మహీంద్రా ఏరోస్పేస్తో కలిసి ఎయిర్బస్ నుంచి ఆర్డర్లను పొందింది. -
Wings India 2024: బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ (ఫొటోలు)
-
ఎయిర్ఇండియా బాహుబలి!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వాకిట్లోకి మరో కొత్త విమానం వచ్చి చేరింది. అతిపెద్ద బాడీ కలిగిన ఏ350-900 సర్వీస్ శనివారం ఎయిర్ ఇండియాతో జతైంది. యూరప్కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ రూపొందించిన ఈ సర్వీసు దిల్లీలోని ఇందీరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి వైడ్బాడీ విమాన సర్వీసును నిర్వహిస్తున్న సంస్థల్లో ఎయిర్ ఇండియానే మొదటిది కావడం విశేషం. దీంతోపాటు వచ్చే మార్చిలోగా మరో 5 విమానాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. మొత్తం 20 ఏ350-900 సర్వీసులను ఆర్డర్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఎయిర్ ఇండియా 40 ఏ350ఎస్ విమానాలు, 40 ఏ350-900, ఏ350-1000 ఎయిర్క్రాఫ్ట్లతోపాటు 140 చిన్న సైజు ఏ321, 70 ఏ320 నియో విమానాలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా A350-900 విమానం కాన్ఫిగరేషన్లు.. క్యాబిన్లో మెరుగైన సౌలభ్యం కోసం ఫ్లాట్ బెడ్లతో 28 ప్రైవేట్ బిజినెస్ క్లాస్ సూట్లు ఉన్నాయి. అదనంగా 24 ప్రీమియం ఎకానమీ సీట్లు ఉన్నాయి. క్యాబిన్లో 264 ఎకానమీ క్లాస్ సీట్లున్నాయి. అన్ని తరగతుల్లో హైడెఫినిషన్ స్క్రీన్లు అందుబాటులో ఉంచారు. సుమారు ఇందులో 320 మంది ప్రయాణించవచ్చు. క్రూ సిబ్బంది ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇటీవల రూపొందించిన కొత్త యూనిఫామ్లో కనిపించనున్నారు. ఎయిర్ ఇండియా A350 జనవరి 2024లో వాణిజ్య సేవలను ప్రారంభించనుంది. ప్రాథమికంగా ఈ సర్వీస్ కొన్నిరోజులు దేశీయంగా సేవలందిస్తుందని సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత విదేశాల్లోని ఇతర ప్రాంతాలకు దీని సేవలను విస్తరించనున్నారు. ఏటా వెయ్యి కోట్లు ఆదా భారతీయ వైమానిక దళం అధీనంలో ఉన్న గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానయాన సంస్థలకు ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆదా కానున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయంగా వినియోగిస్తున్న గగనతలంలో 30 శాతం వైమానిక దళం అధీనంలో ఉంది. ఈ గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానం నడిచే సమయం తగ్గనుందని, చమురు వినిమయం, ఉద్గారాలు మరింత తగ్గుతాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నెల 18 నాటికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) 1,562 మంది కమర్షియల్ పైలెట్లకు లైసెన్స్లు జారీ చేసింది. వైమానిక దళం వినియోగిస్తున్న ఏరోస్పేస్లో 40 శాతం వృథాగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: వారాంతపు సెలవులపై అభిప్రాయం మార్చుకున్న బిల్గేట్స్ -
వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత
క్రిస్మస్ సందర్భంగా ఓ విమానయాన సంస్థ తమ ఉద్యోగులను ఖుషీ చేయాలని నిర్ణయించింది. ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ అట్లాంటిక్ కంపెనీ తవ వద్ద పనిచేసే వారికి పసందైన విందు ఇవ్వాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగానే గ్రాండ్గా డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే క్రిస్మిస్ డిన్నర్ ప్లాన్ బెడిసి కొట్టింది. భోజనం చేసిన ఉద్యోగుల్లో దాదాపు 700 మందికి అస్వస్థతకు గురయ్యారు. డిన్నర్ చేసిన తర్వాత ఉద్యోగులు.. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే డిన్నర్కు ఇచ్చిన మెనూలో ఏయే వంటకాలు ఉన్నాయన్న విషయం తెలియరాలేదు. అంతేగాక భారీ సంఖ్యలో ఉద్యోగుల అనారోగ్యానికి గురవడం వెనక ఉన్న నిర్ధిష్ట కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎయిర్బస్ సంస్థ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రపంచంలోని అతిపెద్ద విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్కు చెందిన అనుబంధ సంస్థే ఎయిర్బస్ అట్లాంటిక్. ఆ సంస్థ కింద అయిదు దేశాల్లో సుమారు 15,000 మంది పనిచేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్కు సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు ఏఆర్తెఎస్లి ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎయిర్బస్ సంస్థలో సుమారు లక్షా 34 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్, డిఫెన్స్, స్పేస్, సెక్యూరిటీ పరిశ్రమలు ఆ కంపెనీ పరిధిలో ఉన్నాయి. చదవండి: విమానం కంటే స్పీడ్గా వెళ్లే రైలు.. కథ కంచికే.. -
భారత్లో విమానాల సర్వీసింగ్.. హాల్తో ఎయిర్బస్ జట్టు!
యూరోపియన్ మల్టీనేషనల్ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ భారత్లో వాణిజ్య విమానాల సర్వీసింగ్లోకి ప్రవేశిస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) భాగస్వామ్యంతో దేశంలో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ , మరమ్మతులు, నవీకరణ (ఎంఆర్ఓ) పరిశ్రమను బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య విమానాలు, ముఖ్యంగా విమాన ప్రయాణాన్ని సరళతరం చేసిన A320 రకానికి చెందిన విమానాల కోసం ఎంఆర్ఓ సేవల డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సేవలందించేందుకు ఎయిర్బస్ ఈ భాగస్వామ్యం ద్వారా హాల్కు మద్దతు ఇస్తుంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ దేశంలో ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ హబ్ని స్థాపించి, విమానయాన సంస్థలకు సమర్థవంతమైన సేవలలు అందించాలనే దృక్పథంతో ఉందని, హాల్ నాసిక్ కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా మిషన్కు అనుగుణంగా ఉంటుందని హాల్ సీఈవో (MiG కాంప్లెక్స్) సాకేత్ చతుర్వేది పేర్కొన్నారు. భారతదేశంలో విమానయాన వ్యవస్థ బలోపేతానికి, అందుకు అత్యంత ఆవశ్యకమైన ఎంఆర్ఓ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎయిర్బస్ కట్టుబడి ఉందని ఎయిర్బస్ ఇండియా అండ్ దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఎయిర్బస్ A320 ఫ్యామిలీ టూల్ ప్యాకేజీని, ఎంఆర్ఓని సెటప్ చేయడానికి ప్రత్యేక కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. దీంతోపాటు ఎయిర్బస్ సపోర్ట్, టెక్నికల్ డేటాతోపాటు ట్రైనింగ్ సొల్యూషన్స్ అందించే డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన ‘ఎయిర్బస్ వరల్డ్’కి యాక్సెస్ను కూడా అందిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదించిన మూడు హ్యాంగర్లు, నైపుణ్యం కలిగిన మానవవనరులతో కూడిన పౌర విమాన ఎంఆర్ఓ సదుపాయాలు ఇప్పటికే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ నాసిక్ విభాగంలో ఉన్నాయి. -
గుడ్ న్యూస్: ఎయిర్బస్లో భారీగా ఉద్యోగాలు
గ్లోబల్ ఏరోస్పేస్ మేజర్ ఎయిర్బస్ (Airbus) వచ్చే రెండేళ్లలో భారత్ నుంచి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోవాలని చూస్తోంది. తద్వారా సంస్థలో భారతీయ ఇంజనీర్ల మొత్తం సంఖ్యను 5,000కి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎయిర్బస్ ఇండియా ప్రెసిడెంట్, దక్షిణాసియా ఎండీ రెమి మెయిలార్డ్ మాట్లాడుతూ.. తాము భారత్ను కేవలం మార్కెట్గా మాత్రమే కాకుండా టాలెంట్ హబ్గా చూస్తున్నామన్నారు. కొత్త ఇంజనీరింగ్ కోర్సు ఎయిర్బస్.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో వడోదరలోని గతి శక్తి విశ్వవిద్యాలయ (GSV)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏరోస్పేస్ రంగంలో కొత్త ఇంజనీరింగ్ కోర్సును ప్రారంభించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. గతి శక్తి విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ను అభివృద్ధి చేస్తామని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ రంగానికి సేవలందించేందుకు భవిష్యత్తులో సిద్ధంగా ఉంటుందని మెయిలార్డ్ తెలిపారు. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్.. ) ఎయిర్బస్ సంస్థలోని డిజైన్, డిజిటల్ కేంద్రాలలో ఇప్పిటికే 3,000 మందికిపైగా భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారని, 2025 నాటికి ఈ సంఖ్యను 5,000లకు పైగా పెంచుతామని మెయిలార్డ్ వివరించారు. భారత్ శక్తిసామర్థ్యాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక మొదటి మేక్-ఇన్-ఇండియా C295 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ను 2026 సెప్టెంబర్లో డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. -
వారెవ్వా.. శంషాబాద్ రన్వేపై బెలుగా ఎయిర్బస్.. అదిరిపోయిందిగా! (ఫొటోలు)
-
ఏవియేషన్ చరిత్రలో అదిపెద్ద డీల్.. 500 విమానాలకు ఇండిగో ఆర్డర్
ఏవియేషన్ చరిత్రలో అతి పెద్ద డీల్ జరిగింది. దేశీయ ఏయిర్లైన్స్ దిగ్గజం ఇండిగో ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ నుంచి 500 విమానాల్ని కొనుగోలు చేసేలా ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పటికే టాటాలకు చెందిన ఎయిరిండియా ఎయిర్బస్, బోయింగ్ నుంచి 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. ఆ ఒప్పందం కంటే ఇండిగో - ఎయిర్ బస్ల మధ్య జరిగిన డీల్ దేశీయ విమాన చరిత్రలో ఇదే పెద్దదని పరిశ్రమ వర్గాల విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 19న ప్యారిస్ ఎయిర్ షోలో ఇండిగో - ఎయిర్బస్ల మధ్య కొనుగోలు చర్చలు జరిగాయి. ఈచర్చల్లో సందర్భంగా ఇండిగో బోర్డ్ఆఫ్ చైర్మన్ వి.సుమత్రాన్, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, ఎయిర్బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ, అంతర్జాతీయ చీఫ్ కమర్షియల్ అధికారి క్రిస్టియన్ షెరర్లు పాల్గొన్నారు. అనంతరం, దేశ ఏవియేషన్ హిస్టరీలోనే భారీ కొనుగోలు ఒప్పందం జరిగింది. 500 ఏ320 ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టినట్లు ఇండిగో తెలిపింది. తాజా ఇండిగో చేసిన ఆర్డర్తో ఎయిర్బస్ డెలివరీ చేయాల్సిన విమానాల సంఖ్య 1,330కి చేరింది. కాగా, ప్రస్తుతం ఇండిగో 300 విమానాలను నడుపుతోంది. ఇది వరకే 480 విమానాలకు ఆర్డర్ పెట్టింది. ఇవి డెలివరీ అవ్వాల్సి ఉంది. -
డ్రోన్ పైలట్ అవుతారా? శిక్షణ కోర్సులు అందించనున్న ఎయిర్బస్
ముంబై: యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్బస్ భారత్లో డ్రోన్ పైలట్ల శిక్షణ కోర్సులను అందించనున్నట్లు వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం పొందిన ఈ సర్టిఫికెట్ కోర్సులు అయిదు రోజుల పాటు ఉంటాయి. సూక్ష్మ, చిన్న కేటగిరీ డ్రోన్ల కోసం ఉద్దేశించిన కోర్సులు బెంగళూరులోని ఎయిర్బస్ ట్రైనింగ్ సెంటర్లో జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. డ్రోన్ల నిబంధనలు, ఫ్లయిట్ ప్రాథమిక సూత్రాలు, నిర్వహణ మొదలైన వాటిపై డీజీసీఏ ఆమోదించిన ఇన్స్ట్రక్టర్లు శిక్షణనిస్తారని పేర్కొంది. సిమ్యులేటర్ శిక్షణతో పాటు ప్రాక్టికల్ ఫ్లయింగ్ పాఠాలు కూడా ఉంటాయని వివరించింది. 10వ తరగతి పూర్తి చేసిన, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్పోర్ ఉండాలి. అలాగే శిక్షణ పొందేందుకు, డ్రోన్లను ఆపరేట్ చేయడానికి ఫిట్నెస్ను ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Palm Payment: ఇదేదో బాగుందే.. వట్టి చేతులు చాలు! పేమెంట్ ఈజీ -
ఒకేసారి అన్ని విమానాలు కొంటుందా? ఇండిగో భారీ డీల్..
దేశీయ దిగ్గజ ఏవియేషన్ సంస్థలు భారీ ఎత్తున విమానాల కొనుగోళ్లకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎయిరిండియా కోసం టాటా సన్స్ 500 విమానాల్ని కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా ఇండిగో సైతం బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల 500 అంతకంటే ఎక్కువ విమానాల కోసం ఆర్డర్ ఇవ్వనున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ప్రస్తుతం విమానాల కొనుగోళ్ల నేపథ్యంలో విమానాల తయారీ సంస్థలతో ఇండిగో చర్చలు జరుపుతుందని, ఆ చర్చలు సఫలమైతే ఎయిరిండియా తర్వాత మరో అతిపెద్ద ఒప్పొందం అవుతుందని రాయిటర్స్ తెలిపింది. బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో గత నెలలో న్యారో బాడీ ప్లైట్ల కోసం ఎయిర్ బస్, ఫ్రెంచ్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని, ఆ చర్చలు కొలిక్కి రావడంతో వందల విమానాల కొనుగోలుకు సిద్ధపడినట్లు రాయిటర్స్ రిపోర్ట్ హైలెట్ చేసింది. ఇక మరో పదేళ్లలో ఇండిగో సంస్థ మిడ్ సైజ్ వైడ్ బాడీ జెట్స్ విమానాల సంఖ్యను పెంచే ప్రణాళికల్లో ఉండగా అందుకు అనుగుణంగా విమానాల ఆర్డర్ ఉండనుంది ఇప్పటికే ఎయిరిండియా ఎయిరిండియా బ్రాండ్కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేందుకు మాతృ సంస్థ టాటా సన్స్ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకునేలా 100 బిలియన్ డాలర్లతో 500 విమానాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా విమాన తయారీ సంస్థలు ఈ 500 ఎయిర్ క్రాప్ట్లను 8 ఏళ్లలో డెలివరీ చేయనున్నట్లు రాయిటర్స్ కథనం వెలువరించింది. -
ఎయిరిండియా మెగా డీల్: భారీ ఉద్యోగాలు, సీఈవో కీలక ప్రకటన
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు సొంతమైన ఎయిరిండియా దూసుకుపోతోంది. ముఖ్యంగా విమానాల కొనగోలులో రికార్డ్ సృష్టిస్తోంది. బోయింగ్, ఎయిర్బస్తో మెగా డీల్గా ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ సోమవారం మాట్లాడారు.సంస్థ వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని వారాల తర్వాత, విల్సన్, ఈ డీల్ ప్రాముఖ్యత, భవిష్యత్తు మార్కెట్ వ్యూహంఅభివృద్ధిలో దాని పాత్ర గురించి వివరాలను బిజినెస్ టుడేతో పంచుకున్నారు. ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా దేశం ఆవిష్కారమయ్యే క్రమంలో విమానయాన చరిత్రలో ఇదొక గొప్ప పరిణామమని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 470 విమానాల కొనుగోలు డీల్ విలువ 70 బిలియన్లని సీఈవో తెలిపారు. ఈ సంవత్సరం చివరి నుండి దశాబ్దం చివరి వరకు విమానాల సేవలను ప్రారంభిస్తామని, కొత్త విమానాల ఫ్లీట్, పవర్ ముఖ్యమైన నెట్వర్క్ , సామర్థ్య విస్తరణ రెండింటినీ మార్చడానికి చారిత్రాత్మక మెగా డీల్కు కట్టుబడి ఉన్నామన్నారు. 5వేల పైలట్లు, ప్రతి నెలా 500మంది క్యాబిన్ ఈ నెల ప్రారంభంలో, విమానయాన సంస్థ తన విమానాలకు 470 విమానాలను చేర్చుకోనున్నట్లు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీని ప్రకారం ఈ 470 విమానాల్లో 220 విమానాలను బోయింగ్ నుంచి, 250 విమానాలను ఎయిర్బస్ నుంచి కొనుగోలు చేయనుంది. అలాగే గత వారం, విమానయాన సంస్థ 5వేల పైలట్లు , క్యాబిన్ సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. నెలకు 100మంది పైలట్లు, 500 మంది క్యాబిన్ సిబ్బంది,ఇతర గ్రౌండ్ స్టాఫ్ను చేర్చుకుంటున్నామని ఆయన తెలిపారు. నాన్ఫ్లైయింగ్ పొజిషన్లతో సహా 1,500 మందికి పైగా సంస్థలో చేరారని విల్సన్ చెప్పారు. ఎయిరిండియా- విస్తారా విలీనం ఎయిరిండియా, విస్తారా విలీనం మొదటి దశలో ఉందని కూడా సీఈవో ప్రకటించారు. తదుపరి దశ విలీనానికి డీజీసీఏ, సీసీఐ ఆమోదం తెలిపాల్సి ఉందన నారు. తక్కువ ధరల్లో సంపూర్ణమైన సేవలు అందించాలని టాటా గ్రూప్ లక్క్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూచర్ ప్లాన్స్పై సీఈవో కీలక ప్రకటన ♦ 470 నారో, వైడ్బాడీ ఎయిర్బస్, బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ మెగా-డీల్తో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లో విమాన ప్రయాణసేవల్ని, వస్తువుల రవాణా రూపురేఖలను పూర్తి మారిపోనున్నాయి. ♦ ప్రపంచంలోని ప్రముఖ విమానాల తయారీదారుల నుండి మరో 370 విమానాలను కొనుగోలు చేసి, ఆర్డర్ పరిమాణాన్ని 840 ఎయిర్క్రాఫ్ట్లకు తీసుకువెళ్లే అవకాశాన్ని ఎయిరిండియా పరిశీలిస్తోంది. ♦ 2025 మధ్యకాలం నుండి పదేళ్లలో గణనీయమైన సంఖ్యలో డెలివరీలు షురూ చేయాలని ప్లాన్. ♦ఎయిరిండియా గ్రూప్ క్యారియర్లు ఎయిరిండియాఎక్స్ప్రెస్ ఏకీకరణ తర్వాత అత్యంత సమన్వయంతో కూడిన కార్యకలాపాలు. ♦ విమానయాన సంస్థ అంతర్జాతీయ , దేశీయ రూట్ నెట్వర్క్ రెండింటినీ పెంచడంపై సమానంగా దృష్టి ♦ మూడు ప్రధాన కేంద్రాల ఏర్పాటు వీటిలో దక్షిణ భారతదేశంలో ఒకటి ♦పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్పెషలిస్ట్ల కోసం శిక్షణ సౌకర్యాల ఏర్పాటు, అలాగే భవిష్యత్తుకార్యకలాపాలు,సేవల నిమిత్తం నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర (MRO) సామర్థ్యాల నిర్మాణం -
మెగా డీల్ జోష్: ఎయిరిండియాలో ఉద్యోగాలు, పైలట్కు జీతం ఎంతంటే?
సాక్షి,ముంబై: టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఎయిర్బస్, బోయింగ్ 470 విమానాలు కోనుగోలు తరువాత 2 లక్షలకు పైగ ఉద్యోగావకాశాలు లభించ నున్నాయంటూ ఇప్పటికే పలువురు నిపుణులు అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియాలో నియామకాల జోష్ కని పిస్తోంది. కంపెనీ వెబ్సైట్లోని ఓపెనింగ్స్ ప్రకటన మేరకు పైలట్లకు ఏడాదికి రూ.2 కోట్ల వరకు చెల్లించనుంది. బోయింగ్, ఎయిర్బస్ విమానలు డెలివరీకి సిద్ధంగాఉన్న నేపథ్యంలో నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఎయిరిండియాలో ఎయిర్లైన్ 'B777 కెప్టెన్ల' కోసం వెతుకుతోందని, వీరికి సంవత్సరానికి రూ. 2 కోట్లకు పైగా చెల్లించనుందని బిజినెస్ టుడే నివేదించింది. "B737 NG/MAX రకం రేటింగ్ ఉన్న పైలట్ల నుండి B777 ఫ్లీట్ కోసం ఫస్ట్ ఆఫీసర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎయిరిండియా వెబ్సైట్లో పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులకు నెలవారీగా 21 వేల డాలర్లు వేతనం. అంటే వార్షిక ప్రాతిపదికన, రూ.2,08,69,416 పైమాటే. దీంతోపాటు క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సహా అనేక ఓపెనింగ్లను ప్రకటించింది. నిపుణులైన పైలట్లు లేకపోవడం వల్ల ఈ పాత్ర చాలా ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తోంది. ఎయిర్లైన్ కన్సల్టింగ్ సంస్థ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ వాదించారు. ప్రపంచవ్యాప్తంగా పైలట్ కొరత ఉందనీ, నిర్దిష్ట విమానంలో కనీసం 5000 నుండి 7000 గంటల పాటు క్వాలిఫైడ్ పైలట్లకు చాలా డిమాండ్ ఉందన్నారు. ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ అభిప్రాయం ప్రకారం ప్రతి విమానానికి కనీసం 10 మంది పైలట్లు అవసరం, వారి షిఫ్ట్ మారుతూ ఉంటుంది కాబట్టి. అలాగే ప్రతి విమానానికి 50 కంటే తక్కువ క్యాబిన్ సిబ్బంది అవసరం. వీరితోపాటు చెక్అవుట్ కౌంటర్లో, బ్యాగేజీ హ్యాండ్లర్లు, మెయింటెనెన్స్ ఇంజనీర్లు మొదలైన సిబ్బంది కూడా అవసరమే. -
ఎయిరిండియా బాటలో ఇతర విమానయాన సంస్థలు!
దేశంలో ఏవియేషన్ సంస్థలు భారీ ఎత్తున విమానాల కొనుగోళ్లకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో ప్రతి ఎయిర్లైన్ కంపెనీ రాబోయే పదేళ్లలోపు కొత్త విమానాలు కొనబోతున్నదని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా (సీఏపీఏ ఇండియా) తెలిపింది. ఇటీవల టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బోయింగ్ నుండి 220 విమానాలను, ఎయిర్బస్ నుండి 250 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. పోటాపోటీగా ఇతర విమానయాన సంస్థలు రెండేళ్లలో మరో 1,200 విమానాలను ఆర్డర్ చేయబోతున్నాయి. ఎయిరిండియా తర్వాత.. ఇండిగో 300 విమానాలు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇండిగో సంస్థ గతంలోనే విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కానీ కోవిడ్ వల్ల అది సాధ్యపడలేదు. మళ్లీ ఇప్పుడు ఆర్ధిక మాద్యం, సప్లై చెయిన్ సమస్యలు లేకపోతే భారీగా విమానాలు కొనుగోలు చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2022 డిసెంబర్ 31 నాటికి ఎయిర్బస్, బోయింగ్లు కలిపి 12,669 ఆర్డర్లను డెలివరీ చేయాల్సి ఉంది కానీ ఇప్పటికీ సాధ్యం కాలేదు. డెలివరీ స్లాట్ల కోసం కనీసం రెండేళ్ళ వరకు ఆగాలని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సింగపూర్ ఎయిర్లైన్స్(ఎస్ఐఏ)కు చెందిన అనుబంధ సంస్ధ స్కూట్ తొమ్మిది ఎంబ్రాయర్ 190-ఈ2 ఎయిర్ క్రాఫ్ట్లు, కొనుగోలు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) చేసుకుంది. -
IndiGo:ఎయిర్బస్ నుంచి 500 విమానాలు ఆర్డర్
సాక్షి,ముంబై: ఎయిరిండియా మెగా డీల్ తరువాత దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వేగం పెంచింది. ఐరోపాలో తన పరిధిని విస్తరించేందుకు టర్కిష్ ఎయిర్లైన్స్తో తన భాగస్వామ్యాన్ని శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం యూరోపియన్ దిగ్గజం ఎయిర్బస్ నుండి ఇప్పటికే ఆర్డర్ చేసిన 500 అదనపు విమానాలను అందుకోనున్నట్లు ఎయిర్లైన్ తెలిపింది. ఇండిగో ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ఇండియానుంచి ఇస్తాంబుల్ ,ఐరోపాకు ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడంలో తమ తాజా కొనుగోలు సాయపడుతుందని చెప్పారు. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,800 విమానాలను నడుపుతోందని, వాటిలో 10 శాతం అంతర్జాతీయ రూట్లలో నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.టర్కిష్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యం ఇది మునుపెన్నడూ లేని విధంగా యూరప్లోకి చొచ్చుకుపోనున్నట్టు మల్హోత్రా అన్నారు. భారతదేశం లోపల లేదా విదేశాలకు వెళ్లాలని ఆకాంక్షించే ప్రయాణికులకు భారీ అవకాశం ఉంది. ప్రస్తుతం పాస్పోర్ట్ ఉన్నవారు దాదాపు 7.3 శాతం అంటే 100 మిలియన్ల కంటే తక్కువ మంది ఉన్నారు. భారతీయ ప్రజలు పాస్పోర్ట్ను పొందుతున్నందున వారు చేయాలనుకుంటున్న మొదటి పని విదేశాలకు విమానంలో ప్రయాణించడమే. ఈ నేపథ్యంలోవారి ఆకాంక్షల్ని తీర్చేందుకు సరియైన సమయమని భావిస్తున్నామన్నారు. -
ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు
సాక్షి,ముంబై: ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా భావిస్తున్న టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా మెగా డీల్ భారీ ఉద్యోగాల కల్పనకు దారి తీయనుంది. ఇటీవల బోయింగ్, ఎయిర్బస్ మధ్య తాజా మెగా ఒప్పందం భారతదేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 140 విమానాల సముదాయాన్ని కలిగి ఉన్న ఎయిరిండియా, బోయింగ్ ఎయిర్బస్ నుంచి భారగా విమానాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాలు నడిపేందుకు, క్రూ, ఇతర ప్రత్యక్ష పరోక్ష సిబ్బంది అవసరం కాబట్టి భవిష్యత్తులో భారీగా ఉద్యోగాల కల్పిను అవకాశం లభిస్తుందని అంచనా.నారో బాడీ ఎయిర్క్రాఫ్ట్ కోసం మొత్తం ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు దాదాపు 400. వైడ్ బాడీ ప్లేన్ కోసం, 600-700మంది అవసరమంని తెలుస్తోంది. "డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో నేరుగా విమానయాన సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్న వారు ఉంటారు, ఉదాహరణకు, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్నికల్, నాన్-టెక్నికల్ సిబ్బంది. ఇది నారో బాడీ విమానానికి దాదాపు 175. ఇంకా విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ట్రావెల్ సేల్స్ ఏజెన్సీ, సర్వీస్ ప్రొవైడర్లు ఇవన్నీ కలిసి విమానానికి 400 ఉద్యోగులు అవసమరని ఏవియేషన్ రంగ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ బిజినెస్ టుడేతో చెప్పారు. ఈ విధంగా మొత్తంగా లెక్కిస్తే దాదాపు 2 లక్షల నుంచి 2 లక్షల 9వేల వరకు ఉంటాయని ఉద్యోగాలొస్తాయని ఆయన చెప్పారు. దీనికి తోడు ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేందర్ భార్గవ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా ఉద్యోగాలొస్తాయని అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఈ బిల్పై స్పందించారు. ఇది చారిత్రాత్మక ఒప్పందమనీ, అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని కొనియాడారు. అంతేకాదు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించారు, ఎందుకంటే ఇది వారికి కీలకమైనది. -
ఎయిరిండియాకు 6,500 మంది పైలట్లు కావాలి
ముంబై: టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా సంస్థ ఎయిర్బస్, బోయింగ్ నుంచి 470 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విమానాలు నడిపించడానికి 6,500 మందికిపైగా పైలట్లు అవసరమని విమానయాన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 113 విమానాలు ఉన్నాయి. దాదాపు 1,600 మంది పైలట్లు పనిచేస్తున్నారు. పైలట్ల కొరత వల్ల ఇటీవల పలు సందర్భాల్లో అల్ట్రా–లాంగ్ హాల్ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియాలో 54 ఫ్లైట్లు ఉండగా, దాదాదాపు 850 మంది పైలట్లు సేవలందిస్తున్నారు. విస్తారా ఎయిర్లైన్స్లో 53 విమానాలు, 600 మందికిపైగా విమాన చోదకులు ఉన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియా, విస్తారా సంస్థల్లో కలిపి 220 విమానాలు ఉన్నాయి. 3,000 మందికిపైగా పైలట్లు పనిచేస్తున్నారు. -
‘ఎయిరిండియా’కు 470 కొత్త విమానాలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా సంస్థ దేశ విదేశాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరింపజేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ నుంచి, అమెరికాలోని బోయింగ్ నుంచి మొత్తం 470 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్త విమానాల కోసం ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇవ్వడం గత 17 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఇచ్చిన తొలి ఆర్డర్ కూడా ఇదే. ‘‘40 ఎయిర్బస్ ఏ350 విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777–9 విమానాలు, 210 ఎయిర్బస్ ఏ320/321 నియో విమానాలు, 190 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కొంటున్నాం’’ అని ఎయిర్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మొదటి విమానం ఈ ఏడాది ఆఖర్లో సర్వీసులో చేరుతుందని పేర్కొంది. 2025 జూలై నుంచి విమానాలు తమకు అందుతాయని తెలియజేసింది. లీజుకు తీసుకున్న 11 బీ777, 25 ఏ320 విమానాల డెలివరీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేసింది. రెండు ఒప్పందాల విలువ ఏకంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.4 లక్షల కోట్లు) అని అంచనా! సుదీర్ఘ ప్రయాణాలకు వైడ్–బాడీ విమానాలు ఎయిర్బస్ నుంచి 250 విమానాలను కొనడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశామని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మంగళవారం చెప్పారు. ఎయిర్బస్ నుంచి 210 నారో–బాడీ విమానాలు, 40 వైడ్–బాడీ విమానాలు కొంటున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తదితరులు వర్చువల్గా పాల్గొన్న కార్యక్రమంలో చంద్రశేఖరన్ మాట్లాడారు. ఎక్కువ సమయం(అల్ట్రా–లాంగ్ హాల్) సాగే ప్రయాణాల కోసం వైడ్–బాడీ విమానాలు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. 16 గంటలకు పైగా ప్రయాణించే విమానాన్ని అల్ట్రా–లాంగ్ హాల్ ఫ్లైట్ అంటారు. భారత ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఎయిరిండియాను 2022లో టాటా గ్రూప్ దక్కించుకోవడం తెలిసిందే. ఎయిర్ ఇండియా చివరిసారిగా 2005లో విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అప్పట్లో బోయింగ్ సంస్థ నుంచి 68, ఎయిర్బస్ నుంచి 43 విమానాలను కొనుగోలు చేసింది. 2005లో ఈ డీల్ విలువ 10.8 బిలియన్ డాలర్లు. ఒప్పందాల పట్ల ప్రధాని మోదీ హర్షం ఎయిర్బస్, బోయింగ్తో ఎయిరిండియా ఒప్పందాలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇవి మైలురాయి లాంటి ఒప్పందాలన్నారు. భారత్లో విమానయాన రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. 15 ఏళ్లలో 2,000కు పైగా విమానాలు అవసరమని చెప్పారు. మన పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో అంతర్భాగమని వ్యాఖ్యానించారు. దేశంలో గత ఎనిమిదేళ్లలో ఎయిర్పోర్టుల సంఖ్య 74 నుంచి 147కు చేరిందని గుర్తుచేశారు. ‘ఉడాన్’ పథకం కింద మారూమూల ప్రాంతాలను సైతం విమానాల ద్వారా అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్గా అవతరించబోతోందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఉక్రెయిన్–రష్యా సమస్యను పరిష్కరించే సత్తా మోదీ నాయకత్వంలోని భారత్కుందని ప్రశంసించారు. భారత జి–20 సారథ్యం విజయవంతం కావడానికి సహకరిస్తున్నామని చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మోదీ మంగళవారం ఫోన్లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఎయిరిండియా–బోయింగ్ ఒప్పందంతోపాటు పలు అంశాలపై నేతలు చర్చించుకున్నారని వెల్లడించింది. చరిత్రాత్మక ఒప్పందం: జో బైడెన్ 34 బిలియన్ డాలర్లతో బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందాన్ని చరిత్రాత్మకంగా బైడెన్ అభివర్ణించారు. ‘‘అవసరాన్ని బట్టి మరో 70 విమానాలు కొనేలా ఒప్పందం కుదిరింది. అలా మొత్తం ఒప్పందం విలువ 45.9 బిలియన్ డాలర్లు. ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నాం’’ అన్నారు. వైట్హౌస్ ప్రకటన మేరకు బోయింగ్తో ఒప్పందంలో 50 బోయింగ్ 737మ్యాక్స్, 20 బోయింగ్ 787 ఫ్లైట్లు ఉన్నాయి. ఎయిరిండియా ఇచ్చిన ఆర్డర్ బోయింగ్ చరిత్రలో డాలర్ విలువలో మూడో అతిపెద్ద సేల్, విమానాల సంఖ్యలో రెండో అతి పెద్దది! కీలక ఘట్టం: రిషి లండన్: ఎయిరిండియాకు 250 కొత్త విమానాలు విక్రయించడానికి ‘ఎయిర్బస్–రోల్స్ రాయిస్’ ఒప్పందానికి రావడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హర్షం బెలిబుచ్చారు. బ్రిటన్ ఏరోస్పేస్ రంగంలో ఇదో కీలక ఘట్టమన్నారు. ‘‘భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. బ్రిటన్లో విమానయాన రంగ అభివృద్ధికి ఆకాశమే హద్దు అనేందుకు ఈ ఒప్పందమే తార్కాణం’’ అన్నారు. ఈ ఒప్పదంతో బ్రిటన్లోని వేల్స్, డెర్బీషైర్లో కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఎగుమతులకు, ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. ఎయిరిండియా కొనుగోలు చేసే 250 విమానాల తయారీ ప్రక్రియ చాలావరకు యూకేలోనే పూర్తి కానున్నట్లు తెలియజేసింది. -
ఎయిరిండియా చరిత్రలో ఎన్నడూ లేని భారీ డీల్.. లక్షల కోట్లతో..
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మకుటంలో మరో కలికితురాయి చేరుకోనుంది. ఎయిరిండియా బ్రాండ్కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేందుకు మాతృ సంస్థ టాటా సన్స్ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకునేలా 100 బిలియన్ డాలర్లతో 500 విమానాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా విమాన తయారీ సంస్థలు ఈ 500 ఎయిర్ క్రాప్ట్లను 8 ఏళ్లలో డెలివరీ చేయనున్నట్లు రాయిటర్స్ కథనం వెలువరించింది. ఇప్పటికే గత డిసెంబర్ నెలలో ఎయిరిండియా భారీ ఎత్తున విమానాల్ని కొనుగోలు చేస్తున్నట్లు అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ కథనాలకు కొనసాగింపుగా వచ్చే వారంలో విమానాల కొనుగోలుపై ఎయిరిండియా ప్రకటన చేయనున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. 500 ఎయిర్ క్రాఫ్ట్లలో ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ నుంచి 210 సింగిల్ ఐస్లె (asile) ఏ320నియోస్, 40 వైడ్ బాడీ ఏ 350ఎస్లను, అమెరికా ఎయిర్క్ట్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్ నుంచి 220 ఫ్లైట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో 190 737 మ్యాక్స్ న్యారో బాడీ జెట్స్ 20 787 వైడ్ బాడీ, 10 777ఎక్స్లను కొనుగులుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్బస్- ఎయిరిండియా విమానాల కొనుగోళ్లపై నిన్ననే ( ఫిబ్రవరి 10న) ఒప్పందంపై సంతకం చేయగా..బోయింగ్ జనవరి 27న ఎయిర్లైన్తో తన ఒప్పందాన్ని అంగీకరించింది. జనవరి 27న ఉద్యోగులకు రాసిన నోట్లో ఎయిర్లైన్ కొత్త విమానాల కొనుగోళ్ల కోసం చారిత్రాత్మకమైన ఆర్డర్ ఖరారు చేస్తున్నట్లు తెలిపింది. -
ఎయిరిండియా విస్తరణ ప్లాన్స్, చర్చనీయాంశంగా టాటా భారీ డీల్
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలతో పాటు విమానాలను కూడా విస్తరిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన విమానాల తయారీదారు సంస్థ ఎయిర్బస్తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. వచ్చేవారం ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. దాదాపు 250 విమానాల కోసం ఎయిర్బస్తో ఒప్పందం ఖరారైందని త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. అలాగే ఇప్పటికే సుమారు 200 విమానాల కోసం బోయింగ్తో ఎయిర్లైన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. వచ్చేవారమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. కొత్త విమానాల కోసం ఎయిర్లైన్ చారిత్రాత్మక ఆర్డర్ను ఖరారు చేయనున్నట్టు ఎయిరిండియా చీఫ్ క్యాప్ బెల్ విల్సన్ ఇటీవల (జనవరి 27న) వ్యాఖ్యానించారు. దీంతో కొనుగోలు వార్తలకు బలం చేకూరుతోంది. అయితే ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాన కాని నేపథ్యంలోఎయిరిండియా అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. కాగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియా 16 సంవత్సరాల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2005 వరకు ఒక్క విమానం కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8బిలియన్ డాలర్ల భారీ డీల్ ను కదుర్చుకుంది ఎయిరిండియా. -
రతన్ టాటా మరో సంచలనం..500 విమానాల కోసం భారీ ఆర్డరు!
ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్లైన్గా తీర్చిదిద్దేందుకు మాతృ సంస్థ టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్బస్, బోయింగ్ ఈ రెండు సంస్థల నుంచి పదివేల బిలియన్ల డాలర్ల విలువైన 500 ప్యాసింజర్ విమానాలు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ పెట్టినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి విలువ సుమారు రూ.80వేల కోట్లు ఉండనుందని అంచనా. ఆర్డర్ ఇచ్చిన వాటిలో 400 నారో బాడీ జెట్లు, 100 లేదా అంతకంటే ఎక్కువ వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్లు ఉండగా.. డజన్ల కొద్దీ ఎయిర్బస్ ఏ350లు, బోయింగ్ 787లు, బోయింగ్ 777లు ఉన్నాయి. అదే జరిగితే బిలియన్ డాలర్ల విమానాల కొనుగోలుతో 10 ఏళ్ల క్రితం అమెరికన్ ఎయిర్ లైన్ కొనుగోళ్లను టాటా అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్ధం క్రితం అమెరికన్ ఎయిర్లైన్స్ 460 ఎయిర్బస్, బోయింగ్ జెట్ల ఆర్డర్ పెట్టింది. నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్, వైడ్ బాడీ విమానాల మధ్య వ్యత్యాసం ట్యూబ్ షేప్లో విమానంలోని ప్యాసింజర్లకు కూర్చునే(మెయిన్ బాడీ), వెడల్పు పెద్దగా ఉండి..రో’ (అడ్డం)లో ఎక్కువ సీట్లు ఉంటే వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఉదాహారణకు ఈ వైడ్ బాడీ విమానం రౌండ్గా 5 నుంచి 6 మీటర్లు ఉండి..అడ్డంగా 9 సీట్లు ఉంటే ప్రతి మూడు సీట్ల మధ్య నడించేందుకు కాళీ ప్రదేశం ఉంటుంది. అలా 9 సీట్ల మధ్యలో ప్రయాణికులు నడించేందుకు రెండు దార్లు ఉంటాయి. ప్రతి మూడు ఈ విమానంలో 10..10 సీట్ల మధ్య ఖాళీగా ఉంటుంది. అదే నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్ బాడీ రౌండ్గా 3 నుంచి 4 మీటర్లు ఉండి.. అడ్డంగా 3 నుంచి 6 సీట్లు ఉంటాయి. ప్రతి మూడు సీట్ల మధ్య నడించేందుకు ఒక్క దారి మాత్రమే ఉంటుంది. -
‘ఆత్మనిర్భర్ భారత్కు డిఫెన్స్, ఏరోస్పేస్ కీలక పిల్లర్స్’
గాంధీనగర్: ఆత్మనిర్భర్ భారత్కు రక్షణ, ఏరోస్పేస్ రంగాలు ముఖ్యమైన పిల్లర్స్ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. వడోదరలో సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ.22వేల కోట్ల వ్యయంతో టాటాల భాగస్వామ్యంతో ఎయిర్బస్ సంస్థ చేపడుతోంది. విమానయాన రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మోదీ పేర్కొన్నారు. ‘భారత్ను ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దటంలో డిఫెన్స్, ఏరోస్పెస్ రంగాలు ముఖ్యమైన రెండు పిల్లర్స్గా మారనున్నాయి. 2025 నాటికి దేశ రక్షణ రంగ తయారీ 25బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఉత్తర్ప్రదేశ్, తమిళనాడులో ఏర్పాటు చేసిన డిఫెన్స్ కారిడార్లు అందుకు దోహదపడుతాయి. భారత రక్షణ ఏరోస్పేస్ రంగంలో ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. బీజేపీ అధికారంలోకి వచ్చాక కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. దానివల్లే తయారీ రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. విమానయాన రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మూడు దేశాల్లో త్వరలోనే భారత్ చోటు సంపాదిస్తుంది.’అని మోదీ వెల్లడించారు. ఐరోపాకు చెందిన ఎయిర్బస్ సంస్థ ఇతర దేశాల్లో సీ-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి. భారత వాయుసేనలో సేవలందిస్తున్న అవ్రో-748 రవాణా విమానాల స్థానంలో, ఎయిర్బస్కు చెందిన సీ-295 రవాణా విమానాలను ప్రవేశపెట్టాలని గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలు అందించేందుకు ఎయిర్బస్తో రూ.21,935 కోట్లతో ఒప్పందం కుదిరింది. 2023 సెప్టెంబరు నుంచి 2025 ఆగస్టు మధ్య 16 విమానాలను ఫ్లై-అవే కండీషన్లో ఎయిర్బస్ భారత్కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాల తయారీ, అసెంబ్లింగ్ను టాటా గ్రూప్నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దేశీయంగా చేపడుతుంది. తొలి దేశీయ తయారీ రవాణా విమానం 2026 సెప్టెంబరులో అందుబాటులోకి రావొచ్చని సమాచారం. ఇదీ చదవండి: గుజరాత్లో రూ.22వేల కోట్ల మెగా ప్రాజెక్ట్.. ఎయిర్బస్ సీ-295 తయారీ -
గుజరాత్లో రూ.22వేల కోట్ల మెగా ప్రాజెక్ట్.. ఎయిర్బస్ సీ-295 తయారీ
న్యూఢిల్లీ: ఆర్మీ కోసం ఎయిర్బస్ సీ-295 ట్రాన్స్పోర్ట్ విమానాలను దేశంలో తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఎయిర్బస్ సీ-295 ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. సుమారు రూ.22,000 కోట్లతో వడోదరలో దీన్ని నెలకొల్పనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. ‘సైనిక ఎయిర్క్రాఫ్ట్ను ప్రైవేట్ కంపెనీ భారత్లో తయారు చేయనున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.21,935 కోట్లు. ఈ విమానాలను పౌర రవాణాకు సైతం ఉపయోగిస్తాం.’ అని తెలిపారు రక్షణ శాఖ సెక్రెటరీ డాక్టర్ అజయ్ కుమార్. ఈ ప్రాజెక్టుకు అక్టోబర్ 30న ఆదివారం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. యూరప్ వెలుపల సీ-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి అని అజయ్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు.. గుజరాత్ ఎన్నికల వేళ వేలాది ఉద్యోగులు కల్పించే భారీ ప్రాజెక్టును ప్రారంభించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత వాయుసేనలోని పాత ఏవీఆర్ఓ-748 ఎయిర్క్రాఫ్ట్ల స్థానంలో ఎయిర్బస్కు చెందిన సీ-295 విమానాలను ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలను అందించేందుకు ఎయిర్బస్తో రూ.21వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా నాలుగేళ్లలో 16 విమానాలను ‘ఫ్లై అవే’ కండీషన్లో ఎయిర్బస్ భారత్కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాలను టాటా గ్రూప్నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారీ, అసెంబ్లింగ్ చేపడుతుంది. ఈ ఒప్పందానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ గత వారమే ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి: దెయ్యంలాంటి రూపంతో ఫేమస్.. అసలు ముఖం మాత్రం ఇది! -
ఇండిగో నిర్వహణ బాగోలేదు.. సొంత సంస్థపై ఉద్యోగుల షాకింగ్ ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రామాణిక నిర్వహణ విధానాలను ఇండిగో సరిగ్గా పాటించడం లేదని ఆ సంస్థలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు ఆరోపించారు. దీని వల్ల ప్రయాణికుల భద్రత రిస్క్లో పడుతోందని పేర్కొన్నారు. ఈమేరకు ఆల్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్స్ జులై 12న విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్కు లేఖ రాశారు. ఇండిగో విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఎయిర్బస్కు వారు విజ్ఞప్తి చేశారు. 'మీరు విమానాలకు లీజుకు ఇచ్చిన ఆపరేటర్లు నిర్వహణ ప్రమాణాలను పాటించడం లేదు. గత నాలుగు రోజులుగా సాంకేతిక సిబ్బంది స్ట్రయిక్ చేస్తున్నారు. అయినా సరైన నిర్వహణ లేకుండానే విమానాలు నడుస్తున్నాయి. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుని గత ఏడు రోజులకు సంబంధించిన నిర్వహణ డాటాను ఆపరేటర్లను అడగండి. సరైన నిర్వహణ లేకపోతే ఆ సంస్థల వల్ల మార్కెట్లో మీ కంపెనీకి కూడా చెడ్డపేరు వస్తుంది. మీ విమానాల నిర్వహణ ప్రమాణాలను వారు దిగజార్చారు. ఈ విషయంపై మీరు వాళ్లని నేరుగా ప్రశ్నించండి.' అని సాంకేతిక నిపుణులు ఎయిర్బస్కు లేఖ రాశారు. అయితే, ఈ ఆరోపణలను ఇండిగో కొట్టిపారేసింది. విమాన నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు పేర్కొంది. అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పింది. ఇవి నిరాధార ఆరోపణలని, కొందరు దురుద్దేశంతోనే ఈ ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇండిగో సాంకేతిక నిపుణులు లేఖ రాసిన ఐదు రోజులకే ఆ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. ఆదివారం షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం సాంకేతిక కారణాలతో పాకిస్థాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో ఈ లేఖ చర్చనీయాంశమైంది. చదవండి: కరాచీ ఎయిర్పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
20 ఏళ్లు.. 2,210 విమానాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏవియేషన్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే రెండు దశాబ్దాల్లో భారత విమానయాన రంగానికి కొత్తగా 2,210 విమానాలు అవసరం కానున్నాయి. వీటిలో 1,770 చిన్న స్థాయి, 440 మధ్య..భారీ స్థాయి ఎయిర్క్రాఫ్ట్లు ఉండనున్నాయి. గురువారమిక్కడ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో సందర్భంగా విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ ఇండియా విభాగం ప్రెసిడెంట్ రెమి మెలార్డ్ ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్పై అంచనాలకు సంబంధించిన నివేదిక ప్రకారం 2040 నాటికి దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏటా 6.2 శాతం మేర వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. జనాభాపరంగా, ఆర్థికంగా, భౌగోళికంగా భారత్కు ఉన్న ప్రత్యేకతలు ఇందుకు దోహదపడగలవని రెమి తెలిపారు. దేశీయంగా మధ్యతరగతి వర్గాలు.. విమాన ప్రయాణాలపై మరింతగా వెచ్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మెయింటెనెన్స్ .. సర్వీస్ సామర్థ్యాలు, ట్యాక్సేషన్ విధానాలు మొదలైనవన్నీ మరింత అనుకూలంగా ఉంటే భారత్లో విమానయాన రంగం గణనీయంగా వృద్ధి చెందగలదని రెమి తెలిపారు. అంతర్జాతీయంగా ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 3.9 శాతం స్థాయిలోనే ఉండగలదన్నారు. అంతర్జాతీయ రూట్లలో వాటా పెంచుకోవాలి గడిచిన పదేళ్లలో దేశీయంగా ఎయిర్ ట్రాఫిక్ దాదాపు తొమ్మిది రెట్లు పెరిగిందని, అంతర్జాతీయ ట్రాఫిక్ రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ రూట్లలో విదేశీ ఎయిర్లైన్స్ వాటా 94 శాతం పైగా ఉంటుండగా.. భారత విమానయాన సంస్థల వాటా 6 శాతం స్థాయిలోనే ఉందని రెమి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీ విమానయాన సంస్థలు తమ మార్కెట్ వాటా మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని రెమి చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ సహా పలు సంక్షోభాలు ఏవియేషన్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, అయితే పరిశ్రమ వీటి నుంచి ధీటుగా బైటపడగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ సంక్షోభం నుంచి భారత్ వేగంగా కోలుకుంటోందని.. అందుకే అంచనాలను పెంచామన్నారు. 34 వేల మంది పైలట్లు కావాలి విమానయాన పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతుండటంతో 2040 నాటికి భారత్లో అదనంగా 34,000 మంది పైలట్లు, 45,000 సాంకేతిక నిపుణులు అవసరమవుతారని భావిస్తున్నట్లు రెమి వివరించారు. భారత్లో ఎయిర్బస్ 7,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పిస్తోందని, ఏటా భారత్ నుంచి 650 మిలియన్ డాలర్ల పైగా కొనుగోళ్లు జరుపుతోందని చెప్పారు. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుందని, జీ20 దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించడం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో భారత్లో విమానయాన సంస్థలకు వారానికి ఒకటి పైగా ఎయిర్క్రాఫ్ట్లను ఎయిర్బస్ డెలివర్ చేయగలదని రెమి చెప్పారు. గతేడాది 611 విమానాలను డెలివర్ చేయగా ఇందులో 10% ఎయిర్క్రాఫ్ట్లు భారత సంస్థలకు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 720 విమానాల డెలివరీ టార్గెట్ అని తెలిపారు. సుదూర ప్రయాణాలకు ఏ350 విమానాలు ఏ350 విమానాలను సుదూర ప్రయాణాలకు అనువుగా రూపొందించినట్లు రెమి తెలిపారు. ఇవి ఏకంగా 18,000 కి.మీ. దూరం ప్రయాణించగలవని, 300–410 మంది వరకూ ప్యాసింజర్లు ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. అధునాతన మెటీరియల్స్ వల్ల ఇదే తరహా పోటీ సంస్థల విమానాలతో పోలిస్తే ఏ350 విమానాలు ఇంధనాన్ని 25% మేర ఆదా చేయగలవని, తద్వారా నిర్వహణ వ్యయాలను తగ్గించగలవని రెమి తెలిపారు. ఈ విమానాల కోసం 50 కస్టమర్ల నుంచి 915 ఆర్డర్లు వచ్చినట్లు (సరుకు రవాణా కోసం ఉపయోగించే ఏ350ఎఫ్ సహా) ఆయన పేర్కొన్నారు. వీటి విక్రయాలకు సంబంధించి భారతీయ విమానయాన సంస్థలతో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. -
టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్కు సిద్ధమైన యూరప్ కంపెనీ..!
సుమారు డెబ్భై ఏళ్ల తర్వాత ఎయిరిండియాను టాటా సొంతం చేసుకుంది . ప్రస్తుతం ఏవియేషన్ సెక్టార్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునీకరణ పనులకు సిద్దమైంది టాటా గ్రూప్స్. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్స్తో యూరప్కు చెందిన ఎయిర్క్రాఫ్ట్ తయారీ సంస్థ ఎయిర్బస్ భారీ డీల్ను కుదుర్చుకునేందుకు ఊవిళ్లురుతుంది. టాటాతో పాటుగా..! ఎయిర్బస్ తయారుచేస్తోన్న A350XWB విమానాల సేకరణకు సంబంధించిన డీల్ కోసం టాటా గ్రూప్స్తో పాటుగా పలు భారతీయ విమానయాన సంస్థలతో చర్చలను కంపెనీ జరుపుతోందని ఎయిర్బస్ ఇండియా & సౌత్ ఏషియా అధ్యక్షుడు రెమి మైలార్డ్ సోమవారం పేర్కొన్నారు. టాటా గ్రూప్స్తో దీర్ఘకాలిక, విశ్వసనీయమైన సంబంధాలను ఇరు కంపెనీల మధ్య నెలకొల్పేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ డీల్తో భారత విమాన రంగంలో కొత్త రికార్డులు నమోదుచేసే అవకాశం ఉందని రెమి మైలార్డ్ అభిప్రాయపడ్డారు. భారత డొమెస్టిక్ విమాన ప్రయాణాల్లో ఎయిర్ ట్రాఫిక్ వార్షిక సగటు వృద్ధి 6.2 శాతంగా, ప్రపంచ ఎయిర్ ట్రాఫిక్ సగటు వృద్ధి 3.9 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఇక టాటా గ్రూప్స్ ఇటీవలే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా స్పెసిఫిక్, విస్తారా , ఎయిర్ ఏషియా ఇండియా అనే నాలుగు ఇండియన్ క్యారియర్లను నడుపుతోంది. A350XWB భారీ సైజులో..! ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎయిర్బస్ రూపొందించిన A350XWB ఎయిర్క్రాఫ్ట్ అత్యంత ఆదరణను పొందాయి. ఇవి అధిక ఫ్యుయల్ ట్యాంక్లను కల్గి ఉన్నాయి. ఈ ఎయిర్క్రాఫ్ట్ A320NEO ఎయిర్క్రాఫ్ట్లతో పోల్చితే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఈ విమానాలు ఏకధాటిగా 18 గంటలపాటు ప్రయాణిస్తాయి. చదవండి: అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట పట్టిన పృథ్వీ అంబానీ! -
దేశంలోనే తొలిసారిగా ఎయిర్బస్ హెలికాప్టర్ కొన్న కేరళ బిలియనీర్!
ప్రముఖ ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బి. రవి పిళ్ళై అరుదైన ఘనతను సాధించారు. దేశంలోని తొలిసారిగా ₹100 కోట్ల విలువైన ఎయిర్బస్ H145 హెలికాప్టర్ కొనుగోలు చేసిన వ్యక్తిగా ఈ బి.రవి పిళ్ళై నిలిచారు. 68 ఏళ్ల ఈ కేరళ బిలియనీర్ ప్రస్తుతం 2.5 బిలియన్ డాలర్ల విలువ ఆస్తిని కలిగి ఉన్నారు. బి. రవికి చెందిన వివిధ కంపెనీల్లో సుమారు 70,000 మంది ఉద్యోగులను పనిచేస్తున్నారు. ప్రస్తుతం యుఏఈ వెలుపల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. హెలికాఫ్టర్ కొనుగోలు చేయడంతో అతని పర్యాటక కార్యకలాపాలు ఊపందుకున్నాయి, ఎందుకంటే అతనికి రాష్ట్రవ్యాప్తంగా లగ్జరీ హోటళ్ళు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల మీదుగా తన అతిథులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు అని ఆర్పీ గ్రూప్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న అత్యాధునిక హెలికాఫ్టర్ ఏడుగురు ప్రయాణీకులను, ఒక పైలట్'ను తీసుకెళ్లగలదు. ఈ హెలికాప్టర్ సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ & టేకాఫ్ చేసే సామర్ధ్యం కలదు. ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బి. రవి పిళ్ళై ఎక్కువ శాతం లో ప్రొఫైల్ కలిగి ఉంటారు. పిళ్ళై, తన ఛారిటీ కార్యకలాపాల వల్ల భాగ ప్రసిద్ధి చెందారు. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. ఏడాదిలో లక్షకు రూ.23 లక్షలు లాభం!) -
బోయింగ్, ఎయిర్బస్లతో టాటా కీలక చర్చలు.. కారణం ఇదే
సుమారు డెబ్భై ఏళ్ల తర్వాత ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా. ప్రస్తుతం ఏవియేషన్ సెక్టార్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునీకరణ పనులు చేపడుతోంది.ఈ మేరకు ఈ రంగంలో దిగ్గజ కంపెనీలైన ఎయిర్బస్, బోయింగ్ సంస్థలతో టాటా గ్రూపు చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టాటా ఇటీవల దక్కించుకుంది. ఈ క్రమంలో చిన్నా పెద్దా అంతా కలిసి 150 విమానాలు ఎయిరిండియాకు ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు విమానాలు పాతవై పోయాయి. వీటి మెయింటనెన్స్ అండ్ మోడిఫికేషన్కి రూ. 7,500 వరకు ఖర్చు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ పనిని పరిమితంగా చేపట్టి.. ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త విమానాల కొనుగోలకు టాటా ఆసక్తి చూపుతుందంటూ బ్లూబెర్గ్ కథనం ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా విమానాల తయారీలో బోయింగ్, ఎయిర్బస్ సంస్థలు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా బోయింగ్ సంస్థ భారీ విమానాలకు పర్యాయపదంగా ఉంది. దీంతో కొత్త విమానల తయారీ, తమ అవసరాలు తదితర అంశాలపై టాటా ప్రతినిధులు ఈ రెండు కంపెనీలతో చర్చలు చేపడుతున్నారు. ఇవి సఫలమైతే టాటా నుంచి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. -
ఆకాశంలో హార్ట్ టచింగ్ ప్రయాణం
Airbus A380 Test Flight: ఆకాశంలో హార్ట్ టచింగ్ ప్రయాణం చోటు చేసుకుంది. విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ ఎప్పటి నుంచో విమనాలు తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్లైన్స్ సంస్థలకు విక్రయిస్తోంది. ఎయిర్బస్ రూపొందించిన విమానాల్లో ఏ 380 మోడల్ ఎంతో పాపులర్. ఈ మోడల్లో చివరి విమానం ఇటీవల జర్మనీలోని హంబర్గ్లో రూపొందింది. ఈ విమానాన్ని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్కి అప్పగించాల్సి ఉంది. అయితే అప్పగింతకి ముందు జర్మనీ గగన తలంపై ఈ విమానం చక్కర్లు కొట్టింది. టెస్ట్రైడ్లో భాగంగా హంబర్గ్లో బయల్దేరిన విమానం జర్మీ గగన తలంపై ప్రధాన నగరాల మీదుగా పలుమార్లు చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో ప్రేమకు చిహ్నమైన హార్ట్ సింబల్ తరహాలో ఈ విమానం గగన తలంలో ప్రయాణించింది. ఈ ఫ్లైట్ ప్రయాణ మార్గానికి సంబంధించిన వీడియో, ఫోటోలను ఎయిర్బస్ సంస్థ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ముఖ్యంగా హృదయం ఆకారరంలో ఉన్న విమాన ప్రయాణ మార్గం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. As we get ready to hand over MSN272 to @emirates, here's our Flight Test team sending some ❤️ to all #A380 fans out there. #MondayMotivation pic.twitter.com/2YXkEILdLZ — Airbus (@Airbus) December 13, 2021 -
పారిస్ టూ ముంబై మధ్యలో ఇరాన్..
న్యూఢిల్లీ : పారిస్ నుంచి ముంబై బయలుదేరిన ఎయిర్ ఫ్రాన్స్ సబ్సిడరీకి చెందిన ఎయిర్బస్ ఏ 340 దుబాయ్ వెళుతూ ఇరాన్లో గంటల కొద్దీ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలతో విమానం ఇరాన్ నగరం ఇస్ఫహాన్లో ల్యాండయింది. ప్రయాణీకులు అందరూ క్షేమంగానే ఉన్నారని, అధికారులు వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారని ఇరాన్ వార్తాసంస్థ పేర్కొంది. విమానాన్ని స్ధానిక మెయింటెనెన్స్ బృందం చెక్ చేసిందని గురువారం దుబాయ్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుందని ఎయిర్ ఫ్రాన్స్ వెల్లడించింది. దుబాయ్ నుంచి ఇతర ఎయిర్లైన్స్కు చెందిన విమానాల్లో ప్రయాణీకులను ముంబై చేరవేస్తామని తెలిపింది. కాగా గత ఏడాది డిసెంబర్లో సైతం నార్వేకు చెందిన ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ దుబాయ్ నుంచి ఓస్లో వెళుతూ ఇరాన్లో అత్యవసరంగా ల్యాండయింది. -
ఎయిర్బస్ ఏ380.. గుడ్బై!
టౌలౌజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా గుర్తింపు పొందిన ఎయిర్బస్ ఏ380 తయారీ నిలిచిపోనుంది. కొనే కస్టమర్లు లేకపోవడంతో 2021 నుంచి తయారీని నిలిపివేస్తున్నట్టు ఎయిర్బస్ తాజాగా ప్రకటించింది. ప్రధాన కస్టమర్ అయిన ఎమిరేట్స్ ఇచ్చిన ఆర్డర్లను తగ్గించుకుంటున్నట్టు తెలిపింది. ‘‘ఏ380 తయారీకి సంబంధించి పూర్తి చేయని ఆర్డర్లు పెద్దగా లేవు. కనుక తయారీని కొనసాగించాల్సిన అవసరం కనిపించడం లేదు’’ అని ఎయిర్బస్ తన ప్రకటనలో తెలిపింది. 500 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల డబుల్ డెక్కర్ ఎయిర్బస్ ఏ380ని మార్కెట్లోకి తీసుకొచ్చిన పదేళ్ల తర్వాత సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ నిర్ణయంతో 3,500 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ విమాన తయారీ కారణంగా 2018లో ఎయిర్బస్కు 463 మిలియన్ల యూరోల నష్టం వచ్చింది. ఇది తమకు బాధాకరమైన నిర్ణయమని ఎయిర్బస్ సీఈవో టామ్ ఎండర్స్ అభివర్ణించారు. ఎంతో శ్రమ, ఎన్నో వనరులను వెచ్చించి, కష్టించామని, అదే సమయంలో వాస్తవికంగా వ్యవహరించ కతప్పదని చెప్పారాయన. 2008లో తొలిసారి ఏ380 విమానం ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి వచ్చింది. ఎత్తయిన సీలింగ్, లాంజెస్, డ్యూటీ చెల్లింపుల్లేని షాప్లు, బార్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
200 విమానాలతో ఇండిగో రికార్డు
ముంబై: బడ్జెట్ ధరల ఎయిర్లైన్స్ ఇండిగో దేశీయంగా అధిక సంఖ్యలో విమానాలు కలిగిన సంస్థగా రికార్డు నమోదు చేసింది. దేశీయంగా 200 విమానాలను కలిగి ఉన్న తొలి సంస్థ ఇదే. రెండు ఎయిర్బస్ ఏ320(సియో), రెండు ఎయిర్బస్ ఏ320 నియో విమానాలు తాజాగా వచ్చి చేరడంతో సంస్థ విమానాల సంఖ్య 200కు చేరుకుంది. దేశీయ మార్కెట్లో ఇండిగో 40 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2015 డిసెంబర్ 24న ఈ సంస్థ నిర్వహణలోకి 100వ విమానం వచ్చి చేరగా, మూడేళ్ల తర్వాత రెట్టింపు స్థాయికి చేరుకున్నట్టు అయింది. -
ఆ విమానంలో జిమ్, పబ్..
న్యూయార్క్ : ప్రపంచంలో ఓ మూల నుంచి ఇంకో మూలకు 20 గంటల్లో చేరుకునేలా నాన్స్టాప్ ఫ్లైట్ను ప్రవేశపెట్టేందుకు కాంటాస్ ఎయిర్వేస్ లిమిటెడ్ ఎయిర్బస్, బోయింగ్లను ఒప్పించింది. సిడ్నీ నుంచి నేరుగా లండన్ లేదా న్యూయార్క్లకు పెద్దసంఖ్యలో ప్రయాణీకులను చేరవేసేలా నాన్ స్టాప్ ఫ్లైట్ను రూపొందించాలని ఏడాది కిందట బోయింగ్, ఎయిర్బస్ కంపెనీలకు తాము విసిరిన సవాల్ను అవి స్వీకరించాయని కాంటాస్ సీఈఓ అలన్ జోస్ స్పష్టం చేశారు. తాము కోరుకున్న విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చే స్థితిలో బోయింగ్, ఎయిర్బస్లు ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టు సన్రైజ్ పేరుతో ఈ భారీ విమానాన్ని ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో కాంటాస్ నిమగ్నమైంది. మూడు వందల మంది ప్రయాణీకులను వారి లగేజ్లతో సహా సుదీర్ఘ గమ్యస్ధానాలకు చేరవేసేందుకు అనువుగా ఉండే ఈ విమానంలో ఎమర్జెన్సీ సమయంలో వాడేందుకు అవసరమైన ఇంధనం ఉంటుందని, ఈ విమానంలో చైల్డ్ కేర్ సదుపాయాలు, జిమ్,బార్, స్లీపింగ్ ఏరియాలను అందుబాటులో ఉంచుతారని కాంటాస్ తెలిపింది. ఈ భారీ విమానంపై ప్రజెంటేషన్స్ ఇచ్చేందుకు ఎయిర్బస్, బోయింగ్లు సిడ్నీ సందర్శించాయి. కాగా ఈ భవిష్యత్ విమానాలకు సంబంధించి వచ్చే ఏడాది ఆర్డర్ ఇచ్చేందుకు జోస్ సన్నాహాలు చేస్తున్నారు. కాంట్రాక్టు కోసం ఎయిర్బస్, బోయింగ్లు పోటీపడుతుండటంతో కోరుకున్న ధర, డిజైన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కాంటాస్కు లభించింది. తాము 2022 నాటికి ఈ తరహా తొలి విమానాన్ని అందుబాటులోకి తెస్తామని జోస్ చెబుతున్నారు. -
‘విస్తార’ విస్తరణ!
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ ’విస్తార’... దేశీ, విదేశీ రూట్లలో కార్యకలాపాలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 19 ఎయిర్బస్, బోయింగ్ విమానాలకు ఆర్డరు ఇవ్వనుంది. వీటి విలువ 3.1 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 21,344 కోట్లు) ఉండనుంది. అలాగే ఏ320 నియో రకానికి చెందిన మరో 37 విమానాలను లీజుకు తీసుకోనుంది. విస్తార బుధవారం ఒక ప్రకటనలో ఈ మేరకు విస్తరణ ప్రణాళికలను వివరించింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తార.. కార్యకలాపాలు ప్రారంభించి మూడేళ్లు దాటింది. ప్రస్తుతం కంపెనీకి ఏ–320 రకం విమానాలు 21 ఉన్నాయి. 22 ప్రాంతాలకు వారానికి 800 పైచిలుకు ఫ్లయిట్స్ నడుపుతోంది. ఈ ఏడాది విదేశీ రూట్లలో కూడా సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది. రెండు సంస్థలతో ఒప్పందాలు.. కార్యకలాపాల విస్తరణ నేపథ్యంలోనే కొత్తగా ఎయిర్బస్ సంస్థ నుంచి ఏ320 నియో రకానికి చెందిన 13 విమానాలు, బోయింగ్ నుంచి 6 డ్రీమ్లైనర్స్ను (787–9 ఎయిర్క్రాఫ్ట్) కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు విస్తార పేర్కొంది. ఎయిర్బస్తో ఒప్పందం ప్రకారం విస్తార ముందుగా ఏ320, ఏ321 రకానికి చెందిన 13 విమానాలను కొనుగోలు చేయనుంది. సందర్భాన్ని బట్టి మరో ఏడు ఏ320 రకం విమానాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే లీజింగ్ కంపెనీల నుంచి మరో 37 కొత్త ఏ320 నియో విమానాలను కూడా విస్తార లీజు కు తీసుకోనుంది. నియో విమానాలు 2019– 2023 మధ్య డెలివరీ అయ్యే అవకాశముంది. ఈ విమానాలను దేశీ రూట్లలోనూ, సందర్భాన్ని బట్టి అంతర్జాతీయ రూట్లలోనూ ఉపయోగించనున్నారు. ఇక, బోయింగ్తో ఒప్పందం ప్రకారం విస్తార 787–7 డ్రీమ్లైనర్ విమానాలు ఆరు కొనుగోలు చేయనుంది. 787 డ్రీమ్లైనర్ కోవకి చెందిన మరో నాలుగింటినీ కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. -
ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు శుభవార్త...
పారిస్ : యూరోపియన్ ఎయిర్క్రాఫ్ట్ దిగ్గజం ఎయిర్బస్ తన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. 2020 నాటికి ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు కూడా పడుకోని ప్రయాణించడానికి వీలుగా క్యాబిన్లలో బెర్తులను ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది. 2016 నవంబర్లో ఎయిర్ ఫ్రాన్స్- కేఎల్ఎం ఎకానమీ క్లాసు ప్రయాణికులకు కూడా స్లీపింగ్ బెర్త్స్ కల్పించాలనే ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. తక్కువ వ్యయంతో రూపొందించే ఈ బెర్తులను కాబిన్ పై భాగంలో గాని, కింది భాగంలో గాని ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్బస్, ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సఫ్రాన్కు అనుబంధ సంస్థ అయిన జోడాయిక్ ఎయిరోస్పేస్ కంపెనీతో కలిసి A330 కార్గో జెట్లలో లోయర్ డెక్ స్లీపింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసే స్లీపర్ కంపార్ట్మెంట్స్ ప్రస్తుతం ఉన్న కార్గో ఎయిర్క్రాఫ్ట్స్ కంపార్టుమెంట్లలో సరిగ్గా సరిపోతాయని వెల్లడించింది. 2020 నాటికి A330 విమానాలకు సరిపోయే డిజైన్ను రూపొందించనున్నట్లు ఎయిర్బస్ తెలిపింది. ఈ ప్రయోగం ఫలిస్తే త్వరలోనే A330XWB ఎయిర్లైన్స్లో కూడా ఈ ప్రయోగాన్ని అమలు పరిచే అవకాశాలను అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్ బస్ కాబిన్ కార్గో ప్రోగ్రామ్ల ముఖ్య అధిపతి జెఫ్ పిన్నర్ మాట్లాడుతూ... ఈ మార్పు ప్రయాణికుల సౌకర్యం కోసం ఒక అడుగు ముందుకు వేయడానికి నిదర్శనమని భావించవచ్చు. మా ఈ ప్రయత్నాన్ని మిగతా ఎయిర్లైన్స్ వారు కూడా మెచ్చుకున్నారు. ఈ ప్రయోగానికి మంచి స్పందనే వస్తుందని అన్నారు. లోయర్ డెక్ పరిష్కారాలను చూపడంలో తమ సంస్ధకు మంచి నైపుణ్యం ఉందని జోడాయిక్ ఎయిరోస్పేస్ కాబిన్ డివిజన్ ముఖ్య అధికారి క్రిస్టోఫ్ బెర్నర్డిని కూడా చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే నేడు వేర్వేరు ఎయర్ లైన్స్ మధ్య భిన్నత్వాన్ని గుర్తించడానికి కీలక అంశంగా మారిందన్నారు. -
ఎయిర్ ట్రాఫిక్.. అయిదున్నర రెట్లకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా పది మందిలో ఒకరు విమాన ప్రయాణం చేస్తున్నారు. ఈ సంఖ్య 20 ఏళ్లలో నాలుగుకు చేరుకుంటుందని ఎయిర్బస్ అంచనా వేస్తోంది. భారత్లో ఎయిర్ ట్రాఫిక్ అయిదున్నర రెట్లకు చేరుకుంటుందని ఎయిర్బస్ ఆసియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ జూస్ వాన్ డీ హేజ్డెన్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ప్రయాణికుల వృద్ధి రేటు ప్రపంచ సగటు 4.4% నమోదు కానుంది. భారత్ మాత్రం దాదాపు రెండింతలతో 8.1% ఉండనుంది. దేశీయ ప్రయాణికుల వృద్ధి రేటు 8.9 శాతంగా నమోదు చేస్తుంది. కొత్తగా 1,750 విమానాలు అవసరం అవుతాయి. వచ్చే 10 సంవత్సరాల్లో ప్రతి వారం ఒక ఎయిర్బస్ విమానం భారత్లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఇక్కడ 300 లకుపైగా ఎయిర్బస్ విమానాలు ఎగురుతున్నాయి’ అని వివరించారు. మేకిన్ ఇండియాకు కట్టుబడ్డాం..: భారత్ నుంచి విడిభాగాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్టు ఎయిర్బస్ ఇండియా కమర్షియల్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ద్వారకానాథ్ తెలిపారు. ‘మేకిన్ ఇండియాకు కట్టుబడి ఉన్నాం. మూడేళ్లలో రూ.9,750 కోట్ల విలువైన విడిభాగాలను భారత్ నుంచి కొనుగోలు చేశాం. 10 ఏళ్లలో కొనుగోళ్లు 16 రెట్లకు చేరుకున్నాయి. 6,000 మందికి ఉపాధి కల్పించగలిగాం. ఎయిర్బస్ పూర్తి స్థాయి శిక్షణ కేం ద్రం ఆసియాలో మొదటిసారిగా ఢిల్లీలో నెలకొల్పుతున్నాం’ అని తెలిపారు. హైదరాబాద్ స్టార్టప్స్తో చేతులు కలుపబోతున్నారా అన్న ప్రశ్నకు టి–హబ్తో కలిసి పనిచేయబోతున్నామని చెప్పారు. -
భారీ డిమాండ్: వారానికో విమానం
సాక్షి,హైదరాబాద్: రానున్న 20 సంవత్సరాల్లో ఇండియాలో దాదాపుగా 1750 ప్యాసింజర్, కార్గో ఎయిర్క్రాప్ట్లు అవసరమౌతాయని యూరోపియన్ ఏవియేషన్ మేజర్ ఎయిర్బస్ ప్రకటించింది. హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన ఏవియేషన్ షోలో భాగంగా ఇండియా గ్రోత్ రిపోర్ట్ను విడుదల చేసింది. భారత్లో విమాన ప్రయాణానికి భారీగా డిమాండ్ పుంజుకోనున్న నేపపథ్యంలో రానున్న పదేళ్లలో వారానికి సగటున ఒక విమానాన్ని పరిచయం చేయనున్నామని ఎయర్బెస్ ఈ సందర్భంగా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వృద్దిని అందిపుచ్చుకోవాలంటే 1350 సింగిల్ ఎయిసల్ ఎయిర్ క్రాప్ట్, 430 వైట్ బాడీ ఫ్లైస్ట్స్ కావాల్సి వస్తుందని ఎయిర్ బస్ ప్రెసిడెంట్ ఎయిర్ బస్ కమర్షియల్ ఎయిర్ క్రాప్ట్ ఇండియా శ్రీనివాసన్ ద్వారకనాథ్ తెలిపారు. అంతేకాదు వచ్చే 20 సంవత్సరాల్లో దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 5 రెట్లు పెరుగుతుందని ఆయన తెలిపారు. అది ప్రస్తుతం ఉన్న అమెరికా విమాన ప్రయాణీకుల సంఖ్యను మించుతుందని తెలిపారు. ఇండియా విమానయాన రంగం ప్రస్తుతం 20శాతం వృద్దికనపరుస్తుందని ఏసియా విమాయన రంగం 9శాతం వృద్ది కనపరుస్తుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం కంపెనీ వ్యూహంలో ప్రధానమైందని ఎయిర్బస్ పేర్కొంది. ఎయిర్బస్ సోర్సింగ్ వాల్యూమ్ గత 10 సంవత్సరాలలో 16 రెట్లు పెరిగింది. ప్రస్తుతం సంవత్సరానికి 550 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో 300 విమానాలను కలిగి ఉంది. -
‘వాహనం’ ఎగిరింది..
ఎగిరే ట్యాక్సీలో ఆఫీసుకెళ్లే రోజులు దగ్గరపడ్డాయి. మొన్నటికి మొన్న చైనీస్ కంపెనీ ఎహాంగ్ తొలిసారి ఇద్దరిని తమ ఎయిర్ ట్యాక్సీలో విజయవంతంగా కొంతదూరం వెళ్లేలా చేయగా.. తాజాగా విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ తన ఎయిర్ ట్యాక్సీ ‘వాహన’ను పరీక్షించింది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని పెండెల్టన్ కేంద్రంలో జరిగిన ఈ పరీక్షలో వాహన దాదాపు నిమిషం పాటు గాల్లోకి ఎగిరింది. ఆ తరువాత సురక్షితంగా నేలకు దిగింది. ట్రాఫిక్ చిక్కులను తప్పించేందుకు ఎయిర్బస్ సిద్ధం చేస్తున్న వాహన 50 మైళ్ల దూరం వరకూ ప్రయాణించగలదు. డ్రైవర్ లేదా పైలట్ అవసరం కూడా లేకపోవడం ఇంకో విశేషం. మొత్తం ఎనిమిది ప్రొపెల్లర్ల సాయంతో గాల్లోకి ఎగిరే వాహనంలో ఇంధనం విద్యుత్తే. -
ఒక్కరోజు పైలట్!
పైలట్ అవ్వడమే ఆ చిన్నారి లక్ష్యం. అందుకే.. వయసు ఆరేళ్లే అయినా.. ఓ పైలట్కు ఉండాల్సిన స్కిల్స్ అన్నీ ఆ చిన్నారి సొంతం. ఆ చిన్నారి పేరు ఆడమ్. చిన్నప్పటి నుంచి విమానాలు నడపాలనే ఆసక్తితో యూట్యూబ్లో పైలట్ శిక్షణకు సంబంధించిన వీడియోలన్నీ చూసేశాడు. అబుదాబీకి చెందిన ఆడమ్కు విమానాలకు సంబంధించిన నాలెడ్జ్ను చూసి ఆశ్చర్యపోయిన ఎతిహాద్ ఎయిర్వేస్ సిబ్బంది ఆడమ్కు ఒక్కరోజు పైలట్గా ఉండే అవకాశాన్ని కల్పించారు. దీంతో తన డ్రీమ్ను ఆరేళ్ల వయసులోనే తీర్చేసుకున్నాడు ఆడమ్. ఆడమ్ను ఎతిహాద్ ఎయిర్వేస్ ట్రెయినింగ్ సెంటర్కు పిలిచి.. పైలట్ యూనిఫాం వేసి, ఎయిర్బస్ ఏ380కు ఒక్కరోజు కోపైలట్గా అవకాశం ఇచ్చారు. ఇక... ఆడమ్కు ఉన్న నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయిన కెప్టెన్ సమెరె యాక్లెఫ్ ఆడమ్ విమానం నడిపిస్తుండగా వీడియో తీసి.. ఎయిర్వేస్ అధికారుల పర్మిషన్తో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియోను ఇప్పటి వరకు 2 కోట్ల మందికిపైగా వీక్షించారు. అంతే కాదు.. ఆ చిన్నారి కచ్చితంగా భవిష్యత్తులో పైలట్ అవుతాడని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఏ380 ఎయిర్బస్కు కెప్టెన్ అవ్వడమే ఆడమ్ ఆశయమట. తప్పకుండా ఆడమ్ కోరుకున్న ఎయిర్బస్కు కెప్టెన్ అవ్వాలని మనమూ కోరుకుందాం. -
డెలివరీ ఆలస్యం.. 7 వేల కోట్ల నష్టం!
పారిస్: కంపెనీ తీసుకున్న ఆర్డర్ల డెలివరీలో ఆలస్యం కారణంగా ఎయిర్బస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోనుంది. నాలుగు భారీ జెట్ విమానాల కొనుగోలు కోసం చేసిన ఆర్డర్లను ఖతార్ ఎయిర్వేస్ వెనక్కి తీసుకుని ఎయిర్బస్ సంస్థకు ఊహించని షాకిచ్చింది. డెలివరీలో ఆలస్యం అయినందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఖతార్ ఎయిర్లైన్స్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఖతార్ ఎయిర్లైన్స్ ఆర్డర్ల రద్దు కారణంగా ఎయిర్బస్ సంస్థకు భారత కరెన్సీలో సుమారు రూ. 7,751 కోట్ల (1.2 బిలియన్ డాలర్ల) మేర నష్టం వాటిల్లనుంది. 'ఎయిర్బస్ సంస్థకు మేం నాలుగు జెట్ విమానాల కోసం ఆర్డరిచ్చాం. అయితే సాంకేతిక లోపాలు తలెత్తడం, ఆర్డర్ సకాలంలో ఇవ్వకపోవడం లాంటి వాటికి ఎయిర్బస్ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాం. కానీ డెలివరీ ఆలస్యమైన కారణంగా మా ఆర్డర్లను రద్దు చేసుకున్నామని' ఖతార్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అక్బర్ అల్ బకార్ వివరించారు. మరోవైపు గత బుధవారం 140 ఎయిర్బస్ జెట్ విమానాల కొనుగోలుకు చైనా ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఎయిర్బస్ ప్రతినిథి ఒకరు మాట్లాడుతూ.. ఏ350-900 జెట్ విమానాలను సరైన సమయంలో డెలివరీ ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నించాం. కానీ కుదరలేదు. వేరొక ఆర్డరిచ్చే కంపెనీకి వీటిని రీ డిజైన్ చేసి వారికి అనుకూలమైన మార్పులతో విక్రయించాల్సి ఉంటుంది. ఇది అంత సులువైన విషయం కాదు. జరిగే నష్టాన్ని ఎంతో కొంత మేర తగ్గించుకునేందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అధిక ఆర్డర్ల కారణంతో పాటు పరికరాల కొరత, అత్యంత నాణ్యత కోసం పాకులాడటం వల్లే ఈ తప్పిదం జరిగిందని కంపెనీ పేర్కొంది. -
నేల నీదే... నింగీ నీదే!
-
నేల నీదే... నింగీ నీదే!
మనకు పరుగెత్తే కార్ల గురించి తెలుసు... ఎగిరే డ్రోన్ల గురించి వింటూ ఉంటాం. మరి ఈ రెండూ కలిసిపోతే... అవసరమైనంత వరకూ రోడ్లపై పరుగులు పెట్టి... ఆ తరువాత అకస్మాత్తుగా పైకి ఎగిరి గమ్యాన్ని చేరుకుంటే? అద్భుతంగా ఉంటుంది కదూ! విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ కూడా ఇదే అంటోంది. అనడమే కాదు... ఇలాంటి హైబ్రిడ్ రవాణా వ్యవస్థలు ఎలా సాధ్యమవుతాయో వివరిస్తోంది కూడా. కావాలంటే పక్క ఫొటోలు చూడండి. ఎయిర్బస్ తయారు చేయాలని సంకల్పిస్తున్న సరికొత్త రవాణా వ్యవస్థ తాలూకూ డిజైన్లు ఇవి. దీనికి ఎయిర్బస్ పెట్టిన పేరు ‘పాప్ అప్’. ఏంటి దీని ప్రత్యేకత అంటే... చాలా సింపుల్... అవసరమైనప్పుడు ఇది రెండు భాగాలుగా విడిపోగలదు. అడుగున ఉన్న భాగం కారులా పనిచేస్తుంది. పైన ఉన్నది ప్రయాణీకులు కూర్చునే క్యాబిన్లా ఉంటుంది. ఈ క్యాబిన్కు నాలుగు ప్రొపెల్లర్లు ఉన్న ఇంకోభాగం వచ్చి అనుసంధానమవుతుంది. ఆ తరువాత అది డ్రోన్లా పైకి ఎగిరిపోతుంది. మనల్ని గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఎయిర్బస్ ‘ప్రాజెక్టు వాహన’ పేరుతో ఎగిరే కారునొకదాన్ని తయారు చేస్తున్నామని గత ఏడాదే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ కొత్త డిజైన్ హైబ్రిడ్ వాహనాన్ని రూపొందించారు. డ్రైవర్లు అవసరం లేని, పూర్తిగా విద్యుత్తుతో మాత్రమే నడిచే ఈ వాహనం పూర్తిగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. మీ స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోగల అప్లికేషన్తో... ఇప్పుడు మీరు ఊబర్, ఓలా వంటి ట్యాక్సీలను బుక్ చేసుకున్నట్టుగానే దీన్ని కూడా ఆన్ డిమాండ్ బుక్ చేసుకోవచ్చు. ఆ తరువాత మొత్తం ఈ వాహనమే చూసుకుంటుంది. ఎంత దూరం రోడ్డుపై వెళ్లాలి... డ్రోన్ రూపంలో ఎంత దూరం ఎగిరి వెళ్లాలి వంటివన్నమాట. ట్రాఫిక్ జామ్లలో ఇరుక్కోకుండా నగరాల్లో సాఫీగా ప్రయాణించేందుకు ఇదో మేలైన మార్గం అంటోంది ఎయిర్బస్... 2030 నాటికల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఎయిర్బస్ ఆలోచన. చూద్దాం ఏమవుతుందో! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ రోడ్లపై పరుగెడుతూ, అవసరమైనపుడు అకస్మాత్తుగా పైకి ఎగిరి గమ్యాన్ని చేరుకునేలా ఎయిర్బస్ కంపెనీ డిజైన్ చేసిన అద్భుత వాహనం ‘పాప్ అప్’ -
ఆలస్యంగా నడిచిన విమానాలు
విమానాశ్రయం (గన్నవరం) : దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం గన్నవరం ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఉదయం 10 గంటల వరకు ఎయిర్పోర్టు పరిసరాలను పొగమంచు కమ్మేసింది. రన్వే కనిపించకపోవడంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఉదయం 7.30 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్కోస్టా విమానం 10 గంటలకు బయలుదేరింది. ఉదయం 8.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి రావాల్సిన ఎయిరిండియా విమానం 10.10 గంటలకు చేరుకుంది. ఈ విమానానికి రన్వే క్లియరెన్స్ రాక సుమారు పది నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టి 10.20కు రన్వేపై దిగింది. హైదరాబాద్ నుంచి ఉదయం 9.15 గంటలకు రావాల్సిన స్పైస్జెట్ విమానం 11.10 గంటలకు వచ్చింది. హైదరాబాద్ నుంచి 9.30 గంటలకు రావాల్సిన ఎయిరిండియా ఏటీఆర్ విమానం 11.30కి చేరుకుంది. విమానాలు సుమారు రెండు నుంచి రెండున్న గంటల ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రన్వేపై దట్టమైన పొగమంచు ఉండడం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులు తెలిపారు. సాయంత్ర విమాన సర్వీసులు కూడా సుమారు గంట పాటు ఆలస్యంగా నడిచాయి. -
క్యాబ్ ఎందుకు?? హెలికాప్టర్ బుక్ చేద్దాం!!
2016, అక్టోబర్ 24.. మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లాలి.. కిశోర్ స్మార్ట్ఫోన్ తీశాడు.. క్యాబ్ బుక్ చేశాడు.. 2020, అక్టోబర్ 24.. మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లాలి.. కిశోర్ మళ్లీ స్మార్ట్ఫోన్ తీశాడు.. అయితే.. ఈసారి హెలికాప్టర్(ఎయిర్ ట్యాక్సీ) బుక్ చేశాడు.. ఫ్రాన్స్ ఏరోస్పేస్ దిగ్గజం ‘ఎయిర్బస్’ చేపడుతున్న ప్రాజెక్టు వాహన విజయవంతమైతే.. స్మార్ట్ఫోన్లో ఇప్పుడు ట్యాక్సీలు బుక్ చేసుకున్నట్లు ఎగిరే ట్యాక్సీలు బుక్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ జామ్ల వంటి సమస్యలు కూడా ఉండవు. హెలికాప్టర్ తరహాలో ఉండే ఈ ‘వాహన’లో ఒకరు ప్రయాణించవచ్చు. డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమేటిక్గా నిర్దేశిత ప్రదేశానికి వెళ్తుంది. ‘దీనికి రన్వే అవసరం లేదు. సెల్ఫ్ డ్రైవింగ్.. దారిలో ఉన్న ఇతర ఎయిర్ ట్యాక్సీలు, ప్రతిబంధకాలను గుర్తించే వ్యవస్థ ఇందులో ఉంటుంది. దాని వల్ల ప్రమాదాల ప్రశ్నే తలెత్తదు. పైలట్ అవసరం లేని తొలి సర్టిఫైడ్ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్గా దీన్ని రూపొందించనున్నాం’ అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాడిన్ లేసాఫ్ తెలిపారు. 2017 చివరికి పూర్తి స్థాయి నమూనాను తయారుచేసి పరీక్షించనున్నారు. 2020లో మార్కెట్లోకి తేనున్నారు. 2030 నాటికి ప్రపంచ జనాభాలో 60 శాతం నగరాల్లోనే నివసిస్తారని ఎయిర్బస్ అంచనా వేస్తోంది. దానికి తగ్గట్లు ట్రాఫిక్ సమస్య కూడా మరింత జటిలమవుతుందని అంటూ.. 2015 నాటికే మెగాసిటీలుగా ఉన్నవాటిని, 2030 నాటికి మెగాసిటీలుగా మారేవాటిని ఎయిర్బస్ గుర్తించింది. 2030 నాటికి మెగా సిటీలుగా మారేవాటిలో హైదరాబాద్ కూడా ఉంది. 2015లో నగర జనాభాను 89 లక్షలుగా పేర్కొన్న ఎయిర్ బస్.. 2030 నాటికి అది 1.27 కోట్లు అవుతుందని అంచనా వేసింది. అంటే.. ఎయిర్ట్యాక్సీలు మన మార్కెట్లోకి కూడా వచ్చే చాన్సుందన్నమాట. -
మాల్యా విమానంవేలంపై హైకోర్టు ఆదేశాలు
ముంబై:వేలకోట్ల రుణ ఎగవేత దారుడు , వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు చెందిన ప్రైవేటు ఎయిర్ బస్ కు వేలానికి సంబంధించి బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 15 లోగా వేలం మరియు అమ్మకం కార్యక్రమాన్ని సేవల పన్ను శాఖ (సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్)కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మాల్యా విమానానికి వేలం నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎస్.సి. ధర్మాధికారి, బీపీ కొలాబవాలాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా విమానం వేలంలోజరుగుతున్న జాప్యంపై న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేశారు. విమానం సుదీర్ఘం కాలంగా డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లో పడి వుందని వ్యాఖ్యానించిన బెంచ్ ..తక్షణమే దాని వేలానికి సంబంధించిన అన్ని విధివిధానాలను పూర్తి చేయాలని చెప్పింది. బకాయిలు పేరుకుపోతుండగా, సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తోందని వ్యాఖ్యానించింది. వేలం పూర్తి చేసి వెంటనే విమానాశ్రయంనుంచి ఎయిర్ బస్ ను గొలగించాలని ఆదేశించింది. డిశెంబర్ 15లోగా వేలం, అమ్మకం ప్రక్రియ పూర్తి అవుతుందనే విశ్వాసాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. కాగా,మాల్యా బకాయి పడిన రూ.500 కోట్ల వసూలు కోసం సేవా పన్ను శాఖ అధికారులు డిసెంబర్, 2013 లో ఎయిర్ బస్ 319 రకం విమానాన్ని ఎటాచ్ చేసిన సంగతి తెలిసిందే.. -
ఎయిర్ ట్యాక్సీ బస్
ప్రపంచ జనాభాతో పాటు ప్రయాణ, రవాణా వాహనాలూ పెరిగిపోతున్నాయి. ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా, ఎన్ని సొరంగ మార్గాలు తవ్వినా ట్రాఫిక్ తగ్గడం లేదు. ఈ సమస్యకు పరిష్కారమే... భవిష్యత్తులో రాబోతున్న ఎయిర్ ట్యాక్సీలు! ఎయిర్బస్ కంపెనీ నుంచి వస్తోన్న ఎయిర్ ట్యాక్సీ ఇది. అయితే పదేళ్లు ఓపిక పట్టాలి! ఆ తరువాత మీకు ట్రాఫిక్ చికాకులు ఉండవు. కాలుష్యం బాధ అసలే ఉండదు. ఆఫీసుకు లేటవుతామేమో అన్న బెంగకూ గుడ్బై చెప్పవచ్చు! ఎందుకలా అంటే... పక్కనున్న ఫొటో చూడండి! ఇలాంటి డ్రోన్లు మిమ్మల్ని ఇంటి నుంచి ఆఫీసులో దిగబెడతాయి. పనైపోగానే మళ్లీ ఇళ్లకు చేరుస్తాయి కూడా! అబ్బో... ఇలాంటివి చాలా చూశాం. విన్నాం కూడా. ఇది మాత్రం అందుబాటులోకి వస్తుందన్న గ్యారెంటీ ఏమిటి? ఇదేనా మీ సందేహం. ఓకే.. ఏదో ఊరు పేరు లేని, చిన్నా చితక కంపెనీ తాము ఇలాంటి హైటెక్ డ్రోన్లు తయారు చేస్తున్నామంటే నమ్మలేకపోవచ్చుగానీ... ప్రపంచంలోనే అతికొద్ది విమాన సంస్థల్లో ఒకటైన ఎయిర్బస్ (ఫ్రాన్స్) ఈ మాట అంటే దానికి విలువ ఉంటుంది కదా! అవునండీ. 2027 నాటికల్లా తాము పైలట్ అవసరం లేని ఎయిర్ ట్యాక్సీలు సిద్ధం చేస్తామని, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల ఎయిర్ ట్యాక్సీలు గాల్లో ఎగురుతూ కనిపిస్తాయని బల్లగుద్ది మరీ చెబుతోంది. ‘వాహన’ పేరుతో ఎయిర్బస్ ఇందుకు శ్రీకారం చుట్టింది కూడా. 2030 నాటికల్లా మహానగరాల్లో జనాభా గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతాయని, అందువల్లనే తాము ట్రాఫిక్ బాదరబందీలేవీ లేకుండా వాయుమార్గ ప్రయాణాన్ని సాకారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అంటోంది. పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీలకు అవసరమైన టెక్నాలజీలు అన్నీ అందుబాటులో ఉన్నా... గాల్లో ప్రమాదాలను గుర్తించి, తగ్గట్టుగా స్పందించే నమ్మకమైన సాంకేతిక పరిజ్ఞానం మాత్రం ఇంకా అభివృద్ధి కాలేదని ఎయిర్బస్ ఉన్నతాధికారి ఒకరు అంటున్నారు. ‘వాహన’ ప్రాజెక్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైందని, వచ్చే ఏడాది చివర్లో ఫ్లైట్ టెస్ట్లు మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో పదేళ్లలో ఈ ‘వాహనా’లు అందుబాటులోకి వస్తాయన్నమాట! -
అనుభవం లేని యువతి.. A320 విమానం ల్యాండింగ్!
-
172 ఎయిర్బస్ విమానాల కొనుగోలు
ఎయిర్బస్తో ఎయిర్ ఏషియా, గో ఎయిర్ ఒప్పందం ఫార్న్బరో: విమానయాన సేవలకు గిరాకీ నేపథ్యంలో బడ్జెట్ ఎయిర్లైన్ సంస్థ ఎయిర్ ఏషియా తోపాటు తక్కువ ధరల విమానసేవల సంస్థ గో ఎయిర్ భారీ ఎత్తున ఎయిర్బస్ విమానాల కొనుగోలుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు ఈ సంస్థలు ఎయిర్బస్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంగ్లండ్లోని ఫార్న్బరోలో జరుగుతున్న ఎయిర్షో కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ఎయిర్ ఏషియా 100 విమానాలు ఎయిర్ ఏషియా సంస్థ 100 ఎయిర్బస్ ఏ321 నియో మోడల్ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు 1260కోట్ల అమెరికన్ డాలర్లు (రూ.84,420కోట్లు సుమారు) ఖర్చు చేయనుంది. ఇందులో ఒకే తరగతిలో 236 మంది ప్రయాణించడానికి వీలుంటుంది. తాజా కొనుగోలుతో కలిపి చూస్తే... ఎయిర్ ఏషియా ఇప్పటి వరకు మొత్తం 575 ఏ320 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. వీటిలో 170 విమానాలను ఎయిర్బస్ అందించింది. గో ఎయిర్ 72 విమానాలు గో ఎయిర్ సంస్థ కూడా తన సేవల విస్తరణకు వీలుగా ఎయిర్బస్ 72 ఏ320 నియో మోడల్ విమానాల కొనుగోలుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 770 కోట్ల డాలర్లు (రూ.51,590 కోట్లు సుమారు). దీంతో వాడియా గ్రూపునకు చెందిన గో ఎయిర్ మొత్తం 144 ఎయిర్బస్ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్టు అయింది. -
భారత్ లో ఎయిర్ బస్ పైలట్ శిక్షణ కేంద్రం
విమానయాన రంగంలో ఉన్న ఎయిర్బస్ ఢిల్లీ సమీపంలో సుమారు రూ.260 కోట్లతో పైలట్, మెయింటెనెన్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేయనుంది. 2018లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ సెంటర్కు 10 ఏళ్లలో 8,000 మంది పైలట్లు, 2,000 మంది మెయింటెనెన్స్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎయిర్బస్కు ఇప్పటికే బెంగళూరులో మెయింటెనెన్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ 2007 నుంచి ఇప్పటి వరకు 2,750 మందికిపైగా శిక్షణ ఇచ్చారు. వచ్చే పదేళ్లలో వారానికి సగటున ఒక ఎయిర్బస్ ఎయిర్క్రాఫ్ట్ను ఇక్కడి ఆపరేటర్లకు డెలివరీ చేసే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. -
కొత్త విమానాలు 1,600 కావాలి
♦ 20 ఏళ్లలో రూ. 15 లక్షల కోట్లు అవసరం ♦ మేకిన్ ఇండియాలో భాగంగా విడిభాగాల కొనుగోళ్లు ♦ 2020 నాటికి ఈ మొత్తం 2 బిలియన్ డాలర్లు ♦ ఎయిర్బస్ వైస్ ప్రెసిడెంట్ జూస్ట్ వాన్డెర్ హైడెన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌర విమానయాన రంగంలో ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటును నమోదు చేస్తున్న ఇండియాకి వచ్చే ఇరవై ఏళ్లలో 1,600 కొత్త విమానాలు అవసరమవుతాయని విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ అంచనా వేసింది. ఇందుకోసం సుమారు రూ.15 లక్షల కోట్లు అవసరమవుతాయని ఎయిర్బస్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్, (ఆసియా, నార్త్ అమెరికా) జూస్ట్ వాన్డెర్ హైడెన్ పేర్కొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న ఏవియేషన్ ప్రదర్శనలో భాగంగా విలేకరుల సమావేశంలో హైడెన్ మాట్లాడుతూ ఇందులో 100 కంటే ఎక్కువ సీట్ల సామర్థ్యం ఉన్న 1,230 విమానాలు, 380 భారీ విమానాలు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం ఇండియాలో 325 చిన్న విమానాలు, 53 భారీ విమానాలు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం నెలకు పది లక్షల మందికిపైగా ప్రయాణం చేస్తున్నా విమానాశ్రమాల సంఖ్య 4కే పరిమితమయ్యిందని, 2034కి ఈ సంఖ్య 14కు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశీయ విమానయాన రంగం సగటున 8.4 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా ప్రయాణికుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందన్నారు. గతేడాది ఇండియా నుంచి 250 కొత్త విమానాలకు ఆర్డర్లు వచ్చాయన్నారు. ప్రస్తుత విమానాలతో పోలిస్తే 20 శాతానికిపైగా ఇంధన వ్యయాన్ని తగ్గించే ఏ-320 నియో, 3-321 నియోలకు మంచి డిమాండ్ ఉందని, ఈ ఏడాది చివరికల్లా వీటి డెలివరీ మొదలవుతుందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్థానికంగా విడిభాగాలను అత్యధికంగా వినియోగిస్తున్నామని, ప్రస్తుతం 500 మిలియన్ డాలర్లుగా ఉన్న వీటి కొనుగోళ్ల విలువ 2020 నాటికి 2 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. -
మా విమానాలు పాక్షికంగా మేడిన్ ఇండియానే
ఎయిర్బస్ సీపీవో క్లాస్ రిక్టర్ న్యూఢిల్లీ: ఎయిర్బస్ గ్రూప్ ఉత్పత్తి చేసే ప్రతీ వాణిజ్య విమానంలోను ఎంతో కొంత భాగం మేడిన్ ఇండియాది ఉంటుందని సంస్థ చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ (సీపీవో) క్లాస్ రిక్టర్ తెలిపారు. గతేడాది భారత్ నుంచి వార్షికంగా 500 మిలియన్ డాలర్ల మేర విలువ చేసే ఉత్పత్తులు, సేవలు సేకరించాలని నిర్దేశించుకోగా, దాన్ని దాటేశామని ఆయన వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన విదేశీ తయారీ సంస్థ భారత్లో ఇంత స్థాయిలో కార్యకలాపాలు సాధించడం ఇదే ప్రథమమని తెలిపారు. తాము తయారు చేసే వివిధ విమానాలకు 45 పైగా సరఫరాదారులకు చెందిన 6,000 మంది పైచిలుకు సిబ్బంది సర్వీసులు, ఉత్పత్తులు అందిస్తున్నారని రిక్టర్ పేర్కొన్నారు. 2020 నాటికి 2 బిలియన్ డాలర్ల పైచిలుకు కొనుగోళ్లు జరిపే లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు. -
రికార్డు స్థాయిలో సీట్లను పెంచిన ఎమిరేట్స్
ఇప్పటికే ప్రపంచంలోనే అధికశాతం ప్రయాణీకులను తరలించే విమానంగా పేరొందిన ఎమిరేట్స్ మరో కొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటిదాకా ఏ విమానంలోనూ లేనన్నిఅత్యధిక సీట్లను కలిగిన విమానంగా 615 సీట్లను ఏర్పాటు చేసి... ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదటి తరగతిని పూర్తిగా తొలగించి, మొత్తం రెండే తరగతులతో, ప్రత్యేక సౌకర్యాలతో ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త A380 ఎమిరేట్స్ ఎయిర్ బస్... ఎకానమీ క్లాస్ లో ఒక్కో వరుసలో పది సీట్లు చొప్పున, 13 వరుసలతో మొత్తం 130 సీట్లను పెంచింది. ఎకానమీ క్లాస్ లో 557 సీట్లు, బిజినెస్ క్లాస్ లో 58 సీట్లు పెంచుతూ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక చర్యలతో ఇంతకు ముందు మూడు తరగతుల ప్రయాణీకులతో ఉండే విమానం కంటే ఇప్పుడు మరో 98 మంది ప్రయాణీకులను అధికంగా తరలించే అవకాశాన్ని కల్పించింది. సీట్లను పెంచడంలో భాగంగా ఎకానమీ క్లాస్ లోని ప్రయాణీకులు ఏ విధంగానూ నష్టపోవాల్సిన అవసరం లేదని.... ఫస్ట్ క్లాస్ భాగంలోని ఖాళీగా ఉన్న స్థలాన్ని వినియోగించి అదనంగా బిజినెస్ క్లాస్ లో 18 పడకల సీట్లను పెంచినట్లు సంస్థ వెల్లడించింది. బిజినెస్ క్లాస్ లో మాత్రం పూర్తి శాతం సౌకర్యాలతో ఫ్లాట్ సీట్లును ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బిజినెస్ క్లాస్ ప్రయాణీకులు మరింత ఆనందంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ కొత్త ఏర్పాట్లలో భాగంగా ప్రయాణీకులు.. కానాప్స్.. పానీయాలతో ఆన్ బోర్డ్ లాంజ్ ను కూడ ఎంజాయ్ చేయగలిగే అవకాశం ఉంది. దీనితో పాటు ఎమిరేట్స్ ఎకానమీ క్యాబిన్ కూడ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఓ చిన్న గ్రామంలో ఉండేటంత జనంతో ఈ దుబాయ్ కి చెందిన ఎయిర్ లైన్స్ విమానం తన ప్రత్యేకతను చాటుతోంది. -
ఇక మేడిన్ చైనా విమానాలు..
దేశీయంగా తొలిసారి సొంత ప్యాసింజర్ విమానం తయారీ * బోయింగ్, ఎయిర్బస్లకు పోటీ నే లక్ష్యం * 174 సీట్ల సామర్థ్యం; వచ్చే ఏడాది పరీక్ష బీజింగ్/షాంఘై: విమానాల తయారీ రంగాన్ని శాసిస్తున్న బోయింగ్, ఎయిర్బస్ వంటి పాశ్చాత్య దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో చైనా తమ సొంత విమానాన్ని తయారు చేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న తొలి ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ సి919ని సోమవారం ఆవిష్కరించింది. దేశ విమానయాన రంగంలో ఇదొక మైలురాయని కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా చైర్మన్ జిన్ ఝువాంగ్లాంగ్ అభివర్ణించారు. బోయింగ్ 737, ఎయిర్బస్ 320 విమానాల తరహాలో సుమారు 174 మంది దాకా ప్రయాణించేందుకు అనువుగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇది సుమారు 5,555 కిలోమీటర్ల దాకా ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటుంది. వచ్చే ఏడాది తొలి టెస్ట్ ఫ్లయిట్ను నడపనున్నట్లు జిన్ చెప్పారు. వ్యాపార సేవలకు అనువైనదిగా అనుమతులు లభించిన తర్వాత షాంఘై నుంచి సింగపూర్, బీజింగ్ నుంచి బ్యాంకాక్ తదితర పాపులర్ రూట్లలో వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చైనా పర్యటన సమయంలో ఎయిర్బస్ కన్సార్షియం నుంచి 130 ఎయిర్క్రాఫ్ట్ల కొనుగోలుకు (విలువ సుమారు 17 బిలియన్ డాలర్లు) ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజులకే చైనా తమ సొంత విమానాన్ని ఆవిష్కరించడం గమనార్హం. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమానయాన మార్కెట్ చైనాలో భారీ ఎయిర్పోర్టులు 21 ఉన్నాయి. 2034 నాటికి చైనా అదనంగా 6,330 కొత్త విమానాలు కొనుగోలు చేయొచ్చని (విలువ 950 బిలియన్ డాలర్లు) బోయింగ్ అంచనా. -
250 ఎయిర్బస్ విమానాలకు ఇండిగో ఆర్డరు
న్యూఢిల్లీ: కార్యకలాపాల విస్తరణలో భాగంగా 250 ఎయిర్బస్ ఏ320 నియో విమానాల ఆర్డరుకు సంబంధించి ఇండిగో పూర్తి స్థాయి కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 26.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.72 లక్షల కోట్లు). గతేడాది అక్టోబర్లో ఈ ఆర్డరు విషయంలో అవగాహన ఒప్పం దం (ఎంవోయూ) కుదిరింది. తాజా కాంట్రాక్టుతో మొత్తం 530 విమానాల కోసం ఇండిగో ఆర్డరు ఇచ్చినట్లవుతుంది. 2005లో 100 ఏ320లకు, 2011లో మరో 180 ఏ320 నియో విమానాల కోసం కంపెనీ ఆర్డర్లు ఇచ్చింది. 2005 కాంట్రాక్టుకు సంబంధించిన 100 విమానాల డెలివరీ ఇప్పటికే పూర్తయినట్లు ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు. ఇంధనం పొదుపు చేసే ఏ320 నియో విమానాలతో చౌకగా సర్వీసులు కొనసాగించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. -
స్పైస్జెట్ ఫ్లీట్లో రెండో ఎయిర్బస్
34 శాతం తనఖా పెట్టిన ప్రమోటర్ న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్, మరో ఎయిర్బస్ విమానాన్ని డెలివరీ తీసుకుంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) సంజీవ్ కపూర్ ట్వీట్ చేశారు. ఈ కంపెనీ మొదటి ఎయిర్బస్ విమానాన్ని గత నెలలోనే కార్యకలాపాలకు వినియోగించడం ప్రారంభించింది. ఈ రెండు విమానాలను వెట్ లీజ్(విమానంతో పాటు క్యాబిన్, విమాన సిబ్బందిని కూడా విమానాన్ని లీజుకిచ్చే సంస్థే సమకూరుస్తుంది) పద్ధతిన లీజుకు తీసుకున్నామని, మూడు నెలల పాటు మెట్రో రూట్లలో వినియోగిస్తామని సంజీవ్ కపూర్ పేర్కొన్నారు. ఈ విమానాలను అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కత, గౌహతి రూట్లలో నడుపుతున్నామని వివరించారు. కాగా కంపెనీ ప్రమోటర్ అజయ్ సింగ్ తన వాటాలో సగానికిపైగా షేర్లను తనఖా పెట్టారు. కంపెనీలో 60 శాతంగా ఉన్న తన వాటాలో 34 శాతం వాటాను ఆయన తనఖా పెట్టారని సమాచారం. ఇది మొత్తం కంపెనీ వాటాలో ఐదవ వంతుకు సమానం. -
ఎర్రబస్సు... ఎయిర్బస్సు కూడా!
సెప్టెంబర్ నుంచి యాత్రాజీనీ విమాన టికెట్లు * నెల రోజుల్లో హోటల్ గదుల బుకింగ్ సేవలు కూడా * ఆ తర్వాత లాజిస్టిక్స్ విభాగంలోకి.. * 150 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెరికా సంస్థ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ఎర్రబస్సు నుంచి ఎయిర్బస్ వరకూ..’ ఇదేదో ప్రాస కోసం వాడింది కాదు. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ అక్షరాలా దీన్ని నిజం చేస్తోంది. 2013 నవంబర్లో బస్సు టికెట్ల బుకింగ్ సేవలను ప్రారంభించిన యాత్రాజీనీ డాట్కామ్... ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విమాన టికెట్ల విక్రయం కూడా ప్రారంభిస్తోంది. ‘‘ఇప్పటికే ఎయిర్కోస్టా, ఎయిర్ ఇండియా, జెట్ విమాన సంస్థలతో సంప్రతింపులు జరిపాం. మిగతా అన్ని సంస్థలతో చర్చలు జరిపి... అన్ని విమానయాన టికెట్లను యాత్రాజినీలో బుక్ చేసుకునేలా టెక్నాలజీని రూపొందిస్తున్నాం’’ అని యాత్రాజీనీ సీఈఓ రెనిల్ కోమిట్ల చెప్పారు. ‘సాక్షి స్టార్టప్’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలివీ... బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన పాక్స్టెర్రా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్... ఈ-కామర్స్ సంస్థలకు సాఫ్ట్వేర్ను డెవలప్ చేసి ఇచ్చేది. ట్రావెల్స్ రంగంలో ఉన్న డిమాండ్ను గుర్తించిన ఆ సంస్థ చైర్మన్, సీఈఓ రెనిల్ కోమిట్ల.. యాత్రాజీనీ.కామ్(డ్చ్టట్చజ్ఛజ్ఛీ) పేరుతో బస్ టికెట్, క్యాబ్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ‘‘టికెట్లను విక్రయించడం ఒక్కటే మా పనికాదు. కస్టమర్ ఇంట్లోంచి బయటికి కాలు పెట్టింది మొదలు తిరిగి ఇంట్లోకి వెళ్లే వరకు అవసరమయ్యే అన్ని సేవలూ అందించడమే లక్ష్యంగా సంస్థను ప్రారంభించాం. అంటే కస్టమర్ ప్రయాణం చేసేందుకు అవసరమైన బస్సు టికెట్టు, బస చేసేందుకు బడ్జెట్ హోటల్, చేరుకున్న నగరంలో తిరిగేందుకు క్యాబ్.. ఇలా అన్ని రకాల సేవల్నీ అందించటమే యాత్రాజీనీ నినాదం’’ అంటారు రెనిల్. నెల రోజుల్లో హోటల్స్ బుకింగ్స్.. నెల రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకరాష్ట్రాల్లో హోటల్ గదుల బుకింగ్ సేవల్ని యాత్రాజీనీ ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 2,000 హోటళ్లు రిజిస్టరు కాగా... దీన్లో తెలుగు రాష్ట్రాల వాటా 10 నుంచి 12 శాతం. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి 20 హోటల్స్ వరకూ ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి లాజిస్టిక్ విభాగంలోకి కూడా కంపెనీ అడుగిడబోతోంది. విజయవాడ, విశాఖపట్నం ప్రధాన కేంద్రాలుగా సేవలందించడానికి పెద్ద మొత్తంలో ట్రక్కుల్ని కొనుగోలు చేస్తోంది సంస్థ. యాత్రాజీనీకి చెందిన క్యాబ్ డ్రైవరే లాజిస్టిక్ కేంద్రాల్లోని ఉత్పత్తులను ట్రక్కుల్లో లోడ్ చేసుకొని.. చెప్పిన చిరునామాలో అన్లోడ్ చేస్తాడు. తెలంగాణలో క్యాబ్స్ సేవలు.. ‘‘ఇటీవలే ఏపీలోని 13 జిల్లాల్లో క్యాబ్స్ సేవలు ప్రారంభించాం. నెల రోజుల్లో తెలంగాణలోని పది జిల్లాల్లో కూడా క్యాబ్స్ ప్రారంభిస్తాం. దశలవారీగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తాం. ఈ ఏడాది ముగింపు నాటికి అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సెప్టెంబర్ నుంచి కర్ణాటకలో 30 జిల్లాల్లో సేవలు ఆరంభిస్తాం. తర్వాత తమిళనాడు, కేరళ మార్కెట్లలోకి వెళతాం. 2016-17 ముగింపు నాటికి ముంబై, ఢిల్లీ నగరాలకూ.. మొత్తం మీద మూడేళ్లలో దేశంలోని వంద నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నా అత్యధిక మార్కెట్ వాటా ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచే. బెంగళూరు నుంచి ఏపీకి క్యాబ్స్, బస్ టికెట్ల బుకింగ్ డిమాండ్ బాగా ఉంది. అందుకే ఏపీలో క్యాబ్స్ సర్వీసులను ప్రారంభించిన మూడు నెలల్లో 30,000 బుకింగ్స్ జరిగాయి. ప్రస్తుతం యాత్రాజినీలో లక్ష నుంచి లక్షాపాతిక వేల మంది కస్టమర్లున్నారు. రోజుకు 3,000-3,500 బస్ టికెట్లు, 1,000-1,500 వరకు క్యాబ్స్ బుక్ అవుతున్నాయి. ఇందులో 90 శాతం బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతున్నవే. మిగతావి కర్ణాటక నుంచి. యాత్రాజినీకి క్యాబ్లు అద్దెకివ్వాలనుకుంటే.. 15:85 ఓనర్ మేనేజ్మెంట్ రూపంలో తీసుకుంటున్నాం’’ అని రెనిల్ వివరించారు. రూ.150 కోట్ల పెట్టుబడులు.. యాత్రాజీనీపై రెండేళ్లలో రూ.30 కోట్ల పెట్టుబడులు పెట్టగా గతేడాది రూ.60 కోట్ల టర్నోవర్ నమోదయింది. ఈ ఏడాది రూ.150 కోట్ల టర్నోవర్ను సంస్థ ఆశిస్తోంది. అమెరికాకు చెందిన ఓ వెంచర్ కేపిటలిస్ట్ రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సంప్రతింపులు జరుపుతున్నట్లు రెనిల్ వెల్లడించారు. ఈ డీల్కు సంబంధించి పూర్తి వివరాలను నెల రోజుల్లో వెల్లడిస్తామన్నారు. యాత్రాజీనీ క్యాబ్స్ జీపీఎస్ టెక్నాలజీతో పనిచేస్తాయని, కస్టమర్లు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే నొక్కటానికి ప్యానిక్ బటన్ ఉంటుందని ఆయన తెలియజేశారు. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఎయిర్ బస్ ను కిందకు దించిన ఎలుకలు!
లెహ్: ఎలుకలే కదా తేలిగ్గా తీసిపారేయకండి. ఓ ఎలుకల గుంపు పెద్ద విమానాన్ని గాల్లోంచి కిందకు దించేసింది. ఎలుకల హడావుడితో ఎయిర్ బస్ ఏకంగా ఆకాశం నుంచి అత్యవసరంగా దిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ-320 విమానం మంగళవారం జమ్మూకశ్మీర్ లోని లెహ్ ఎయిర్ పోర్టులో దిగింది. 90 ప్రయాణికులు ఉన్న ఈ విమానంలో ఎలుకలను గుర్తించడంతో ముందు జాగ్రత్త చర్యగా కిందకు దించేశారు. విమానంలోని ఎలక్ట్రిక్ వైర్లను ఎలుకలు కొరికేస్తాయని, దీంతో సమాచార వ్యవస్థ పనిచేయక ప్రమాదం వాటిల్లే అవకాశమున్నందన్న ఉద్దేశంతో ప్లైట్ ను కిందకు దించారు. అయితే లెహ్ ఎయిర్ పోర్టులో ఎలుకలను పట్టుకునే ఎక్విప్ మెంట్ లేకపోవడంతో మరో చోటి నుంచి విమానంలో దీన్ని తెప్పించింది ఎయిర్ ఇండియా. ఎలుకల పని పట్టిన తర్వాత విమానం మళ్లీ ఎగురుతుందని అధికారులు తెలిపారు. కేటరింగ్ వ్యాన్ల ద్వారా ఎలుకలు విమానంలోకి ప్రవేశించివుంటాయని అనుమానిస్తున్నారు. -
భారత్లో ఎయిర్బస్ ‘తయారీ’!
-
భారత్లో ఎయిర్బస్ ‘తయారీ’!
ఔట్సోర్సింగ్ను 200 కోట్ల డాలర్లకు పెంచుతామన్న ఫ్రాన్స్ కంపెనీ - విమాన కర్మాగారాన్ని సందర్శించిన మోదీకి ‘ఎయిర్బస్’ వెల్లడి - మొదటి ప్రపంచ యుద్ధం స్మారకాన్ని సందర్శించిన భారత ప్రధాని తౌలోస్ (ఫ్రాన్స్): భారత ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఫ్రాన్స్కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ మద్దతు తెలిపింది. భారత్లో తయారు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్లో తమ ఔట్సోర్సింగ్ను 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తౌలోస్లోని ఎయిర్బస్ విమాన కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా ఆ సంస్థ పై విధంగా స్పందించింది. సంస్థ సీఈఓ టామ్ ఎండర్స్ మోదీకి స్వాగతం పలికారు. కర్మాగారంలో ఎ380 ఎయిర్బస్ను తుదిగా రూపొందించే ప్రక్రియను మోదీ పరిశీలించారు. భారత్లో ప్రస్తుతం 4 ఎ380 విమానాలు ప్రతి రోజూ సేవలందిస్తున్నాయని ఈ సందర్భంగా టామ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్తో బలమైన పారిశ్రామిక బంధాన్ని నెలకొల్పుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపుకు మేం మద్దతిస్తున్నాం. భారత్లో తయారు చేయటానికి మేం సిద్ధం’’ అని చెప్పారు. భారత్లో ఎయిర్బస్ గ్రూపు సంస్థలు ప్రస్తుతం.. పౌర విమానయానం, రక్షణ రంగాలకు సంబంధించి రెండు వేర్వేరు ఇంజనీరింగ్ కేంద్రాలను, ఒక పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం (ఆర్ అండ్ టీ) కేంద్రాన్ని నిర్వహిస్తోంది. వీటిలో ప్రస్తుతం 400 మందికి పైగా అత్యంత అర్హతలున్న వారు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తరించాలన్న తమ నిర్ణయాన్ని టామ్ ఎండర్స్ వెల్లడించారు. విమానాలను తుదిగా అసెంబుల్ చేసే కర్మాగారాలను, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లకు సరఫరా సంస్థలు, సంబంధిత మౌలిక సదుపాయాలను నెలకొల్పాలని తాము భావిస్తున్నట్లు వివరించారు. ఎయిర్బస్ సంస్థ భారత్లో తమ ఔట్సోర్సింగ్ను ప్రస్తుతమున్న 40 కోట్ల డాలర్ల నుంచి 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు ప్రధాని మోదీతో చెప్పిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఆ తర్వాత ట్వీటర్లో వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్లో భారత అమర జవాన్లకు మోదీ నివాళులు ప్రధాని మోదీ ఫ్రాన్స్లో రెండో రోజు పర్యటనలో భాగంగా లిల్లె నగరానికి వెళ్లి.. అక్కడి మొదటి ప్రపంచయుద్ధ స్మారకాన్ని సందర్శించారు. 1914-18 మధ్య కాలంలో ఫ్రాన్స్ సరసన జర్మనీతో పోరాడుతూ మరణించిన 10,000 మంది భారతీయ సైనికులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ పలువురు భారతీయులు సమావేశమై ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. ఈ స్మారక చిహ్నాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే కావటం విశేషం. అనంతరం ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ స్టేట్ స్టడీస్ (సీఎన్ఈఎస్)ను కూడా మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తనచుట్టూ చేరిన యువ విద్యార్థులతో ఆయన ‘సెల్ఫీ’ ఫొటోలు దిగారు. -
'మేక్ ఇన్ ఇండియా'కు ఎయిర్బస్ మద్దతు
తౌలోస్ (ఫ్రాన్స్): భారత 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఫ్రాన్స్కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ మద్దతు తెలిపింది. తాము భారత్లో తయారు చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తౌలోస్లోని ఎయిర్బస్ విమాన కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా ఆ సంస్థ పై విధంగా స్పందించింది. సంస్థ సీఈఓ టామ్ ఎండర్స్ మోదీకి స్వాగతం పలికారు. కర్మాగారంలో ఎ380 ఎయిర్బస్ను తుదిగా రూపొందించే ప్రక్రియను మోదీ పరిశీలించారు. భారత్లో ప్రస్తుతం 4 ఎ380 విమానాలు ప్రతి రోజూ సేవలందిస్తున్నాయని ఈ సందర్భంగా టామ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్తో బలమైన పారిశ్రామిక బంధాన్ని నెలకొల్పుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ''మోదీ 'మేక్ ఇన్ ఇండియా' పిలుపుకు మేం మద్దతిస్తున్నాం. భారత్లో తయారు చేయటానికి మేం సిద్ధం'' అని చెప్పారు. భారత్లో ఎయిర్బస్ గ్రూపు సంస్థలు ప్రస్తుతం. పౌర విమానయానం, రక్షణ రంగాలకు సంబంధించి రెండు వేర్వేరు ఇంజనీరింగ్ కేంద్రాలను, ఒక పరిశోధన, సాంకేతికపరిజ్ఞానం (ఆర్ అండ్ టీ) కేంద్రాన్ని నిర్వహిస్తోంది. వీటిలో ప్రస్తుతం 400 మందికి పైగా అత్యంత అర్హతలున్న వారు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తరించాలన్న తమ నిర్ణయాన్ని టామ్ ఎండర్స్ వెల్లడించారు. విమానాలను తుదిగా అసెంబుల్ చేసే కర్మాగారాలను, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లకు సరఫరా సంస్థలు, సంబంధిత మౌలిక సదుపాయాలను నెలకొల్పాలని తాము భావిస్తున్నట్లు వివరించారు. -
ఐఏఎఫ్కు ఎయిర్బస్-టాటా బిడ్
ఎయిర్బస్ సీ295 విమానాల సరఫరా న్యూఢిల్లీ: కాలపరిమితి ముగుస్తున్న ఏవ్రో ఎయిర్క్రాఫ్ట్ల స్థానంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్)కు ఎయిర్బస్ సీ295 రవాణా విమానాలను సరఫరా చేసేందుకు ఎయిర్బస్తో టాటా జత కట్టింది. తద్వారా 56 విమానాల సరఫరాకు సంయుక్త బిడ్ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్బస్ తొలి 16 విమానాలను సరఫరా చేయనుంది. ఆపై మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్) తయారీ, అసెం బ్లింగ్ ద్వారా అందిస్తుంది. ప్రధానంగా విడిభాగాలను అసెంబ్లింగ్ చేయడం, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, దేశీ పరికరాల పరిశీలన, నిర్వహణ వంటి కార్యక్రమాలను టీఏఎస్ చేపడుతుంది. తగిన పరిశీలన, పటిష్ట పరిశోధన చేశాక ఈ ఒప్పందానికి టీఏఎస్ను దేశీ ఉత్పాదక సంస్థగా ఎంపిక చేసుకున్నట్లు ఎయిర్బస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏవ్రో విమానాలను ఐఏఎఫ్ తొలిసారి 1960లో అందుకుంది. -
ఆకాశ వీధిలో అద్భుతః
ఈ విమానం డిజైన్ చూశారా.. 2050లో విమానయానం ఇలాగే ఉండబోతోందట. ఈ విషయాన్ని విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ చెబుతోంది. ఈ భవిష్యత్ విమానాల్లో మసాజ్ సీట్లు, కావాలనుకున్నప్పుడు విమానం పై భాగమంతా పారదర్శకంగా మారిపోయే ఏర్పాట్లు ఉంటాయి. అంటే.. మేఘాల్లో నిజంగానే తేలుతున్న అనుభూతి కలుగుతుందన్నమాట. అంతేకాదు.. మనం కూర్చునే సీట్లు.. మన శరీరంలోని వేడిని గ్రహించి.. విద్యుత్ను తయారుచేస్తాయి. విమానంలో గేమ్ జోన్స్, బార్లు వంటి సదుపాయాలెన్నో ఉంటాయి. విమానంలో ప్రయాణిస్తున్నట్లు కాకుండా.. ఏదో విహార యాత్రకు వెళ్లిన అనుభూతి ప్రయాణికులకు కలుగుతుందని ఎయిర్బస్ చెబుతుంది. ఇదంతా జరుగుతుందో లేదో తేలాలంటే.. 2050 రావాల్సిందే.. -
టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్కు 20 ఎయిర్బస్లు
-
టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్కు 20 ఎయిర్బస్లు
దోహా: టాటా-ఎస్ఐఏ ఎయిర్లైన్స్ సంస్థ సింగపూర్కు చెందిన బీఓసీ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ నుంచి 20 ఎయిర్బస్ విమానాలను లీజుకు తీసుకోనున్నది. ఈ సెప్టెంబర్-అక్టోబర్ నుంచి ఈ విమానాలను టాటా-ఎస్ఐఏకు అందజేయడం ప్రారంభిస్తామని బీఓసీకు చెందిన ఇన్వెస్టర్ రిలేషన్స్ హెడ్ క్లెయిరీ లియో వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న ఐఏటీఏ వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె ఈ వివరాలు తెలిపారు. కాగా ఈ సంస్థ ఇప్పటికే జెట్ ఎయిర్వేస్, స్పైస్జెట్- ఈ రెండు భారత విమానయాన సంస్థలకు కొన్ని విమానాలను లీజుకు ఇచ్చింది. టాటా సన్స్ సంస్థ సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి 51:49 భాగస్వామ్యంతో టాటా-ఎస్ఐఏ ఎయిర్లైన్స్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ఏ 320-200, ఏ 320-200(నియో) విమానాల ద్వారా తన సర్వీసులనందజేయనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా భారత్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఢిల్లీ కేంద్రంగా ముంబై, గోవా, పాట్నా, చంఢీగర్, శ్రీనగర్, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు విమాన సర్వీసులను నిర్వహించాలని ఈ సంస్థ యోచిస్తోంది. ఆ తర్వాత పుణే, లక్నో, వారణాసి, జైపూర్, కోల్కత, అమృత్సర్, బగ్దోగ్రా, ఇండోర్, కొచ్చిన్లకు విమాన సర్వీసులను విస్తరించనున్నది. ఈ సంస్థ విమానయాన సర్వీసులకు అనుమతిని ఇంకా పొందలేదు. కాగా టాటా గ్రూప్, ఢిల్లీకి చెందిన టెలిస్ట్రాలు భారత వెంచర్ భాగస్వాములుగా ఉన్న ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. -
నింగికెగిరిన విద్యుత్ విమానం
లండన్: ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యుత్ విమానం తొలిసారిగా నింగికెగిరింది. ప్రయోగాత్మకంగా రూపొందించిన ‘ఈ-ఫ్యాన్’ అనే ఈ చిన్న విమానం ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలోని బోర్డీక్స్ సమీపంలోనున్న విమానాశ్రయం నుంచి తొలి గగనయానానికి బయలుదేరింది. ఎలక్ట్రిక్ విమానాల ద్వారా విమానయాన వ్యయం గణనీయంగా తగ్గుతుందని దీనిని తయారు చేసిన ‘ఎయిర్ బస్’ సంస్థ వెల్లడించింది. దీని ధ్వని కూడా తక్కువేనని, హెయిర్ డ్రయ్యర్ ధ్వని కంటే ఎక్కువేమీ ఉండదని తెలిపింది. ‘ఎయిర్బస్’ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... ఈ విమానం పొడవు 19 అడగులు. 120 లీథియం అయాన్ పాలిమర్ బ్యాటరీల సాయంతో ఇది ప్రయాణిస్తుంది. రీచార్జింగ్ అవసరం లేకుండా ఇది గంటసేపు నిరంతరాయంగా ప్రయాణించే అవకాశం ఉంది. అయితే గత నెల తొలిసారిగా జరిపిన పరీక్షలో దీనిని పది నిమిషాలు మాత్రమే నడిపారు. పెట్రోలుతో ప్రయాణించే సాధారణ విమానాల్లో ప్రయాణించేందుకు గంటకు 55 డాలర్లు ఖర్చవుతుంది. ‘ఈ-ఫ్యాన్’లోనైతే కేవలం 16 డాలర్ల ఖర్చుతోనే గంటసేపు ప్రయాణించవచ్చు. -
30 నుంచి సూపర్జంబో విమానాలు
న్యూఢిల్లీ: ఒకేసారి 471 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఎయిర్బస్ ఏ-380 విమానాలు ఈ నెల 30వ తేదీ నుంచి భారత్కు రాకపోకలు ప్రారంభించనున్నాయి. సూపర్జంబోలుగా పిలిచే వీటిని భారత్లో తొలిసారిగా ఢిల్లీ, ముంబై నగరాలకు సింగపూర్ ఎయిర్లైన్స్ నడపనుంది. ఈ రెండు నగరాలతో పాటు హైదరాబాద్, బెంగళూరుల నుంచి ఈ విమానాలు నడపడానికి ప్రభుత్వం గత జనవరిలో అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై నగరాలకు రోజూ రాకపోకలు సాగిస్తున్న బోయింగ్ 777 విమానాల స్థానంలో ఏ-380లను ప్రవేశపెడుతున్నామని సింగపూర్ ఎయిర్లైన్స్ జనరల్ మేనేజర్ (ఇండియా) డేవిడ్ లౌ మంగళవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఏ-380 విమానంలో ఫస్ట్క్లాస్ సూట్స్, బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్లలో మొత్తం 471 సీట్లుంటాయని వివరించారు. భారత్కు ఏ-380 విమాన సర్వీసులు నడపాలని తాము ఎంతో ఆసక్తితో ఎదురుచూశామనీ, ఇప్పుడు తమకు అనుమతి లభించిందనీ చెప్పారు. ఢిల్లీ, ముంబైల నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్లో వారానికి ఆరువేల సీట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. సింగపూర్ ఎయిర్లైన్స్ 10 శాతం డిస్కౌంట్ ముంబై: విమాన ప్రయాణికులపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. వచ్చే నెల నుంచి ఏ380 విమానాన్ని నడపనున్న సింగపూర్ ఎయిర్లైన్స్ కంపెనీ ప్రీమియం క్లాస్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. దేశీయ విమాన ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. తరుచుగా విమాన ప్రయాణాలు చేసే- క్రిస్ప్లైయర్కు 10 శాతం బోనస్ మైల్స్ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇక తరుచుగా ప్రీమియం క్లాస్లో ప్రయాణించే వారికి ఏ380 విమానంలో సూట్స్ టికెట్ల కొనుగోళ్లపై 10 శాతం అదనపు డిస్కౌంట్ను ఇస్తామని, ఈ ఆఫర్ ఈ నెల 1 నుంచి 15 లోపు బుక్ చేసుకునే టికెట్లకే వర్తిస్తుందని వివరించింది. జూన్ 1 నుంచి జూలై 15 ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ కంపెనీ ఈ నెల 30 నుంచి ముంబై-న్యూఢిల్లీ రూట్లలో ఏ380ను నడపనున్నది.