BBC
-
న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేవు
న్యూఢిల్లీ: భారతదేశం ఏకైక రాజకీయ పార్టీ ఆధిపత్యం చెలాయించే దేశంగా మారిపోతోందన్న వాదనను సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్( DY Chandrachud) తిరస్కరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు సైతం బలంగా ఉన్నాయని చెప్పారు. తాను సీజేఐగా పనిచేసినప్పుడు రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి తనపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని స్పష్టంచేశారు. ఇండియాలో న్యాయ వ్యవస్థ చట్టపరిధిలోనే పనిచేస్తోందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు ఉన్నట్లు తాను భావించడం లేదన్నారు. తాజాగా బీబీసీ ‘హర్డ్టాక్’ఇంటర్వ్యూ(BBC Hard Talk interview)లో జర్నలిస్టు స్టీఫెన్ సకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ఆధిపత్యం కింద ఇండియా ఏక పార్టీ రాజ్యంగా మారుతోందన్న వాదనను తాను అంగీకరించలేనని పేర్కొన్నారు. ఈ మేరకు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వెలువడిన సంపాదకీయాన్ని ఖండించారు.అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ప్రాంతీయ పార్టీలతోపాటు రాష్ట్రస్థాయిలో రాజకీయాలకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పడానికి 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయని, దేశంలో ప్రాంతీయ ఆకాంక్షలు, గుర్తింపునకు ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని వివరించారు. సుప్రీంకోర్టు పట్ల ప్రజల విశ్వాసంసొంత పార్టీ నాయకులను రక్షించుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి న్యాయ వ్యవస్థపై అధికార పార్టీ ఒత్తిడి పెంచుతోందని ఆరోపించడం సరైంది కాదని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అలాంటి ఒత్తిళ్లేవీ తనకు ఎదురు కాలేదన్నారు. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అనర్హతకు గురయ్యారని, ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు.ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగే అవకాశం కల్పించిందని అన్నారు. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇండియా కోర్టులు స్థిరంగా పరిరక్షిస్తున్నాయని చెప్పారు. ఎన్నో కేసుల్లో నిందితులకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే కోర్టులు ఉన్నాయని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు స్పష్టం చేసిందని వివరించారు. కొన్ని కేసుల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అయినప్పటికీ పౌరుల స్వాతం్రత్యాన్ని కాపాడే విషయంలో సుప్రీంకోర్టు ముందు వరుసలో ఉంటోందని పేర్కొన్నారు. అందుకే ప్రజలు సుప్రీంకోర్టు పట్ల సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని వెల్లడించారు.లింగ వివక్ష, వారసత్వ జాడ్యం లేదుభారత న్యాయ వ్యవస్థపై ఆగ్రవర్ణ హిందూ పురుషులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఇక్కడ కూడా వారసత్వ జాడ్యం కనిపిస్తోందన్న అభిప్రాయాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఖండించారు. న్యాయ వ్యవస్థలో లింగ వివక్ష భారీగా తగ్గిపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో కొత్తగా చేరుతున్న వారిలో 50 శాతానికిపైగా మహిళలే ఉంటున్నారని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య 60 నుంచి 70 శాతం ఉందన్నారు. న్యాయ విద్య మహిళలకు చేరువవుతోందని తెలిపారు. లా స్కూళ్లలో మహిళల ప్రవేశాలు పెరుగుతున్నాయని, వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు.న్యాయవాదులు, న్యాయమూర్తులు వారసత్వంగా కోర్టుల్లో చేరుతున్నట్లు తాను అనుకోవడం లేదన్నారు. తన తండ్రి వై.వి.చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని గుర్తుచేశారు. సీజేఐగా ఉన్నంత కాలం కోర్టులో అడుగుపెట్టొద్దంటూ తన తండ్రి తనకు చెప్పారన్నారు. దీంతో హార్వర్డ్ లా స్కూల్లో మూడేళ్లు చదివానని, తన తండ్రి రిటైర్ అయిన తర్వాతే మొదటిసారి కోర్టులో అడుగుపెట్టానని వెల్లడించారు.ఇండియాలో చాలామంది లాయర్లు, జడ్జిలకు ఎలాంటి న్యాయ నేపథ్యం లేదన్నారు. అయోధ్య రామమందిరం, ఆర్టీకల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వంటి కీలక అంశాలపై నిబంధనల ప్రకారమే తీర్పులు ఇచ్చినట్లు జస్టిస్ చంద్రచూడ్ స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజకీయ వాస్తవికతల మధ్య చక్కటి సమతుల్యత పాటిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అది మర్యాదపూర్వక కలయిక గత ఏడాది వినాయక చవితి సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరైన సంగతి తెలిసిందే. సీజేఐ ఇంటికి ప్రధానమంత్రి రావడం అత్యంత అరుదు. ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. సీజేఐని ప్రభావితం చేసేందుకు మోదీ ప్రయత్నిచారని మండిపడ్డాయి. ఈ అంశంపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు.ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగానే తన నివాసానికి వచ్చారని చెప్పారు. దీనిపై అతి విశ్లేషణ అవసరం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లోని వ్యక్తుల మధ్య ఉండే కనీస మర్యాదలను అర్థం చేసుకొనేటంత పరిపక్వత మన వ్యవస్థకు ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మర్యాదపూర్వకమైన కలయికల ప్రభావం కేసుల విచారణపై ఎంతమాత్రం ఉండదన్నారు.ప్రధాని మోదీ తన నివాసానికి రాక ముందు, వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు వెలువరించిందని, ఇందులో ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చిన తీర్పులు సైతం ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ పాత్ర పార్లమెంట్లో ప్రతిపక్షం పోషించే పాత్రలాంటిది కాదని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. కేసులను విచారించడం, చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడడం మాత్రమే న్యాయ వ్యవస్థ బాధ్యత అని తేల్చిచెప్పారు. -
మన్మోహన్కు అంతర్జాతీయ మీడియా నివాళులు
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణానికి అంతర్జాతీయ మీడియా సంతాపం తెలిపింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటన నడిపిన నాయకుడని ప్రపంచ మీడియా ప్రశంసించింది. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి: బీబీసీ 1991లో ఆర్థిక మంత్రిగా, 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో మన్మోహన్సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన కీలక సరళీకృత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. భారత అత్యున్నత పదవిని నిర్వహించిన మొదటి సిక్కుగా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నేత. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. పదవులు నచ్చని రాజు: రాయిటర్స్ మన్మోహన్ సింగ్.. పదవులు నచ్చని రాజు. భారత్లో అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరు. ఆయన పాలనలో జరిగిన ఆర్థిక వృద్ధి లక్షలాదిమందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చింది. గొప్ప ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందినా.. సోనియాగాంధీ చేతిలోనే ప్రభుత్వం ఉందనే విమర్శలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. దూరదృష్టిగల నేత: న్యూయార్క్ టైమ్స్ మన్మోహన్సింగ్ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపైకి నడిపించిన దూరదృష్టి గల నేత, మృదుభాíÙ. పాకిస్తాన్తో సయోధ్య కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. సమగ్రతకు చిహ్నం: వాషింగ్టన్ పోస్ట్ మన్మోహన్సింగ్ టెక్నోక్రాట్ నుంచి ప్రధాని స్థాయికి నాటకీయంగా ఎదిగారు. భారత్–అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఆయన హయాంలో జరిగిన ఇండో–యూఎస్ పౌర అణు ఒప్పందం ఒక మైలురాయి. సమగ్ర నాయకుడైన ఆయన శక్తిహీనులని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి: బ్లూమ్బర్గ్ మన్మోహన్సింగ్ గొప్ప సంస్కర్త. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అవినీతి కుంభకోణాలతో రెండో పర్యాయంలో ఆయన సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇది పెట్టుబడిదారులను నిరాశపరిచింది. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. ఎల్లలెరుగని స్నేహితుడు: ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మన్మోహన్సింగ్ పాత్ర అమోఘం. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఆయన చేసిన కృషి, సంస్కరణలు ఆయన పదవీకాలంలో మైలురాళ్లు. సామాజిక విధానం, దౌత్యంలో ఆయన నాయకత్వం గొప్పది. 2జీ స్పెక్ట్రమ్ కేసు, బొగ్గు కుంభకోణం వంటి వివాదాలు ఆయన తర్వాతి కాలాన్ని దెబ్బతీశాయి. సౌమ్యుడైన నాయకుడు: అల్ జజీరా మన్మోహన్ సింగ్ సౌమ్య ప్రవర్తన కలిగిన టెక్నోక్రాట్. గొప్ప వ్యక్తిగత సమగ్రత కలిగిన నాయకుడు. దూర దృష్టితో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. -
బిబిసి 100 విమెన్ 2024...నూరులో ఆ ముగ్గురు
ఎప్పటిలాగే 2024 సంవత్సరానికి కూడా ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంత మహిళలను బీబీసీ ఎంపిక చేసి ప్రకటించింది. వారిలో ముగ్గురు భారతీయ మహిళలు. సామాజిక కార్యకర్త అరుణా రాయ్ కుస్తీ యోధురాలు వినేష్ ఫొగట్ అనాథ శవాల అంతిమ సంస్కారాలు చేసే పూజా శర్మ... ఈ ముగ్గురి ఎంపిక ఎందుకో బీబీసీ ఇలా తెలిపింది.బి.బి.సి బి.బి.సి 2024 సంవత్సరానికి ‘బీబీసీ 100 విమెన్’ లిస్ట్ను విడుదల చేసింది. ప్రపంచ దేశాల నుంచి ఎంతో వడపోత తర్వాత ఈ 100 మందిని ఎంపిక చేయడం ఆనవాయితీ. పర్యావరణం, సంస్కృతి–విద్య, వినోదరంగం–క్రీడారంగం, రాజకీయరంగం, సైన్స్–హెల్త్ అండ్ టెక్నాలజీ విభాగల నుంచి సమాజం మీద విస్తృతమైన ప్రభావం ఏర్పరిచిన స్త్రీలను ఎంపిక చేసింది. వీరిలో వ్యోమగామి సునీతా విలియమ్స్, రేప్ సర్వైవల్ గిసెల్ పెలికట్, నటి షెరాన్ స్టోన్, ఒలింపిక్ అథ్లెట్ బెబాక అండ్రాడె, నోబెల్ శాంతి విజేత నాడియా మురాద్, రచయిత్రి క్రిస్టీనా రివెరా గర్జా తదితరులు ఉన్నారు. అలాగే మన దేశం నుంచి అరుణా రాయ్, వినేష్ ఫొగట్, పూజాశర్మలను ఎంపిక చేసింది. ‘ఓర్పు, పోరాట పటిమతో నిలబడి తమ తమ రంగాలలో, సమూహాలలో మార్పు కోసం కృషి చేస్తున్న ధీరలు వీరంతా’ అని బీబీసీ ఈ సందర్భంగా అంది. మన దేశం నుంచి ఎంపికైన ముగ్గురు ఎందుకు ఎంపికయ్యారు?పూజా శర్మÉì ల్లీకి 27 సంవత్సరాల పూజాశర్మ తల ఒంచక న్యాయం వైపు నిలబడి పోరాడటం వల్లే ముందుకు వెళ్లగలరు అని ఈ విధానం వినేష్‡కు ‘చనిపోయిన వ్యక్తిని సగౌరవంగా సాగనంపే సేవ’ చేయాలని తన జీవితంలోని సొంత విషాదం వల్ల గట్టిగా అనిపించింది. ఆమె సోదరుణ్ణి మూడేళ్ల క్రితం ఒక కొట్లాటలో చంపేశారు. ఆ గొడవ వల్ల అతని దహన కార్యక్రమాలకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు పూజాశర్మ తానే పూనుకొని దహన సంస్కారాలు చేసింది. ఇలాంటి సందర్భాలలోనే పేదరికం వల్ల, ప్రమాదాల వల్ల అనారోగ్యం వల్ల దహన సంస్కారాలకు నోచుకోని అనాథ శవాలను, దిక్కూమొక్కూ లేని శవాలను తానే గౌరవంగా సాగనంపాలని నిర్ణయించుకుంది. వెంటనే ‘బ్రైట్ ది సోలా ఫౌండేషన్’ స్థాపించి ఇప్పటికి వందల శవాలకు దహన సంస్కారాలు స్వయంగా నిర్వహించింది. ఇందుకు మొదట్లో కొంతమంది నుంచి విమర్శలు ఎదురైనా, ఇది ఆడవాళ్ల పని కాదు అని ఆమెను వారించినా, ఆమె చేసే పనులు సోషల్ మీడియా ద్వారా మద్దతు కూడగట్టుకున్నాయి. సేవారంగంలో ఎంతో మానవీయమైన ఆమె కృషికి నేడు దక్కిన గౌరవం బిబిసి 100లో చేరిక.అరుణా రాయ్అరుణా రాయ్ (74) తన జీవితం ఆరంభం నుంచి నేటి వరకూ అట్టడుగు వర్గాల జీవనమార్పు కోసం పోరాడుతూనే ఉన్నారు. ‘పెద్ద ముందంజలు కాదు... ఇరుగు పొరుగువారి చిన్న చిన్న ముందడుగులు అవసరం’ అనే ఆమె తన జీవితమంతా ఆదర్శాల కోసం నిలబడ్డారు. మద్రాసులో పుట్టి పెరిగిన అరుణ బాల్యం నుంచి ఛాందస భావాలను నిరోధించారు. తన 21 ఏళ్ల వయసులో 1967లో ఐ.ఏ.ఎస్ పరీక్ష రాసి ఎంపికయ్యారు. ఆ రోజుల్లో ఐ.ఏ.ఎస్ రాసే మహిళలే లేరు దేశంలో. 1967లో 10 మాత్రమే ఎంపికైతే వారిలో ఒకరు అరుణ. తమిళనాడులో కలెక్టర్గా పని చేసిన అరుణ గ్రామాలు బాగుపడాలంటే తన ఉద్యోగం పనికిరాదని అట్టడుగు వర్గాల చైతన్యం ముఖ్యమని, వారి ఆర్థిక స్వావలంబన తప్పదని భావించి ఉద్యోగానికి రాజీనామా చేసి తన భర్త సంజిత్ రాయ్తో కలిసి ‘బేర్ఫుట్ కాలేజ్’ స్థాపించి గ్రామీణుల కోసం పని చేశారు. ‘మజ్దూర్ కిసాన్ సంఘటన్’,‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్’ వీటన్నింటిలో ఆమెవి కీలక బాధ్యతలు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉనికిలోకి రావడానికి అరుణ కూడా ఒక కారణం. చైతన్యవంతమైన సమాజం, స్త్రీల హక్కుల కోసం ఆమె చేస్తున్న ఎడతెగని కృషే ఆమెను బీబీసీ 100 విమెన్కు చేర్చింది. -
ముఖాముఖి సంభాషణల్లో మేటి
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడమంటే పైపై ప్రశ్నలు అడగటం కాదు. లోతుగా, సునిశితంగా, ప్రేక్షకులకు మరింత సమాచారాన్ని, ఆ విషయం మీద మంచి అవగాహనను ఇచ్చేలా ఆ సంభాషణ జరగాలి. అలాంటి అర్థవంతమైన ఇంటర్వ్యూలకు పెట్టింది పేరు బీబీసీలో వచ్చే ‘హార్డ్టాక్’. 1997లో మొదలైన ఈ కార్యక్రమం ఆంగ్లంలో వార్తలు చూసేవారికి ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. అసలు బీబీసీ వరల్డ్ సర్వీస్ను ప్రేక్షకులు ఇష్టపడేదే ఈ ఇంటర్వ్యూ కోసం! నెల్సన్ మండేలా, మిఖాయిల్ గోర్బచేవ్, కోఫీ అన్నన్, బేనజీర్ భుట్టో, హ్యూగో చావెజ్ లాంటి ఎందరో భిన్న దేశాల నాయకులను ఇందులో ఇంటర్వ్యూ చేశారు. అయితే, పాతికేళ్లుగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఖర్చులు తగ్గించుకోవడానికి ఆపేస్తున్నారని తెలియడం నిరాశ కలిగిస్తోంది.‘హార్డ్టాక్’ పేరుతో బీబీసీలో ఓ కార్య క్రమం వస్తుంది. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. ప్చ్... రానున్న మార్చి నుంచి ఈ కార్యక్రమం ఉండదు. ఈ వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. కొంత నిస్పృహ కూడా ఆవరించింది. అసలా నిర్ణయమే మూర్ఖమైంది అనుకుంటున్నా. అయితే నిర్ణయం జరిగిపోయింది, ఇక చేసేందుకు ఏమీ లేదు.ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా బీబీసీ... హార్డ్ టాక్ను నిలిపేస్తోందని తెలిసింది. సుమారు 70 కోట్ల పౌండ్లు సంస్థకు ఆదా చేయాలన్నది ఆలోచన. అసలీ ప్రోగ్రామ్కు ఎంత ఖర్చు అవు తోందో నాకు స్పష్టంగా తెలియదు కానీ... 70 కోట్ల పౌండ్లలో చాలా చాలా తక్కువ భాగమని మాత్రం అనుకుంటున్నా. నా భయమల్లా ఇది ఏదో చేయబోయి, ఇంకేదో అయినట్లు అవుతుందేమో అని! ఈ నిర్ణయం తీసుకున్నందుకు భవిష్యత్తులో బీబీసీ కచ్చితంగా పశ్చాత్తాప పడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం... నా లాంటి ఫాలో యర్లు బాగా నిరుత్సాహపడతారు. ఎందుకంటే హార్డ్టాక్ కేవలం ఒక టాక్షో కాదు... బీబీసీలో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకోటి లేదు.అంతెందుకు చాలా ఛానెళ్లలోనూ లేదు. ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన, విషయాన్ని పైస్థాయిలో చూడగలగడం, ఉద్వేగపూరిత లోతు ఉండే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో తప్ప కనబడవు.సరే... ఏంటి హార్డ్టాక్ ప్రత్యేకత? ముఖాముఖి ఇంటర్వ్యూలలో దీర్ఘకాలం నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది. నిర్దిష్ట అంశంపై ప్రముఖుడు ఒకరు మాట్లాడటం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ముఖాముఖి ఇంటర్వ్యూల్లో చాలా దూకుడుగా ఉంటుంది. చర్చకు ఉద్దేశించిన అంశం ముందు వెనుకల గురించి క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసు కున్న తరువాతే కార్యక్రమం జరుగుతుంది. ప్రోగ్రామ్ పూర్తయిన తరువాత మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుందనడం అతిశయోక్తి కాదు. ఉన్న అనుమానాలు తీరతాయి కూడా! ఏ న్యూస్ బులిటెన్ కూడా విడమరచి చెప్పలేని విధంగా హార్డ్టాక్లో విషయాలపై చర్చ జరుగు తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఛానల్లో అవశేషం కాదు... గుండెకాయ లాంటిది!కొంచెం వివరంగా ఆలోచిస్తే ఇంకో విషయం స్పష్టమవుతుంది. బీబీసీకి అసలు విషయం అర్థం కాలేదనాలి. సుదీర్ఘ ఇంటర్వ్యూలు... ప్రశ్నించేందుకు, వివరాలు తెలుసుకునేందుకు, మనం అనుకున్న విష యాలపై పట్టుబట్టేందుకు, విషయం లోతుల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇది చిన్న చిన్న ఇంటర్వ్యూల ద్వారా అసాధ్యం. హార్డ్టాక్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ సాధ్యం కాక పోవచ్చు. కానీ... చాలామంది ఇష్టపడే కార్యక్రమం.చాలా ఎక్కువగా పొగుడుతున్నానని అనుకుంటూ ఉంటే ఒక సారి ఆలోచించండి. బీబీసీలో హార్డ్టాక్ ప్రెజెంటర్లకే పేరు ప్రఖ్యా తులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? అప్పట్లో టిమ్ సెబాస్టియన్ చాలామంది అభిమానం, ఆరా«ధన పొందిన హార్డ్టాక్ ప్రెజెంటర్ (1997 నుంచి ఎనిమిదేళ్ల పాటు చేశారు)! ఈయనతో ఇంటర్వ్యూ అంటే... చాలామంది ఇబ్బంది పడేంత జనాదరణ సంపాదించు కున్నారు టిమ్. ఇంటర్వ్యూలు ఎదుర్కొన్న వారు టిమ్ను ఇష్టపడ లేదన్నది బహిరంగ రహస్యం.2005 నుంచి హార్డ్టాక్ కార్యక్రమాన్ని స్టీఫెన్ సాకర్ నిర్వ హిస్తున్నారు. ఈయన టిమ్ కంటే చాలా భిన్నం. కానీ ఆదరణ మాత్రం బాగా ఉంది. టిమ్ వైఖరి చాలా దూకుడుగా ఉండేది. అవ తలి వ్యక్తికి పదే పదే అడ్డు తగిలేవాడు. సూటి ప్రశ్నలు సంధించేవాడు. స్టీఫెన్ కొంచెం ఆలోచించి ప్రశ్నలు వేస్తాడు. కొన్నిసార్లు ప్రొఫెసర్ మాదిరిగా వ్యవహరిస్తాడు కూడా! టిమ్ విధ్వంసం లాంటి వాడైతే స్టీఫెన్ నెమ్మదిగా అవతలి వ్యక్తి మెదడును ఆక్రమించేసే టైపు. టిమ్, స్టీఫెన్ లు ఎవరైనా సరే... నిష్టూర సత్యాలతో అతిథిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడతారు. నా భయమల్లా బీబీసీ మరీ మొద్దుబారిపోతోందేమో అని! అత్యద్భుతమైన కార్యక్రమాలను అకస్మాత్తుగా నిలిపివేయడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ‘న్యూస్నైట్’ ఛానెల్ మొత్తానికి హైలైట్గా ఉండేది. రెండు మూడు కథనాలను మాత్రమే చర్చించేవారు కానీ... చాలా లోతుగా సాగేది. ఈ కార్యక్రమ ప్రెజెంటర్ జెరెమీ ప్యాక్స్మన్ మంచి జర్నలిస్టుగా ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో పేరొందారు. న్యూస్నైట్లో వచ్చిన మరో గొప్ప వార్తా కథనం ప్రిన్ ్స ఆండ్రూతో ఎమిలీ మైట్లిస్ నిర్వహించిన ఇంటర్వ్యూ. అన్నీ పోయాయి. ఇప్పుడు కార్యక్రమాలన్నీ న్యూస్ బులిటెన్ ను మరింత పొడిగించినట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రతి వారం రాత్రి 10 గంటలకు తప్పకుండా చూడాలని అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు... చూడకపోయినా ఏం కాదులే అన్న స్థితికి వచ్చేశాం. చాలా మంది పరిస్థితి కూడా ఇదే! విచిత్రమైన విషయం ఏమిటంటే... బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ ‘వరల్డ్ సర్వీస్’ కోసం అదనపు నిధులు కావాలంటూ ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. హార్డ్టాక్ మూతపడుతోందన్న వార్తలు రాగానే స్టీఫెన్ చేసిన ఒక ట్వీట్ గుర్తుకొస్తోంది: ‘‘అద్భు తమైన ప్రొడ్యూసర్లు, పరిశోధకులు ఉన్న బృందాన్ని విడదీశారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమం అనేది ప్రజాస్వామిక భావప్రకటనకు ఎంత ముఖ్యమో టిమ్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.’’హార్డ్టాక్ ప్రభావశీలత, ఆ కార్యక్రమం ద్వారా వ్యక్తమయ్యే భావాలు ఎంత కీలకమైనవో టిమ్ డేవీకి తెలుసా? బీబీసీ వరల్డ్ కార్యక్రమం చూసేదే అందులోని హార్డ్టాక్ కోసమని ఆయన అర్థం చేసుకున్నారా? ‘హార్డ్టాక్’ను ఎత్తేయడం ఇప్పుడు దాన్ని చూడకుండా ఉండటానికి మరో అదనపు కారణం అవుతుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’
అంతరిక్ష ప్రయోగంలో (Chandrayaan-3) భారత్ విజయంపై బ్రిటీష్ మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేని భారత్కు అంతరిక్ష ప్రయోగాల కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం అవసరమా? అంటూ డిబెట్లు పెట్టి ప్రశ్నిస్తున్నాయి. అలా ప్రశ్నించిన బీబీసీ యాంకర్కు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా గూబ గుయ్యిమనేలా కౌంటర్ ఇచ్చారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డుకెక్కింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్–3 మిషన్ ఘనంగా ముగించి.. 140 కోట్ల మంది భారతీయల హృదయాలను ఆనందంతోనూ ఒకింత విజయగర్వంతోనూ నింపింది. అయితే, భారత్ విజయాన్ని దాయాది దేశం పాకిస్తాన్, అమెరికా వంటి దేశాలు అభినందనలతో ముంచెత్తుతుంటే బ్రిటీష్ మీడియా సంస్థ బీబీసీ తన అక్కసు వెళ్లగక్కుకుంది. మరుగుదొడ్లే లేవు 700 మిలియన్ల మందికి కనీస మరుగదొడ్డి సదుపాయాలు లేవని.. అంతటి పేదరికంతో ఉన్న భారతదేశం.. అంతరిక్ష ప్రయోగానికి ఇంత మొత్తంలో ఖర్చు చేయాలా? అని ప్రశ్నిస్తూ బీబీసీ డిబేట్లు పెడుతోంది. అలా ఓ బీసీసీ యాంకర్ భారత్ విజయంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహినూర్ డైమండ్ను దోచుకొని బీబీసీ యాంకర్ డిబెట్ను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇలా ట్వీట్ చేశారు. నిజం ఏంటంటే? పేదరికం దశాబ్దాల వలస పాలన ఫలితం. మా నుంచి అత్యంత విలువైన ఆస్తి కోహినూర్ వజ్రమే కాదు, మా నమ్మకాన్ని, శక్తి సామర్ధ్యాల్ని దోచుకున్నారు. అలాంటి మీరు మరుగుదొడ్లు, అంతరిక్ష అన్వేషణ పెట్టుబడులపై ప్రశ్నించడం మీ వైఖరికి అద్దం పడుతోంది. మేం చంద్రునిపైకి వెళ్లడం అంటే ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సహాయపడుతుంది. పరిశోధనా రంగంలో పురోగతిని సాధించేందుకు మాపై మాకు నమ్మకాన్ని కలిగిస్తుంది. పేదరికం నుండి బయటపడేయాలనే ఆకాంక్షను ఇస్తుంది. అసలు పేదరికం ఏంటంటే ఆకాంక్షల్లో కూడా పేదరికాన్ని కలిగి ఉండటమే’ అంటూ ఆనంద్ మహీంద్రా ధీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Really?? The truth is that, in large part, our poverty was a result of decades of colonial rule which systematically plundered the wealth of an entire subcontinent. Yet the most valuable possession we were robbed of was not the Kohinoor Diamond but our pride & belief in our own… https://t.co/KQP40cklQZ — anand mahindra (@anandmahindra) August 24, 2023 చదవండి👉‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’ -
బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?
గత ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ బృందం ‘సర్వే’ కోసం బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో పరిశీలనలు మాత్రమే జరుగుతున్నాయని, సోదాలు చేయడం లేదని (సీబీడీటీ )సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీనియర్ అధికారి ఒకరు నాడు స్పష్టం చేశారు. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలను తనిఖీ చేసేందుకు పన్ను అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో మరో అధికారి తెలిపారు. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు ఈ చర్యలు చేపట్టడం విశేషం. అలాగే భారత ప్రభుత్వం బీబీసీ వలసవాద మనస్తత్వం కలిగి ఉందని ఆరోపించింది. యజమాని ఎవరు? బీబీసీ 1922, అక్టోబరు 18 న ఒక ప్రైవేట్ కంపెనీగా ఆవిర్భవించింది. అప్పట్లో దీనిని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా పిలిచేవారు. ప్రారంభంలో ఈ వ్యాపారంలో తనను తాను నిరూపించుకోవడానికి బీబీసీ ఎన్నో కష్టాలు పడింది. 1926 సార్వత్రిక సమ్మె సమయంలో విస్తృతమైన కవరేజ్ అందించి, బీబీసీ బ్రిటిష్ ప్రజల ఆదరణను చూరగొంది. అదే సంవత్సరంలో, పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ద్వారా బీబీసీ ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కార్పొరేషన్గా మార్పుచెందింది. దీనితో కంపెనీ.. పార్లమెంటుకు జవాబుదారీతనం కలిగివుండాలని నిర్ణయించారు. కానీ బీబీసీ దాని పని తీరు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. బీబీసీని జాన్ రీత్ (1889–1971) స్థాపించారు. 1922లో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా సంస్థను స్థాపించినప్పుడు దాని మొదటి జనరల్ మేనేజర్గా, 1927లో పబ్లిక్ కార్పొరేషన్గా మారినప్పుడు దాని మొదటి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ ప్రచార సాధనాలను ఎదుర్కొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మరో సమాచార మంత్రిత్వ శాఖను సృష్టించింది. దీనికి జాన్ రీత్ను సమాచార మంత్రిగా నియమించింది. ఐరోపాలో హిట్లర్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బ్రిటిష్ ప్రజలను మానసికంగా యుద్ధానికి సిద్ధం చేయడం అతని పనిగా ఉండేది. డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? బీబీసికి వచ్చే నిధులలో ఎక్కువ భాగం వార్షిక టెలివిజన్ ఫీజు ద్వారా వస్తుంది. ఇదే కాకుండా, బ్రిటన్ పార్లమెంట్ కూడా బీబీసీకి గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరుస్తుంది. బీబీసీకి ఇతర ఆదాయ వనరులు బీబీసీ స్టూడియోస్, బీబీసీ స్టూడియోవర్క్స్. భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? బీబీసీ భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1940 మే 11న ప్రారంభమైంది. విశేషమేమిటంటే, ఈ తేదీన విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో బీబీసీని ప్రారంభించడం వెనక ఉద్దేశ్యం భారత ఉపఖండంలోని సైనికులకు వార్తలను అందించడమే. బీబీసీ హిందీ డాట్ కామ్ 2001లో ప్రారంభమమైంది. ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి? -
నా దేశం నగ్నదేహమా?
అర నిమిషం నిడివి కూడా లేని ఆ వీడియో అణు విస్ఫోటనాన్ని తలపించింది. కోటానుకోట్ల మనసుల్ని షాక్కు గురిచేసిన ఆ విద్యుదావేశాన్ని కొలవడానికి వోల్టేజీ లెక్కలు సరిపోకపోవచ్చు. క్రోధం, దుఃఖం, అవమానం, అసహ్యం, భయం వగైరాలన్నీ సునామీ కెరటాల్లా గుండెల లోతుల్లోంచి దూసుకొస్తున్నాయి. మణిపురలో జరిగిన బర్బర క్రీడను కోట్ల గొంతుకలు ఖండిస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ వార్తాసంస్థలన్నీ ఈ అమానుషాన్ని ప్రముఖంగా ప్రకటించాయి. ఒక్క బీబీసీని అయితే బెదిరించగలిగాం కానీ ఇంతమందిని బెదిరించడం సాధ్యం కాలేదు. కనుక ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ప్రపంచం నివ్వెరపోయింది. మూకదాడులు చెలరేగిన ప్రతిచోటా మహిళల దేహాలు శత్రువుల చేతుల్లో ఆయుధాలుగా మారుతూనే ఉన్నాయి. చిత్రవధల రచనకు క్యాన్వాస్లవుతూనే ఉన్నాయి. ఈ ధోరణి మణిపురలో మాత్రమే ప్రారంభం కాలేదు. మణిపురతో అంతమూ కాదు. మూకదాడుల్లో తమ ప్రాబల్య విస్తరణ పరమార్థమున్న రాజకీయ శక్తులున్నంతకాలం మణిపురలు మండుతూనే ఉంటాయి. మానవత్వం కాలు తూనే ఉంటుంది. మణిపుర అల్లర్లను కేవలం మైతేయ్ (ఓబీసీ), కుకీ (ఎస్టీ)ల ఘర్షణగానే చూడాలా? అంతకు మించిన వృత్తాంతమున్నదా? అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మణిపుర జనాభాలో 53 శాతం మంది మైతేయ్ తెగవారు. వీరు ప్రధానంగా సారవంతమైన ఇంఫాల్ లోయభూముల్లోనే నివసిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే నాగా, కుకీ జాతులవారు 40 శాతం వరకు ఉంటారు. మిగిలినవారు చిన్నచిన్న గిరిజన తెగలు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన హిందువులు, ముస్లింలు. గిరిజన తెగల్లో అత్యధికులు క్రైస్తవులు. మైతేయ్ల్లో అత్యధికులు హిందు వులు. మహాభారతంలోని బభ్రువాహనునికి వారసులమని వారి విశ్వాసం. అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తిరుగుతూ తిరుగుతూ అక్కడకు చేరుకొని రాజకుమారి చిత్రాంగద ప్రేమలో పడతాడు. వీరికో కుమారుడు. వాళ్లనక్కడే వదిలేసి అర్జునుడు తన మానాన తాను వెళ్లిపోతాడు. యుద్ధం ముగిసి ధర్మరాజు చక్రవర్తి అయిన తర్వాత అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వాన్ని మణిపుర ప్రాంతం రాజకుమా రుడు బభ్రువాహనుడు బంధిస్తాడు. రక్షణగా వెళ్లిన అర్జు నుడిని కూడా ఓడించి గాయపరుస్తాడు. అదే ప్రాంతంలో ఉండే అర్జునుడి మరో భార్య ఉలూచి అనే నాగినికి విషయం తెలిసి నాగమణి ప్రభావంతో అర్జునుడిని కాపాడుతుంది. కథ సుఖాంతమై ఇద్దరు భార్యలతో అర్జునుడు హస్తినకు చేరుకుంటాడు. ఈ కథ యథాతథంగా వ్యాసభారతంలో లేదట! రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఒక నాటకంలో ఈ ఉదంతం ఉన్నదట! తెలుగు, కన్నడ భాషల్లో ‘బభ్రువాహన’ పేరుతో సినిమాలు కూడా వచ్చాయి. ఇందులో ఆసక్తిక రమైన విషయమేమిటంటే చిత్రాంగదది మైతేయ్ (మణి పురి) తెగ. ఉలూచిది నాగా తెగ. ఇప్పుడీ రెండు తెగలవారు అక్కడ గణనీయంగా ఉన్నారు. చిత్రాంగద గొప్ప యోధ. ఆమె తండ్రి చిత్రవాహనుడికి మగ సంతానం లేనందువలన ఆమెకు యుద్ధ విద్యల్లో తర్ఫీదునిస్తాడు. ఆమె శిక్షణలోనే రాటుదేలిన బభ్రువాహ నుడు తండ్రినే ఓడిస్తాడు. నిన్న మొన్నటి ఈరోమ్ షర్మిల వరకు మణిపురి మహిళల సాహస స్వభావం మనకు కనిపి స్తూనే ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 16 సంవత్సరాల పాటు ఈరోమ్ షర్మిల నిరాహారదీక్ష చేశారు. ఒక దశలో ఇంఫాల్ లోయ ప్రాంతాన్ని (ఎక్కువగా మైతేయ్లు నివసించే ప్రాంతం) చట్ట పరిధి నుంచి మినహాయించి ఈరోమ్ను దీక్ష విరమించాలని ప్రభుత్వం కోరింది. కొండ ప్రాంతాల్లోని గిరిజన తెగలు ఇంకా చీకటి చట్టం మాటున మగ్గుతుండగా తాను ఎట్లా ఉద్యమాన్ని విరమిస్తానని ఈరోమ్ ప్రశ్నించింది. ఆమె మైతేయ్ తెగ మహిళ. స్వభావ సిద్ధంగా ప్రజల మధ్య విభజన లేదు. చీకటి చట్టం మాటున మన సాయుధ జవాన్లు అన్ని తెగల మీద తమ దాష్టీకాన్ని ప్రయోగించారు. మహిళల మీద అత్యా చారాలు ఒక అలవాటుగా మార్చుకున్నారు. థాంజోమ్ మనోరమ అనే మహిళను పారా మిలటరీ జవాన్లు సామూహిక అత్యాచారం చేసి చంపేయడం అన్ని తెగల మహిళల్నీ కదిలించింది. కొందరు మహిళలు నగ్నంగా వీధుల్లోకి వచ్చి ‘ఇండియన్ ఆర్మీ... రేప్ అజ్’ అనే బ్యాన ర్తో ప్రదర్శన చేసిన ఘటన, ఇరవయ్యేళ్లు గడిచినా ఇంకా వెన్నాడుతున్న పీడకలగానే మిగిలిపోయింది. తెగల మధ్య సహజంగా ఉండే చిన్నచిన్న వైరుద్ధ్యాలు సెగలు గక్కే శత్రు వైరుద్ధ్యాలుగా పరిణమించవలసిన అవ సరం లేదు. ఆ అవసరం కొన్ని సంకుచిత శక్తులకున్నది. మంటల్లో చలికాచుకునే రాజకీయ శక్తులకున్నది. సంఘాన్ని మెజారిటీ – మైనారిటీలుగా విడగొట్టి మెజారిటీ పక్షాన పేటెంట్ హక్కు రాసుకొనే స్వార్థ వర్గాలకున్నది. మైనారిటీల మీద మూకదాడులకు మెజారిటీలను ఉసిగొలిపే వ్యూహ కర్తలకున్నది. ఈ మూకదాడులు క్షణికావేశాలు కావనీ, ప్రణాళికాబద్ధమేనని బిల్కిస్ బానో ఉదంతం మనకు చాటి చెప్పింది. గుజరాత్ అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులందరినీ అల్లరిమూక చంపేసింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ధైర్యంగా పట్టుదలతో హంతకుల మీద కేసు నడిపింది. వారికి శిక్ష పడింది. శిక్షాకాలం పూర్తి కాకముందే స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆ హంతకులు రాచమర్యాదలతో విడుదలయ్యారు. వారికి స్వాతంత్య్ర సమరయోధుల కంటే మిన్నగా స్వాగత సత్కారాలు లభించాయి. ఈ ఘటన నేర్పుతున్న పాఠమేమిటి? మణిపుర ఘటనలు ‘డబుల్ ఇంజన్’ సర్కార్ నిర్వాకమని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అది తప్పు. అక్కడున్నది ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనిపించే ఇంజన్లయితే కనిపించని ఆ మూడో ఇంజనే పరివార్... సంఘ్ పరివార్! ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన తెగల్లో క్రైస్తవ ప్రాబల్యం పెరుగుతుండడంతో పరివార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి వ్యూహం ఫలించడం మొదలైంది. కాషాయ పార్టీ అక్కడ బలం పుంజుకున్నది. మణిపుర అల్లర్లు ఎలా మొదల య్యాయి? ఒక మైతేయ్ మహిళను కుకీ తెగవారు రేప్ చేశారని ఒక ఫేక్ వార్త దావానలంగా వ్యాపించింది. క్షణాల్లో అటువంటి వార్తలను ప్రచారంలో పెట్టగల ప్రావీణ్యం ఎవరికి ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఎవరి అధీనంలో ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. వార్త ప్రచారమైందే తడవుగా వేల సంఖ్యలో మైతేయ్ ప్రజలు గుంపులు గుంపులుగా కుకీ గ్రామాల మీద పడ్డారు. ఒక్కరోజులోనే ఒక వర్గానికి చెందిన వందకు పైగా ప్రార్థనాలయాలు ధ్వంస మయ్యాయంటే, ప్రార్థనలు చేయించేవారిని వెతికి పట్టుకొని దాడులు చేశారంటే మనకు బోధపడుతున్న వాస్తవమేమిటి? అదే వరసలో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి దిగంబరంగా పరేడ్ చేయించారు. వారితో జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఒక అమ్మాయి సోదరుని, తండ్రిని చంపేశారు. ఆ ముగ్గురిలో ఒకరు ఆర్మీ జవాన్ భార్య. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. దేశాన్ని కాపాడాడు. తన భార్యను మాత్రం కాపాడుకోలేక పోయానని విలపిస్తున్నాడు. దేశాన్ని మెజారిటీ, మైనారిటీలుగా విడగొట్టడంలో మన పరివారం గణనీయమైన విజయాలే సాధించింది. మెజారిటీ వర్గాన్ని రంజింపజేయగల చక్కెరపూత భావ జాలాన్ని అది సృష్టించగలిగింది. అదే నేటి ఆధిపత్య భావజాలం. దేశం మీద పెత్తనం చేస్తున్నది. ఈ ఆధిపత్య భావజాలానికి మైనారిటీల మీద, నిమ్న జాతుల మీదనే చిన్నచూపు కాదు. జనాభాలో సగభాగమైన మహిళల మీదా చిన్నచూపే! దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికల మీద జాతీయ పతాకాల్లా ఎగరేసిన క్రీడాకారుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ దేశం గమనించింది. వాళ్లను అవమానించి వేధించినవాడు దర్జాగా పార్లమెంట్లో కూర్చుంటున్నాడు. ఆధిపత్య భావజాలంతో రెచ్చిపోతున్న నికృష్ట మూకలు నగ్నదేహాలతో ఆటలాడటాన్ని కూడా దేశం చూసింది. నేటి మన ఆధిపత్య భావజాలపు ప్రధాన వ్యూహం టార్గెట్ వర్గాలపై అసత్య ప్రచారాలు చేసి ఏకాకుల్ని చేయడం, వారంతా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనే భయాన్ని సమాజంలో కలిగించడం! చేతబడి అనే సాకు చూపి ఒక కుటుంబాన్ని ఊరంతా కలిసి చంపేయడాలు మనకు తెలిసిందే కదా! అదిగో ఆ మూఢత్వానికే మన వాళ్లు జాతీయ హోదా కల్పించారు. ఇప్పుడా చేతబడి ప్రచారాన్ని కుకీల మీద చేస్తున్నారు. వారంతా పరాయి దేశం వాళ్లట. లవ్ జిహాద్, గోహత్య వగైరా వగైరా చేతబడి వ్యూహాలతో ఎల్లకాలం నెట్టుకురావడం సాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటన గుర్తున్నది కదా! నాటి యూపీఏ ప్రభుత్వాన్ని చెత్త కుప్పలోకి విసిరేయడంలో చోదకపాత్ర పోషించిన ఉదంతం. మణిపుర మహిళల నగ్న పరేడ్ అంతకంటే చిన్న విషయమేమీ కాదు. దాని ప్రకంపనలు ఇప్పుడప్పుడే సద్దుమణగవు. నా దేశం నగ్న దేహం కాదు. అది నవచైతన్య పతాకం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అశ్లీల చిత్రాలను పంపించమని కోరాడు.. ఉద్యోగం గోవిందా..
లండన్: బీబీసీ ఛానల్ న్యూస్ ప్రెజెంటర్ ఒకరు 17 ఏళ్ల యువతి వ్యక్తిగత ఫోటోలను కోరుతూ అందుకు ప్రతిఫలంగా 35 వేల పౌండ్లు(సుమారు రూ.37 లక్షలు) దఫాలుగా చెల్లించిన ఉదంతంలో బీబీసీ ఎట్టకేలకు స్పందించింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న బీబీసీ ఉద్యోగిని విధుల నుండి తప్పించినట్లు తెలిపింది. 37 లక్షలు ఎర.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మీడియా ఛానల్ అయిన బీబీసీలో ఒక న్యూస్ ప్రెజెంటర్ సంస్థ ప్రతిష్టను దిగజార్చే పనికి పాల్పడ్డాడు. 2020లో పరిచయమైన ఓ అమ్మాయిని తన వ్యక్తిగత చిత్రాలను పంపించవలసిందిగా కోరాడు. అప్పటికి ఆ అమ్మాయి వయసు 17 ఏళ్ళు కాగా ఇప్పుడు 20 ఏళ్ళు. అలా పంపించినందుకుగాను ఆమెకు 35 యూకే పౌండ్లు(సుమారు రూ.37 లక్షలు) కూడా ఎరగా చూపించాడు. సున్నితమైన అంశం కాబట్టి.. ఈ విషయం ఆ అమ్మాయి తల్లికి తెలియడంతో బిబిసి ప్రెజెంటర్ విషయాన్ని సన్ మీడియా దృష్టికి తీసుకొచ్చింది. దీంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. బీబీసీ ఛానల్ ప్రతిష్ట దిగజారుతుందేమోనన్న భయంతో సంస్థ యాజమాన్యం సంఘటనపై జాప్యంగా వ్యవహరించింది. చివరికి ఛానల్ పై ఒత్తిడి అధికం కావడంతో సదరు ప్రెజెంటర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా బీబీసీ.. సంక్లిష్టమైన సమస్య కావడంతో సత్వరంగా చర్యలు తీసుకున్నాము. అయినా కూడా ఈ సంఘటనపై దర్యాపు చేసి నిజాలు వెల్లడించాలని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులను కోరింది. కల్చర్ సెక్రెటరీ లూసీ ఫ్రేజర్ బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డెవీతో ఈ విషయంపై మాట్లాడానని ఆయన దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నట్లు హామీ ఇచ్చారని ట్విట్టర్లో షేర్ చేసింది. I have spoken to BBC Director General Tim Davie about the deeply concerning allegations involving one of its presenters. He has assured me the BBC are investigating swiftly and sensitively. — Lucy Frazer (@lucyfrazermp) July 9, 2023 ఇది కూడా చదవండి: ఫ్రాన్స్ అల్లర్లు - అభివృద్ధి చెందిన దేశానికి ఎందుకీ గతి పట్టింది? -
నేడే చార్లెస్–3 పట్టాభిషేకం
లండన్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్మినిస్టర్ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు. ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్ బైబిల్ సూక్తులు చదివి వినిపిస్తారు. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు శుక్రవారం లండన్కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. -
బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు..
న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 (FEMA) నిబంధనల ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ గురువారం పేర్కొంది. ఫెమా నిబంధనల ప్రకారం.. కంపెనీ ఆర్థిక లావాదేవీల పత్రాలు సమర్పించాలని బీబీసీ ఇండియాను ఈడీ ఆదేశించింది. కొంతమంది బీబీసీ ఎగ్జిక్యూటివ్ల నుంచి స్టేట్మెంట్ల రికార్డింగ్ను కోరినట్లు ఈడీ సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే విదేశీ రెమిటెన్సుల (ప్రవాసుల నుంచి అందిన నిధులు) వివరాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీబీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీబీసీ డాక్యుమెంట్ భారత్లో ప్రసారం చేయకుండా బ్యాన్ విధించింది. దీనికి సంబంధించిన లింకుల్ని సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది. ఆ తరువాత కొద్ది రోజులకే ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులపాటు బీబీసీ ఉద్యోగులను విచారించారు. అయితే ఇవి సోదాలు కాదని.. సర్వే అని ఐటీ అధికారులు పేర్కొన్నారు. క్రమంలోనే తాజాగా ఫెమా యాక్ట్ కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. చదవండి: కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ కీలక నిర్ణయం.. సమైక్యంగా ఎన్నికలకు! -
చనిపోయిన వ్యక్తి కళ్లు, వెంట్రుకలతో బొమ్మ తయారీ.. చూసేందుకు క్యూ కడుతున్న జనం!
నేరాలు ఘోరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మళ్లీ ఎవరో ఎవరినో చంపి సంచిలో మూటకట్టి ఇలా పడేశారేమిటి అని అనుకుంటున్నారా.. అయితే మీరు గోనెసంచిలో కాలు వేసినట్లే. చూడ్డానికి అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న ఈ బొమ్మ పేరు జార్జ్. చార్లెస్ రాస్ అనే పురావస్తు నిపుణుడు తయారు చేశాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి 1930లో చనిపోతే అతని కళ్లు, వెంట్రుకలు తీసి, ఈ బొమ్మకు అమర్చాడు. ఇతనికి దెయ్యాల భవంతి కంటే భయం పుట్టించే భవనాన్ని ఏర్పాటు చేయటం ఇష్టం. ఇందుకోసం వివిధ రకాల భయంకరమైన బొమ్మలు, వస్తువులు తయారు చేసేవాడు. వీటన్నింటినీ నాటింగ్హామ్లోని హాంటెడ్ మ్యూజియంలో ప్రదర్శించేవాడు. చార్లీ ఈ జార్జ్ బొమ్మ పెట్టగానే, రోజూ అక్కడికి వచ్చే సందర్శకులు సంఖ్య పెరిగి, చార్లీ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే బీబీసీ చానెల్లో ప్రసారమయ్యే ‘బార్గైన్ హంట్’కు ఆహ్వానం కూడా అందుకున్నాడు. అక్కడికి చార్లీ తను తయారు చేసిన కొన్ని బొమ్మలను తీసుకెళ్లడంతో భయంకరమైన ఈ జార్జ్ బొమ్మ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ జార్జ్ బొమ్మను చూస్తుంటే సినిమాల్లోని అనాబెల్, చూకీ బొమ్మల కంటే భయంకరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. -
బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్లో పరిణామాలపై బ్రిటన్ స్పందన
బీబీసీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీసిన డాక్యుమెంటరీ పెనుదుమారమే రేపింది. తదనంతర నాటకీయ పరిణామాల నడుమ.. ఆ సంస్థ కార్యాలయాలపై ఐటీ పరిశీలనలు కొనసాగాయి. ఐటీ లెక్కల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించింది భారత ఐటీ శాఖ. ఈ పరిణామంపై యూకే ప్రభుత్వం పార్లమెంట్లో స్పందించింది. పైగా బీబీసీ సంపాదకీయ స్వేచ్ఛను సమర్థించింది కూడా. ఈ మేరకు హౌస్ ఆఫ్ కామన్స్లో లేవనెత్తిన అత్యవసర ప్రశ్నకు విదేశాంగ కామన్వెల్త్ అభివృద్ధి కార్యాలయం(ఎఫ్సీడీఓ) జూనియర్ మంత్రి డేవిడ్ రూట్లీ స్పందిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటీ శాఖ చేసిన ఆరోపణల గురించి అక్కడి(భారత) ప్రభుత్వంపై వ్యాఖ్యనించలేమన్నారు. కానీ మీడియా స్వేచ్ఛ, వాక్ స్వాంతంత్య్రం గురించి నొక్కి చెప్పారు. పైగా బలమైన ప్రజాస్వామ్యానికి అవే ముఖ్యమైన అంశాలన్నారు. అంతేగాదు భారతదేశంతో ఉన్న విస్తృతమైన లోతైన సంబంధాల గురించి ప్రస్తావించారు. అలాగే భారత ప్రభుత్వంతో అనేక సమస్యలను నిర్మాణత్మాకమైన పద్ధతిలో చర్చించేందుకు యూకేకు వీలు కల్సిస్తుందని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు తాము బీబీసీ కోసం నిలబడతాం, నిధులు సమకూరుస్తాం అని రూట్లీ కుండబద్ధలు కొట్టారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ అత్యంత ముఖ్యమైనదని భావిస్తున్నామని తేల్చి చెప్పారు. అందుకే బీబీసీకి సంపాదకీయ స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని రూట్లీ ధృఢంగా చెప్పారు. బీబీసీ మా ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష లేబర్ పార్టీని కూడా విమర్శిస్తుంది, దానికి ఆ స్వేచ్ఛ ఉందన్నారు. ఆ స్వేచ్ఛ చాల కీలకమైనదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన స్నేహితులకు అంటే భారతదేశంలోని ప్రభుత్వంతో సహా దీని ప్రాముఖ్యతను తెలియజేయగలగాలన్నారు. నాలుగు భారతీయ భాషలతో సహా.. బీబీసీ సంపాదకీయంగా స్వతంత్రంగా ఉంటుందని నొక్కి చ్పెప్పారు. ఈ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ముఖ్యమైన పాత్ర పోషించడమే గాక నాలుగు భారతీయ భాషలతో సహా మొత్తం 12 భాషల్లో సేవలందిస్తుందన్నారు.ఎందుకంటే ఇది మన స్వరం మాత్రమే గాదు బీబీసీ ద్వారా మన స్వతంత్ర స్వరాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చూసుకోవడం అతి ముఖ్యమని చెప్పారు. ఇదిలా ఉండగా, ఉత్తర ఐర్లాండ్ ఎంపీ జిమ్ షానన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ అత్యవసర ప్రశ్నను లేవనెత్తారు. ఆయన ఈ చర్యను దేశ నాయకుడి గురించి పొగడ్త లేని డాక్యుమెంటరీ విడుదల చేయడంతో ఉద్దేశపూర్వకంగా సాగిన బెదిరింపు చర్యగా ఆరోపణలు చేశారు. ఈ సమస్యపై స్పందించడంలో విఫలమైనందుకు యూకే ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. అంతేకాదు బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు గురించి ప్రస్తావించారు కూడా. ఈ విషయంలో విదేశీ కామన్వెల్త్ అభివృద్ధి కార్యాలయం కూడా నిశబ్దంగా ఉందని అందువల్లే దీన్ని ఖండించేలా ప్రభుత్వాన్ని పోత్సహించడానికీ ఈ ప్రశ్నను తాను లేవనెత్తినట్లు డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ) పార్లమెంటు సభ్యుడు షానన్ అన్నారు. దీన్ని ఆయన పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఐతే ఇది సంభాషణలో భాగంగా లేవనెత్తిన ప్రశ్న అని, అయినా తాము ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మంత్రి రూట్లీ తెలిపారు. మరోవైపు బ్రిటీష్ సిక్కు లేబర్ పార్టీ ఎంపీ తన్మన్జీత్ సింగ్ ధేసీ కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. బీబీసీ దర్యాప్తుపై ఎంక్వైయిరీ భారతదేశంలోని అధికారులు ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలపై దాడులు చేపట్టడం ఇదేమి మొదటిసారి కాదని లేబర్పార్టీ ఎంపీలు విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాదు భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్మన్, భారత్లోని ఐటీ అధికారులు ఏడేళ్లుగా బీబీసీని దర్యాప్తు చేస్తున్నారో లేదో నిర్ధారించాలని మంత్రిని రూట్లీని కోరారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు మంత్రి నిరాకరించారు. కాగా, ఫిబ్రవరి 14న ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత మూడు రోజుల తర్వాత ఇది రైడ్ కాదు సర్వేగా ఐటీ శాఖ పేర్కొంది. అంతేగాదు సర్వే తదనంతరం బీబీసీ లావాదేవీలు భారత్ కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలపడం గమనార్హం. -
బీబీసీలో ఆర్థిక అవకతవకలు జరిగాయ్
న్యూఢిల్లీ: బీబీసీ గ్రూప్లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సర్వేలో కీలకమైన ఆధారాలు లభించాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కొన్ని సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్లో వారి కార్యకలాపాలకు అనుగుణంగా లేవని, దాని విదేశీ సంస్థల చెల్లింపులపై కట్టాల్సిన పన్నుల్ని ఎగవేసిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులిచ్చిన వాంగ్మూలాలు, డిజిటల్ ప్రూఫ్లు, సేకరించిన డాక్యుమెంట్ల ద్వారా ఆ గ్రూప్లో భారీగా ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలు చేసినట్టుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారని తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి ఎన్నో వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్టుగా ఐటీ సర్వేలో తేలిందని ఆ ప్రకటన వివరించింది. పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఐటీ శాఖ సర్వే సమయంలో మందకొడిగా వ్యవహరిస్తూ ప్రతీది ఆలస్యం చేసే వ్యూహాలు రచించిందని ఆరోపించింది. ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు దాదాపు 60 గంటలు ఐటీ శాఖ సర్వే నిర్వహించింది. 2002 గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బాధ్యుడిగా ఆరోపిస్తూ ‘‘ఇండియా ది మోదీ క్వశ్చన్’’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల్లోనే ఐటీ శాఖ సర్వే జరపడం చర్చనీయాంశంగా మారింది. -
బీబీసీలో సర్వేపై ఐటీ శాఖ ప్రకటన!
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఆఫీసుల్లో జరుగుతున్న సర్వేపై ఐటీ శాఖ శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేసింది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు గుర్తించామని, ఇందుకు సంబంధించి ఆధారాలు సైతం సేకరించామని పేర్కొంది. అవి ఐటీ దాడులు, సోదాలు కాదని.. కేవలం సర్వేనే అని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీబీసీ పేరును ప్రస్తావించకుండానే.. ఓ ప్రముఖ మీడియా సంస్థ అని పేర్కొంటూ సదరు సంస్థ లావాదేవీలపై సర్వే చేసినట్లు, అకౌంటింగ్ పుస్తకాల్లో అక్రమాలను గుర్తించినట్లు తాజాగా భారత ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ముంబై, ఢిల్లీ కార్యాయాలల్లో చేసిన ఈ సర్వేల్లో ప్రధానంగా లావాదేవీల డాక్యుమెంట్స్ పరిశీలించామని.. ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలో వివిధ విభాగాలు వెల్లడించిన ఆదాయం, లాభాలు భారతదేశంలో వాళ్ల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవు అని ఆదాయపు పన్ను శాఖ సదరు ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు మీడియా సంస్థలోని ఉద్యోగుల స్టేట్మెంట్లు, డిజిటల్ ఫైల్లు, డాక్యుమెంట్లను పరిశీలించే ప్రక్రియలో ఇంకా కొనసాగుతోందని ప్రకటించింది. తమ దర్యాప్తును ఆలస్యం చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లు కూడా ఆరోపించింది ఐటీ శాఖ. అయితే ఈ ఆరోపణలపై బీబీసీ ఇంకా స్పందించాల్సి ఉంది. సదరు వార్తా సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఈ నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఇంకా ఏమైనా ఉందా? అనే కోణంలోనే సర్వే చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీబీసీ ఆఫీసుల్లో మొదటి రెండు రోజులపాటు.. లోపలికి ఉద్యోగులను అనుమతించలేదు. లోపల ఉన్నవాళ్లను బయటకు పంపలేదు. మూడవ రోజు నుంచి ఉద్యోగులకు కార్యకలాపాలకు అనుమతించింది. అయితే అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలను మాత్రం ఐటీ శాఖ తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆయా విభాగాల్లో వాళ్లను ప్రశ్నించడంతో పాటు పత్రాలతో పాటు కంప్యూటర్ల్లో ఉన్న డాక్యుమెంట్లను కూడా ఐటీ శాఖ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బీబీసీ భారత ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ గుజరాత్ అల్లర్ల ప్రధానాశాంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించగా.. అది దుమారం రేపింది. ఈ తరుణంలో బీబీసీ కార్యాలయాల్లో తనిఖీలపై రాజకీయంగానూ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన బీబీసీ
-
మూడో రోజూ ఐటీ సోదాలు.. 2 రాత్రులుగా ఆఫీసులోనే బీబీసీ ఉద్యోగులు
బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) ఇండియా కార్యాలయాలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. సర్వే ఆపరేషన్ పేరుతో ఐటీ అధికారులు చేపట్టిన దాడుల కారణంగా ఢిల్లీలోని బీబీసీలో పనిచేసే దాదాపు 10 మంది సీనియర్లు ఉద్యోగులు రెండు రోజుల నుంచి ఆఫీస్లోనే ఉంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ సర్వే ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి వెళ్లలేదు. బీబీసీ కార్యాలయ ఉద్యోగుల నుంచి ఐటీ అధికారులు తమకు కావల్సిన ఆర్ధిక లావాదేవీల సమాచారాన్ని, డాక్యుమెంట్లు, మెయిల్స్, ఇతర వివరాల్ని సేకరించారు. కాగా 2002 గుజరాత్ జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఇటీవల ఓ డాక్యుమెంటరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియా ది మోదీ క్వశ్చన్ పేరుతో రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీ దేశ వ్యాప్తంగా వివాదస్పదమైంది. దీనిని భారత్లో ప్రసారం చేయనీయకుండా కేంద్రం బ్యాన్ చేసింది. సోషల్ మీడియా మాధ్యమాలైన యూట్యూబ్, ట్విటర్ వంటి వాటిల్లో సంబంధిత లింక్లను తొలగించింది. ఇది జరిగిన రెండు వారాల్లోనే ఈ ఐటీ దాడులు ప్రారంభమవడం గమనార్హం. ఐటీ దాడుల నేపథ్యంలో ఢిల్లీలోని బీబీసీ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. ఐటీ సోదాలు జరుగుతున్న కూడా తాము వార్తలను ఎప్పటిలాగే ప్రసారం చేస్తున్నామని తెలిపారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా పన్నుల ఎగవేత ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఐటీ సోదాలు 44 గంటలు గడిచినా ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ దాడులు మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందనేది చెప్పలేమని.. తమకు లభించే ఆధారాల్ని బట్టి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్మాణం, ఇతర వివరాలపై ఐటీ సర్వే బృందాలు సమాధానాలు రాబడుతున్నాయి. సాక్ష్యాలను సేకరించే పనిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డేటాను కాపీ చేస్తున్నాయని ఐటీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాజకీయ ప్రతికారంతోనే బీబీసీ కార్యాలయాలపై కేంద్రం ఐటీ దాడులు జరిపిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక వివాదాస్పద డాక్యుమెంటరీ నేపథ్యంలో భారతదేశంలో బీబీసీపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గత వారం కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో డాక్యుమెంటరీ లింక్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్పై ఏప్రిల్లో విచారణ జరగనుంది. చదవండి: హిండెన్బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు -
బీబీసీపై ఐటీ నజర్
-
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానీ మోదీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ రూపొందించిన తర్వాత ఈ తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది. విపక్షాలు ఇప్పటికే కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఈ వ్యవహారంపై స్పందించింది. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్రిక స్వేచ్ఛకు ప్రాధాన్యం ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భావ ప్రకటనా స్వేచ్చ, మతం లేదా విశ్వాసపరమైన స్వేచ్చ మానవహక్కులుగా దోహదపడుతాయన్నారు. భారత్లో ప్రజాస్వామ్యాన్ని కూడా ఇవే బలోపేతం చేశాయని చెప్పారు. ఈ విషయాలను తాము ఎప్పుడు హైలైట్ చేస్తూనే ఉన్నామని వివరించారు. ఈ సార్వత్రిక హక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యాలకు పునాది అని నొక్కి చెప్పారు. అయితే బీబీసీపై ఐటీ దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమా ? అని అడిగిన ప్రశ్నకు నెడ్ ప్రైస్ ఆచితూచి సమాధానమిచ్చారు. ఈ సోదాలపై నిజానిజాల గురించి తమకు తెలుసునని, అయితే దీనిపై తీర్పు చెప్పే స్థితిలో తాను లేనని వ్యాఖ్యానించారు. చదవండి: ‘లేఆఫ్స్’ తాత్కాలికమే.. అమెరికాలో భారీగా ఉద్యోగాలు..! -
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు..ఇది కేవలం సర్వేనే!
బీబీసీ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీ పెను వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లోకి ఐటీ అధికారులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు. సోదాలు నిర్వహించి..ఉద్యోగుల ల్యాప్టాప్లు, ఫోన్లను తీసుకువెళ్లడమే కాకుండా కార్యాలయంలోని డెస్క్టాప్లను కూడా తనిఖీ చేశారు. ఐతే ఆదాయపు శాఖ మాత్రం పన్నుల అవకతవకల ఆరోపణలపై సర్వే చేస్తున్నమని, సోదాలు కాదని పేర్కొంది. కార్యాలయం లావాదేవీలకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లు, ఖాతాల వివరాలను ఇవ్వాల్సిందిగా బీబీసీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ని కోరినట్లు ఆదాయపు శాఖ వర్గాలు తెలిపాయి. ఈ తనిఖీలు ముగిసిన తర్వాతే ఉద్యోగులను కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ఐటీ అధికారలు అనుమతించినటట్లు సమాచారం. కాగా, బీబీసీ ఈ ఘటనపై స్పందిస్తూ.."ఆదాయపు శాఖ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. మా ఉద్యోగులందరూ క్షేమంగానే ఉన్నారు. బీబీసి వారికి అన్నివిధాలుగా సహకరిస్తుంది. ఈ వివాదం తొందరలోనే ముగిసిపోతుందని ఆశిస్తున్నా." అని తెలిపింది. ఇదిలా ఉండగా..గత నెలలో బీబీసీ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన 2002 గుజరాత్ అల్లర్లుపై ఒక డాక్యుమెంటరీ తీసింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించిడమే గాక వలవాద విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది కూడా. (చదవండి: పార్లమెంట్లో ఒక ప్రధాని ఇలా అంగీకరించడం ప్రపథమం! సీఎం స్టాలిన్ సెటైర్లు) -
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులపై స్పందించిన కేటీఆర్
-
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులు
-
పాలనా రథానికి ప్రజలే రక్ష!
భారతీయులు 140 కోట్ల మంది తనకు రక్షా కవచంగా ఉన్నారని ప్రధాని అన్నారు. మరి అలాంటప్పుడు ఒక డాక్యుమెంటరీని ఎందుకు అంతగా ప్రభుత్వం వ్యతిరేకించింది? భారత సమాజ పరిస్థితులు, ప్రభుత్వ చర్యల గురించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని ఇది కాలరాయడం కాదా? ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమని నమ్మిన నాయకులున్నారు. కానీ జాతీయోద్యమ నాయకుడైన మహావీర్ త్యాగి ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని వాదించారు. ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే హక్కును ప్రజలకు దఖలు పరచాలన్నారు. ‘‘నా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను దేశ ప్రజలు నమ్మ బోరు. 140 కోట్లమంది భారతీయులూ నాకు రక్షణగా, సురక్షితమైన కవచంగా ఉన్నారు.’’ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (8 ఫిబ్రవరి 2023) గుజరాత్లో 2002లో మైనారిటీలపై జరిగిన మూకుమ్మడి హత్యా కాండ గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక ప్రకటన చేస్తూ– గుజరాత్ ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడటంలో గుజరాత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ, ఆ తర్వాత వారాల తరబడి సాగిన హింసాకాండను అదుపు చేయలేక పోయిందనీ నిశితంగా విమర్శించింది. అంతేగాదు, గత 20 సంవత్సరాలుగానూ దేశవ్యాప్తంగా వివిధ బాధ్యతాయుత సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల నాయకులు ఈ విపరిణామాన్ని ఖండిస్తూ వచ్చారు. అయినా 2002 నాటి గుజరాత్ హింసాకాండను ప్రోత్సహించిన బాధ్యు లెవరిపైనా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదు. గుజరాత్ ఊచ కోతలపై ‘ఇండియా – ది మోదీ క్వశ్చన్’ మకుటం కింద ఒక డాక్యు మెంటరీని ‘బీబీసీ’ విడుదల చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ ‘భారతదేశ సార్వభౌమాధికారాన్ని, నిజాయితీని అవమాన పరుస్తోం’దన్న పేరిట సామాజిక మాధ్యమాలన్నిటి నుంచి ప్రభుత్వం తొలగించింది. భారత సమాజ పరిస్థితుల గురించి, ప్రభుత్వ చర్యల గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని కాలరాయడం పట్ల శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తదితర విద్వత్ సంపన్నులు 500 మందికి పైగా విస్మయం వ్యక్తం చేశారు. పరిణామాలకు అద్దం నిజానికి ‘బీబీసీ’ డాక్యుమెంటరీ వచ్చింది గుజరాత్ మారణకాండ అనంతరం 20 సంవత్సరాలకు. అంతకుముందే 2010 నాటికే రాణా అయూబ్ ‘గుజరాత్ ఫైల్స్’ పేరిట గుజరాత్ బీజేపీ పాలకవర్గ ‘మాలోకా’న్ని ప్రత్యక్షరబద్ధంగా నమోదు చేసింది. ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం రాసింది మరెవరో కాదు, సాక్షాత్తూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ. ‘ఈశావాప్యోపనిషత్’లో కళ్లు తెరిపించే ఒక సూక్తి ఉంది: ‘‘నిజం అనే ముఖాన్ని కనపడనివ్వకుండా ఓ బంగారు కుండీలో దాచి ఉంచుతారు. అసలా జలతారు కుండీలో దాగిన నిజమేమిటి?’’ అలాగే నిజమనేది కట్టుకథకు అందని వాస్తవం! అలాంటి ‘గుజరాత్ వాస్తవాల’ను రాణా అయూబ్ సాహసంతో బహిర్గతం చేసిందని శ్రీకృష్ణ కితాబిచ్చారు. ‘అయూబ్ రచన పరి శోధనాత్మక పాత్రికేయ విధి నిర్వహణలో ఒక సాహస యాత్ర. పాలనా రంగంలో నానాటికీ పెరిగిపోతున్న నిజాయితీకి పాతరేసి, దొంగచాటు రాజకీయ కుట్రలకు మార్గం తీస్తున్న పరిణామాలకు ప్రత్యక్ష సాక్ష్యం’ అని పేర్కొన్నారు. రాజ్యాంగ రచనా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అంబేడ్కర్, భారత ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైనందున అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంబేడ్కర్ అభిప్రాయంతో జాతీయోద్యమ నాయకుల్లో ఒకరైన మహావీర్ త్యాగి(1899–1980) విభేదిస్తూ, అంబేడ్కర్ లాగా ఇలాంటి అభిప్రాయాలు కల నాయకులెవరైనా ఉంటే వారు అలాంటి ప్రకటనలు చేయబోయేముందు కొన్నాళ్లు జైలులో ఉండొస్తే మంచిదని వ్యంగ్యంగా సలహా ఇచ్చారు! ఆ పిమ్మట త్యాగి, రాజ్యాంగ రచన ముసాయిదా సంఘానికి సవాలుగా ఒక ప్రతిపాదన చేస్తూ, ప్రజలకు ఆమోదించిన ప్రాథమిక హక్కుల్ని ముందుముందు ఏర్పడబోయే ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే లేదా మార్చేసే హక్కును ప్రజలకు దఖలు పరిచే అంశాన్ని చర్చించారా లేదా అని ప్రశ్నించారు. ప్రజలకున్న అలాంటి సహజమైన హక్కుకు మీరు గ్యారంటీ ఇవ్వలేదని త్యాగి విమర్శిస్తూ ప్రభుత్వ హక్కులతోపాటు ప్రజల హక్కుల్ని గురించి కూడా ఆలోచించా లన్నారు. ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని త్యాగి వాదించారు. అందుకు పూర్తిగా సమ్మ తిస్తూ డాక్టర్ అంబేడ్కర్, ఉత్తరోత్తరా ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు ఊహపై ఆధారపడి) పైన వ్యక్తుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టే స్వేచ్ఛను భావిప్రభుత్వాలకు అనుమతించే ప్రసక్తి ఉండరాదని పలుమార్లు స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్రం తర్వాత ప్రజాస్వామ్యం, ఎన్నికల మాటున ‘ఓటు’ ఎరలోనూ షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తరగతులకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. పైగా ఎన్నికల పేరిట సంపన్న వర్గాలు, కుల, మత, రాజకీయ పక్షాలూ చేసిందీ, చేస్తున్నదీ – అన్ని కులా లలోని పేదలు, అణగారిన ప్రజలు చైతన్యం పొందకుండా జాగ్రత్త పడటం మాత్రమే. అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగ ప్రతిని వెలుగు చూడకుండా రాజ్యాంగ రచనా సంఘంలోని కొందరు సభ్యులు విశ్వ ప్రయత్నం చేశారు. అడ్డదారులలో ఎన్నికల పేరిట కుల, మత సంపన్న వర్గాల సభ్యులు హెచ్చుమంది ఎలా అనతికాలంలోనే ‘కుబేర సంతానం’గా మారి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే, తారుమారు చేయడానికి వెనుదీయడం లేదో ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. రాజ్యం కార్పొరేట్ ఎస్టేట్ వ్యాపారంగా ఎలా మారిపోయిందో రుజువై పోయింది. స్వతంత్రంగా వ్యవహరించాలి 1951 మేలోనే కేంద్ర, రాష్ట్ర శాసన వేదికల్లోకి ప్రవేశించడానికి ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలో ‘ప్రజా ప్రాతినిధ్య బిల్లు’ను అంబేడ్కర్ ప్రవేశపెడుతూ అవసరమైన సవరణలను కూడా ప్రతి పాదించారు. వాటిలో ప్రధానమైనవి – పార్లమెంట్, ఎన్నికల చట్టం పార్లమెంట్ సభ్యుల స్వేచ్ఛను ప్రభుత్వ స్వేచ్ఛను భిన్నమైనవిగా భావించాలి. మొత్తం పార్లమెంట్ను అవినీతికి ‘పెద్ద బిడ్డ’గా మార్చ కుండా ఉండే విధంగా సభనూ, ఎన్నికల చట్టాన్నీ రూపొందించాలి. పార్లమెంట్ సభ్యులకు రాజకీయ పదవులను కట్టబెట్టడం ద్వారా లేదా ఇతర ప్రలోభాలకు లోను చేయడం ద్వారా మొత్తం పార్లమెంట్ను లేదా శాసన వేదికలను అవినీతిపాలు చేసేలా ప్రభుత్వానికి అవకాశం కల్పించకూడదు. దానికి తగిన విధంగా మన శాసన వేదికలు, పార్ల మెంట్, ఎన్నికల చట్టమూ ఉండాలని అంబేడ్కర్ అభిలషించారు. పార్లమెంట్ లేదా శాసన వేదిక అనేది నిర్భీతిగా, ప్రభుత్వం నుంచి ఏ ప్రలోభాన్ని ఆశించకుండా స్వతంత్రంగా వ్యవహరించలేని నాడు అలాంటి శాసన వేదికలు నిష్ప్రయోజనకరం. శాసన వేదికలు ప్రభు త్వాలు చెప్పే మాటలకు డూడూ బసనన్నలుగా, నట, గాయక వందిమాగధులుగా వ్యవహరించరాదని కూడా అంబేడ్కర్ (1951 మే 9) నిర్మొహమాటంగా పేర్కొన్నారని మరచి పోరాదు. పార్లమెంట్ ఒక స్టాక్ ఎక్స్ఛేంజీగా (వ్యాపార లావాదేవీల కేంద్రం) ఇప్పటికే (1951 నాటికే) మారిపోయిందని పండిట్ లక్ష్మీకాంత మైత్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంప్రదాయానికి 75 ఏళ్లకు కూడా ‘కళ్లెం’ వేయడానికి పాలకులకు ఇష్టం లేదు. దీనివల్ల పాలకులు ప్రయోజనం పొందడం సహజం. కనుకనే న్యాయ వ్యవస్థ తన జడత్వాన్ని క్రమంగా వదిలించుకుని చైతన్యావస్థలోకి వచ్చి కఠినమైన నిర్ణయాలు తీసుకోగల సత్తాను సంతరించుకుంటోంది. అందుకే కవి కుమారుడు ఎంతటి కమ్మని సూక్తిని విడిచి వెళ్లాడో గదా – ‘‘బలవంతపు రాజ్యకాంక్షా ఒక పాపము జూచునే ఈశ్వరా?’’! తన ‘బీదతనం’ దేశ దారిద్య్రమనీ, తన మరణం లోక ప్రళయమనీ భావించి సంచరించే అహంకారుల గురించి సుమతీ శతకకారుడు హెచ్చరించలేదూ?! abkprasad2006@yahoo.co.in -
డాక్యుమెంటరీపై మాటల సెల్ఫ్ గోల్
గుజరాత్లో 2002లో జరిగిన హింసపై ‘బీబీసీ’ నిర్మించిన తాజా డాక్యుమెంటరీని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఖండించారు. తాను దాన్ని చూడలేదని పేర్కొంటూనే, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, తప్పుడు వాదనతో, ప్రచార యావతో తీసిన డాక్యుమెంటరీగా దాన్ని ప్రకటించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ, హోమ్ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి పలు మంత్రిత్వ శాఖలు, సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు... బీబీసీ తాజా డాక్యుమెంటరీపై కనీసపాటి ఆలోచన కూడా లేకుండా తీవ్ర ధోరణిలో మాట్లాడారు. భారతదేశ సార్వభౌమత్వాన్నీ, సమగ్రతనూ ఆ డాక్యుమెంటరీతో కించపర్చారంటూ వారు ఆరోపించారు. భారతదేశంలో అసలు ప్రసారమే చేయని ఒక డాక్యుమెంటరీ చిత్రం మన దేశాన్ని ఆ స్థాయిలో ముక్కలు ముక్కలు చేస్తుందా? వారు వ్యక్తం చేసిన ఆందోళన బీబీసీ పైనా, దాని డాక్యుమెంటరీ పైనా కాదు. మన దేశ మనుగడ పైనే వారు కలవరం వ్యక్తపరిచినట్టుగా తయారైంది. తప్పుగా మాట్లాడటం ద్వారా వారు తమ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఈ విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించేకొద్దీ, నిజానికి సమస్య మనలోనే ఉందని చెబు తాను. సాధారణంగా రాజకీయ నాయకుల వద్ద ప్రతి సమస్యకూ పరిష్కారం ఉండాలనీ, ప్రతి సమ స్యపై వారు వ్యాఖ్యానించాలనీ, ప్రతి వ్యక్తికి సంబంధించి అర్థవంతమైన, కచ్చితమైన అభిప్రా యాన్ని కూడా కలిగి ఉండాలనీ, అన్ని పరిస్థితు లనూ వారు అర్థం చేసుకోవాలనీ మనం భావిస్తుంటాం. కాని వారు అలా చేయలేరు. అది వారికి సాధ్యం కూడా కాదు. అలాగని తాము దేన్నయినా సరే... చేయగలమని వారు నటించినట్లయితే దానిని మనం వారిని అగౌరవించాల్సిన పని లేదు. సూటిగా చెప్పాలంటే, రాజకీయ నాయకులు వారి పట్ల మనకు ఉందనుకుంటున్న గౌరవాన్ని కోల్పో వలసిన అవసరం లేదు. అయితే వారు గుర్తించనిది ఏమిటంటే, మన అంచనాలు వారికి ఒక ఉచ్చు లాంటివి. ఆ సంగతి వారు స్పష్టంగా గ్రహిస్తూనే, గర్విస్తూనే మనం ఏర్పరచిన ఉచ్చులో చిక్కుకుంటూ ఉంటారు. ఇవాళ ఆలోచనాత్మకమైన, మేధాసహితమైన స్పందనల కంటే ఆకట్టుకునేలా అభిప్రాయాలు వెల్లడించడమే ఎక్కువ అవసరమని రాజకీయ నాయకులు భావించే దశకు మనం చేరుకున్నాం. ఎందుకంటే, వీటిలో ఆకర్షణీయమైన స్పందనే పతాక శీర్షికలకు ఎక్కుతుంది. అది వారికి ప్రచా రాన్ని కల్పిస్తుంది. మరోవైపున ఆలోచనతో కూడిన స్పందన మరింత అర్థవంతంగానూ, సహాయకారి గానూ ఉండవచ్చు కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి కాస్త ఏకాగ్రత అవసరమవుతుంది. కాబట్టి పునః పరిశీలనకు అది పిలుపునిస్తుంది. పైగా ఆకర్షణీయ మైన స్పందనకు సరిసమానమైన ప్రభావాన్ని మేధాసహితమైన స్పందన కలిగించనే కలిగించదు. ‘షారుఖ్ ఖాన్ ఎవరు? అతడి గురించి నాకేమీ తెలీదు’ అని అస్సామ్ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఇటీవల చేసిన ప్రకటన దీనికి అత్యుత్తమ మైన ఉదాహరణ అని నేను చెబుతాను. గౌహతిలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆయన చేసిన ఈ వ్యాఖ్య అత్యంత వివాదాస్పద మైంది. అంతేకాదు. ఆయన మాటల్లో అసలు నిజం లేదు. ఒకవేళ ఆయన వ్యాఖ్య గనక నిజమే అయితే... మన దేశంలోని ప్రజల గురించి ఏ మాత్రం తెలియని స్థితిలో సదరు అస్సామ్ ముఖ్య మంత్రి ఉన్నారని చెప్పక తప్పదు. నిజానికి ఆయన చేసిన ఆ ప్రకటన అమితాబ్ బచ్చన్ స్వయంగా ‘నరేంద్ర మోదీ ఎవరు? ఆయన గురించి నాకేమీ తెలీదు’ అని చెప్పినట్టు ఉంది. ప్రముఖ హిందీ సినీ కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఎవరో తెలియని భారతీయులు ఎవరైనా ఉంటారా అని నాకు సందేహం. అలాగే, భారతీయ జనతా పార్టీ నేత – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి కూడా తెలియనివారు ఉన్నారంటే కూడా సందేహించాల్సి ఉంటుంది. అందుకనే అస్సామ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యను జనం దృష్టిని ఆకర్షించడానికి, జనం తమను ఏదో ఒకలా గుర్తుంచుకునేలా చేసే తప్పుడు ప్రయత్నంగానే చూడాల్సి ఉంటుంది. ఈ ఉదంతంలో అన్నీ తప్పుడు అంశాలే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. విషాదం ఏమిటంటే, కనీసపాటి ఆలోచన కూడా లేకుండా షారుఖ్ ఖాన్ గురించి అలా మాట్లాడటం వల్ల అస్సామ్ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ దేశవ్యాప్తంగా మూర్ఖుడిగా మారిపోయారు. 2002 నాటి గుజరాత్ హింసపై బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన డాక్యుమెంటరీని విమర్శించి, ఖండించాలన్న ఉద్దేశంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి కూడా దాదాపు ఇలాంటి పనే చేశారు. ఆ డాక్యుమెంటరీని తాను చూడలేదని ఒప్పుకుంటూనే, నిర్దిష్టంగా ఒక తప్పుడు వాదనను జనంలోకి తీసుకుపోవడానికి, ప్రచారమే పరమావధిగా తీసిన డాక్యుమెంటరీగా దాన్ని ప్రకటించారు. పైగా అది పక్షపాతంతో కూడుకున్నదనీ, దాంట్లో నిష్పా క్షికత లోపించిందనీ నిందించారు. అయితే బీబీసీ తాజా డాక్యుమెంటరీని చూడ నప్పుడు దాంట్లోని విషయాలను ఆయన ఎలా ప్రస్తావించారు? అది కూడా తానొక అధికారిక ప్రతి నిధి అయ్యుండి, తాను చూడని విషయంపై ఎలా వ్యాఖ్యానించారు అనే ప్రశ్న వస్తుంది. అయితే తాను దేని గురించి మాట్లాడుతున్నదీ తనకు స్పష్టంగా తెలుసన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు, వర్ణనలు ఉన్నాయి. అధికారిక ప్రతినిధి చేసే ప్రక టన సాధికారికంగా ఉంటుందనీ, విశ్వసించదగిన దనీ ఎవరైనా భావిస్తారు. వాళ్ళూ వీళ్ళూ చెబుతుంటే విని చెబుతున్నట్టుగా, వేరెవరి అభిప్రాయాలో మళ్లీ ప్రస్తావించినట్టుగా ఉంటాయనీ, ఉండాలనీ ఎవరూ అనుకోరు. కానీ ఆయన తాజా వ్యాఖ్య లన్నీ అచ్చంగా అలాగే ఉన్నాయని గ్రహించాలి. భారత విదేశీ వ్యవహారాల శాఖ, హోమ్ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి పలు మంత్రిత్వ శాఖలకూ, సంస్థలకూ చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారులు దాదాపుగా దేశంలోని అన్ని పత్రికలతో మాట్లాడారు. బీబీసీ తాజా డాక్యుమెంటరీపై తమ వాదనను బలంగా వినిపించడం కోసం కనీసపాటి ఆలోచన అయినా కూడా లేకుండా వారు తీవ్ర ధోరణితో మాట్లాడారు. ఆ తొందరలో చివరకు భారతదేశం గురించి ఇబ్బందికరమైన ప్రశ్నలు పొడసూపేలా చేశారు. ఆ డాక్యుమెంటరీలో భారత సార్వభౌమత్వాన్నీ, సమ గ్రతనూ కించపర్చారంటూ వారు ఆరోపించారు. నిజమా? నిజంగానే అలా జరిగిందా? ఇంతకూ వారు గుర్తించని విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే – తాము ఏం మాట్లాడు తున్నాం అనే విషయం గురించి వారు కనీసం ఒక్కసారి కూడా ఆగి, నింపాదిగా ఆలోచించలే పోయారు. భారతదేశంలో అసలు ప్రసారమే చేయని ఒక డాక్యుమెంటరీ చిత్రం మన దేశాన్ని ఆ స్థాయిలో ముక్కలు ముక్కలు చేస్తుందా? పైగా యూట్యూబ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్రచార, ప్రసార వేదికలను వాడేవారు మన జనాభాలో అతి తక్కువమంది అని తప్పక గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఆ కొద్దిమంది ఆ డాక్యుమెంటరీ చూసినంత మాత్రాన మన జాతీయ చట్రమే కదిలి పోతుందా? విచ్ఛిన్నమవుతుందా? చివరకు వచ్చేసరికి వారు వ్యక్తం చేసిన ఆందోళన అంతా బీబీసీ పైనా, దాని డాక్యుమెంటరీ పైనా కాదు. మన దేశంలోని పరిస్థితి పైనా, దేశ మనుగడకు సంబంధించిన అంశం పైనే వారు కలవరం వ్యక్తపరిచినట్టు అయింది. అలా వారు దాన్ని గురించి తప్పుగా మాట్లాడటం ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అయింది. ఇప్పుడు మన ప్రియమైన ముఖ్యమంత్రి, మన అధికార ప్రతినిధి, అలాగే నిగూఢమైన మన ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ విషయంపై భయకంపిత స్వరంతో మాట్లాడి ఉన్నట్లయితే నేను దానికి ఏమాత్రం భయపడను. బదులుగా ముసి ముసిగా నవ్వుకునేవాడిని. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది!
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది! -
‘జామియా’లో డాక్యుమెంటరీ కలకలం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థి సంఘం నాయకులు ఏర్పాట్లు చేయడం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటలో కలకలం రేపింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలు ప్రకటించారు. దీంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంటరీ ఎందుకొచ్చింది? తిరువనంతపురం: బీబీసీ డాక్యుమెంటరీని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తప్పుబట్టారు. ‘జీ20 కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఇదే సమయానికి బీబీసీ డాక్యుమెంటరీ తేవడం ఏంటి?’ అని ప్రశ్నించారు. -
బ్రిటన్లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్!
లండన్: బ్రిటన్లోకి విదేశీ విద్యార్థుల రూపంలో పోటెత్తుతున్న వలసల కట్టడికి ప్రధాని రిషి సునాక్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిగువ శ్రేణి డిగ్రీ చదివేందుకు, డిపెండెంట్లుగా ఉండేందుకు వస్తున్న వారందరినీ నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని కార్యాలయ ఉన్నతాధికారి వెల్లడించారని బీబీసీ పేర్కొంది. ‘‘వలసలు బ్రిటన్ను వేధిస్తున్నాయి. 2021లో 1,73,000గా ఉన్న వలసలు ఈ ఏడాది 5,04,000కు పెరిగాయి. విదేశీ విద్యార్థుల్లో చైనాను భారతీయులు వెనక్కినెట్టారు. కానీ వీరిని తగ్గిస్తే ఆ సీట్లను బ్రిటన్ వర్సిటీలు స్థానిక విద్యార్థులకు తక్కువ ఫీజుకే ఇవ్వాల్సి ఉంటుంది. అవి భారీ ఆదాయాన్ని కోల్పోతాయి. ఆదాయం కాపాడుకుంటూ, అంతర్జాతీయ విద్యార్థుల్ని తగ్గించుకోవడం సంక్షిష్టమైన అంశం’’ అని సునాక్ అధికార ప్రతినిధి శుక్రవారం అన్నారు. భారత విద్యార్థులు వీసా ముగిసినా బ్రిటన్లో తిష్ట వేస్తున్నారన్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ వ్యాఖ్యలు దీనికి నేపథ్యంగా భావిస్తున్నారు. -
40 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా.. సన్యాసిలా బతుకుతున్నాడు
సాక్షి, వెబ్డెస్క్: కరోనా కట్టడి కోసం మూడు నెలల పాటు లాక్డౌన్ విధిస్తేనే జనాలకు పిచ్చిపట్టింది. మనుషుల్లో తిరగక.. బయటకు వెళ్లక ఇంటికే పరిమితం కావడం అంటే పెద్ద పనిష్మెంట్గా భావించారు. చుట్టూ నలుగురు మనుషులు, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా.. భారంగా గడిపారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి మాత్రం మనకు చాలా భిన్నం. ఆయన గత 40 ఏళ్లుగా మనుషులకు చాలా దూరంగా.. ప్రకృతి ఒడిలో నివసిస్తున్నారు. గ్యాస్, కరెంట్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేకపోయినా సంతోషంగా జీవిస్తున్నారు. భౌతిక సుఖాలు పరిత్యజించి ఇలా సన్యాసిగా జీవించడం చాలా బాగుంది అంటున్న ఈ వ్యక్తి వివరాలు.. (photo cridit BBC) 40 ఏళ్లుగా అడవిలో నివసిస్తున్న ఈ వ్యక్తి పేరు కెన్ స్మిత్(74). ప్రస్తుతం అతడు స్కాట్లాండ్ రాన్నోచ్ మూర్ అంచున ఉన్న సమీప రహదారి నుంచి రెండు గంటలు లోపలకి ప్రయాణిస్తే కనిపించే లోచ్ ట్రీగ్లో ఓ చెక్క గదిలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతాన్ని లోన్లీ లోచ్ అని పిలుస్తారు. మనుషులకు దూరంగా ఉంటున్న కెన్ గురించి తొలుత 9 సంవత్సరాల క్రితం ఫిల్మ్ మేకర్ లిజ్జీ మెక్కెంజీకి తెలిసింది. ఆమె గత రెండెళ్ల క్రితం ఇతని గురించి బీబీసీ స్కాంట్లాండ్లో ‘ట్రైగ్ సన్యాసి’ పేరుతో డాక్యూమెంటరీ ప్రచురించింది. ఆ ప్రమాదంతో జీవితంలో మార్పు.. డెర్బీషైర్కు చెందిన కెన్ 15వ ఏట నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 26వ ఏట ఉండగా దారి దోపిడి దొంగలు కెన్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో 23 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాడు. అతడి స్థితి చూసిన వారు.. కెన్ కోలుకోవచ్చు.. కానీ మాట్లాడలేడు.. నడవలేడు అన్నారు. అయితే వారి మాటలు అబద్ధం చేస్తూ కెన్ చాలా త్వరగా పూర్వపు జీవితాన్ని ప్రారంభించాడు. (photo cridit BBC) 22 వేల మైళ్లు ప్రయాణం... ప్రమాదం కెన్ జీవితాన్ని మార్చింది. ఎవరి మాటలు వినకూడదని నిర్ణయంచుకున్నాడు. ఆ సమయంలో అతడికి అడవిపై ఆసక్తి కలిగింది. ఇక నడక ప్రారంభించాడు. దాదాపు 22 వైల మైళ్లు నడిచి అలాస్కా సరిహద్దలో ఉన్న కెనడియన్ భూభాగమైన యుకాన్ చేరుకున్నాడు. కెన్ ఈ ప్రయాణంలో ఉండగానే అతడి తల్లిదండ్రులు మరణించారు. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకున్న కెన్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి అతడి చాలా సమయం పట్టింది. తల్లిదండ్రుల మరణం తర్వాత పూర్తి ఒంటరిగా.. తల్లిదండ్రులు చనిపోయారు.. నా అన్న వాళ్లు ఎవరు లేరు. దాంతో ఇక జనవాసాలకు దూరంగా.. అడవిలోనే జీవించాలనుకున్నాడు కెన్. ఏకాంత ప్రదేశం కోసం వేల కొద్ది మైళ్లు ప్రయాణం చేసి చివరకు లోచ్ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అదే తనకు అనువైన స్థావరంగా భావించాడు. అక్కడే దుంగలతో ఓ చిన్నపాటి గదిని నిర్మించుకున్నాడు. (photo cridit BBC) నో గ్యాస్, నో కరెంట్... గత 40 ఏళ్లుగా ఒక్కడే.. ఆ చిన్న గదిలో నివసిస్తున్నాడు కెన్. గ్యాస్, కరెంట్ వంటి సదుపాయాలు లేవు. చేపలు పట్టడం, కూరగాయలు, బెర్రీస్ పండిచి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. అతడి దగ్గర ఓ జీపీఎస్ పర్సనల్ లోకేటర్ బీకాన్ ఉంది. ఇక ఒంటిరిగా బతకాలంటే.. కచ్చితంగా చేపలు పట్టడం రావాలంటాడు కెన్. కాపాడిన జీపీఎస్ పర్సనల్ లోకేటర్.. అయితే 2019లో తొలిసారి కెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫిల్మ్మేకర్ లిజ్జీ కెన్ వద్ద నుంచి వెళ్లిన పది రోజుల తర్వాత, ఫిబ్రవరి 2019లో, కెన్ బయట మంచులో ఉన్నప్పుడు స్ట్రోక్కు గురయ్యాడు. అయితే అతడి ఉన్న జీపీఎస్ లోకేటర్ టెక్సాస్, హస్టన్లో ఉన్న రెస్పాన్స్ కేంద్రానికి ఎస్ఓఎస్ పంపడంతో కెన్ పరిస్థితి గురించి వారికి తెలిసింది. (photo cridit BBC) వారు ఈ విషయాన్ని వెంటనే యూకేలోని కోస్ట్గార్డ్కు తెలియజేశారు. వారు వెంటనే కెన్ను ఫోర్ట్ విలియమ్లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. అక్కడ అతను కోలుకోవడానికి ఏడు వారాలు పట్టింది. వైద్యులు అతనికి జనవాసంలో ఉండాలని కోరారు. కానీ కెన్ తన క్యాబిన్కు తిరిగి వచ్చాడు. నాకు ఏం కాదు 102 ఏళ్లు బతుకుతాను అంటున్నాడు కెన్. చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి పొరపాటున వేరే వారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది... -
మైఖేల్ వాన్పై నిషేధం..!
Michael Vaughan Dropped From BBC After Racism Allegations: జాత్యాహంకార ఆరోపణల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వివాదాస్పద వ్యాఖ్యాత మైఖేల్ వాన్పై ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ నిషేధం విధించింది. తమ ఛానల్లో ప్రసారమయ్యే "ద టఫర్స్ అండ్ వాన్ క్రికెట్ షో" నుంచి వాన్ను తప్పిస్తున్నట్లు శనివారం ప్రకటన విడుదల చేసింది. వాన్ బీబీసీలో గత 12 ఏళ్లుగా టెస్ట్ మ్యాచ్ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు. 2009లో నాటింగ్హమ్తో మ్యాచ్ సందర్భంగా తనతో పాటు జట్టులోని పలువురు సభ్యులపై వాన్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడని యార్క్షైర్ ఆటగాడు అజీమ్ రఫీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీబీసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీబీసీ చర్యలను వాన్ పూర్తిగా ఖండించాడు. తనపై ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నాడు. 1991 నుంచి 2009 వరకు ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాన్.. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వాన్ చాలాసార్లు తన నోటికి పని చెప్పాడు. ఇదిలా ఉంటే, జాతి వివక్షపై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు రావడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ)పై సస్పెన్షన్ వేటు వేసింది. వాన్పై ఫిర్యాదు చేసిన రఫీక్ ఇదే కౌంటీ తరఫున 2008–2018 వరకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: యార్క్షైర్ కౌంటీపై వేటు -
విజేత కోనేరు హంపి
న్యూఢిల్లీ: భారత చెస్ స్టార్, ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపికి ప్రతిష్టాత్మక బీబీసీ క్రీడా అవార్డుల పురస్కారం దక్కింది. వార్షిక అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన హంపి ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్–2020’గా ఎంపికైంది. ఈ విభాగంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్, స్ప్రింటర్ ద్యుతీ చంద్, షూటర్ మనూ భాకర్, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్లతో పోటీ పడిన తెలుగు తేజం హంపి తుది విజేతగా నిలిచింది. 40 మంది సభ్యుల జ్యూరీ ఈ అవార్డు నామినీలను ఎంపిక చేయగా... అభిమానుల ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఐదుగురు నామినీల్లో అత్యధిక ఓట్లు హంపికే వచ్చాయని బీబీసీ తెలిపింది. అవార్డుల ప్రకటన కార్య క్రమాన్ని ‘వర్చువల్’గా బీబీసీ నిర్వహించింది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చరిత్రలో ఇప్పటి వరకు పతకం గెలిచిన ఏకైక భారత అథ్లెట్ అయిన అంజూ జార్జ్కు ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు... షూటర్ మనూ భాకర్కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించాయి. భారత క్రీడారంగంలోని అత్యు త్తమ క్రీడాకారిణులకు తగిన గుర్తింపునిస్తూ 2019లో ఈ అవార్డును బీబీసీ ప్రారంభించగా... బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు తొలి విజేతగా నిలిచింది. ఈ అవార్డు నాకు మాత్రమే కాకుండా మొత్తం చెస్ క్రీడకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా. క్రికెట్ సహా ఇతర క్రీడలతో పోలిస్తే భారత్లో చెస్పై ఎక్కువ మంది దృష్టి ఉండదు. ఇకపై మార్పు వస్తుందని ఆశిస్తున్నా. నా ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం కారణంగానే ఇన్నేళ్లుగా విజయాలు సాధించగలుగుతున్నాను. ఒక మహిళా క్రీడాకారిణి ఆటను వదిలేయాలని ఎప్పుడూ అనుకోరాదు. పెళ్లి, పిల్లలు జీవితంలో భాగమే కానీ మన జీవన గమనాన్ని మార్చరాదు. –హంపి -
బీబీసీ బ్యాన్: చైనాపై యూకే, యూఎస్ ఫైర్
బీజింగ్: మీడియా మార్గదర్శకాలను తీవ్రంగా ఉల్లంఘించిన ఆరోపణలపై ప్రముఖ మీడియా సంస్థ బీబీసీపై చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రసారాలను నిషేధం విధిస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు చైనా టీవీ అండ్ రేడియో రెగ్యులేటరీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. చైనాకు చెందిన చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్(సీజీటీఎన్) ప్రసారాలను బ్రిటీష్ మీడియా రెగ్యులేటరీ సంస్థ ఆఫ్కామ్ ఇటీవలే నిలిపివేసిన అనంతరం తాజా పరిణామం చోటుచేసుకుంది. సీజీటీఎన్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు పొందిందని రెగ్యులేటరీ ఆరోపించిన సంగతి తెలిసిందే. బీబీసీ తమ విదేశీ మీడియా నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని, చైనాపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని చైనా ఆరోపించింది. తమ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై 'తప్పుడు రిపోర్టింగ్' చేస్తోందని మండిపడింది. వీగర్ ముస్లింలు, కరోనావైరస్ విషయంలో బీబీసీ కథనాలను చైనా ప్రభుత్వం తప్పుబట్టింది. వార్తలు నిజాయితీగా, నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలి తప్ప, చైనా జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించకూడదని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే చైనా స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఆర్టిఎ) బీబీసీని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు చైనా నిర్ణయంపై బీబీసీ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ బీబీసీ అనీ, ఎలాంటి పక్షపాతం లేకుండా తమ మీడియా వార్తలను ప్రసారం చేస్తుందని బీబీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. అటు యూకే విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ ఈ నిషేధాన్ని వ్యతిరేకించారు. "మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు ఆమోదయోగ్యం కాదు" అని పేర్కొన్నారు. చైనాలో బీబీసీ నిషేధాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. చైనాలో మీడియా అణిచివేతకు గురవుతోందని అమెరికా హోంశాఖ వ్యాఖ్యానించింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి బయట ఫ్రీ మీడియాను వాడుకుంటున్న చైనా తమ దేశంలో ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. BBC statement in response to Chinese ban of BBC World News pic.twitter.com/RpLwvW4OzO — BBC News Press Team (@BBCNewsPR) February 11, 2021 -
మహిళా.. వందనం
గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటూ, గట్టిగా నిలబడి మార్పునకు దారి చూపిన వంద మంది మహిళల జాబితాను బి.బి.సి. నిన్న మంగళవారం విడుదల చేసింది. ఏటా ఆ సంస్థ విడుదల చేసే ఆ జాబితాలో ఈ ఏడాది నలుగురు భారతీయ మహిళలూ ఉన్నారు. బిల్కిస్ దాదీ (82), గానా ఇసైవాణి (23), మానసీ జోషీ (31), రిధిమా పాండే (12) ఆ నలుగురు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క ఎదురీత, పోరాట పటిమ, ఉద్యమ నిర్వహణ. అసమాన ప్రావీణ్యం. బిల్కిస్ (బానో) దాది గత సెప్టెంబరులో ప్రధాని మోదీ, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తదితరులతో పాటు ఈ ఏడాది ‘టైమ్’ మ్యాగజీన్ చోటిచ్చిన 100 మంది శక్తిమంతుల జాబితాలో కూడా 82 ఏళ్ల బిల్కిస్ దాదీ ఉన్నారు. గత ఏడాది చివర్లో భారత ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ – సి.ఎ.ఎ.)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్బాగ్లో డిసెంబర్ నుంచి మార్చి వరకు వంద రోజులకు పైగా జరిగి, కరోనా వల్ల ఆగిపోయిన మహిళల బైఠాయింపు ప్రదర్శనలో బిల్కిస్ దాదీ చివరి రోజు వరకు పాల్గొన్నారు! గడ్డ కట్టించే చలిలో స్ఫూర్తిమంతమైన మాటలు చెబుతూ షహీన్బాగ్ నిరసనకు ఉద్యమరూపం తెచ్చారు బిల్కిస్. ఆ ప్రేరణతో దేశంలో మిగతాచోట్ల కూడా షహీన్బాగ్ తరహా మహిళా ఉద్యమాలు తలెత్తాయి. గానా ఇసైవాణి ‘గానా’ అనేది ఒక ఆలాపన ధోరణి. అందులో పురుషుల స్వరాలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. చెన్నై అమ్మాయి ఇసైవాణి గానాలో పట్టుసాధించి పురుష గాయకులకు దీటుగా నిలిచింది. పోటీ ఇచ్చింది. ప్రజాదరణ పొందింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ‘గానా’ పాటలు పాడేందుకు ముందుకు వచ్చారు! మానసీ జోషి పారా అథ్లెట్. బ్యాడ్మింటన్లో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్. అంగవైకల్యం, పారా క్రీడల విషయంలో భారతీయుల వైఖరిని సానుకూలంగా మార్చేందుకు ఆమె కృషి చేస్తున్నారు. మానసీ జోషీ రాజ్కోట్ యువతి. ఇంజినీరింగ్ చదివారు. ఇటీవలే ‘టైమ్’ మ్యాగజీన్ ప్రకటించిన ‘నెక్స్›్ట జనరేషన్ లీడర్’ జాబితాలోనూ మానసీ ఉన్నారు. రిధిమా పాండే పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవలసిన అవసరం గురించి తోడి విద్యార్థులను జాగృతం చేస్తున్న రిధిమా ఈ చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా అనేక చైతన్య సదస్సులలో పాల్గొంది. వాతావరణ మార్పుల విషయంలో భారత ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపిస్తో తొమ్మిదేళ్ల వయసులోనే రిధిమ ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’లో పిటిషన్ వేసింది. గత ఏడాది గ్రెటా థన్బెర్గ్, ఇతర బాల కార్యకర్తలతో కలిసి ఐదు దేశాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల కమిటీలో ఫిర్యాదు చేసింది. పాండే ఉత్తరాఖండ్లో ఉంటుంది. -
నేషనల్ మీడియాపై దర్శకుడి వ్యంగ్యాస్త్రాలు
దక్షిణ భారత దేశ ప్రముఖుల విషయంలో జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై దర్శకుడు హరీష్ శంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తకు జాతీయ మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆయన మండిపడ్డారు. శనివారం ట్విటర్ వేదికగా హరీష్ స్పందిస్తూ..‘‘ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది. అంతేలే, కొందరి స్థాయి విశ్వవ్యాప్తం. ( ‘బాలు ఎప్పుడూ మాతోనే ఉన్నారు.. ఉంటారు’ ) ఇరుకు సందుల్లో కాదు’’ అని పేర్కొన్నారు. ప్రముఖ ఇంటర్ నేషనల్ న్యూస్ ఛానల్ బీబీసీ.. ఎస్పీ బాలు మరణంపై ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK — Harish Shankar .S (@harish2you) September 26, 2020 -
అసత్య ప్రచారంపై ప్రపంచాస్త్రం
సాక్షి, హైదరాబాద్: నాన్నా... పులి కథ గుర్తుందా? చిన్నప్పుడు చదువుకున్న ఈ కథ చెప్పే సారాంశం ఏమిటంటే.. కావాలనో, సరదాగానో తనకు ప్రమాదం ఉందంటూ అనవసరంగా అబద్ధం చెబితే నిజంగా ప్రమాదం కలిగినప్పుడు నిజం చెప్పినా అది అబ ద్ధమే అనుకుంటారు. ఇప్పుడీ కథ స్ఫూర్తి ప్రధానం కాదు కానీ.. అబద్ధమే ఇక్కడ ప్రధానం. అసత్యమే ప్రస్తుత వివాదం. ఎందుకంటే కరోనా మహమ్మారి ప్రపం చ దేశాలను ఉత్పాతంలోకి నెట్టిన ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిపై ప్ర పంచ వ్యాప్తంగా పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియా పుణ్యమాని ప్రజల్లోకి వెళ్లి పోయి గందరగోళానికి గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే ఏదో జరిగిపోతుందని, మళ్లీ ఏడాది తర్వాత వీరవిహారం చేస్తుందనీ, వ్యాక్సిన్ తయారీకి ఐదు– పదేళ్లు పడుతుందని.. ఇలా అనేక అవాస్తవాలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే మానవాళిని గం దరగోళానికి గురిచేస్తోన్న ఈ అసత్యాలపై యుద్ధం ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో). ప్రఖ్యాత టెలివిజన్ బీబీసీ, బ్రిటన్ ప్రభుత్వంతో కలసి ‘స్టాప్ ద స్ప్రెడ్’పేరుతో వాస్తవాలతో కూడిన విస్తృత ప్రచారాన్ని చేయాలని నిర్ణయించింది. ఏం చేస్తున్నారంటే..!: కోవిడ్–19పై ఈ అసత్య ప్రచారాలను కౌంటర్ చేసేందుకు గాను బీబీసీ టెలివిజన్తో పాటు పలు డిజిటల్ ప్లాట్ఫారాల ద్వారా భారత్తో సహా 20 దేశాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన టూల్కిట్లను బ్రిటన్ ప్రభుత్వం ఆ దేశాలకు అందజేయనుంది. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చనుంది. కరోనా వ్యాప్తి, దాని ప్రభావం, నియంత్రణ తదితర అంశాలతో కూడిన వాస్తవిక సమాచారాన్ని డబ్ల్యూహెచ్వో రూపొందించనుంది. ఈ 3 ప్రయత్నాల ద్వారా పెద్ద ఎత్తున వాస్తవాలను ఆయా దేశాల్లోని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని భావిస్తున్న మే, జూన్లో ఈ ప్రయత్నం చేయనున్నారు. దేశాలివే..: ఇథియోపియా, కెన్యా, నైజీరియా, సియెర్రాలియోన్, టాంజానియా, జాంబియా, బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, నేపాల్, థాయ్లాండ్, అజర్బైజాన్, మొలొదోవ, అల్జీరియా, లిబియా, ట్యునీషియా, బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, పరాగ్వే. -
క్షమాపణ చెప్పిన బీబీసీ
లండన్ : తాము ప్రసారం చేసిన వీడియోలో తప్పు దొర్లినందుకు ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ క్షమాపణలు తెలిపింది. అమెరికా లెజండరీ బాస్కెట్బాల్ ప్లేయర్ కోబ్ బ్రియాంట్ దుర్మరణానికి సంబంధించి బీబీసీ ఆదివారం పది గంటల బులిటెన్లో ఓ వార్తను ప్రసారం చేసింది. అయితే అందులో కోబ్కు బదులుగా లిబ్రోన్ జేమ్స్ చిత్రాలను చూపించారు. జేమ్స్, కోబ్ కెరీర్ పాయింట్లను అధిగమిస్తున్న వార్తను టెలికాస్ట్ చేశారు. దీంతో కోబ్కు బదులు జేమ్స్ స్క్రీన్ మీద ఎందుకు కనిపిస్తున్నాడనే దానిపై స్పష్టత లేకపోవడంతో వీక్షకులు ఆశ్చర్యపోయారు. బీబీసీ చేసిన తప్పిదాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సంస్థకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. బీబీసీని ఉద్దేశించి కొందరు నెటిజన్లు ఘాటుగా కూడా స్పందించారు. వార్త ప్రసారంలో తప్పును గుర్తించిన బీబీసీ.. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి బులిటెన్ చివర్లో న్యూస్ రీడర్ రీతా చక్రవర్తి చేత క్షమాపణలు చెప్పించింది. ‘కోబ్ మరణానికి సంబంధించిన వార్తను ప్రసారం చేసే సమయంలో.. ఒకానొక సందర్భంలో పొరపాటున కోబ్కు బదులుగా మరో బాస్కెట్బాల్ ఆటగాడు జేమ్స్ దృశ్యాలను ప్రసారం అయ్యాయ’ని రీతా పేర్కొన్నారు. అలాగే ఈ బులిటెన్ ముగిసిన కొద్ది సేపటికే బీబీసీ ఎడిటర్(సిక్స్ అండ్ టెన్) పాల్ రాయల్ ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. మానవ తప్పిదం వల్ల ఇలా జరిగిందన్న పాల్.. ఈ చర్య తమ సాధారణ ప్రమాణాలను తక్కువ చేసి చూపిందని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా బీబీసీ ఇటువంటి తప్పిదానికి క్షమాపణ చెప్పింది. 2018 జూలైలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్కు బదులుగా.. పాకిస్తాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ దృశ్యాలను ప్రసారం చేసినందుకు బీబీసీ ప్రేక్షకులను క్షమాపణ కోరింది. కాగా, కోబ్ ప్రయాణిస్తున్న అతని ప్రయివేట్ హెలికాప్టర్ లాస్ఏంజిల్స్కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్లో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కోబ్, అతని కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. తన 20 ఏళ్ల కెరీర్లో కోబ్ ఐదుసార్లు ఎన్బీఏ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా అత్యధిక గోల్స్ సాధించిన టాప్ ప్లేయర్స్లలో కోబ్ బ్రియంట్ ఒకడిగా నిలిచారు. I genuinely cannot believe that the actual BBC News at 10 just did this pic.twitter.com/n6csMV9OOG — Matthew Champion (@matthewchampion) January 26, 2020 In tonight’s coverage of the death of Kobe Bryant on #BBCNewsTen we mistakenly used pictures of LeBron James in one section of the report. We apologise for this human error which fell below our usual standards on the programme. — Paul Royall (@paulroyall) January 26, 2020 చదవండి : కుమార్తెతో సహా బాస్కెట్బాల్ లెజెండ్ కోబ్ దుర్మరణం ట్రంప్ ట్వీట్పై నెటిజన్ల మండిపాటు.. -
బీబీసీ అత్యుత్తమ ఆటగాడిగా స్టోక్స్
అబెర్దీన్ (స్కాట్లాండ్): ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ‘స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. గ్రేట్ బ్రిటన్ తరఫున వివిధ రంగాల్లో అసమాన ప్రదర్శన కనబర్చిన వారికి బీబీసీ ప్రతీ ఏటా ఈ పురస్కారాలు అందిస్తుంది. 2019లో మైదానంలో స్టోక్స్ ప్రదర్శన ఇంగ్లండ్ అభిమానుల దృష్టిలో అత్యుత్తమంగా నిలిచింది. ఇంగ్లండ్ తొలిసారి గెలుచున్న వన్డే వరల్డ్ కప్లో స్టోక్స్ 66.42 సగటుతో 5 అర్ధ సెంచరీలు సహా 465 పరుగులు చేశాడు. ఫైనల్ పోరులో అతనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఆ తర్వాత యాషెస్ సిరీస్లో భాగంగా హెడింగ్లీలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్కు ఓటమి ఖాయమనిపించిన దశలో 135 పరుగుల అద్భుత బ్యాటింగ్తో తమ జట్టును గెలిపించాడు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం నిర్ణయించిన ఈ అవార్డులో స్టోక్స్ తర్వాత ఫార్ములావన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్కు రెండో స్థానం దక్కింది. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఒక క్రికెటర్ అత్యుత్తమ ఆటగాడి పురస్కారాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి. కొన్నాళ్ల క్రితం బ్రిస్టల్లో జరిగిన ఒక పబ్ ఉదంతంలో వ్యక్తిపై దాడికి పాల్పడి దాదాపు కెరీర్ ముగిసిపోయే ప్రమాదంలో నిలిచిన దశ నుంచి ఇప్పుడు స్టోక్స్ అందరినుంచి నీరాజనాలు అందుకోవడం విశేషం. ‘రెండేళ్ల క్రితం నా జీవితంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. కానీ అలాంటి స్థితిలో అండగా నిలిచిన నా సన్నిహితుల వల్ల కోలుకోగలిగాను. ఒక టీమ్ ఈవెంట్లో నా వ్యక్తిగత ప్రదర్శనను అంతా గుర్తించినందుకు సంతోషంగా ఉంది’ అని స్టోక్స్ వ్యాఖ్యానించాడు. బీబీసీ అవార్డుల్లో ప్రపంచ కప్ గెలుచుకున్న ఇంగ్లండ్ వన్డే జట్టు ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’గా నిలవగా... సూపర్ ఓవర్ చివరి బంతికి స్టంప్స్ను పడగొట్టి గప్టిల్ను కీపర్ బట్లర్ రనౌట్ చేసిన క్షణం ‘గ్రేటెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్’ అవార్డుకు ఎంపికైంది. 1954లో నెలకొల్పిన బీబీసీ స్పోర్ట్స్ అవార్డుల్లో ఇప్పటివరకు ఐదుగురు క్రికెటర్లు మాత్రమే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో జిమ్ లేకర్ (1956లో), డేవిడ్ స్టీలీ (1975లో), ఇయాన్ బోథమ్ (1981లో), ఆండ్రూ ఫ్లింటాఫ్ (2005లో) ఈ అవార్డును పొందారు. -
టాప్–100 రచయితల్లో మనవాళ్లు
లండన్: ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన మొదటి 100 మందిలో.. ప్రముఖ భారతీయ రచయితలు ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్లకు చోటు దక్కింది. బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో వీరి పేర్లున్నాయి. బీబీసీ నియమించిన నిపుణుల కమిటీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనల్ని ఎంపిక చేసి వాటిని ప్రేమ, రాజకీయం, అధికారం, బాలసాహిత్యం, సమాజం వంటి పది కేటగిరీలుగా విభజించింది. ఒక్కో కేటగిరీ కింద ఏడాది పాటు శ్రమించి కొన్ని పుస్తకాలను ఈ బృందం ఎంపిక చేసింది. ఇందులో అరుంధతి రాయ్ రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్కే నారాయణ్ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్లో, సల్మాన్ రష్దీ రాసిన ‘ది మూర్స్ లాస్ట్ సై’రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ‘ఎ స్యూటబుల్ బోయ్’ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది. పాక్ రచయితలు మొహ్సీన్ హమీద్, కమిలా షమ్సీలు రాసిన ది రిలక్టాంట్ ఫండమెంటలిస్ట్, హోం ఫైర్, అఫ్గాన్–అమెరికన్ రచయిత ఖలేద్ హొస్సైనీ రాసిన ఎ థౌజెండ్ స్లె్పండిడ్ సన్స్ నవలకు చోటు దక్కింది. ఆంగ్లంలో తొలి నవలగా భావించే ‘రాబిన్సన్ క్రూసో ’ప్రచురితమై 300 ఏళ్లు పూర్తవడంతో ఈ జాబితా తెచ్చారు. -
అదంతే..అనాదిగా ఇంతే!
బొమ్మలతో ఆడుకోవడమంటే చిన్న పిల్లలకు సరదా.. వాటిని చూడగానే ఎంత మారాం చేసే వారైనా నిమిషంలో అట్టే సైలెంట్ అయిపోతారు. సంవత్సరం లోపు వయసున్న పిల్లలకు దాదాపు గిలక్కాయ వంటి చప్పుడు చేసే వస్తువులు ఇస్తుంటాం. ఆ వస్తువుల్లో పెద్ద తేడా ఉండదు. కానీ వాళ్లు పెరుగుతున్న కొద్దీ వారు ఆడుకునే బొమ్మల్లో తేడా వస్తుంటుంది. ఆడ పిల్లలైతే బార్బీ బొమ్మలు, టెడ్డీ బేర్, కిచెన్ సెట్లు, పెళ్లి కూతురు బొమ్మలను ‘ఇస్తుంటాం’. అదే మగ పిల్లలయితే కార్లు, బైకులు, ట్రక్కులను ‘ఇస్తుంటాం’.. అంతేనా..? మనమే ఇస్తుంటామా.. లేదా వారే అలా కోరుకుంటారా..? ఇలా బొమ్మలను ఎంచుకోవడం, ఆడ, మగ పిల్లలు వేర్వేరుగా పెరగడంలో సమాజం పాత్ర ఏమైనా ఉందా.. లేదా సహజంగానే ఆ ఎంపిక జరుగుతోందా..? ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని జంతువులపై బీబీసీ ప్రయోగం జరిపింది. ఎంపికలో తేడా అనాదిగానే ఉందని, మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఇలాంటి ప్రవర్తనే ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలింది. జెండర్ న్యూట్రల్ బొమ్మలు లింగ వివక్ష చూపుతూ బొమ్మలు తయారు చేస్తున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వస్తున్నాయి. ‘కిండర్ జాయ్’కూడా మగ పిల్లలకు, ఆడ పిల్లలకు వేర్వేరు బొమ్మలు తయారు చేస్తుండటంపై ఈ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లింగ వివక్షచూపే బొమ్మలు ఉండొద్దని.. అందరు పిల్లలకూ ఒకే రకమైన బొమ్మలు తయారు చేయాలని (జెండర్ న్యూట్రల్ టాయ్స్) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆటలోనూ ఆడ, మగ జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బార్బీ బొమ్మలు, టెడ్డీ బేర్స్, కార్లు, బైకులు, ట్రక్కులు ఇలా చాలా బొమ్మలను పరిశోధకులు ఉంచారు. బబూన్ కోతి పిల్లలను పరిశీలించినప్పుడు ఆడ కోతి పిల్లలేమో టెడ్డీబేర్ వంటి బొమ్మలతో ఆడుకున్నట్లు, మగ కోతి పిల్ల లేమో కార్లు, ట్రక్కులతో ఆడుకున్నట్లు గమనించారు. మిగతా జంతువుల్లో కూడా దాదాపు ఇలాంటి ప్రవర్తనే గుర్తించారు. ‘జంతువులు ఇలా చేస్తున్నాయంటే వాటికి ఎవరైనా నేర్పుతున్నారా? కాదుకదా సహజంగానే అవి ఎంచుకుంటున్నాయి. ఇలాంటి ప్రవర్తనే మానవు ల్లో కూడా అనాదిగా ఉంది. ఎవరూ నేర్పించట్లేదు. ఇది సహజమైన ప్రక్రియే’అని జీవ పరిణామ శాస్త్రవేత్త ప్రొ.బెన్ గారడ్ పేర్కొన్నారు. -
భారత సంతతి ఇళ్లే టార్గెట్
లండన్: బ్రిటన్లో బంగారం దొంగలు అత్యధికంగా భారత సంతతి ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు శనివారం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. గత ఐదేళ్లలో రూ. 1,280 కోట్ల విలువైన బంగారం బ్రిటన్లో చోరికి గురైందనీ, అందులో అత్యధికం భారత సంతతి ప్రజలదేనని బీబీసీ పరిశోధనలో తేలింది. 2013 నుంచి చూస్తే 28 వేల బంగారం దొంగతనాలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రేటర్ లండన్లో రూ. 1,050 కోట్ల విలువైన బంగారం దొంగతనానికి గురయ్యింది. ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా బంగారం ఎంతున్నా దొంగలు కొట్టేస్తున్నారనీ, బంగారాన్ని చాలా తక్కువ సమయంలో, చాలా సులువుగా నగదుగా మార్చుకునే అవకాశం ఉండటం ఇందుకు ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు. చెషైర్ పోలీస్ దళంలో నేరాల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆరోన్ దుగ్గన్ అనే అధికారి మాట్లాడుతూ ‘సెకండ్ హ్యాండ్ నగలు కొనే వ్యాపారులు అమ్ముతున్న వ్యక్తి ఎవరు? ఆ నగలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? అని తెలుసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. ఈ దేశంలో బంగారం తునక ముక్కలు అమ్మడం కన్నా సెకండ్ హ్యాండ్ నగలు అమ్మడమే సులభం’ అని తెలిపారు. దసరా, దీపావళి సమయాల్లోనే ఎక్కువ దీపావళి, దసరా తదితర భారత ప్రధాన పండుగల సమయంలో ప్రజలు బంగారం ఎక్కువగా ధరించి ఆలయాలు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారనీ, ఆ పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని లండన్ పోలీసులు అంటున్నారు. ప్రతీ ఏడాది ఈ పండుగల సమయంలో తాము హెచ్చరికలు కూడా చేస్తామన్నారు. 2017–18లో లండన్లోనే 3,300 దొంగతనాలు జరిగాయి. రూ. 193 కోట్ల విలువైన బంగారం చోరీకి గురయ్యింది. పశ్చిమ లండన్లోని సౌథాల్లో ఆసియా స్టైల్ బంగారం నగలు అమ్మే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బంగా>రం ఆభరణాలకు సంప్రదాయాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవాలనీ, బీమా కూడా చేయించుకోవాలని తానెప్పుడూ తన దగ్గర బంగారం కొనేవారికి చెబుతుంటానని ఆయన తెలిపారు. ‘బంగారం కొనడమంటే పెట్టుబడి పెట్టడమనీ, అది అదృష్టాన్ని కూడా తెస్తుందని పిల్లలకు వారి తల్లిదండ్రులు చెబుతారు. ఆసియా ప్రజలు ఇదే చేస్తారు. వాళ్లు ఇక్కడకొచ్చినా ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు’ అని సంజయ్ కుమార్ వివరించారు. బంగారు ఆభరణాలు కేవలం విలువైనవేగాక, వాటి యజమానులకు వాటితో ప్రత్యేక అనుబంధం ఉంటుందనీ, అవి పోయినప్పుడు యజమానుల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని లండన్ పోలీసు విభాగంలో డిటెక్టివ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న లీసా కీలే చెప్పారు. తమ చర్యల కారణంగా ఈ దొంగతనాలు కొంచెం తగ్గాయనీ, అయినా చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆమె తెలిపారు. బంగారం దొంగలను పట్టుకోడానికి, దొంగతనాల సంఖ్యను తగ్గించడానికి లండన్ పోలీసులు ప్రత్యేకంగా ‘ఆపరేషన్ నగ్గెట్’ పేరిట ఓ∙కార్యక్రమాన్ని సైతం ఆచరణలోకి తెచ్చారు. -
ముగ్గురు విజేతలు
విజి పేన్కూట్టు, రాహీబాయి, మీనా గయేన్.. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన, స్ఫూర్తిదాయకమైన’ మహిళలుగా బీబీసీ తయారు చేసిన తాజా వందమంది జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ ముగ్గురు భారతీయ స్త్రీలు తమ శక్తికి మించిన ప్రయత్నాలతో వివిధ సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టి సమాజానికి ఆదర్శంగా నిలిచారని బిబీసీ ప్రశంసించింది. రైట్ టు సిట్ విజి పేన్కూట్టు.. వయసు యాభైఏళ్లు. వృత్తి టైలరింగ్. 22 ఏళ్ల వయసులో సామాజిక సేవ మొదలుపెట్టారు. ఘనత.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కోసం పోరాడారు. దాదాపు నాలుగేళ్ల ఉద్యమం తర్వాత ఆమె ఘోష విన్నది కేరళ ప్రభుత్వం ఆ మేరకు చట్టాన్ని సవరించింది. అంతేకాదు ఆడవాళ్లు పనిచేస్తున్న ప్రతి షాపులో వాళ్లు కూర్చోవడానికి వీలుగా కుర్చీలను ఏర్పాటును తప్పనిసరి చేసింది. విజి చేపట్టిన ఉద్యమం పేరు ‘రైట్ టు సిట్’. ‘‘బీబీసీ జాబితాలో నా పేరుండడం నిజంగా సంతోషాన్నిస్తోంది. రైట్ టు సిట్ అనేది కేవలం మనదేశంలోని సమస్యే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేల్స్గర్ల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం’’ అంటుంది విజి పేన్కూట్టు. సీడ్ మదర్ రాహీబాయి.. స్వస్థలం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా, కోంభాల్నే గ్రామం. వృత్తి రైతు. ఘనత.. ఆగ్రో– బయోడైవర్సిటీలో సెల్ఫ్ మేడ్ ఎక్స్పర్ట్. వరిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తూ ఆదర్శరైతుగా నిలిచింది. తన పొలంలో సొంతంగా నీటి సంరక్షణా నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీంతో రెండెకరాల బంజరుభూమిని మాగాణిగా మలచుకుంది. ఆ నేలలో కూరగాయలను పండిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. విత్తన భాండాగారాన్నీ స్థాపించి రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తోంది. ఇదిగాక విత్తనాల ఎంపిక, నేల సారాన్ని వృద్ధిపరుచుకోవడం, ఎరువుల వాడకం వంటివాటిపై రైతులకు, వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు శిక్షణనూ ఇస్తోంది. ఈ కృషికి ‘ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ సంస్థ ఆమెను ‘సీడ్ మదర్’ అనే బిరుదుతో సత్కరించింది. భగీరథి మీనా గయేన్.. పశ్చిమ బెంగాల్ వాస్తవ్యురాలు. ఘనత.. సుందర్బన్స్లోని మహిళలందరినీ ఏకం చేసి ఆ ప్రాంతంలో రహదారులను నిర్మించింది. చుట్టూ నదులతో శాశ్వత రహదారులకు అనుకూలంగా లేని ప్రదేశం సుందర్బన్స్. అలాంటి చోట అక్కడి గ్రామాల స్త్రీలనందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చి పర్మినెంట్ రోడ్లను నిర్మింపచేసి అభినవ భగీరథిగా కీర్తిగాంచింది రాహీబాయి. అందుకే బీబీసీ ఆమెను మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఇన్సిపైరింగ్ ఉమన్గా గౌరవించింది. -
‘జాతీయ’ ముసుగులో నకిలీ వార్తలు
లండన్/ న్యూఢిల్లీ: భారత్లో నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిపై ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ సంచలన విషయాన్ని బయటపెట్టింది. దేశ నిర్మాణం, జాతీయవాద సందేశాలతో ఉన్న నకిలీ వార్తలను భారతీయులు సోషల్మీడియాలో పంచుకుంటున్నారని బీబీసీ తెలిపింది. ఈ సందర్భంగా వీటిలోని నిజానిజాలను పరిశీలించడం లేదని వెల్లడించింది. హింసను రెచ్చగొట్టే సందేశాలను సోషల్మీడియాలో పంచుకునేందుకు భారతీయులు ఇష్టపడటం లేదనీ, అదే సమయంలో జాతీయవాద సందేశాలున్న వార్తలను షేర్ చేయడాన్ని తమ బాధ్యతగా భావిస్తున్నారని చెప్పింది. సోషల్మీడియాలో నకిలీ వార్తలు వ్యాప్తిచేస్తున్న గ్రూపులకు, ప్రధాని మోదీ మద్దతుదారులకు మధ్య సంబంధముందని పేర్కొంది. భారత్, కెన్యా, నైజీరియాలో నకిలీ వార్తలపై అధ్యయనం చేసిన బీబీసీ సోమవారం తన నివేదికను విడుదల చేసింది. భావోద్వేగాల ఆధారంగా ఈ నకిలీ వార్తలు, వదంతులను వ్యాప్తి చేస్తున్నారని బీబీసీ తెలిపింది. ఈ విషయమై బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్రూప్ డైరెక్టర్ జేమీ అంగస్ మాట్లాడుతూ.. ‘నకిలీ వార్తలపై పశ్చిమదేశాల్లోని మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో మాత్రం జాతి నిర్మాణం అనే అంశం వాస్తవాలను మరుగున పడేస్తోంది. భారత్లో నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలో ట్విట్టర్లోని హిందుత్వ గ్రూపులు, వామపక్ష భావజాలమున్న వారికంటే ఎక్కువ సమన్వయంతో పనిచేస్తున్నాయి’ అని వెల్లడించారు. ‘బీబీసీ బియాండ్ ఫేక్ న్యూస్ ప్రాజెక్టు’ కింద అధ్యయనం చేపట్టామన్నారు. నకిలీల్ని పూర్తిగా అరికట్టలేం: ట్విట్టర్ నకిలీ వార్తల వ్యాప్తి అన్నది చాలా అంశాలతో కూడుకున్న విషయమనీ, దాన్ని పరిమిత చర్యలతో అడ్డుకోలేమని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న భారత్కు చేరుకున్న డోర్సీ.. ఢిల్లీ–ఐఐటీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లా డారు. నకిలీ వార్తలు, వదంతుల తొలగింపులో ట్విట్టర్ నిర్లక్ష్యంగా, నిదానంగా వ్యవహారిస్తోం దని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఒంటరి
‘ఒంటరితనాన్ని అణచిపెట్టినా, నిర్లక్ష్యం చేసినా.. ఆ భావన తాలూకు బాధ, సమస్య అలాగే ఉంటాయి’అంటారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. యువతీ యవకుల్లో 40% మంది ఆ ఒంటరితనం బారినపడుతున్నారని, పెద్దల (27%)తో పోలిస్తే సమాజంతో వేరుపడిపోతున్న యువత సంఖ్య పెరుగుతోందని బీబీసీ ఇటీవల జరిపిన సర్వే చెబుతోంది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన 55,000 మంది (16 – 99 వయస్కులు) ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 66% మంది స్త్రీలు. ‘ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. ప్రపంచం నన్ను పక్కకు నెట్టేసినట్టు, ప్రపంచం నుంచి వేరుపడినట్లు అనిపిస్తుంది. ఈ కారణంగాదిగులుగా వుంటుంది’అని ఒంటరితనం గురించి సర్వేలో పాల్గొన్న వారు ఇచ్చిన వివరణ ఇది.మన దేశంలో జరిగిన కొన్ని అధ్యయనాలు కూడా ఇవే విషయాలు వెల్లడించాయి. 30% మంది యువతీ యువకులు ఒంటరితనానికి లోనవుతున్నట్టు 2016లో లోక్నీతి– సీఎస్డీఎస్ (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసై టీస్) జరిపిన శాంపిల్ సర్వే తెలిపింది. యువకుల (29%) కంటే యువతుల్లో (33%), పట్టణ యువత (29%) కంటే గ్రామీణ యువతలో (33%) ఒంటరితనం బాధితులు ఎక్కువని తేల్చింది. బీబీసీ సర్వేలో తేలిన అంశాలు 16 – 24 వయసున్న యువతీయువకుల్లో 40% మందిని ఒంటరితనం వెంటాడుతోంది. ఒంటరితనం ఒక్కోసారి తమకు మంచి అనుభవాలనే పంచిందని 41% మంది చెప్పారు. నిరుద్యోగుల్ని (వయసుతో నిమిత్తం లేకుండా) ఒంటరితనం మరింత బాధిస్తోంది. పూర్తిగా, పాక్షికంగా కంటిచూపు లేని వారిలోనూ, వివక్షకు గురువుతున్న వారిలోని ఒంటరితనపు యాతన ఎక్కువే. సామాజికంగా – ఆర్థికంగా వెనుకబడిన వారు, గేలు.. వివక్ష ఎదురైన సందర్భాల్లో తమకు ఎవ్వరూ లేరనే వేదనలో కూరుకుపోతున్నారు. ఏం చేయాలి? ‘ఏదైనా చదవండి లేదా పనిలో మునిగిపోండి. స్నేహితులు, కుటుంబంతో తరుచుగా మాట్లాడుతూ మీ ఆలోచనల్ని పంచుకోండి. మీరు కలిసే వ్యక్తుల్లో మంచినే చూడటం నేర్చుకోండి. ముందు ఒంటరితనం వెనుకున్న కారణాలు గ్రహించి అటువైపు ఆలోచించండి. మనసుకు నచ్చిన వారికి మీ వేదన చెప్పండి’అని ఒంటరితనం నుంచి బయటపడేందుకు బీబీసీ సర్వే నిర్వాహకులు ఇచ్చిన సలహాలివి. ఆధునిక జీవితంలో ‘ఒంటరితనం’ఓ విషాద వాస్తవమంటున్నారు బ్రిటన్ ప్రధాని థెరిసా మే. ఆ దేశం ‘ఒంటరితనం’తాలూకు ప్రమాదకర పరిణామాల నుంచి ప్రజల్ని రక్షించే ఉద్దేశంతో ఒక మంత్రిత్వశాఖ (మినిస్టర్ ఫర్ లోన్లీనెస్)ను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకిలా? యవ్వన దశలో జీవితంలో అనేక మార్పులొస్తాయి. చదువు, పనుల కోసం ఇంటికి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. కొత్త వారితో మసలుకోవాల్సి ఉంటుంది. సహజంగానే ఇవి కొంతవరకు ఒంటరితనానికి కారణమవుతాయి. అయితే చుట్టూ ఉన్న వాతావరణం తమ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు అందులో ఇమడలేనప్పుడు.. ఆ ఒంటరితనం మరింత బాధిస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. విద్యా సంస్థల్లో మంచి గ్రేడ్ సంపాదించకపోవడమనేది కొన్ని సందర్భాల్లో ఇతరులతో వేరుపడిపోయేందుకు, ఆపైన డిప్రెషన్లోకి జారుకునేందుకు దారి తీస్తుంటుందని వారు వివరిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న టెక్నాలజీ వాడకం, సోషల్ మీడియాలో గడపటం ఒంటరితనానికి కారణమవుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. -
హార్ట్ టచింగ్ ఫోటో: కంటతడి పెట్టాల్సిందే..
అమ్మ తనకు ఆకలిగా ఉన్నా.. పిల్లల కడుపు నింపిన తర్వాతే భోజనం చేస్తుంది. కానీ పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ తల్లి ప్రేమను మర్చి పోతారు. తమ దారేదో తాము చూసుకుంటారు. తల్లిదండ్రులకు పట్టేడన్నం పెట్టడానికి వెనుకాడతారు. వయసు పైబడిన వారు తమకు భారమైనట్టు, తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతుంటారు. మనవళ్లు, మనవరాళ్లను వారికి దూరం చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ప్రతి ఒక్కరినీ చలింప చేస్తోంది. ఓ స్కూల్ బాలిక, ఓ వృద్ధురాలి పక్కన కూర్చుని గుక్కపెట్టి ఏడ్చే ఆ ఫోటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఫోటోలోని బాలిక, స్కూల్ ఫీల్డ్ ట్రిప్లో భాగంగా అనూహ్యంగా ఓ వృద్ధాశ్రమంలో ఉన్న తన నాన్మమ్మను కలుసుకుంటోంది. ఇన్నాళ్లు నాన్నమ్మ బయటికి వెళ్లిందని నాన్న చెప్పే మాటలనే నమ్ముతూ వస్తున్న ఆ బాలికకు.. వృద్ధాశ్రమంలో తన నాన్నమ్మ కనిపించడం, ఆ తర్వాత నిజం తెలియడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గుజరాత్లోని ఓ ఫోటోగ్రాఫర్ దాదాపు పదేళ్ల కిందట ఈ హృదయ విదారకమైన సంఘటనతో పాటు వారి ఫోటోను కూడా గుజరాతి డైలీ ‘దివ్య భాస్కర్’లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశాడు. అప్పట్లో అది ఓ సంచలన టాఫిక్గా మారింది. ఆ ఫోటో ఫేస్బుక్లో పెద్ద ఎత్తున షేర్ అయింది. తాజాగా పదేళ్ల తర్వాత మరోసారి ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2007 సెప్టెంబర్ 12న ఫోటోజర్నలిస్ట్ కల్పెష్ ఎస్ భరేచ్కు గుజరాత్ మనినగర్లోని జీఎన్సీ స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఘోదసర్లోని మనిలాల్ గాంధీ వృద్ధాశ్రమానికి స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్నామని, ఈ స్కూల్ ట్రిప్ను కవర్ చేయమని ప్రిన్సిపాల్ కోరారు. భరేచ్, పిల్లలతో పాటు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కానీ ఆ అసైన్మెంటే తన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుందని భరేచ్ కలలో కూడా ఊహించి ఉండడు. ఫీల్డ్ ట్రిప్లో భాగంగా పిల్లలను, పెద్ద వాళ్ల పక్కన కూర్చోమని.. మంచి మంచి ఫోటోలు తీస్తున్నాడు. స్కూల్ పిల్లల్లో ఒక చిన్న అమ్మాయి.. ఒక గదిలోకి వెళ్లగానే ఓ ముసలావిడ దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. ఆ మహిళ కూడా చిన్నారిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఏం జరిగిందా? అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ ఆ ముసలావిడ చెప్పిన స్టోరీ వినగానే మేమందరం ఒక్కసారిగా మూగబోయాం అని భరేచ్ చెప్పాడు. ఆ ముసలావిడ, ఆ అమ్మాయికి నాన్నమ్మ అట. ఎంతో కాలం తర్వాత మనవరాలిని చూసిన ఆ ముసలావిడ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని తనివితీరా ఏడ్చారు. నాన్నమ్మ బయటికి వెళ్లిందని ఎప్పుడూ నాన్న చెబుతుండే వాడని ఆ పాప చెప్పింది. కానీ ఎప్పుడూ కూడా వృద్ధాశ్రమంలో ఉందని చెప్పలేదని కన్నీంటి పర్యంతమైంది. నానమ్మ, మనవరాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న ఫోటోతో పాటు, వీరి స్టోరీని గుజరాతి డైలీ దివ్య భాస్కర్లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశారు. గుజరాత్ అంతటా అప్పట్లో ఇదే బిగ్ డిబేట్. అన్ని పత్రికలు, ఛానళ్లు కూడా దీన్నే మెయిన్ స్టోరీగా బ్రాడ్కాస్ట్ చేశాయి. ఆమెను వృద్ధాశ్రమం నుంచి తన ఇంటికి తీసుకెళ్లినట్టు భరేచ్ తర్వాత స్థానిక టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు వైరల్ అవుతుంది.... ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా.. బీబీసీ గుజరాతీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్లను తమ కెరీర్లో తీసిన ఉత్తమమైన ఫోటోలను షేర్ చేయమని కోరింది. బీబీసీ గుజరాతీకి భరేచ్.. తన బెస్ట్ ఫోటోలన్నింటిన్నీ షేర్ చేయగా.. ఈ ఫోటో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భరేచ్ ప్రస్తుతం దివ్య భాస్కర్లో పనిచేస్తున్నాడు. తన తండ్రి ఫోటో సోషల్ మీడియా వైరల్ అయిందని... చాలామంది సెలబ్రిటీలు దీనిపై ట్వీట్ చేస్తున్నారని.. కేవలం పేరు కోసం కాకుండా.. వృత్తి మీద ప్రేమతో పనిచేయాలని తన తండ్రి ఎప్పుడూ సూచిస్తుంటాడని... నిజంగా ఇది తమకెంతో గర్వకారణమని భరేచ్ కొడుకు దీపమ్ ఫేస్బుక్లో ఓ పోస్టులో తెలిపాడు. -
పొలిటికల్ కారిడర్ 17th July 2018
-
చనిపోయాడని చెప్పారు.. కానీ!
కేప్టౌన్(దక్షిణాఫ్రికా) : ఆ రోజు జూన్ 24, తెల్లవారు జామున.. రోడ్డు సరిగా కనిపించడం లేదు. అసలే అది కేప్టౌన్లోకెల్లా చాలా ప్రమాదకరమయిన రోడ్డు. ఆ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. కారులో నలుగురులో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఎంత తీవ్రంగా అంటే కారులో నుంచి రోడ్డు మీద పడ్డారు. నాల్గో వ్యక్తికి మాత్రం అంత పెద్ద దెబ్బలేం తగల్లేదు. దాంతో అతను సాయం కోసం ఎదురు చూస చూస్తుండగా.. సమాచారం అందుకున్న ప్రైవేటు అంబులెన్స్ సర్వీస్ వారు అక్కడికి వచ్చారు. గాయపడిన నాల్గో వ్యక్తిని కాపాడటం కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. అనంతరం వారిని మార్చురికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ముగ్గురిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తుండగా చనిపోయిన వారిలో ఒక వ్యక్తి శ్వాస తీసుకుంటున్నట్టు గమనించారు. అతన్ని పరీక్షించగా బతికే ఉన్నాడు. కొద్ది నిమిషాల ముందు మరణించాడని ప్రకటించిన వ్యక్తి మళ్లీ ఎలా బతికాడు...? ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు ప్రంపంచ వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి బీబీసీ కొన్ని కథనాలను కూడా ప్రచారం చేసింది. వాటిలో గత జనవరిలో గోన్జాలో మొన్టోయో అని వ్యక్తి మరణించినట్లు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డాక్టర్లు నిర్ధారించారు. అతనికి పోస్టు మార్టమ్ చేద్దామని శరీరంపై గుర్తులు కూడా పెట్టారు. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. మూడేళ్ల క్రితం 91 ఏళ్ల వృద్ధురాలిని మరణించినట్లు ప్రకటించారు. కానీ ఆమె మరణించినట్లు ప్రకటించిన 11 గంటల తర్వాత ఆ బామ్మ నింపాదిగా లేచి కూర్చుని వేడి వేడిగా ఓ కప్పు కాఫీ, పాన్ కేక్ తీసుకురమ్మని డాక్టర్లకు చెప్పింది. దాంతో డాక్టర్లు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. కొన్నేళ్ల క్రితం ఓ 80 ఏళ్ల బామ్మకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు ఆమెను మరణించిందని నిర్ధారించి, ఫ్రీజర్లో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆమె ముక్కు పగిలి సగం బయటకు వచ్చి ఉంది. ఏం జరిగిందో ముందు డాక్టర్లకు అర్థం కాలేదు. తర్వాత తెలిసిందేంటంటే పాపం ఆ వృద్ధురాలిని ఫ్రీజర్లో పెట్టిన తర్వాత బతికిందని, అందుకే బయటకు రావడానికి ప్రయత్నించి ఉంటుందని తెలిపారు డాక్టర్లు. మరణం తర్వాత జీవం ఎలా... వైద్యులు పరీక్షించి, మరణించారని నిర్ధారించిన తర్వాత కూడా వీరంతా మళ్లీ ఎలా బతుకుతున్నారన్నదే చాలా ఆశ్చర్చకరమైన విషయం. అయితే దీనికి వైద్యులు చెప్పే సమాధానం మరణించారని నిర్ధారించిన వ్యక్తులు కొన్నిసార్లు నిజంగానే మరణించరు. ఆ సమయంలో వారు ‘కాటలాప్సి’(కండరాలు బిగుసుకుపోవడం) అనే స్థితికి చేరుకుంటారు. ఆ సమయంలో వారి హృదయ స్పందనలు, శ్వాస తీసుకోవడం వంటి వాటిని గుర్తించలేనంత లో-లెవల్కు పడిపోతాయి. కాబట్టి వారు మరణించిన వారిలానే ఉంటారు. కండరాల బిగువు సడలిన తర్వాత వారి శరీరం సాధారణ స్థితిలోకి వచ్చి ఉన్నట్టుండి ఒక్కసారిగా బతుకుతున్నారని తెలిపారు వైద్యులు. -
భారత్లో ప్రాణాంతకంగా నకిలీ వార్తలు: బీబీసీ
లండన్: ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా చక్కర్లు కొడుతున్న నకిలీ వార్తలు భారత్లో పెనుముప్పుగా తయారయ్యాయని బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) తెలిపింది. తద్వారా దేశంలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని బెంగళూరులో ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు కిడ్నాపర్లు నగరంలోకి వచ్చారన్న వదంతుల నేపథ్యంలో బెంగళూరులో గత మంగళవారం కాలురామ్ బచ్చన్రామ్ అనే వ్యక్తిని కొట్టిచంపిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై బీబీసీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..‘భారత్లో విచ్చలవిడిగా వ్యాపిస్తున్న వదంతులకు కాలూరామ్ బలైపోయాడు. ఇలాంటి నకిలీ వార్తలు, వదంతులకు ఇప్పటివరకూ దేశంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు’అని చెప్పారు. ఈ నకిలీ వార్తలు, వదంతులకు చెక్ పెట్టేందుకు ‘బీబీసీ రియాలిటీ చెక్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. 2016లో బ్రెగ్జిట్ సందర్భంగా ఈ సేవల్ని ఆవిష్కరించామన్నారు. భారత్లో దాదాపు 83 శాతం మంది ప్రజలు నకిలీ వార్తల వ్యాప్తిపై ఆందోళన చెందుతున్నట్లు ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో తేలిందన్నారు. -
ప్రపంచకప్ రేడియో ప్రసార హక్కులు సోంతం చేసుకున్న బీబీసీ
-
ఆకాశం ఎరుపెక్కుతోంది
రిపోర్టింగ్లో రోజూ చచ్చిబతికే పరిస్థితులుండే చైనాలో సైతం ఎడిటర్గా పనిచేయడానికి నాలుగేళ్ల క్రితమే సిద్ధపడి వచ్చిన క్యారీ గ్రేసీ .. తన మనసు చంపుకుని మాత్రం ఆ హోదాలో పనిచేయలేకపోయారు. స్త్రీలను ‘ఆకాశంలో సగభాగం’ అని చైనా వివ్లవ నాయకుడు మావో అన్నారు. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను నిరసిస్తూ బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ ఇప్పుడు తన నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రైవేటు సంస్థలలో స్త్రీల కన్నా పురుషులకు ఎక్కువ జీతాలు ఇవ్వడం నేరం అని ఈ జనవరి 1న ఐస్ల్యాండ్ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్స్టీన్ లైంగిక వేధింపులకు నిరసనగా మొన్న జనవరి 8న గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్కు అంతా నల్లదుస్తులు ధరించి వచ్చారు. ఇప్పుడు బిబిసి చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ రాజీనామా వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చూస్తుంటే ఈ ఏడాది ‘మహిళా విప్లవం’ ఏదో రాబోతున్నట్లే ఉంది. శుభ పరిణామమే! బీబీíసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ రాజీనామా చేశారు! లక్షా ఎనభై వేల పౌండ్ల జీతాన్ని వదులుకుని లండన్ తిరిగొచ్చేశారు. ‘న్యూస్ రూమ్లో చిన్న ఉద్యోగం ఇవ్వండి చాలు’ అని అన్నారు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఊహించని పరిణామం ఇది. రాజీనామా లేఖొచ్చి టేబుల్ మీద పడగానే బోర్డు రూమ్ ఉలిక్కిపడింది. బీబీసీలో సీనియర్ జర్నలిస్ట్ గ్రేసీ. ముప్పై ఏళ్ల అనుభవం. ‘ఈక్వల్ పే’ లేదని ఈ అకస్మాత్తు రాజీనామా చేశారు. తనకు లేదని కాదు. అసలు బీబీసీ లోనే లేదని. ‘డబ్బు ముఖ్యం కాదు నాకు. సమానత్వం కావాలి. నాకొక్కదానికి కాదు. బీబీసీలో పనిచేస్తున్న మహిళందరికీ కావాలి’ అని గ్రేసీ బహిరంగ లేఖ రాశారు. వెంటనే ఆమెకు మద్దతుగా 130 మంది ఉన్నతస్థాయి బీబీసీ జర్నలిస్టులు ఒక ప్రకటన విడుదల చేశారు. అవార్డు విన్నింగ్ జర్నలిస్టు గ్రేసీని తిరిగి చైనా ఎడిటర్గా పునర్నియమించాలని ఆ ప్రకటన డిమాండ్. అలా చేయాలంటే, బీబీసీ ‘ఈక్వల్ పే’ విధానాన్ని అమలు చేయాలి. స్త్రీ,పురుష సిబ్బందికి సమాన వేతనాలు ఇవ్వాలి. ఒకే హోదాలో ఉన్నవారిలో స్త్రీల కన్నా, పురుషులు యాభై శాతం అధికంగా జీతాలను పొందుతున్నారని, అదంతా రహస్యంగా జరిగిపోతోందని తన దృష్టికి వచ్చిన వెంటనే గ్రేసీ బయటికి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె జీతం ఏడాదికి లక్షా ముప్పై వేల పౌండ్లు. ఆ మొత్తాన్ని లక్షా ఎనభై వేల పౌండ్లకు పెంచేందుకు గత అక్టోబర్లోనే బీబీసీ పేపర్లు కూడా తయారు చేసింది. కానీ గ్రేసీ వద్దన్నారు. ‘‘అందరికీ పెంచాలి’’ అని కండిషన్ పెట్టారు. ‘ఈక్వల్ పే’ కోసం గత జూలైలో సిబ్బంది నుంచి బీబీసీపై ఒత్తిడి వచ్చినప్పుడు అత్యున్నత స్థాయిలో జీతాలు ఎలా ఉన్నాయన్నదీ ఆ సంస్థ ఒక నివేదికను విడుదల చేయవలసి వచ్చింది. అప్పుడే గ్రేసీ తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అప్పుడే ఆమెకు జీతం పెంచడానికి బీబీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అప్పుడే గ్రేసీ తనకొక్కదానికే జీతం పెంచడంపై విముఖతను వ్యక్తం చేశారు. ఇప్పటికి ఆరు నెలలు గడిచాయి. ఎక్కడి జీతాలు అక్కడే ఉన్నాయి. మహిళలూ ఎక్కడివారు అక్కడే ఉన్నారు. పురుషులకు దీటుగా పనిచేస్తున్నప్పటికీ పురుషులకన్నా తక్కువ జీతాలు పొందుతున్నారు. ఇది గ్రేసీని బాధించింది. ఆగ్రహం తెప్పించింది. రిపోర్టింగ్లో రోజూ చచ్చిబతికే పరిస్థితులుండే చైనాలో సైతం ఎడిటర్గా పనిచేయడానికి నాలుగేళ్ల క్రితమే సిద్ధపడి వచ్చిన క్యారీ గ్రేసీ.. చివరికి మనసు చంపుకుని మాత్రం ఆ హోదాలో పనిచేయలేకపోయారు. చైనాలో నిక్కచ్చి ఎడిటర్గా పనిచేయడం నిత్యం డ్రాగన్లతో పోరాడటమే. పాలకుల బెదిరింపులు ఉంటాయి. పోలీసుల వేధింపులు ఉంటాయి. ఎడిటరే స్వయంగా రిపోర్టింగ్కి వెళితేనే గానీ సమాచారం సేకరించలేనంత గుంభనంగా, పకడ్బందీగా చైనా యంత్రాంగం ఉంటుంది. ఆ కష్టాలేవీ ఇప్పుడు రాజీనామా చేశాక గ్రేసీ ఏకరువు పెట్టడం లేదు. ‘చీకటి మీద లైట్ను ఫోకస్ చేసే గొప్ప వృత్తిలో ఉన్నప్పుడు మన దగ్గర చీకటిని చూడలేకపోతే.. సమాజాన్ని వేలెత్తి చూపే నైతిక హక్కు మనకు ఎలా ఉంటుంది?’’ అని గ్రేసీ ప్రశ్నిస్తున్నారు. నిజాలు దాస్తుందని చైనాకు పేరు. ఎడిటర్గా ఇంతకాలం గ్రేసీ ఆ నిజాలను బయటికి రప్పించారు. బీబీసీకి జీతాలను దాచే అలవాటుందని తెలిశాక ఆమే బయటికి వచ్చారు. క్యారీ గ్రేసీ బయటికి రావడం అంటే.. అసమానతలను బయటికి తేవడమే! -
తప్పులో కాలేసిన బీబీసీ : శశికపూర్కు బదులు...
బ్రాడ్కాస్ట్ సర్వీసుల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన బీబీసీ తప్పులో కాలేసింది. అలనాటి మేటి బాలీవుడ్ నటుడు శశికపూర్ మృతిచెందిన సందర్భంగా బీబీసీ న్యూస్ తప్పుడు వీడియో క్లిప్ను షేర్చేసింది. శశికపూర్ మరణం గురించి మాట్లాడుతూ.. వీడియో క్లిప్లో రిషి కపూర్, అమితాబ్ బచ్చన్లను బ్రాడ్కాస్ట్ చేసింది. దీంతో వెంటనే బీబీసీ న్యూస్ ఛానెల్పై సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. అనంతరం తప్పును తెలుసుకున్న బీబీసీ-ఎడిటర్ పౌల్ రోయల్, తాము చేసిన అతిపెద్ద తప్పుకు క్షమాపణ చెప్పారు. శశికపూర్ మృతి సందర్భంగా షేర్ చేసిన వీడియోలో తప్పుడు చిత్రాలను చూపించినందుకు వెర్రీ సారీ అంటూ పౌల్ ట్వీట్ చేశారు. సాధారణంగా ఇలాంటి తప్పులు జరుగవు, పొరపాటున జరిగినందుకు క్షమాపణ చెబుతున్నా అని పేర్కొన్నారు. బీబీసీ బ్రాడ్కాస్ట్ చేసిన ఈ వార్తపై మాత్రం ట్విట్టర్ యూజర్లు పెద్ద ఎత్తునే విమర్శల వర్షం కురిపించారు. Hang on @bbcnews Shashi Kapoor has died not Amitabh Bachan or Rishi Kapoor, who you've weirdly used to illustrate the story. pic.twitter.com/48jo6DGjU6 — Media Diversified (@WritersofColour) December 4, 2017 Did BBC News at 10 cover the Shashi Kapoor story but just showed footage of Amitabh Bhachan and Rishi Kapoor? I'm no Bollywood expert but that's what it looked like to me. My sister thought Amitabh had died as well!? 😳 — Trishna Bharadia (@TrishnaBharadia) December 4, 2017 @BBCNews Too bad BBC News at 10 you broadcasted the news of Shashi Kapoors demise with film snippets of Rishi Kapoor and Amitabh Bachchan in it, two completely wrong and totally alive actors. Correct film, Kabhi Kabhi, but wrong actors aired. Very stupid and rude indeed! — Dee Akther (@DeeAkther) December 4, 2017 #BBCNewsTen is very sorry wrong images were used to mark the death of Shashi Kapoor. Not our usual standards and I apologise for any upset. — Paul Royall (@paulroyall) December 4, 2017 -
బీబీసీ శక్తిమంతమైన మహిళల్లో మిథాలీ రాజ్
-
బీబీసీ శక్తిమంతమైన మహిళల్లో మిథాలీ రాజ్
హైదరాబాదీ స్టార్, భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అత్యంత శక్తిమంతమైన భారత మహిళల్లో ఒకరిగా ‘బీబీసీ’ జాబితాలో నిలిచింది. బీబీసీ విడుదల చేసిన ఈ టాప్–100 ప్రభావవంతమైన మహిళల్లో ఆమె ఉంది. వచ్చే నెల ‘బీబీసీ 100 విమెన్ చాలెంజ్’ పేరుతో భారత్లోని వివిధ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగనున్నాయి. గత జూన్–జూలైలలో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్కప్లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు రన్నరప్గా నిలిచింది. -
మలాలాపై సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్: నోబెల్ అవార్డు గ్రహీత, పాకిస్థాన్ అక్షర సాహసి యూసఫ్జాయ్ మలాలాపై దాడి అంతా ఓ భూటకం అని, అదంతా ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్టు ఆధారంగా చోటు చేసుకుందని పాకిస్థాన్ పార్లమెంటు నేత ముస్సారత్ అహ్మద్జేబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీబీసీ చానెల్ కోసం సిద్ధం చేసిన కథ ఆధారంగా 2012లో మలాలాపై దాడి సంఘటన చోటు చేసుకుందని, అదంతా ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక తప్ప మరొకటి కాదంటూ ఎవ్వరూ ఊహించని విధంగా అన్నారు. ఆదివారం ఉమ్మత్ అనే ఓ ఉర్దూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మలాలా తలకు బుల్లెట్ తగిలింది.. కానీ ఏ బుల్లెట్ ఆమె తలలో ఉన్నట్లు సిటీ స్కాన్లో కనిపించలేదని స్వాట్లో స్కాన్ చేసినప్పుడు తెలిసింది. కానీ, పెషావర్లోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిలో మాత్రం బుల్లెట్ ఆమె తలలో ఉంది’ అని అన్నారు. అంతేకాదు, ఆమెకు చికిత్స చేసిన వైద్యులను కూడా తీవ్రంగా నిందించారు. ఆ వైద్యులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కూడా ఇచ్చిందని చెప్పారు. బీబీసీలో చూపించినట్లుగా మలాలాకు అసలు చదవడం, రాయడం రాదని, ఒక అమెరికన్ మలాలా ఇంట్లో మూడు నెలలు ఉండి ఆమె నిర్వహించాల్సిన పాత్రపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. అసలు ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా ఆమె మలాలా విషయంలో ఎందుకు ఇలా ఆరోపణలు చేశారో పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ముస్సారత్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్లో ఉన్నారు. ఈ పార్టీ నవాజ్ షరీఫ్ చేతుల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
మహిళను అలా తాకి లైవ్లో బుక్కయ్యాడు!
-
మహిళను అలా తాకి లైవ్లో బుక్కయ్యాడు!
లండన్: టీవీ లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ మహిళను అనుచితంగా తాకినందుకు ఓ ప్రముఖ జర్నలిస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీబీసీ జర్నలిస్ట్ బెన్ బ్రౌన్ ఇంగ్లండ్ లోని బ్రాడ్ఫోర్డ్లో నార్మన్ స్మిత్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. లేబర్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా కొన్ని కీలక విషయాలపై వీరు చర్చిస్తున్నారు. ఇంతలో బెన్ బ్రౌన్కు పరిచయం ఉన్న ఓ మహిళ అక్కడికి వచ్చింది. ఇంటర్వ్యూ జరుగుతుండగానే బొటనవేలుతో సక్సెస్ అంటూ చూపిస్తూ అతడిని పలకరించింది. లైవ్ ఇంటర్వ్యూకు సమస్య తలెత్తుతుందని భావించిన బ్రౌన్ వెంటనే ఆ మహిళను కాస్త పక్కకు జరుగు అంటూ అసభ్యకర రీతిలో టచ్ చేస్తూ ఆమెను వెనక్కి జరిపాడు. అనుకోని సంఘటనతో కంగుతిన్న మహిళ వెంటనే తేరుకుని, బెన్ బ్రౌన్ను ఒక్క దెబ్బకొట్టి మరీ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఎంత బిజీ పనులలో ఉన్నా మహిళల పట్ల ఆ తరహాలో అసభ్యంగా ప్రవర్తించకూడదని, మహిళలను అలా తాకవద్దంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బెన్ మాత్రం అనుకోకుండా అలా జరిగిపోయిందని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని వివరణ ఇచ్చుకున్నా అలా ప్రవర్తించడం ముమ్మాటికీ తప్పేనంటూ హితవు పలికారు. -
నా మరణసంతాపంలో ఈ ముక్క రాయొద్దు!
-
నా మరణసంతాపంలో ఈ ముక్క రాయొద్దు!
'నా మరణ సంతాపంలో ఇది మొదటి లైను కాకూడదు' అంటూ ఆన్లైన్లో అనుకోకుండా వచ్చిన పాపులారిటీతో ఇబ్బంది పడుతున్న ఓ విద్యావేత్త వాపోతున్నారు. బీబీసీ ఇంటర్వ్యూ లైవ్ ప్రసారంలో తన పిల్లలు చొరబడి ఆగమాగం చేయడంతో దక్షిణకొరియాకు చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ కెల్లీ ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయారు. పుసాన్ జాతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై గురించి బీబీసీ లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. ఆయన పిల్లలు మధ్యలోకి వచ్చి కొంత అల్లరి చేశారు. ఇంటిలోని కార్యాలయం నుంచి ఆయన ఈ ఇంటర్వ్యూ ఇస్తుండగా.. మొదట ఆయన పాప, ఆ వెంటనే వాకర్లో ఉన్న చిన్నారి కొడుకు లోపలికి చొరబడి.. ఇంటర్వ్యూలో దర్శనమిచ్చారు. ఈ విషయాన్ని లైవ్ ప్రసారంలో చూసి బిత్తరపోయిన ఆయన భార్య వెంటనే లోపలికి వచ్చి ఆదరాబాదరాగా ఆ ఇద్దరు చిన్నారులను లాక్కెళ్లిపోయారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కన్నా ఆయన పిల్లలు చొరబడి చేసిన హంగామానే ఆన్లైన్లో బాగా పేలింది. ఏకంగా బీబీసీ యూట్యూబ్ పేజీలో ఈ వీడియోను 16 కోట్లమంది చూశారు. దీంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయిన రాబర్ట్ కెల్లీ తాజాగా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ఇలా ప్రపంచమంతటా ఫేమస్ అవుతానని అనుకోలేదని, తను మరణించిన తర్వాత కూడా తన సంతాప సందేశంలో మొదటిలైను ఇదే ఉంటుందని, ఇలాంటి గుర్తింపు తనకు వద్దని ఆయన వాపోయారు. -
ఆ విషయంలో ఫేస్బుక్ ఫెయిలైంది!
వాషింగ్టన్: లైంగికంగా అసభ్యంగా, అశ్లీలంగా ఉన్న పిల్లల ఫొటోలను తన వెబ్సైట్ నుంచి తొలగించడంలో ఫేస్బుక్ విఫలమవ్వడం విమర్శలకు తావిస్తోంది. బాలలను లైంగికంగా చూపించే ఫొటోల గురించి యూజర్లు ఫిర్యాదు (రిపోర్ట్) చేసినా.. చాలావరకు వాటిని ఫేస్బుక్ తొలగించడం లేదని తాజాగా తేలింది. ఇలాంటి ఫొటోలకు సంబంధించిన ఆధారాలను తాజాగా బీబీసీ ఫేస్బుక్కు అందించింది. అయితే, ఆ ఫొటోలలో 20శాతం కన్నా తక్కువవాటినే ఫేస్బుక్ తొలగించింది. ఈ ఫొటోలను తొలగించడానికి బదులు.. ప్రైవేటు గ్రూపులలో షేర్ చేసుకున్న ఈ ఫొటోల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా బీబీసీకి ఫేస్బుక్ హితబోధ చెప్పింది. పిల్లల పట్ల లైంగిక వేధింపులు, లైంగిక చర్యలకు ఆసక్తి చూపే నికృష్ట ప్రవృత్తి కలిగిన ప్రైవేటు గ్రూపులకు సంబంధించి దాదాపు 100 అంశాలను బీబీసీ ఫేస్బుక్ దృష్టికి తీసుకెళ్లింది. పలువురు చిన్నారుల రియల్ ఫొటోలను పెట్టి.. దానికింద అసభ్యకరమైన వ్యాఖ్యలు రాసి ఉంచిన విషయాన్ని ఫిర్యాదు చేసింది. అయితే, ఇందులో ఓ ఫొటో ఫేస్బుక్ కమ్యూనిటీ ప్రమాణాలకు ఉల్లంఘన కాదంటూ ఫేస్బుక్ గతంలో పేర్కొంది. అంతేకాకుండా ఆ ఫొటో ఇప్పటికీ సైట్లో దర్శనమిస్తోందని బీబీసీ తెలిపింది. అయితే, తమ సైట్లో ఉన్న కంటెంట్ను జాగ్రత్తగా సమీక్షించి.. అక్రమంగా, తమ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నవాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని ఫేస్బుక్ పేర్కొంటున్నది. -
ఆ మీడియాపై వైట్హౌస్ నిషేధం!
న్యూయార్క్ టైమ్స్, బీబీసీలను అడ్డుకున్న భద్రతా సిబ్బంది వాషింగ్టన్ : అమెరికాలోని మెజారిటీ వార్తా సంస్థలు అమెరికన్లకు శత్రువుల్లా పనిచేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల తరువాత, వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పైసర్స్ కార్యాలయంలో జరిగే రోజువారీ సమావేశానికి సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, ద లాస్ఏంజిల్స్ టైమ్స్, బీబీసీ, ద గార్డియన్ వంటి ప్రముఖ వార్తా సంస్థలకు ఆహ్వానం అందలేదు. ఈ వార్తా సంస్థల ప్రతినిధులు సమావేశ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా జాబితాలో ఈ సంస్థల పేర్లు లేవని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలో ప్రతిరోజూ జరిగే ఈ సమావేశం టీవీల్లో ప్రసారం కావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుతం దీన్ని ఆఫ్ కెమెరా పద్ధతిలో నిర్వహించారు. సమావేశంలో స్పైసర్ మాట్లాడుతూ మీడియా నుంచి వచ్చే వాస్తవ దూరమైన కథనాలను ట్రంప్ సర్కార్ బలంగా తిప్పి కొడుతుందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను అంగీకరించ లేమని సీఎన్ ఎన్ వాస్తవాలు వారికి నచ్చకపోవడం వల్లే ఇటువంటి చర్యలు తీసుకున్నారని, అయినా వాస్తవాలు వెల్లడించడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధమైన పత్రికా స్వేచ్ఛపై వైట్హౌస్ వర్గాలు విషప్రచారం చేస్తున్నాయని, ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయమని నేషనల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పేర్కొన్నారు. కాగా, వ్యాపార నిర్వహణలో ఉద్యోగాల కల్పనకు అవరోధంగా ఉన్న నిబంధనల్ని తొలగించే లక్ష్యంతో టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పచ్చజెండా ఊపారు. -
ట్రంప్ పై కాల్పులు: బీబీసీ ట్వీట్
లండన్: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సమయంలోనే ఆయన్ను కాల్చివేశారంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ చేసిన ట్వీట్ ప్రపంచాన్ని కాసేపు కాలవరపాటుకు గురిచేసింది. కొద్దిసేపటికే తప్పును సరిదిద్దుకున్న బీబీసీ సంబంధిత ట్వీట్ను తొలగించింది. తుపాకీ కాల్పుల్లో ట్రంప్ గాయపడ్డారని ట్వీట్లో బీబీసీ పేర్కొంది. దీంతో ఒక్కసారిగా ట్విట్టర్లో కలకలం రేగింది. ట్వీట్ను తొలగించిన తర్వాత సంబంధిత పోస్టుకు క్షమాపణలు వేడుకుంటున్నట్లు చెప్పింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి పోస్టు చేశారని తెలిపింది. ఘటనపై విచారణ జరపుతామని వెల్లడించింది. -
384 మర్రిచెట్లను 'కన్న' మహిళకు బీబీసీ గుర్తింపు
పిల్లలు లేకపోతేనేం? ఈ చెట్లే నా పిల్లలు, అంటుంది సాలుమరద తిమ్మక్క. కర్ణాటకకు చెందిన ఈ 103 ఏళ్ల బామ్మ రోడ్డు పొడవునా 384 మర్రిచెట్లను పెంచి, ఆదర్శ పర్యావరణవేత్తగా నిలిచింది. 2016 అత్యంత ప్రభావశీలుర మహిళల జాబితాలో బీబీసీ తిమ్మక్క పేరును కూడా చేర్చింది. తిమ్మక్క నిరక్షరాస్యురాలు. రోజుకూలీ చేసేది. పశువులను మేపుకునే చిక్కయ్యతో చిన్న వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. దురదృష్టవశాత్తూ వారికి సంతానం కలగలేదు. సమాజంలో హేళన ఎదుర్కొన్నారు. దాంతో పిల్లలు లేకపోతేనేం, మొక్కలనే పిల్లల్లాగా పెంచుకుందాం, అనుకున్నారు. అలా తిమ్మక్క దంపతులు స్టేట్ హైవే 94 మీద హులికల్ నుంచి కూడూర్ మధ్యలో తొలుత పది చెట్లతో ప్రారంభించి, తరువాతి సంవత్సరం పదిహేను, మరుసటి ఏడాది ఇరవై ఇలా మర్రిచెట్లను నాటుతూ పోయారు. వాటికి 4 కిలోమీటర్లు మోసుకెళ్లి నీళ్లు పోసేవారు. పశువులు మేయకుండా చుట్టూ కంచె వేసేవారు. చాలీ చాలని సంపాదనతోనే చెట్లను సంరక్షించారు. తిమ్మక్క భర్త 1991లో చనిపోయారు. తర్వాత తిమ్మక్క ఒంటరిగానే వాటి బాధ్యత తీసుకుంది. సాలుమరద అంటే చెట్లవరస. అదే ఇప్పుడు తిమ్మక్క ఇంటి పేరైంది. ఆ గుబురు చెట్ల మధ్య, పర్యావరణ పాఠాలను వినడానికి ఎంతోమంది పర్యావరణ కార్యకర్తలు ఆమెను కలుస్తున్నారు. -
బీబీసీ ‘100 మంది మహిళల్లో’ సన్నీలియోన్
-
బీబీసీ ‘100 మంది మహిళల్లో’ సన్నీలియోన్
ముంబై: బీబీసీ ఈ ఏడాదికి రూపొందించిన వంద మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో నటి సన్నీలియోన్కు చోటు దక్కింది. వ్యాపారం, క్రీడలు, ఫ్యాషన్, కళలు, ఇంజినీరింగ్ తదితర రంగాల్లోని మహిళలతో కూడిన జాబితాను బీబీసీ విడుదల చేసింది. సన్నీతోపాటు ఈ జాబి తాలో మరో నలుగురు భారతీయ మహిళకూ స్థానం లభించింది. వారిలో గౌరీ చిందార్కర్(సాంగ్లీ-మహారాష్ట్ర), మల్లికా శ్రీనివాసన్ (చెన్నై), నేహా సింగ్ (ముంబై). సాలుమరద తిమ్మక్క (కర్ణాటక) ఉన్నారు. 105 ఏళ్ల తిమ్మక్క గత 80 ఏళ్లలో 8 వేల చెట్లను నాటారు. ‘ట్రాక్టర్ క్వీన్’గా గుర్తింపు పొందిన మల్లిక ‘ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్’ కంపెనీ సీఈవో. గౌరి(20) ‘స్కూల్ ఇన్ ద క్లౌడ్’విద్యా విధానాన్ని పొందిన కొద్ది మంది పిల్లల్లో ఒకరు. నేహ (34) నటి-రచరుుత, సామాజిక కార్యకర్త. -
తెలుగులో బీబీసీ ప్రసారాలు
ముంబై: యూకే మీడియా దిగ్గజం బీబీసీ తన సేవలను మరో 11 భాషలకు విస్తరించనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో భారతీయ భాషలు తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ కూడా ఉన్నారుు. 1940 తరువాత సంస్థ చేపడుతున్న అతిపెద్ద విస్తరణ ఇదే. ప్రస్తుతం బీబీసీ ప్రసారాలు హిందీ, బెంగాలీ, తమిళం భాషల్లో కొనసాగుతున్నారుు. ఆ సంస్థ భారత్లో కొత్తగా 157 ఉద్యోగాలను కల్పించనుంది. యూకేకు ఆవల ఢిల్లీలో అతిపెద్ద బ్యూరోను నెలకొల్పనుంది. బీబీసీ కార్యక్రమాలు 29 భాషల్లో వారానికి సుమారు 35 కోట్ల మందికి చేరుతున్నారుు. తాజా విస్తరణలో ఆరు కొరియా, ఆఫ్రికా భాషల్లో కూడా సేవలు మొదలవుతారుు. -
బీబీసీ భారీ విస్తరణ..తెలుగులో కూడా
లండన్: ప్రపంచవ్యాప్తంగా వార్తలను అందించడంలో ప్రసిద్ధిగాంచిన బీబీసీ వరల్డ్ సర్వీస్ భారీ విస్తరణ చేపట్టింది. నాలుగు ఆసియా భాషల్లో, ఏడు ఆఫ్రికన్ భాషల్లో మొత్తం 11 కొత్త సేవలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో తన సేవలను బుధవారం లాంచ్ చేసింది. వీటితో మరో ఇతర ఏడు భాషల్లో కూడా తన సేవలను విస్తరించనుంది. అఫాన్ ఓరామా, అమ్హారిక్, ఇగ్బో, కొరియన్, పిడ్గిన్, తిగ్రిన్యా, యోరుబా భాషల్లోకూడా తమ సేవలను విస్తరిస్తున్నట్టు బీబీసీ ప్రకటించింది. దీంతోపాటుగా దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటన్ వెలుపల అతిపెద్ద బ్యూరోను ఏర్పాటు చేయనుంది. ఈ విస్తరణ ద్వారా 157 మందికి కొత్త ఉద్యోగాలను లభించనున్నాయి. జర్నలిజంలో స్వతంత్ర, నిష్పాక్షికమైన సేవలు అందించే లక్ష్యంతో సాగుతున్నామని బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ తెలిపారు. శతాబ్దం దిశగా సాగుతున్న బీబీసీ ఈ లక్ష్యాన్ని సాధించే ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు. బీబీసికి ఇది ఒక చారిత్రాత్మక రోజని ఆయన అభివర్ణించారు. భారతీయ భాషల్లో డిజిటల్, టీవీ, వీడియో ఔట్ పుట్ సేవలను సంయుక్తంగా లాంచ్ చేయనుంది. 1922లో స్థాపించిన బీబీసీ వరల్డ్ సర్వీస్ ..1940 తర్వాత ఇదే అతిపెద్ద విస్తరణ అని అంచనా. దీని ద్వారా లక్షలాది ప్రజలకు తన జర్నలిజం తీసుకుని పోవడానికి సంస్థ యోచిస్తోంది. ముఖ్యంగా భారీ పెరుగుదులను నమోదుచేస్తున్న , యువత, మహిళా ప్రేక్షకులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది. ఈ కొత్త సర్వీసులు 2017 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అలాగే థాయ్ లో ఈ రోజు పూర్తి డిజిటల్ సేవలను ప్రారంభించింది. 2014లో ప్రవేశపెట్టిన ఫేస్ బుక్ పాప్ అప్ సర్వీసులు విజయవంతంకావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ ప్రేక్షకులకుచేరువ కావాలని బీబీసీ డైరెక్టర్ జనరల్ టార్గెట్ గా ఎంచుకున్నారు. ఈ తాజా విస్తరణతో బీబీసీ ఇంగ్లీష్ సహా మొత్తం 40 భాషలకు విస్తరించినట్టయింది. -
12 దేశాల్లో రోల్స్ రాయిస్ భారీ అక్రమాలు
లండన్ : బ్రిటన్ ప్రముఖ తయారీ సంస్థ రోల్స్ రాయిస్, ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడవుతోంది. సీక్రెట్గా ఏజెంట్స్ను నియమించుకుని లాభాదాయకమైన భూ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వారికి లంచాలు కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. గార్డియన్, బీబీసీ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం బ్రాడ్ కాస్ట్ అయిన పనోరమ ప్రొగ్రామ్లో ఈ విషయాలు బీబీసీ పేర్కొంది. లాభాలు పెంచుకోవడానికి అక్రమ చెల్లింపుల పద్ధతిని అనుసరించి రోల్స్ రాయిస్ ప్రయోజనాలు పొందిందని బీబీసీ, గార్డియన్లు తెలిపాయి. ల్యాండ్ కాంట్రాక్టులు పొందడానికి కూడా ఏజెంట్లు అక్రమ చెల్లింపులకు తెరతీశారని సంస్థ అంతర్గత వ్యక్తులు చెబుతున్నారు. ఈ విషయంపై అమెరికా, బ్రిటన్ అవినీతి నిరోధక ఏజెన్సీలు నెట్వర్క్ ఏజెంట్లను విచారించడం ప్రారంభించాయి. 13 బిలియన్ పౌండ్ల(రూ.1,06,125కోట్లకు పైగా) విలువ కలిగిన టర్బైన్లను, ఇంజన్లను ప్యాసెంజర్, మిలటరీ ఎయిర్క్రాప్ట్లకు విక్రయించిన రోల్స్ రాయిస్ వాటిపై మాత్రం పూర్తి వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న విచారణకు తాము సహకరిస్తామని, కానీ మధ్యవర్తిత్వలు పాల్పడిన అవినీతి, లంచాలకు సంబంధించిన విషయాలు మాత్రం సీరియస్ ఫ్రాడ్ ఆఫీసు, ఇతర అథారిటీలు విచారిస్తాయని దాటవేస్తోంది. బ్రెజిల్, భారత్, చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, అంగోలా, ఇరాక్, ఇరాన్, కజాఖ్స్తాన్, అజర్బైజాన్, నైజీరియా, సౌదీ అరేబియాలలో రోల్స్ రాయిస్ ఏజెంట్లను నియమించుకుని ఈ అక్రమాలకు పాల్పడిందని బీబీసీ రిపోర్టు చేసింది. బీబీసీ రిపోర్టులో భారత్కు చెందిన తన డిపెన్స్ ఏజెంట్ సుధీర్ చౌదరికి అక్రమంగా 10 మిలియన్ పౌండ్ల(రూ.81కోట్లకు పైగా) ను రోల్స్ రాయిస్ చెల్లించిందని వెల్లడైంది. భారత వైమానిక దళం వాడే హాక్ ఎయిర్క్రాప్ట్ల అతిపెద్ద కాంట్రాక్ట్ రోల్స్ రాయిస్ చేతికి వెళ్లడానికి ఆయన సహకారం అందించినట్టు బీబీసీ తెలిపింది. -
ఆ సీరియల్ తొలి ఎపిసోడ్కే షాక్ తిన్నారు!
17వ శతాబ్దంలో ఫ్రాన్స్ను పాలించిన చక్రవర్తి లూయిస్-14 జీవితకథ ఆధారంగా బీబీసీలో ప్రసారమవుతున్న 'వర్సల్లెస్' సీరియల్ బుధవారం బ్రిటన్ వాసులను షాక్ గురిచేసింది. బుధవారం ప్రసారమైన తొలి ఎపిసోడ్లోనే ఏడు శృంగార సన్నివేశాలు ఉండటంతో వీక్షకులు బిత్తరపోయారు. ఈ ఏపిసోడ్లో పూర్తిస్థాయి నగ్న సన్నివేశాలను కూడా చూపించారు. ప్రైమ్టైమ్లో బీబీసీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్పై గత కొంతకాలంగా నిరసన వ్యక్తమవుతున్నది. ఈ సీరియల్ నిండా నగ్న దృశ్యాలు, గ్రాఫిక్ శృంగార దృశ్యాలు ఉండటంతో.. ఈ సీరియల్ ప్రారంభానికి ముందే బ్రిటన్ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీబీసీ మాత్రం ఫ్రాన్స్లో నిర్మితమైన ఈ సీరియల్ వీక్షకులకు మాంఛి కనువిందు ఇస్తుందని పేర్కొంటున్నది. దాదాపు రూ. రెండు వందల కోట్ల (21 మిలియన్ పౌండ్ల) ఖర్చు.. అత్యంత భారీ తారాగణం.. చరిత్రను కళ్లకు కట్టే కథనంతో ప్రసారమవుతున్న ఈ సీరియల్పై ఇటు వీక్షకులు కూడా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఎంత ఖర్చుపెట్టి.. అట్టహాసంగా నిర్మించినా సీరియల్లో డైలాగ్లు నాసిరకంగా ఉన్నాయని, తొలి ఎపిసోడ్ ఏమాత్రం ఆసక్తికరంగా లేదని పలువురు వీక్షకులు ట్విట్టర్లో పెదవి విరిచాడు. అనేక అంచనాలు రేపిన ఈ సీరియల్లో లూయిస్ గా కనిపించిన జార్జ్ బ్లాగ్డెన్ కూడా ఏమాత్రం ఈ పాత్రకు సరిపోలేదని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సన్ కింగ్గా పేరొందిన లూయిస్ -14 జీవితంలోని ఉత్థానపతనాలు చిత్రీకరించే ఈ సీరియల్ బ్రిటన్లోనే తొలి సెక్సువల్ గ్రాఫిక్ డ్రామాగా పేరొందింది. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్లోనే గే సెక్స్, రాజకుమారుడి క్రాస్ డ్రెసింగ్, రాకుమారి విపరీతమైన వ్యామోహం వంటి దృశ్యాలను చూపించారు. ఈ సీరియల్ను ఫ్రాన్స్లో నిర్మించినప్పటికీ ఇంగ్లిష్ భాషలో రూపొందించారు. దీంతో ఫ్రాన్స్ వీక్షకులు దీనిని ఫ్రెంచ్ సబ్టైటిల్స్తో చూడాల్సి ఉంటుంది. ప్రముఖ ఫ్రెంచి చక్రవర్తి అయిన లూయిస్-14 జీవితాన్ని, చరిత్రను వక్రీకరిస్తుండటంతో ఫ్రాన్స్లో ఈ సీరియల్పై వివాదం రేగుతోంది. -
ఉత్తర కొరియా అదుపులో బీబీసీ రిపోర్టర్
సియోల్: ప్రతిష్టాత్మక బ్రిటన్ బ్రాడ్ కాస్టర్ బీబీసీ రిపోర్టర్ను ఉత్తర కొరియా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా తమ దేశంలో జరుగుతున్న పార్టీ సమావేశ కార్యక్రమం కవరేజికి వెళ్లిన అతడిని ఎయిర్ పోర్ట్ లోనే బంధించారు. అతడిని అక్కడి నుంచి బహిష్కరిస్తారని కూడా సమాచారం. దాదాపు 36 ఏళ్ల తర్వాత తొలిసారి ఉత్తర కొరియా పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీని కవరేజీకి ఏ మీడియాను ఆ దేశం అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే బీబీసీకి చెందిన రూపర్ట్ వింగ్ ఫీల్డ్ హేస్ అనే రిపోర్టర్ ను ప్యాంగ్ యాంగ్ విమానాశ్రయంలోనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. -
మూతపడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం
♦ కానీ సక్సెస్ అవుతామని గ్యారంటీ లేదు ♦ టాటా స్టీల్ యూకే వ్యాపారంపై బ్రిటన్ ప్రధాని కామెరాన్ లండన్: నష్టాల్లో కూరుకుపోయిన టాటా స్టీల్ యూకే సంస్థలో పనిచేస్తున్న దాదాపు 20,000 మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తోందని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. ‘‘మేం చేయగలిగినదంతా చేస్తున్నాం. కానీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయనే గ్యారంటీ మాత్రం ఇవ్వలేం’’ అన్నారాయన. భారతదేశ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్... నష్టాల్లో ఉన్న తమ బ్రిటన్ వ్యాపారాన్ని విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కామెరాన్ క్యాబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమస్య పరిష్కారానికి కంపెనీని జాతీయం చేయడం పరిష్కారం కాదని, కానీ ఏ అవకాశాలనూ తోసిపుచ్చలేమని చెప్పారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగం కష్టాల్లో ఉంది. ధరలు పతనమయ్యాయి. సరఫరా పెరిగిపోయింది’’ అని క్యాబినెట్ సమావేశం అనంతరం కామెరాన్ విలేకరులతో వ్యాఖ్యానించారు. మరోవైపు, కొనుగోలుదారు దొరికే దాకా ప్లాంట్లను మూసివేయకుండా కొనసాగిస్తామనే హామీని టాటా స్టీల్ ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నట్లుగా ‘బీబీసీ’ ఒక కథనం వెలువరించింది. టాటా గ్రూప్.. తమ వ్యాపారాన్ని విక్రయించడం కంటే ప్లాంట్లను మూసివేయడానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చన్న అంశం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోందని ఈ కథనంలో పేర్కొంది. ప్లాంట్లు ఎంతకాలం నడుస్తాయన్న దానిపై కంపెనీ నుంచి నిర్దిష్ట హామీని ప్రభుత్వం దక్కించుకోలేకపోయింది. దీంతో కొనుగోలుదారు ఎవరైనా ముందుకు రావడం లేదా జాతీయం చేయడం లేదా ప్లాంటును మూసివేసేందుకు అంగీకరించడం తదితర అంశాలన్నీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని సమాచారం. అలాగే కొనేందుకు ముందుకొచ్చే సంస్థలకు రుణ హామీలు ఇచ్చే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆ సీరియల్ నిండా పోర్న్ బాగోతమే!
దాదాపు రూ. రెండు వందల కోట్ల (21 మిలియన్ పౌండ్ల) ఖర్చు. అత్యంత భారీ తారాగణం. చరిత్రను కళ్లకు కట్టే కథనం. కానీ ఆ సీరియల్లో దుస్తుల కోసం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టనట్టు కనిపిస్తోంది. సీరియల్ నిండా నగ్న, శృంగార దృశ్యాలు, స్వలింగ సంపర్కం. ఇది 17వ శతాబ్దంలో ఫ్రాన్స్ను పాలించిన చక్రవర్తి లూయిస్-14 జీవితకథ ఆధారంగా బీబీసీలో ప్రసారమవుతున్న 'వర్సల్లెస్' సీరియల్ వ్యవహారం. ప్రైమ్టైమ్లో బీబీసీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్పై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. ఈ సీరియల్ నిండా నగ్న దృశ్యాలు, గ్రాఫిక్ శృంగార దృశ్యాలు ఉండటంపై బ్రిటన్ హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. బీబీసీ మాత్రం ఫ్రాన్స్లో నిర్మితమైన ఈ సీరియల్ వీక్షకులకు మాంఛి కనువిందు ఇస్తుందని పేర్కొంటున్నది. ఇప్పటికే ఈ సీరియల్లోని దృశ్యాలపై బ్రిటన్ ఎంపీలు, కుటుంబ హక్కుల కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చారిత్రక కథనాన్ని అందించే పేరుతో పోర్న్ దృశ్యాలను వండివారుస్తున్నారని మండిపడుతున్నారు. సన్ కింగ్గా పేరొందిన లూయిస్ -14 జీవితంలోని ఉత్థానపతనాలు చిత్రీకరించే ఈ సీరియల్ బ్రిటన్లోనే తొలి సెక్సువల్ గ్రాఫిక్ డ్రామాగా పేరొందింది. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్లోనే గే సెక్స్, రాజకుమారుడి క్రాస్ డ్రెసింగ్, రాకుమారి విపరీతమైన వ్యామోహం వంటి దృశ్యాలను చూపించారు. ఈ సీరియల్ను ఫ్రాన్స్లో నిర్మించినప్పటికీ ఇంగ్లిష్ భాషలో రూపొందించారు. దీంతో ఫ్రాన్స్ వీక్షకులు దీనిని ఫ్రెంచ్ సబ్టైటిల్స్తో చూడాల్సి ఉంటుంది. ప్రముఖ ఫ్రెంచి చక్రవర్తి అయిన లూయిస్-14 జీవితాన్ని, చరిత్రను వక్రీకరిస్తుండటంతో ఫ్రాన్స్లో ఈ సీరియల్పై వివాదం రేగుతోంది. ఇటు బ్రిటన్లోనూ ఈ సీరియల్లో చూపించే విపరీతమైన దృశ్యాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సీరియల్ని నిలిపివేయాలని బ్రిటన్ ఎంపీలు, హక్కుల సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
బీబీసీ వెబ్సైట్ హ్యాక్
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పనిచేసే ఓ హ్యాకర్స్ గ్రూప్.. బీబీసీ నెట్వర్క్ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్టు వెల్లడించింది. కొత్త ఏడాది సందర్భంగా ముందు రోజు గురువారం కొన్ని గంటల పాటు బీబీసీ వెబ్సైట్లు పనిచేయలేదు. ఈ వార్తపై బీబీసీ యాజమాన్యం స్పందించలేదు. హ్యాకర్లు దాడి చేసిన విషయన్ని ధ్రువీకరించడం కానీ తోసిపుచ్చడం కానీ చేయలేదు. కాగా ఐఎస్ సభ్యులు, అనుబంధ వెబ్సైట్లను హ్యాక్ చేస్తుంటామని హ్యాకర్స్ గ్రూప్ వెల్లడించింది. తమ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు బీబీసీ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్టు హ్యాకర్స్ గ్రూప్ పేర్కొంది. -
బీబీసీ కార్యాలయం వద్ద బాంబు కలకలం
లండన్: ప్రపంచ ప్రఖ్యాత న్యూస్ ఛానెల్ బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద బాంబు కలకలం చెలరేగింది. సెంట్రల్ లండన్ లోని ఛానెల్ ఆఫీసు వద్ద ఓ అనుమానిత వాహనం గంటలకొద్ది నిలిచిఉండటంతో అందులో బాంబులు ఉన్నాయనే అనుమానం అక్కడి సిబ్బందిని వణికించింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బీబీసీ ఆఫీసుతోపాటు చుట్టుపక్కల కార్యాలయాలను ఖాళీచేయించారు. అనుమానిత కారును అణువణువూ పరిశోధించిన బాంబు స్క్వాడ్ చివరికి పేలుడు పదార్థాలేవీ లేవని తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవలి పారిస్ దాడులు, అంతకు ముందు చార్లిస్ హెబ్డో పత్రికా కార్యాలయంపై ఉగ్రపంజా ఘటనల దృష్ట్యా ప్రధాన నగరాల్లోని అన్ని పత్రికా, టీవీ ఛానెళ్ల వద్ద నిఘా పెంచిన సంగతి తెలిసిందే. -
యుద్ధం జరుగుతోందనుకున్నాం
పారిస్ : పారిస్ నగరంలో జరిగిన ఉగ్రదాడికి బలైన ప్రదేశాల్లో బాటాక్లాన్ కూడా ఒకటి. అక్కడో సంగీత కార్యక్రమం జరుగుతోంది. అక్కడంతా కోలాహలంగా ఉంది. చాలా ఉత్సాహంగా, మ్యూజిక్ బ్యాండ్తో హోరెత్తుతోంది. ఇంతలో అక్కడ ఒక్కసారిగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. అక్కడి ప్రత్యక్ష సాక్షుల కథనాలను బీబీసీ రిపోర్టు చేసింది. మ్యూజిక్ కన్సర్ట్ చాలా ఉత్సాహంగా ఉంది.. పెద్ద సౌండుతో సంగీతం వినిపిస్తోంది. ఇంతలో సడన్గా కాల్పులు వినిపించాయి. భీకరమైన అరుపులు. చుట్టూ చూశా.. ముసుగు ధరించిన ఉన్న ఒక నీడ లాంటి రూపం నావైపు చూస్తోంది. అంతోలోనే నా వైపు గురి పెట్టి కాల్పులు జరిపింది. తృటిలో నేను బతికిపోయాను. కానీ పక్కన వ్యక్తి చనిపోయాడు.. ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. భీకరమైన కాల్పులు. దాదాపు అందరూ నేలపైన పడుకున్నారు. మరికొంతమంది ఇక్కడ యుద్ధం జరుగుతోందని అరుస్తూ నాలుగు వైపులా భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. మేం పక్కనే ఉన్న కెఫే లో దాక్కున్నాం. యుద్ధం జరుగుతోందని ఎవరో అరవగానే అందరూ నమ్మారు. ఎక్కడివాళ్లక్కడ నేలమీద పడుకుండిపోయాం.. భారీ ఎత్తున సైరన్ లు వినిపిస్తున్నాయి... భయంతో వణికిపోయాం. తర్వాత వెనక డోర్ నుంచి మమ్మల్ని తప్పించారంటూ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న వారు చివురుటాకుల్లా వణికిపోతూ బీబీసీ న్యూస్ తో తమ భయంకరమైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. -
ఆ తండాలో మగాళ్లంతా రోడ్డుకు బలి
♦ పెద్దకుంట తండా దుస్థితిపై హైకోర్టు విస్మయం ♦ {పస్తుతం గ్రామంలో ఉన్నది ఒక్క మగ వ్యక్తే ♦ తండాలో మహిళలు దోపిడీకి గురవుతున్నారు ♦ వారిని ఆదుకునేలా ఆదేశాలివ్వండి.. హైకోర్టులో పిల్ ♦ వివరాలు కోర్టు ముందుంచాలని ఎన్హెచ్ఏఐకి ఆదేశం సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని పెద్దకుంట తండాలోని మగవాళ్లంతా జాతీయ రహదారిని దాటుతూ మృత్యువాత పడటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ తండాలో ప్రస్తుతం ఒక్క మగ వ్యక్తి మాత్రమే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామ ప్రజలు రోడ్డును దాటేందుకు వీలుగా అండర్ పాస్ లేదా సబ్వేను ఎందుకు నిర్మించలేదని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)ను ప్రశ్నించి న ధర్మాసనం.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించిం ది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవికుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దకుంట తాండలోని మహిళల పరిస్థితి దుర్భరంగా ఉందని, అనేక రకాలుగా వారు దోపిడీకి గురవుతున్నారని, వారికి రక్షణ కల్పించడంతో పాటు ఆర్థిక సాయం అందించి అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరు తూ హైదరాబాద్కు చెందిన అషీమ్ అవతార్ దాస్, మరో ఇద్దరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సోమవారం ధర్మాసనం విచారించింది. పిటీషనర్ల తరఫు న్యాయవాది రచనా వడ్డేపల్లి వాదనలు విని పిస్తూ.. 44వ నంబర్ జాతీయ రహదారి ఎదురుగానే తండా ఉంటుందని, అక్కడికి వెళ్లాంటే తప్పనిసరిగా రహదారిని దాటాల్సి ఉంటుం దని, ఇలా రోడ్డు దాటుతూ రెండేళ్ల కాలంలో 80 మంది మగవారు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం ఆ తండాలో ఒక మగ వ్యక్తి మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ తండాకు ‘రహదారి వితంతుల గ్రామం’ అని పేరు వచ్చిందని, వీరి దీన గాథపై బీబీసీ ప్రత్యేక కథనం ప్రసారం చేసిందని వివరించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అందేపల్లి సంజీవ్కుమార్ స్పందిస్తూ ఆ తండా మహిళల పరిస్థితి నిజంగానే దుర్భరంగా ఉందని, మగవారంతా రోడ్డు దాటుతూ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇలాంటి చోట్ల జాతీయ రహదారి దాటేందుకు అండర్పాస్ లేదా సబ్వే ఎందుకు నిర్మించలేదని ఎన్హెచ్ఏఐ తరఫు న్యాయవాది వర్మను ప్రశ్నించింది. సబ్వే ఉందని ఆయన చెప్పడంతో, మరెందుకు దానిని ఉపయోగించడం లేదని రచనను అడిగింది. తాను ఆ తండాను సందర్శించానని, అక్కడ ఎటువంటి సబ్వే లేదని ఆమె స్పష్టం చేశారు. ఆమె చెప్పిన విషయాన్ని విశ్వాసంలోకి తీసుకుంటున్నామని, సబ్వే ఉందని మీకు ఎవరు చెప్పారని, ఆ అధికారి పేరు, హోదా చెప్పాలని వర్మను ఆదేశించింది. ఎన్హెచ్ఏఐ హైదరాబాద్ మేనేజర్(టెక్నికల్) శైలజ ఈ విషయం చెప్పారని వర్మ తెలిపారు. ఆమెను తదుపరి విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఉందని చెబుతున్న సబ్వేకు, తండాకు మధ్య ఎంత దూరం ఉందని, అందుకు సంబంధించిన ఫొటోలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఆనాటి చేదు జ్ఞాపకం!
లండన్: కాలంతో పాటు కరిగిపోని కొన్ని చేదు జ్ఞాపకాలు మన కళ్లు ముందు కదలాడితే అవి చాలా బాధాకరంగా ఉంటాయి. అటువంటి కన్నీటి జ్ఞాపకమే భారత సంతతి ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత అనితా రాణికి తారసపడింది. ఇందుకు బీబీసీ నిర్వహించిన ఓ కార్యక్రమమే కారణం.1947 వరకూ బ్రిటీష్ పాలనలో ఉన్న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే క్రమంలో అనితా రాణి కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని విషాదకర పరిస్థితులు బీబీసీ షో ద్వారా తెలుసుకున్న ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.సెలబ్రిటీల పూర్వీకుల జీవితాల్లో కొన్ని రహస్యాలను తెలియజెప్పే 'హూ డూ యూ థింక్ యూ ఆర్? అనే పేరుతో బీబీసీ నిర్వహించిన షోతో అనితా రాణి తన కుటుంబ పూర్వ స్థితి గురించి తెలుసుకుని కలత చెందారు. ఆనాటి బ్రిటీష్ పాలనలో అనితా రాణి తాతయ్య శాంతా సింగ్ జవానుగా పని చేసేవారు. శాంతా సింగ్ కుటుంబ పోషణలో భాగంగా ఉన్న ఊరికి వెయ్యి కిలో మీటర్ల దూరంలో పని చేసేవాడు. అయితే అదే సమయంలో దేశ విభజన కోసం జరిగిన అల్లర్లు తారాస్థాయికి చేరాయి. ఆ విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకోలేక పోయిన శాంతా సింగ్ భార్య ప్రీతమ్ కౌర్ ను కొంతమంది ఆందోళన కారులు బావిలోకి తోసివేయడంతో మృతిచెందింది. ఈ ఘటనలో ప్రీతమ్ తన ఏడేళ్ల కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా, అమ్మమ్మ ప్రీతమ్ మరణించిన విషయం కుటుంబ సభ్యులకు కొంతవరకూ తెలిసినా.. ఆ సమయంలో ఏడేళ్ల చిన్నారి కూడా మృతిచెందిన విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదట .ఈ విషయాన్ని బీబీసీ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకున్న అనితా రాణి ఆవేదన చెందారు. ఆనాటి చేదు జ్ఞాపకాన్ని తెలుసుకున్న అనితా రాణి ఉట్టిపడుతున్నకన్నీటిని దాచిపెట్టుకున్నారు. ఈ షో అక్టోబర్ 1 వ తేదీన బీబీసీలో ప్రసారం కానుంది. అనితా రాణి తల్లి సిక్కు మతానికి చెందిన వ్యక్తి కాగా, తండ్రి హిందూ మతానికి చెందిన వారు. లండన్ లోని బ్రాండ్ ఫోర్డ్ లో పుట్టిన అనితా రాణి.. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ నుంచి బ్రాడ్ కాస్టింగ్ లో డిగ్రీ చదివారు. తన 14 ఏట సిటీ సన్ రైజ్ రేడియోలో కెరీర్ ను ఆరంభించిన అనితా రాణి.. ఆ తరువాత ఛానల్ ఫైవ్, స్కై స్పోర్ట్స్, ఛానల్ ఫోర్, బీబీసీ టూ, బీబీసీ త్రీ, బీబీసీ ఆసియన్ నెట్ వర్క్ లలో జర్నలిస్టుగా పనిచేశారు. -
నిర్బంధాల నీడలలో
బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా విన్న తరువాతనే తెలిసింది-ఎమర్జెన్సీ సంగతి. జయ ప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ వంటి నేతలు ఆ ముందు రాత్రి అరెస్టయిన సంగతి కూడా అలాగే తెలిసింది. నేను విలేకరులను పిలిచి ఈ చర్యలను ఖండి స్తున్నట్టు చెప్పాను. జూన్ 12, 1975. ఆ ముందురోజు రాత్రి నుంచే గుజరాత్ అసెంబ్లీ ఎన్ని కల ఫలితాలు రావడం మొదలైంది. కాంగ్రెస్ పరిస్థితి ఆశా జనకంగా లేదు. మరోవైపు రాయబరేలీ లోక్సభ నియోజక వర్గం నుంచి ఇందిరా గాంధీ ఎన్నిక (1971) చెల్లదంటూ సోష లిస్ట్ నాయకుడు రాజ్నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్కు అనుకూలంగా అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జేఎంఎల్ సిన్హా తీర్పు ఇచ్చినట్టు వార్త వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో మిత్రుడు సి. నరసింహారావు రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నాను. వార్త తెలిసిన వెంటనే ‘ఇందిర రాజీనామా చేయాలి’ అన్నాను. జూన్ 25, 1975 అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద పూర్తిగా స్టే విధించాలని కోరుతూ జూన్ 23న ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లారు. వెకేషన్ జడ్జి వీఆర్ కృష్ణయ్యర్ షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చారు. అది జరిగిన కొన్ని గంటలకే ఇందిరా గాంధీ ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని విధిస్తూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆ రాత్రే కొద్దిగా జల్లు పడుతోం డగా నేనూ, మా నాన్నగారూ విజయవాడ నుంచి గుం టూరు శివార్లలో ఉండే మా ఇంటికి తిరిగి వచ్చాము. ఒం టిగంటకు తలుపు చప్పుడైంది. ఎదురుగా పోలీసులు. కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ వెంటనే రమ్మన్నారని చెప్పారు. అరండల్పేట పోలీస్స్టేషన్లో కొంచెం హడా వుడి జరిగింది. ఇంతకీ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన సంగతి నాకు తెలియదు. ఆశ్చర్యంగా పోలీసులు కూడా చెప్పలేకపోయారు. ఇక్కడ నాకు స్నేహితుడు రాఘ వరావు జతయ్యాడు. ఇద్దరినీ ఒక హోటల్కు మార్చి, తరు వాత రాజమండ్రి జైలుకు తీసుకువెళతామని తెలియచేశా రు. మరునాడు ఉదయం పదిగంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని మాత్రమే ఆకాశవాణి ప్రకటించిం ది. చివరికి బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా విన్న తరువా తనే తెలిసింది- ఎమర్జెన్సీ సంగతి. జయప్రకాశ్ నారా యణ్, మొరార్జీ దేశాయ్ వంటి నేతలు ఆ ముందు రాత్రి అరెస్టయిన సంగతి అలాగే తెలిసింది. నేను విలేకరులను పిలిచి ఈ చర్యలను ఖండి స్తున్నట్టు చెప్పాను. రాఘవరావు, నేనూ విజయవాడ బయలుదేరాం. విజయవాడ బస్ డిపో లోనూ, రైల్వే స్టేషన్లోనూ మాకు సాదర స్వాగతం లభిం చింది. జూపూడి యజ్ఞనారాయణ, బి. సుబ్బారెడ్డి, తూమా టి బాలకోటేశ్వరరావులను కూడా ‘మీసా’ (మెయింటె నెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కింద అరెస్ట్ చేసినట్టు ఇక్కడే తెలిసింది. గొట్టిపాటి మురళీమోహనరావు, కొమర గిరి కృష్ణమోహన్రావు, ఎంవీ రామమూర్తి, తుమ్మల చౌదరి, అట్లూరి శ్రీమన్నారాయణ, అయితా రాములు- వీరందరినీ కూడా రాజమండ్రి జైలుకే తరలిస్తున్నట్టు సమాచారం అందింది. దేశమే నిర్బంధం నీడలోకి వెళ్లింది. అంతటా, భయం అంతర్లీనంగా. ఆ గుబులుకు కొద్దిగా సాంత్వనను ఇచ్చే ఘటనలు కూడా మధ్య మధ్య జరగక పోలేదు. మాకు కాపలా ఉన్న పోలీసుకు రూపాయి ఇచ్చి పత్రికలు తెచ్చి పెట్టమన్నాను. నాలుగు తెచ్చాడు. నాలు గూ ఆంధ్రపత్రిక ప్రతులే. నాలుగు పత్రికలంటే, ఒకే పత్రి క నాలుగు ప్రతులు తెచ్చే మేధావులు ఉన్నంత వరకు ఫర వాలేద నిపించింది. ఇలాంటి వారి సాయంతో ఇందిర నియంత కావాలనుకుంటే కష్టమే అని బయటకే అన్నాను. రాజమండ్రి జైలులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగుపెట్టాం. అక్కడ ఎంవీ ఎస్ సుబ్బరాజు (వ్యవస్థా కాంగ్రెస్) ఉన్నారు. మాకినేని బసవపున్నయ్య (సీపీఎం), కాతా జనార్దనరావు (సోష లిస్ట్), కొల్లా వెంకయ్య (కమ్యూనిస్టు నాయకుడు), పీవీ ఎన్ రాజు (జనసంఘ్) మాదల నారాయణస్వామి (ఎం ఎల్ న్యూడెమోక్రసీ) ఉన్నారు. ‘మీసా’ నిబంధన కింద అరెస్టయిన వారిలో అన్నిరకాలు ఉన్నారు. మీసా నిబం ధనల మేరకు నిర్బంధానికి కారణాలేమిటో బందీలకు చెప్పాలి. గుంటూరు జిల్లా కలెక్టర్కు కారణాలు చెబుదామ నిపించింది కాబోలు. మేము చెరుకుపల్లి పోలీస్స్టేషన్ మీద దాడికి వ్యూహం పన్నామట. ఇద్దరు కానిస్టేబుళ్ల మర ణానికి కారణమట. ఆయుధాలు దొంగిలించుకుపోవడా నికి కుట్ర చేశామట. ఇదీ వివరణ. భారతీయ లోక్దళ్ కార్యదర్శిగా సంచలనాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా నట. అలహాబాద్ హైకోర్టు తీర్పు తరువాత ఇందిర రాజీ నామా చేయాలని కోరడం, ‘సంపూర్ణ విప్లవం’ కావాలని కోరడం నేరమట. మాకు వివరణ ఇచ్చిన కొన్ని గంటలకే ఇలా కారణాలు చెప్పాలన్న ఆ నిబంధనను (జూన్ 29న) హఠాత్తుగా సవరించారు. అయితే ఏవో సాంకేతిక కారణా లతో మీసా అరెస్టులు చెల్లవని కర్ణాటక హైకోర్టు ఆగస్టు, 1975లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత నిర్బంధ ఆదేశాలను రద్దు చేసి కొత్తవి జారీ చేసింది. నేను ఎండీ ప్రవేశం కోసం విశాఖపట్నంలో ఇంటర్వ్యూకు హాజ రు కావలసి ఉంది. ఈ సౌకర్యం నాకు ఇవ్వలేదు. కాగా 20 రోజుల వరకు ఈ అరెస్టుల గురించి తెలియచేయలేదు కాబట్టి, ఆ అరెస్టులు చెల్లవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రక టించింది. కానీ పోలీసులు మా విడుదల, మళ్లీ అరెస్టు ఒకేసారి నిర్వహించారు. నేను హైకోర్టు మెట్లు దిగగానే అరెస్టు చేసి, చార్మినార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ రాత్రి పోలీస్ స్టేషన్లోనే నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్న పుడు నిఘా విభాగానికి చెందిన ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు వచ్చారు. ‘‘జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీదేశాయ్ వంటి పెద్ద నాయకులను అరెస్ట్ చేసినా ప్రజలు మౌనంగానే ఉం డిపోయారు. అంటే ఈ పరిణామాలకు ప్రజా మద్దతులే దని అర్థం కావడం లేదా?’’ అన్నారు. ‘‘ఇందిరా గాంధీని అరెస్టు చేసినా అంతే, జనం మాట్లాడరు!’’ అన్నాన్నేను. ప్రజావిజయం కానీ ఆ మౌనం ఎంతోకాలం కొనసాగలేదు. 21 మాసాల తరువాత ఎమర్జెన్సీ ఎత్తివేయక తప్పలేదు. అరెస్టయిన వేలాది మందిని విడుదల చేయక తప్పలేదు. జనతా పార్టీ ఆవిర్భవించింది. 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఘోరం గా ఓడిపోయారు. జూన్, 1975 నుంచి 1977 మధ్య కాలం మన ప్రజాస్వామ్యానికి ఒక పీడకల. దేశం లో పడగ విప్పిన నియంతృత్వాన్నీ, నిర్బంధాన్నీ కూల దోసినవారు ఎవరో కాదు. అలాంటి రాజ్యశక్తిని ఎది రించి, తాము పోగొట్టుకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలను జాతికి అలవాటైన అహింసా పద్ధతిలో పదిల పరచిన వారు సామాన్య ప్రజానీకమే. ఇందుకు భావితరాలు రుణపడి ఉండాలి. (వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు) మొబైల్: 98663 76735, యూఎస్ 001-41077 78552 - ఎలమంచిలి శివాజీ -
భయం నిర్భయం నడుమ...?
ఎన్ని చర్యలు తీసుకున్నా, సంప్రదాయ నియంత్రణా పద్ధతులేవీ ఫలితాలివ్వనప్పుడు, మహిళల పట్ల పురుషల ఆలోచనా ధోరణిలోనే మార్పు తేవడం మంచిదే కదా! ఆ మార్పు తేవాలంటే ముందు ఇప్పుడున్న ఆలోచనా ధోరణి ఏంటో తెలియాలి కదా? నికృష్టుడి నీచపు వ్యాఖ్యలు మినహాయిస్తే ఈ డాక్యుమెంటరీలో ఉన్నదదే. ‘దేశంలోని దయనీయ పరిస్థితులకు ఇది అద్దం పట్టింది. మన పాలకులు ఆ ప్రతిబింబాన్ని ఇంటా బయటా ఎవరూ చూడకుండా అద్దాన్ని పగులగొట్టడమో, ముసుగుకప్పడమో చేస్తున్నారు’ అన్న ఓ కార్యకర్త వ్యాఖ్య అక్షర సత్యం. ‘తలనొప్పి వచ్చిందీ!’ అనంటే, ‘తల తీసేస్తే పోలా?’ అన్నది మన పాల కుల వైఖరి. వారు అనుసరించే పద్ధతి కూడా అదే అనడానికి ‘భారతపుత్రి’ (ఇండియాస్ డాటర్) డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిషేధించిన తీరే నిదర్శనం. ఇది ఈ రోజు కొత్తగా వచ్చిన జబ్బేమీ కాదు. సత్యజిత్ రే వంటి ప్రపంచస్థాయి దర్శకుడు ‘పథేర్ పాంచాలి’ అనే ఓ దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తే, భారత పేదరికాన్ని బయటి ప్రపంచానికి ఎత్తి చూపు తున్నాడని బలమైన ఓ వర్గం విమర్శించిన నాటి నుంచీ ఈ ఒరవడి కొనసా గుతున్నదే! దేశభక్తి, సంస్కృతి, మత భావనలు, ఇతర భావోద్రేకాంశాలు వివాదాస్పదం కావడం ఇక్కడ మామూలే! వివాద సందర్భాల్లో భావ వ్యక్తీక రణ స్వేచ్ఛపై ఇటువంటి అధికారిక నిషేధాలు ఈ దేశంలో తరచూ జరుగుతు న్నవే! కానీ, ఆ ధోరణి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తున్నపుడు, భవిష్యత్ ప్రయోజనాలకు భంగకరమైన సంకేతాలిస్తున్నపుడు అంతా అప్ర మత్తం కావాల్సిందే! అత్యాచారాల సంస్కృతి, బాధితుల్నే తూలనాడే వైఖరి, దర్యాప్తుల్ని నీరుగార్చి నేరప్రవృత్తిగల వారిలో ధీమా పెంచే దుస్థితికన్నా కూడా... ఈ విషయాలు బయటి ప్రపంచానికి తెలియడమే పెద్ద ఘోరమ న్నట్టు ప్రభుత్వం స్పందించిన తీరు అభ్యంతరకరం. అరచేయి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేనట్టే ఈ డాక్యుమెంటరీ పరివ్యాప్తిని కూడా నిషేధం నియంత్రించలేకపోతోంది. బీబీసీ ఇప్పటికే దీన్ని ప్రసారం చేసింది. యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. బీబీసీకి నోటీ సిచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ప్రసారాల్ని అదుపుచేసే చర్యల్ని ప్రారంభించింది. రెండేళ్ల కింద, 2012 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ పాశవిక అత్యాచారం, హత్య కేసు పూర్వాపరాలు కథావస్తువుగా లెస్లీ ఉద్విన్ దాదాపు గంట నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ తీశారు. నిర్భయ కేసులో శిక్షపడిన దోషుల్లో ఒకరైన ముఖేష్సింగ్ ఇంటర్వ్యూ కూడా అందులో ఉంది. బాధితురాలిపైన, మొత్తం మహిళలపైన అతడు ఆ ఇంటర్వ్యూలో విపరీత వ్యాఖ్యలు చేశాడు. దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, అం తకుముందు ఒక భారత టెలివిజన్ సంస్థతో కలిసి ప్రసారం చేస్తామని బీబీసీ ప్రకటించింది. దీంతో అందులో ఏముందోనని పత్రికల్లో కథనాలు రావడం, ఆ వెంటనే పార్లమెంట్లో దుమారం, ప్రసారాలపై నిషేధం.. అన్నీ చకచకా సాగిపోయాయి. నిజంగానే అదంత అభ్యంతరకరమా? అని కొందరు, ప్రజా స్వామ్యంలో ఒక డాక్యుమెంటరీపై నిషేధమా? అని ఇంకొందరు, ఒక దోషిని ఇంటర్వ్యూ చేయడమేమిటి, అతనలా నిస్సిగ్గుగా అమానవీయ వ్యాఖ్యలు చేయడమేమిటనే ఆగ్రహంతో మరికొందరు... కారణమేదైతేనేం చాలా మం దే డాక్యుమెంటరీని చూస్తున్నారు. చూడాలి కూడానని విజ్ఞుల అభిప్రాయం. అవునూ... చూస్తే తప్పేంటి? ఈ వివాదంపై ప్రస్తుతం మూడు రకాల ఆలోచనా ధోరణులు సాగుతు న్నాయి. నిషేధం తప్పు, డాక్యుమెంటరీని అంతా చూడాలన్నది ఒక అభిప్రా యమైతే, ఇది దురుద్దేశ్యంతో, తప్పుడు భావనల వ్యాప్తి కోసం రూపొందిం చిన డాక్యుమెంటరీ కనుక నిషేధమే సబబన్నది మరో అభిప్రాయం. మూడో అభిప్రాయమూ ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుండగా శిక్షపడిన ఖైదీగా ఉన్న దోషి అభిప్రాయాల్ని, వ్యాఖ్యల్ని జోడించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయడం సముచితం కాదన్నది ఈ భావన. అనైతిక పద్ధతుల్లో ముఖేష్ ఇంటర్వ్యూ సంపాదించడం, చట్ట విరుద్ధంగా తిహార్ జైలు అధికారులు ఆ అవకాశం కల్పించడం, ఇలాంటి అత్యాచారాలు అంతటా జరుగుతున్నపుడు ఒక దేశం, ఒక వర్గం, ఒక కేసునే ప్రాతిపదిక చేసి కథనం నడపడం... వంటి అంశాలపైనా వీరికి అభ్యంతరాలున్నాయి. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం (ఏఐపీడబ్ల్యూఏ) కార్యదర్శి కవితా కృష్ణన్ లాంటి వారు ఈ భావన లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రసారాల్ని వాయిదా వేయాలని స్థానిక మీడియా సంస్థల్ని కోరిన వీరు, తదుపరి చర్యల కోసం సమాలోచనలు జరు పుతున్నారు. పాలక-విపక్షాలతో సహా కొన్ని రాజకీయపక్షాలు, మత, సామా జిక, సేవా సంఘాలు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు డాక్యుమెంటరీపై తీవ్ర ఆగ్ర హంతో ఉన్నాయి. ఎలా జరిగిందో తేల్చాలని అంతర్గత దర్యాప్తునకు ఆదే శించి, ప్రసారాలు పరివ్యాప్తం కాకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టారు. వారికి రకరకాల అభ్యంతరాలున్నప్పటికీ, నిషేధానికి ప్రధానమైనదిగా చూపుతున్న కారణాలు మాత్రం రెండు. ఒకటి పాశవిక అత్యాచార నేరానికి పాల్పడ్డ దోషిని ఇంటర్వ్యూ చేసి, అమానుషమైన అతని వ్యాఖ్యల్ని ప్రచారంలోకి తేవడం. అత్యాచారాలకు, ఇతర హింసకు గురవుతున్న మహిళలపైనే కాక మొత్తంగా మహిళలపైనే దాడిగా దీన్ని వారు అభివర్ణిస్తున్నారు. రెండోది, పాశవిక అత్యాచారాలు, ఇతర నేరాలు ఒక్క మన దేశంలోనే జరుగుతున్నట్టు, ఇవికాక ఇక్కడ ఇంకేమీ లేనట్టు బయటి ప్రపంచంలో భారత్ను అప్రదిష్ట పాల్జేయాలని పనిగట్టుకొని తీసిన డాక్యుమెంటరీ ఇది అన్నది వారి ప్రధాన ఆరోపణ. ఇదే వారి తీవ్ర ఆగ్రహానికి కారణం. చర్చ జరగడమే ఆరోగ్యకరం ప్రాధాన్యతగల అంశాల్ని మామూలుగా, అతి మామూలు విషయాల్ని అత్యం త ప్రాధాన్యతగల అంశాలుగా మన పాలకులు తిరగేసి చూస్తున్నారని ఎక్కు వగా వినిపిస్తున్న విమర్శ. తాజా ఉదంతంలో వారి వ్యవహారశైలే అందుకు తార్కాణం. మహిళలపై దాడులు, హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి వాటిని నియంత్రించడంపై పెట్టాల్సిన శ్రద్ధాసక్తులను, వాటి వ్యతిరేక ప్రచారాన్ని నియంత్రించడంపై చూపుతున్నారు. నికృష్టుడు ముఖేష్ నీచపు వ్యాఖ్యలను మినహాయిస్తే ఈ డాక్యుమెంటరీలో ఉన్నదదే. ‘దేశంలోని దయనీయ పరిస్థితులకు ఇది అద్దం పట్టింది. ‘దేశంలో నెలకొన్న దయనీయ పరిస్థితుల్ని ఇది అద్దం పట్టి చూపింది. మన పాలకులు ఆ ప్రతిబింబాన్ని ఇంటా బయటా ఎవరూ చూడకుండా అద్దాన్ని పగులగొట్టడమో, ముసుగు కప్పడమో చేస్తున్నారు’ అన్న ఓ సామాజిక కార్యకర్త వ్యాఖ్య అక్షర సత్యం. నిర్భయ ఉదంతం తర్వాత ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమాలు లేచాయి. సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తక్కువ సమయంలో ఇం తటి వ్యవస్థీకృత ఉద్యమాన్ని మున్నెప్పుడూ చూడలేదు. ‘ఇంత ఘోరమా!’ అని లోకమంతా ఒక్క గొంతై అరిచింది. ప్రభుత్వాలు స్పందించాయి. దర్యా ప్తును ముమ్మరం చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పరచి, విచారణను వేగిరపరిచి నిందితుల్ని దోషులుగా నిర్ధారించి మరణదండన విధించారు. కానీ, ఇదే వేగం, నిక్కచ్చితనం ఇతరత్రా వందలు, వేల అత్యాచార కేసుల్లో జరగటం లేదు. ఇది కేవలం భద్రతా చర్యలు, పోలీసు దర్యాప్తులు, న్యాయ విచార ణలు, చట్టాల్లో పొందుపరచిన శిక్షలు తదితర అంశాలకు మాత్రమే సంబం ధించినది కాదని తేటతెల్లమైంది. ఇంకేదో జరగాలి, అప్పుడే ఈ నేరాలు అదు పులో కొస్తాయని స్పష్టమైంది. బలంగా పాతుకుపోయిన ఈ పురుషాధిక్య వ్యవస్థలో ఆలోచనా ధోరణి మారాలనే అభిప్రాయం బలపడుతూవచ్చింది. ఇందుకవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వివిధ ప్రజాసంఘాలు, అధ్య యన నివేదికలు స్పష్టంచేస్తున్న తరుణంలో... ఒక ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా భద్రత, దర్యాప్తు, విచారణ, శిక్షలు వంటి సంప్రదాయ నియంత్రణా పద్ధతులు ఫలితాలివ్వనప్పుడు, మహిళలపట్ల పురుషల ఆలో చనా ధోరణిలోనే మార్పుతేవడం మంచిదే కదా! ఆ మార్పు తేవాలంటే ముం దు ఇప్పుడున్న ఆలోచనా ధోరణి ఏంటో తెలియాలి కదా? ‘భారత పుత్రి’ డాక్యుమెంటరీలో ఉన్నదదే. మహిళలపట్ల స్థాయీ భేదాలు లేకుండా ఉన్న ధోరణి ఏంటో అద్దం పట్టింది. దోషితోనే కాకుండా దోషుల తల్లిదండ్రులతో, బాధితురాలి తల్లిదండ్రులతో, రిటైర్డు న్యాయమూర్తితో, న్యాయవాదులతో, సామాజిక కార్యకర్తలతో, బాధితురాలి మిత్రుడితో... ఇలా వివిధ వర్గాల వారితో మాట్లాడించి రూపొందించిన ఆ డాక్యుమెంటరీ వాస్తవ పరిస్థితిని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. అది ఖచ్చితంగా ఓ ఆరోగ్యకరమైన చర్చకు దారితీస్తుంది. మహిళలపట్ల పురుషుల ఆలోచనాధోరణి ఎలా ఉంటుందో చెబుతుంది. ఎలా ఉండాలనే వైపు చర్చను రేకెత్తిస్తుందని, ఇది ఆహ్వానిం చదగ్గ పరిణామమేనని పరిశీలకుల అభిప్రాయం. మాట్లాడకుండా ఎవరినాపగలిగామని? నిర్భయ కేసు దోషుల చర్యల్ని, వారి అమానుష ఆలోచనా ధోరణిని, అను చిత వ్యాఖ్యల్ని ఎవరూ సమర్థించరు. పైగా అసహ్యించుకుంటారు. అవిద్య, అజ్ఞానం, మురికివాడల్లో పెరిగిన నేపథ్యం కలిగిన ముఖేష్ వ్యాఖ్యలు దారుణం, అభ్యంతరకరం. అయితే, ఆయన తరపు న్యాయవాది వ్యక్తీకరణ, భావజాలం, మహిళలపట్ల అతని ఆలోచనా ధోరణి ముఖేష్ మాటలకన్నా నీచంగా ఉండటం గమనార్హం. మహిళలపై అత్యాచారాలు జరగొద్దంటే, వారెలా ఉండాలి, ఎలా బట్టలేసుకోవాలి, ఎప్పుడెప్పుడు-ఎక్కడెక్కడికి- ఎవరితో వెళ్లాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి...అని చెప్పే పెద్ద మనుషుల జాబితా చాంతాడంత. ఒక న్యాయవాది, ఒక సాధుమహరాజ్, ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతి, ఒక మంత్రి, ఓ పార్టీ అధినేత, ఒక ఎమ్పీ, ఒక డీజీపీ... ఇలా పెద్ద పెద్ద హోదాలున్న మహానుభావులు మహిళల పట్ల వ్యక్తం చేసిన చిల్లర అభిప్రాయాలు ముఖేష్ మాటల కన్నా తక్కువ నీచమైనవేం కావు. వాటిని నిషేధించవద్దా? నిషేధించామా? నిషేధించగలమా? వాటిని నిషేధిం చలేనపుడు, అవి యథేచ్ఛగా షికార్లు చేస్తున్నప్పుడు, అవి ఏ నష్టమూ కలగ జేస్తలేవనుకున్నప్పుడు, ముఖేష్ ముతక మాటలే తీరని నష్టం కలిగిస్తాయ నడంలో అర్థమేముంది? డాక్యుమెంటరీపై నిషేధం సాధించగల ప్రయోజన మేముంటుంది? ముఖేష్ వ్యాఖ్యలనైనా తొలగించి డాక్యుమెంటరీని ప్రసారం చేయనిస్తే బాగుండేది. పురుషుల ఆలోచనా ధోరణి మారేలా భావజాల వ్యాప్తి జరగాలి. మహిళలపై ధాష్టీకాలకు వ్యతిరేకంగా ఇంకా చాలా ప్రజా ఉద్యమాలు రావాలి. పాలకులు వారి మాట వినాలి, వారితో చర్చించాలి. మహిళలపై జరుగుతున్న ధాష్టీకాలకు వ్యక్తుల్ని, కుటుంబాల్ని, సమాజాల్ని, ప్రభుత్వాల్ని, న్యాయస్థానాల్ని అందర్నీ బాధ్యుల్ని చేస్తూ, జవాబుదారుగా నిలపాలి. స్త్రీ, పురుషుల మధ్య హెచ్చు తగ్గులు లేవు, ఆకాశంలో కాదు, నేల మీద సగం నువ్వు, సగం నేను కావాలి. ఆర్. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
పాము.. పురస్కారం..
నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీవారు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014లో మనోళ్లు తీసిన చిత్రాలూ అవార్డులను అందుకున్నాయి. ఈ ఫొటో చూడండి. సడన్గా చూస్తే.. ఏదో మొక్క అని అనుకుంటాం. సరిగ్గా చూస్తే.. పచ్చటి పరిసరాల్లో కలిసిపోయిన పచ్చ రంగు పాము మనకు కనిపిస్తుంది. ఈ ఫొటోను తీసిన ఎస్.ఎస్.రవిప్రకాశ్ కూడా తొలిసారి చూసినప్పుడు దీన్ని అలాగే అనుకున్నారట. కర్ణాటకలోని బెంగ ళూరుకు చెందిన రవిప్రకాశ్ తీసిన ఈ చిత్రం ఉభయచరాలు, సరీసృపాలు విభాగంలో విజేతగా నిలిచింది. తన తోటలోనే ఈ చిత్రాన్ని తీశానని.. ఈ పాములు తాము వేటాడే బల్లులు, కప్పలు వంటి వాటి కోసం ఇలా చాలాసేపు కదలకుండా బొమ్మలా ఉండిపోతాయని రవిప్రకాశ్ తెలిపారు. ఆ విషయాన్ని తెలియజెప్పేలా తానీ చిత్రాన్ని తీశానని చెప్పారు. -
విరాట్ కోహ్లీ రహస్య డిన్నర్...!
సాతాంప్టన్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత డాషింగ్ బాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ డిన్నర్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ లోని బ్రెజిలియన్ రెస్టారెంట్ లో మంగళవారం రాత్రి విందు ఆరగించారని బీబీసీ రేడియో ఓ కథనాన్ని వెల్లడించింది. అయితే డిన్నర్ వ్యవహారంపై అటు వాన్, ఇటు కోహ్లీల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మరింత ఆసక్తిని రేపుతోంది. వారిద్దరి మధ్య ఇలాంటి చర్చలు జరిగాయనే అంశంపై ఊహాజనిత కథనాలు వస్తున్నాయి. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో దుమ్ము దులిపేస్తున్న కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. ఇంగ్లీష్ పిచ్ లపై స్వింగ్ బౌలింగ్ ఎదుర్కొనలేక ఇబ్బందపడుతున్న కోహ్లీ తన వైఫల్యాలను అధిగమించడానికి మాజీ కెప్టెన్ వాన్ తో ఏమైనా టిప్స్ తీసుకున్నాడా అనే కోణంలో కూడా క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
తిమింగలం ఎముకలతో కళాకృతులు
తిమింగలం ఎముకలతో కళాకృతులు తయారుచేస్తున్న బ్రెజిలీ కళాకరుడు హామిల్టన్ కోయెలో ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాడు. అది కూడా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద బీచ్ ఒడ్డున ఉండటమంటే అతనికి మరీ ఇష్టం. దక్షిణ బ్రెజిల్లో ఉన్న ‘ప్రేయా డు క్యాసి’ బీచ్ దగ్గర కూర్చుని తనలో తాను జీవించేస్తాడు హామిల్టన్. బ్రెజిల్లో అతడి ఇల్లే ఆ దేశానికి చిట్టచివరిది. అట్లాంటిక్ సముద్రం దగ్గర నుంచి ఆ ఇల్లు స్పష్టంగా కనపడుతుంది. ఉరుగ్వే బోర్డర్కి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది ఆ ఇల్లు. ఆ ఇంటిని హామిల్టన్ స్వయంగా తయారుచేసుకున్నారు. ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన పాడైపోయిన ఓడ భాగాలతో ఆ ఇల్లు అందంగా నిర్మితమైంది. గత ఇరవై సంవత్సరాలుగా కోయెలో ఆ తీరంలో ఇటువంటి పురాతన నిధుల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. అక్కడ దొరికే గాజు సీసాల నుంచి, తుప్పు పట్టిన ట్రాక్టర్ వస్తువుల వరకు అన్నిటినీ అన్వేషిస్తూనే ఉన్నారు. దొరికిన వాటితో ఏదో ఒక కళాఖండాన్ని తయారుచేస్తూ ఆనందిస్తున్నారు. ఆయన తయారుచేసిన కళాకృతులతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. పెద్దపెద్ద తిమింగలం ఎముకలతో ఆయన తయారుచేసిన కళాకృతులు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ‘‘ఈ చోటు నాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. నిరంతరం ప్రవహిస్తూ, వైబ్రేషన్స్ ఇచ్చే సముద్రమంటే నాకు చాలా ఇష్టం.అవి నాలో చలనం కలిగిస్తాయి. నేను ఇక్కడే ఆనందంగా ఉంటాను. ఇక్కడ దొరికే వస్తువులే నాకు ఇష్టం. 15 సంవత్సరాల క్రితం షిప్రెక్ వస్తువులు నాకు లభించాయి. వాటితో నా ఇల్లు నిర్మించుకున్నాను. ఇక్కడకు కొట్టుకు వచ్చే తిమింగలం ఎముకలను తీసుకుని కళాకృతులు తయారుచేస్తున్నాను. అయితే వీటిని షేప్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఆ పని నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను. ఇక్కడ నేను గమనించిందేమిటంటే, తిమింగలాలు వయసు పైబడి కాకుండా వాటిలో ఉండే ఎగ్రెసివ్నెస్ వల్లే అవి మరణిస్తాయని తెలుసుకున్నాను’’ అంటారు హామిల్టన్. - వైజయంతి -
తరగతిలో టీచర్ ను హత్య చేసిన విద్యార్థి తల్లి
పారీస్: స్కూల్ టీచర్ ను తరగతి గదిలోనే హత్య చేసింది ఓ విద్యార్థి తల్లి. విద్యార్థులందరూ చూస్తుండగానే ఆమె ఈ టీచర్ ను పొడిచి చంపింది. ఫ్రాన్స్ లో సంచలనం రేపిన ఈ ఘటన ఆల్బీ ప్రాంతంలోని ఎడుయోర్డ్ హెరియట్ ప్రైమరీ పాఠశాలలో చోటు చేసుకుందని బీబీసీ తెలిపింది. నిందితురాలిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే వెంటనే విద్యాశాఖమంత్రిని సంఘటనా స్థలానికి పంపించారు. ఈ దారుణం నుంచి విద్యార్థులు కోలుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హత్య జరిప్పుడు తరగతిలో ఉన్న విద్యార్థులందరూ 5 -6 ఏళ్ల మధ్యనున్న వయసున్న వారు కావడంతో వారికి కౌన్సెలింగ్ చేయాలని భావిస్తున్నారు. కాగా, ఫ్రాన్స్ లో టీచర్లపై విద్యార్థుల తల్లిదండ్రుల దాడులు పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఢిల్లీ కోటలో నరసాపురం కోడలు!
జాతీయ టెలివిజన్ చానెళ్లలో తనదైన శైలిలో చర్చలు, ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, రాజకీయ దిగ్గజాలతో పోటీపడి పార్టీ వాణిని మీడియా వేదికపై బలంగా వినిపించి.. అందరినీ మెప్పించిన నిర్మలా సీతారామన్ గత కొద్దికాలంగా బీజేపీలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఏనాడూ ప్రజాప్రతినిధిగా పని చేయకపోయినా, ఈసారి ఎన్నికల్లో పోటి చేయకపోయినా కూడా ప్రధాని నరేంద్రమోడీ క్యాబినెట్ లో చోటు సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. గత గుజరాత్ ఎన్నికల్లో ప్రచారకర్తగా, వ్యూహకర్తగా నిర్మలా సీతారామన్ పనితీరు మోడీని ఆకట్టుకుంది. గుజరాత్ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి మోడీ ఘనవిజయంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడే మీడియాతో కూడా సత్సంబంధాలు ఏర్పరుచుకుని, జాతీయ మీడియాలో మోడీ పేరు మార్మోగిపోయేలా చేయడంలో తెరవెనుక ఈమె పోషించిన పాత్ర చాలా ఉంది. సరిగ్గా ఇదే అంశం మోడీనే కాకుండా బీజేపీ అగ్రనేతలను కూడా ఆకట్టుకునేలా చేసింది. పార్టీ అంకిత భావంతో సేవలందించి, బీజేపీలో అగ్రస్థాయికి చేరడం నిర్మలా సీతారామన్ కు సానుకూలంగా మారింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన ఆమె పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కోడలు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన నిర్మలా సీతారామన్ డాక్టర్ పరకాల ప్రభాకర్ సతీమణి. పరకాల ప్రభాకర్ త్రండి శేషావతారం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతనే కాకుండా మంత్రిగా సేవలందించారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన నిర్మలా సీతారామన్ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో పనిచేశారు. అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నిర్మలా సీతారామన్ చేసిన సేవలు బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానికి చేరువయ్యేలా చేశాయి. అద్వానీ, ఇతర బీజేపీ నేతలతో పరిచయాలు ఆమెను బీజేపీలో చేరేందుకు కారణమైంది. భర్త కాంగ్రెస్, బీజేపీ, పీఆర్పీ.. ఇలా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. తాను మాత్రం బీజేపీనే అంటిపెట్టుకుని ఉండటం, దానికితోడు ఆమె చురుకుదనం, అంకిత భావం కారణంగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్థాయికి చేరుకున్నారు. ఇటీవలి కాలంలో పంజాబీ లాబీ కారణంగా నిర్మల పేరు కాస్త వెనకబడినట్లు అనిపించినా.. అప్పటికే మోడీ దృష్టిలో ఉండటంతో నేరుగా స్వతంత్ర హోదాలో సహాయమంత్రి పదవి, అది కూడా అత్యంత కీలకమైన వాణిజ్యం, పరిశ్రమల శాఖ దక్కింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ముందు పెద్ద సవాళ్లే నిలిచి ఉన్నాయి. బంగారం దిగుమతులపై నియంత్రణలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లపై మ్యాట్ విధింపు, ఉత్పాదక రంగంలో గణనీయంగా పడిపోయిన ఉత్పత్తి, కార్మిక చట్టాలు, భూసేకరణలో సమస్యలు ... ఇలా అనేకానేక సమస్యలు ఆమె ముందు కొలువుదీరాయి. వివిధ రంగాల్లో సేవలందించిన నిర్మలా సీతారామన్ తన ముందు ఉన్న సవాళ్లను ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే.