BEST
-
డిసెంబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న అల్లు అర్జున్ భార్య (ఫోటోలు)
-
వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ : టాప్-5లో ముంబై, అయ్యో హైదరాబాద్!
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారం నగరం జాబితాలో వాణిజ్య రాజధాని టాప్ -5లో చోటు దక్కించుకుంది.ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్, టేస్ట్ అట్లాస్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన తాజా లిస్టును ప్రకటించింది. వాటిలో అనేక స్థానాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ముంబై నగరం టాప్ప్లేస్కి ఎగబాకగా హైదరాబాద్, 50వ స్థానానికి పడిపోయింది.ముంబై ప్రపంచంలో 5వ అత్యుత్తమ ఆహార నగరంగా నిలిచింది. టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ఫుడ్ గైడ్ వివిధ వర్గాలలో ర్యాంకింగ్లను విడుదల చేసింది."ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల" జాబితాలో ముంబై 5వ స్థానంలో నిలిచింది.తొలి నాలుగు స్థానాలకు ఇటలీలోని నగరాలు చోటు సంపాదించాయి. నేపుల్స్, మిలన్, బోలోగ్నా, ఫ్లోరెన్స్. ముంబై తర్వాత రోమ్, పారిస్, వియన్నా, టురిన్ , ఒసాకా టాప్ 10లో ఉన్న నగరాలుగా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఇతర భారతీయ నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి, వాటిలో మూడు ముంబైతో పాటు టాప్ 50లోకి వచ్చాయి. అమృత్సర్ 43వ స్థానంలో, న్యూఢిల్లీ 45వ స్థానంలో, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలో నిలిచాయి. కోల్కతా 71వ స్థానంలో ఉండగా, చెన్నై 75వ స్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) అలాగే టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల ర్యాంకింగ్ను కూడా ప్రకటించింది. భారత్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ మెరుగ్గానే ఉందని తెలిపింది. కాగా గత ఏడాది ఈ జాబితాలో ముంబై35, హైదరాబాద్ 39వ స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 56వ స్థానంలోనూ, చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లోనూ నిలిచాయి. -
Mumbai : ఆర్టీసీ బస్సు ప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు
ముంబై : ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్కి ఎలక్ట్రిక్ బస్సు నడపడం రాదని, ఈవీ బస్సుపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తేలింది. పోలీస్ కస్టడీలో ఉన్న పోలీసుల విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ పలు కీలక విషయాల్ని వెల్లడించాడు. ఎలక్ట్రిక్ బస్సు నడపడంలో తనకు అనుభవం లేదని, కేవలం ఒక్క రోజు ఈవీ బస్సును డ్రైవింగ్ చేసినట్లు చెప్పాడు. ఆ ఒక్క రోజు కేవలం మూడుసార్లు నడిపిట్లు చేసినట్లు, అనంతరం విధులకు హజరైనట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.కాబట్టే 60 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న ఈవీ బస్సును ఎలా కంట్రోల్ చేయాలో తనకు అర్ధం కాలేదని, కాబట్టే ఈ ఘోర ప్రమాదానికి దారి తీసినట్లు పోలీసులకు చెప్పాడు. అనుభవం లేకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి ఘోర ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కిటికి అద్దాలు పగులగొట్టి, తన క్యాబిన్లో ఉన్న బ్యాగ్ తీసుకుని పారిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ముంబై ఆర్టీసీ విభాగంపై విమర్శలుముంబై ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. ఆరు వారాల పాటు ఎలక్ట్రిక్ బస్సు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ మోరాకు ఈవీ బస్సులో విధులు అప్పగించడంపై ముంబై ఆర్టీసీ అధికారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్టీసీ బస్సు బీభత్సంగత సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 42మందికి తీవ్ర గాయాలయ్యాయి. 20కి పైగా వాహనాలు ధ్వంస మయ్యాయి. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ధారించారు. 👉చదవండి : ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి.. -
ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రైడ్ చికెన్ డిష్గా చికెన్ 65..!
ప్రపంచంలోనే బెస్ట్ వంటకాలు, స్వీట్ల జాబితాను విడుదల చేసి వరల్డ్ టేస్ట్ అట్లాస్ తాజాగా బెస్ట్ ఫ్రైడ్ చికెన్ డిష్లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఫ్రైడ్ చికెన్ని తయారుచేస్తారు. అయితే ఆ జాబితాలో మన భారతీయ వంటకం చికెన్65 టాప్ 10లో చోటు దక్కించుకుంది. దక్షిణ భారతదేశానికి చెందిన ఈ వంటకం మూడో స్థానంలో నిలిచింది. దీన్ని అల్లం, నిమ్మకాయ, ఎర్రమిరపకాయల కారం, మసాలా దినుసులతో మెరినేట్ చేసి.. డీప్ ఫ్రై చేస్తారు. భారత్లో ఈ రెసిపీ బాగా ఫేమస్.ఆహార ప్రియులకు ఎంతో ఇష్టమైన వంటకం ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. నిజానికి ఈ చికెన్ 65 మూలం తమిళనాడుగా చెబుతుంటారు. అయితే చికెన్ 65 ఇలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం తొలిసారి కాదు. గతేడాది ఆగస్టు 2023లో ఇదే థీమ్పై టేస్ట్ అట్లాస్ జాబితాను విడుదల చేసినప్పుడు చికెన్65 పదో స్థానంలో నిలిచింది. కాగా, టేస్టీ అట్లాస్ విడుదల చేసిన ప్రస్తుత జాబితాలో కొరియన్ ఫ్రైడ్ చికెన్ (చికిన్) అగ్రస్థానంలో ఉండగా, జపాన్కు చెందిన కరేజ్ రెండో స్థానంలో ఉంది. గత ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచిన అయామ్ గోరెంగ్ ఇప్పుడు 5వ స్థానానికి పరిమితమయ్యింది. ఇవేగాక వీటితోపాటు ఈ జాబితాలో చైనీస్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ (జాజీజీ), తైవానీస్ పాప్కార్న్ చికెన్, ఇండోనేషియా అయామ్ పెనియెట్ తదితరాలు టాప్10లో చోటు దక్కించుకున్నాయి.(చదవండి: వాయు కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..!) -
భారతీయ శాకాహార వంటకాలు భేష్: జేడీ వాన్స్
వాషింగ్టన్: అమెరికా నూతన ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జేడీ వాన్స్ భారతీయ శాకాహార వంటకాలపై ప్రశంసలు గుప్పించారు. తనకు భారతీయ శాకాహార వంటకాల రుచులను చూపించిన ఘనత తన భార్య ఉషా వాన్స్కి దక్కుతుందన్నారు. తామిద్దం డేటింగ్లో ఉన్నప్పుడు ఉష తన కోసం వండిన మొదటి శాఖాహార భోజనం గురించి జేడీవాన్స్ మీడియాకు తెలిపారు.‘జో రోగన్ ఎక్స్పీరియన్స్’ కార్యక్రమంలో వాన్స్ తన ఆహార అభిరుచులు తన భార్య ఉష కారణంగా ఎలా మారాయో తెలిపారు. ప్రత్యేకించి ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటూ, శాకాహార వంటల వైపు మళ్లానని తెలిపారు. ప్రాసెస్ చేసిన మాంసాహారాలపై జో రోగన్ చేసిన విమర్శతో ఈ చర్చ ప్రారంభమైంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను రోగర్.. చెత్త అని పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో మొక్కల ఆధారిత ఆహారాలను అలవాటు చేసుకున్న వాన్స్ ఈ మాటను హృదయపూర్వకంగా అంగీకరించారు.ఎవరైనా సరే కూరగాయలను సరిగా తినాలనుకుంటే, అలాగే శాఖాహారిగా ఉండాలనుకుంటే భారతీయ ఆహారాలను తినండి అంటూ రోగన్ సలహా ఇచ్చిన దరిమిలా వాన్స్ దీనిని అంగీకరిస్తూ, తన భార్య నేపథ్యం, ఆమె వంటకాలు.. వాటితో తన జీవన విధానం ఎలా మారిందో తెలిపారు. తాను ఉషా వాన్స్ని కలవడానికి ముందు భారతీయ వంటకాలపై తనకు ప్రాథమిక అవగాహన మాత్రమే ఉందని వాన్స్ తెలిపారు. తన భార్య భారతీయ-అమెరికన్ అని, ఆమె చేసే శాఖాహార వంటలు అద్భుతంగా ఉంటాయని వాన్స్ పేర్కొన్నారు.శాకాహార జీవనశైలిని స్వీకరించాలనుకునువారు భారతీయ వంటకాల వైపు మళ్లండి. శాకాహారంలో పలు ఎంపికలు ఉంటాయి. నకిలీ మాంసాన్ని తినడం మానివేయండి అని వాన్స్ అన్నారు. వాన్స్ తన భార్య ఉషాతో డేటింగ్ చేసిన తొలిరోజుల నాటి ఊసులను కూడా ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. తాను తన ఇంట్లో తయారుచేసిన శాఖాహార భోజనంతో ఉషను ఆకట్టుకునేందుకు ప్రయత్నించానని వాన్స్ తెలిపారు. పిజ్జా రోల్స్పై పచ్చి బ్రోకలీని ఉంచి, దానిపై మరిన్ని మసాలాలు జల్లి ఓవెన్లో 45 నిమిషాలు ఉంచి, శాఖాహార పిజ్జాను తయారు చేశానని,అయితే అది అత్యంత అసహ్యకరంగా తయారయ్యిందని వాన్స్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. శాకాహార భోజనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తనకు కాస్త సమయం పట్టిందని వాన్స్ తెలిపారు. తన భార్య ఉష కారణంగా భారతీయ వంటకాల రుచులను చూశాక అవి ఎంత గొప్పగా, రుచిగా వైవిధ్యంగా ఉంటాయో గ్రహించానని, భారతీయ శాకాహార ఆహారాన్ని మనేదానితోనూ పోల్చలేమని వాన్స్ పేర్కొన్నారు. భారతీయ శాకాహారం గొప్పదనం తెలుసుకున్నాక తాను శాకాహారిగా మారానని తెలిపారు. కాగా తాను తన తల్లి నుంచి శాకాహర వంటకాలను తయారు చేయడాన్ని నేర్చుకున్నానని ఉషా వాన్స్ ఆ మధ్య మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికాలో... భారతీయ జానపద కథలకు జీవం -
డైలాగుల్లో తాతకు సరిసాటి
-
జియోలో అత్యంత చవకైన ప్లాన్ ఇదే..
ప్రైవేటు టెలికం సంస్థలు గత నెలలో తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కి మారారు. బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్లను అందిస్తుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తమ వినియోగదారులను నిలుపుకోవడానికి పలు చవక రీఛార్జ్ ప్లాన్లను రూపొందించింది.సాధారణంగా కాలింగ్, డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్కు నెలకు కనీసం రూ. 180 నుండి రూ.200 ఖర్చవుతుంది. కానీ ఈ జియో ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటే అంతకన్నా తక్కువ ఖర్చవుతుంది. అదే రిలయన్స్ జియో రూ.1,899 రీఛార్జ్ ప్లాన్. ఇది 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే నెలకు రూ. 173 మాత్రమే ఖర్చవుతుంది.ఈ ప్లాన్ దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, దేశవ్యాపంగా ఉచిత రోమింగ్ అందిస్తుంది. రోజువారీ పరిమితి లేకుండా మొత్తంగా 24GB హై-స్పీడ్ డేటా, 3600 ఉచిత ఎస్ఎంఎస్లను ఆనందించవచ్చు. అంతేకాకుండా జియో అనుబంధ యాప్లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. -
Best Indian Places: భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాలివే..! (ఫోటోలు)
-
ది బెస్ట్ మ్యాంగో రెసిపీల్లో మామిడి చట్నీ ఎన్నో స్థానం అంటే..!
పండ్లలో రారాజు మామిడి పండు. దీనితో చాలా చోట్ల పలు రకాల రెసీపీలు, స్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రలో అయితే మామిడి తాండ్ర వంటి వివిధ రకా స్వీట్లను తయారు చేస్తారు. ఇక కొన్ని చోట్ల చట్నీలు, డిజర్ట్లు చేస్తుంటారు. అలాంటి భారతీయ వంటకాలన్నింటికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ కర్రీ, బెస్ట్ డిజార్ట్ వంటి ర్యాకింగ్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈసారి మ్యాంగోతో తయారు చేసే ఉత్తమ వంటకాల జాబితా ఇచ్చింది. వాటిలో రెండు భారతీయ వంటకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అవి రెండు తొలి టాప్ 10 జాబితాలోనే ర్యాంకులు పొందాయి. ముఖ్యంగా పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లలో రుచికరమైన వంటకంగా పేరుగాంచిన ఆమ్రాస్ తొలి స్థానం నిలిచింది. ఇది ప్యూరీ విత్ మ్యాంగో జ్యూస్తో తయారు చేస్తారు. ఈ జ్యూస్ని పొడి అల్లం లేదా ఏలుకులతో జత చేసి కూడా తయారు చేస్తారు. ఈ జాబితాలోనే భారతీయ మామిడి చట్నీ కూడా ఐదో స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ చట్నీని దాల్చిన చెక్కలు, యాలకులు, బ్రౌన్ షుగర్, వెనిగర్ వంటి వాటితో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చట్నీ తయారీలో కొద్దిపాటి వైవిధ్యాలు కూడా ఉన్నాయి. ఇక ది బెస్ట్ మ్యాంగో రెసీపీల జాబితాలో థాయిలాండ్కు చెందిన మ్యాంగో స్టిక్కీ రైస్ రెండో స్థానం దక్కించుకుంది. ఈసారి టేస్ట్ అట్లాస్ ఇచ్చిన వరల్డ్లోనే 50 బెస్ట్ మ్యాంగో రెసీపీలలో భారతీయ మామిడి వంటకాలే తొలి పది స్థానాల్లో నిలవడం విశేషం.(చదవండి: ఆ సమస్యలు ఉంటే.. పెరుగుతో ఈ ఆహారాలు జత చెయ్యొద్దు!) -
ప్రపంచంలోనే 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో రెండు భారతీయ రెస్టారెంట్లకు చోటు!
విలియం రీడ్ మీడియా ఈ ఏడాది 2024కి ప్రంపంచలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అందుకోసం రెస్టారెంట్ల జాబితాను మరింతగా సవరించింది. ఈ గ్లోబల్ ర్యాకింగ్స్ని సవరించి 2024కి సంబంధించిన ప్రతిష్టాత్మక ఉత్తమ రెస్టారెంట్ల జాబితాను చేసింది. అందులో రెండు భారతీయ రెస్టారెంట్లకు చోటు దక్కడం విశేషం. ఈ రెండు రెస్టారెంట్లు టాప్ 51 నుంచి 100వ ర్యాంకుల్లో స్థానాలు దక్కించుకున్నాయి. ఈ సవరించిన జాబితాలో ముంబైలోని రెండు భారతీయ రెస్టారెంట్లలలో న్యూఢిల్లీలోని ఒక రెస్టారెంట్కి స్థానం దక్కింది. ముంబైలోని మాస్క్ అనే రెస్టారెంట్ ఈ అంతర్జాతీయ జాబితాలో 78వ స్థానం దక్కించుకోగా న్యూఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ మరోసారి రీ ఎంట్రీ ఇచ్చి..89వ స్థానంలో నిలిచింది. మాస్క్ రెస్టారెంట్..ఆసియాలోని 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితా ప్రకారం 2023-2024లో భారతదేశంలోని ది బెస్ట్ రెస్టారెంట్గా మాస్క్ నిలిచింది. ఈ రెస్టారెంట్ ఫౌండర్ అదితి దుగర్, హెడ్ చెఫ్ వరణ్ టోట్లని సారథ్యంలో కస్టమర్లకు మంచి బ్రాండెడ్ ఉత్పత్తులతో చేసిన రుచులను అందించేవారు. అంతేగాదు అందుబాటులో ఉన్న పదర్థాలతోనే మంచి రుచిని అందించేలా ఆకరషణీయంగా కనిపించేలా సర్వ్ చేస్తుంది. ఇండియన్ యాక్సెంట్, న్యూఢిల్లీ ఇది 2015 నుండి 2021 వరకు వరుసగా ఏడేళ్లు అత్యుత్తమ రెస్టారెంట్ ప్రకటించబడింది. ఇది 2024కి ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్లలో 26వ స్థానంలో ఉంది.ఇది భారతీయ సమాకాలీన వంటకాలను అందించే రెస్టారెంట్గా పేరుగాంచింది. చెఫ్ మనీష్ మెహ్రోత్రా సారథ్యంలో రకరకాల రుచుల ఆవిష్కరణల తోపాటు సీజన్కు తగ్గట్టు భారతీయ సంప్రదాయ వంటకాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుంది. కాగా, జూన్ 5, 2024న లాస్ వెగాస్లో జరిగే అవార్డుల వేడుకలో ఈ ఏడాది 2024కి సంబంధించిన 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాను లైవ్లో ప్రకటించనుంది. (చదవండి: నటుడు వరుణ్ సూద్కు వచ్చిన బ్రెయిన్ ఇంజూరీ అంటే? ఎందువల్ల వస్తుంది?)a -
షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
షుగర్ వ్యాధి వచ్చిందనగానే మనలో చాలామంది కంగారుపడిపోతూ ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, స్వీట్ తినకూడదు కదా మరి ఎలాంటి పండ్లు తీసుకోవాలి అనే సందేహాలు మొదలౌతాయి. అయితే వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల పండ్లను తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను భయంలేకుండా తీసుకోవచ్చు.అవేంటో చూద్దాం. నిజానికి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ డయాబెటిస్ ఉన్నవారు కొన్ని పండ్లను తినకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా మామిడి, అరటి, ద్రాక్ష, పనస పండ్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఒకటి లేదా రెండు ముక్కలను తీసుకుంటే మంచిది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవచ్చు.ఆపిల్, జామ, నారింజ, బొప్పాయి ,పుచ్చకాయ తీసుకోవచ్చు. ఈ పండ్లలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది , చక్కెర తక్కువగా ఉంటుంది. అయితే వీటిని జ్యూస్ల రూపంలో కాకుండా, కాయగానే తినాలి. అపుడు మాత్రమే నష్టపోకుండా ఉంటుంది. ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం, డైటరీ ఫైబర్ లభిస్తాయి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించాలనుకుంటే, భోజనం మధ్య విరామాలలో ఈ పండ్లను తీసుకోండి. సిట్రస్ పండ్లు, యాపిల్స్, బొప్పాయి ద్వారా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే ఫోలేట్- B9 లభిస్తుంది.ఆపిల్స్: ఆపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. జ్యూస్ రూపంలో గాకుండా, శుభ్రంగా కడిగి తొక్కతో తింటే ఫైబర్ ఎక్కువ అందుతుంది. పుచ్చకాయ: దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పొటాషియం కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేస్తుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండుని తీసుకోవచ్చు. ఆరెంజ్: ఆరెంజ్ పళ్లలోని క్యాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. అధిక మోతాదులో లభించే విటమిన్ ‘ఎ’ వల్ల దృష్టి లోపాలను నివారిస్తుంది. ఇందులో క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఏ, సీ విటమిన్లతో పాటు థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ తదితరాలు మెండుగా ఉంటాయి.నేరేడుపండ్లు: సమ్మర్లో ఎక్కువగా లభించే పళ్లలో నేరేడు ఒకటి.నేరేడు పండ్లు, ఎండబెట్టిన గింజల పొడి, నేరేడు చిగుళ్లను తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెబుతారు. ఇందులో విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలంజామపండ్లు: జామపండులో విటమిన్ ఏ, సి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ పండ్లు మధుమేహులకు చాలా మంచివి. ఆరెంజ్లోని విటమిన్ సి జామపండులో నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. జామకాయను తినడం ద్వారా దంతాలు, చిగుళ్లకు బలం చేకూరుతుంది. జామపండును రోజుకు రెండేసి తీసుకోవడం ద్వారా షూగర్ ను కంట్రోల్ లో పెట్టవచ్చు.పైనాపిల్: యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండు పైనాపిల్. ఎముకలకు ఇది బలం. అంజీర్: వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అందుకే ఇది ఇన్సులిన్ ఫంక్షన్ని కంట్రోల్ చేస్తుంది.అంజీర్తో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతోపాటు క్లోరిన్ లభిస్తాయి. -
ఆ డ్రెస్ నీదేనా.. రాశీ ఖన్నా ఫోటోలపై ట్రోలింగ్!
-
90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!
నీళ్లు తాగడం మంచిదని తాగుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఎలా తాగుతున్నం అనేది ఆలోచిస్తున్నారా?. చాలామంది చేసే తప్పే ఇది. పరగడుపునే నీళ్లు తాగమనగానే చల్లటి నీళ్లు తాగేస్తున్నారే తప్ప. కనీసం గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీళ్లను తీసుకునేందుకు యత్నించడం లేదు. పైగా నీళ్లు ఎక్కువుగా తాగుతున్నాం కదా!. అయినా ఈ సమస్యలేంటి అని వాపోతున్నారు. కానీ నీళ్లు తాగే పద్ధతి ఇది కాదు. అలాగే ఎప్పుడూ పడితే అప్పుడూ తాగిన ఆరోగ్యం మాట ఎలా ఉన్నా అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఎలా తాగితే మేలంటే.. ఇక నీటిని 90 శాతం మంది తప్పుగానే తాగుతుంటారు. ఈ విధంగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీటిని తాగేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఆయుర్వేద ప్రకారం నీటిని భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం అనంతరం 30 నిమిషాలు ఆగి తాగాలి. అప్పుడే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కనుక భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ నీళ్లను తాగరాదు. అంతగా తాగాలనిపిస్తే ఒకసారి చప్పరించవచ్చు. అంతేగాదు నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి. నిలుచుని తాగరాదు. లేదంటే అది జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అది కిడ్నీల పనితీరును నెమ్మదింపజేస్తుంది. కనుక నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి. ఎల్లప్పుడూ గోరు వెచ్చని నీళ్లు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లను తాగాలి. చల్లని నీళ్లను తాగరాదు. కానీ కుండలోని నీళ్లను తాగవచ్చు. ఫ్రిజ్లో చల్ల బరిచిన నీళ్లను తాగరాదు. తాగితే శరీరంలో కఫం పెరిగిపోతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక మలబద్దకం సమస్య వస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం సరిగ్గా శోషించుకోలేదు. చల్లని నీళ్లను తాగడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోతాయి. దీంతో గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనుక చల్లని నీళ్లను తాగరాదు. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో నీళ్లను కూడా తాగరాదు. బాగా దాహంగా ఉందని ఆబగా తాగేయ్యకూడదు. నీళ్లను తాగేటప్పుడూ కొంత సమయం వ్యవధి ఇచ్చి తాగాలి. ఇలా ఎక్కువ మొత్తంలో నీళ్లను ఒకేసారి తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మంచిది కాదు. కనుక నీళ్లను కొద్దిగా కొద్దిగా ఎక్కువ సార్లు తాగాలి. నీళ్లను తగినంత మోతాదులో తాగకపోతే మూత్రం పసుపు రంగులో వస్తుంది. అంటే మీరు నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం చేసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మేర నీళ్లను తాగాలి. అలాగే దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లను తాగాలి. అవసరం ఉన్నా, లేకపోయినా పదే పదే నీళ్లను తాగరాదు. నీళ్లను అవసరం లేకపోయినా ఎక్కువగా తాగితే కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో కిడ్నీల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కిడ్నీలు చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక అవసరం ఉన్నంత మేరకే నీళ్లను తాగాల్సి ఉంటుంది. ఇక ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో మలబద్దకం సమస్య ఉండదు. అధిక బరువు తగ్గుతారు. గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. గోరు వెచ్చని నీళ్లను ఒక లీటర్ వరకు కూడా ఉదయం తాగవచ్చు. కానీ కొంత సమయం ఇచ్చి తాగాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయోజనాలను పొందవచ్చు. (చదవండి: Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..! -
ఆసియాలోని బెస్ట్ రెస్లారెంట్లుగా ఐదు భారత రెస్టారెంట్లు!
యూకే ఆధారిత విలియం రీడ్ బిజనెస్ మీడియా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను విడుదల చేయనుంది. అందుకోసం మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికాకు సంబంధించి సుమారు 50 బెస్ట్ రెస్టారెంట్ల ఎంట్రీలను ఆహ్వానించింది. వాటిలో 51 నుంచి 100 ర్యాంకుల వరకు ఆసియాకి సంబంధించిన వివిధ రెస్టారెంట్లే ఉన్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఐదు భారతీయ సంస్థలు ఉండటం విశేషం. ఈ ఏడాదికి సంబంధించిన ఆసియా టాప్ 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ఈ నెలాఖరులోగా వెల్లడించనుంది. ఈ జాబితా ఎంట్రీల్లో 51-100 ర్యాంకుల్లో మూడు ముంబై రెస్లారెంట్లు, డిల్లీకి సంబంధించిన రెండు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. ముంబైలోని అమెరికాలనో(61), ది బాంబే క్యాంటీన్(70), ఎకా(98), ఇక ఢిల్లీకి సంబంధించి గురుగ్రామ్లో కొమెరిన్(79), న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ (87)వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితా ఎంట్రీలో దేశం వెలుపల ఉన్న రెస్టారెంట్లు, బ్యాంకాక్కి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు తర్వాత స్థానంలో ఉన్నాయి. దీనికి భారతీయ చెఫ్ గరిమా అరోరా నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఆసియా బెస్ట్ రెస్టారెంట్ ఎంట్రీల జాబితాలో టోక్యో, సింగపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక 51 నుంచి 100 ర్యాంకుల జాబితాలో మాత్రం ఆసియాలోని 16 నగరాలకి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ఆసియా బెస్ట్ రెస్టారెంట్ల 2024 జాబితాన మార్చి 26, 2024న దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగే అవార్డుల కార్యక్రమంలో వెల్లడించనున్నారు. ఈ బెస్ట్ రెస్టారెంట్ల ఎంట్రీల జాబితాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. కాగా, గతేడాదిలో ఈ బెస్ట్ రెస్టారెంట్ జాబితాలో అమెరికానో 66వ స్థానాన్ని, ఎకా 93వ స్థానాన్ని దక్కించుకుంది. View this post on Instagram A post shared by The Worlds 50 Best Restaurants (@theworlds50best) (చదవండి: బెస్ట్ శాండ్విచ్గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..) -
వరల్డ్ బెస్ట్ లిస్ట్లో భారత ఫిల్టర్ కాఫీ
కాఫీ గుమాళింపు ముక్కు పుటలకు తాకగానే హా! అని ఆస్వాదించేందుకు రెడీ అయిపోతాం. అలాంటి కాఫీలలో అత్యుత్తమమైన కాఫీల జాభితాను ఫుడ్ అండ్ ట్రామెల్ గైడ్ ఫ్లాట్ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసింది. మొత్తం 38 అత్యుత్తమమైన కాఫీ జాబితాలను విడుదల చేయగా, అందులో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానం దక్కించుకుంది. తొలి స్థానంలో క్యూబాకి చెందిన క్యూబన్ ఎస్ప్రెస్సో కాఫీ నిలిచింది. ఈ క్యూబన్ ఎస్ప్రెసో అనేది డార్క్ రోస్ట్ కాఫీ. దీన్ని పంచదారను ఉపయోగించి తయారు చేసే షాట్స్లా ఉంటుంది. కాఫీ కాచేటప్పుడు కొద్దిగా చక్కెర స్టవ్ టాప్ ఎస్ర్పెస్సో మేకర్లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషిన్లో తయారు చేస్తారు. దీనిపై లేత గోధుమ రంగు నురుగ కూడా ఉంటుంది. ఇక భారతీయ ఫిల్టర్ కాఫీ స్టెయిన్లెస్ స్టీల్లో తయారు చేస్తారు. ఇందులో రెండు గదులుగా ఉంటుంది. పైభాగం చిల్లులగా ఉండి దిగువ భాగంలో కాఫీని ఉంచడానికి ఉపయోగాస్తారు. దిగువున ఉన్న గది నుంచి నెమ్మదిగా కాఫీ బయటకు రావడం జరగుతుంది. దక్షిణ భారతదేశంలో విస్తృత ప్రాచుర్యం పొందింది ఈ కాఫీ. చాలామంది వ్యక్తులు రాత్రిపూట ఈ ఫిల్టర్ కాఫీని ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే ఈ తాజా కాఫీ మిశ్రమానికి వెచ్చని పాలు, చక్కెర కలుపుతారు. ఈ కాఫీ ఉక్కు లేదా ఇత్తడితో చేసిన చిన్న గ్లాస్లో సర్వ్ చేస్తారు. దీంతోపాటు దబారా అనే చిన్న గిన్నెలాంటి సాసర్ ఉంటుంది. సర్వ్ చేసే ముందు చక్కగా తిరగబోసి నురుగు వచ్చేలా అందంగా సర్వ్ చేయడం జరుగుతుంది. కాగా, టేస్లీ అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యుత్తమ పది కాఫీల జాబితాలో ఏయే దేశాల కాఫీలు ఉన్నాయంటే.. 1. క్యూబన్ ఎస్ప్రెస్సో (క్యూబా) 2. సౌత్ ఇండియన్ కాఫీ (భారతదేశం) 3. ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్) 4. ఫ్రెడ్డో కాపుచినో (గ్రీస్) 5. కాపుచినో (ఇటలీ) 6. టర్కిష్ కాఫీ (టర్కీయే) 7. రిస్ట్రెట్టో (ఇటలీ) 8. ఫ్రాప్పే (గ్రీస్) 9. ఐస్కాఫీ (జర్మనీ) 10. వియత్నామీస్ ఐస్డ్ కాఫీ (వియత్నాం) (చదవండి: అక్కడ మహిళలదే పైచేయి..అబ్బాయే అత్తారింటికి వస్తాడు..ఎక్కడంటే..!) -
‘చిత్ర’మైన యాప్లు! అలా తీసిన ఫొటో ఇలా..
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, విస్తృతమైన స్మార్ట్ఫోన్ వినియోగంతో ఫోటోలు తీయడం అనేది ఊపిరి పీల్చుకున్నంత సహజంగా మారిన యుగం ఇది. ప్రతి కదలికకూ ఓ సెల్ఫీ.. రోజులో ఎన్ని సెల్ఫీలు, ఫొటోలు తీస్తామో మనకే తెలియదు. అయితే అలా తీసిన సాధారణ ఫొటోలు, సెల్ఫీలను అద్భుతమైన చిత్రాలుగా మార్చుకోవచ్చు. మీకు ఉన్నట్టుండి ఓ సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది.. మీ పెంపుడు జంతువు ముచ్చటగా అనిపించి ఓ ఫొటో తీస్తారు.. రమణీయ ప్రకృతి దృశ్యాన్ని మీ ఫోన్ కెమెరాలో బంధిస్తారు. ఈ సాధారణ ఫొటోలే వాన్ గోహ్ చిత్రించినట్లుగా, పికాసో మలిచినట్లుగా అద్భుతమైన చిత్రాలుగా మారిపోతే.. ఒక్కసారి ఊహించండి.. ఊహించడం కాదు.. నిజంగానే అద్భుతమైన చిత్రాలుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం అద్భుతమైన నైపుణ్యం అవసరం లేదు. ఇక్కడ మేం చెప్పే కొన్ని మొబైల్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ప్రిస్మా అనేక రకాల ఎడిటింగ్ ఆప్షన్లు కావాలనుకున్నవారికి ఈ యాప్ చక్కగా సరిపోతుంది. న్యూరల్ నెట్వర్క్, కృత్రిమ మేధస్సు కలయికతో మీఫొటోను కొత్త శైలిలో పునఃసృష్టిస్తుంది. దీన్ని ఉచితంగానే ఉపయోగించవచ్చు. కాస్త ఎక్కువ ఫీచర్లు కావాలనుకున్నవారు ప్రీమియం వర్షన్ ట్రై చేయొచ్చు. ఆర్ట్ స్టైల్, క్లాసిక్ టెంప్లేట్లు, ఫ్రేమ్లు వంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఫొటో నాణ్యతను పెంచే హెచ్డీ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ప్రిస్మా ( Prisma) యాప్ అందించే మరో ఆసక్తికరమైన ఫీచర్ మ్యాజిక్ అవతార్స్. ఇది ఏఐ సాంకేతికతను ఉపయోగించి మీ సొంత ఫోటోల నుంచి అవతార్లను సృష్టిస్తుంది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో అందుబాటులో ఉంది. పిక్సార్ట్ పేరులో ఉన్నట్లుగానే మీ ఫోటోలను ఆర్ట్గా మార్చాలనుకుంటే పరిగణించవలసిన మరొక మంచి యాప్ పిక్సార్ట్ (Picsart). గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో అందుబాటులో ఉంది. స్కెచ్ ఎఫెక్ట్లు, పాతకాలపు ఫిల్టర్లు, ఆయిల్ పెయింటింగ్ వంటి వాటితో సహా అనేక రకాల ఫిల్టర్లు, ఆర్ట్ స్టైల్లను ఇది అందిస్తుంది. క్రాపింగ్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ సర్దుబాటు, టెక్స్ట్ యాడింగ్ వంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. అదనంగా మీ ఫోటోకు ఆసక్తికరమైన స్టిక్కర్లు, ఎలిమెంట్లు యాడ్ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న టెంప్లేట్లు కాకుండా పిక్సార్ట్లో మీరు తెలుసుకోవలసిన మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏఐ ఇమేజ్. గోఆర్ట్ ఫోటో ఆర్ట్ మేకర్ మీ ఫోటోలను తీర్చిదిద్దడానికి మరింత ప్రొఫెషనల్-గ్రేడ్ టూల్ కోసం చూస్తున్నట్లయితే గోఆర్ట్ (GoArt) ఫోటో ఆర్ట్ మేకర్ మంచి ఎంపిక. దీన్ని ఉపయోగించడం చాలా ఇతర ఫోటో ఎడిటింగ్ యాప్ల మాదిరిగా సూటిగా అనిపించకపోవచ్చు, కానీ ఇందులోని ఫీచర్లు, టూల్స్ కృషికి తగినవిగా చేస్తాయి. పెయిడ్ వర్షన్ను వినియోగిస్తే క్రెడిట్ల రూపంలో రోజువారీ రివార్డ్లు కూడా లభిస్తాయి. ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోటోలీప్ ట్రెండింగ్లో ఉన్న అన్ని క్లాసిక్, ఏఐ ఫిల్టర్లతో మీ ఫొటోలను అద్భుతంగా మార్చుకోవాలంటే ఈ ఫోటోలీప్ (Photoleap) యాప్ను ట్రై చేయొచ్చు. ఫొటోలకి ఫ్యూచరిస్టిక్ ఎన్హాన్స్మెంట్స్ చేసే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. అలాగే మీ ఫోటోను కార్టూన్, యానిమేషన్, మాంగా మొదలైనవాటిగానూ మార్చవచ్చు. ప్రతి ఫిల్టర్ మీ ఫోటోలోని రంగు, ఆకృతి, నమూనా వంటి వివిధ అంశాలను మాన్యువల్గా పునరావృతం చేయడానికి సంక్లిష్టంగా ఉండే మార్గాల్లో సర్దుబాటు చేస్తుంది. ఇందులో స్కై టూల్ను కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ ఫోటోలలో ఆకాశాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఫోటోకు మరింత కళను జోడించడానికి ఏఐ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఫోటో ల్యాబ్ ఫోటో ల్యాబ్ (Photo Lab) అనేది దాని విస్తృత శ్రేణి ఎఫెక్ట్లు, ఫిల్టర్లు, ఫ్రేమ్లు, ఇతర ఎడిటింగ్ సాధనాలకు ప్రసిద్ధి చెందిన మరొక అప్లికేషన్. దీంట్లో యూజర్లు తమ ఫోటోలను సులువుగా కళాత్మక సృష్టిలుగా మార్చుకోవచ్చు. ఇతర యాప్ల మాదిరిగానే ఈ యాప్ కూడా ఫొటోలను అద్భుతంగా తీర్చిదిద్దడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. ఈ యాప్లో ఇతర యూజర్లు చేసిన ఫోటో ఎడిట్ల క్యూరేటెడ్ స్ట్రీమ్ను ప్రదర్శించే ఫీడ్ ఫీచర్ను ఉంది. ఇక్కడ మీరు కమ్యూనిటీ ద్వారా అప్లయి చేసే విభిన్న శ్రేణి ఎడిట్స్, ఎఫెక్ట్స్ను వీక్షించడం ద్వారా ఫోటో ల్యాబ్లోని సృజనాత్మక అవకాశాలను అన్వేషించవచ్చు. అలాగే యూజర్ల ఫీడ్ నుంచి ఫోటోలను లైక్, కామెంట్, షేర్ చేయవచ్చు. గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో ఈ యాప్ను పొందవచ్చు. -
నీరు.. బేజారు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కళాఖండమేమీ కాదు, ఇది మంచినీటి సీసా మాత్రమే! దీని ధర తెలుసుకుంటే మాత్రం గుండె బేజారవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసా. ‘అక్వా డి క్రిస్టాలో ట్రిబ్యూటో ఎ మోదిగ్లియానీ’ పేరుతో ఈ మంచినీటి సీసాను దివంగత ఇటాలియన్ కళాకారుడు అమేదియో క్లెమెంటె మోదిగ్లియానీకి నివాళిగా మెక్సికన్ కళాకారుడు ఫెర్నాండో ఆల్టమిరానో ప్రాచీన ఈజిప్షియన్ శిల్ప శైలిలో రూపొందించాడు. దీని తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్, 23 కేరట్ల బంగారం ఉపయోగించి, యంత్రాలతో పనిలేకుండా పూర్తిగా హస్తకళా నైపుణ్యంతోనే ఈ నీటిసీసాలను తయారు చేశాడు. వీటిలో జలపాతాల నుంచి జాలువారిన నీటిని నింపి, విక్రయానికి సిద్ధం చేశాడు. ఈ నీరు సాధారణ నీటి కంటే ఎక్కువ ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. మెక్సికో సిటీలో 2010లో జరిగిన వేలంలో ఈ లీటరు నీటి సీసా ఒకటి 60 వేల డాలర్లకు (రూ.49.89 లక్షలు) అమ్ముడుపోయి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసాగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు దీని రికార్డు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. -
మహిళా భద్రతలో టాప్.... చెన్నై!
అవతార్ గ్రూప్ తాజగా మహిళా భద్రతకు పెద్దపీట వేసిన నగరాల జాబితాను టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా(టీసీడబ్ల్యూఐ) అనే సూచిక పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆ సూచీలో మహిళలకు ది బెస్ట్ సిటీగా చెన్నై నిలిచింది. దీన్ని వైవిధ్యం, సమానత్వం, భ్రదత అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. అంతేగాదు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ డేటా తోపాటు దాదాపు 12 వందల మంది మహిళల అభిప్రాయాలనే సేకరించి మరీ అవతార్ గ్రూప్ ఈ సూచీని రూపొందించింది. ఈ సర్వేలో రెండు కేటగిరీలలో తమిళనాడు నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. మిలియన్ ప్లస్ జనాభా విభాగంలో 49 నగరాలు, మిలయిన్కంటే తక్కువ జనాభా విభాగంలో 64 నగరాలు ఉన్నాయి. అయితే మిలియన్ ప్లస్ విభాగంలో చెన్నై టాప్ పొజిషన్లో ఉండగా, మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న విభాగంలో తిరుచిరాపల్లి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రలైన చెన్నై, బెంగళూరు, పూణె, ముంబై, హైదరాబాద్, నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో మన హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో ఉండటం విశేషం. ఈ సర్వేని సిటీ ఇన్క్లూజన్ స్కోర్ (CIS), సామాజిక చేరిక స్కోర్ (SIS), ఇండస్ట్రియల్ ఇన్క్లూజన్ స్కోర్ (IIS) వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ అంశాలే కొలమానంగా బాహ్య సామాజిక వాతావరణం, సంస్థల్లో శ్రామిక క్తిని చేర్చడం, సర్వేల ద్వారా మహిళల అనుభవాలుతీసుకోవడం, ఫోకస్ గ్రూప్ చర్చలు(FGDs) తదితర వాటితో మహిళల అనుభవాలను అంచనా వేసి మరీ వెల్లడించింది అవతార్ గ్రూప్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..మహిళలపై నేరాలకు పేరుగాంచిన దేశ రాజధాని ఢిల్లీ 8వ ర్యాంక్తో మొదటి 10 స్థానాల్లో నిలవడం విశేషం. గతేడాది ఢిల్లీ ఈ సీఐఎస్ ర్యాంక్లో 14వ స్థానంలో ఉంది. కానీ భద్రత పరంగా ఎస్ఐఎస్ ర్యాంక్ ఎనిమిది స్థానాలు దిగజారి 27వ ర్యాంక్కు పరిమితమైంది. ఈమేరకు అవతార్ గ్రూప్ ఫౌండర్-ప్రెసిడెంట్ డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ..ఈ సూచిక దేశంలోని మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచేలా సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు పిలుపునిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు..2027కల్లా భారతదేశం అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉంది అనేందుకు తమ డేటా నిలువెత్తు సాక్ష్యం అవుతుందన్నారు. అంతేగాదు 2025 నాటికి భారతదేశం దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి వర్క్ఫోర్స్లో మహిళ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేస్తూ సంస్థల్లో మరింత వైవిధ్యాన్ని తీసుకొచ్చేలా సామాజిక సమానత్వంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని సౌందర్య రాజేష్ అన్నారు. (చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!) -
World Best Photos Of 2023: ప్రపంచ వ్యాప్తంగా 2023లో తీసిన బెస్ట్ ఫోటోలు ఇవే.. ఓ లుక్కేయండి
-
మనదేశంలో చూడదగ్గ 'బెస్ట్ ఆఫ్బీట్' పర్యాటక ప్రదేశాలు!
కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం చాలామందికి. అందుకని విదేశాలకు చెక్కేస్తుంటారు. కానీ మన గడ్డపైనే ఎంతో విలక్షణమైన ప్రదేశాలు, కట్టిపడేసే సహజమైన ప్రకృతి దృశ్యాలు, మిస్టరీ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వెరైటీ వంటకాలకు నెలవైన ప్రదేశాలతో సహా వైవిధ్యభరితంగా, ఆహ్లాదంగా ఉండే సుందర ఉద్యానవనాలు ఎన్నెన్నో ఉన్నాయి. స్వదేశానికి మించిన గొప్ప పర్యాటక ప్రదేశం మరొకటి లేదు అనేలా బెస్ట్ ఆఫ్బీట్ ప్రదేశాలు ఎన్నో మన నేలలోనే ఉన్నాయి. అంతేగాదు ఈ ఏడాది 'బెస్ట్ ఆఫ్బీట్' ప్రదేశంగా ఓ ప్రసిద్ధ లోయ గోల్డ్ని దక్కించుకుంది కూడా. ఇంతకీ మన సొంత గడ్డలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఏంటంటే.. ప్రకృతి అందానికి ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్.. ప్రతిష్టాత్మకమైన ఔట్లుక్ ట్రావెలర్ అవార్డ్ 2023లో బెస్ట్ ఆఫ్బీట్ ప్రదేశంగా ఉత్తర కాశీలో కుప్వారా జిల్లాలోని లోలాబ్ వ్యాలీ బంగారు పతకాన్ని దక్కించుకుంది గెలుచుకుంది. వాడి ఈలో లాబ్ లేదా లోలోవ్ అని పిలిచే ఈ లోలాబ్ వ్యాలీ అద్భుతమైన ప్రకృతి అందానికి, ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్గా ఉంటుంది. పైగా దీన్ని భారత్లో దాగున్న అద్భతమైన రత్నంగా ఈ ప్రదేశాన్ని అభివర్ణిస్తారు. యాపిల్ తోటలు, మెలికలు తిరిగిన నదులతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కుప్వారాకు ఉత్తరంగా 9 కిలోమీటలర్ల దూరంలో ఈ ఐకానిక్ ప్రదేశం ఉంది. ఈ లోలాబ్ వ్యాలీ ఎంట్రీ గేట్ నుంచే అద్భతమైన ప్రకృతి దృశ్యాలు ప్రారంభమవుతాయి. విశాలమైన పర్వత శ్రేణులతో ఓవల్ ఆకారపు లోయ నుంచి జర్నీ మొదలవుతుంది. పర్యాటకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కలరూస్ గుహలకు ఆకర్షితలవుతారు. ఇక్క నుంచి నేరుగా రష్యాకు చేరుకునేలా మార్గం ఉందని, పైగా ఈ గుహ లోపల భారీ నీటి వనరులను దాచి పెట్టారని స్థానిక ప్రజలు కథకథలుగా చెప్పుకుంటుంటారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ లోయని మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది. విద్యుత్ సౌకర్యం లేని గ్రామానికి నెలవు.. ఈ ఆదునిక కాలంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు లేనేలేవు కదా! కానీ ఇదే కాశ్మీర్లో శ్రీనగర్కి 80 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ సౌకర్యం లేని చత్పాల్ అనే విచిత్రమైన గ్రామం ఉంది. పర్యాటకులు తప్పనసరిగా చూడాల్సిన గొప్ప పర్యాటక ప్రదేశం. ఇక్కడ మంత్ర ముగ్దుల్ని చేసే పైన్ అడవులు సూర్యరశ్మిని ముద్దాడే హిమాలయాల అద్భుతాలను తిలకించాల్సిందే. ఈ గ్రామంలో ప్రత్యేకంగా చూసేందుకు ఏమీ ఉండదు కానీ అక్కడ ప్రకృతి రమ్యత పర్యాటకులను పులకించిపోయేలా చేస్తుంది. కొద్ది దూరంలో ఉన్న తిమ్రాన్ గ్రామంలోని పాఠశాల, ఆపిల్, వాల్నట్ తోటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అక్కడ స్థానికులు పర్యాటకులతో స్నేహపూర్వకంగా ఉండటమే గాక అక్కడ వారందించే సుగంధభరితమైన టీ చాలా రుచిగా ఉంటుంది. తొలి సముద్ర జాతీయ ఉద్యానవనం.. చూడదగ్గ మరో పర్యాక ప్రదేశం గుజరాత్లోని నరరా మెరైన్ నేషనల్ పార్క్. ఇది భారత్లోని తొలి సముద్ర జాతీయ ఉద్యానవనంగా చెబుతారు. గుజరాత్లోని జామ్నగర్కు కొద్ది దూరంలో ఉంది. ఇది మూడు పార్క్లుగా విభజించబడి, 42 చిన్న ద్వీపాల మాదిరి విస్తరించి ఉంది. ఇక్క పగడాలు, ఆక్టోపస్, ఎనిమోన్స్, పఫర్ ఫిష్, సముద్ర గుర్రాలు, పీతలు వంటికి నెలవు. కళాకారులకు నిలయం.. హిమచల్ ప్రదేశ్లోని ఆండ్రెట్టా పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ప్రదేశం. ఇది పారాగ్లైడింగ్కి ప్రసిద్ధి. అంతేగాదు ఈ ఆండ్రెట్టాని కళాకారుల కాలనీ అని కూడా అంటారు. దీన్ని 1920లలో ఐరిష్ థియేటర్ ఆర్టిస్ట్ నోరా రిచర్డ్స్ స్థాపించారు. ఇక్కడ కుమ్మరి దగ్గర నుంచి హస్తకళకారుల వరకు ఎందరో కళకారులు ఉంటారు. వారందరి నైపుణ్యాలను తిలకించొచ్చు, నేర్చుకోవచ్చు కూడా. ఇక్కడ శోభా సింగ్ ఆర్ట్గ్యాలరీ మరింత ప్రసిద్ధి. దేవాలయల భూమి.. తమిళనాడులో ఉన్న తరంగంబాడి మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఈ పేరుని అనువదిస్తే 'గాన తరంగాల భూమి' అని అర్థం. గతంలో ట్రాన్క్విబార్ అనిపిలిచేవారు. ఇది అనేక బీచ్ టౌన్లు కలిగిన ప్రదేశం. ఇది చరిత్రలో నిలిచిన పట్టణం. గత కాలం గురించి లోతుగా తెలుసుకోవాలనుకునేవారికి ఇది మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఉన్న డానిష్ కోట మరింత ఆకర్షిస్తుంది. దీన్ని 1620లలో నిర్మించారు. ఈ కోటని డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు స్థావరంగా ఉపయోగింకున్నట్లు చెబుతారు చరిత్రకారులు. ఇక్కడ తప్పక సందర్శించాల్సింది న్యూ జెరూసలేం చర్చి. దీన్ని భారతీయ యూరోపియన్ నిర్మాణాల కలయికతో ఆకట్టుకునేలా నిర్మించారు. ఆనంద నగరం సందక్ఫు.. ఇది పశ్చిమబెంగాల్లో ఉంది. ఎత్తైన శిఖరాలనకు నిలయం ఈ ప్రాంతం.ఇది భారత్ నేపాల్ సరిహద్దులో ఎంది. ఎవరెస్ట్, కాంచనజంగా, లోట్సే మకాలులను కప్పి ఉంచే అద్భుతమైన పర్వత దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ దృశ్యం బుద్ధుడి ఆకృతిని తలపించేలా ఉందని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. హన్లే డార్క్ స్కై రిజర్వ్.. లద్దాఖ్లో ఉంది హన్లే డార్క్ స్కై రిజర్వ్. విలక్షణమైన ప్రకృతి దృశ్యాలు చూడాలనుకునేవారికి ది బెస్ట్ ప్లేస్ ఇది. ఈ రిజర్వ్లో కాంతి పొల్యూషన్ని చూడొచ్చు. ఇక్కడ ఆకాశం పూర్తి చీకటితో నిర్మలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నిశితంగా చూడొచ్చు. ఇక్కడ దాదాపు వెయ్చి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణలో భారతీయ ఖగోళ అబ్జర్వేటరీ ఉంది. అలాగే హన్లేలో సరస్వతి పర్వతంపై సుమారు 4 వేల మీటర్ల ఎత్తులో టెలిస్కోప్ ఉంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన అబ్జర్వేటరీలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: చలో టూర్) -
ఉత్తమ ఆహార నగరాల జాబితాలో ఐదు భారత నగరాలకు చోటు!
పర్యాటకులు ఏ నగరం వెళ్లినా.. ముందుగా తెలుసుకునేది ఆహారం గురించే. ఎలాంటి ఆహారం దొరుకుతుందని తెలుసుకుని అప్పుడూ స్టే చేయగలమా లేదా నిర్ణయించుకుంటారు. అలా అత్యుత్తమ ఆహారం అందించే నగరాల జాబితా తెలిస్తే పర్యాటకలుకు మరితం ఈజీ అవుతుంది. అలాంటి ఉత్తమ ఆహార నగరాల జాబితా ఒకటి ఇటీవలే విడుదలైంది. దీన్నిఆ నగర సంస్కృతిక, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్థానిక ఆహారాన్ని రుచిగా అందించే... గల్లీలోని స్టాల్స్ నుంచి ఐకానిక్ రెస్టారెంట్ల వరకు ఏం ఉన్నాయి, ఆహార ప్రియులు ఇష్టపడే నగరాలు, ఆ రెస్టారెంట్లకు ఉన్న రేట్లు తదితరాలను పరిగణలోనికి తీసుకుని మరీ ఈ ఉత్తమ ఆహార నగరాల జాబితాను ఇచ్చారు. ఈ ఉత్తమ ఆహారాల జాబితాను ట్రావెల్ ఆన్లైన్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఇటీవలే విడుదల చేసింది. ఆ జాబితాలో ఐదు భారతీయ మహానగరాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఆ నగరాలు ఏంటంటే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లక్నో టాప్ 100 జాబితాలో స్థానం దక్కించుకోగా, టాప్ 50లో ముంబై 35వ స్థానం, హైదరాబాద్ 39వ స్థానం నిలాచాయి. ఇక ఢిల్లీ 56వ స్థానానికి, చెన్నై(65), లక్నో(92) స్థానాలను దక్కించుకున్నాయి. ఇక ఈ జాబితాలో తాజా పదార్థాలతో రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధిగా రోమ్(ఇటలీ) నిలిచింది. బోలోగ్నా, నేపుల్స్, రెండు ఇటాలియన్ నగరాలు రెండు, మూడు ర్యాంక్లు దక్కించుకున్నాయి. కాగా, టాప్ 10 జాబితాలో స్థానం దక్కించుకున్న ఇతర నగరాలు వియన్నా(ఆస్ట్రియా), టోక్యో(జపాన్), హాంకాంగ్(చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ) , బాండుంగ్ (ఇండోనేషియా) తదితరాలు. (చదవండి: అత్యంత తక్కువ పగటి కాలం ఉండేది ఈ రోజే! ఎందుకలా జరుగుతుందంటే..?) -
బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు!
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో 5జీ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్, ఐకూ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ. 15,000లోపు లభించే టాప్ మూడు 5జీ ఫోన్ డీల్స్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 (Samsung Galaxy F14) రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి. M సిరీస్ వెర్షన్లో అదనంగా 2-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. రెండెంటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండు ఫోన్లూ 6000 mAh బ్యాటరీతో వస్తాయి. అయితే వీటికి ఛార్జర్ రాదు. ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రూ. 11,967కి అందుబాటులో ఉండగా, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ధర రూ.11,490 ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లతో కొటే అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ ఐకూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్. దీని ధర రూ. 13,989. స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ ఉపయోగం, సాధారణ గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. 120Hz స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది. పోకో ఎం6 ప్రో 5జీ రూ. 10 వేల లోపు సెగ్మెంట్లో వచ్చే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) రోజువారీ వినియోగం, సాధారణ గేమింగ్ కోసం స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ను ఆశించవచ్చు. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో ఇది ధర రూ. 9,999లకే లభిస్తోంది. -
తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?
TIME World100 Best Companies List Infosys ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ టైమ్ ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీల లిస్ట్లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రమే కావడం విశేషం. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ధీటుగా 64 వ స్థానంలో ఇన్ఫీ తనప్రత్యేకతను చాటుకుంది. అలాగే ప్రపంచంలోని తొలి మూడు ప్రొఫెషనల్ సేవల కంపెనీలలో ఒకటిగా కూడా ఇన్ఫోసి నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న కంపెనీల ర్యాంకింగ్లో మొత్తం 750 కంపెనీలను పేర్కొన్నాయి. అయితే ఇన్ఫోసిస్తో పాటు, మరో ఏడు భారతీయ కంపెనీలు 750 కంపెనీలున్న టైమ్ జాబితాలో ప్లేస్ దక్కించుకున్నాయి. టైమ్ మ్యాగజైన్ , ఆన్లైన్ డేటా ప్లాట్ఫారమ్ స్టాటిస్టా సంకలనం చేసిన 2023 ప్రపంచ అత్యుత్తమ కంపెనీల టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ) మెటా లాంటి టెక్ కంపెనీలు టాప్లో ఉన్నాయి. రాబడి వృద్ధి, ఉద్యోగుల సంతృప్తి సర్వేలు , పర్యావరణ హిత విధానాలు, సామాజిక , కార్పొరేట్ గవర్నెన్స్ (ESG, లేదా సుస్థిరత) డేటా ఆధారంగా ఆ ర్యాంకింగ్లను కేటాయించారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించిన తయారీదారులు, వినియోగ వస్తువుల కంపెలు, ఫాస్ట్ మూవింగ్ టెక్ ర్యాంకింగ్లున్నాయి. Infosys has been featured in TIME World’s Best Companies 2023 list. We are among the top 3 global professional services firm and the only brand from India in the Top 100 global rankings: https://t.co/Mvg9lRFxDV pic.twitter.com/dN6n0p76ZA — Infosys (@Infosys) September 14, 2023 టెక్ కంపెనీలు బాగా పనిచేశాయి. ఎందుకంటే వాటి కార్బన్ ఉద్గారాలు విమానయాన సంస్థలు, హోటళ్లు లేదా పెద్ద తయారీదారులు వంటి ముఖ్యమైన భౌతిక పాదముద్రలు కలిగిన ఇతర రకాల కంపెనీల కంటే చాలా తక్కువగా ఉన్నాయని టైమ్ పేర్కొంది. వారి ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కూడా వారు కూడా మంచి ర్యాంక్ను పొందడానికి కారణం. ఉద్యోగుల ర్యాంకింగ్లలో తొలి నాలుగు కంపెనీలు అత్యధిక మార్కులు పొందాయి. గత మూడేళ్లలో గణనీయ మైన లాభాలను పోస్ట్ చేసారు. వారు సామాజిక పాలన సూత్రాలకు కట్టుబడి ఉన్నారు. అలాగే ఉద్గారాలను తగ్గించడంతో కృషి, వారి వారి బోర్డులలో ఎక్కువ మంది మహిళలను నియమించడం వంటివి దోహద పడ్డాయని తెలిపింది. ఇక ఈ జాబితాలో విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 262వ స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 418వ స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 596వ స్థానంలో నిలిచాయి. -
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
Victory Venkatesh: ఇండస్ట్రీలో 37 ఏళ్లు పూర్తి చేసుకున్న వెంకీ మామ, అరుదైన ఫోటోలు
-
Best Camera Phones: ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ కెమెరా మొబైల్ ఫోన్స్
-
2023 భారతదేశంలో టాప్ 10 బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్
-
బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి..
స్మార్ట్ఫోన్లు మన దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. కస్టమర్లు తమ బడ్జెట్కు అనుగుణంగా ప్రీమియం, మిడ్-రేంజ్ లేదా లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. హార్డ్వేర్, ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యాలను మెరుగుపరచడంతో ఈ రోజుల్లో ఫోన్లు చాలా బరువుగా మారాయి. ప్రీమియమ్ బిల్డ్, పెద్ద బ్యాటరీలు ఉండటం మంచిదే అయినప్పటికీ కొంతమంది ఫోన్లు తేలికగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని తేలికపాటి ఫోన్ల గురించి సమాచారం ఇక్కడ అందిస్తున్నాం. రియల్ మీ నార్జో ఎన్ 53 (Realme Narzo N53) బరువు 182 గ్రాములు. 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ Unisoc T612 SoC ప్రాసెసర్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 12GB వరకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీ LED ఫ్లాష్తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా 4GB + 64GB వెర్షన్ ధర రూ. 8,999, 6GB + 128GB మోడల్ ధర రూ. 10,999. మోటో జీ13 (Moto G13) బరువు 184.25 గ్రా 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ 4GB LPDDR4X ర్యామ్ 64GB/128GB స్టోరేజీ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డ్యూయల్ లెన్స్లు, 8MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 4GB + 64GB మోడల్ రేటు రూ. 9,499, 4GB + 128GB వెర్షన్ ధర రూ. 9,999. వివో వై 02 (Vivo Y02) బరువు 186 గ్రాములు. 6.51-అంగుళాల HD+ డిస్ప్లే మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3GB ర్యామ్, 32GB స్టోరేజీ, 1TB వరకు విస్తరించవచ్చు Funtouch OS 12తో Android 12 Go ఎడిషన్ 8MP రియర్ కెమెరా 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 2GB + 32GB మోడల్ ధర రూ. 8,999. రెడ్మీ 10ఎ (Redmi 10A) బరువు 194 గ్రాములు 6.53-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G25 ప్రాసెసర్ 3GB/4GB LPDDR4x ర్యామ్, 32GB/ 64GB eMMC 5.1 స్టోరేజ్. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 3GB + 32GB మోడల్ ధర రూ. 8,499, 4GB + 64GB వెర్షన్ ధర రూ. 9,499. -
మెత్తని మిఠాయి..ప్రపంచం మెచ్చిందోయి!
తీపి పదార్థాలు అంటే చాలా మంది చెవి కోసుకుంటారనేది సామెత. నిజంగా చెవి కోసుకోవడం ఏమోగానీ.. ముందు పెడితే చాలు జామ్మంటూ లాగించేస్తుంటారు. అందులోనూ మైసూర్ పాక్ అనగానే నోట్లో నీళ్లూరడం ఖాయం. అలా దేశవిదేశాల్లో ఆహార ప్రియుల నోరూరిస్తున్న మైసూర్ పాక్.. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ స్వీట్లలో 14వ స్థానంలో నిలిచింది. – మైసూర్ టాప్–50 స్వీట్లపై సర్వేలో.. ప్రఖ్యాత ఫుడ్ మ్యాగజైన్ ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల ఆన్లైన్లో వివిధ ఆహార పదార్థాలపై సర్వే చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వీధుల్లో అమ్మే మిఠాయిల్లో ప్రజాదరణ పొందినవి ఏవి అన్న అంశంపై ఓటింగ్ నిర్వహించింది. అందులో మైసూర్పాక్ 14వ స్థానంలో నిలవడం గమనార్హం. అంతేకాదు.. దీనికి స్వీట్ ప్రియుల నుంచి ఏకంగా 4.4 రేటింగ్ వచ్చింది. ఇక ఈ జాబితాలో అమెరికాకు చెందిన డోనట్స్ టాప్ ప్లేస్.. మన దేశానికే చెందిన కుల్ఫీ 24వ స్థానంలో, గులాబ్జమూన్ 26వ స్థానం సంపాదించాయి. రాజు కోసం వండిన మిఠాయి మైసూర్ పాక్ గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మైసూర్ రాజు అంతఃపురం వంటశాలలో మైసూర్ పాక్ పుట్టిందనే కథ. సుమారు 90 ఏళ్ల కింద మైసూర్ రాజు ఒడయార్ అంతఃపురంలో ముఖ్యమైన వంటగాడిగా మాదప్ప ఉండేవారు. అప్పటి రాజు కృష్ణరాజ ఒడయార్ భోజనం చేస్తున్న సమయంలో.. అక్కడ ఎలాంటి మిఠాయి లేదని మాదప్ప గుర్తించాడు. వెంటనే చక్కెర, నెయ్యి, శనగపిండి మిశ్రమంతో ఓ పాకం వంటి వంటకాన్ని తయారు చేశాడు. రాజు భోజనం చివరికి వచ్చేసరికి పాకం చల్లారి మెత్తటి ముద్దగా మారింది. మాదప్ప దాన్ని ముక్కలుగా కోసి వడ్డించగా.. రాజు తిని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇదేం మిఠాయి అని రాజు అడిగితే.. మైసూర్ పాకం అని మాదప్ప బదులిచ్చారు. అదే కాస్త మార్పులతో మైసూర్ పాక్గా మారింది. అంతఃపురం నుంచి అంగళ్లకు, ఇళ్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మైసూర్ పాక్ను తయారు చేసి అమ్ముతున్నా.. మన దేశంలో చేసినంత బాగా మరెక్కడా రుచిగా రాదని మిఠాయి ప్రియులు చెప్తుంటారు. -
నోకియా మొబైల్స్.. ఈ మోడల్స్ ఎప్పుడైనా చూశారా?
-
ఉత్తమ పోలీసులకు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ సేవలందించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. నూతన సంవత్సరంగా సందర్భంగా ఇవ్వాల్సిన ఈ పతకాలను దక్కించుకున్న పోలీసు, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల అధికారుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర శౌర్యపతకం, మహోన్నత సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, కఠిన సేవాపతకం, సేవాపతకం.. మొత్తం ఐదు కేటగిరీల్లో పతకాల విజేతల జాబితాను రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ విడుదల చేశారు. శౌర్య పతకాలు ఎవరికంటే... పోలీస్శాఖ నుంచి శౌర్య పతకాన్ని గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ పి.సతీశ్ దక్కించుకున్నారు. ఇంటెలి జెన్స్ విభాగం(కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, స్టేట్ ఇంటెలిజెన్స్ వింగ్)కు చెందిన ఎస్సై ఎస్ఎ కరీం, ఏఎస్సై శివ శంకర్, హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ ఖాజా మొయినుద్దీన్, ఎస్.రాజవర్ధన్రెడ్డి, ఏ. బాలాజీరావు, కానిస్టేబుళ్లు పి మోహన్, కె కిరణ్కుమార్, బి.లక్ష్మీ నారాయణ, బి.వీరస్వామి, ఎండీ అలీముద్దీన్లకు తెలంగాణ అగ్నిమాపకశాఖ నుంచి శౌర్య పతకం అందుకున్న వారిలో అసెంబ్లీ ఫైర్ స్టేషన్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వి.ధనుంజయ్రెడ్డి, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్లో ఎస్ఎఫ్ఓ( స్టేషన్ ఫైర్ ఆఫీసర్)గా పనిచేస్తున్న డి. మోహన్రావు, గౌలిగూడ ఫైర్ స్టేషన్ ఎస్ఎఫ్ఓ ఎన్ ప్రవీణ్కుమార్, మొఘల్పుర ఫైర్ స్టేషన్ ఫైర్మన్ బి.వెంకటేశ్వర రాజు, గౌలిగూడ ఫైర్స్టేషన్ ఫైర్మెన్ మహ్మద్ అస్గర్, అసెంబ్లీ ఫైర్స్టేషన్ ఫైర్మన్ టి. హరికృష్ణ, సికింద్రాబాద్ ఫైర్స్టేషన్ ఫైర్మన్ ఎం.హరికృష్ణలకు దక్కాయి. పోలీస్ శాఖ నుంచి మహోన్నత సేవా పతకాలు 16 మందికి, ఉత్తమ సేవా పతకాలు 94 మందికి, కఠిన సేవాపతకాలు 51 మందికి, సేవా పతకాలు 473 మందికి దక్కాయి. ఇల్లెందు ఫైర్స్టేషన్ డ్రైవర్కుమహోన్నత సేవా పతకం మహోన్నత సేవా పతకం ఖమ్మం జిల్లా ఇల్లెందు ఫైర్స్టేషన్ డ్రైవర్ ఆపరేటర్ కే వెంకటేశ్వర్లుకు దక్కింది. ఉత్తమ సేవా పతకాలు ముగ్గురికి, సేవా పతకాలు 14 మందికి దక్కాయి. ఏసీబీలో,,, ఏసీబీలో ఉత్తమ సేవాపతకాలు వరంగల్ రేంజ్ కానిస్టేబుల్ ఏ. నర్సయ్య, నిజామాబాద్ రేంజ్ కానిస్టేబుల్ జి సురేశ్, ఖమ్మం రేంజ్ హెడ్కాని స్టేబుల్ టి.క్రిష్ణ సూరిలకు దక్కించుకున్నారు. సేవాపతకాలు 22 మందికి దక్కాయి. విజిలెన్స్ విభాగం నుంచి ఇన్స్పెక్టర్ ఎం.హుస్సేని నా యుడు, కానిస్టేబుల్ ఎంఏ మసూద్లకు దక్క గా, సేవాపతకాలు ఇన్స్పెక్టర్ దండిక మహేశ్, కానిస్టేబుల్ డి.రాజేశ్కుమార్ దక్కించుకున్నారు. ఎస్పీఎఫ్లో.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు చెందిన వారిలో సబ్ ఇన్స్పెక్టర్ డి. తిరుపతిరెడ్డికి మహోన్నత సేవా పతకం దక్కింది. ఉత్తమ సేవా పతకాలు ముగ్గురికి, సేవాపతకాలు 15 మందికి దక్కాయి. కాగా, పతకాల జాబితా ఆరు నెలలు ఆలస్యం కావడంపై సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే, ఆలస్యంగానైనా పతకాలు దక్కినందుకు ఒకింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
టమాటా ధర పెరిగిందని టెన్షన్ వద్దు.. ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!
ప్రస్తుతం కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గడిచిన నెలలో ఎండల తీవ్రత.. దీనికి తోడు అకాల వర్షాలు..వీటన్నింటి కారణంగా సరైన దిగుబడి లేకుండా పోయింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో దిగుమతులు కూడాలేవు. దీంతో మొన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న కూరగాయాల ధరలు కాస్తా ఒకేసారి సామాన్యుడు కొనలేనంతగా పైకి ఎగబాకాయి. అందులోనూ.. టమాట ధర సెంచరీ కొట్టేసింది. మొన్నటి వరకు కిలో రూ. 20, రూ. 40గా ఉన్నాయి వంద రూపాయాలు పైనే పలుకుతోంది. అన్ని కూరల్లోనూ గ్రేవీ కోసం టమాటాలను విరివిగా వాడటం సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడూ కొనాలన్నా, ఉపయోగించాలన్న ఆలోచించాల్సిన స్థితి. టమాట వేస్తే ఆ కూర రుచే వేరే. ఆఖరికి రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు సైతం కస్టమర్లకు గ్రేవీతో కూడిన కూర సర్వ్ చేయాలంటే.. అక్కడ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కానీ గృహణులు ఇలాంటి సమయంలోనే తమ పాక శాస్త్ర ప్రావిణ్యాన్ని వెలికితీసి టమాటాకే డౌటు తెప్పించే రుచిగా వండాలి. ఈ ప్రత్యామ్నాయాలతో ఆ కొరతను భర్తీ చేసుకుంటూ టమాటా లాంటి రుచిని తెప్పించి చూపించ్చొఉ. అందుకు కాస్త తెలివిని ఉపయోగిస్తే చాలు. ఇంతకీ అవేమిటో చూద్దామా!. టమాటాలకు అల్ట్రనేటివ్గా వేటిని ఉపయోగించాలంటే.. ►టమాటా వేయగానే కాస్త పులుపు తీపి మిక్సింగ్లతో కూర రుచి అదిరిపోతుంది కదా. దాని ప్లేస్లో చింతపండును చక్కగా ఉపయోగించవచ్చు. అది కూడా కూరకు సరిపడగా పులుపు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడితే ఆ కూర రుచి అదర్స్ అనే చెప్పాలి. ►మార్కెట్లో దొరికే టమాటో పేస్ట్తో కూడా ఆలోటును సులభంగా భర్తి చేసుకోవచ్చు. తాజా టమాటాలు అందుబాటులో లేనప్పుడూ, కొనలేని స్థితిలో ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఇవి మార్కెట్లో కూడా సరసమైన ధరలోనే అందుబాటులో ఉంటాయి. ►ఇక రెడ్ బెల్ పెప్పర్ కూడా టమాటా మాదిరిగా కూరకు రుచిని ఇవ్వగలదు. పైగా కూర మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ►ఇంకోకటి ఆలివ్లు వీటిని ఉడికించి లేదా నేరుగా ఉపయోగించవచ్చు. పండిన ఆలివ్లు అయితే టమాటకు బెస్ట్ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు ►అలాగే ఉసిరి కూడా మంచి పులుపు వగరుతో కూడిని స్వీట్ని అందిస్తుంది. దీనిలో ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు దీనిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కారణంగా క్యాన్సర్-నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న ఆకుపచ్చ ఉసిరికాయ ఆకుపచ్చ టమాటాలను గుర్తుకు తెచ్చే పుల్లని రుచిని అందిస్తుంది. గృహుణులు ఇలాంటి ప్రత్నామ్నాయ చిట్కాలతో టమాటాకు ప్రత్యామ్నాయంగా వాడటం తోపాటు కుటుంబసభ్యులందరికి ఆరోగ్యకరమైన భోజనం పెట్టినవాళ్లం అవుతాం. సో మహిళలు మేథస్సు మన సోంతం. తెలివిగా ఇలాంటి చిట్కాలతో పెరుగుతున్న ధరలకు చెక్పెట్టేలా ఇలా ఇంటిని చక్కబెట్టుకోండి. (చదవండి: మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు) -
వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్స్
-
ప్రపంచంలో బెస్ట్ ఆక్టర్స్ ఎవరో తెలుసా..
-
AP: ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించాను
-
ప్రపంచంలోని టాప్ 10 బెస్ట్ ఐస్ క్రీమ్స్
-
2023లో చీప్ అండ్ బెస్ట్ కార్లు ఇవే (ఫోటోలు)
-
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్!
తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు కొనాలని చూస్తున్న వారి కోసం మే నెలలో మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రియల్మీ (Realme), రెడ్మీ (Redmi) తమ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్లను మే నెలలో లాంచ్ చేశాయి. రియల్మీ నార్జో ఎన్53 (Realme Narzo N53)j, Redmi A2 సిరీస్ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. భారతదేశంలో Realme Narzo N53 ధర రూ. 8,999 వద్ద ప్రారంభమవుతుంది. Redmi A2 Plus ధర రూ. 8,499. వీటితోపాటు పోకో సీ51 (Poco C51), మోటో జీ13 (Moto G13), శాంసంగ్ గెలాక్సీ ఎం13(Samsung Galaxy M13) వంటి ఫోన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ నార్జో ఎన్53 Narzo N53 6.74 అంగుళాల పెద్ద డిస్ప్లే, 50MP మెయిన్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ధర రూ. 8,999. ఇందులో విశేషం ఏంటంటే ఐఫోన్ 14ప్రో (iPhone 14 Pro) లాంటి డిజైన్ ఉండటం. యాపిల్ డైనమిక్ ఐలాండ్ నాచ్ సిస్టమ్ ఇందులో ఉంది. రియల్ ఏ2 ప్లస్ Redmi A2 Plus అద్భుతమైన ఫీచర్లలో ముఖ్యమైనవి దాని డిజైన్, Android 13 Go ఎడిషన్ సాఫ్ట్వేర్. అలాగే ఇందులో అతిపెద్ద 5,000mAh బ్యాటరీని ఇస్తుంది. తక్కువ ర్యామ్, స్టోరేజ్ (2GB/32GB) చాలు, ఫింగర్ప్రింట్ రీడర్ అవసరం లేదు అనుకునే వారికి ఈ ఫోన్ సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ. 5,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. Redmi A2 స్టాండర్డ్ మోడల్. ఇందులో 2GB/64GB వేరియంట్ రూ.6,499, 4GB/64GB వర్షన్ రూ.7,499కి లభిస్తుంది. మోటరోలా జీ13 Motorola G13 ఫోన్ వేగవంతమైన 90Hz డిస్ప్లే, స్టీరియో స్పీకర్లతో వస్తుంది.డాల్బీ అట్మాస్ సౌండ్ను ఇది విడుదల చేస్తుంది. కంటెంట్ కోసం వినియోగించేవారికి ఈ ఫోన్ అనువుగా ఉంటుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 4GB/128GB వేరియంట్ ధర రూ.9,999. పోకో సీ51 Poco C51 భారత్లో ఏప్రిల్లోనే లాంచ్ అయింది. 4GB/64GB వేరియంట్ ధర ప్రారంభంలో రూ. 8,499 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 7,249లకే లభిస్తోంది. ఇది చూడాటానికి Redmi A2 ప్లస్ లాగే ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం13 Samsung Galaxy M13 ఒక సంవత్సరం పాతదే అయినా నేటికీ దీనికి మంచి ఆదరణ ఉంది. ఈ ఫోన్ 4GB/64GB వేరియంట్ ధర ఇటీవల రూ. 11,999 నుంచి రూ. 9,699కి తగ్గింది. దీంతో దీన్ని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. డెడికేటెడ్ అల్ట్రావైడ్ శక్తివంతమైన కెమెరా సెటప్, 6,000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇదీ చదవండి: Flipkart Big Bachat Dhamaal Sale: స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు.. ఫ్లిప్కార్ట్లో అదిరిపోయే డీల్స్! -
ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ ఫుట్బాల్ స్టేడియంస్
-
భారతదేశంలోని టాప్ 10 ఉత్తమ ప్రకృతి ప్రదేశాలు (ఫోటోలు)
-
AP: స్టూడెంట్-టీచర్ నిష్పత్తిలో ఉత్తమం
సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, అత్యుత్తమ బోధనా విధానాలు, శిక్షణా కార్యక్రమాలు, నాడు – నేడు ద్వారా పాఠశాలలను మౌలిక వసతులతో తీర్చిదిద్దడం సత్ఫలితాలనిస్తున్నట్లు మరోసారి తేటతెల్లమైంది. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక తదితర ప్రోత్సాహాలతో ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరగగా అందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులను సమకూర్చడంతో నాణ్యమైన బోధన అందుతోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి (పీపుల్, టీచర్ రేషియో)లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థితిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇతర పెద్ద రాష్ట్రాల కన్నా ఏపీలో పరిస్థితి ఎంతో బాగున్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈమేరకు కేంద్ర విద్యా శాఖ ఈనెల 13వతేదీన పార్లమెంట్కు లిఖిత పూర్వకంగా తెలియచేసింది. రాష్ట్రాలవారీగా పీపుల్, టీచర్ రేషియో వివరాలను వెల్లడించాలని యూపీకి చెందిన బీజేపీ ఎంపీ అజయ్నిషాద్ కోరగా లోక్సభకు వివరాలను సమర్పించింది. ►2021–22 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు – ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రైమరీ స్కూళ్లలో 24 : 1గా, అప్పర్ ప్రైమరీలో 17 : 1 చొప్పున ఉంది. అంటే ప్రైమరీ తరగతుల్లో 24 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండగా అప్పర్ ప్రైమరీలో 17 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున టీచర్ ఉన్నారు. ►పాఠశాల విద్యకు ఆయువు పట్టు లాంటి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని జాతీయ విద్యాహక్కు చట్టం 2009లో స్పష్టంగా నిర్దేశించారు. ఈ చట్టం ప్రకారం పీపుల్, టీచర్ రేషియో ప్రైమరీలో 30 మంది విద్యార్ధులకు ఒక టీచర్ (30 : 1) ఉండాలి. అప్పర్ ప్రైమరీలో 35 మంది విద్యార్ధులకు ఒక టీచర్ (35 : 1) ప్రకారం ఉండాలని పేర్కొన్నారు. అయితే ఏపీలో అంతకంటే మెరుగ్గా టీచర్లు అందుబాటులో ఉండటం గమనార్హం. ►ఏపీలో పీపుల్, టీచర్ రేషియో జాతీయ సగటుకన్నా మెరుగ్గా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్ధులు – ఉపాధ్యాయుల నిష్పత్తి జాతీయ స్థాయిలో ప్రైమరీలో 28 : 1 కాగా అప్పర్ ప్రైమరీలో 24 : 1 చొప్పున ఉంది. పెద్ద రాష్ట్రాల కంటే మెరుగ్గా.. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతున్నట్లు కేంద్రం విడుదల చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా విద్యారంగంలో అగ్రస్థానంలో కొనసాగిన కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల కంటే ఏపీలో టీచర్ల నిష్పత్తి మెరుగైన స్థితిలో ఉన్నట్లు వెల్లడవుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం అప్పర్ ప్రైమరీలో 35 : 1 నిష్పత్తిలో పీపుల్, టీచర్ రేషియో ఉండాలి. ఏపీలో అంతకంటే మెరుగ్గా 17 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున ప్రభుత్వం టీచర్లను నియమించింది. -
జమ్మూకశ్మీర్ లిథియం నిల్వలు అత్యుత్తమ రకం
జమ్మూ: జమ్మూకశ్మీర్లో బయటపడిన లిథియం నిల్వలు అత్యుత్తమ రకానికి చెందినవని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీర్లోని రియాసి జిల్లాలో సుమారు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు భారత భూగర్భ పరిశోధన సంస్థ (జీఎస్ఐ)కనుగొన్న విషయం తెలిసిందే. ‘‘లిథియం కీలకమైన ఖనిజ వనరు. ఇది గతంలో దేశంలో అందుబాటులో లేదు. నూటికి నూరు శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. సాధారణంగా లిథియం నాణ్యత 220 పీపీఎం(పార్ట్స్ పర్ మిలియన్)గా ఉంటుంది. అయితే, కశ్మీర్లో కనుగొన్న లిథియం నాణ్యత 500 పీపీఎం ప్లస్గా ఉంది. లిథియం లభ్యతలో మన దేశం చైనాను మించిపోతుంది’’ అని కశ్మీర్ గనుల శాఖ కార్యదర్శి అమిత్ శర్మ చెప్పారు. -
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తో " చిట్ చాట్ "
-
మంచి మాట: అన్వేషణ ఏమిటి? ఎందుకు?
అన్వేషణ ఓ సాహసకృత్యం, ప్రయాణం, వేట, డేగ కన్ను, లోచూపు. ఒక కొత్తపుంత, అద్భుత సృజన, చింతన, సత్యశోధన, నిత్యసాధన, తపన. జ్ఞాన సముపార్జన. అన్వేషణ ఒక జీవిత పోరాటం. అన్వేషణ జీవితంలో అతి ముఖ్యమైన అంతర్భాగం. ప్రతి ప్రాణికి తప్పనిది, తప్పించుకో లేనిది. అయితే దీనిలో స్థాయీభేదముంటుంది. దీన్నే దృష్టి అంటాం. ఇది ఎవరి కెలా ఉంటుందనేది వారి వారి జీవిత నేపథ్యం, భౌగోళిక, సామాజికాంశాలతో పాటు చదువుల సారం మీద కూడ ఆధారపడుతుంది. హృదయ సంస్కారం కూడ ఈ అన్వేషణలో చేర్చతగ్గ ముఖ్యాంశమే. మన ఉనికికి భౌతికరూపమైన ఈ శరీరాన్ని పోషించుకునేందుకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునే యత్నంతో అన్వేషణ ప్రారంభమవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి అత్యంతావశ్యకమైనది. పక్షులు సైతం తమ పిల్లలకోసం ఆహారాన్ని సంపాదించి నోటిలో పెట్టటం సాధారణ దృశ్యం. ఆదిమానవుడు ప్రకృతి, సూర్యోదయ, చంద్రోదయాలను, మెరుపులను ఉరుముల శబ్దాన్ని రుతు మార్పులను చూసి, జంతువులను చూసి ఎంతగానో భయపడ్డాడు. క్రమేణా భయాన్ని వీడుతూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఈ మార్పులు సహజమన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. జీవితం నేర్పిన ఈ జ్ఞానం అతడికి ఆలోచనా శక్తినిచ్చింది. ఇదీ ఒక అన్వేషణే. ఎంతో గొప్పదైనది. మానవ సమూహాల సంఖ్య పెరిగిన కొద్దీ అహారవసరాలు పెరిగాయి. నివాసాల అవసరాలు వచ్చాయి. ఇది వ్యవసాయానికి, ఇళ్ల నిర్మాణానికి దారి తీసాయి. మనిషి భయం, అవసరం అతడిని కొత్త మార్గాలను, పద్ధతులను కనిపెట్టేటట్టు చేసింది. చేస్తూనే ఉంటుంది. ఇది మనిషికి ఉన్న ఆలోచనా శక్తి వల్ల వచ్చింది. మనిషికున్న ఈ అన్వేషణా మేధ ఎప్పటికప్పుడు నూతన ఒరవళ్ళకు శ్రీకారం చుడుతూనే ఉంటుంది. ‘అవసరం’ అన్వేషణను ప్రేరేపించే అంశాలలో మొట్టమొదటిది. రెండవది ‘ఆసక్తి లేదా ‘జిజ్ఞాస.’ మనిషికి ఉత్సకత ఉండాలి. ఇది ప్రశ్నించేటట్టు చేస్తుంది. ప్రతిదాన్ని నిశితంగా, లోతుగా చూసే చూపునిస్తుంది. అది ప్రకృతి పరమైనది కావచ్చు. లేదా ఆత్మానుగతమైనదీ కావచ్చు. ఒక శాస్త్రవేత్త, ఒక సిద్ధార్థుడు దీనికి మనకు గొప్ప నిదర్శనంగా నిలుస్తారు. ఈ సృష్టి ఎలా ఏర్పడింది.. జీవపరిణామం ఏమిటన్నది ఒకరి ఆలోచన అయితే, మరొకరిది ఈ సృష్టిలో మనిషి ఆస్తిత్వమేమిటి, చావు పుట్టుకల చట్రం నుండి బయటపడేదెలా అన్న ఆలోచనమరొకరిది. మార్గాలేవేరు అంతే. ఇద్దరూ మేధోమధనం చేసేవారే. ఇరువురూ జ్ఞానసాధకులే, సత్యశోధకులే. సామాన్యులకు అర్థం కాని, తట్టని జీవిత రహస్యాలను విడమరచి చెప్పే మాన్యులే. ఈ అన్వేషణ శక్తి సహజాతం కానప్పుడు అలవరచుకోవటం కష్టం. ఎవరైతే ఆ శక్తి లేదనుకుంటారో వారు ప్రయత్నం చెయ్యాలి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలనగా చూడాలి. మనుషుల ప్రవర్తనను గమనిస్తూ విశ్లేషణ చేసుకోవాలి. ఈ అన్వేషణ అనే లోతైన సముద్రంలో తార్కికత, గొప్ప అవగాహనా శక్తి, కఠోర శ్రమలతోపాటు గొప్ప జిజ్ఞాస తోడు చేసుకుని ఈదగలిగితే రత్నాలు.. మణులు, మాణిక్యాలు దొరుకుతాయి. అయితే, ఇంతటి సాధన.. శోధన కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి వారికే జగతి జేజేలు పలుకుతుంది. అన్వేషణకు మార్గమే కాదు లక్ష్యం కూడ సరైనదిగా ఉండాలి. వక్రమార్గంలో స్వార్థపూరితంగా చేసే అన్వేషణ ప్రపంచానికి ఏ ప్రయోజనాన్నీ ఇవ్వకపోగా చేటు చేస్తుంది. వ్యక్తికైనా, సమాజానికైనా, దేశానికైనా, పరశువేది, అమృతం గురించి అన్వేషించిన వాళ్ళ జీవితాలు ఎలా వృథా అయ్యాయో చరిత్ర చెప్పనే చెప్పింది. కొన్నిదేశాలు చేసే ప్రయోగాలు, శాస్త్రపరిశోధనలు మానవాళికెంత హాని కలిగించాయో మనకు తెలుసు. అందుకనే అన్వేషణకు ఉత్తమ లక్ష్యం ఉండాలి. అప్పుడే ఉత్తమ సాధనాపథం అమరుతుంది. ఉత్తమ సాహిత్యం చదువుతున్నప్పుడు ఈ అన్వేషణ అనే వివేచనా నయనం అవసరం. అప్పుడే ఆ కవి లేదా రచయిత సృజనలోని విశిష్టతను పసిగట్టగలం. ఆ కావ్యంలోని భాషా సొబగులను.. కవి భావనా పటిమను, కవి చూసిన సాహితీ లోతులను.. ఆ కావ్యప్రయోజనాన్ని అర్థం చేసుకోగలం. లోపాలను చూడగలిగే విమర్శనాశక్తికి ఈ అన్వేషణ గొప్ప సాధనమవుతుంది. అన్వేషణంటే కొందరి భావన కొత్త ప్రదేశాలను సందర్శించటం, కొత్త వ్యక్తులను కలవటం. వారి సంస్కృతిని దాని గొప్పదనాన్ని చూడగలగటం. అనుసరణ యోగ్యమైతే స్వీకరించటం. రక్త సంబంధీకులు, స్నేహితులు, హితులు, శ్రేయోభిలాషులు, ఇరుగుపొరుగు, ముఖ పరిచయం కలవారు... ఇలా అనేకమంది తో సాగేదే మన ఈ జీవితనౌక. దీనిలో మనతో, మన భావాలతో, మన ధోరణితో ఒదిగి మనతో ఎక్కువకాలం పయనించ గలిగే వారి కోసం మనం అన్వేషించాలి. మనకు కష్టం కలిగినవేళ నేనున్నాననే వారి చేతి స్పర్శ, బాధపడే సమయాన మనకొరకు చెమ్మగిల గల నయనం, మనం తలను వాల్చేటందుకు ఒక భుజం, మనం తలవాల్చ గల ఎద మనకు కావాలి. ఒక సహచర్యం ప్రతి ఒక్కరికీ అవసరం. అందుకోసం ప్రతి ఒక్కరూ వెతకాలి. ఆస్తికులకి అన్వేషణ అంటే ఆత్మ శోధన. ఆత్మతత్వమేమిటో తెలుసుకోవాలనే తపన. జీవాత్మ, పరమాత్మల సంబంధం, సంలీనం కోసం ఆరాటం. నాస్తికులకు, మానవతా వాదులకు మాధవ సేవ కన్నా మానవ సేవ ముఖ్యం. అన్నార్తుల, బాధార్తుల, అనాథలను ఆదుకోవాలనే తపన వీరిది. ఇది కూడా ఒక విధమైన అన్వేషణే. ఇది కూడా అలవర చుకోవలసిన అన్వేషణమే. విద్యను గరిపే గురువులకు అన్వేషణాశక్తి ఎంత అవసరమో దానిని నేర్చుకునే విద్యార్థులకు అది అంతే ఆవశ్యకం. గురువు తన జ్ఞానాన్ని నిత్యవసంతం చేసుకోవాలి. క్లిష్టమైన అంశాలను శిష్యులకు బోధించే సులభమైన పద్ధతులను వెతకాలి. శిష్యులు కూడ గురువు అందిస్తున్న జ్ఞానాన్ని తరచి చూసే అలవాటు చేసుకోవాలి. ఈ రకమైన అన్వేషణ వల్ల తాను పొందే జ్ఞాన సత్యాసత్యాలు తెలుస్తాయి. పరిశోధకులకు ఈ అన్వేషణ చాలా అవసరం. అంతవరకూ ప్రపంచం విశ్వసిస్తున్న ఒక నిజాన్ని, ఒక సిద్ధాంతాన్ని త్రోసిరాజని నిరూపణ చేసే శక్తి అన్వేషణ మనిషికిస్తుంది. అసలు నిజమేమిటో ప్రపంచానికి చాటాలంటే మనకెంతో స్థైర్యం ఉండాలి. చరిత్రను పరిశీలిస్తే ఎంతోమంది వేదాంతులు, తత్త్వవేత్తలు, సిద్ధాంతకర్తలు, శాస్త్రవేత్తలు తాము శోధించి తెలుసుకున్న సత్యాన్ని తమ ప్రాణాలను సైతం లెక్కచేయక జగతికి ప్రకటించి జగత్విఖ్యాతులై ప్రాతః స్మరణీయులయ్యారో తెలుస్తుంది. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
2021లో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్ఫోన్స్ ఇవే..!
2021 పలు దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలకు బిజినెస్ ‘కొంచెం ఇష్టం..కొంచెం కష్టం’గా గడిచింది. మరికొన్ని కంపెనీలకేమో మూడు పువ్వులు ఆరుకాయలుగా గణనీయమైన వృద్ధిని సాధించాయి. దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలను చిప్స్ కొరత, సప్లై చైన్ వంటి సమస్యలు వెంటడాయి. అయినప్పటికీ స్మార్ట్ఫోన్ కంపెనీలకు భారత్ కాసుల వర్షాలను కురిపించాయి. 2021 స్మార్ట్ఫోన్ కంపెనీలకు గొప్ప సంవత్సరంగా నిలిచింది. 2021లో వచ్చిన సూపర్ స్మార్ట్ఫోన్స్ జాబితాను ప్రముఖ టెక్ వెబ్సైట్ గాడ్జెట్స్ 360 ఎంపిక చేసింది. ఆయా స్మార్ట్ఫోన్ల పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ధరలు ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని గాడ్జెట్స్ 360 ఈ ఏడాది వచ్చిన సూపర్ స్మార్ట్ఫోన్స్ లిస్ట్ను రిలీజ్ చేసింది. కాగా గాడ్జెట్స్ 360 ఎంచుకున్న స్మార్ట్ఫోన్లలో ఏ మోడల్స్ కూడా 10/10 స్కోర్ను సాధించలేకపోయాయి. గాడ్జెట్స్ 360 ఎంపిక స్మార్ట్ ఫోన్లలో యాపిల్, వివో, రియల్ మీ, ఎంఐ, శాంసంగ్, వన్ప్లస్ స్మార్ట్ఫోన్స్ నిలిచాయి ఈ ఏడాది వచ్చిన బెస్ట్ స్మార్ట్ఫోన్స్ ఇవే..! ►యాపిల్కు చెందిన ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐపోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్స్ తొలి నాలుగుస్థానాల్లో నిలిచాయి. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్ప్లే పరంగా మిగతా స్మార్ట్ఫోన్ల కంటే ముందు స్థానంలో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ఫోన్ ధరలు అధికంగా ఉండడంతో కొంతమంది వ్యక్తులకే మాత్రమే పరిమితమయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్స్ ధరలు అధికంగా ఉండడంతో 10/10 స్కోర్ను సాధించలేకపోయింది. ►రియల్మీ స్మార్ట్ఫోన్ రియల్ మీ జీటీ నిలిచింది. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్ప్లే, కెమెరా, విషయంలో అద్భుతమైన స్మార్ట్ఫోన్గా ఉంది. యాపిల్ స్మార్ట్ఫోన్లతో పోల్చితే ఈ స్మార్ట్ఫోన్ ధర తక్కువగా ఉండడంతో రియల్మీ జీటీ అమ్మకాలు భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ►ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ ఈ ఏడాది రిలీజ్ చేసిన స్మార్ట్ఫోన్లలో Mi 11 అల్ట్రా అత్యంత శక్తివంతమైన ఫోన్గా నిలిచింది. శామ్సంగ్ గెలాక్సీ S21 కు గట్టిపోటీనే ఇచ్చింది. ►భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఉత్తమమైన స్మార్ట్ఫోన్గా Samsung S21 అల్ట్రా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో కెమెరా ఫీచర్స్ అదరగొట్టాయి. ►కెమెరాస్ విత్ గింబల్ తో వచ్చిన స్మార్ట్ఫోన్లలో Vivo X70 Pro+ అద్బుతంగా ఉంది. సొగసైన డిజైన్, IP68 రేటింగ్, పదునైన 120Hz డిస్ప్లే, అద్భుతమైన వీడియో స్థిరీకరణ ఈ స్మార్ట్ఫోన్ సొంతం. ►వన్ప్లస్ స్మార్ట్ఫోన్స్లో OnePlus 9 ప్రో అద్బుతమైన పనితీరును కనబర్చింది.50W వైర్లెస్ ఛార్జింగ్ , క్లాస్-లీడింగ్ అల్ట్రా-వైడ్ కెమెరా వంటి కొన్ని కొత్త గుర్తించదగిన ఫీచర్లు వన్ప్లస్ 9 ప్రొలో ఉన్నాయి. చదవండి: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ లిస్ట్లో ఒకేఒక్కడు! అంతలా ఎందుకు వెతికారంటే.. -
ఏడాదిన్నర తర్వాత రోడ్డుపైకి.. ‘ఓపెన్ టాప్’ పునఃప్రారంభం
దాదర్ (ముంబై): పర్యాటకులను ఆకట్టుకునేందుకు బుధవారం నుంచి ఓపెన్ టాప్ (టాప్ లెస్) బస్సులను పునఃప్రారంభించాలని బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్టు (బెస్ట్) నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించింది. దీంతో ముంబైకి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు, నగరంలోని వారసత్వ కట్టడాలు, ఇతర పర్యాటక ప్రాంతాలను ఈ ఓపెన్ టాప్ బస్సుల ద్వారా తిలకించే సౌకర్యాన్ని బెస్ట్ కల్పించింది. దీంతో నష్టాల్లో నడుస్తున్న సంస్థకు ఈ బస్సులు కొంత ఆదాయాన్ని తెచ్చిపెడతాయని బెస్ట్ అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ముంబై నగర అందాలను తిలకించేందుకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. లాక్డౌన్కు ముందు ఈ టాప్ లెస్ బస్సులు పర్యాటకులకు సేవలు అందించాయి. కానీ, లాక్డౌన్ అమలులోకి వచ్చాక ఈ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అయితే, ఇప్పుడు పరిస్థితులు యథాస్థితికి రావడంతో ఇన్నాళ్లూ డిపోలకే పరిమితమైన ఓపెన్ టాప్ బస్సులను మళ్లీ రోడ్డుపైకి తేవాలని బెస్ట్ భావించింది. ఈ మేరకు దీపావళి పర్వదినానికి ముందే ఈ బస్సులను పునఃప్రారంభించాలని బెస్ట్ నిర్ణయించింది. చదవండి: (మళ్లీ తెరపైకి ‘ముల్లై పెరియార్’) అయితే, ఈ బస్సులు రోజంతా నడవవని, కేవలం సాయంత్రం తరువాతే రోడ్డుపైకి వస్తాయని ఓ అధికారి తెలిపారు. ప్రముఖ కట్టడాలైన గేట్ వే ఆఫ్ ఇండియా, బీఎంసీ ప్రధాన కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ), ప్రిన్స్ వెల్స్ ఆఫ్ మ్యూజియం, మంత్రాలయ, అసెంబ్లీ భవనం, ఎన్సీపీఏ, మెరైన్ డ్రైవ్, చౌపాటి, చర్చిగేట్ రైల్వే స్టేషన్, ఓవల్ మైదాన్, రాజాబాయి టవర్, హుతాత్మ చౌక్, హార్నిమన్ సర్కిల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏషియాటిక్ లైబ్రరీ, ఓల్డ్ కస్టమ్ హౌస్ తదితరాల కట్టడాలను తిలకించేలా ఈ బస్సుల రూట్ మ్యాప్ ఉంటుందన్నారు. ఈ బస్సుల్లో పై అంతస్తులో కూర్చునేవారు రూ. 150, కింది అంతస్తులో కూర్చునేవారు రూ. 75 చొప్పున చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మొదటి బస్సు గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి సాయంత్రం 6.30 గంటలకు బయలు దేరనుంది. తరువాత 7.45 గంటలకు ఓ బస్సు, 8.00 గంటలకు మరో బస్సు ఉండనుండగా, చివరి బస్సు 9.15 గంటలకు బయలు దేరుతుంది. ఈ బస్సు టికెట్లు సీఎస్ఎంటీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చౌక్, గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న బెస్ట్ సంస్థకు చెందిన సబ్ టికెట్ కౌంటర్ల వద్ద లభిస్తాయని బెస్ట్ సంస్థ అధికారులు తెలిపారు. -
రూ.1000 కంటే తక్కువ ధరలో బ్రాండెడ్ హెడ్ఫోన్స్ ఇవే..!
మనకు నచ్చిన సంగీతాన్ని వింటుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏలాంటి డిస్టారెబెన్స్ లేకుండా ఇయర్ఫోన్స్ పెట్టుకొని వింటే ఆ మజానే వేరు. ఇయర్ఫోన్స్ ఒక్కింతా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటాయి. పలు స్మార్ట్ఫోన్ కంపెనీలు ఫోన్లతో పాటుగా ఇయర్ఫోన్స్ను ఒకప్పుడు అందించేవి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు స్మార్ట్ఫోన్ కంపెనీలు కస్టమర్లకు ఇయర్ఫోన్లను అందించడం నిలిపివేశాయి. దీంతో కచ్చితంగా సపరేటుగా ఇయర్ఫోన్లకు కొనాల్సిందే. ఇయర్ఫోన్లను కొనేటప్పుడు ఏ కంపెనీకి చెందినవి బాగుంటాయి..? ఏంత ధరలో ఇయర్ఫోన్లను కొనాలి..? అనే ప్రశ్నలు మనందరికీ తొలచివేస్తుంది. ఇలా ఏ కంపెనీ ఇయర్ఫోన్లను కొనాలనే సందేహం ఉన్నవారి కోసమే.. ఈ వార్త! రూ.1000 కంటే తక్కువ రేట్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే ఇయర్ఫోన్లను మీకోసం అందిస్తున్నాం... రూ.1000 కంటే తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ఫోన్స్ ఇవే..! 1.బోట్ బాస్హెడ్స్ 225 బోట్ కంపెనీకి చెందిన క్లాసిక్ ఇయర్ఫోన్లలో ఇది ఒకటి. మీ చెవులకు బాగా సరిపోయే విధంగా వీటి డిజైన్ ఉంటుంది. వీటి ధర రూ. 399 2. బోట్ బాస్ హెడ్స్ 242 ఈ ఇయర్ఫోన్స్ ఐపీఎక్స్4 రేటింగ్ను కలిగి ఉంది. ఇన్ లైన్ మైక్తో వస్తుంది. తేలికగా ఉంటాయి. వీటి ధర రూ. 399 3.జెబీఎల్ సీ200ఎస్ఐ సౌండ్, అకౌస్టిక్ పరికారాల్లో హర్మన్ కంపెనీకి చెందిన జెబీఎల్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ ఇయర్ఫోన్స్ ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. జెబీఎల్ సీ200ఎస్ఐ ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్ను కలిగి ఉంది, ఇది మన్నికైనదిగా ఉంటుంది. వీటి ధర రూ. 749. 4. రియల్మీ బడ్స్ 2 నియో రియల్మీ స్మార్ట్ఫోన్ తన కంపెనీ నుంచి ఇయర్ఫోన్లను కూడా అందిస్తోంది. రియల్మీ బడ్స్ టీపీయూ మెటిరియల్తో తయారుచేశారు. రియల్మీ బడ్స్ 2 చెవులకు బాగా సరిపోయే విధంగా ఇన్-ఇయర్ డిజైన్ను కలిగి ఉంది. స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. వీటి ధర రూ. 399. 5. బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL అనేది వైర్లెస్ నెక్బ్యాండ్. బ్లూటూత్ 5.0 ఆధారంగా పనిచేస్తుంది. ఇది 12 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. X1-WL పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 1-2 రోజుల స్టాండ్బై టైమ్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా IPX5 రేటింగ్ కలిగి ఉంది. వీటి ధర రూ. 849. గమనిక: ఎక్కువసేపు ఇయర్ఫోన్లను చెవులకు తగిలించుకోవడం మంచింది కాదు. పై ధరలు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్లో పేర్కొన్న ధరలు. -
ఉత్తమ లఘు చిత్రంగా ‘జయహో జన నాయకా’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2020కి ప్రకటించిన ‘నవరత్నాలు’ అభివృద్ధి పథకాలపై తీసిన లఘు చిత్రాల(షార్ట్ ఫిలిం)లో ‘జయహో జన నాయకా’ ఉత్తమ లఘుచిత్రంగా ఎంపికైంది. లఘు చిత్రాల ఫెస్టివల్కు మొత్తం 35 ఎంట్రీలొచ్చాయి. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగం అభివృద్ధి సంస్థ చైర్మన్ టీఎస్ విజయచందర్ అధ్యక్షతన బీఎన్వీ రామకృష్ణంరాజు, ఎంవీ రఘులు కమిటీ సభ్యులుగా లఘు చిత్రాలను పరిశీలించారు. ప్రథమ బహుమతికి ఒకటి, ద్వితీయ బహుమతికి రెండు, తృతీయ బహుమతికి మూడు చొప్పున మొత్తం ఆరు లఘు చిత్రాలను ఎంపిక చేశారు. వాటి నిర్మాతలకు త్వరలో నగదు బహుమతులతో పాటు ప్రశంస పత్రాలు ఇవ్వనున్నట్టు విజయచందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ బహుమతి: ‘జయహో జన నాయకా’.. నిర్మాత వజ్రగిరి నాగరాజు(విజయవాడ), బహుమతి రూ.లక్ష ద్వితీయ బహుమతి: ఈ కేటగిరీలో మొదటి లఘుచిత్రం ‘నవ రత్నాలు మ్యూజికల్ ప్రెజెంటేషన్’, నిర్మాత ఎస్బీఎస్ శ్రీనివాస్ పోలిశెట్టి(తూర్పుగోదావరి పెద్దాపురం), రూ.50 వేలు. రెండో లఘు చిత్రం ‘జగనన్న నవ రత్నాలు’.. నిర్మాత శివశ్రీ మీగడ(విశాఖ), రూ.50 వేలు తృతీయ బహుమతి: ఈ కేటగిరీలో మొదటి లఘుచిత్రం ‘బోర్న్ ఎగైన్’(మళ్లీ పుట్టాను).. నిర్మాత టీఎస్ లక్ష్మీనారాయణమూర్తి(కాకినాడ), రూ.25 వేలు. రెండో లఘుచిత్రం ‘రాజన్న రాజ్యంలో ఓ సీత కథ’.. నిర్మాత టి.వేణుగోపాల్కృష్ణ(పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు), రూ.25 వేలు. మూడో లఘు చిత్రం ‘పేదలందరికీ ఇళ్లు’.. నిర్మాత చండూర్ సుందరరామశర్మ(గుంటూరు), రూ.25 వేలు. -
కరోనా: కొత్త అవతారం ఎత్తిన ఏసీ బస్సులు
ముంబై : కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వారిని ఆసుపత్రులకు తరలించడానికి గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఓ కొత్త ఉపాయం ఆలోచించింది. ఏసీ బస్సులను అంబులెన్సుల్లాగా మార్చి వాటిని రోగుల రవాణా కోసం ఉపయోగించాలని భావించింది. అనుకున్నదే తడవగా బ్రిహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్టు(బెస్ట్)క్ ఆ పనిని అప్పగించింది. దీంతో బెస్ట్ ఓ ఏడు ఏసీ బస్సులను అంబులెన్సులుగా మార్చి బీఎంసీకి అందించింది. వీటిలో డ్రైవర్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ప్రత్యేక ఏర్పాట్లు, ఎక్కువ మందిని తరలించేందుకు సౌకర్యవంతంగా ఉండటంతో మరిన్ని బస్సులను అంబులెన్సుల్లాగా మార్చాలని బీఎంసీ.. బెస్ట్కు పురమాయించింది. (మన దగ్గర పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? ) బస్సు అంబులెన్స్ ప్రస్తుతం బీఎంసీ చేతిలో ఉన్న ఏడు బస్సు అంబులెన్స్లు తమ సేవల్ని మొదలుపెట్టాయి. కాగా, లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని వందల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్నింటిని మాత్రం అత్యవసర సేవల కోసం.. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల రవాణా కోసం వాడుతున్నారు. ( వైరలైన కాజోల్ మెహందీ ఫంక్షన్ ఫొటో! ) -
జిల్లాకు ఉత్తమ ఏరువాక కేంద్రం అవార్డు
నడకుదురు(కరప): రాష్ట్ర స్థాయిలో తూర్పుగోదావరి జిల్లా ఏరువాక కేంద్రం 2015–16 సంవత్సరానికి గాను ఉత్తమ కేంద్రంగా ఎంపికైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 జిల్లాల్లోని ఏరువాక కేంద్రాల్లో జిల్లా ఎంపిక కావడం విశేషం. నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈనెల 4న జరిగిన 46వ ప్రాంతీయ వ్యవసాయ, విస్తరణ సలహామండలి సమావేశంలో వ్యవసాయశాఖ డైరక్టర్ ధనంజయ్రెడ్డి చేతులమీదుగా జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పీఎల్ఆర్జే ప్రవీణ అవార్డును అందుకున్నారు. కరప మండలం నడకుదురులోని ఏరువాక కేంద్రం కార్యాలయంలో మంగళవారం అవార్డు తీసుకున్న విషయాలను ఆమె వెల్లడించారు. జిల్లాలో అయిదేళ్లుగా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు అందించిన సూచనలు, సలహాలు, క్షేత్ర ప్రదర్శనలు, క్షేత్ర సందర్శనలు, రైతులకు, వ్యవసాయ విస్తరణాధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు వంటివి పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు ఇచ్చారన్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనంజయ్రెడ్డితోపాటు అక్కడి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎన్వీ నాయుడు, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నట్టు డాక్టర్ ప్రవీణ వివరించారు. -
ఉత్తమ యూనిట్గా కాకినాడ ఎన్సీసీ ఆంధ్రా ఎయిర్ వింగ్
బాలాజీచెరువు (కాకినాడ) : రాజస్ధాన్ రాష్ట్రం జోథ్పూర్లో అక్టోబర్ 15 నుంచి 26వ తేదీ వరకూ జరిగిన ఆల్ఇండియా వాయు సైనిక్ క్యాంపులో కాకినాడ ఆంధ్రా ఎయిర్ వింగ్ టెక్నికల్ ఎన్సీసీ యూనిట్ ఉత్తమ యూనిట్గా ఎంపికైంది. ఆ వివరాలను కాకినాడ న్ సీసీ యూనిట్ వింగ్ గ్రూపు కెప్టెన్ ఎల్వీఎస్ సుధాంశ బుధవారం జేఎన్ టీయూకేలో విలేకరుల సమావేశంలో వివరించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ద్వితీయస్ధానం సా«ధించి జోథ్పూర్లో జరిగిన జాతీయ పోటీల్లో ఉత్తమ యూనిట్గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన 17 డైరెక్టరేట్ల నుంచి 600 మంది ఎన్ సీసీ క్యాడెట్లు ప్లైంగ్, ఫైరింగ్, ఎన్ సీసీ సిలబస్ రాత పరీక్ష, టెంట్ వేసే విధానం వంటి పోటీలు నిర్వహించగా కాకినాడ యూనిట్ నుంచి వెళ్లిన పీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పి.ధనుంజయ్, కె.సత్యనారాయణ, తేజస్వినీదేవి, ఆర్.నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్తమ యూనిట్గా గుర్తింపు పొందేందుకు కృషిచేశారన్నారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్యాంపులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఇస్తారని తెలిపారు. కాకినాడ ఎన్ సీసీ యూనిట్ వింగ్కు ప్రత్యేక గుర్తిపు తెచ్చిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులతో పాటు ఎన్ సీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యమైన ఉత్పత్తి సాధించాలి
మల్టీ డిపార్ట్మెంట్æ కమిటీ సమావేశాల్లో సీజీఎం వెంకటేశ్వరరావు గోదావరిఖని/యైటింక్లయిన్కాలనీ : సింగరేణిలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి అందరూ కృషి చేయాలని ఆర్జీ–1 సీజీఎం, ఆర్జీ–2 ఇన్చార్జి సీజీఎం వెంకటేశ్వర్రావు కోరారు. ఆర్జీ–1 పరిధిలోని జీడీకే–1వ గని, ఆర్జీ–2 పరిధిలోని ఓసీపీ–3 కృషిభవన్లో బుధవారం వేర్వేరుగా నిర్వహించిన మల్టీడిపార్ట్మెంటల్ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతేడాది ఉద్యోగులందరూ మల్టీ డిపార్ట్మెంట్ కమిటి ద్వారా సమావేశాలు నిర్వహించుకుని ఆయా గనులు, డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో, సమన్వయంతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సంస్థను లాభాల బాట పట్టించారని తెలిపారు. ఈసారి వర్షాల కారణంగా సెప్టెంబర్ వరకు ఉత్పత్తి, ఉత్పాదకత విషయంలో కొంత వెనుకబడి ఉన్నామని, దీనిని అధిగమించి ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి అంకితభావంతో పని చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు ప్రణాళిక బద్దంగా ముందుకు సాగితే వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధిం^è డం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో బొగ్గుకు డిమాండ్ తగ్గిపోయిందన్నారు. విదేశాలను నుంచి తక్కువ ధరకే బొగ్గు మార్కెట్లోకి దిగుమతి కావడంతో బొగ్గు ధరలు పడిపోయాయని తెలిపారు. విద్యుత్ సంస్థలకు సరఫరా చేసే బొగ్గు ధరను పెంచే అవకాశం లేకుండా పోయిందని, కేవలం సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేసే బొగ్గు ధరమాత్రమే మనచేతుల్లో ఉందన్నారు. దీనికోసం ఇ–యాక్షన్ ద్వారాబొగ్గు అమ్మకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఉద్యోగులపై ఒత్తిడి పెంచి అధికారులు చేతులు ఎత్తేస్తే కాదని అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. భారీ యంత్రాల నిర్వహణపై దృష్టిసారించి పనిగంటలు పెంచుకోవాలని సూచించారు. సంస్థ మిగులు బడ్జెట్ కోసం అవుట్ సోర్సింగ్, ట్రాన్స్పోర్టు కోల్కాంట్రాక్టు ద్వారా పనులు నిర్వహిస్తుందని తెలిపారు. ఇది ఎంతో కాలం ఉండబోదన్నారు. రాబోయే రోజుల్లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచకతప్పదని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రాన్స్పోర్టు ధరలు విపరీతంగా పెరిగాయని, ఇలాంటి పరిస్థితుల్లో సంస్థ పరిస్థితి అర్థం చేసుకుని ముందుకు సాగాలన్నారు. సమావేశాల్లో ఐఈడీ ఏజీఎం ప్రసాద్రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేవీ.రావు సాధించాల్సిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను, కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు, రక్షణ పరమైన చర్యలు, అందరి బాధ్యత తదితర విషయాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశాల్లో ఎస్ఓటూ సీజీఎం సుధాకర్రెడ్డి, ఎస్వోటూ జీఎం రవీందర్, ఏజెంట్లు సాంబయ్య, రమేశ్, పర్సనల్ డీజీఎం బి.హనుమంతరావు, ఎన్వీ.రావు, ఈఅండ్ఎం ఏజీఎం సాయిరాం, ఫైనాన్స్ డీజీఎం రాజేశ్వర్రావు, క్వాలిటీ డీజీఎం భైరయ్య, మేనేజర్లు బీవీ.రమణ, వెంకటయ్య, సంక్షేమాధికారి శ్రీనివాస్, నాయకులు సారంగపాణి, యాదగిరి సత్తయ్య, షబ్బీర్అహ్మద్, రమేశ్రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమించాం..ఫలితాలు పొందుతున్నాం
‘టీవీఎస్’ జిల్లా ప్రథమ మహాసభలో దేశపతి శ్రీనివాస్ కొత్తగూడెం అర్బన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అంతా ఉద్యమించామని, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలను పొందుతున్నామని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షులు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఐఎంఏ హాల్లో సంఘం జిల్లా ప్రథమ మహాసభలో ప్రసంగించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తొలి జిల్లా ఖమ్మంఅని, అందులో కొత్తగూడెం చైతన్యవంతమైన ప్రాంతమని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల కాలంలో మాదిరి కాకుండా..ఇప్పుడు ప్రజలు నేరుగా తమ ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకునే రోజులొచ్చినయన్నారు. ప్రభుత్వం కూడా అన్ని వర్గాలవారి సంక్షేమం కోసం భూ పంపిణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సమితి రాష్ట్ర కార్యదర్శులు విజయభాస్కర్రెడ్డి, వెంకన్న, గిరిజన విభాగం నాయకులు మాలోత్ బిక్షపతినాయక్, రాష్ట్ర ప్రధన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సోషల్ ఫౌండేషన్ నర్సింహరెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ అయితా శ్రీధర్, జిల్లా అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలతో విజ్ఞానం.. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పొందొచ్చని ప్రముఖ కవి, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో కథా, కవితా రచన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. చిన్నారులకు ఉత్సాహాన్ని నింపే ఉత్సవం బాలోత్సవ్ మాత్రమేనని అన్నారు. విద్యార్థులు జాలి, కరుణ, దయ పంచే వారుగా తయారు కావాలన్నారు. ఎక్కడైతే కళలు గొప్పగా ఉంటాయో అక్కడ సమాజం బాగుంటుందని చెప్పారు. బాలోత్సవ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్బాబు మాట్లాడుతూ..విద్యార్థులు కవితలు, కథలు రాయడం, చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కవులు, కథకులు పెద్దింటి అశోక్, కుప్పిలి పద్మ, వాసిరెడ్డి నవీన్, పద్మారావు, మాధవరావు, బాల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉద్యమించాం..ఫలితాలు పొందుతున్నాం
‘టీవీఎస్’ జిల్లా ప్రథమ మహాసభలో దేశపతి శ్రీనివాస్ కొత్తగూడెం అర్బన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అంతా ఉద్యమించామని, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలను పొందుతున్నామని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షులు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఐఎంఏ హాల్లో సంఘం జిల్లా ప్రథమ మహాసభలో ప్రసంగించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తొలి జిల్లా ఖమ్మంఅని, అందులో కొత్తగూడెం చైతన్యవంతమైన ప్రాంతమని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల కాలంలో మాదిరి కాకుండా..ఇప్పుడు ప్రజలు నేరుగా తమ ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకునే రోజులొచ్చినయన్నారు. ప్రభుత్వం కూడా అన్ని వర్గాలవారి సంక్షేమం కోసం భూ పంపిణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సమితి రాష్ట్ర కార్యదర్శులు విజయభాస్కర్రెడ్డి, వెంకన్న, గిరిజన విభాగం నాయకులు మాలోత్ బిక్షపతినాయక్, రాష్ట్ర ప్రధన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సోషల్ ఫౌండేషన్ నర్సింహరెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ అయితా శ్రీధర్, జిల్లా అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలతో విజ్ఞానం.. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పొందొచ్చని ప్రముఖ కవి, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో కథా, కవితా రచన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. చిన్నారులకు ఉత్సాహాన్ని నింపే ఉత్సవం బాలోత్సవ్ మాత్రమేనని అన్నారు. విద్యార్థులు జాలి, కరుణ, దయ పంచే వారుగా తయారు కావాలన్నారు. ఎక్కడైతే కళలు గొప్పగా ఉంటాయో అక్కడ సమాజం బాగుంటుందని చెప్పారు. బాలోత్సవ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్బాబు మాట్లాడుతూ..విద్యార్థులు కవితలు, కథలు రాయడం, చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కవులు, కథకులు పెద్దింటి అశోక్, కుప్పిలి పద్మ, వాసిరెడ్డి నవీన్, పద్మారావు, మాధవరావు, బాల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాలో ఎనిమిది మంది ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులను ఎంపికచేసినట్లు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం జిల్లాశాఖ అధ్యక్ష, కార్యదర్శులు జగన్మోహన్గౌడ్, రాజవర్ధన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో యూ.శ్రీనివాసులు (మహబూబ్నగర్), సురేందర్రెడ్డి (వనపర్తి), జితేందర్ (మల్దకల్), ఎజ్కెల్ (మామిడిపల్లి), యాదయ్యగౌడ్ (కల్వకుర్తి), ఆంజనేయులు (జక్లెర్), మెర్సి ఫ్రెంచ్ (బాదేపల్లి), వి.శ్రీనివాసులు (అలంపూర్)లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వీరికి ఈనెల 12న హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సన్మానం చేయనున్నట్లు వారు తెలిపారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
టీజీబీ చైర్మన్ బీఆర్జీ ఉపాధ్యాయ గుండ్లపల్లిలో టీజీబీ శాఖ ప్రారంభం బెజ్జంకి : ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలు విస్తృతపరుస్తున్నట్లు ఆ బ్యాంకుల రాష్ట్ర చైర్మన్ బీఆర్జీ ఉపాధ్యాయ అన్నారు. మండలంలోని గుండ్లపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన శాఖను గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.10,682 కోట్లు, జిల్లావ్యాప్తంగా రూ.1919.13 కోట్ల టర్నోవర్తో బ్యాంకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు పంటరుణాలు, వ్యాపారులకు, మహిళ సంఘాలకు, విద్యార్థులకు విద్య రుణాలతో పాటు వాహనాల రుణాలు కూడ ఇవ్వనున్నట్లు వివరించారు. అలాగే మిషన్కాకతీయలో చెరువుల మట్టిని తరలించేందుకు ఎకరాకు రూ.5 వేలు రైతులకు రుణసౌకర్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. జీఎం ఎస్.పాదం, ఆర్ఎం రవీందర్రెడ్డి, కార్యదర్శి శ్రీపాద్, మేనేజర్ అనిల్రెడ్డి, క్యాషియర్ వేణుగోపాల్, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచులు కృష్ణమోహన్రెడ్డి, గువ్వ వీరయ్య, ఎంపీటీసీ కొర్వి సంధ్యారాణి, ఉపసర్పంచ్ కాల్వ పెద్ద కొమురయ్య, ముల్కనూర్, రీజీనల్ ఆఫీసర్ ఐలయ్య, అల్గునూర్ బ్రాంచ్ల మేనేజర్లు సతీశ్, వెంకటస్వామి పాల్గొన్నారు. -
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే
26 మంది ఎంపిక 8న సన్మాన కార్యక్రమం ఆదిలాబాద్ టౌన్ : జిల్లాలో పనిచేస్తున్న 26 మంది ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలు మంగళవారం ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపికైన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 8న జిల్లా కేంద్రంలో జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, ఐకే రెడ్డి, కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్లు వీరిని శాలువాలతో సన్మానించి మెమోంటో అందజేస్తారు. ఈ నెల 5న ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వినాయకచవితి నేపథ్యంలో వాయిదా వేశారు. ఉపాధ్యాయుడు హోదా పాఠశాల పేరు కెవీఎం ప్రకాశ్రావు హెచ్ఎం జెడ్పీఎస్ఎస్, అన్నారం, కోటపల్లి కరుణ హెచ్ఎం జెడ్పీఎస్ఎస్, ధని, సారంగపూర్ సుధారాణి ప్రిన్సిపాల్ మోడల్ స్కూల్, బంగారుగూడ, ఆదిలాబాద్ గోపాల్సింగ్ తిలావత్ హెచ్ఎం జెడ్పీఎస్ఎస్, ఇంద్రవెల్లి ప్రకాశం పీఎస్హెచ్ఎం జెండావెంకటాపూర్, లక్సెట్టిపేట సత్యనారాయణరెడ్డి ఎస్ఏ మావల, ఆదిలాబాద్ నర్సయ్య ఎస్ఏ కుమారి, నేరడిగొండ గంగాధర్ ఎస్ఏ జెడ్పీఎస్ఎస్, కుంటాల శివప్రసాద్ ఎస్ఏ పొన్కల్, మామడ ఎండీ రోనక్ అలీఖాన్ ఎస్ఏ జెడ్పీఎస్ఎస్, బాసర అసిఫ్ అలీ ఎస్ఏ ఉర్దూ మీడియం పాఠశాల, ఖానాపూర్ మంజూల ఎస్ఏ చెన్నూర్ విజయ్కుమార్ ఎస్ఏ గుండంపల్లి, దిలావర్పూర్ కిరణ్కుమార్ ఎస్ఏ మల్లాపూర్, లక్ష్మణచాంద వినోద్కుమార్ ఎస్ఏ కడెం ఎన్.రవి ఎస్ఏ జెడ్పీఎస్ఎస్, బీరవెల్లి, సారంగపూర్ సహదేవ్ ఎస్ఏ మంచిర్యాల రామ్మోహన్రావు పీడీ కోటపల్లి వేణుగోపాల్ భాషా పండిత్ కడెం రాజేశ్వర్ ఎస్జీటీ రాజురా, లోకేశ్వరం శ్రీనివాస్ ఎస్జీటీ పొన్కల్, జన్నారం గంగన్న ఎస్జీటీ ఆలూర్, సారంగపూర్ చంద్రశేఖర్ ఎస్జీటీ దిలావర్పూర్ మహేశ్వర్ ఎస్జీటీ సింగాపూర్, మంచిర్యాల తైకుల్లా పీఈడీ ఎయిడెడ్, నిర్మల్ సత్యనారాయణ డీఎం చెన్నూర్ -
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఐదుగురు
జిల్లా టీచర్లకు రాష్ట్ర స్థాయి గౌరవం 8న సీఎం చేతుల మీదుగా సత్కారం విద్యారణ్యపురి : మాతృ దేవో¿¶ వ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత స్థానంలో నిలుస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన సంప్రదాయం. ఈ మేరకు ఏటా సెప్టెంబర్ 5న రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఏటా కొందరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సన్మాసిస్తుంది. ఈ మేరకు ఈసారి రాష్ట్రంలో 31మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయగా ఇందులో జిల్లా నుంచి ఐదుగురికి స్థానం దక్కింది. ఈ జాబితాను ఆదివారం విడుదల చేయగా.. ఈనెల 8న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఉత్తమ ఉపాధ్యాయులకు రూ.10వేల నగదు అందజేయడంతో పాటు సన్మానించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు, విద్యార్థులను తీర్చిదిద్దడం, పాఠశాలలను అభివృద్ధి చేయడంతో వారి పాత్రపై ప్రత్యేక కథనం. గురునాథరావు.. సైన్స్ కార్యక్రమాలపై ప్రోత్సాహం మహబూబాబాద్ మండలం కంబాలపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్లో భౌతిక రసాయశాస్త్ర ఉపాధ్యాయుడు గురునాథరావుకు నేషనల్ ఫౌండేషన్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. మహబూబాబాద్కు చెందిన గురునాథరావు డోర్నకల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియామకమై 2002లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. విద్యార్థులను సైన్స్ ప్రయోగాల దిశగా ప్రోత్సహించే ఆయన జాతీయ బాలల సైన్స్కాంగ్రెస్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో రిసోర్స్ పర్సన్గా, అకడమిక్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. 2007లో కురవి మండలం నేరడ పాఠశాలలో విద్యార్థులతో ఆయన జిల్లా సైన్స్ ప్రదర్శనకు 14 ప్రాజెక్టులు తయారుచేయించారు. ఇప్పటివరకు 60 జాతీయ అంతార్జాతీయ సదస్సుల్లో వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించారు. గురునాథరావు రాసిన పలు పరిశోధనాపత్రాలనుపలు విద్యాSసంస్థల గ్రంథాలయాల్లో రెఫరెన్స్గా వినియోగించుకుంటున్నారు. కలకత్తాలో జరిగిన 100వ భారత సైన్స్ కాంగ్రెస్లో పాల్గొని దివంగత రాష్ట్ర పతి అబ్బుల్కలాం చేతుల మీదుగా అవార్డు స్వీకిరంచిన ఆయన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్లో జీవిత కాలసభ్యుడిగా ఉన్నారు. ది ఇండియన్ సైన్స్కాంగ్రెస్అసోసియేషన్లో జీవిత కాలసభ్యుడిగాఉన్నారు.గురునాధరావు తన ఉపాధ్యాయుడుగా తన విధులను నిర్వర్తిస్తూనే ఆరేళ్ల క్రితం దిశ సామాజిక సేవాసంస్థలను స్థాపించారు. 2008లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు, ఎల్ఐసీ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు, 2007 –2008లో నేషనల్ గ్రీన్కోర్ ఉత్తమ మాస్టర్ ట్రైనర్ అవార్డులను గురునాథరావు అందుకున్నారు. అన్వర్.. హిందీ ప్రత్యేక బోధన హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎం.డీ.అన్వర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 1993లో వరంగల్లోని శివనగర్ ప్రభుత్వ హైస్కూల్లో ఆయన నియామకమయ్యారు. విద్యార్థులకు విద్యాబోధనతోపాటు పేద వర్గాల పిల్లలకు ఉచితంగా నోట్బుక్స్ను కూడా అందజేస్తున్నారు. జిల్లా రిసోర్స్పర్సన్గా ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పదో తరగతి పిల్లలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసే క్యాంపుల్లో హిందీ సబ్జెక్టు బోధిస్తున్నారు. సబ్జెక్టు నిపుణులుగా కూడా వ్యవహరిస్తున్న అన్వర్.. హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కాలేజీలో కూడాడిప్యూటేషన్పై సైకాలజీ అధ్యాపకుడిగా బోధించారు. రిసోర్స్ పర్సన్గా జవహార్ నవోదయ విద్యాయానికి వ్యవహరించిన ఆయన బోధన సామగ్రి రూపొందించారు. పలు వర్క్షాపుల్లో వివిధ తరగతుల హిందీ సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు కూడా తయారుచేయటంలో కీలకంగా పనిచేసిన ఆయన విద్యాపరంగా అత్యుత్తమ సేవలందించినందుకు 2010లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2015లో సంవత్సరంలో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సన్మానం అందుకున్నారు. చలపతి.. బడిని బతికించారు స్టేషన్ ఘన్పూర్ నియోజకవరగలోని చిన్నపెండ్యాల ఎస్సీ, బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా సీహెచ్.చలపతి విధులు నిర్వర్తిస్తున్నారు. రేగొండ మండ లం తిరుమలగిరికి చెందిన చలపతి 1983లో ఉపాధ్యాయుడిగా ఆయన నియామకమయ్యారు. చిన్నపెండ్యాల పాఠశాలలో తొలుత 36మంది విద్యార్థులు ఉండగా చలపతి బాధ్యతలు స్వీకరించాక ఆయన కృషితో ఇప్పుడు ఆ సంఖ్య 350కి చేరింది. అంతేకాకుండా పాఠశాలను వంద శాతం పరిశుభ్రం, పచ్చదనంగా మార్చగా పర్యావరణ మిత్రలో రాష్ట్రస్థాయి అవార్డును 2014లో అందుకున్నారు. దాతల సహకారంతో పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పాటు కాకతీయుల కళాతోరణం ఆర్చీ నిర్మించారు. కాగా, చలపతి 2012లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2013–2014లో రాష్ట్ర స్థాయిలో రాజీవ్ విద్యామిషన్ అవార్డులు స్వీకరించారు. రమాకుమారి.. ఉపాధ్యాయులకే శిక్షణ వర్ధన్నపేటమ మండలం ఉప్పరపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీజీ హెచ్ఎంగా పనిచేస్తున్న దేవరాజు రమాకుమారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. హన్మకొండకు చెందిన రమాకుమారి 1984లో ఉపాధ్యాయురాలిగా నియామకమైన ఆమె తన 32ఏళ్ల సర్వీస్లో ఎక్కడ పనిచేసినా విద్యార్థుల డ్రాపౌట్స్ లేకుండా కృషి చేశారు. ఇంకా జాతీయ స్థాయిలో విద్యార్థులను వాలీబాల్, హాకీపోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలను ఏర్పాటుచేసి పాఠశాలల అభివృద్ధికి పాటుపడుతున్నారు. స్వఛ్చభారత్ కార్యక్రమాలు అమలుచేయటం, పాఠశాలలకు దాతల చేయూతతో ఆటవస్తువులు, వాటర్ ఫ్యూరిఫయర్లు ఏర్పాటుచేయించారు. రాష్ట్రస్థాయిలో ఎస్ఈఆర్టీ, ఆర్వీఎం, ఆర్ఎంఎస్ఏ, మన టీవి టెలీ న్యూస్ ప్రోగ్రామ్స్ల్లో పాల్గొని ఎస్సెస్సీ స్టడీమెటీరియల్ను రూపొందించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. 2012లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డుతో పలు సంస్థల నుంచి ఇప్పటివరకు రమాకుమారి అవార్డులు స్వీకరించారు. నరేందర్.. ఉపాధ్యాయుడు, కవి జఫర్గఢ్ మండలం తీగారం యూపీఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్న రాచమల్ల నరేందర్కు నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్ విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఏ తరగతి గదిలో అభివృద్ధి చెందాల్సిన సామర్థ్యాలు అదే తరగతిలో విద్యార్థులకు వచ్చేలా బోధిస్తున్నారు. ఇంకా సహా పాఠ్య కార్యక్రమాల కూడా సమర్దవంతంగా నిర్వర్తిస్తూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వానికి దోహదపడుతున్నారు. 1997సంవత్సరంలో జఫర్గఢ్ మండలం సూరారం పాఠశాలలో ఎస్జీటీగా నియమితులైన నరేందర్ అదే మండలంలో పదిహేడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గుణాత్మక విద్యలో భాగంగా తరచూ ప్రాజెక్టుమేళా, కృత్యమేళా నిర్వహించే ఆయన సైన్స్ఫేర్లు, ఇన్స్ఫైర ్లలొ పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో బడిబాటలో భాగంగా విద్యార్థులను చేర్పించేందుకు విశేష కృషి చేశారు. ఉపాధ్యాయుడిగా తన విధులు నిర్వర్తించే నరేందర్.. కవిగా కూడా తన ప్రతిభ చాటుతున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాకవి కాళోజీ నారాయణ శతజయంతి ఉత్సవాల సందర్బంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని ఉత్తమ కవిగా సన్మానం అందుకున్న నరేందర్.. హైదరాబాద్లోని చెలిమి సాంస్కృతిక సమితి నుంచి గురజాడ అప్పారావు పురస్కారం అందుకోగా, 2010లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించారు. -
గురుభ్యోనమః
8న ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం ముగ్గురికి రాష్ట్ర స్థాయి 27 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక నేడు ఉపాధ్యాయ దినోత్సవం ఆదిలాబాద్: గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర.. అనాది నుంచి గురువులకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. తల్లిదండ్రుల తర్వాత పూజించబడేది గురువులే. గురువులు పరబ్రహ్మ స్వరూపంగా సంభోదించే సంప్రదాయం మనది. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు భవిష్యత్తుకు బాట చూపుతారు. అక్షర ఓనమాలు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. గురువులను గౌరవించని వారి భవిష్యత్తు అంధకారమే అని చెప్పవచ్చు. దేశ ప్రథమ పౌరుడైనా.. ఎంతటి స్థాయిలో ఉన్నా... గురువు లేనిదే ఆ వ్యక్తి గమ్యానికి చేరుకోలేరు. క్రమశిక్షణ, సమయ పాలన, విధి నిర్వహణలో నిబద్ధతకు నిదర్శనం ఉపాధ్యాయ వత్తి. విద్యార్థులకు అలాంటి ఉత్తమ విద్యనందించిన వారే ఉత్తములు అవుతారు. సర్వేపల్లి రాధాకష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి రావడంతో జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈనెల 8న జరుపుకుంటున్నారు. రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సన్మానం చేయనున్నారు. కాగా జిల్లా స్థాయిలో 27 మందికి, రాష్ట్ర స్థాయిలో ముగ్గురిని సన్మానించనున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన వారి మనోగతం.. సేవలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు.. ఆదిలాబాద్ మండలంలోని అంకోలి ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న సంతోష్ కుమార్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన 1987 ఫిబ్రవరిలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. అంకోలి పాఠశాలలో పనిచేసే కంటేముందు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేది. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను సర్కార్ బడికి వచ్చేలా చేసి, పాఠశాల అభివద్ధికి ఎంతగానో కషి చేస్తున్నారు. ఈ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా విద్యా బోధన జరుగుతుంది. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సంతోష్. 2014 సంవత్సరంలో జిల్లా ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోనున్నారు. నిబద్దతకు నిదర్శనం.. కట్టరాజమౌళి వత్తిలో నిబద్ధతకు నిదర్శనం. రాజమౌళి ఎన్సీసీ శిక్షణ అధికారి పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు దారి చూపారు. రాజమౌళి వద్ద శిక్షణ పొందిన 30 మంది వరకు విద్యార్థులు ప్రస్తుతం పోలీసు కానిస్టేబుళ్లుగా, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్సీసీ నిర్వహించిన వివిధ పోటీల్లో, సాంస్కతిక కార్యక్రమాల్లో 200 వరకు బంగారు పథకాలు సాధించేలా కృషి చేశారు. 1995 సంవత్సరం జూన్ మాసంలో ఉపాధ్యాయ వత్తిలో చేరారు. 2001 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందారు. ప్రస్తుతం జన్నారం జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2012 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. 2012, 2014 సంవత్సరాలలో ఉత్తమ ఎన్సీసీ అధికారిగా అవార్డులు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోనున్నారు. పర్యావరణ ప్రేమికుడు పర్యావరణ పరిరక్షించడంలో ఈ ఉపాధ్యాయుడు తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులకు పర్యావరణం పరిరక్షణపై శిక్షణ కల్పిస్తున్నారు. నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కో ఆర్డినేటర్గా, మాస్టర్ ట్రైనర్గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కౌమర విద్య, హెచ్ఐవీ, ఎయిడ్స్పై ఎన్నో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2010లో మారిన పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయలకు శిక్షణలు ఇవ్వడంతో పాటు జీవశాస్త్రం సబెక్టు ట్రైనర్గా, రాష్ట్ర రిసోర్స్పర్సన్గా పనిచేశారు. ఎన్జీసీ ద్వారా జిల్లాకు చెందిన 40 మంది విద్యార్థులను తిరుపతి తీసుకెళ్లి పర్యావరణంపై అవగాహన కల్పించారు. మొక్కలు నాటడం వల్ల కలిగే లాభాలు, విద్యుత్ పొదుపు, కాలుష్యం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ ఉపాధ్యాయుడు 1998 సంవత్సరంలో ఉపాధ్యాయ వత్తిలో చేరారు.1998 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. 2012 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2010 సంవత్సరంలో ఉత్తమ ఎన్జీసీ ఉపాధ్యాయుడిగా అవార్డులు పొందారు. -
దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలి
అంబాల (కమలాపూర్) : విద్యార్థులు క్రీడల్లో రాణించి దేశం గర్వించే స్థాయికి ఎదగాలని జెడ్పీటీసీ సభ్యుడు మారపెల్లి నవీన్కుమార్ అన్నారు. మండలంలోని అంబాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 1 నుంచి నిర్వహించనున్న మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీస్తాయన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రవి, ఎంపీటీసీ రమేశ్, క్రీడా సమాఖ్య చైర్మన్, ఎంఈవో రాంకిషన్రాజు, వైస్ చైర్మన్ రాంరెడ్డి, కన్వీనర్ రాజేందర్, హెచ్ఎంలు రాజయ్య, జయప్రకాశ్, పవన్కుమార్, టీఆర్ఎస్ నాయకులు పింగిలి ప్రదీప్రెడ్డి, సత్యం, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చరిత్రలో తొలిసారి!
ఇందూరు : రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కలెక్టర్ అవార్డును ప్రదానం చేసింది. మొదటి అవార్డు జిల్లా కలెక్టర్ యోగితారాణాను వరించింది. సోమవారం గోల్కొండలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో సీఎం చేతుల మీదుగా యోగితారాణా అవార్డును స్వీకరించారు. సమైక్య రాష్ట్రంలోనూ ఉత్తమ కలెక్టర్ అవార్డు ఎవరూ అందుకోలేదని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ పథకాల అమలులో కలెక్టర్ చూపిన చొరవకు ఈ అవార్డు దక్కిందంటున్నారు. యోగితారాణా చొరవతో హరితహారం అమలులో రాష్ట్రంలో, ఉపాధి హామీ పథకం అమలులో దేశంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. సీఎం తన ప్రసంగంలో కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికారులు అభినందిస్తుంటే తన ఆనందానికి అవధులు లేకుండా పోయానని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్కు అవార్డుతోపాటు లక్ష రూపాయల రివార్డును అందించారు. -
ఉత్తములు... 453 మంది
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల్లో 453 మందిని ఉత్తములుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఉద్యోగుల జాబితాను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఆయా ఉద్యోగులకు సోమవారం హన్మకొండలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు ఉద్యోగుల జాబితా.. జిల్లా అధికారులు డి.అమయ్కుమార్–ఐటీడీఏ పీఓ, ఎస్.తిరుపతిరావు– ఏ జేసీ, బి.రామచందర్రావు–చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, పి.వెంక టేశ్వరరెడ్డి–డీఆర్డీఏ పీడీ, వై.శేఖర్రెడ్డి–డ్వామా పీడీ, ఎం. నర్సింహారెడ్డి–బీసీ కార్పోరేషన్ ఈడీ, వి.ఆనం ద్కుమార్–డోర్నకల్ స్పెషల్ ఆఫీసర్, రూపాదేవి–డిస్ట్రిక్ కోఆర్డినేటర్ టీఎస్ఆర్డబ్ల్యూఆర్ఐఎస్, డి.పాండు–డెరెక్టర్ రిసిట్, జె.లక్ష్మణ్–హúసింగ్ పీడీ, అట్కూరు సాయిప్రసాద్– లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్.రాజమౌళి–ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్.పరమేశ్– పరకాల నగర పంచాయతీ కమిషనర్, ఎం.రామకృ ష్ణారెడ్డి–నర్సంపేట ఆర్డీఓ, సీహెచ్.మహేందర్జీ– ములు గు ఆర్డీఓ, వి.శ్రీనివాస్రావు–ఎస్ఎఫ్ డీఎఫ్ఓ పౌర సరఫరాల శాఖ ఎస్.కిరణ్ప్రకాశ్, బి.విశ్వనారాయణ, జి.రవీందర్–తహ సీ ల్దార్లు, వి.అనిత–సీ.అ., జి.వీరస్వామి–వాచ్మెన్, సాంబ య్య–అటెండర్, సయ్యద్ అబ్దుల్, జి.రాజేష్, ఏజేసీ సీసీ లు,ఎ.ఓంప్రకాశ్–ఏజేసీ అటెండర్,పి.కొమురయ్య– డ్రైవర్, వీ.ఎస్.వీ.విజయ్కుమార్–డీఐఓ,వై.శ్రీధర్– ఈడీఎం. రెవెన్యూ శాఖ వరంగల్ డివిజన్ : హసన్పర్తి తహసీల్దార్ ఎన్.రవి, పర్వతగిరి ఏఎస్ఓ ఎస్.దుర్గారాజు, స్టేషన్ ఘన్పూర్ సర్వేయర్ ఎం.సురేందర్, వరంగల్ ఆర్డీఓ జూనియర్ అసిస్టెంట్ ఎం.డీ. హసీబుద్దీన్ ఘోరీ జనగామ డివిజన్ : చేర్యాల తహసీల్దార్ వి.విజయ్సాగర్, పాలకుర్తి ఎంఆర్ఐ ఎ.ప్రసూన, దేవరుప్పుల వీఆర్ఓ కె.ప్రవీణ్రెడ్డి, కొడకండ్ల వీఆర్ఏ బి.వెంకటేశ్, మహబూబాబాద్ ఆర్డీఓ సీ.అ. జి.కోమల, తొర్రూరు ఏఆర్ఐ శ్రీనివాస్, మహబూబాబాద్ వీఆర్ఓ ఏ.అశోక్రెడ్డి, నెల్లికుదురు వీఆర్ఓ ఎండీ.అల్లాబాస్. ములుగు డివిజన్ : భూపాలపల్లి తహసీల్దార్ ఎన్.సత్యనారాయణ, గణపురం డీటీ కె.రవిరాజ్కుమార్, భూపాలపల్లి సర్వేయర్ కె.స్టాలిన్, ఏటూరునాగారం ఆర్ఐ ఎస్డీ.సర్వర్, ములుగు వీఆర్ఓ బి.సూరయ్య. నర్సంపేట డివిజన్ : నర్సంపేట సీ.అ. టి.చక్రపాణి, దుగ్గొండి ఏఆర్ఐ శోభారాణి, గూడూరు టైపిస్ట్ డి.సాం బయ్య, నర్సంపేట అటెండర్ సీహెచ్.రఘు, డీటీ కె.సూ ర్యనారాయణ, చైన్మన్ బిక్షపతి, ఎస్సారెస్పీ డీటీ కె.అనిల్ కుమార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జి.లాలు, సీ.అ. పి.రవి, డీటీ జి.జయశంకర్, జనగామ ఏఎస్ఓ ఎం.రోజారాణి, బి.వి నోద్కుమార్, వి.కృష్ణమూర్తి, సీహెచ్.రాజు, ఎ.బాలకృష్ణ, ఎస్.రమేష్. పోలీస్ కమిషనరేట్ పరిధిలో... ఎస్.మహేందర్– ఏసీపీ మామునూరు, పి.కిషన్, ఎస్,రవి కుమార్, ఎ.విద్యాసాగర్, కె.సత్యనారాయణ, ఖాదర్ షరీఫ్–సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బందిలో కె.రవికుమా ర్, కె.మహేశ్వర్, ఎండీ.రిజ్వాన్అలీ, ఎం.శ్రీనివాసులు, జి.దామోదర్, ఎం.ఉస్మాన్, ఎస్.వేణు, బి.సారంగపాణి, వి.రవీందర్, ఎం.నర్సయ్య ఎ.నరేందర్, ఎండీ.ఉస్మాన్ (1019), డి.రవికుమార్, బి.సృజన్, డి.శ్రీకాంత్, ఎం. భాస్కర్, డి.రవినాథ్, ఎండీ.ఖాలీద్, కె.శ్యాంసుందర్, బి.భీ మయ్య, ఎం.మోహనకృష్ణ, టి.వీరస్వామి, కె.శివకుమార్, పి.శ్రీనివాసరాజు, వి.వేణుగోపాల్రెడ్డి, ఎల్.రవీందర్, ఎం. యాదగిరి, ఎండీ.నజీర్, బి.శంకరయ్య, ఎం.రత్నాకర్రెడ్డి, ఈ.ప్రకాశం, జి.సదానందం, ఎం.రాజేందర్, విజయ్పాల్, ఎం.మల్లేశం, ఎన్.సంజీవరెడ్డి, ఎస్డీ, యూసుఫ్హుస్సేన్, డి.వేణుగోపాల్రెడ్డి, ఎం.సోమయ్య, జి.నర్సయ్య, డి.రవి రాజు, ఎస్.శ్రీధర్, జి.వేణు, ఎం.సంపత్కుమార్, పి.ఉమే‹ Ùకుమార్, డా.కె.ఝూన్సీ, పి.శ్రీనివాస్. రూరల్ ఎస్పీ పరిధిలో... విశ్వజిత్ కంపాటి–ఏఎస్పీ, ములుగు, కె.ప్రవీణ్కుమార్– అడిషనల్ ఎస్పీ, బి.రాజమహేంద్రనాయక్, టి.పద్మనాభరె డ్డి, సి.సత్యనారాయణరెడ్డి–డీఎస్పీలు, మహ్మద్ సర్దార్ (అడిషనల్ పీపీ), సర్కిల్ ఇన్స్పెక్టర్లు సీహెచ్.రఘునం దన్రావు, పి.బాలరాజు, బి.బాలాజీ, బి.కిషన్, జానీ నర్సింహులు, కె.శ్రీధర్రావు, వి.బాపురెడ్డి, బి.సదానందం, ఎన్.సంతోష్, పి.సునీత, సురేష్కుమార్–డాక్టర్లు, ఎస్సైలు వై.కృష్ణకుమార్, ఎం.నరేష్, డి.గురుస్వామి, ఎండీ.షాదు ల్లాబాబా, జి.కిషన్, ఎల్.పవన్, ఆర్ఎస్ఐలు వి.కృష్ణాంజనే యులు, ఎస్.మల్లేశం, కె.ఉదయభాస్కర్, సూపరింటెండెం ట్లు ఫర్హానా, మహమూద్, కె.రమాదేవి, కార్యాలయ సిబ్బంది ఎ.శ్రీనివాస్, ఎండీ వహీద్పాషా, ఎం.రమేష్, పి. వేణు, పి,రాజు, ఎన్. సత్యనారాయణరెడ్డి, ఎస్.స్వర్ణలత, ఎన్.రాజేశ్, కె.ఐలయ్య, కె.శైలజ, ఆర్. సంతోష్కుమార్, ఏఎస్సైలు స్వామిదాస్, జాఫర్ఖాన్, మహమూద్, ఆర్.రా జిరెడ్డి, కె,కుమారస్వామి, ఎ.మధుసూదన్రాజు, బి.రమేష్, సీహెచ్. రవీందర్రావు, ఎస్కే.ఇమ్రాన్, ఆషాబీ, ఎ.సత్యనా రాయణ, ఫజల్ఖాన్, కె.నరేందర్రావు, ఆర్.వెం కటేశ్వర్లు, కె.సంతోష, యు.లక్ష్మణ్, అబ్దుల్ ఘనీ, కె.విజయలక్ష్మీ, బి.పూర్ణచందర్, డి,రామాచారి, డి.మాధవయ్య. ప్రెస్ : శ్రీనివాస్, సుధాకర్, కె.రాజు వైద్యులు : గన్ను కృష్ణమూర్తి, బేతి కవిత, సుధాకర్, వెంకట్రెడ్డి, శరత్. వ్యవసాయ శాఖ : బి.రామకృష్ణ, కె.సుధాకర్, ఎన్.రఘుపతి, సీహెచ్.కిరణ్కుమార్, టి.శ్రీనివాసరావు, పి.జైసింగ్, ఎ.కవిత, ఎ.లలిత, జి.విజ్ఞాన్, వి.సైదమ్మ, ఎస్.శ్రీధర్బాబు, బి.కుమార్రావు, జి.సురేందర్, ఎం.యాకయ్య, జి.రజిత, పి.ఈశ్వరి, బి.సతీష్చంద్ర పశుసంవర్థక శాఖ డాక్టర్ వి.అశోక్, డాక్టర్ ప్రవీణ్కుమార్, డాక్టర్ జి.రాజేష్, హేమలత, నానుపాషా, డి.కుమారస్వామి, పి.సురేందర్. స్టేట్ అడిట్ శాఖ : జె.శ్రీనివాస్, జె.కిషోర్, దుర్గారావు. సహకారశాఖ : డి.శైలజ, మథిన్ సుల్తాన్, ఏ.రాజ్యలక్ష్మి. డ్వామా ఎం.సంపత్రావు–స్టేషన్ ఘన్పూర్ ఎంపీడీఓ, బి.సురేంద ర్–గూడూరు ఎంపీడీఓ, టి.విద్యావతి–ఏపీఓ స్టేషన్ఘ న్పూర్, డి.శ్రీనివాస్రావు–ఏపీఓ గూడూరు, బి.ప రశు రాం–ఈసీ బచ్చన్నపేట, యు.మోహన్–ఈసీ జనగాం, ఎం రమేష్ జియాలజిస్ట్, బి.రాకేష్–పీడీ సీసీ, యు వీరబా బు– ఎంటీసీ నర్సంపేట, ఎ.రవికుమార్– సీఓ నర్సంపేట, గురుచరణ్ సింగ్–ఆపరేటర్ పాలకుర్తి, బి.నర్సింహా– ఎఫ్ఎ ఫత్తేపూర్ స్టేషన్ఘన్పూర్, అజ్మీరా కిష్టునాయక్–ఎఫ్ఏ గుండెంగ గూడూరు, బత్తిని శ్రీలత–ఎఫ్ఏ అడవి కేశ్వాపూర్ జనగాం, ఎన్.కవిత–ఎఫ్ఏ చిన్నపెండ్యాల స్టేషన్ఘన్పూర్, కె.జంబా–టీఎ స్టేషన్ఘన్పూర్, జి రవీందర్–టీఏ జన గాం, డి.శ్రీనివాస్–గూడూరు, కె.సుధాకర్–నర్సంపేట, బి.ఐలయ్య–అటెండర్ వరంగల్, టి.రఘు–సీఓ వరంగల్. డీఆర్డీఏలో.. పి. పరమాత్మ–డిప్యూటీ ఎస్ఓ, శంకర్– ఏసీ తొర్రూరు, బి. నటరాజ్–కంప్యూటర్ ఆపరేటర్ వరంగల్, ఎస్. రోహిత్– బీఎం ఆంధ్రాబ్యాంక్, వి. మారుతి–బీఎం ఆంధ్రాబ్యాంక్, పి. శ్రీనివాసులు–బీఎం ఏపీజీవీబీ, ఎన్. రాంచంద్రారెడ్డి– బీఎం ఏపీజీపీబీ, జి. మురళీకృష్ణా–బీఎం సెంట్రల్బ్యాంక్, పి. విద్యాసాగర్–బీఎం కెనరాబ్యాంక్ , మంకిడి బిరులి– బీఎం ఎస్బీహెచ్, కె. రమేష్బాబు–బీఎం ఎస్బీహెచ్, కె.వెంకటేశ్వర్రావు–బీఎం ఎస్బీఐ, పి.సునీల్–బీఎం ఎస్బీ ఐ, సీహెచ్ రవిబాబు– బీఎం ఇండియన్బ్యాంక్, గొట్టె శ్రీని వాస్ –పీఎం పీడీ ఎన్టైటిల్మెంట్, పి.శ్రీనివాస్– పీఎం పీ డబ్ల్యూడీ, ఓంప్రకాశ్–జూ.అ, ఏ.కోటేశ్వర్– ఏపీఎం హెచ్ ఆర్, ఏ. సురేష్–ఏపీఎం గీసుకొండ, కె. సుధాకర్–ఏపీఎం ఖానాపురం, అహ్మద్ షరీఫ్–అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, సీహెచ్ సంజీవ్– అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, టి రమేష్– సీసీ వర్ధన్నపేట, ఏ. కుమారస్వామి– సీసీ రేగొండ, ఏ. చంద్ర మౌళి– ఎంబీకే రేగొండ, సీహెచ్ శ్రీలత– సీసీ దుగ్గొండి, టి వెంకటరమణ– సీసీ కేసముద్రం, డి. ప్రేమలత–సీసీ మద్దూ రు, సీహెచ్ హరికృష్ణ– కన్సల్టెంట్, ఎస్. హైమావతి–ఎల్ఓ, పి. సునీత అకౌంటెంట్ జిల్లా సమాఖ్య, బి.గణేష్– అటెండర్, బి. హైమావతి– భీమామిత్ర. విద్యాశాఖలో... డి. అమీనా– లైబ్రెరీయన్ జిల్లా గ్రంథాలయం, ఎం. శ్రీకాం త్–అటెండర్ డీఈఓ ఆఫీసు వరంగల్, ఎం. నిర్మల– ఏసీ జీఈ డీఈఓ ఆఫీస్ వరంగల్, ఎం. శ్రీధర్–జూ.అ ఆర్జేడీ ఆఫీస్, బి. నరేష్– సివిల్ ఇంజినీరింగ్ హెడ్ ప్రభుత్వ పాలి టెక్నిక్, బి. భూషణం–లెక్చరర్ పాలిటెక్నిక్, టి. శ్రీలత సీఎం పీ, ఎల్.శ్రీనివాసరావు– సూపరింటెండెంట్, వి సంజయ్– సీ. అ, ఎస్. జగన్మోహన్రెడ్డి –ట్రెనింగ్ఆఫీసర్ ఐటీఐ. దేవాదాయ శాఖ : టి.రాజేంద్రం–కురవి, ఆర్. సునీత–అ్రVýంపహాడ్, జి.శేషగిరి–మేడారం, అగ్రిమాపక శాఖ : జె.లిల్లీ రోజ్– సూపరింటెండెంట్, కె. సత్తయ్య– డ్రైవర్ ఆపరేటర్ ములుగు, పి. ప్రసన్నకుమార్– ఫైర్మెన్ జనగామ. ఫిషరీస్ : పి.కిరణ్కుమార్–జూనియర్ అసిస్టెంట్ వరంగల్. అటవీ శాఖ : డి.యాకయ్య–ఎఫ్ఆర్ఓ ఏటూరునాగారం, పి.పున్నంచంద ర్–ఎఫ్ఆర్ఓ వరంగల్, వి.శ్రీనివాస్రావు–ఎఫ్ఆర్ఓ నర్సం పేట, డి.బాలాజీ–డీఆర్ఓ నర్సంపేట హార్టికల్చర్ : ఎం.ఏ.అక్బర్, ఆర్.శ్రీనాథ్బాబు. నీటి పారుదలశాఖ ఎస్.శ్రీనివాస్రెడ్డి–డీఈఈ హన్మకొండ, ఎం శేషగిరి–ఏఈ హన్మకొండ, జి.గోవింద్కుమార్–ఎస్ఎ, కిరణ్కుమార్– ఏఈ హన్మకొండ, ఎం.శ్రీలత–ఏఈ జనగాం, సీహెచ్ ప్రవీణ–ఏఈ వరంగల్, బి.గోపాల్రావు–ఈఈ ములుగు, డి.వెంకటేశ్వర్లు–డీఈఈ ఏటూరునాగారం, పి గణేష్ సీఆ ములుగు, ఎస్.పగిడిద్దరాజు–జూఆ వరంగల్, బి సీతారాం– డీఈఈ, ఎస్.శ్రీనివాస్రెడ్డి–డీఈఈ, ఓంసింగ్–ఏఈ, సిహె చ్ తేజేశ్వర్రావు–ఏఈ, వి.శ్రీనివాస్–డీఈఈ జనగామ, జె.ప్రవళిక–ఎఈ పరిశ్రమలశాఖ : షరీఫ్ అహ్మద్, సూపరింటెండెంట్ సమాచార పౌర సంబంధాల శాఖ ఎం.శ్రీనివాస్కుమార్, ఎంపీఆర్ఓ హన్మకొండ, ఎం.విష్ణు మోహన్రావు, పబ్లిసిటీ అసిస్టెంట్ కార్మిక శాఖ : శ్రీధర్బాబు, రమేష్బాబు–ఏసీ. లీగల్ మెట్రాలజీ : ఎస్.రాజేశ్వరావు, డీఐ వరంగల్ వ్యవసాయ మార్కెట్ : టి.చందర్రావు, ఏఎంసీ వర్ధన్నపేట, సయ్యద్ ఇమామ్ జాఫర్, డీఈ వరంగల్ వైద్య ఆరోగ్య శాఖ(ఆయుష్) డాక్టర్ ఎం.సూరయ్య, ఎంఓ గంగారం కొత్తగూడ, పి.శ్యాంకుమార్, కాంపౌండర్ వరంగల్ వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్ టి.నిర్మలాకుమారి–జీఎంహెచ్ హన్మకొండ, కె.సబి త–జీఎంహెచ్ హన్మకొండ, ఎస్.సత్యవతి–స్టాఫ్ నర్స్, జీఎంహెచ్ హన్మకొండ, డాక్టర్ వై.పద్మ–సీకేఎం వరంగల్, బి.అనితకుమారి, స్టాఫ్ నర్సు సీకేఎం వరంగల్, డాక్టర్ ఎల్.అర్చన–ఆర్ఎంఓ ఐ హాస్పటల్, కజీయారాణి–నర్సింగ్ సూపరింటెండెంట్ ఐ హాస్పిటల్, పూర్ణచందర్రావు– ఫార్మ సిస్ట్ ఐ హాస్పిటల్, డాక్టర్ ఎ.సుమిత్రాదేవి, ఎంజీఎం, సయ్యద్ సర్వర్–ఎల్టీ ఎంజీఎం, జి.రవీందర్, ఎల్టీ ఈఎస్ఐ కరీమాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ సాజిదా అత్తారీ–ఎంఓ ధర్మసాగర్, సయ్యద్ జమ్మీ రుద్దీన్–ఎంపిహెచ్ఈఓ కడిపికొండ, పి.సంధ్యారాణి–ఫార్మ సిస్ట్ మంగపేట, బి.తిరుపతి–హెచ్ఈఓ ఏటూరునాగారం, కె.వాసుదేవరెడ్డి–పీఎంఓ వరంగల్ వైద్యకళాశాల : హెచ్ సంధ్యారాణి, డాక్టర్ జె.పాండురంగ, ఎం.శ్రీనివాస్, డాక్టర్ కె.రవీందర్, సీహెచ్.భద్రయ్య మెప్మా : బి.విజయ, వి.అశోక్కుమార్, ఎస్.కే.వహీదా, కె.స్రవంతి, ఎస్.నవీన్, ఎం.రజితరాణి, కె.రమేష్ జిల్లా పంచాయితీ విభాగం ఎస్.శ్రీలత–ఎఓ , పంచాయతీ కార్యదర్శులు ఎం.యాదగి రి–విశ్వనాథపురం, జె.అశోక్ –వనమాల కనపర్తి, సుప్రజ– రంగాపుర్, ఈఓ పీఆర్డీలు ఎన్.మల్లేశం–ధర్మసాగర్, ఎం సత్యనారాయణ రెడ్డి–మరిపెడ, ఎండీ తాజుద్దీన్, అటెండర్, మహబూబాబాద్, ఎస్.రాజేంద్రప్రసాద్, ఈఈ మహబూ బాబాద్, కె.రమణి, ఏఈ వరంగల్, సీహెచ్.సుధాకర్, డీఈ భూపాలపల్లి, ఎస్,శ్రీనివాసపతి, ఏఈ దేవరుప్పుల జిల్లా పరిషత్ ఎంపీడీఓలు జి.రవీందర్–జఫర్గఢ్, ఎం.శ్రీనివాస్–వర్ధన్న పేట, టి.శ్రీనాథ్–తొర్రూరు, పి.కరణ్సింగ్, సీసీ సీజెడ్పీ, జి.జవహర్రెడ్డి, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లు ఎండీ.అమ్జద్పాషా, సీహెచ్.హరిబాబు, కే.వీ.రంగాచారి, ఎస్.ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్లు సీహెచ్.రమేష్, ఎం డీ.ఇమాన్, పి.శ్యాంసుందర్, దేవయ్య, పి.జయరాం, మ యూరి, కె.శ్రీనివాస్తో పాటు ప్రమీలారాణి, బి.వెంకటేశ్వ ర్లు, ఎస్.వినీత్కుమార్, జి.అనురాధ, ఎం.డీ.యాకూబ్ పా షా, బి.రమేష్, డి.మొండయ్య, సునీత, శ్రీనివాసరెడ్డి, శ్రీని వాస్, రంజిత్, రాజయ్య, వెంకటరావు, ఖాజా. సీపీఓ : కె.రాజ్కుమార్, వి.సతీష్, వి.రాందయాకర్రెడ్డి. జైలుశాఖ : పి.బిక్షపతి, పి.కొమురెళి, టి.మీనా. ఎక్సైజ్శాఖ : కె.తిరుపతి, ఎన్.శంకర్, కె.జగన్నాథరావు, రామ్మోహన్రావు, పి.శ్రీనివాసరావు, పి.సారంగపాణీ, పి. బుచ్చయ్య, శ్రీనివాసరావు, శ్రీధర్, కనకరాజు, ఎ.రవీందర్. రిజిస్ట్రేషన్ల శాఖ : కె.డానియల్, తస్లీం మహ్మద్ ఆర్అండ్బీశాఖ : ఎస్.రాజులు, వి.యుగంధర్, ఫాతిమా, ఎస్.వెంకటరమణ, ఎస్.శివానందం, బి.మల్లయ్య. ఆర్డబ్ల్యూఎస్ : కె.వెంకటరమణారెడ్డి, పి.మధుకుమార్ , ఈ.సునీత, పి.దివ్యరెడి, సిరికల్చర్ : ఎంఎ.మతిన్ అతర్, టి.రాజయ్య. సర్వే ల్యాండ్ రికార్డ్స్ : జి.గోపాల్(ఇన్స్పెక్టర్) టూరిజం : సి.రఘువీర్, జె.ప్రణీత, రామకృష్ణ. టీఎస్ఆర్టీసీ : సురేష్, రాములు, కె.సుబ్రహ్మణేశ్వర్రావు, ట్రెజరీ శాఖ : బి.విజయకుమారి, ఎండీ.రఫీ(ఎస్టీవో). టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ : కె.సుదర్శన్రెడ్డి, కె.దయాకర్, ఆర్.మల్లయ్య. బీసీ వెల్పేర్ : కె.శంకరయ్య(ఎస్డబ్ల్యూఓ). వికలాంగుల శాఖ : ఎం.రాధిక, భూపాలరెడ్డి మైనార్టీ వెల్ఫేర్ : పి.కిరణ్కుమార్(ఎఫ్ఓ) సోషల్ వెల్పేర్ : జి.రామయ్య, కె.బాలరాజు, పి.మధురిమ ట్రైబల్ వెల్పేర్ : క్షేత్రయ్య, కరుణాకర్, ఎండీ.అబీద్ఖాన్, ఐసీడీఎస్ : వి.లలితాదేవి, కవిత, అబ్జల్బీ, లక్ష్మి, శోభ హరితహారం : పి.శ్రీనివాస్, ఎం.శ్రీధర్, సుదర్శన్రెడ్డి. సామాజిక సేవ మనోచేతన ఎన్జీవో, ఎండీ.మహబూబ్అలీ(సహృదయ వృద్ధాశ్రమం), స్పందన సర్వీస్ సొసైటీ, బొంపెల్లి సుధీర్రావు(డ్యాన్స్మాస్టర్), ఎ.గంగాధర్(రెడ్క్రాస్). -
‘ఉత్తమ’ ఉద్యోగులు 56 మంది
నేడు మంత్రి చేతులమీదుగా ప్రశంసాపత్రాల ప్రదానం ఖమ్మం జెడ్పీసెంటర్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ శాఖల నుంచి 56 మంది ఉద్యోగులను ఉత్తమ సేవా పురస్కారాల కోసం ఎంపిక చేశారు. ఒక్కో శాఖ నుంచి ఒక ఉద్యోగిని మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్ లోకేష్కుమార్ ఆదేశించడంతో..ఆ మేరకు జాబితాను అధికారులు రూపొందించారు. వీరికి సోమవారం ఉదయం 10:30 గంటలకు పోలీస్ పరేడ్గ్రౌండ్లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందించనున్నారు. -
ఎల్ఐసీ శక్తివంతమైన ఆర్థిక సంస్థ
2న దేశవ్యాప్త సమ్మె సౌత్ సెంట్రల్ జోన్ బీమా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వేణుగోపాల్రావు హుస్నాబాద్ : దేశంలోని బీమా సంస్థల్లోనే ఎల్ఐసీ శక్తివంతమైన ఆర్థిక సంస్థగా అభివృద్ధి చెందుతుందని సౌత్సెంట్రల్ జోన్ బీమా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వేణుగోపాల్రావు అన్నారు. హుస్నాబాద్లోని ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బీమారంగంలో విదేశీపెట్టుబడులకు వ్యతిరేకంగా ఎల్ఐసీ పనిచేస్తుందన్నారు. రూ.27లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉందని తెలిపారు. 2015–16 సంవత్సరానికి ప్రభుత్వ రూ.5కోట్ల పెట్టుబడిపై రూ.1816 కోట్ల డివిడెండ్ చెల్లించి దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడిందన్నారు. ఎల్ఐసీని నిర్వీర్యం చేసేందుకు ఇరువై ఏళ్లుగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మతం, కులం పేరిట కార్మికుల్లో చిచ్చుపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ప్రధాన మౌలిక డిమాండ్లతో దేశవ్యాప్తంగా అంసఘటిత కార్మికులతో సెప్టెంబర్ 2న సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శి ఎం.రవీందర్, ఎస్.అశోక్కుమార్ పాల్గొన్నారు. -
అగ్గికే హడల్
♦ అత్యవసర సేవలలో అగ్నిమాపక శాఖ ఫస్ట్.. బెస్ట్ ♦ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలను కాపాడుతున్న అగ్నిమాపక సిబ్బంది ♦ నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ఇబ్రహీంపట్నం రూరల్: అగ్ని ప్రమాదాలకే హడలెత్తిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను విపత్తుల నుంచి రక్షిస్తున్నారు. గతంలో పల్లెలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే నగ రం నుంచి ఫైరింజన్ వచ్చే వరకు ఎదు రు చూపులు తప్పేది కాదు. ఇంత లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయేది. కానీ ప్రభుత్వం అగ్నిమాపక కేంద్రాలను మం డల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడంతో ప్రమాదం జరిగిన వెంటనే ఘట నా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పి స్తూ ప్రజల మన్నన్నలు పొందుతున్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదాలపై ప్రజ లకు అవగాహన కల్పిం చేందుకు ఈ నె ల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అవగాహనతోనే.. ప్రజల అవగాహన రాహిత్యంతోనే ఎ క్కువ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయని పేర్కొంటున్నారు అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండి వెంటనే స్పందించే 90శాతం ప్రమాదాలను అడ్డుకోవచ్చునని, ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేసేం దుకు ప్రభుత్వం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు. అగ్ని ప్రమాద రహిత సమాజమే ధ్యేయంగా 101 నంబర్కు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తామని చెబుతున్నారు. నేటికి 100 ప్రమాదాలకు పైగా ఎదుర్కొన్న సిబ్బంది ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బోంగ్లూర్ సమీపంలో 2013 నవంబర్ 22న అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో చోటుచేసుకున్న సుమారు 100 పైగా ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా కాపాడారు. అవగాహన కల్పిస్తాం నేటి నుంచి 20వ తేదీ వరకు వారం రోజులు వివిధ ప్రదేశాల్లో అవగహన సదస్సులు నిర్వహిస్తాం. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తాం. ప్రతి సంవత్సరం ఈ వారం రోజులు మాకు పండగలా ఉంటుంది. - దెంది మధుకర్రెడ్డి, ఫైర్మన్ ప్రజల సహకారంతోనే విపత్తులకు చెక్ మా కేంద్రంలో 14 మంది సిబ్బంది ఉన్నారు. ఎక్కడ విపత్తులు సంబవించినా స్పందించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నాం. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల పాత్ర ఎంతో కీలకం, విద్యుత్, ఎలక్ట్రిక్ ప్రమాదాలపై సరైన సమయంలో స్పందించాలి. లేకుంటే నష్టం తీవ్రస్థాయిలో ఉంటుంది. - కుమార్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఇబ్రహీంపట్నం -
ఎల్లలు దాటిన స్నేహ బంధం!
స్నేహ బంధమూ.. ఎంత మధురమూ... కరిగిపోదు చెరిగి పోదు జీవితాంతమూ అన్నాడో సినీ కవి. నిజంగా ఆ ఇద్దరు స్నేహితుల బంధమూ అలాగే కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, బంధువుల బంధాలు తెలియని అనాధలే అయినా.. శరణాలయంలో కలసి మెలసి పెరిగిన వారి స్నేహ బంధం మాత్రం విడిపోలేదు. చిన్నతనంలో ఆఫ్రికాలోని అనాధ శరణాలయంలో ఒకరికి ఒకరై బతికిన జీవితాలు... అమెరికా కు దత్తతకు వెళ్ళినా అనుకోకుండా ఒకే చోటుకి చేరుకున్నాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఆఫ్రికాలోని మొజాంబిక్ అనాథాశ్రమంలో పెరిగిన ఆ ఇద్దరు అబ్బాయిలు ఊహ తెలిసినప్పటి నుంచీ మంచి స్నేహితులు. అయితే ప్రస్తుతం 18 ఏళ్ళ వయసున్న కెల్విన్ లెవిస్, అఫోన్సో స్టేటర్ లను ఎనిమిదేళ్ల క్రితం అరిజోనా గిల్బర్ట్ నుంచి వచ్చిన రెండు కుటుంబాలు ఒకరికి తెలియకుండా ఒకరు దత్తతకు స్వీకరించారు. ఇరు కుటుంబాలు ఒకే ప్రాంతంలో కేవలం రెండు మైళ్ళ దూరంలో ఉండటంతో తిరిగి కెల్విన్, అఫోన్సో లు ఒకే కళాశాలలో చేరడంతో అసలు విషయం తెలిసింది. ఇరు కుటుంబాలు ఒకరికొకరు తెలియదు. దత్తత సమయంలోనూ కలవలేదు. అయితేనేం ఒకే ప్రాంతంలో దత్తతకు రావడంతో ఆశ్చర్యంగా ఇద్దరు స్నేహితులు తిరిగి కలుసుకున్నారు. చూసేందుకు భిన్నంగా కనిపించినా తమ స్నేహ బంధం ఎంతో ధృఢమైనదని, అందుకే తిరిగి తాము కలవగలిగామని చెప్తున్నారు. ఎక్కడో విడిపోయిన తాము తిరిగి ఒకేచోట కలిసి పెరిగే అవకాశం రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆ స్నేహితులిద్దరూ చెప్తున్నారు. ఇద్దరూ గిల్బర్ట్ హైస్కూల్లోని సాకర్ టీం లో చేరారు. బ్రిగమ్ యంగ్ యూనివర్శిటీలో సీటు సంపాదించి... రూమ్మేట్స్ గా ఉండే యోచనలో ఉన్నారు. భవిష్యత్తులో వైద్యుడుగా స్థిరపడి మొజాంబిక్ లో సేవలు అందించాలనుకుంటున్నానని కెల్విన్ చెప్తుంటే... వివిధ దేశాల మధ్య దత్తత స్వీకరణ అభివృద్ధి చేసేందుకు కావలసిన అంతర్జాతీయ అధ్యయనాల్లో డిగ్రీ చదవాలనుకుంటున్నానని అఫోన్సో చెప్తున్నాడు. మేమిద్దరం స్నేహితులేకాదు సోదరులకంటే ఎక్కువ బంధం కలగి ఉన్నామని, భవిష్యత్తులో మా పిల్లలను సైతం మంచి స్నేహితులుగా ఉండేట్టు చూస్తామని ఆ అపూర్వ స్నేహితులు... కాదు సహోదరులు చెప్తున్నారు. -
సినీ పరిశ్రమకు రాజమండ్రి బెస్ట్
గోకవరం :రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో వైజాగ్ చిత్ర నిర్మాణ కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అయితే వైజాగ్ కంటే రాజమండ్రి సినీ నిర్మాణానికి అనుకూలమైనదని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ తనకు ఇటీవల విడుదలైన లౌక్యం సినిమాలోని బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. ఆయన ఆదివారం గోకవరంలోని వీరభద్రుని గద్దెలోని దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి పళ్లెం, చీరను సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అని తెలిపారు. ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా 18 ఏళ్ల క్రితం తాను తెలుగుతెరకు పరిచయమయ్యానన్నారు. ఇంతవరకూ తాను సుమారు 75 సినిమాల్లో నటించానన్నారు. తనకు అన్ని పాత్రలు సంతృప్తినిచ్చాయన్నారు. సినీరంగంలో హీరో శ్రీహరి తనను బాగా ప్రోత్సహించారన్నారు. తాను పవన్కళ్యాణ్కు వీరాభిమానినని తెలిపారు. సాయిధర్మతేజ్ హీరోగా హరీష్శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో, రవితేజ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలోని ‘కిక్ 2’ సినిమాతోపాటు తనకు పేరు తెచ్చిన డైలాగ్ ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పేరుతో తన స్నేహితుడు కృష్ణారెడ్డి నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నానన్నారు. -
ఠాణే కార్పొరేషన్కు భారంగా టీఎంటీ
సాక్షి, ముంబై : నష్టాల్లో నడుస్తున్న ఠాణే మున్సిపల్ ట్రాన్స్పోర్టు (టీఎంటీ) ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెస్ట్ సంస్థ ప్రకటించింది. అందుకు టీఎంటీ సంస్థ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తే త్వరలో టీఎంటీ బస్సులన్నీ బెస్ట్గా మారనున్నాయి. ముంబైలాగా ఠాణేకర్లకు నాణ్యమైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఏటా ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ రూ.25 కోట్లు టీఎంటీకి ఆర్థిక సాయం అందజేస్తోంది. అయినప్పటికీ ఈ సంస్థకు ప్రతీ నెలా రూ.1.50 కోట్ల నుంచి రూ.1.75 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయి. సంవత్సరానికి రూ.25 కోట్లు మేర నష్టం వస్తోంది. టీఎంటీని పోషించడం ఠాణే కార్పొరేషన్కు పెను భారంగా మారడంతో టీఎంటీని బెస్ట్లో విలీనం చేయాలనే అంశం తెరమీదకు వచ్చింది. నష్టాల బాటలో నడుస్తున్న టీఎంటీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని బెస్ట్ కూడా ఆసక్తి కనబరుస్తోంది. టీఎంటీకి అగ్ని పరీక్ష ప్రస్తుతం టీఎంటీ సంస్థ రజతోత్సవాలు జర్పుకుంటోంది. 25 సంవత్సరాల నుంచి డొక్కు బస్సులతోనే రవాణా సేవలందిస్తున్న టీఎంటీకి ఇప్పుడు ఒక అగ్ని పరీక్షగా మారింది. సేవలను మెరుగు పరిచేందుకు నీళ్లలా డబ్బులు ఖర్చు చేస్తున్నా ఆనుకున్నంతమేర ఆదాయం మాత్రం రావడం లేదు. ఠాణే కార్పొరేషన్ ఆర్థికంగా ఆదుకుంటున్నా నష్టాల ఊబి నుంచి బయట పడలేక పోతోంది. బస్సులు తరుచూ బ్రేక్ డౌన్ కావడం, సమయానికి బస్సులు రాకపోవడం, వచ్చినా అవి కిక్కిరిసి ఉండడం లాంటి ప్రధాన కారణాలున్నాయి. టీఎంటీ ఆధీనంలో 325 బస్సులున్నాయి. ఇందులో కేవలం 125 బస్సులు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. మిగతావన్నీ మరమ్మతుల కారణంగా డిపోలకే పరిమితమయ్యాయి. మేం సిద్ధం : బెస్ట్ జీఎం టీఎంటీని తమ సంస్థలో విలీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బెస్ట్ జనరల్ మేనేజర్ ఓ.పి.గుప్తా స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇటీవలే ఠాణే మున్సిపల్ కమిషనర్ అసీం గుప్తాతో చర్చలు జరిపినట్లు ఆయన చెప్పారు. మరో రెండు, మూడు సంవత్సరాలు ఠాణే కార్పొరేషన్ టీఎంటీని ఆర్థికంగా ఆదుకుంటే ఆ తరువాత తామే స్వయంగా సేవలను అందిస్తామని వెల్లడించారు. టీఎంటీ బస్సులు బెస్ట్ ఆధీనంలోకి వస్తే సిబ్బందికి బెస్ట్ తరహాలో వేతనాలు, ఇతర భత్యాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం ఠాణేలో సేవలు అందించేందుకు బెస్ట్కు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. ఠాణేకర్లకు ముంబై తరహాలో సేవలు అందిచేందుకు మార్గం సుగమం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ముంబైలోనూ విద్యుత్ చార్జీలు తగ్గించాల్సిందే
ముంబై: నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ నిరుపమ్ శుక్రవారం నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. ఉత్తర ముంబైలోని కాండివలిలో ఉన్న రిలయన్స్ ఎనర్జీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఆయన దీక్షకు కూర్చున్నారు. ముంబై మినహా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీలను 20 శాతం తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ముంబై వాసులకు సైతం ఈ తగ్గింపు వర్తించాలని ఉత్తర ముంబై నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు. నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గించినంతవరకు తన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ను వాడుతున్న వినియోగదారులకే ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ముంబై నగరంలో ప్రైవేట్ రంగానికి చెందిన టాటా పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ పంపిణీ కంపెనీలు విద్యుత్ను పంపిణీ చేస్తున్నాయి. కాగా, లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విద్యుత్ ధర తగ్గింపు నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షపార్టీ అయిన బీజేపీ తీవ్రంగా ఆరోపించింది. అయితే దీనికి స్పందించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గత నవంబర్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే విద్యుత్ చార్జీలను తగ్గించామే తప్ప రాజకీయ కారణాలేవీ లేవన్నారు. ఈ తగ్గింపు వల్ల వచ్చే రూ.7,200 కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన అన్నారు. కాగా, నగరంలోనూ విద్యుత్ చార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ ప్రియాదత్తో పాటు నిరుపమ్ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం పృథ్వీరాజ్ చవాన్కు నిరుపమ్ లేఖ కూడా రాశారు.‘జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 50 శాతం విద్యుత్ చార్జీలను తగ్గించింది. ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో, రాష్ట్రంలో మనం ఎందుకు విద్యుత్ చార్జీలను తగ్గించలేం?..’ అంటూ ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. ప్రభుత్వం తన లేఖపై స్పందించకపోవడంతో తాను నిరాహారదీక్షకు దిగాల్సి వచ్చిందని నిరుపమ్ తెలిపారు. దీక్ష తప్పు కాదు కాని.. నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఎంపీ సంజయ్ నిరుపమ్ నిరవధిక నిరాహారదీక్షకు దిగడం అప్రస్తుత చర్యగా ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం విద్యుత్ చార్జీలను తగ్గించిన ప్రభుత్వం, ముంబై విషయంలో వచ్చే శాసనసభ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించిందన్నారు. విద్యుత్ చార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం లేదా ఎంఈఆర్సీ తప్ప రిలయన్స్ ఎనర్జీ కాదని ఆయన నొక్కిచెప్పారు. ‘నిరుపమ్ పోరాటం చేయడంలో తప్పు లేదు కానీ అతడు దీక్ష చేస్తున్న స్థలం మాత్రం కరెక్ట్ కాదు..’ అని ఆయన అన్నారు. ఫ్లైఓవర్లపై సుంకం ఎత్తివేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్కు బీఎంసీ స్థాయీ కమిటీ అధ్యక్షుడు రాహుల్ షెవాలే లేఖ రాయడంపై నవాబ్ మాలిక్ స్పందిస్తూ..‘ ఒకప్పుడు సేనా-బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుంకం వసూలు పద్ధతినే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది తప్ప కొత్తగా చేపట్టిన విధానం కాదు..’ అని అన్నారు. ‘శివసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఫ్లైఓవర్ల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. నిర్మాణ వ్యయాన్ని సదరు ప్రైవేట్ కంపెనీలు వసూలు చేసుకునేందుకు సుంకం విధానాన్ని ప్రవేశపె ట్టింది..’అని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా నగరంలో విద్యుత్ ధరలను 50 శాతం తగ్గించాలని శివసేన డిమాండ్ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు.‘బీఎంసీలో మీరే అధికారంలో ఉన్నారు.. నగరంలో బెస్ట్ వసూలుచేస్తున్న విద్యుత్ చార్జీలను ముందు తగ్గించండి.. తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడండి..’ అంటూ ఆయన సవాల్ విసిరారు. -
బెస్ట్ ఫస్ట్!!
ముంబై: ఆ సంస్థ పేరు ‘బెస్ట్’! ప్రయాణికులను బస్సుల్లో గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. అయితే ‘బెస్ట్’ అనేది పేరులో మాత్రమేనని, ఆ సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగుల వ్యవహారశైలి ‘వరెస్ట్’గా ఉందంటున్నారు నగరవాసులు. ప్రమాదాలు చేయడంలో, బాధితులకు పరిహారం చెల్లించడం లో, రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిం చడంలో బెస్ట్ సంస్థే మొదటిస్థానంలో నిలుస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇది ఎన్నోసార్లు తేటతెల్లమైంది కూడా. 2010లో ఓ బెస్ట్ బస్ డ్రైవర్ ఉన్మాదిలా మారి వ్యతిరేక దిశలో బస్సు నడిపి రహదారిపై రణరంగమే సృష్టించాడు. 2012-13 మధ్య కాలంలో తొమ్మిదినెలల్లో కూడా బెస్ట్ డ్రైవర్లు 30కి పైగా ప్రమాదాలు చేశారు. దీనికి మరో నాలుగు నెలల ప్రమాదాలు జతకావాల్సి ఉంది. ఇక బాధితులకు బెస్ట్ సంస్థ చెల్లించిన పరిహారం విషయానికి వస్తే 2010లో ప్రమాదానికి గురైన బాధితులకు రూ.38.89 లక్షలు చెల్లించింది. ఈ విషయమై బెస్ట్ కమిటీ మాజీ సభ్యుడు రవిరాజా మాట్లాడుతూ.. ‘పరిహారాల చెల్లింపుల విషయంలో బెస్ట్ సంస్థ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అదే ప్రమాదాలు జరగకుండా ఉంటే ఆ సొమ్మును ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయొచ్చ’న్నారు. గతంలో తరచూ ఉన్నతాధికారుల తనిఖీలు ఉండేవని, ఆకస్మిక తనిఖీల్లో డ్రైవర్లు, కండక్టర్ల పరిస్థితి ఏమిటో తెలిసొచ్చేదని, ఇప్పుడదంతా లేకుండా పోయిందన్నారు. అయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ఉండేందుకు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఎంతైనా అవసరమన్నారు. సామాజిక కార్యకర్త జీఆర్ వోరా మాట్లాడుతూ.. ‘బెస్ట్ డ్రైవర్లు బస్సులను చాలా నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. రోడ్డుపై తామే రాజులమనుకుంటున్నారు. సిగ్నల్స్ వద్ద కూడా ఆగడంలేదు. దీంతో పాదచారులు తరచూ ప్రమాదాలబారిన పడుతున్నార’ని ఆరోపించారు. ఈ విషయమై బెస్ట్ ప్రయాణికుల హక్కుల కార్యకర్త ఇర్ఫాన్ మచివాలా మాట్లాడుతూ.. ‘విధులు సక్రమంగా నిర్వర్తించే డ్రైవర్లకు ఎటువంటి ప్రోత్సాహకాలను ఆ సంస్థ ఇవ్వడంలేదు. దీంతో ఎంత కష్టపడి పనిచేసినా, చేయకపోయినా అంతే వేతనం లభిస్తుందనే ఆలోచనతో డ్రైవర్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నార’న్నారు. బెస్ట్ అధికార ప్రతినిధి ఏఎస్ తంబోలి మాట్లాడుతూ.. ‘బెస్ట్ డ్రైవర్ల రికార్డులను పరిశీలించాలని నిర్ణయించాం. గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క ప్రమాదానికి కూడా బాధ్యులు కాని డ్రైవర్లకు ప్రోత్సాహం అందజేయాలని నిర్ణయించాం. ఇది మిగతా డ్రైవర్లకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నామ’న్నారు.