confidence
-
Mitti Cafe: అలీన అద్భుత దీపం...
అద్భుతాలు జరగడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కర్లేదు. కాస్త ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. అలీన ఆ ఆత్మవిశ్వాసంతో సాధించిన అద్భుతం...మిట్టీ కేఫ్. ఆఫీసుల నుంచి రెస్టారెంట్ల వరకు దివ్యాంగులకు సరిౖయెన సౌకర్యాలు లేని పరిస్థితి. ‘నేను ఉద్యోగం చేస్తాను’ అని అడిగితే ‘సారీ’ చెప్పే పరిస్థితి. ఇది తెలిసి కూడా దివ్యాంగులను ఉద్యోగులుగా, ఎంటర్ప్రెన్యూర్లుగా చూడాలని కల కన్నది అలీనా అలమ్. ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆమె మొదలుపెట్టిన ‘మిట్టీ కేఫ్’ ఆ తరువాత కాలంలో అద్భుతం సృష్టించింది. ‘మిట్టి కేఫ్’ అనేది ఇప్పుడు ఒక కేఫ్ బ్రాండ్ మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిధ్వనించే బ్రాండ్...దివ్యాంగుల కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘సమర్థన’ ట్రస్ట్లో ఇంటర్న్షిప్ ్ర΄ోగ్రామ్ చేస్తున్న రోజుల్లో ‘మిట్టీ కేఫ్’ ఆలోచన ఆలీనా అలమ్కు వచ్చింది. సోషల్ ఎంటర్ప్రెన్యూర్గా తన కలను సాకారం చేసుకోవడానికి ‘మిట్టీ కేఫ్’ మంచి ఆలోచన అనుకుంది.‘పెళ్లి చేసుకో లేదా ఉద్యోగం చెయ్’ అన్నారు తల్లిదండ్రులు. అలీనా మాత్రం సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ దారిలో నడక మొదలు పెట్టింది. దివ్యాంగుల కోసం, దివ్యాంగుల చేత నడుస్తున్న ‘మిట్టీ కేఫ్’లు సక్సెస్ అయ్యాయి.‘మన దేశంలోని లక్షలాది మంది దివ్యాంగులు సమాన అవకాశాల కోసం, ఆర్థికంగా సొంతకాళ్ల మీద నిలబడడం కోసం ఎదురుచూస్తున్నారు. సమస్య అనేది వారి సామర్థ్యం గురించి కాదు. సమస్య మనం చూసే దృష్టి కోణంలో ఉంది. వారి గురించి మనకు ఎన్నో అ΄ోహలు ఉంటాయి. చిన్న చూపు ఉంది. ఈ పరిస్థితి పూర్తిగా మారి΄ోవాలి’ అంటున్న అలీన ‘మిట్టీ కేఫ్’ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉ΄ాధితో΄ాటూ ఆత్మస్థైర్యాన్నీ ఇచ్చింది.దాతలు ఇచ్చిన విరాళాలతో‘మిట్టీ కేఫ్’ మొదలైంది. ‘సంకల్పం మంచిదైతే సహాయపడడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అన్నట్లు ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమాని కేఫ్కు సంబంధించిన ΄ోస్టర్లను ఉచితంగా ముద్రించి ఇచ్చాడు.దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘మిట్టీ కేఫ్’లను తీర్చిదిద్దారు. దృష్టి లోపం ఉన్నవారు బిల్లింగ్ చేయడానికి వీలుగా బిల్లింగ్ సిస్టమ్లో ఆడియో ఫీచర్ ఉంది. మెనూ బ్రెయిలీ లిపిలో ఉంటుంది. వినికిడి లోపం ఉన్న, మూగ ఉద్యోగులు కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి ప్లకార్డులు కూడా ఉంటాయి.హుబ్లీలోని చిన్న షెడ్లో మొదలైన ‘మిట్టీ కేఫ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా ఎయిర్΄ోర్ట్స్, పెద్ద కంపెనీలు, బ్యాంకులు... మొదలైన వాటిలో 46 ‘మిట్టీ కేఫ్’లు నడుస్తున్నాయి. గత సంవత్సరం సుప్రీంకోర్టు ్ర΄ాంగణం, రాష్ట్రపతి భవన్, ఐఐఎం–బెంగళూరులో ‘మిట్టీ కేఫ్’లను ్ర΄ారంభించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని విమాన్రాశయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లలో ‘మిట్టీ కేఫ్’ లు ఏర్పాటు చేయనున్నారు.‘కరేజ్’ ‘మ్యాజిక్’ అనే మాటలు అలీన నోటి నుంచి తరచుగా వినిపిస్తుంటాయి. ‘ధైర్యం’ ఉన్న చోటే ఊహించని అద్భుతాలు, మ్యాజిక్లు జరుగుతాయి. ‘మిట్టీ కేఫ్’ రూపంలో అద్భుతం సృష్టించడానికి అలీనాలోని ధైర్యమే కారణం. ఆమెకు బాగా ఇష్టమైన కొటేషన్...‘ఎక్కడ దయాగుణం ఉంటుందో... అక్కడ మంచితనం ఉంటుంది.ఎక్కడ మంచితనం ఉంటుందో... అక్కడ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది’‘మనం మాత్రం ఏం చేయగలం’ అనుకునే నిరాశావాదులకు అలీన ఆలమ్ విజయం కనువిప్పు లాంటిది. కొత్త దారి చూపే కాంతి కిరణంలాంటిది. ‘మిట్టీ కేఫ్’లో పనిచేసిన దివ్యాంగ ఉద్యోగులలో కొందరు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్లుగా రాణించడం మరో మంచి విజయం. -
రెండోసారి కూడా మన ప్రభుత్వమే..
-
Anantha Nageswaran: ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లో విశ్వాస పునరుద్ధరణ నెలకొందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఇందుకుగాను ఆయన ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ విశ్వాస పునరుద్ధరణ భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల పురోగతి స్పష్టంగా ప్రతిబింబిస్తున్నట్లు నాగేశ్వరన్ వెల్లడించారు. ‘‘ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ జరిగింది. లేకపోతే, భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వద్ద ఎలా వృద్ధి చెందుతుంది? అలాగే మీరు పర్చేజింగ్ మేనేజర్ల ఇండెక్స్, తయారీ, సేవల సూచీల పురోగతి స్టాక్ మార్కెట్ పనితీరును చూడండి. స్థూల దేశీయోత్పత్తి అంకెల్లో సానుకూలంగా కనిపిస్తున్నాయి’’ అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏమి చెప్పారంటే... ► ప్రైవేట్ రంగంలో లిస్టెడ్ కంపెనీలు తమ మూలధన వ్యయాలను ప్రారంభించాయని, కొత్త ప్రాజెక్ట్ ప్రకటనలనూ చేస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన మధ్యంతర బడ్జెట్లో ఇదే విషయాన్ని వెల్లడించారు. ► ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24 తో పోలి్చతే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో విశ్లేషించారు. ► ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నేపథ్యంలో స్టీల్, సిమెంట్, పెట్రోలియం వంటి కొన్ని రంగాలలో ఇటీ వలి కాలంలో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకున్నాయి. ► 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి అంచనాల నేపథ్యంలో రుణాలకు సంబంధించి అటు కార్పొరేట్, ఇటు బ్యాంకింగ్ రంగాల బ్యాలెన్స్ షీట్లు రెండూ కొంత ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ► కోవిడ్ నేపథ్యంలో రుణ భారాలను తగ్గించుకోడానికి తమ అసెట్స్ను సైతం విక్రయించిన కంపెనీలు, తాజా సానుకూల ఆర్థిక వాతావరణం నేపథ్యంలో రుణ సమీకరణ, వ్యాపార విస్తరణలపై దృష్టి సారించాయి. బ్యాంకింగ్ మూలధన నిష్పత్తి పటిష్టం.. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ తెలిపిన సమాచారం ప్రకారం, 15 శాతం సగటు మూలధన నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో)తో బ్యాంకుల ఫైనాన్షియల్ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసే సమయానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) 16.85 శాతంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్యాపిటల్ అడిక్వసీ రేషియో అత్యధికంగా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 16.80 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 16.13 క్యాపిటల్ అడిక్వసీ రేషియోను కలిగిఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 253 శాతం వృద్ధితో (రూ. 2,223 కోట్లు) అత్యధిక త్రైమాసిక నికర లాభం వృద్ధిని సాధించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 62 శాతం వృద్ధితో (రూ. 1,870 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60 శాతం పెరుగుదలతో (రూ. 3,590 కోట్లు) తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. -
ముఖ స్తుతి
పొగడ్తకి పొంగిపోని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మనుషులే కాదు దేవతలు కూడా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బై పోతారు. పొగడ్త వినగానే డోపమైన్ అనే హార్మోను విడుదల అవుతుంది. అందుకే దైవాన్ని ఇష్టదైవాన్ని అష్టోత్తరాలు, సహస్రనామాలతో కీర్తిస్తూ ఉంటారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు. జంతువులు కూడా పొగిడితే సంతోషిస్తాయి. పెంపుడు జంతువులున్నవారికి ఇది అనుభవమే. పొగడ్తలు మనిషిని ప్రోత్సహించే వరకు ఉపయోగ పడతాయి. నిజంగా ప్రతిభ ఉన్నవారికి చిన్న మెప్పుదల ఉత్సాహాన్ని ఇస్తుంది. తాము చేస్తున్నది మంచిదే అయినా సాటివారి ఆమోదముద్ర తమ పని మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పొగడ్తలో కొంచెం అయినా నిజం ఉంటుంది. ముఖస్తుతిలో అంటే ఎదురుగా పొగడటంలో నిజం ఉండే అవకాశం తక్కువ. మెరమెచ్చుల కోసం లేనిపోనివి అపాదించి చెప్పటం ముఖస్తుతి. ఆ సంగతి అంటున్నవారికి, వింటున్నవారికి తెలుసు. అయినా ఇష్టం లేనట్టు ముఖం పెట్టి వింటూనే ఉంటారు. లోలోపల సంతోషంగానే ఉంటుంది. ఎటువంటి వారికైనా తమని మెచ్చుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. ‘‘మీ లాగా పొగడ్తలు ఇష్టపడని వారు చాల గొప్పవాళ్ళు. అందుకే మీరంటే నాకు ఎంతో అభిమానం.’’ అంటే బోల్తాపడరా? చిన్నపిల్లల దగ్గర నుండి, దేవతల వరకు. ముఖస్తుతిని ఆశించి, ఆనందించే వారు సాధారణంగా నష్టపోతూ ఉంటారు. తనకి అపాదించబడిన గుణాలు తనలో ఉన్నాయేమో నని భ్రమ పడుతూ ఉంటారు. ఆ భ్రమ వల్ల దానిని నిజం చేయాలనే తాపత్రయంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏవిధంగా ఉంటాయో గమనించ వచ్చు. ఉదాహరణకి: మన్మథుడు, శల్యుడు. ఇంద్రుడు మన్మథుణ్ణి పిలిపించి అతడి సామర్థ్యాన్ని పొగుడుతాడు. అతడు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి ‘‘నేను ఎంతటి వారినైనా ప్రలోభపెట్ట గలను – శివుడైనా సరే!’’ అంటాడు. ఇంద్రుడికి కావలసింది అదే! అంతే! ఇరుక్కుపోయాడు. శరీరాన్ని కోల్పోయాడు. శల్యుణ్ణి దుర్యోధనాదులు పొగిడి కర్ణుడి రథసారథిగా ఒప్పించారు. ససేమిరా, నేను సారథ్యం చేయట మేమిటి? అని భీష్మించుకున్న శల్యుడు తనని కృష్ణుడితో సమానమని పోల్చగానే ఆ పొగడ్తల మాయాజాలంలో పడి రథసారథ్యం చేశాడు. ములగచెట్టు ఎక్కించటం అని చమత్కారంగా అంటూ ఉంటారు. ఆ కొమ్మ పుటుక్కున విరిగిపోతుంది. ముఖస్తుతి చేసే వారు ఎదుట పొగిడినా, వెనుక విమర్శిస్తూ ఉంటారు. పైగా పొగడ్తలకి పడిపోయారని చులకనగా మాట్లాడుతారు. ఈ ఆయుధం కొన్ని మారులు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ‘‘నా బంగారుకొండ మంచివాడు. చక్కగా అన్నం తిని నిద్రపోతాడు.’’ అంటుంది తల్లి. వాడు అన్నం తినటానికి పేచీ పెడతాడని ఒక పట్టాన నిద్రపోడని ఆ తల్లికి తెలుసు. వినగా, వినగా ఆ లక్షణాలు కొడుకులో పెంపొందుతాయేమోననే ఆశతో ఆ విధంగా పొగుడుతుంది. ఒక రాజుకి ఒక కన్ను లేదు. తన చిత్రాన్ని అందంగా వేసిన వారికి బహుమతి ప్రకటించాడు. ఒక చిత్రకారుడికి ఆ బహుమతి దక్కింది. రాజు విల్లు ఎక్కుపెట్టి లక్ష్యం వైపు చూడటానికి ఒక కన్ను మూసినట్టు వేశాడు. పొగడటానికి అబద్ధాలు చెప్పనక్కర లేదు. సాధారణంగా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి లేని సద్గుణాలని అపాదించి ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించేదే ముఖస్తుతి. పిల్లికి బిచ్చం పెట్టని వాణ్ణి దానకర్ణుడని, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేని వాణ్ణి బృహస్పతి అని పొగడటం ముఖస్తుతి కాక మరేమిటి? ముఖస్తుతికి అలవాటు పడిన వారు విమర్శను అంగీకరించ లేరు. ఆత్మవిమర్శ అసలే ఉండదు. తాము చేసింది సరైనదే అనే మొండిపట్టు ఉంటుంది. పొరపాట్లని సరిదిద్దుకునే లక్షణం ఉండదు కనుక నాశాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మహత్కార్యాలు చేయటానికి ఈ పొగడ్త ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి హనుమ. – డా.ఎన్.అనంత లక్ష్మి -
PM Narendra Modi: మూడోసారీ మేమే...
న్యూఢిల్లీ: వరుసగా మూడో పర్యాయం ప్రధాని పదవిని చేపడతానని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తమ మూడో పర్యాయంలో మెరుగైన వృద్ధిరేటుతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనే నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ భారత్ తప్పకుండా పేదరిక నిర్మూలన సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినపుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా... ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. -
గన్ షాట్: వచ్చే ఎన్నికల్లో జగన్ తుఫాన్ ఎలా ఉండబోతోంది ..!
-
SOMA BANIK: ఆరోగ్యమే ఆత్మవిశ్వాసం
ఓ భారతీయ యువతీ! తెల్లగా ఉండడమే అందానికి కొలమానం అని ఎవరు నిర్దేశించారు? అందంగా ఉన్న వాళ్లే విజేతలవుతారని నీకు ఎవరు చెప్పారు? ఆత్మవిశ్వాసానికి తెల్లగా ఉండడమే గీటురాయి అనే సూత్రం ఎలా వచ్చింది? మీ రెజ్యూమెలో మార్కులతో రాని ఆత్మవిశ్వాసం అందంతో వస్తుందా? నీకు ఉద్యోగం తెచ్చేది నువ్వు సాధించుకున్న మార్కులే... తెల్లదనం కాదు. తెల్లదనమే అందమనే అపోహ కాస్మెటిక్ మార్కెట్ సృష్టించిన మాయాజాలం. ఈ మాయాజాలం ఇప్పుడు భారతీయ మహిళల ఆరోగ్యాన్ని హరిస్తోంది. అరగంట ఎండను తాళలేకపోతే సమానత్వ పోరాటంలో మహిళ స్థానమెక్కడ? భారతీయ మహిళలు ఆరోగ్యం కోసం చేసే ఖర్చు కంటే అందంగా కనిపించడం కోసం చేసే ఖర్చే ఎక్కువగా ఉంటోంది. భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిణామాలకు ఇది తొలి సంకేతం. వైటెనింగ్ క్రీమ్లు వాడుతున్న వాళ్లను ముంబయిలో ఓ సంస్థ ప్రశ్నించినప్పుడు ‘తెల్లగా ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటాననే ఉద్దేశం తో ఫెయిర్నెస్క్రీమ్ని వాడుతున్నాను’ అని కొందరు బదులిచ్చారు. ఇంకా... ‘మా ఇంట్లో వాళ్లు, స్నేహితులు ఫెయిర్నెస్ క్రీమ్ వాడమని చెప్పారు, వాడినప్పుడు బావున్నానని చెప్పారు. అందుకే కంటిన్యూ చేస్తున్నాను... అని, సినిమా వాళ్లు, యాడ్లో ఈ క్రీమ్లు వాడినందువల్లనే అందంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి నేను కూడా అలా కనిపించడం కోసం వాడుతున్నాను’... ఇలాంటి సమాధానాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే... కోల్కతాకు చెందిన సోమా బానిక్ చేదు అనుభవం ఇలా ఉంది. ∙∙ అది 2003, సోమా బానిక్కి పద్నాలుగేళ్లు. అప్పుడు సోమా బానిక్ తల్లితో ఓ పక్కింటావిడ అన్న మాటలు ఆ అమ్మాయి జీవితం మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించాయి. ‘చర్మాన్ని తెల్లబరచడానికి మార్కెట్లో అన్ని క్రీమ్లున్నాయి కదా! మీ అమ్మాయికి ప్రయత్నించండి. కొత్తగా ఫలానా క్రీమ్ వచ్చింది. మంచి ఫలితం ఉంటోందట’ అని వైటెనింగ్ క్రీమ్ పేరు కూడా చెప్పిందా పక్కింటావిడ. తెల్లగా ఉంటేనే విజేతలవుతారా! ఒక అమ్మాయి విజేతగా నిలవడానికి దగ్గర దారి తెల్లగా ఉండడమే అన్నంతగా కాస్మెటిక్ కంపెనీలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న రోజులవి. క్రీమ్ని వాడడం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్కూల్లో ఫ్రెండ్స్ సోమా చర్మంలో వచ్చిన మార్పును గుర్తించడం, ప్రశంసించడం మొదలైంది. రెండు నెలలు గడిచేటప్పటికి అసలు సమస్య మొదలైంది. ఎండలోకి వెళ్తే చర్మం చిరచిరలాడడం, మంట, దద్దుర్లు రావడం మొదలైంది. వైటెనింగ్ క్రీమ్ వాడేవాళ్లు ఇలాంటి మార్పును స్వచ్ఛందంగా స్వాగతిస్తారు. చర్మం తెల్లగా అయ్యే క్రమంలో ఇలాగే ఉంటుందని తమకు తాముగా సమాధానం చెప్పుకుంటారు. సోమా కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. ఓ రోజు... క్రీమ్ రాసుకోవడం మరిచిపోయింది. స్కూలుకు వెళ్లిన కొద్ది గంటలకే ఆమె గడ్డం మీద చిన్న మచ్చలా మొదలై మొటిమలా తేలింది. ఇక క్రమం తప్పకుండా క్రీమ్ రాస్తూ ఏడాది పాటు కొనసాగించింది. చెంపల మీద మొదలైన సన్నని వెంట్రుకలు ముఖమంతా రావడాన్ని గమనించిందామె. ఇప్పుడామె వయసు 33. కోల్కతాలో స్టేట్గవర్నమెంట్ ఉద్యోగిని. ఇప్పుడామె భర్త ఎపిలేటర్ సహాయంతో ముఖం మీది వెంట్రుకలను తొలగించడంలో సహాయం చేస్తున్నాడు. ఇవన్నీ సోమా బానిక్ తన బ్లాగ్లో రాసుకున్న వివరాలు. ఈ లక్షణాలను విశ్లేషించిన డెర్మటాలజిస్టులందరూ ముక్తకంఠంతో చెప్పిన మాట ఒక్కటే... ‘చర్మం తెల్లగా మారడానికి ఆమె వాడిన వైటెనింగ్ క్రీమ్లో ఉన్న స్టిరాయిడ్స్ కారణం’ అని. అది కూడా దీర్ఘకాలం వాడడం వల్ల వెంట్రుకల వంటి సమస్యకు దారి తీసిందనీ. రంగు మార్చే క్రీమ్లు లేవు! చర్మం రంగును క్రీమ్లతో మార్చడం సాధ్యమయ్యే పని కాదన్నారు బెంగళూరుకు చెందిన డెర్మటాలజిస్ట్ ప్రియాంక రెడ్డి. ‘‘డెర్మటాలజీలో ఎంతటి అధునాతనమైన యంత్రాలు, ఔషధాలు వచ్చాయంటే... కోటి రూపాయల మెషినరీ కూడా ఉంది. కానీ చర్మాన్ని తెల్లబరిచే యంత్రం కానీ ఔషధం తయారు కాలేదు, కాదు కూడా. ఎందుకంటే చర్మం రంగు జన్యుపరంగా నిర్ణయమవుతుంది. అలా నిర్ణయమైన చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చడానికి వీలుంటుంది. గ్లూమింగ్తోపాటు చర్మం మెరుపుతో కాంతులీనేటట్లు చేసే ట్రీట్మెంట్లున్నాయి. కానీ తెల్లబరిచే ట్రీట్మెంట్లు లేవు. అది ఆరోగ్యకరం కాదు కూడా. కొంతమంది హీరోయిన్లను ఉదాహరణ గా చూపిస్తూ ఉంటారు. కానీ అది మేకప్, కెమెరా టెక్నిక్స్, ఎడిటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వాళ్లు ఆరోగ్యకరమైన ట్రీట్మెంట్లు చేయించుకుంటారు తప్ప స్టిరాయిడ్స్, హైడ్రోక్వైనోన్లు ఉండే వైటెనింగ్ క్రీమ్ల జోలికి వెళ్లరు. చర్మ సంరక్షణలో ఆరోగ్యకరమైన పద్ధతులనే అవలంబిస్తారు’’ అని చెప్పారామె. స్కిన్ వైటెనింగ్, లైటెనింగ్ వంటి హానికారకమైన డ్రగ్స్ మీద ఆంక్షలు విధించాలని 2017లో ఐఏడివీఎల్ (ఇండియన్ అసోసిÄేæషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్ వెనెరియాలజిస్ట్) ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసింది. నిషేధిత ఔషధాలు మార్కెట్లో యధేచ్ఛగా లభించడం మనదేశంలో జరుగుతున్న అరాచకమే. ‘అప్పియరెన్స్లో ఏముంది’ అని చెప్పడం సులువే, కానీ సమాజం అప్పియరెన్స్నే ప్రధానంగా చూస్తూ తోటివారిని న్యూనతకు గురి చేస్తూనే ఉంటుంది. సమాజం ఆలోచన మారి తీరాల్సిందేనన్నారు ప్రియాంక. అసలు ఈ తెల్లదనపు మాయకు ఆజ్యం పోసింది మన ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ అంటే ఆశ్చర్యం కలగక మానదు. రవివర్మ చిత్రలేఖనాన్ని డచ్ చిత్రకారుడి దగ్గర నేర్చుకోవడం... మన భారతీయ మహిళల మీద ఈ స్థాయిలో తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించింది. ఆయన చిత్రించిన బొమ్మల్లో చాలా వరకు తెల్లగా యూరోపియన్ స్కిన్టోన్తో ఉంటాయి. ఆ బొమ్మల క్యాలెండర్లు దాదాపుగా అన్ని ఇళ్లకూ చేరాయి. అందంగా ఉండడం అంటే చర్మం తెల్లగా ఉండాలనే అపోహ కూడా ఇంటి గోడల నుంచి మెదడుకు దారి తీసింది. సమాజం ఈ అపోహ నుంచి బయటపడాలంటే మేధోవికసితమైన ఉద్యమం ఒకటి మౌనంగానే అయినా మొదలు కావాలి. అప్పుడు వైటెనింగ్, లైటెనింగ్ క్రీమ్ల మార్కెట్ మనదేశం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంది. ఆరోగ్యమే అందం వైటెనింగ్ క్రీమ్లను రెండు నుంచి మూడు నెలలు వాడినప్పటి నుంచి చర్మం పలుచబడడం, ఎర్రబారడం మొదలవుతుంది. ఎంతగా అంటే.. రక్తనాళాలు కనిపించేటంతగా పలుచబడుతుంది. ఆపేయగానే మొటిమలు, పిగ్మెంటేషన్ (మంగు) మొదలవుతాయి. దీర్ఘకాలం వాడితే చర్మం మీద వెంట్రుకలు మొదలవుతాయి. చర్మ సంరక్షణకు సాధారణంగా అవసరమయ్యేవి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్లు మాత్రమే. అంతకు మించి ఏ అవసరం ఏర్పడినా డెర్మటాలజిస్ట్ను సంప్రదించాల్సిందే. చర్మతత్వాన్ని స్వయంగా పరిశీలించి, సమస్యను, వయసును దృష్టిలో పెట్టుకుని క్రీమ్ లేదా లోషన్లను వాడాల్సి ఉంటుంది. తెల్లదనం కోసం ఖర్చు పెట్టడం వృథా ప్రయాస మాత్రమే. పొల్యూషన్ చర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దేహం ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా కాంతులీనుతుంది. మంచి ఆహారం, తగినంత నిద్ర, నీరు తీసుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసి చెమట ద్వారా మలినాలు బయటకు పంపించడం కూడా చర్మానికి మెరుపునిస్తుంది. – డాక్టర్ ప్రియాంక రెడ్డి, మెడికల్ డైరెక్టర్, డీఎన్ఏ స్కిన్ క్లినిక్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి -
Sheroes Hangout: ఆత్మబలమే అసలైన అందం... ఆనందం
ఆ కేఫ్ వేడివేడి చాయ్లకు మాత్రమే ఫేమస్ కాదు. వేడి, వేడి చర్చలకు కూడా. ఎక్కడో ఏదో దిగులుగా ఉందా? అంతా శూన్యం అనిపిస్తుందా? అయితే అటు పదండి. దేశవ్యాప్తంగా ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు అంతులేని ధైర్యాన్ని ఇచ్చిన శ్రేయాస్ హ్యాంగవుట్ కేఫ్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది... ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలోని ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ కేవలం రుచుల కేఫ్ మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం లేనివారికి అంతులేని ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే వేదిక. అభాగ్యుల కన్నీటిని తుడిచే చల్లని హస్తం. ఆపదలో ఉన్నవారికి చేయూత ఇచ్చి ముందడుగు వేయించే ఆత్మీయ మిత్రురాలు. యాసిడ్ ఎటాక్ సర్వైవర్స్ ఈ కేఫ్ను నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు స్ఫూర్తి ఇచ్చిన ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. ప్రముఖ బ్యూటీ చైన్ సెలూన్ ‘నెచురల్స్’తో కలిసి యాసిడ్ బాధిత మహిళలకు ప్రొఫెషనల్ బ్యూటీ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఈ కోర్స్ చేయడానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, వారు సొంతంగా బ్యూటీపార్లర్ ప్రారంభించడానికి అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అయిదు మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. వారిలో ఒకరు ఫరాఖాన్. ఒకప్పుడు ఆమెకు మేకప్ వేసుకోవడం అంటే ఎంతో ఇష్టం. అయితే భర్త యాసిడ్ దాడి చేసిన తరువాత అద్దంలోకి చూడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ‘అందరు మహిళలలాగే నాకు కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం. శుభకార్యాలకు వెళ్లడానికి ముందు ఎంతో హడావిడి చేసేదాన్ని. నా భర్త చేసిన దుర్మార్గం వల్ల మేకప్ అనే మాట వినబడగానే కన్నీళ్లు ధారలు కట్టేవి. అద్దం చూడడానికి భయమేసేది. ఇలాంటి నా మానసిక ధోరణిలో పూర్తిగా మార్పు తీసుకువచ్చి నన్ను బలమైన మహిళగా నిలబెట్టింది శ్రేయాస్. పూర్వంలాగే ఇప్పుడు నేను మేకప్ విషయంలో శ్రద్ధ చూపుతున్నాను. ఏ తప్పు చేశానని భయపడాలి? ఎవరికి భయపడాలి!’ అంటుంది ఫరాఖాన్. 28 సంవత్సరాల కుంతి సోని డిమాండ్ ఉన్న నెయిల్ ఆర్ట్లో శిక్షణ తీసుకుంది. ఒక సినిమా కోసం బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణెతో కలిసి పనిచేసింది. ‘యాసిడ్ బాధితులకు ఉపాధి దొరకడం ఒక ఎల్తైతే, అందమైన ఆనంద జీవితం మరో ఎత్తు. యాసిడ్ బాధితురాలైన నేను మేకప్ వేసుకుంటే నలుగురు చులకనగా మాట్లాడతారేమో...అనే భావనతో చాలామంది అలంకరణ అనే అందమైన సంతోషాన్ని తమ ప్రపంచం నుంచి దూరం చేసుకుంటున్నారు. అలాంటి వారికి శ్రేయాస్ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది’ అంటుంది సోని. ఘాజిపూర్కు చెందిన రూపాలి విశ్వకర్మ సినిమా రంగంలో మేకప్–ఆర్టిస్ట్ కావాలని బలంగా అనుకుంటుంది. కొన్ని ప్రాంతీయ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు వేసిన రుపాలి ఆర్టిస్ట్గా నిలదొక్కుకోకముందే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది. ఆమె రంగుల కల నల్లగా మసక బారింది. ఒకప్పుడు కళ్లముందు సుందర భవిష్యత్ చిత్రపటం తప్ప మరేది కనిపించేది కాదు. దాడి తరువాత ఎటుచూసినా దుఃఖసముద్రమే! ‘బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు ఇంటివాళ్ల నుంచి కూడా నన్ను పట్టించుకోని నిర్లక్ష్య ధోరణి ఎదురైంది. ఒక మూలన కూర్చొని జీవితాన్ని వెళ్లదీయి అన్నట్లుగా ఉండేవి వారి మాటలు. అయితే శ్రేయాస్తో పరిచయం అయిన తరువాత నాలో ధైర్యం పెరిగింది. మరుగున పడిన కలలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. నేను మేకప్–ఆర్టిస్ట్గా రాణించడం మాత్రమే కాదు, ధైర్యం లోపించి దారి కనిపించని యువతులకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటుంది రుపాలి. శ్రేయాస్ సరికొత్త ముందడుగు ద్వారా ‘అలంకరణ, అందం అనేవి మనకు సంబంధించిన మాటలు కావు’ అనే దుఃఖపూరిత నిరాశానిస్పృహలకు కాలం చెల్లుతుంది. ‘ఆత్మబలమే అసలైన అందం, ఆనందం’ అనుకునే కొత్త కాలం ఒకటి వస్తుంది. -
భారతీయులు ఆత్మ విశ్వాసం కోల్పోరు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనా సరే భారతీయులు ఆత్మవిశ్వాసం కోల్పోరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ మేరకు సంపూర్ణ శక్తియుక్తులతోపాటు అకుంఠిత దీక్షతో కరోనా సవాలును అధిగమించగలరని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సరైన అవగాహన కల్పించడంతోపాటు పారిశుద్ధ్యం, పరిశుభ్రత దిశగా పంచాయతీ పాలన మండళ్లు తగు చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ కోరారు. ‘‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’’(పీఎం–కిసాన్) పథకం కింద ప్రధాని మోదీ శుక్రవారం 9.50 కోట్ల మందికి పైగా రైతులకు 8వ విడతగా రూ.20,667 కోట్లను విడుదల చేశారు. వర్చువల్గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ పీఎం–కిసాన్ కింద ఇప్పటి వరకు 1.35 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని పలువురు రైతులతో కాసేపు ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో 170 మంది ఆదివాసీ రైతులకు వ్యవసాయంలో మార్గదర్శనం చేస్తున్న ఎన్.వెన్నూరమ్మ కృషిని ప్రధాని అభినందించారు. ‘‘ఈ పథకం కింద పశ్చిమ బెంగాల్ రైతులు 7.03 లక్షల మంది తొలిసారి లబ్ధి పొందనున్నారు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో కూడా ఆహార ధాన్యాలు, ఉద్యాన పంటలను రికార్డు స్థాయిలో పండించిన రైతుల కృషి అభినందనీయం. వారికి శ్రమకు ఫలితం దక్కేవిధంగా ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో పంటల కొనుగోళ్లలో ఏటా కొత్త రికార్డులు çసృష్టిస్తోంది. ‘ఎంఎస్పీ’తో ధాన్యం సేకరణలో కొత్త రికార్డు నెలకొనగా, గోధుమ కొనుగోళ్లు కూడా కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకూ ‘ఎంఎస్పీ’తో కొనుగోళ్లు 10 శాతం అదనంగా నమోదయ్యాయి. వ్యవసాయంలో కొత్త సాధనాలు, సరికొత్త మార్గాలను రైతులకు చేరువ చేయడం కోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కూడా ఇందులో భాగమే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ల గడువును పొడిగించనున్నాం. తదనుగుణంగా వాయిదాల చెల్లింపు గడువును జూన్ 30దాకా పెంచే వీలుంటుంది. శతాబ్దానికోసారి దాపురించే మహమ్మారి మన కళ్లకు కనిపించని శత్రువులా నేడు ప్రపంచానికి సవాళ్లు విసురుతోంది. కోవిడ్–19 మహమ్మారిపై ప్రభుత్వం సర్వశక్తులూ కూడదీసుకుని పోరాడుతోంది. ప్రజల కష్టాలు తీర్చడానికి భరోసా ఇస్తూ ప్రభుత్వంలోని అన్ని శాఖలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి’అని ప్రధాని తెలిపారు. కాగా, పశ్చిమబెంగాల్ రైతుల బ్యాంకు ఖాతాల్లో మొట్టమొదటి సారిగా పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలు జమ అయ్యాయి. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ కేంద్రం, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాల కారణంగా ఆ రాష్ట్ర రైతులకు ఈ పథకం అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలను మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అందరూ టీకా వేయించుకోండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభించడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 2.60 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుందని తెలిపారు. వేగంగా కోవిడ్ టీకా వేసే దిశగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని ప్రధాని అన్నారు. ‘ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకుని, టీకా వేయించుకోవాలి. టీకా వేసిన తర్వాత కూడా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ నియంత్రణ విధానాలను తప్పనిసరిగా కొనసాగించాలి. కరోనాపై పోరాటంలో ఈ టీకా అత్యంత కీలక ఆయుధం, దీనివల్ల తీవ్ర ముప్పు తప్పుతుంది’’అని ప్రధాని తెలిపారు. -
ప్రపంచ ఎకానమీ రికవరీపై ఒపెక్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మున్ముందు రికవరీ బాటన పయనిస్తుందని చమురు ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో క్రమంగా చమురు ఉత్పత్తి పెంపునకు తన మిత్రదేశాలతో కలిసి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మే నుంచి జూలై వరకూ మొత్తంగా రోజుకు 2 మిలియన్ బ్యారళ్లకుపైగా అదనపు ఉత్పత్తి జరగనుంది. దీని ప్రకారం ఉత్పత్తి మే నెల్లో రోజుకు 3,50,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి జరుగుతుంది. జూన్ నెల్లో అదనపు ఉత్పత్తి కూడా ఇదే స్థాయిలో రోజుకు 3,50,000 బ్యారళ్లు జరుగుతుంది. జూలైలో రోజుకు 4,00,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి అవుతుంది. దీనికితోడు సౌదీ అరేబియా రోజుకు అదనంగా ఒక మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తి జరపనుంది. మార్చిలో ఒపెక్ తన ఉత్పత్తిని రోజుకు 3,00,000 బ్యారళ్ల మేర అదనంగా పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో రోజుకు సగటు ఉత్పత్తి 25.33 మిలియన్ బ్యారళ్లకు చేరింది. (ఐటీ కంపెనీల తాజా సవాల్ ఏంటంటే?) గత మార్చి సమా వేశం తరహాలోనే సరఫరాల విషయంలో ఒపెక్ జాగరూకతతో వ్యవహరించింది. ఉత్పత్తి లక్ష్యా లను భారీగా పెంచకపోవడం వల్ల స్వల్ప కాల వ్యవధిలో ధరల స్థిరీకరణ జరగవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థల రికవరీ బాగుంటుందని, ఈ నేపథ్యంలో క్రూడ్ డిమాండ్ భారీగా పెరుగుతుందని ఒపెక్ దేశాలు భావిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతి, ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకుల ఉద్దీపన చర్యలు గ్లోబల్ ఎకానమీ వృద్ధికి బాటలువేస్తాయని ఒపెక్ దేశాలు అంచనా వేస్తున్నాయి. మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి అమెరికా రిఫైనరీలు భారీగా క్రూడ్ ప్రాసెసింగ్ చేసిన విషయాన్ని సంబంధిత వర్గాలు ప్రస్తావించాయి. -
విశ్వాసం అంటే అందరితో పోల్చుకోవడం కాదు..
ముంబై: అందం, స్టైల్, ఫ్యాషన్లో ఆటిట్యూడ్ను ప్రదర్శించడంలో హీరోయిన్ తాప్పీ పన్నుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన సొంత నిర్ణయాల ప్రకారం సినిమాలను, పాత్రలను ఎంపిక చేసుకుంటూ విజయవంతంగా దూసుకుపోతున్నారామె. ఈ క్రమంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి ఆత్మవిశ్వాసంతో ముందుకువెళుతున్న తాప్పీ తాజాగా విశ్వాసం అంటే ఎంటో వివరించారు. సినిమా సెట్స్లోపి తన ఫొటో షూట్కు సంబంధించిన ఓ ఫొటోను తాప్సీ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. బూడిద రంగు మ్యాక్సీ టాప్, కర్లీ హేర్ స్టైల్, రౌండ్ బ్లాక్ సన్గ్లాస్ ధరించిన ఆమె ఈ ఫొటోలో ఫ్యాషన్గా ఉన్న ఈ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో నిర్వచించారు. (చదవండి: ఆ నియమం పెట్టుకున్నా : హీరోయిన్ తాప్సీ) ‘విశ్వాసం అంటే అందరికంటే నేను గొప్ప అంటూ ఆలోచించుకుంటూ మీ గదిలో వెళ్లడం కాదు.. మొదట మిమ్మిల్ని మీరు ఎవరితో పోల్చుకోకపోవడమే విశ్వాసం’ అంటూ హ్యాపీ సండే అనే హ్యాష్ ట్యాగ్ను జత చేశారు. ఇక తన పోస్టు చూసిన తాప్పీ అభిమానులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేగాక తాప్పీ బాయ్ఫ్రెండ్ మాతియాస్ బోయ్.. కళ్లలో హర్ట్ సింబల్ ఉన్న ఎమోజీలతో తన స్పందనను తెలిపాడు. కాగా ప్రస్తుతం తాప్పీ ‘రష్మి రాకెట్’ షూటింగ్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఇటీవల రాంచిలో జరిగింది. ఇందులో తాప్సీ గుజరాతి అథ్లేట్ రష్మిగా లీడ్రోల్ పోషిస్తున్నారు. అంతేగాక ‘రష్మి రాకేట్’తో పాటు ‘హసీన్ దిల్రూబా’, ‘లూప్ లపేటా’ వంటి సినిమాల్లో కూడా ఆమె నటిస్తున్నారు. (చదవండి: నీకు అది మాత్రం కనబడదు కదా: తాప్సీ) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
వినియోగ విశ్వాసం బలోపేతంతోనే వృద్ధి
ముంబై: ఆర్థికాభివృద్ధి అంశంలో వినియోగదారుని విశ్వాసం, మనోభావాలే కీలక పాత్ర పోషిస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అంశాల్లో బలహీనత నెలకొందని ఆమె అన్నారు. వినియోగ విశ్వాసం పటిష్టతే ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జరిగిన ఒక గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా జరిగిన చర్చ గోష్టిలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితిపై ఆమె మాట్లాడారు. ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలతో దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పూర్తి అనిశ్చితి, భయాందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పురోగతికి ప్రభుత్వం నుంచి మరింత వ్యయాలు అవసరం. ► కరోనా ముందటి పరిస్థితితో పోల్చితే ఉత్పత్తి ప్రస్తుతం 60 నుంచి 70 శాతం స్థాయికి చేరిందని కర్మాగారాల నుంచి వార్తలు వస్తున్నాయి. రుణ లభ్యత బాగుంది. ఎగుమతులు దారిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిమాండ్ పెంపు పరిస్థితులపై ఆలోచించాలి. ఎందుకంటే వినియోగదారు విశ్వాసం ఇంకా బలహీనంగానే ఉంది. వారి మనోభావాలు మెరుగుపడకుండా వృద్ధిని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం అసాధ్యం. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష నగదు బదలాయింపులు మరింత జరగాలి. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధిలో ప్రత్యక్ష నగదు బదలాయింపు ఎంతో కీలకమవుతుంది. ► ఫిక్కీ ఇప్పటికే ప్రభుత్వానికి కన్జూమర్ వోచర్ విధానాన్ని సిఫారసు చేసింది. ప్రభుత్వం వ్యయాల కింద 30 నుంచి 50 శాతం డిస్కౌంట్తో కన్జూమర్ వోచర్ విధానాన్ని అమలు చేయడం వల్ల వ్యవస్థలో డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ► విధానాన్ని ఇకమీదట ఏ మాత్రం అనుసరించకూడదు. పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఏ విభాగంలోనూ ఇకపై లాక్డౌన్ నిబంధనలను ఏ మాత్రం అమలు చేయకూడదు. ► వేదాంతా గ్రూప్ సీఈఓ సునీల్ దుగ్గల్, టాటా మోటార్స్ సీఈఓ బషెక్, యాక్సెంచర్ సీఈఓ పీయూష్ సింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను చూస్తే... ద్రవ్యోల్బణంపై ఆందోళన అక్కర్లేదు వృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించే విషయానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందనక్కర్లేదు. ఎకానమీలోకి మరింత నగదు లభ్యత జరిగేలా చూడ్డం ఇప్పడు ముఖ్యం. ముఖ్యంగా మౌలిక రంగంలో వ్యయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనితోపాటు కార్మిక సంస్కరణల విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేయాలి. పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. – సునీల్ దుగ్గల్, సీఈఓ, వేదాంతా గ్రూప్ డిమాండ్ పటిష్టతకు మరో 9 నెలలు ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగంలో డిమాండ్ ఊరటకలిగించే స్థాయిలో మెరుగుపడింది. అయితే అన్ని విభా గాల్లో డిమాండ్ పూర్తి పునరుత్తేజానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. – పీయూష్ సింగ్, సీనియన్ ఎండీ, యాక్సెంచర్ ఆటో... పన్ను రాయితీలు కావాలి కరోనా ప్రేరిత అంశాలతో ఆటో పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రంగం 2010–11 స్థాయికి క్షీణిస్తుందన్నది అంచనా. పన్ను రాయితీలు ఈ రంగానికి తక్షణ అవసరం. – బషెక్, ఎండీ, సీఈఓ, టాటా మోటార్స్ -
విశ్వసనీయతను మళ్లీ తెస్తాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు తిరిగి విశ్వసనీయతను తీసుకు వచ్చి, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందు వచ్చే లా చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మాట చెబితే దానిపై నమ్మకం ఏర్పడేలా చేస్తానన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రాయితీల రూపంలో బకాయి పడిన మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం చెల్లించేందుకు రీస్టార్ట్ ప్యాకేజీని ప్రక టించింది. అందులో భాగంగా మే లో తొలి విడతగా రూ.450 కోట్లు చెల్లించింది. రెండో విడతగా సీఎం వైఎస్ జగన్ సోమవారం రూ.512.35 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. -
గుడ్డి గుర్రం
సింహపురి రాజ్యాన్ని రుషికేశవ మహారాజు పరిపాలిస్తున్నాడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నాడంటే ఎవరూ ఎదురు చెప్పకూడదు, ’ఔను’ అనాలి. చాలా మొండిఘటం. అయినా రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు. తనకు ఒక గుర్రం వుంది. చాలా ఏళ్ల తరబడి దానిపైనే ప్రయాణం సాగిస్తున్నాడు. గుర్రానికి వయసు పైబడింది. సేనాధిపతి కేశవుడికి గుర్రం మార్చమని చాలా సార్లు చెప్పాడు రాజు. ‘‘సేనాధిపతి... నేను స్వారీ చేస్తున్న గుర్రానికి వయసు ముదిరినది.. పైగా చీకటి పడే సమయానికి కళ్లు కనిపించవు.. గుడ్డిదైపోయింది. జోరు తగ్గిపోయింది. ఈ గుర్రాన్ని పాకలోనే కట్టేసి వేరే గుర్రాన్ని తెప్పించండి’’ అని చాలా సార్లు సేనాధిపతికి చెప్పి చూశాడు రాజు. ‘‘మహారాజా.. నీకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి ఈ గుర్రం నిన్ను మోస్తూనే వుంది, ఇప్పుడు వయసు అయిపోయిందని వద్దనుకోవడం రాజధర్మం కాదు, వయసు మీద పడిందని మన బరువు బాధ్యతలు మోసిన తల్లిదండ్రులను వద్దనుకుంటామా, ఇది అంతే మహారాజా’’ అంటూ సేనాధిపతి గుర్రాన్ని మార్చడానికి ఒప్పుకోలేదు. ‘‘సేనాధిపతి.. పొంతన లేకుండా మాట్లాడుతున్నావు. గుర్రానికి వయసు మాత్రమే పైబడి వుంటే ఇలా ఆలోచించేవాణ్ణి కాదు. గుడ్డిది అయింది, పైగా సమరానికైనా సంబరానికైనా పనికి రాకుండా పోయింది, తల్లిదండ్రులతో పోలిక ఏమిటి?’’ రాజుగారి కంఠంలో కాస్త కటువుదనం కనిపించింది, ‘‘వయసు మీద పడినప్పుడే మహారాజా.. చూపు కూడా మందగిస్తుంది. కన్నవారు మన బాధ్యతను మోస్తున్నట్టే గుర్రం కూడా మీ బరువును మోస్తూ మీరు అనుకున్న గమ్యానికి చేరుస్తోంది. ఇందులో తారతమ్యం ఏమున్నది మహారాజా..’’ తమాయించుకుంటూ అన్నాడు సేనాధిపతి. ‘‘మీరు ఎన్నైనా చెప్పండి ఈ గుడ్డి గుర్రంపై నేను స్వారీ చేయలేను. వెంటనే గుర్రం మార్చండి’’ ఈసారి హెచ్చరిక జారీ చేసినట్టుగా అన్నాడు మహారాజు. ‘‘చిత్తం ప్రభు.. కాకపోతే చిన్న మనవి’’ అన్నాడు సేనాధిపతి. ‘‘చెప్పండి’’ అన్నాడు మహారాజు. ‘‘ఇప్పుడు మనం వెళుతున్న వేటకు ప్రస్తుతం ఈ గుర్రాన్నే ఉపయోగించండి. తరువాత వెళ్ళే వేటకు మరో గుర్రం సిద్ధం చేస్తాను’’ అన్నాడు సేనాధిపతి. ‘‘అటులనే కానివ్వండి’’ అంటూ మందిరంలోకి వెళ్ళాడు రుషికేశవ మహారాజు. రాజుకు వేటాడడం అంటే చాలా ఇష్టం, వేటకు వెళ్లిన ప్రతిసారి ఇలా వెనుకబడిపోవటం తనకు నచ్చలేదు, పరివారం చక్కగా వేటాడి విజయం సాధిస్తున్నారు, ఆ ఆనందం తనకు దక్కక పోవడానికి కారణం గుడ్డి గుర్రం. సేనాధిపతి మాత్రం గుర్రం విషయంలో వాయిదాలు వేస్తూ వెళుతున్నాడు. రాజు గుడ్డి గుర్రాన్నే స్వారీ చేయాలనే సేనాధిపతి యొక్క కోరిక వెనుక ఆంతర్యం ఏమిటో రాజుకు అర్థం కాలేదు. తన మాట ప్రకారమే ముందుకు వెళుతున్నాడు. పైగా రాజుకు వేట అంటే చాలా ఇష్టం ఒక మాసంలోనే రెండు సార్లు వేటకు వెళ్ళాల్సిందే.. ఒక రోజు తన పరివారంతో అడవికి వేట కోసం వెళ్ళాడు రాజు, పరివారమంతా ముందు వెళుతుంటే రాజు గుర్రం బాగా వెనుకబడింది, ముందుగా వెళ్లిన సేనాధిపతి రాజు రాకకోసం చెట్టు కింద కూర్చుని వున్నాడు. కాసేపటి తరువాత రాజు రానే వచ్చాడు. సత్తువ లేని గుర్రం కాబట్టే బాగా వెనుక పడ్డాడని తనపై కోపంగా వున్న రాజును గమనించాడు సేనాధిపతి, ‘‘సేనాధిపతి.. నీ గుర్రాన్ని నాకు ఇవ్వు. నువ్వు ఎలాగూ స్వారీలో నేర్పరివికాబట్టి ఈ గుడ్డి గుర్రాన్ని దారికి తెచ్చుకోగలవు’’ అంటూ అడిగాడు రాజు. సేనాధిపతి గట్టిగా నవ్వి ‘‘మహారాజా.. ఈరోజు చీకటి పడేవరకు దీనిపైనే పయనించండి. మీకు నచ్చకపోతే నా గుర్రం మీకిచ్చి మీ గుడ్డి గుర్రాన్ని నేనే తీసుకుంటాను’’ అన్నాడు సేనాధిపతి, వేట మొదలు పెట్టారు.. పరివారం మొత్తం అరణ్యాన్ని చుట్టు్టముట్టారు. పగలంతా తలా ఓ దిక్కు వెళ్లి వేటాడుతున్నారు, మధ్యాహ్నం దాటిపోయింది, రాజుగారి దగ్గర ఒక్క మనిషి కూడా లేడు. చీకటి పడుతోంది పరివారమంతా సేనాధిపతి మాట ప్రకారం రాజ్యానికి చేరుకున్నారు. రాజు మాత్రం అడవిలోనే నిలిచిపోయాడు. అది దట్టమైన అడవి కావడంతో వచ్చిన దారి మరచిపోయాడు. పైగా గుర్రం గుడ్డిది. ఎంతటి రాజైనా ఈ పరిస్థితుల్లో భయపడక తప్పదు. చాలా దూరం వచ్చేసినట్టు వున్నాడు. తను వచ్చింది తూరుపు ముఖం నుంచి కానీ అక్కడకు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయింది. తన పరివారం కనిపిస్తారేమో అని దిక్కులు చూస్తున్నాడు రాజు. వాళ్ళ అలికిడి ఎక్కడా వినపడలేదు. గుర్రాన్ని దారి మళ్ళిస్తున్నాడు. అది మాట వినలేదు. వేరే మార్గం వైపు లాగుతోంది. కాలి గిట్టలు పదే పదే నేలకేసి కొడుతోంది. గుర్రాన్ని ఎంత అదిలిస్తున్నా అది దక్షిణం వైపు దారికే అడుగులు కదుపుతున్నది. ఆకాశంలో క్రమేపి చీకటి అలముకుంది, ఇక ప్రయోజనం లేదని గుర్రం లాగుతున్న వైపే పయనం సాగించాడు. అది మెల్లగా అడుగులు వేస్తూనే ఎట్టకేలకు రాజుని రాజ్యానికి చేర్చింది. ఆశ్చర్యబోయాడు రాజు. ‘‘మహారాజా.. గుర్రం మార్చుకుందామా’’ అడిగాడు రాజుకు ఎదురేగిన సేనాధిపతి. ‘‘అవసరం లేదు సేనాధిపతి.. నా గుర్రం గుడ్డిదైనా దానికి వున్న ఆత్మవిశ్వాసం గుడ్డిది కాదు. మనిషి ఆత్మవిశ్వాసంతో బాటు ఏకాగ్రత కోల్పోతాడు కాబట్టే దారి మరచిపోతాడు. ఏ జంతువుకైనా ఏకాగ్రత వుంది కాబట్టే వచ్చిన దారి మరచిపోదు, దీన్ని బట్టి మనిషి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంపై నమ్మకం పెంచుకోవాలి, నువ్వు గుర్రం గుడ్డిదైనా ఎందుకు మార్చలేదో అర్థమైంది’’ అంటూ రాజు సేనాధిపతిని మెచ్చుకున్నాడు. ∙ -
విశ్వాసి హృదయ సింహాసనం దేవునిదే!!
‘నన్ను వెంబడించాలనుకునేవాడు, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి.. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునే వాడు దాన్ని పోగొట్టుకొంటాడు, నా కోసం ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు’ అంటూ యేసుప్రభువు శిష్యులకు తన కొత్తనిబంధన విశ్వాస మార్గాన్ని ఒకరోజు ఉపదేశించాడు. స్వార్థం, స్వాభిమానం, స్వనీతి, స్వలాభం, ’నేను’, ‘నా’ అనే ‘స్వీయత’నంతా వదిలేసుకోవడం విశ్వాసంలో ఒక ప్రధానమైన భాగమైతే, ఇవన్నీ పోగా మిగిలిన తన సిలువను విశ్వాసి తానే మోస్తూ ప్రభువును వెంబడించడం మరో ముఖ్యమైన భాగం!! విశ్వాసి ఇలా ప్రభువు కోసం పాటుపడుతూ తన ప్రాణాన్ని దక్కించుకోగలుగుతాడని, అలా కాకుండా తనను తానే నమ్ముకొని, తన సిలువను తాను మోయనివాడు లోక ప్రలోభాల్లో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకొంటాడని ప్రభువు అన్నాడు. క్రీస్తును వెంబడించే క్రైస్తవ మార్గంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు న్నాయి, దేవుడిచ్చే శాంతిసమాధానాలున్నాయి. కాని లోకమిచ్చే ఆనందం, వినోదానికి అవి పూర్తిగా అతీతమైనవి. తనను యెరూషలేములో సిలువ వేయబోతున్నారంటూ మూడున్నరేళ్ల తర్వాత ప్రభువు ప్రకటించినపుడే తామెన్నుకు న్నది విలక్షణమార్గమని, పోగొట్టుకోవడమే ఈ మార్గ రహస్యమని శిష్యులకు బోధపడింది. ఇక ఇస్కరియోతు అనే శిష్యుడైతే, ఇదంతా విని యే సుతో విభేదించి, ముప్పై వెండినాణేల ప్రలోభానికి యూదులకు యేసును అమ్మేసి, తనది లాభసాటి బేరమనుకున్నాడు. కాని ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఉరేసుకొని ప్రాణాలు పోగొట్టుకొని యేసు మాటలు సత్యమైనవని రుజువు చేశాడు. ఆనాడు ఏదెను తోటలో ఆదాము, హవ్వలకు కూడా పోగొట్టుకోవడం, పొందడం అనే అనుభవాల నేపథ్యం అర్థం కాలేదు. దేవుడు వారిద్దరినీ సృష్టించడానికి మునుపే మంచి విషయాలతో లోకాన్ని నింపి సృష్టించి వారికిచ్చాడు. అయితే వారి హృదయాంతర్యంలోని సింహాసనాన్ని మాత్రం తనకే ప్రత్యేకించాలని ప్రభువు కోరుకుంటే, ఆదాము, హవ్వ లోకాన్నంతా తమ హృదయంలోకి చేర్చుకొని, ఆజ్ఞాతిక్రమం అనే పాపానికి పాల్పడి దేవుణ్ణి ఆ సింహాసనం నుండి దించి బయటికి పంపేశారు. అదీ అక్కడ జరిగిన నిజమైన విషాదం. అయితే ఆదాము, హవ్వ ఎక్కడ విఫలమయ్యారో అక్కడే, కొన్నేళ్ల తర్వాత వారి వారసుడు, విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము దైవాజ్ఞ పాలనే శిరోధార్యమని భావించి గెలుపొందాడు. అబ్రాహాము జీవితమంతా దేవుని ఆజ్ఞల ప్రకారమే, అంటే అన్నీ పోగొట్టుకొంటూ సాగింది. నీ వాళ్ళందరినీ వదిలేసి నేను చూపే కొత్త ప్రాంతానికి వెళ్ళమంటే, తనకు ప్రాణప్రదమైనవన్నీ వదిలేసి ప్రభువే సర్వస్వమనుకొని ఆయన వెళ్ళాడు. చివరికి కడువృద్ధాప్యంలో కలిగిన ఏకైక కుమారుడైన ఇస్సాకును కూడా తనకు బలివ్వమని దేవుడు ఆదేశిస్తే, అందుకు కూడా అతను ఆనందంగా సిద్ధమయ్యాడు. విశ్వాస పరీక్షలో అబ్రాహాము నెగ్గినట్టు ప్రకటించాడు దేవుడు. ఇదీ ప్రభువానాడు బోధించిన విశ్వాస మార్గం. –రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ ఈమెయిల్:prabhukirant@gmail.com -
మున్సిపోల్స్లో కాంగి‘రేస్’
సాక్షి, జనగామ : పంచాయతీ నుంచి ప్రాదేశిక ఎన్నికల వరకు, శాసన సభనుంచి లోక్సభ ఎన్నికల వరకు జరిగిన వరుస ఎన్నికల్లో ఓటములతో డీలా పడిన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బలమైన క్యాడర్ను కలిగిన ఆ పార్టీ ప్రస్తుతం మునిసిపాలిటీ ఎన్నికలే టార్గెట్గా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుంది. కాంగ్రెస్ కంచుకోటగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన జనగామలో ఆ పార్టీ పట్టు నిలుపుకోవడం కోసం తహతహలాడుతోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి నూతనోత్తేజం నింపడానికి సిద్ధమైంది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సభ్వత్వ నమోదుతో కార్యకర్తలను సమీకరిస్తుండగా కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారైనా కలిసొచ్చేనా? కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు రాజకీయంగా జన్మనిచ్చిన జనగామ ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. నాలుగు దశాబ్దాల పాటు పొన్నాల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనమైన చరిత్రను సొంతం చేసుకుంది. ముఖ్యంగా జనగామ మునిసిపాలిటీ చరిత్రలో ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యతను కనబరిచింది. 1953 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు మినహాయిస్తే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ చైర్మన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. తొలిసారిగా 1987లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోగా రెండోసారి 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 28 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఇద్దరు అభ్యర్థులు 1, 2 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తే ఏకపక్షంగానే చైర్మన్ స్థానం దక్కి ఉండేది. కానీ అనూహ్యంగా కేవలం ఆరు స్థానాల్లోనే విజయం సాధించిన టీఆర్ఎస్ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. మెజారిటీ కౌన్సిలర్లను గెలుచుకున్నప్పటికీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోక పోవడంలో పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించలేదనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మొదటి నుంచే పక్కా ప్రణాళికను అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. రిజర్వేషన్లలో బీసీ కోటాకు ప్రభుత్వం కోత విధిస్తున్నప్పటికీ పార్టీపరంగా బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీసీ, దళిత, మైనార్టీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ‘పొన్నాల’ మకాం మునిసిపాలిటీ ఎన్నికలు అయ్యే వరకు పొన్నాల లక్ష్మయ్య జిల్లా కేంద్రంలోనే మకాం వేయనున్నారు. ప్రతి వార్డులో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే స్థానిక సమస్యలను ప్రచార అస్త్రాలుగా ఎక్కు పెట్టడానికి రెడీ అవుతున్నారు. వార్డుల వారీగా ఆశావహుల జాబితాను తయారు చేయడం, పార్టీ క్యాడర్కు దిశానిర్ధేశం చేయడం, పట్టణ ప్రజలతో మమేకం కావడం వంటి కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు జెండా పండుగలు శనివారం పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో మునిసిపాలిటీ పరిధిలో విస్తృతంగా జెండా పండుగను జరుపనున్నారు. రోజుకు 10 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. పొన్నాలతోపాటు టీపీసీసీ మునిసిపాలిటీ ఎన్నికల పరిశీలకుడు మక్సూద్ అహ్మద్తోపాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ముఖ్యనేతలను ఆయా వార్డుల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘హిందూపురం’లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దాం
హిందూపురం: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందరూ సైనికులుగా పని చేసి హిందూపురంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దామని వైఎస్సార్సీపీ నాయకులు కొండూరు వేణుగోపాల్రెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డిలు పిలుపునిచ్చారు. స్థానిక ఐఎంఏ హాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయం తక్కువగా ఉంది.. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని నాయకులు అన్నారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని వారు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైన గెలుపొందాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారు. బూత్ కన్వీనర్లు ఓటరు జాబితాలను క్షుణంగా పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నవరత్నాల గురించి ఇంటింటికి ప్రచారం చేయాలి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. నవరత్నాలతోనే పేదల భవిష్యత్తు మారుతుందని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. మహమ్మద్ ఇక్బాల్కు స్వాగత ఏర్పాట్లు నేడు వైఎస్సార్సీపీ నేత, రిటైర్డు ఐజీ మహమ్మద్ ఇక్బాల్ హిందుపూరానికి రానున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు కొడికొండ చెక్పోస్టు వద్ద మహమ్మద్ ఇక్బాల్కు ఘనంగా స్వాగతం పలకనున్నారు. పెద్దఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. చెక్పోస్టు నుంచి ప్రత్యేక వాహనంలో ర్యాలీగా చిలమత్తూరు, లేపాక్షి మండలాల మీదుగా హిందూపురం చేరుకుంటారు. సమావేశంలో మండల కన్వీనర్లు నారాయణస్వామి, శ్రీరాంరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి సురేష్రెడ్డి, హిందూపురం పార్లమెంట్ యువజన విభాగ అధ్యక్షుడు ఉపేంద్రరెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రెహెమాన్ నాయకులు జగన్మోహన్రెడ్డి, రాజారెడ్డి, బసిరెడ్డి, బలరామిరెడ్డి, గోపికృష్ణ,అంజన్రెడ్డి, నరిసింహరెడ్డి, పురుషోత్తంరెడ్డి, జనార్థన్రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిన్ను నువ్వు నమ్ముకో!
సావిత్రీబాయి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కర్ల కుమారుడు బాబూ టెండూల్కర్. బాబు వైద్య విద్య రెండవ సంవత్సరం చదువుతుండగా జ్యోతిషులు అతని జాతక చక్రాన్ని చూశారు. ఆ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని, ఎంత చదివినా ప్రయోజనం ఉండదని జ్యోతిషులు పెదవి విరిచారు. మరుసటి ఏడాది కష్టపడి చదవనవసరం లేకుండానే పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడని కూడా చెప్పారు. బాబు దిగాలు పడ్డాడు. అప్పట్నుంచి చదవడం మానేసి నిర్లిప్తంగా గడపడం మొదలు పెట్టాడు. కుమారుని వాలకం చూసి సావిత్రీబాయి కలత చెందింది. ఆమె తల్లి మనసు తల్లడిల్లింది. రఘునాథ్ కూడా కొడుకుని చూసి బెంగపెట్టుకున్నాడు. సావిత్రీబాయి ఎన్నో విధాల బాబుకు నచ్చజెప్పచూసి విఫలమైంది. కష్టంలోనూ. సుఖంలోనూ తమ వెన్నంటి ఉండే బాబా వద్దకు వెళ్లింది. కొడుకు పరిస్థితి బాబాకు చెప్పుకుని కంటతడి పెట్టుకుంది. బాబా హృదయం ద్రవించింది. ‘జాతకాలు, జన్మకుండలి పట్టించుకోవద్దు. సాముద్రికాన్ని చూడవద్దు. నాపై విశ్వాసం ఉంచి బుద్ధిగా చదువుకోమను. ఈ సంవత్సరమే అతను పరీక్ష ఉత్తీర్ణుడవుతాడు’ అని బాబా అభయం ఇచ్చారు. సావిత్రీబాయి ఇంటికి తిరిగి వెళ్లి బాబా చెప్పిన మాటలు బాబుకి చెప్పింది. బాబా ఇచ్చిన అభయంతో బాబు ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. పరీక్షలు బాగా రాశాడు. ఉత్తీర్ణత కూడా సాధించాడు. బాబాపై ఉంచిన విశ్వాసమే బాబును గట్టున పడేసింది. బాబాపై మన విశ్వాసం చెదిరిపోనిదే అయితే మనం సాధించలేనిది ఏమీ లేదు. ‘‘నిన్ను నువ్వు నమ్ముకో. నీలోని భగవంతుడిని నమ్ముకో’’ అనేది బాబా ఉపదేశం. భగవంతుడి కృపను పొందడానికి, సాయిపథంలో నడవడానికి విశ్వాసమే తొలిమెట్టు. గురువులు, ఇష్టదైవాల గురించి చదివి వదిలేయడం కాదు, వారు చెప్పిన దానిని ఆచరించాలి. అదే మనం వారిపై చూపే నిజమైన నమ్మకం. – డా.కుమార్ అన్నవరపు -
బయటికి వచ్చేశారు
ఎక్కడ ఇబ్బంది కలిగినా, భయం అనిపించినా, ఇంటికి రాగానే అన్నీ మరచిపోతాం. ఇల్లు ఒక భరోసా, ఇల్లు ఒక నమ్మకం, ఇల్లు ఒక విశ్వాసం. మరి ఆ ఇంట్లోనే నరకం కనిపిస్తే ఏం చేయాలి? వలెరి, రచెల్, నాన్సీ, విక్టోరియా... ఇల్లు చూస్తే భయపడుతున్న అమ్మాయిలు వీరు. ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాలలో కనీసం 11 లక్షలమంది మహిళలు నిత్యం గృహ హింసకు గురవుతున్నారని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, సంతానం.. ఎవరో ఒకరి కారణంగా వీరు శారీరకంగా, మానసికంగా ఇంట్లో రక్షణ లేకుండా ఉన్నారని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి. ఈ నలుగురి అనుభవాలను వింటే.. స్త్రీ జీవితం ఎక్కడైనా ఒకేలా ఉందనిపిస్తుంది! వలెరి ఉదయం ఐదు గంటలకే లేచి, ఆయన లేవకముందే పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఆయన కోసం ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం చాలా టైమ్ కేటాయిస్తాను. నాకు రెండుసార్లు వివాహం అయ్యింది. రెండు వివాహాలలోను.. నన్ను నియంత్రించడం, నిరంతరం అసభ్యంగా మాట్లాడుతూ హింసించడం అనుభవం అయ్యాయి. నా మొదటి భర్త చొక్కాకి పొరపాటున మరక ఉండిపోయిందని, నా భర్త నాకు వాతలు పెట్టాడు. నా రెండో భర్త ఉద్యోగానికి బయటకు వెళుతూ, నన్ను మెట్ల మీద నుంచి తోసేశాడు, నేను స్పృహ తప్పి పడిపోయాను. ఇటువంటివి ఎన్నని లెక్కించగలను? నా పిల్లలను దృష్టిలో ఉంచుకుని చాలాకాలం అన్నీ అనుభవించాను. చివరికి నేను ఎందుకూ పనికిరాననే భావన నాలో ఏర్పడింది. ప్రపంచం ఎందుకు ఇలా నడుస్తుందో అర్థం కాదు, సాటి మనిషిని హింసించే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు? కాలం ఎంత మారుతున్నా వారి ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. నేనే బయటికి వచ్చేశాను. రచేల్ నా చుట్టూ ఉన్న సంప్రదాయ యూదు కుటుంబాల వారు.. నా భర్త నన్ను హింసించడం కళ్లారా చూశారు. ఒక్కరూ నా వైపు న్యాయం మాట్లాడలేదు. నా గురించి, నా పిల్లలకు సంబంధించిన కుశలప్రశ్నలు అడగలేదు. ఆయన గదిలోనే కనీసం నేల మీద పడుకోవాలన్నా భయమే. నేను వద్దు అనడానికి వీలు లేదు. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆయన బెడ్రూమ్లోకి వెళ్లవలసిందే. ఆయన ఎన్ని విధాలుగా హింసించినా, నేను శుభ్రంగా ముఖం కడుక్కుని, శుభ్రంగా రెడీ అయ్యి, ఏమీ జరగనట్టుగా ప్రవర్తించవలసిందే. ఇలాగే రోజులన్నీ గడిచాయి. కబోర్డ్లో డబ్బాల మీద లేబుల్స్ దగ్గర నుంచి అన్నీ ఆయన చెప్పినట్టుగా ఉండాలి. ఆయన కనుసన్నల్లోనే జరగాలి. పదిహేడు సంవత్సరాల తరువాత నేను ఏం కోల్పోయానో తెలుసుకున్నాను. ఇంతకాలం నా గొంతు నేను నొక్కుకున్నానని అర్థం చేసుకున్నాను. నా మీద నాకే అసహ్యం వేసింది. అప్పుడే నాలో శక్తి బయలుదేరింది. నేను ఇంక బాధితురాలిగా ఉండకూడదని నిశ్చయించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. నాన్సీ మొదట్లో నేను చాలా సంబరపడ్డాను. అతను ప్రతిరోజు నాకోసమే వస్తున్నాడని, నన్ను కలుస్తున్నాడని నా తరువాతే తనకి అందరూ అని భావించాను. నేను వేరేవారితో ఉంటే, వెంటనే నాకు మెసేజ్ పెట్టేవాడు. నా మీద తనకి ప్రేమ చాలా ఎక్కువ అనుకున్నాను. అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినప్పుడు అతనిలో ఎటువంటి భావమూ లేదు. అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. అంతకుముందు ఎన్నడూ నన్ను ఎవ్వరూ కొట్టలేదు. అంతకుముందు ఎన్నడూ లేనంత భయంకరంగా నన్ను హింసించాడు. గట్టిగా తన్నాడు, చెంప మీద కొట్టాడు, చేతులతో బయటకు తోసేశాడు, తల పగలగొట్టాడు. చివరగా నా గొంతు పట్టుకున్నాడు. నేను భయంతో వీధులలోకి పరుగులు తీసి, పబ్లిక్ టాయిలెట్లో దాక్కున్నాను. నన్ను వెంటాడుతూ వెనకే వచ్చాడు. ఆ టాయిలెట్కి రెండు దారులు ఉన్నాయనే విషయం నాకు తెలియదు. హమ్మయ్య నేను తప్పించుకున్నాను అనుకునేంతలోనే అతడు నా మీదకు రాబోయాడు. ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను పిలిచాను. ఇటువంటి విషయాలను మరచిపోవాలన్నా సాధ్యపడదు. కానీ ఎలా తప్పించుకోవాలో మాత్రం తెలుసుకున్నాను. ఆ తరువాత నేను మగవారితో ఒంటరిగా ఉండటం మానేశాను. అందరూ ఒకేలా ఉండరని తెలిసినా కూడా నాలో ఆ భయం పోలేదు. విక్టోరియా నేను ఇద్దరు మగవారి కారణంగా గృహహింసను అనుభవించాను. నాతో సన్నిహితంగా ఉంటూనే నన్ను హింసించారు వారు. ఆ తరువాత నేను వారి నుంచి దూరంగా వచ్చేశాను. నా మాజీ భర్త మా ఇంటి తలుపులన్నీ మూసేసి, ఆ తరువాత నన్ను, నా కొడుకుని హింసించేవాడు. వాడిని కొట్టకుండా అడ్డుపడేదాన్ని. నా భర్త నా తల మీద సుత్తితో బలంగా కొట్టాడు. 11 సంవత్సరాల నా బిడ్డ నా మాజీ భర్తను ఇంట్లో నుంచి పొమ్మని బయటికి తోసేశాడు. అలా ఆ రోజు నా కొడుకే నన్ను రక్షించాడు. నేను ఆసుపత్రి నుంచి వచ్చాక, నన్ను నేను చంపుకోవాలనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే నా కొడుకు దగ్గర నుంచి నాకు ‘‘అమ్మా! ప్లీజ్, ఇంటికిరా, నాకు నువ్వు కావాలి’’ అని ఒక మెసేజ్ వచ్చింది. నా ప్రయత్నం విరమించుకున్నాను. ఈ రోజుకీ నాకు పీడకలలు వస్తున్నాయి. నిద్రపోతే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భయం నన్ను విడిచిపెట్టట్లేదు. అందుకే కళ్లు మూసుకోలేకపోతున్నాను. – రోహిణి -
కాన్ఫిడెన్స్ క్వీన్
కె ఫర్ కంగనా. కాదు కాదు కె ఫర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు బాలీవుడ్ జనాలు. కారణం కంగనా రనౌత్ కాన్ఫిడెన్సే. మేటర్ ఏంటంటే.. ఇటీవల కాన్స్ ఫెస్టివల్స్లో రెడ్ కార్పెట్పై ఫస్ట్ టైమ్ నడిచారు క్వీన్ కంగనా రనౌత్. కానీ కాన్స్ రెడ్ కార్పెట్ మీద కచ్చితంగా నడుస్తాను అని 22 ఏళ్ల వయసులోనే ఊహించారట ఆమె. ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘22 ఏళ్ల వయసులో సొంతంగా డబ్బు సంపాదిస్తున్న టైమ్లో ఫ్రాన్స్ విజిట్ చేయాలనిపించింది. అక్కడ 10 డేస్ స్పెండ్ చేశాను. పెర్ఫ్యూమ్ తయారు చేసే ఫ్యాక్టరీల చుట్టూ తిరిగాను. ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాను. ఆ తర్వాత రెడ్ కార్పెట్ చూడాలనిపించింది. ఆ ప్లేస్కు ఒక టూరిస్ట్గా వెళ్లాను. ఆ టైమ్లో ఎందుకో అనిపించింది ‘రెడ్ కార్పెట్ చూడవసరంలేదు, ఎలాగూ ఏదో రోజు ఆ కార్పెట్ మీద మనం నడుస్తాను’ అని. అలా అనుకున్న వెంటనే వెనక్కి వచ్చేశా’’ అని పేర్కొన్నారు కంగనా. ఇది జరిగిన జస్ట్ 9 ఏళ్లలోనే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై నడిచారీ క్వీన్. ఏదైనా విషయాన్ని కాన్ఫిడెంట్గా బిలీవ్ చేస్తే చాలు అయిపోతుంది అనడానికి ఇదో ఉదాహరణ. -
వజ్రంలాంటి విశ్వాసం
అంధుడి మాటలు రాజుగారిలో కొత్త ఆశను రేకెత్తించడంతో అందుకు సరేనన్నారు. ఆ అంధుడు ఆ వజ్రాలను తడిమి చూసి, ఫలానా వజ్రం అసలైనది, ఫలానా వజ్రం నకిలీదని వెంటనే తేల్చి చెప్పాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా రాజుగారు ఎంతో ఉత్సాహంగా సభా వ్యవహారాలను ప్రారంభించారు. అంతలో ఒక వ్యక్తి రాజదర్బారులో ప్రత్యక్షమయ్యాడు. ‘‘నా దగ్గర అమూల్యమైన రెండు వజ్రాలున్నాయి అందులో ఏది అసలైనదో, ఏది నకిలీదో తెలుసుకునేందుకు నేను తిరగని సంస్థానమంటూ లేదు, చేరని రాజ్యమంటూ లేదు. మీరేమైనా పసిగట్టగలరా’’ అని ప్రశ్నించాడు. రాజుగారు ఆ రెండు వజ్రాలను చేతిలోకి తీసుకొని ‘‘ఈ రెండూ ఒకేలా ఉన్నాయిగా’’ అన్నారు ఆశ్చర్యంగా. దానికి ఆ వ్యక్తి ‘‘ఇందులో ఒకటి వెలకట్టలేని వజ్రం. రెండోది గాజుది. మీ కొలువులో ఉన్న వారిలో ఎవరైనా, ఇందులో అసలు వజ్రాన్ని పసిగడితే ఆ వజ్రాన్ని నేను కానుకగా అందిస్తాను. కనుక్కోలేకపోతే ఆ వజ్రానికి తగ్గ మూల్యం చెల్లించాలి’’ అని సవాల్ విసరాడు. రాజుగారు, మంత్రులు, ఇతర అధికారులు ఆ వజ్రాన్ని చేతిలో తీసుకుని ఎంత పరిశీలించినా వారికి అర్థం గాక తీవ్ర నిరాశ చెందారు. ఈ విషయం ఆ రాజ్యంలోని ఒక పుట్టుగుడ్డి చెవిలోనూ పడింది. తెలిసిన వారి సహాయంతో రాజదర్బారుకు చేరుకున్న ఆ అంధుడు రాజుగారితో ‘‘అయ్యా! నేను అసలు వజ్రాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తాను. నాకో అవకాశం కల్పించండి’’ అని వేడుకున్నాడు. అంధుడి మాటలు రాజుగారిలో కొత్త ఆశను రేకెత్తించడంతో అందుకు సరేనన్నారు. ఆ అంధుడు ఆ వజ్రాలను తడిమి చూసి, ఫలానా వజ్రం అసలైనది, ఫలానా వజ్రం నకిలీదని వెంటనే తేల్చి చెప్పాడు. వజ్రాన్ని తెచ్చిన వ్యక్తి ఖంగుతిన్నాడు. షరతు ప్రకారం వజ్రం రాజుగారి సొంతమయ్యింది. కళ్లు లేకపోయినా అసలు వజ్రాన్ని కనిపెట్టిన అంధుడిని అభినందించారు అందరూ. ఎలా కనిపెట్టగలిగావంటూ అంధుడిపై ప్రశ్నల వర్షం కురిపించసాగారు. ‘ఈ రెండు వజ్రాల్లో ఒకటి వేడిగా ఉంది. ఒకటి చల్లగా ఉంది. ఎండకి వేడెక్కిన వజ్రం నకిలీదని పసిగట్టాను’ అని చెప్పాడు ఆ అంధుడు. అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అసలైన విశ్వాసులు నకిలీ వజ్రంలా వేడెక్కరు. అసలు వజ్రంలా ప్రశాంతంగా ఉంటారు. -
దృఢమైన మనసు
ఓ భగవంతుడా! కష్టాలకు భయపడి పారిపోకుండా వాటిని ఎదుర్కొనగలిగే ధైర్యాన్ని నాకు ప్రసాదించు. ఆపదలు వచ్చినప్పుడు నన్ను రక్షించమని నేను ప్రార్థించడం లేదు. కానీ వాటిని ఎదుర్కొనటానికి కావలసిన శక్తిని ప్రసాదించమని మాత్రం నిన్ను వేడుకుంటున్నాను. కష్టాలలో నేను కొట్టుకుపోతున్నప్పుడు నాకు సాంత్వన చేకూర్చమని నేను నిన్ను వేడుకోవడం లేదు. నా కష్టాలనే కుసుమాలుగా మార్చి, వాటిని నీ పాదాల చెంత ఉంచి, కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని తగిన విజయం సాధించగలిగే శక్తిని నాకు ప్రసాదించు అని వేడుకొంటున్నాను. ఈ విధంగా ఎవరైనా ప్రార్థిస్తారా అసలు? అలాంటి వారు ఉంటారా? ఉంటే భగవంతుడు వారి కోరికను తీరుస్తాడా? ఇదంతా ఏదో వ్యక్తిత్వ వికాస పాఠంలా కనిపిస్తోంది కానీ, ప్రార్థనలా ఉందా? ఉన్నట్టే ఉంది. ఎందుకంటే, కొన్ని వేల ఏళ్ల కిందటే ‘‘నేను నిన్ను మరచిపోకుండా ఉండాలంటే, నాకు కావలసింది సుఖాలు, సంపదలు కాదు, కష్టాలు, కడగండ్లే. కాబట్టి ఓ కృష్ణా! నీవు నాకు అనుక్షణం గుర్తుకు వచ్చేలా నాకు ఎప్పుడూ ఏదో ఒక కష్టాన్ని ఇస్తూ ఉండు’’ అని కుంతీదేవి తన మేనల్లుడైన శ్రీ కృష్ణుని ప్రార్థించిందట. నిజంగా ఎంత గొప్ప ప్రార్థనో కదా! ప్రార్థన అనేకంటే, ఎంత దృఢమైన మనసో కదా! అనుకోవాలి. ఎందుకంటే, భగవంతుడి మీద మనకు ఉన్న విశ్వాసం ఆయన్ని ‘అవి కావాలి, ఇవి కావాలి’ అని కోరుకునే యాచనగా కాదు, శక్తిగా మారాలి. మనస్సు బలహీనతకు గురి కాకుండా ఉండేంత శక్తిమంతంగా ఉండాలి. – డి.వి.ఆర్. -
అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
-
ఆచరణలో కనిపించేదే ఆసలు విశ్వాసం!!
‘కనిపించడు కాని మా వాడు భలే భక్తిపరుడు తెలుసా?’ లాంటి వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. పైకి పొంగిపోతున్నట్టుండే భక్తితో సమస్యలేమో కాని, నిజమైన భక్తి విశ్వాసికి జీవితంలో కనిపించి తీరాలి. బబులోను చెరలో మగ్గుతున్నా తమ దేవుణ్ణి, దేవుని విధి విధానాలను మర్చిపోలేని భక్తి యూదులది, ముఖ్యంగా దానియేలు, అతని ముగ్గురు స్నేహితులది. వారి అచంచలమైన భక్తిశ్రద్ధలు చూసి అసూయపడ్డ శత్రువులు ఎలాగైనా వారిని నాశనం చేయడానికి కుట్రపన్నారు. యూదులు పరలోకమందున్న దేవునికి తప్ప మరొకరికి సాగిలపడరు. అందువల్ల బబులోను సామ్రాజ్యంలోని ప్రజలు, ప్రముఖులెవరూ ముప్ఫైరోజులపాటు చక్రవర్తి దర్యావేషుకు తప్ప మరే వ్యక్తికైనా సాగిలపడరాదని, విన్నపాలు సమర్చించరాదని ఒక శాససం చేశాడు. ఎంతో తెలివైనవాడిగా ప్రసిద్ధి పొందిన దానియేలును అప్పటికే చక్రవర్తి తన సంస్థానంలో అత్యున్నత స్థానంలో నియమించాడు. అదీ వారి అసూయకు ప్రధాన కారణం. ఇలాంటి శాసనం గురించి తెలిసి కూడా దానియేలు రోజుకు మూడుసార్లు యథాప్రకారం దేవుని ప్రార్థించాడు. శాసనోల్లంఘనకుగాను రాజుగారికిష్టం లేకున్నా శిక్షగా దానియేలును సింహాలున్న గుహలో పడదోశారు. కాని దానియేలును దేవుడు సింహాల గుహలో కూడా క్షేమంగా కాపాడుతాడని నమ్మకమున్న చక్రవర్తి మరునాడే అక్కడికెళ్లి ‘నిత్యమూ నీవు సేవిస్తున్న జీవము కలిగిన నీ దేవుడు నిన్ను రక్షించాడా?’ అని అడిగితే, ‘అవును రాజా: నన్ను రక్షించాడని దానియేలు జవాబిచ్చాడు. చక్రవర్తి వెంటనే అతన్ని బయటకి రప్పించి, అతని మీద కుట్ర చేసిన వారందరినీ సింహాల గుహలో వేశాడు. మేము రహస్య విశ్వాలసుమంటారు కొందరు. ‘రహస్యభక్తి’ అనేది క్రైస్తవమే కాదు. క్రైస్తవ సుగుణమైన సాహసం, క్షమాపణ, ప్రేమ, పేదలు నిరాశ్రయుల పక్షంగా పోరాడేందుకు తెగింపు సమాజానికి వారి జీవితాల్లో కొట్టవచ్చినట్లు కనిపించాలి. ఉద్యమాలు, విప్లవాలు క్రైస్తవ విధానం కాదు. కాని దేవుని పక్షంగా నిరుపేదలు, నిర్భాగ్యుల కోసం నిలబడేందుకు విప్లవాలు తేవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రతి క్రైస్తవుడూ తన వ్యక్తిగత కుటుంబ బాధ్యతగా చేపట్టాలి. అలాంటి నిస్వార్థసేవే క్రైస్తవాన్ని ఒక విశిష్టమైన జీవన విధానంగా తీర్చిదిద్దింది. నిస్వార్థమైన త్యాగపూరితమైన సేవ క్రైస్తవానికి పర్యాయపదంగా నిలబెట్టింది. -
మూఢనమ్మకమా? గాఢవిశ్వాసమా?
సెల్ఫ్చెక్ సృృష్టి రహస్యాన్ని ఛేదించటానికి అనేక సంవత్సరాల శాస్త్రవేత్తల కృషికి ప్రయోగరూపం బిగ్బ్యాంగ్. ఒకవైపు మానవుని ఆయుష్షు పెంచటానికి రకరకాల ప్రయోగాలు, పరిశోధనలు, గ్రహాలపై నివాసానికి ప్రయత్నాలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు, విజయాలు చోటు చేసుకుంటుంటే ఇంకోవైపు మూఢ నమ్మకాలతో జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకొనే వారు ఎందరో ఉన్నారు. వీరు అపోహలతో, అనుమానాలతో విలువైన కాలాన్ని వృథా చేసుకుంటుంటారు. మీలో కూడ మూఢ నమ్మకాలకు స్థానం ఉందా? ఇది తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్చెక్ని టిక్ చేయండి. 1. మీ నమ్మకాలను మూఢనమ్మకాలుగా పిలవటం మీకిష్టం లేదు. ఎ. అవును బి. కాదు 2. ప్రయాణ సమయాల్లో పిల్లి, కుక్క లాంటి జంతువులో మరేదో ఎదురొస్తే మీ ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. మీ ఆచారాలవల్ల అమూల్యమైన సమయం వృథా అవుతోందన్న సత్యాన్ని గ్రహించలేరు. ఎ. అవును బి. కాదు 4. అదృష్టం, దురదృష్టాలను బలంగా నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 5. అమావాస్య రోజుల్లో ప్రయాణాలను వాయిదా వేయటానికి గట్టిగా ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 6. ‘పెళ్లికి ముందే జీవితభాగస్వామిని చూడటం, మాట్లాడటం చాలా తప్పు.’ ఈ భావనతో మీరు ఏకీభవిస్తారు. ఎ. అవును బి. కాదు 7. నక్కలు, కుక్కలు అరిస్తే అరిష్టాలు జరుగుతాయని నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 8. మంచి జరుగుతుందన్న నమ్మకంతో బలులను సమర్థిస్తారు. ఎ. అవును బి. కాదు 9. చేతబడి, బాణామతి లాంటి ఆచారాల వల్ల అనుకున్నది సాధించగలమని వాదిస్తారు. ఎ. అవును బి. కాదు 10. హేతువాదులంటే మీకు గిట్టదు. మీ ఆచారాలకు ఎవరైనా అడ్డువస్తే అసలు సహించలేరు. ఎ. అవును బి. కాదు మీరు టిక్ పెట్టిన సమాధానాలలో ‘ఎ’లు 7 దాటితే మీలో మూఢనమ్మకాలకు స్థానం ఉందని అర్థం. లేనిపోని భయాలు, అపోహలకు పెద్దపీట వేస్తూ వాస్తవాలను గ్రహించలేరు. ఇందులో చదువుకున్న వారూ ఉండొచ్చు. ఇలాంటి ఆచారాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు. కాబట్టి ఇటువంటి నమ్మకాలను వెంటనే వదిలివేయాలి. వీలైనంత ఎక్కువగా శాస్త్రీయదృక్పథాన్ని పెంచుకోవాలి. ‘బి’ లు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు మూఢాచారాలకు దూరంగా ఉంటారు. నిర్థారణలేని విషయాలను పక్కకు తోస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. -
విశ్వాసాన్ని కోల్పోతున్నారా?
సెల్ఫ్ చెక్ ఒక్కసారి మనల్ని మనం నమ్మితే అద్భుతాలు సృష్టించవచ్చు, మనకు కావలసిన ఎలాంటి అనుభూతులనైనా సాధ్యం చేసుకోవచ్చు.ఇది జరగనప్పుడు? ఏదైనా సాధించగలను అనుకోవటం మరుక్షణం డీలా పడిపోవటం... వల్ల మనశ్శాంతి ఉండదు. దేనినీ నమ్మక, ఎవరిపై నమ్మకం ఉంచక చివరికి వారినివారే ద్వేషించుకుంటూ తమపై విశ్వాసాన్ని కోల్పోయేవారు ఏదీ సాధించలేరు. అయితే దీనిని అధిగమించటం, మీ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవటం కష్టమేమీ కాదు. 1. మీ పనుల్లో అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకుంటారు. అహానికి తావివ్వరు. ఎ. అవును బి. కాదు 2. ‘‘నువ్వు దేనికీ పనికిరావు, నువ్వు సరిగా పనిచేయటం లేదు’’ ఇలా మిమ్మల్ని ఎవరైనా నిరుత్సాహపరిస్తే ఎలాంటి ఒత్తిడికి లోనవ్వరు. ఎ. అవును బి. కాదు 3. హడావిడి పడరు, ప్లాన్డ్గా ఉంటారు. ప్రతిచిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మీకిష్టం ఉండదు. ఎ. అవును బి. కాదు 4. మిమ్మల్ని ఇబ్బందిపెట్టే సమస్యలను గుర్తు చేసుకొని నోట్ చేసుకుంటారు. వాటిని ఎలా పరిష్కరించవచ్చో, మార్గాలు అన్వేషిస్తారు. ఎ. అవును బి. కాదు 5. అసంబద్ధమైన వాటిని నమ్మాలంటే అనుమాన పడతారు, కానీ మీ నమ్మకంపై అనుమానం పెంచుకోరు. ఎ. అవును బి. కాదు 6. దార్శనికతను ఏర్పరచుకుంటారు. దానికోసం కావలసిన ఇన్పుట్స్ను పొందుతారు. మీ విజన్కున్న ప్రతికూల అంశాలను గుర్తించగలరు. ఎ. అవును బి. కాదు 7. విజన్ను ఏర్పరచుకొని అంతటితో వదిలేయరు. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మోటివేట్ అవుతారు. మీరనుకున్నది సాధించలేమని అనుకోరు. ఎ. అవును బి. కాదు 8. మీ విశ్వాసాన్ని నీరుకార్చే ఆలోచనలు వస్తే వాటిని ఆహ్వానిస్తారు. తర్వాత వాటిని పాజిటివ్గా మరల్చుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 9. కొన్ని సందర్భాల్లో, నమ్మకాన్ని కోల్పోవటం మీకు మాత్రమే జరగదని, ఇలా ప్రతివ్యక్తిలో జరుగుతుందని అనుకుంటారు. అందుకే దీనిని కామన్ ప్రాబ్లమ్గా నిర్వచిస్తారు. ఎ. అవును బి. కాదు 10. ప్రయత్నించడమంటే మీకిష్టం. మీరు ట్రై చేసిన మొదటిసారే మీరనుకున్న ఫలితం రావాలని ఆశించరు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీ విశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోరు. విశాలదృక్పథంతో, ఆప్టిమిజంతో పనులను చేస్తుంటారు. దీనివల్ల మంచి ఆరోగ్యం మీ సొంతమవుతంది. ఇబ్బందిపెట్టే ఆలోచనలను దరిచేరనివ్వరు. ‘బి’ లు ఆరు దాటితే మనశ్శాంతితో ఉండరు. జీవితంలో ఎలా ఆనందించాలో, సమస్యలపై ఎలా స్పందించాలో మీకు తెలియదు. మీ నిరాశావాదానికి ఇకనైనా చెక్ చెప్పండి. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా తీసుకోవటంతోపాటు ఆత్మవిశ్వాసం ఎలాపొందాలో తెలిపే పుస్తకాలూ చదవండి. ఆశావాదులతో స్నేహం చేయండి. ఆల్ ద బెస్ట్. -
విశ్వాసంతో జయిస్తున్నారా?
సెల్ఫ్చెక్ ఒక్కసారి మనల్ని మనం నమ్మితే అద్భుతాలు సృష్టించవచ్చు, ఎప్పుడూ సంతోషంతో ఉండవచ్చు. మనకు కావలసిన ఎలాంటి అనుభూతులనైనా సాధ్యం చేసుకోవచ్చు. ఇది జరగనప్పుడు? ఏదైనా సాధించగలను అనుకోవటం మరుక్షణం డీలా పడిపోవటం... నా జీవితం ఎప్పటికీ ఇంతే... లోకంలో కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తాయి? జీవించటం అవసరమా? ఇలా ఎప్పుడూ అభద్రతా భావంతో, నిరాశా వాదంతో, నిస్సత్తువతో ఉండటంవల్ల మనశ్శాంతి ఉండదు. దేనినీ నమ్మక, ఎవరిపై నమ్మకం ఉంచక చివరికి వారినివారే ద్వేషించుకుంటూ తమపై విశ్వాసాన్ని కోల్పోయేవారు ఏదీ సాధించలేరు. తమపై తాము విశ్వాసాన్ని కోల్పోవటానికి సాధారణంగా కుటుంబ, వ్యక్తిగత, సమాజ పరిస్థితులు కారణంగా ఉంటాయి. అయితే వీటిని అధిగమించటం పెద్ద సమస్యేమీ కాదు. మీ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవటం కష్టమేమీ కాదు. 1. మీ పనులను మీరు చేసుకొంటున్నా అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకుంటారు. అహానికి తావివ్వరు. ఎ. అవును బి. కాదు 2. ‘‘నువ్వు దేనికీ పనికిరావు, నువ్వు సరిగా పనిచేయటం లేదు’’ ఇలా మిమ్మల్ని ఎవరైనా నిరుత్సాహ పరిస్తే ఎలాంటి ఒత్తిడికి లోనవ్వరు. ఎ. అవును బి. కాదు 3. హడావిడి పడరు, ప్లాన్డ్గా ఉంటారు. ప్రతిచిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మీకిష్టం ఉండదు. ఎ. అవును బి. కాదు 4. మిమ్మల్ని ఇబ్బందిపెట్టే సమస్యలను గుర్తు చేసుకొని నోట్ చేసుకుంటారు. వాటిని ఎలా పరిష్కరించవచ్చో, మార్గాలు అన్వేషిస్తారు. ఎ. అవును బి. కాదు 5. అసంబద్ధంగా ఉన్నదాన్ని నమ్మాలంటే సదేహిస్తారు. కాని మీ అభిప్రాయం మీద మీకున్న విశ్వాసాన్ని కోల్పోరు. ఎ. అవును బి. కాదు 6. దార్శనికతను ఏర్పరచుకుంటారు. దానికోసం కావలసిన ఇన్పుట్స్ను పొందుతారు. మీ విజన్కున్న ప్రతికూల అంశాలను గుర్తించగలరు. ఎ. అవును బి. కాదు 7. విజన్ను ఏర్పరచుకొని అంతటితో వదిలేయరు. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మోటివేట్ అవుతారు. అనుకున్నది సాధించలేనేమోనని భయపడరు. ఎ. అవును బి. కాదు 8. మీ విశ్వాసాన్ని నీరుకార్చే ఆలోచనలు వస్తే వాటిని ఆహ్వానిస్తారు. తర్వాత వాటిని పాజిటివ్గా మరల్చుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 9. కొన్ని సందర్భాల్లో, నమ్మకాన్ని కోల్పోవటం మీకు మాత్రమే జరగదని, ఇలా ప్రతివ్యక్తిలో జరుగుతుందని అనుకుంటారు. అందుకే దీనిని కామన్ ప్రాబ్లమ్గా నిర్వచిస్తారు. ఎ. అవును బి. కాదు 10. ప్రయత్నించడం అంటే మీకిష్టం. మీరు ట్రై చేసిన మొదటిసారే మీరనుకున్న ఫలితం రావాలని ఆశించరు. ప్రయత్నం మీద దేనినైనా సాధించవచ్చని నమ్ముతారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీ విశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోరు. విశాలదృక్పథంతో, ఆప్టిమిజంతో పనులను చేస్తుంటారు. దీనివల్ల మంచి ఆరోగ్యం మీ సొంతమవుతంది. ఇబ్బందిపెట్టే ఆలోచనలను దరిచేరనివ్వరు. ‘బి’ లు ఆరు దాటితే మనశ్శాంతితో ఉండరు. జీవితంలో ఎలా ఆనందించాలో, సమస్యలపై ఎలా స్పందించాలో మీకు తెలియదు. మీ నిరాశావాదానికి ఇకనైనా చెక్ చెప్పండి. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా తీసుకోవటంతోపాటు ఆత్మవిశ్వాసం ఎలాపొందాలో తెలిపే పుస్తకాలు చదవండి. ఆశావాదులతో స్నేహం చేయండి. ఆల్ ద బెస్ట్. -
అభీష్ట ప్రదాత తిరుత్తణిగై
పుణ్య తీర్థం తమిళంలో మురుగన్ అంటే అందం అని అర్థం. అందానికి ప్రతీకగా భక్తులచే పూజలందుకునే దైవంగా కీర్తి చెందిన సుబ్రమణ్యస్వామి (మురుగన్) తన ఆరు పుణ్యక్షేత్రాల్లో ఉగ్రరూపుడిగా దర్శనమిచ్చినా ఒక్క తిరుత్తణి కొండలో మాత్రం శాంతస్వరూపుడిగా భక్తులను కటాక్షిస్తున్నాడు. ఈ ఆలయంలో స్వామికి నిర్వహించే అభిషేకాల్లో వినియోగించే విభూది, గంధ ప్రసాదాల ద్వారా ఆరోగ్య సమస్యలు నయమవుతాయని విశ్వాసం. ఆరోగ్యం, విద్య, వ్యాపారం, కోర్టు సమస్యలు, వివాహం తదితర సమస్యలు సుబ్రమణ్యస్వామిని దర్శించుకుంటే తొలగుతాయని ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తిరుత్తణికి విచ్చేస్తుంటారు. ఈ క్షేత్రానికి తమిళంలో తొండ్రుతొట్టు అని పేరు. అంటే తప్పులు, పాపాలను మన్నించి సౌభాగ్యాలు ప్రసాదించడం అని, తిరుత్తణిగై అంటే శాంతించిన దేవుడని అర్థం. ఇప్పుడక్కడ ఆడికృత్తిక ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా... స్థలపురాణం దేవతలు, మునులు, రుషులను బాధపెట్టిన శూరపద్ముడనే రాక్షసునితో ఉగ్రరూపుడిగా భీకర యుద్ధం చేపట్టి, వల్లీదేవిని వివాహం చేసుకునేందుకు బోయ రాజులతో తేలికపాటి పోరు ముగిసిన తరువాత స్వామి శాంతస్వరూపుడిగా కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుత్తణి కొండమీద తూర్పుదశలో వున్న ఆలయానికి ఇరుపక్కల రెండు పర్వత్రÔó ణులు వ్యాపించి వున్నాయి. ఉత్తరాన గల పర్వతం తెల్లగా ఉండడం వల్ల పచ్చిబియ్యపు కొండగా, దక్షిణం వైపున్న పర్వతం నల్లగా వున్నందున గానుగ పిండి పర్వతంగా పిలుస్తారు. ఈ కొండను చేరుకునేందుకు 365 మెట్లు వున్నాయి. తన తండ్రి పరమేశ్వరుని కొలిచేందుకు తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్టించాడు. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో వున్న శివలింగానికి కుమారేశ్వరుడని పేరు. దేవసేనను తిరుప్పరంకుండ్రంలోనూ, ఇంద్రుడి కుమార్తె వల్లీదేవిని తిరుత్తణికొండలోనూ వివాహం చేసుకుంటాడు. వివాహం సందర్భంగా ఇంద్రుడు కానుకగా ఇచ్చిన గజరాజం ఆలయ వాకిలికి ముందు ధ్వజ స్తంభానికి ఆనుకుని ఇప్పటికీ దర్శనమిస్తుంటుంది. ఈ గజరాజాన్ని దర్శించుకున్నాకనే ఆలయంలోకి అడుగుపెట్టడం ఆచారం. ఇంద్రుడు ఇచ్చిన మరో కానుక గంధపు రుబ్బురాయి. కొండ ఆలయంలోని రెండవ ప్రాకారంలో యాగశాలకు ఎదురుగా వున్న ఈ రుబ్బురాతిలోనే నేటికీ స్వామివారి సేవలకు వినియోగించే గం«ధాన్ని తీస్తారు. మొదటి ప్రాకారానికి వెనుక వైపు బాలమురుగన్ సన్నిధిలో ఆరుద్ర దర్శనంలో బాలమురుగన్కు వేడినీళ్లతో అభిషేకం చేస్తారు. ఆలయంలోని నాల్గవ ప్రాకారంలో నెలకొని వున్న మూలమూర్తి ఎడమ చేతిలో శూలంతో దర్శనమిస్తున్నాడు. స్వామివారికి ఇరువైపులా దేవసేన, వల్లీదేవతలకు వేర్వేరుగా సన్నిధులున్నాయి. ఈ ఆలయంలో నిర్వహించే ఏకాంత సేవలో ఒకరాత్రి వల్లీదేవితో, మరురాత్రి దేవసేనతో సుబ్రమణ్యస్వామి కొలువుదీరడం మరే ఆలయంలో లేని ప్రత్యేకత. లక్ష రుద్రాక్ష మండపం ఉత్సవర్లు కొలువుదీరిన లక్ష రుద్రాక్షమండపం ఈ ఆలయ ప్రత్యేకత. లక్ష రుద్రాక్షలతో రూపుదిద్దుకున్న పల్లకిలో నిత్యం వల్లీదేవీ, దేవసేన సమేతంగా భక్తులకు దర్శనమిస్తుంటారు. అలాగే షణ్ముఖర్, ఆపత్సహాయక వినాయకుడు, ఆది బాలసుబ్రమణ్యం, కుమారేశ్వరుడు, బైరవుడు తదితర సన్నిధులను కూడా కచ్చితంగా దర్శించుకోవడం నియమం. విశిష్ట ఉత్సవ వేడుకలు సుబ్రమణ్యస్వామి కృత్తిక నక్షత్రంలో జన్మించడంతో ప్రతి కృత్తిక, మంగళవారం రోజుల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఆషాఢంలో శరవణ పుష్కరిణిలో మూడు రోజులపాటు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు కావిళ్లతో కొండకు వస్తారు. ముందుగా తలనీలాలు సమర్పించి శరవణ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి మెట్లమార్గంలో ఆలయం చేరుకుని స్వామికి కావళ్లు చెల్లించి హుండీల్లో కానుకలు చెల్లించడం పరిపాటి. ఎలా వెళ్లాలంటే..? అప్పట్లో తమిళ, తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న తిరుత్తణిని ఆంధ్రరాష్ట్రంలో చేర్చారు. అయితే తమిళ భాషాభిమానులు చేపట్టిన ఉద్యమంతో తిరుత్తణి తమిళనాట అంతర్భాగంగా మారింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దులోని తిరుత్తణి చెన్నైకు 80 కిలోమీటర్లు, తిరుపతికి 65 కిలోమీటర్ల దూరంలో వుంది. చెన్నై నుంచి ముంబయి రైలు మార్గంలోని అరక్కోణం రైల్వే జంక్షన్కు పది కిలోమీటర్ల దూరంలో వుంది. – చక్రాల నరసింహులు, సాక్షి, తిరుత్తణి (తమిళనాడు) -
దండాలన్నా నాంపల్లి నర్సన్నా
పుణ్య తీర్థం ఐదు తలల సర్పాకారం... తలపై శ్రీకృష్ణుడి నృత్యరూపం.. 52 అడుగుల ఎల్తైన గుట్ట.. చుట్టూ పచ్చని పంటలు.. కనుచూపు మేర కనువిందుచేసే అందాలు... మనసును ఉల్లాసంగా ఉంచే ప్రకృతి దృశ్యాలు...ఎన్నిసార్లు చూసినా... తనివి తీరని అద్భుత శిల్పాలు నాంపల్లిగుట్ట సొంతం. ఆ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎంతో విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రం. పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఆనందానుభూతులలో ఓలలాడతారు. నాంపల్లిని పూర్వం నామపల్లిగా పిలిచేవారు. ఆరువందల ఏళ్ల కిందట ఈ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి వెలసినట్లు చెబుతారు. శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో చోళుల కాలంలోనే స్వామివారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. సహజ సిద్ధంగా ఓ వైపు మూలవాగు.. మరోవైపు మానేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత లోపల ఉన్న అంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమంతుడికి మండల దీక్షలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులు నాంపల్లిగుట్టకు కూడా వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. కొత్తగా పెళ్లయిన జంటలు సంతానం కలగాలని మొక్కుకుని, కోరిక నెరవేరాక ఇక్కడ వనభోజనాలు చేస్తారు. రాజరాజనరేంద్రుడు, ఆయన సతీమణి కూడా స్వామివారిని సేవించి, సంతానాన్ని పొందినట్లు చారిత్రక కథనాలున్నాయి. గుట్టపై గుహలు నాంపల్లిగుట్టపై సహజసిద్ధమైన బండరాళ్ల మధ్య గుహలు, రెండు కోనేరులున్నాయి. ఇక ఆలయం పక్కనే ఉన్న చిన్న గుహలో శివలింగంతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకూ పూజలు జరుగుతాయి. క్రీ.శ 10 శతాబ్దంలో నవనాథ సిద్ధులు(తొమ్మిది మంది) ఈ గుట్టపై తపస్సు చేసి సిద్ధి పొందారని ప్రతీతి. నిత్యం నవనాథులు ఈ గుహ నుంచి భూగర్భ సొరంగ మార్గంలో వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసే వారని చెబుతారు. కాళీయ మర్దనం.. ప్రత్యేకత నాంపల్లిగుట్ట ఆసాంతం సింహం నిద్రిస్తున్న తీరులో ఉంటుంది. గుట్ట ఎంత మహిమాన్వితంగా కనిపిస్తుందో ప్రకృతి అందాలతో అంతగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సహజ సిద్ధమైన అందాలతో పాటు కాళీయమర్దనం మరో ప్రత్యేకత. ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం. నాగపాము తలపై శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో నృత్యం చేస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎటు నుంచి చూసినా గుట్టపై చెట్లపొదల్లో చుట్టుకుని పడుకున్న కొండంత పాములా కనిపిస్తుంది. పామునోటిలోనికి వెళ్తుండగా.. శ్రీలక్ష్మీనర్సింహస్వామి లీలలను తెలిపే రకరకాల శిల్పాలు కనువిందు చేస్తాయి. గుట్టపైకి వచ్చిన వారు వీటిని మైమరచి చూస్తూ... నర్సింహుడి ఉగ్రరూపాన్ని, నాగదేవతను దర్శించుకుంటారు. నూనెతో, పాలతో స్వయంగా అభిషేకాలు నిర్వహించుకుంటారు. వేడుకలు.. ఉత్సవాలు ప్రతి శ్రావణమాసంలో సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణం, శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, శివరాత్రి వేడుకలు, శ్రీరామనవమి, గోదారంగనాథుల కల్యాణ వేడుకలు జరుగుతాయి. వేములవాడకు అతి సమీపంలో ఉన్న నాంపల్లిగుట్ట అభివృద్ధికి తెలంగాణ పర్యాటక శాఖ రూ.29 కోట్లతో గుట్ట దగ్గర ధ్యానమందిరం, ప్లానెటోరియం, గుట్టపైకి రోప్వే, కాటేజీలు, లైట్ అండ్ సౌండ్స్ వంటి ఆధునిక వసతులను సమకూర్చేందుకు ప్రతిపాదించారు. గుట్టపైకి ఘాట్ రోడ్డు సౌకర్యం ఉంది. ఎలా చేరుకోవాలి..! నాంపల్లిగుట్టకు చేరాలంటే రోడ్డు మార్గం ఒక్కటే ఉంది. హైదరాబాద్ మీదుగా రావాలంటే సిద్దిపేట, సిరిసిల్ల గుండా 152 కిలోమీటర్లు ప్రయాణించి వేములవాడ చేరుకోవాలి. అక్కడి నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో నాంపల్లిగుట్ట దర్శనమిస్తుంది. కరీంనగర్కు 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ మార్గంలో ఉంది. జగిత్యాల మీదుగావచ్చే వారు 55 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆర్టీసీ బస్సు సౌకర్యం, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. గుట్టపైకి వాహనాలు వెళతాయి. మెట్ల గుండా ఆలయానికి చేరుకోవాలి. – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’, రాజన్న సిరిసిల్ల -
విశ్వాస మహిమ
ఒకసారి ఒకడు సముద్రాన్ని దాటి లంకనుంచి భారతదేశానికి రావాలనుకున్నాడు. విభీషణుడి దగ్గరకు వెళ్లి ఆయన సలహా కోరాడు. విభీషణుడు ఏదో ఒక వస్తువును అతని అంగవస్త్రంలో పెట్టి ముడి వేసి, ‘‘భయపడకు. నువ్వు నీటిపై నడిచి సముద్రాన్ని క్షేమంగా దాటగలుగుతావు. అయితే, నీ అంగవస్త్రానికి కట్టిన దానిని మాత్రం ముడివిప్పి చూడకు. అలా చేస్తే మునిగిపోతావు’’ అని హెచ్చరించాడు. విభీషణుడి మాటలపై విశ్వాసంతో అతడు నేలమీద నడిచినంత సులభంగా సముద్రం మీద నడిచిపోసాగాడు. కొంతదూరం వెళ్లేసరికి అతనికి ఒక సందేహం కలిగింది. ‘నేను ఇంత సులభంగా నీటిమీద ఎలా నడిచి పోగలుగుతున్నాను? విభీషణుడు నా కొంగు చివర ఏమి కట్టి ఉంటాడు? తీసి చూస్తే బాగుంటుంది’ అనుకున్నాడు. అంగవస్త్రం ముడివిప్పి చూశాడు. దానిలో ఒక ఆకు ఉంది. ఆ ఆకుమీద ‘శ్రీరామ’ అని రాసి ఉంది. దాన్ని చూసి, ‘ఓస్! ఇంతేనా?’ అనుకున్నాడు. వెంటనే నీటిలో మునిగిపోయాడు. విశ్వాసం కొద్దిగా సడలిపోగానే అతనికి అంతకు ముందున్న శక్తి పోయింది. అదే అతని వినాశనానికి నాంది అయింది. -
వైతరిణి ఎలా ఉంటుంది?
జీవులు ఆయువు తీరిన తర్వాత తాను చేసిన పాపపుణ్యాలను బట్టి స్వర్గనరకాలకు వెళతారని విశ్వాసం. అలా నరకానికి వెళ్లే క్రమంలో వైతరణి అనే నదిని దాటవలసి వుంటుందని కూడా కొన్ని పురాణాలలో ఉంటుంది. ఇంతకీ ఆ వైతరణీ నది ఎలా ఉంటుందో చూద్దామా... వైతరణీనది వంద యోజనాల వెడల్పుతో ఉంటుంది. అందులో చిక్కని రక్తం. దానితో పాటు చీము కూడా. మహా జలచరాలు. భరించలేనంత దుర్వాసన. ఎన్ని దీనాలాపనలు చేసినా, పాపి చేసిన పాపాలకు ఫలితం అక్కడ అనుభవించాల్సిందే. అందు కనే మరణించిన వారి సంతానం భువిపై వారి పేరు మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరిణి నదిని సులభంగా దాటగలరని శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి తెలియచెప్పినట్లు గరుడ పురాణంలో తెలుస్తుంది. -
వెల్లివిరిసే ఆత్మీయత
రమజాన్ కాంతులు ఆత్మీయతాభావం వెల్లివిరిసే రమజాన్ మాసం ముఖ్యంగా ఆత్మక్షాళన మాసం. మనల్ని మనం ఆధ్యాత్మికతకు పునరంకితం చే సుకునే మాసం. వ్యక్తి జీవన విధానంలో చైతన్యాన్ని ప్రేరేపించే మాసం. క్రమశిక్షణను నేర్పే మాసం. ఈ మాసంలో దైవప్రసన్నతను భక్తుడు తనివితీరా గ్రోలుతాడు. తన ఆరాధనలచే దేవుని కరుణాకటాక్షాలను మెండుగా పొందుతాడు. విశ్వమానవ సౌభ్రాతృత్వం ఎల్లెడలా వెల్లివిరుస్తుంది. అందరిలో పరస్పరం ఆత్మీయతాభావం కలుగుతుంది. దైవంపై విశ్వాసం ద్విగుణీకృతమవుతుంది. పవిత్ర ఖుర్ ఆన్ అవతరింపంబడిన మాసం ఇది. స్థితిపరులు నిరుపేదలకు దానధర్మాలు చేస్తారు. ఈ మాసం ఆద్యంతం దైవానుగ్రహాలు వర్షింపబడతాయి. పుణ్యకార్యాలపట్ల ఆకాంక్ష, పాపకార్యాల పట్ల వైముఖ్యం కలుగుతుంది. «ధనికులు ఈ మాసంలో పేదలకు జకాత్, ఫిత్రా, సదకా వంటి దానధర్మాలు నిర్వర్తిస్తారు. – షేఖ్ అబ్దుల్ హఖ్ -
ప్రోత్సహించడంలో మీకు మీరే సాటి!
సెల్ఫ్చెక్ చిన్న పిల్లలను తిడుతుంటే వారికి కోపం వస్తుంది, అది అలాగే కొనసాగిస్తే అభద్రతాభావం నెలకొంటుంది. సొంతవారిపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇల్లే కాదు, ఆఫీసూ అంతే. ఉద్యోగుల మీద మేనేజర్ చీటికిమాటికీ చిర్రుబుర్రులాడుతుంటే వారిపై వారు విశ్వాసాన్ని కోల్పోతారు. ఆఫీసులో మీరు సీనియర్ అయితే సాటి ఉద్యోగులను ప్రోత్సహించే బాధ్యత మీది కూడానూ. తోటివారిని ప్రోత్సహించటం వల్ల వ్యక్తిగతంగా వారు అభివృద్ధి సాధిస్తారు. మీలో ప్రోత్సహించే గుణం ఉందా? 1. తోటి ఉద్యోగులు ఇచ్చే సలహాలు, సూచనల గురించి ఆలోచిస్తారు. అవి ఆచరణయోగ్యంగా ఉంటే అవలంబిస్తారు. ఎలాంటి ఇగోలకు తావివ్వరు. ఎ. అవును బి. కాదు 2. విజయాలు సాధించటం వల్ల ఎంత పేరొస్తుందో వివరిస్తారు. వారిలో ప్రేరణ కలిగిస్తారు. ఎ. అవును బి. కాదు 3. గోల్స్ ఎంత ముఖ్యమైనవో, ఎంతమేర కష్టపడాలో చెప్తారు. ఎ. అవును బి. కాదు 4. ఇంతకు ముందు విజయాల్లో వారి పాత్ర ఎంత ఉందో వివరిస్తారు. వారి సహకారం కావాలని అడుగుతారు. ఎ. అవును బి. కాదు 5. అభినందన ద్వారా స్ఫూర్తి కలుగుతుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 6. ఉద్యోగస్తుల్లో అంతర్గతంగా ఉన్న స్కిల్స్ను బయటకు తీయటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఉద్యోగుల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టిస్తారు. బహుమతులు ఇచ్చి ప్రోత్సíß స్తారు. ఎ. అవును బి. కాదు 8. పొరపాటును తెలియపరుస్తారే కాని అవమానాలకు గురిచేయరు. ఎ. అవును బి. కాదు 9. ఆఫీసు వాతావరణంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వరు. టాలెంట్ ఉన్నవాళ్లని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ఎ. అవును బి. కాదు 10. ఉద్యోగుల సందేహాలను తీర్చటానికి ముందుంటారు. మీ అనుభవాన్ని వారితో పంచుకుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీరు మీ ఉద్యోగులకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు. వారిలోని సామర్థ్యాలు వెలికితీయటానికి ప్రయత్నిస్తారు. మీలోని ఈ లక్షణాన్ని కేవలం ఆఫీసుకే పరిమితం చేయరు. మీ కుటుంబసభ్యులు, తెలిసిన వారినందరినీ మంచి పనులు చేయటానికి ప్రోత్సహిస్తారు. -
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికే సదస్సులు
► ఆదిత్యలో స్టార్టప్ కంపెనీల ప్రతినిధుల వెల్లడి టెక్కలి: విద్యార్థుల్లో భయం పొగొట్టి ఆత్మవిశ్వాసం నింపడానికే సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివిధ కంపెనీలకు చెందిన స్టార్టప్ ప్రతినిధులు స్పష్టంచేశారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో టెక్విప్ నిధులతో ఎంటర్ప్రిన్యూర్షిప్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన కేబీహెచ్ఎస్, నైపుణ్య టెక్నాలజీ సొల్యూషన్, సదానందా, టెక్నాలజీ, అక్షయ ఆటోమిషన్ కంపెనీల సీఈవోలు శ్రీనివాస్, శ్యాంనరేష్, కృష్ణకిషోర్, జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో విద్యార్థులు భయం విడనాడాలన్నారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతినిధులు కోరారు. అనంతరం ప్రతినిధులను కళాశాల యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ కె.బి.మధుసాహు, టెక్విప్ సమన్వయ కర్త డి.విష్ణుమూర్తి, డీన్ ఫిన్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఎంటర్ప్రిన్యూర్ షిప్ ఇన్చార్జి బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొక్కోరోకో
హ్యూమర్ ప్లస్ మన నమ్మకాలే నమ్మకాలు. ఎదుటివాళ్ళ నమ్మకాలు మూఢనమ్మకాలు. లోకం సజావుగా నడవాలంటే మన మీద మనకి విశ్వాసం, ఎదుటివాళ్ళ మీద అవిశ్వాసం ఉండాలి. నిప్పు పట్టుకుంటే కాలదని వెనకటికి మావూళ్ళో ఒకాయన వాదించేవాడు. కాలుతుందని మనం నమ్మడం వల్లే అది కాలుస్తుందని అనేవాడు. కానీ బొబ్బలు ఎక్కడినుంచి వస్తాయని అడిగితే పెడబొబ్బలు పెట్టి తన సిద్ధాంతాన్ని విడమర్చి చెప్పేవాడు. నొప్పి అనేది స్పందనా లోపమని, గాయం ఒక దృశ్య లోపమని, భావనే ప్రపంచాన్ని నడిపిస్తుందని అనేవాడు. తర్కం తర్కించడానికే తప్ప పరీక్షించడానికి కాదని కూడా ఆయనకి తెలుసు. అందుకే నిప్పుని ఎప్పుడూ ముట్టుకోలేదు. నమ్మించడానికి పెద్ద ప్రపంచమే వుంటుంది. కానీ నమ్మడానికి మనది చాలా చిన్న జీవితం. రసాయన సిద్ధాంతాన్ని ఎంత బోధించినా భౌతికశాస్త్రాన్ని విస్మరించరాదు. అందుకే గతితార్కిక భౌతిక అధివాస్తవిక, సూత్ర చలన, గమనశీల అనే ఉపన్యాసాలతో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళంతా నయా రివిజనిస్ట్, బూర్జువా, భూస్వామ్య ఫ్యూడల్ అవశేష పదజాలంలో కలిసిపోయారు. కోడిపుంజుని మనం వంటకంగా భావిస్తాం కానీ, అది మాత్రం తనని తాను మేధావిగా భావిస్తూ పుంజుకుంటూ వుంటుంది. తన కూతతోనే సూర్యుడు కళ్ళు తెరుస్తాడని నమ్ముతుంది. ఈ లోకానికి తానే వెలుగు ప్రసాదిస్తున్నాననే జ్ఞాన కాంతిపుంజంతో రెక్కలు విప్పుకుంటూ వుంటుంది. జ్ఞానులని నమ్మిన ప్రతివాడ్ని ఈ ప్రపంచం గొంతుకోసి చంపుతుంది. ఆయుధాన్ని కనుగొన్నప్పుడే మనిషి జ్ఞానాన్ని వేటాడ్డం మొదలుపెట్టాడు.సత్యాన్ని ఆవిష్కరించాలనుకున్న తన పూర్వీకులంతా కత్తికి ఎరగా మారారని ఒక కోడిపుంజు గ్రహించింది. తన స్వరమహిమ చాటాలని బయలుదేరింది. ఒక రాతి బండ కింద గుటకలు మింగుతున్న కప్ప కనిపించింది. తనకి, సూర్యుడికి గల అవినాభావ సంబంధాన్ని ‘కొరకొర’ శబ్దంతో వివరించింది. అంతా విన్న కప్ప నాలుగు అడుగులు ముందుకి, రెండు అడుగులు వెనక్కి గెంతింది. ‘‘నీ గురించి నీకెంత తెలుసో, నా గురించి నాకు అంతే తెలుసు. బండచాటు నుంచి నేను బయటకు వచ్చిన ప్రతిసారి వర్షం వస్తుంది. అంటే ఈ లోకానికి జలాన్ని ప్రసాదించే శక్తి నాకు మాత్రమే వుంది. చిటపట చినుకులకి, బెకబెకలకి సంబంధముంది. ఈ సత్యాన్వేషణ గురించి లోకానికి తెలియజేయాలనుకుని యాత్రార్ధులై వెళ్ళిన నా పూర్వీకులందరూ చైనీస్ హోటళ్ళలో తేలారు. ప్రకృతి శక్తి గురించి తెలిసిన ప్రతివాడ్ని ఈ లోకం వండుకు తింటుంది జాగ్రత్త’’ అని కప్ప రాతిలో జరిగే జీవపరిణామం, తద్వారా ఉద్భవించే పురుగుల అన్వేషణకి బయలుదేరింది. ప్రతివాడికి ఒక సిద్ధాంతం ఉంటుంది. మనది మనం చెప్పడానికి ప్రయత్నిస్తే అవతలివాడు వాడిది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. రెండింటి వైరుధ్యాల మధ్య యుద్ధం జరిగి కొత్తది పుడుతుంది. ఇతరుల్ని మనం అంగీకరిస్తే, మనల్ని అంగీకరించేవాడు ఎక్కడో తగలకపోడని నమ్మి పుంజు బయలుదేరింది. ఒక తొండ తగిలింది. సూర్య సిద్ధాంతాన్ని వివరించేలోగా అది అందుకుంటూ ‘‘ఈ లోకానికి వ్యాయామాన్ని నేర్పించిందే నేను. తొలి సిక్స్ప్యాక్ రూపకర్తను నేను’’ అంటూ బస్కీలు మొదలుపెట్టింది. ఈసారి ఊసరవెల్లి తగిలింది. డ్రామాలో ఫోకసింగ్ లైట్లని మార్చినట్టు ఒంటిమీద రంగుల్ని మార్చింది. ‘‘ప్రపంచాన్ని వర్ణశోభితం చేసింది నేనే. పెయింటర్లందరికీ నేనే స్ఫూర్తి’’ అని డబ్బా అందుకుంది.పుంజుకి తత్వం బోధపడింది. ఎవరికి వాళ్ళు తామే ఈ లోకాన్ని నడుపుతుంటామని భావిస్తారని, స్వీయజ్ఞానం అంటే ఇదేనని అర్థమైంది. దుఃఖంతో కోళ్ళ గంప చేరుకుంది. మరుసటిరోజు మబ్బులు పట్టి సూర్యుడు రాలేదు. తాను కూయకపోతే సూర్యుడు రాడని మారుజ్ఞానం పొందింది. – జి.ఆర్. మహర్షి -
నమ్మితే నిలువునా మోసం చేశారు
కోల్డ్స్టోరేజి ఎదుట 12రోజులుగా మహిళ పోరాటం పసుపు వ్యాపారం చేస్తూ చనిపోయిన భర్త రుణాలు చెల్లిస్తామని మోసగించిన పెద్దమనుషులు న్యాయం చేయాలంటూ రైతులతో కలిసి మహిళ ఆందోళన దుగ్గిరాల: పసుపు వ్యాపారం చేస్తున్న భర్త మృతిచెందడంతో ఆయనకు ఉన్న అప్పులు తీర్చేందుకు పెద్దమనుషులను నమ్మి మోసపోయిన మహిళ న్యాయం కోసం పోరాడుతోంది. తన పేరున ఉన్న భూమిని విక్రయించి రుణాలు తీర్చాలని, కోల్ట్స్టోరేజిలో పెట్టిన పసుపు బస్తాలను తీసి రైతులకు చెల్లించాలని ఎక్కడ అడిగితే అక్కడ సంతకాలు పెట్టిన ఆమె మోసపోయానని తెలుసుకుంది. కోల్డ్ స్టోరేజి యాజమాన్యంతో కలిసి పెద్దలు తమవరకు రావాల్సిన మొత్తం తీసుకుని రైతులకు చెల్లించలేదని ఆలస్యంగా తెలుసుకుని న్యాయం చేయాలంటూ కోల్స్టోరేజి ఎదుట పోరాడుతోంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు... కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన బొంతు అశోక్రెడ్డి పసుపు వ్యాపారం నిర్వహించేవారు. అందులో భాగంగా మధ్యవర్తిగా ఉండి దుగ్గిరాలలోని ఓ కోల్డ్స్టోరేజిలో రైతులకు చెందిన సుమారు రూ. ఏడు కోట్ల విలువైన పసుపును నిల్వ ఉంచారు. గత ఏడాది అశోక్రెడ్డి అనారోగ్యంతో అకస్మికంగా మృతి చెందారు. విషాదంలో ఉన్న అశోక్రెడ్డి భార్య రమాదేవిని పలువురు పెద్దలు కలిసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి చెప్పగా.. తన భర్త ఎవరికి రుణం ఉండకూడదని చెప్పి తన పేరిట ఉన్న 11 ఎకరాల పొలం కాగితాలు ఇచ్చి, విక్రయించి అందరికి చెల్లించడంతో పాటు స్టోరేజిలో ఉన్న పసుపు రైతులకు అప్పగించాలని కోరింది. ఇదే అదనుగా కొందరు కోల్డ్ స్టోరేజి యాజమాన్యంతో కుమ్మక్కై 13500 పసుపు బస్తాలను 1350 బస్తాలుగా చిత్రీకరించి మోసం చేశారు. ఆచారం ప్రకారం గుడిలో నిద్ర చేస్తున్న మహిళ వద్దకు వెళ్లిన పెద్దలు సమస్య అంతా తీరిపోయిందని, ఒక్క స్టాంప్ పేపర్ మీద సంతకం చేస్తే చాలని చెప్పడంతో నిజమేనని నమ్మి సంతకం చేసింది. అంతా అయిపోయిందని తన రాత ఇంతవరకే ఉందనుకుని కుమార్తెను చదివించుకుంటూ జీవిస్తోంది. కోర్టు నోటీసులతో... అంతా సజావుగా ఉందనుకునే సమయంలో నెల రోజుల క్రితం కొందరు తమకు అశోక్రెడ్డి డబ్బులు ఇవ్వాలంటూ రమాదేవికి కోర్టు నోటీసులు పంపడంతో కంగారుపడ్డ ఆమె ఏం జరిగిందో తెలుసుకుని నివ్వెరపోయింది. కోల్డ్స్టోరేజి యాçజమాన్యం రైతుల పసుపు బస్తాలకు వారిపేరునే బాండ్లను తయారు చేసి గుంటూరులోని ఓ బ్యాంక్లో పెట్టి కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. అశోక్రెడ్డి మృతి చెందడంతో రైతులకు ఎగ్గొట్టేందుకు స్టోరేజి యాజమన్యం ఆయన భార్య రమాదేవి సంతకం చేసిన స్టాంప్ పేపర్లో స్టోరేజిలో ఉన్న పసుపును రైతులకు అప్పగించినట్టు రాసుకుని దానినే ఇప్పుడు రైతులకు చూపిస్తూ వారిని మోసగించేందుకు కుట్ర చేస్తున్నారు. రమాదేవి కోల్డ్ స్టోరేజి యాజమాన్యాన్ని ప్రశ్నించగా తమకు సంబంధం లేదని చెప్పింది. దీంతో కోల్డ్ స్టోరేజి రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, రైతులకు అన్యాయం చేయవద్దని రమాదేవి రైతులతో కలిసి 12రోజులుగా స్టోరేజి వద్ద ఆందోళన చేస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని స్టోరేజిలో రికార్డులను పరిశీలించాలని కోరుతోంది. -
పరిశుద్ధ లేఖనాల్లోని ప్రవచనాల సమాహారం
ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి, మనం దేవుని ప్రేమించామని కాదు, ఆయనే మనలను మొదట ప్రేమించారు. అందుకే మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన తన కుమారుని పంపారు. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయమును పొందుతున్నాం. ఈ లోకంలో మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవైనా, రాబోయేవైనా, అధికారులైనా, ఎల్తైనా, లోతైనా, సృష్టింపబడినదేదైనా మన ప్రభువునైన క్రీస్తు యేసునందలి ప్రేమ నుంచి మనలను దూరం చేయవు. దేవుడికి ఏ ఒక్కరూ నశించిపోవుట ఇష్టం కాదు. నశించిన దానిని వెదికి రక్షించటానికే మనుష్య కుమారుడు వచ్చాడు. ఎందుకంటే దైవత్వం సర్వ సంపూర్ణ శరీరంగా క్రీస్తులో నివసిస్తోంది. ఆయన శిలువ మీద మన పాపాలన్నింటినీ మోసి వెల చెల్లించాడు. దేవునికి మానవునికి సంధి చేశాడు. దేవుడు తన సొంత కుమారుని అనుగ్ర హించటానికి వెనుకదీయకుండా మన అందరి కోసం ఆయనను అప్పగించాడు. అదీ... ఆయనకు మనమీద ఉన్న ప్రేమ! పాప క్షమాపణ యేసు రక్తము జయము. అపవాది క్రియలకు లయము. పాపము చేయని మనిషంటూ ఉండడు. తెలిసో తెలియకో ఏదో ఒక పాపం మనవల్ల జరుగుతూనే ఉంటుంది. అందుకే మన కోసం ఆ ప్రభువు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. మన పాపాల నుంచి మనకు విముక్తి కలిగించడానికే దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మన కోసం ప్రాణత్యాగం చేశాడు. రక్తం చిందించకపోతే పాప క్షమాపణ కలుగదు కనుక, మన పాపాల కోసం క్రీస్తు శిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం మనలను కడిగి పరిశుద్ధ పరచడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచితే... ఆయన నామం మూలంగా మనం తప్పకుండా పాప క్షమాపణను పొందుతాం. మనం పాప క్షమాపణ పొందినప్పుడే అపవాదిని జయించగలుగుతాం. ఆ విజయాన్ని సొంతం చేసుకోవాలంటే మన పాపాలకు క్షమాపణను మనం పొంది తీరాలి. అది క్రీస్తును విశ్వసించి, ఆయన మార్గంలో నడవడం ద్వారానే సాధ్యపడుతుంది. తగ్గించుకుంటే హెచ్చిస్తాడు! చాలామంది తమను తాము అధికులుగానే భావిస్తారు. ఇతరులు తమను అలాగే చూడాలని హెచ్చులకు పోతుంటారు. అది ప్రభువుకి ఏమాత్రం నచ్చని విషయం. అందుకే ఆయన తగ్గించుకుని బతకమని ఆదేశించాడు. తన్ను తాను హెచ్చించు కొనువాడు తగ్గించబడతాడని, తన్ను తాను తగ్గించుకొనేవాడు హెచ్చింపబడతాడని ఆయన చెప్పాడు. అలా తగ్గించుకోవడం ద్వారానే మనం దేవుని కృపను పొందగలుగుతాం. నిజానికి దైవ కుమారుడే ఎంతో తగ్గించుకున్నాడు. మన కోసం ఓ సాధారణ మనిషిలా పశువుల పాకలో జన్మించాడు. ఈ లోకములోనే పెరిగి, పాపుల మధ్యన మసిలి, తన నిరాడంబరతను చాటుకున్నాడు. సిలువ మరణాన్ని పొందాడు. తాను చేసిన ప్రతి పనిలోనూ తనను తాను ఎంత తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని పోలికతో పుట్టిన నరులమైన మనం కూడా మనలను మనం తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు మనలను హెచ్చిస్తాడు. విశ్వాసం! దేవునిపై విశ్వాసం ఉన్ననాడే దేవుని అడుగు జాడల్లో నడవగలుగుతాం. అందుకే మనం కచ్చితంగా ఉత్తమ విశ్వాసిగా ఉండి తీరాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ విశ్వాస వీరులుగా ఉండాలి. పరిశుద్ధులు విశ్వాసం ద్వారా గొప్ప సాహసోపేతమైన కార్యాలు చేశారని పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి. వాళ్లందరూ ఘనపరచబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో వాళ్లు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి గురించి పాత నిబంధన ఎంతో స్పష్టంగా తెలియజేస్తోంది. మనమూ అటువంటి విశ్వాసులమై ఉండాలి. అప్పుడే మనం మనలను బలహీనపరిచే దురాత్మలతో పోరాడగలం. ఆ పోరాటంలో విజయమూ సాధించగలం. కాబట్టి దేవునియందు విశ్వాసం కలిగి జీవిద్దాం. ఆ విశ్వాసం మనకు జయాన్ని తెస్తుంది. మనలను విజేతలుగా నిలబెడుతుంది. ఆ విజయం ఎంతో గొప్పది. అది లోక సంబంధితమైన విజయం కాదు. పరలోకంలో మనకు స్థానం కల్పించే గొప్ప విజయం! ఇచ్చేవారు ధన్యులు! ‘పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యము’ అన్నాడు ప్రభువు. దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. మన అవసరతలన్నీ తీర్చాడు. అవి లేనివాళ్లు మన చుట్టూ ఎందరో ఉన్నారు. వారికి మనకున్నదానిలో కాస్తయినా ఇస్తే చాలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే, బట్టలు లేనివారికి బట్టలిస్తే నాకు ఇచ్చినట్టే, అవసరంలో ఉన్నవారికి మీరు చేసే ప్రతి సాయం నాకు చేసినట్టే అని ప్రభువు చెప్పాడు. నీ దగ్గర సొమ్ము ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చి అడిగితే లేదని అనవద్దు అని కూడా లేఖనాల్లో స్పష్టం చేశాడు. తన బిడ్డలకు దాతృత్వం ఉండి తీరాలి అన్నదే ఆయన అన్న మాటలకు అర్థం. మనకన్నీ ఇచ్చే మన ప్రభువు మనలో దాతృత్వాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. అది మనలో ఉంటే మనం ధన్యులమైనట్టే! స్వస్థపరచువాడు! మన దేవుడు స్వస్థపరుచువాడు. అంతే కాదు, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాలలో ఏదీ కూడా మనకు రానివ్వనని ఆనాడే ఆయన వాగ్దానం చేసివున్నాడు. ఆయనే మనకు రక్ష. ఆయన వ్యాధిని తొలగించువాడు మాత్రమే కాదు. మంచి ఆరోగ్యము ఇచ్చేవాడు కూడా! మన ప్రభువు మన పాపములను క్షమించువాడు. శాపములను తొలగించువాడు. వ్యాధులను స్వస్థపరుచువాడు. చేదైన జీవితమును మధురమైనదిగా మార్చువాడు. ‘‘మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ’’ అని పరిశుద్ధ లేఖనం మనకు స్పష్టం చేస్తోంది. కేవలం మన కోసమే ఆయన శిక్షను అనుభవించాడు. మన జీవితాలను బాగు చేసేందుకే తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయనే మనలను కాపాడువాడు. ఆయనే మనకు నిత్యజీవాన్ని అనుగ్రహించువాడు. సమస్తం అనుగ్రహించువాడు! దేవుడు తన సొంత కుమారుడినే మన కోసం బలి చేశాడు. మరి మనం ఆయన మార్గంలో నడిస్తే మనకు సమస్తం ఎందుకు అనుగ్రహించడు! ఎంత గొప్ప ప్రేమ ఆయనది! యేసయ్య తన రక్తమాంసములను మాత్రమే కాక లోకము ఇవ్వలేని తీసుకోలేని దైవిక సమాధానాన్ని, రక్షణను మనకు అనుగ్రహించాడు. జీవకిరీటాన్ని, నిత్య నివాస స్థలాన్ని మనకు ఇచ్చాడు. మనం చేయవలసినదంతా కేవలం మన హృదయాన్ని ఆయనకు ఇవ్వడమే! ‘కుమారుడా, కుమార్తే... నీ హృదయమును నాకిమ్ము’ అని ఆయన నోరు తెరిచి మనల్ని అడుగుతున్నాడు. యేసు తన రక్తము ద్వారా మనలో నిబంధన చేసుకున్నాడు. పాపాలను క్షమించడమే కాకుండా, శాప ప్రభావాన్ని కూడా తొలగించి దేవుని ఉగ్రత నుండి కాపాడాడు. సాతాను తలను చితక త్రొక్కి మన వ్యాధిని స్వస్థపరిచియున్నాడు. మన కోసం సమస్తం చేసిన మన ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుని తీరాలి. ఆదరణ కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఈ లోకంలో ఎటు చూసినా దుఃఖమే కనిపిస్తోంది. కానీ ఆయన సన్నిధి మనల్ని కాపాడుతోంది. లోకులు మన çహృదయాన్ని గాయపరుస్తుంటే... ఆయన మనల్ని ఓదార్చి బలపరుస్తున్నాడు. ఆయన హస్తములు మనల్ని ప్రేమతో దగ్గరకు తీసుకుంటున్నాయి. ప్రభువు కన్నీటిని తుడుచువాడు, రోగ పీడితులను స్వస్థపరుచువాడు, చనిపోయినవారిని లేవనెత్తువాడు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించువాడు అన్న విషయం ఎప్పుడో నిరూపణ అయ్యింది. ఎలాంటి శ్రమలో ఉన్నా, దాన్ని తొలగించి ఆయన శక్తిని ఇస్తున్నాడు. ఆదరించి అక్కున చేర్చుకుంటున్నాడు. కష్టాలు చుట్టుముట్టిన సమయంలో కావలి ఉంటున్నాడు. కంటికి రెప్పలా కాపాడి కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. ఆ ఆదరణ ఎంతో గొప్పది. ఆయన ఆదరణే మనల్ని ఈ లోక సంబంధిత శ్రమల నుంచి, అపనిందలు అష్టకష్టాల నుంచి విముక్తుల్ని చేస్తున్నది. క్షమాపణ మీ ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములను క్షమించుము (మత్తయి 6:12) అంటూ పరలోక ప్రార్థనలో మనకు నేర్పించాడు యేసయ్య. మేము మాకచ్చియున్న ప్రతిదానిని క్షమించియున్నాము గనుక మా పాపములను క్షమింపుము అని లూకా సువార్తలో కూడా ఉంది. అయితే కొందరు దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, జవాబు ఇవ్వడం లేదు, ముఖం తిప్పుకున్నాడు అని బాధ పడుతూ ఉంటారు. కానీ ఆయన మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం మనలో ఉన్న క్షమించలేని గుణమే. మన హృదయంలో కోపం, వైరాగ్యం ఉన్నప్పుడు మన పట్ల దేవుని ప్రసన్నత ఉండదు. ఎదుటివారిని మనఃపూర్వకముగా క్షమించని యెడల మనమూ క్షమాపణ పొందలేం. మీకు విరోధమేమైన యున్నయెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లా వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును’’ అన్నాడు ప్రభువు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించాలంటే, ముందు మనం ఇతరుల్ని క్షమించాలి. భయం పరిశుద్ధ గ్రంథంలో ‘భయపడకుము’ అన్న మాట 366 సార్లు రాయబడివుంది. మనము ప్రతిదినం ప్రభువును నమ్ముకొనుట వలన భయాన్ని జయిస్తాము. భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు. ధైర్యం చెప్పి మనలను బలపరుస్తున్నాడు. కాబట్టి ‘‘భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము’’ (కీర్తన 46:2–3). దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమలో భయముండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొడుతుంది (1 యోహాను 4:18). లోక రక్షకుడు మనకు అండగా ఉండగా మనకేమి భయము? కాకపోతే భయమును జయించు విశ్వాసము మనలో ఉండాలి. యుగసమాప్తి వరకు సదాకాలము మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి భయాన్ని వీడి ధైర్యంగా జీవించాలి. విజ్ఞాపన ప్రార్థన మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యోబు విషయంలో అదే జరిగింది. అతడు ఎన్నో కష్టాలు పడుతూ కూడా తన కోసం ప్రార్థించలేదు. తన స్నేహితుల కోసం, తనను అవహేళన చేస్తున్నవారి కోసం కూడా ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థనే దేవునికి ఇష్టం. స్వార్థపూరితమైన ప్రార్థన దేవుని చెవులను చేరదు. దీన మనస్సుతో చేసిన ప్రార్థన అత్యంత వేగంగా ఆయన వద్దకు చేరుతుంది. అంతే వేగంగా ఆయన ఆశీర్వాద ఫలము కూడా మనలను వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఇతరుల కోసం ప్రార్థించాలి. ఇతరుల సంతోషం కోసం, వారి సుఖ సౌఖ్యాల కోసం ప్రార్థన చేయాలి. వై.ఎస్. విజయలక్ష్మి -
ఎవర్టన్తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే
రాబర్టో ఫిర్మినో ఇంటర్వూ్య లివర్పూల్ విజయాల్లో ఫార్వర్డ్ ఆటగాడు రాబర్టో ఫిర్మినోది కీలక పాత్ర. అతడి ఆటతీరుతో జట్టు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) టైటిల్ రేస్లో టాప్–3లో ఉందని చెప్పుకోవచ్చు. సోమవారం తమ చిరకాల ప్రత్యర్థి ఎవర్టన్తో జరిగే మ్యాచ్పై తామంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నామని ఫిర్మినో చెబుతున్నాడు. ఎవర్టన్తో జరగనున్న కీలక మ్యాచ్కు సిద్ధంగా ఉన్నారా? అవును. ఇది చాలా పెద్ద మ్యాచ్. ఎవర్టన్తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఆటగాళ్లకే కాకుండా మా మద్దతుదారులకు కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. మ్యాచ్ గెలిచేందుకు తమ శక్తియుక్తులన్నీ ధారపోసేందుకు ప్రతీ ఆటగాడు ఎదురుచూస్తుంటాడు. లివర్పూల్ టైటిల్ రేసులో ఉంది. ఇది మీపై ఒత్తిడి పెంచుతోందా? ఈ సీజన్లో మా జట్టు చాలా బాగా ఆడుతోంది. అయితే ఇక్కడితోనే ఆగిపోం. ప్రీమియర్ లీగ్ టైటిల్ రేసులో మేమూ ఉన్నామనే విషయం వాస్తవం. అయితే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇప్పటిదాకా మా ఆటతీరుకు మార్కులు వేసుకోవాలంటే పదికి ఎనిమిది సాధించాం. ఇంతకన్నా మెరుగ్గా ఆడగలమన్న విశ్వాసం మాకుంది. లివర్పూల్ టైటిల్ గెలుస్తుందని భావిస్తున్నారా? అదే జరిగితే మీ సంబరాలు ఎలా ఉంటాయి? మాకు ఈ టైటిల్ ఎంత ముఖ్యమో తెలుసు. 1990 అనంతరం మేం చాంపియన్గా నిలవలేదు. ఇక మేమే గెలిస్తే మా సుదీర్ఘ ఎదురుచూపులు ఫలించినట్టు అవుతుంది. ఆ సంబరాలు కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాను. -
ఆర్బీఐపై నమ్మకాన్ని ఇది దెబ్బకొట్టింది!
ముంబాయి : కేంద్రప్రభుత్వం తీసుకున్న హఠాత్తు పరిణామం పాత నోట్లను రద్దు ప్రక్రియ వల్ల సెంట్రల్ బ్యాంకు గౌరవాన్ని, స్వాతంత్య్రాన్ని నిర్లక్ష్యం చేసినట్టు వెల్లడవుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ డైరెక్టర్ కైరాన్ కర్రీ అన్నారు. ఆర్బీఐ స్వాతంత్య్రానికి నోట్ల రద్దు ప్రక్రియ ముసుగులా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సెంట్రల్ బ్యాంకు క్రెడిబుల్ ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. కర్రీ మీడియాతో నిర్వహించిన భేటీలో ఈ విషయాలను వెల్లడించారు. పాత నోట్ల రద్దు ప్రక్రియ భారత్లో విధానపర నిర్ణయాలపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిందని, ఆర్బీఐపై నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని పేర్కొన్నారు. అయితే ఆర్బీఐ క్రెడిబుల్ సంస్థగానే ఉందని తాము అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దాని అమలులో లోటుపాట్ల వల్ల కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాపైనా పలు కామెంట్లు వస్తున్నాయి. పాత కరెన్సీ నోట్లను రద్దు చేసినప్పటికీ, కొత్త కరెన్సీ నోట్లు ప్రజలకు సరిపడ రీతిలో అందుబాటులోకి రావడం లేదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజులు దాటినా ప్రజలు ఇంకా బ్యాంకులు, ఏటీఎం వద్ద క్యూలైన్లోనే నిల్చువాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నగదు కొరతతో ఆర్థికవ్యవస్థలో చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అయితే సరిపడ నగదు అందుబాటులో ఉందని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆర్బీఐ, ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే ఆర్బీఐ ముందస్తు ఎలాంటి ప్రణాళికలు చేసుకోకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలో ఆర్బీఐ స్వాతంత్య్రం ఎక్కడుందని పలువురు ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. -
చదువులతల్లి వల్లెలాంబదేవి
సీమ బాసర కర్నూలు జిల్లాలోని కోడుమూరు పట్టణం హంద్రీనది ఒడ్డున వెలసిన శ్రీవల్లెలాంబదేవి చదువుల తల్లిగా విరాజిల్లుతోంది. అమ్మవారి సన్నిధిలో చదువుకుంటే మంచి మార్కులొస్తాయని, ఉన్నతస్థాయి ఉద్యోగాలొస్తాయని యువతీ యువకుల ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రాంతంలో పరీక్షలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ వల్లెలాంబ ఆశీస్సులు తీసుకొని హాజరవుతుంటారు. వందలాది మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు వల్లెలాంబదేవి సమక్షంలోనే అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అమ్మ మీద విశ్వాసం వల్ల ఆమెను దర్శించుకునే విద్యార్థినీ, విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుండడంతో కోడుమూరులో వెలసిన శ్రీవల్లెలాంబదేవి సీమ బాసర సరస్వతీదేవిగా విరాజిల్లుతోంది. మొదటి వల్లె సమర్పించడం వల్లే... క్రీ.శ.1036లో చాళుక్య రాజు సత్యాశ్రయుని కాలంలో వల్లెలాంబ దేవాలయం నిర్మించినట్లు ఇక్కడి శిలా శాసనం ద్వారా తెలుస్తోంది. గ్రామంలో వస్త్రాలు నేసే వారికి ఈమె కుల దేవత అని, వారు నేసిన మొదటి వల్లెను దేవికి అర్పించేవారు గనుకనే వల్లెలాంబ అని ప్రతీతి. దేవాలయంలో నాటి పండితులు తమ శిష్యులచే వేదాలు వల్లె వేయించేవారు గనుక ఈ దేవికి వల్లెలాంబ అనే పేరు వచ్చిందనేది మరో అభిప్రాయం. వల్లెలాంబదేవి మహిమలు గొల్లాపిన్ని కవి పండిత వంశానికి వల్లెలాంబదేవి కుల దేవత. వీరి వంశీయుడైన మోటప్ప అనే బ్రాహ్మణునికి విద్య అబ్బలేదు. నిరక్షరాస్యుడని అందరూ ఎగతాళి చేస్తుంటే సహించలేని అతడు ఓ రోజు రాత్రి వల్లెలాంబ గుడిలో తలుపులు బిగించుకొని కూర్చున్నాడు. రాత్రి వేళలో నగర సంచారానికి వెళ్లి తిరిగి వచ్చిన వల్లెలాంబదేవి గుడి తలుపులు తీయకుండా మొండిగా ప్రవర్తిస్తున్న మోటప్పను కోపంతో హంద్రీనదిలోకి విసిరికొట్టింది. తిరిగి మరుదినం అతడు యధాప్రకారం గుడిలో తలుపులు బంధించుకొని కూర్చున్నాడు. అమ్మవారు తిరిగి అతడిని నదిలోకి విసిరి కొట్టింది. ఇలా మూడు రోజులు జరిగాక మోటప్ప పట్టుదల గమనించి అతని సమస్య తెలుసుకుని సంపూర్ణ అక్షర జ్ఞానం కలిగించడమే కాకుండా ఆ వంశానికి చెందిన ఏడుతరాలు పండిత పుత్రులుగా విరాజిల్లాలని ఆశీస్సులిచ్చినట్లు గొల్లాపిన్ని వంశస్తుల కథనం. గొల్లాపిన్ని వంశస్తులు బెంగళూరు, హైదరాబాద్, నంద్యాల, అనంతపురం ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఏడాదికో రోజు వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్తుంటారు. - హంపిరెడ్డి, సాక్షి, కోడుమూరు రూరల్ ప్రతినిధి -
ఈ పదీ ఆచరిస్తే నో టెన్షన్
మంచి ఆరోగ్యం కోసం మంచి జీవనశైలి అవసరం. మంచి వ్యాయామం అవసరం.దానితో పాటు ఎప్పుడూ ఆకర్షణీయమైన సౌష్టవంతో, ఫిట్నెస్తో ఉండటం అనే అంశమూ నలుగురిలోనూ ఆత్మవిశ్వాసంతో ఉండటానికి దోహదపడుతుంది. అలాంటి ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం పొందడానికి కొన్ని సాధారణ సూచనలు ఇవి... మంచి ఆహారం: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా ఆటగాళ్లకు ఉండే సౌష్టవం సాధ్యం కాదు. మంచి బ్రేక్ఫాస్ట్, ఓ మోస్తరుగా మధ్యాహ్న భోజనం, రాత్రివేళ తీసుకునే ఆహారం మితంగా ఉండేలా చూసుకోవాలి. దాంతో పాటు పోషకాలు ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. జంక్ఫుడ్ను పూర్తిగా మానేయాలి. రాత్రి 10 గంటలు దాటాక ఆహారం తీసుకోవడం సరికాదు. వ్యాయామం: వ్యాయామ నియమం తప్పక పాటించండి. వారంలో ఐదు రోజులు వ్యాయామం చేయాలన్న నియమం తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని తప్పకూడదు. నిర్ణయాల విషయంలో సూచనలు: మనం ఏవైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి ఆచరణకు సాధ్యమేనా అన్న విషయం ఆలోచించండి. మనం తప్పక ఆచరించగలమనే అంశాలనే ఎంచుకోండి. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుపరచండి. ఇష్టమైన ఆట: మీరు ఏదైనా ఆటను ఎంచుకోండి. మీరొక్కరే ఎప్పుడూ ఆటను కొనసాగించలేరు. మీరు ఎంచుకున్న ఆటతో పాటు నిత్యం మీకు తోడుగా వచ్చే పార్ట్నర్ను కూడా ఎంచుకోండి. మిమ్మల్ని ఆటలో ప్రోత్సహించేలా ఆ భాగస్వామి ఉండాలి. అయితే ఇటీవలి కాలంలో మీకు ఖాళీ సమయం లభించినప్పుడే మీ క్రీడా భాగస్వామికీ టైమ్ లభిస్తుందని చెప్పలేం. కాబట్టి కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల సహాయంతో మీ ఇంటి టీవీలోనే మీ క్రీడా భాగస్వామిని ఎంచుకునే వీలుంది. కాబట్టి ఇలాంటి ఇండోర్ ఆటలు రోజులో కనీసం కొద్దిసేపైనా ఆడటం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి క్రీడా భాగస్వామిని ఎంచుకోలేని వారు ఈ తరహా ఆటలను ఎంచుకోవచ్చు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తది నేర్చుకోండి: ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. మీకంటే చిన్నవాళ్ల నుంచి కొత్తవి నేర్చుకునే విషయంలో అహానికి లోనుకావద్దు. కొత్త తరానికి మనకంటే కొన్ని విషయాలు ఎక్కువగా తెలుసు అనే అంశాన్ని గుర్తించండి. సాకులు మానేయండి: కొన్ని విషయాలను ఆచరించడానికి కుదరనప్పుడు దానికి వెంటనే సాకులు వెతుక్కోవడం మానవ సహజం. అది ఆహారం విషయంలోనైనా, వ్యాయామం విషయంలోనైనా! అందుకే ఏదైనా విషయంలో ఎప్పుడైనా పొరబాటు జరగవచ్చు. అలాంటప్పుడు తప్పు మీది కాదని సరిపుచ్చుకోకండి. జరిగిన పొరబాటును మళ్లీ జరగకుండా దిద్దుకోండి. నిత్యం ఆనందంగా ఉండండి: ఎప్పుడూ విచారంగా ఉండకండి. మీరు చేసే ప్రతి పనినీ ఆస్వాదిస్తూ ఆనందంగా ఉండండి. స్ఫూర్తి పొందండి: మీరు చదువుతున్న పత్రికలు, చూస్తున్న టీవీ కార్యక్రమాల వంటి వాటి నుంచి నుంచి స్ఫూర్తి పొందండి. ఇలా నిత్యం స్ఫూర్తి పొందడం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఓపికగా ఉండండి: జీవితంలో ఎత్తు పల్లాలు సహజం. కష్టాలు ఎదురైనప్పుడు నిరాశ చెందకండి. అవి తొలగేవరకూ ఓర్పుగా ఉండండి. మీరు ఏదైనా లక్ష్యాలు నిర్ణయించుకున్నప్పుడు అవి తీరే వరకు ఓపిక వహించండి. కుంగిపోకండి: వరుసగా కష్టాలు వచ్చినా కుంగిపోకండి. ఏ కష్టమూ ఎప్పుడూ శాశ్వతం కాదు. సుఖం తర్వాత కష్టం, దాని తర్వాత ఆనందం ఎప్పుడూ వస్తూపోతూ ఉంటాయి. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మోఖాపై వెళ్లి సర్వే చేపట్టాలి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు శాయంపేట : జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలతో కూలిపోయిన ఇండ్లను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మొక్కజోన్న, పత్తి, మిర్చి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అంతేకాకుండా వందలాది ఇండ్లు నేలమట్లమయ్యాయన్నారు. ఇంత జరిగిన వ్యవసాయ, హార్టికల్చర్, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, బాసని శాంతా, చిందం రవి, బాసని మార్కండేయా, పెద్దిరెడ్డి రాజిరెడ్డి, రాజు పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ రేగొండ : జిల్లాల పునర్విభజన పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను పక్కదారి పట్టించి మోసం చేస్తున్నారని గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగామ ప్రజలను విస్మరించి తన స్నేహితుడు కెప్టె¯ŒS లకీ‡్ష్మకాంతరావు కోసం హన్మకొండ జిల్లాను ఏర్పరచడం దారుణమన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు ఇప్పటికీ రుణమాఫీ చేయకపోవడం శోచనీయమన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు. -
సర్కారు దవాఖానాలపై నమ్మకం ఏర్పడింది
బీబీనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుండడంతో ప్రజలకు సర్కారీ దవాఖానాలపై నమ్మకం పెరిగిందని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బీబీనగర్లోని నిమ్స్ యూనివర్సిటీ భవనంలోని ఎమర్జెన్సీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో కొనసాగుతున్న నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఒక సంవత్సరకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మం ది రోగులు వైద్యం చేయించుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సేవలు అందించేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రసు ్తతం నిమ్స్లో కొనసాగుతున్న ఐదు వి భాగాల వైద్య సేవలతో పాటు డిసెంబర్లోపు మరో మూడు విభాగాలకు చెందిన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి ఇన్ పెషెంట్ను ప్రారంభించేలా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రయల్ రన్ను నిర్వహించిన మంత్రి మిషన్ భగీరథలో భాగంగా బీబీనగర్ రైల్వే గేట్ సమీపంలోని ఏర్పాటు చేసిన ట్యాంక్కు గోదావరి జలాలు చేరుకున్నాయి. అయితే బుధవారం బీబీనగర్కు వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి జలాల ట్రయల్ రన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ము ఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరును అంది స్తున్నారని అన్నారు. ఆయన వెంట ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి, జడ్పీటీసీ బస్వయ్య, సర్పంచ్లు స్వరుపారాణి, ఇస్తారి, అంజయ్య, ఎంపీటీసీలు లింగయ్యగౌడ్, వెంకటేశ్గౌడ్, మన్నె బాల్రాజు, చంద్రశేఖర్, రవి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్గౌడ్, గాదె నరేందర్రెడ్డి, వెంకటకిషన్, అమరేందర్, మండల నాయకులు అశోక్, రాములు పాల్గొన్నారు. ప్రతి పక్షాలు రాద్ధాంతాలు చేస్తున్నాయి... నిమ్స్ను ఎయిమ్స్గా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదనలు పంపినప్పటికీ ప్రతి పక్షాలు కావాలనే రాద్ధాం తాలు చేస్తున్నాయని మంత్రి అన్నారు. ఎయిమ్స్ కోసం కేం ద్రానికి ప్రతి పాదనలు పం పగా వచ్చే బడ్జెట్లో పెడతామని కేంద్ర మంత్రి వివరణ కూడా ఇచ్చారని ఆయ న తెలిపారు. ఇవేవి తెలుసుకోకుండా ప్ర తిపక్ష నాయకులు అర్థంలేని మాటా లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. -
అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు!
జీవితంలో దేన్నీ అంత సులువుగా వదులుకోకూడదని చాలామంది బలంగా ఫిక్స్ అవుతారు. నయనతార ఈ కోవకే వస్తారు. మరీ సాధ్యం కానివి వదులుకుంటారు తప్ప చాలావరకూ అన్నింటినీ సాధించేస్తారు. అది సినిమాలైనా.. వ్యక్తిగత విషయాలైనా. నయనతారకు తన మీద తనకు నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకం, హార్డ్వర్కే నన్ను నడిపిస్తున్నాయని ఆమె అంటున్నారు. ఇంకా ఆత్మవిశ్వాసం గురించి నయనతార మాట్లాడుతూ - ‘‘బతికినంత కాలం ధైర్యంగా, హాయిగా బతకాలంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. మనం ఏ విధంగా ఉన్నామనే దాన్నిబట్టే ఎదుటి వ్యక్తులు మన గురించి ఓ అంచనాకు వచ్చేస్తారు. ఆత్మన్యూనతా భావంతో కనిపిస్తే.. ఎదుటి వ్యక్తులు మనల్ని ఇంకా తగ్గించడానికి ట్రై చేసే అవకాశం ఉంది. ఆ చాన్స్ వాళ్లకు ఇవ్వకూడదంటే మనం ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ఎవరికీ తక్కువ కాదన్నట్లుగానే కనిపించాలి... ప్రవర్తించాలి. అలాగే అహంభావానికీ, ఆత్మవిశ్వాసానికీ తేడా తెలుసుకోవాలి. మన తీరు తిన్నగా ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు’’ అన్నారు. నయనతార మాటలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి కదూ! -
వృద్ధిపై మన సీఈవోల విశ్వాసమే మెండు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సీఈవోలతో పోలిస్తే భారతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) వారి కంపెనీల పనితీరు, వృద్ధిపై అధిక విశ్వాసంగా ఉన్నారు. పీడబ్ల్యూసీ 19వ వార్షిక గ్లోబల్ సీఈవో సర్వే (ఇండియా నివేదిక) ప్రకారం.. వచ్చే ఏడాది కాలంలో వారి వారి కంపెనీలు మంచి వృద్ధిని నమోదు చేస్తాయని సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది భారతీయ సీఈవోలు అంచనా వేశారు. ఇక కంపెనీల వృద్ధిపై ఆశావహంగా ఉన్న అంతర్జాతీయ సీఈవోలు 35 శాతంగా మాత్రమే ఉన్నారు. వృద్ధి మార్కెట్లలో గ్లోబల్ సీఈవోల ర్యాంకింగ్లో గతేడాది 6వ స్థానంలో ఉన్న ఇండియా ఈసారి 5వ స్థానానికి ఎగబాకింది. గత మూడేళ్లలో కన్నా ఈ ఏడాది వృద్ధి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని 75 శాతం మంది సీఈవోలు తెలిపారు. వేగవంతమైన టెక్నాలజీ మార్పు కంపెనీ వృద్ధిపై ప్రభావం చూపుతుందని 79 శాతం మంది పేర్కొన్నారు. దాదాపు 70 శాతం మంది సీఈవోలు వచ్చే ఏడాది కాలంలో సిబ్బంది పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తుంటే, 89 శాతం మంది సీఈవోలు సిబ్బంది అధికారాలు, సంక్షేమానికి పెద్దపీట వేయడం గురించి ఆలోచిస్తున్నారు. -
అమాయక పాత్రలు ఇక వద్దు
అమాయక పాత్రలు ఇక వద్దు అంటోంది నటి సురభి. కలలు కనడం సాధారణమే వాటిని సాధించుకోవడం మాత్రం అంత సులభం కాదు. వర్ధమాన తార సురభి నటిగా చాలానే ఆశపడుతోంది. ఈ భామ ఏకంగా వీరనారి ఝాన్సీరాణిగా నటించాలని కోరుకుంటోంది. ఇంతకు ముందు లేడీ సూపర్స్టార్గా వెలుగొందిన విజయశాంతి నుంచి చాలా మంది నటీమణులు ఝాన్సీరాణిగా తెరపై కనిపించాలని ఆశించారు. అయితే వారెవరి కోరిక నెరవేరలేదు. ఇప్పుడు నటి సురభి అలాంటి అసాధారణ కోరికనే వ్యక్తం చేస్తోంది. ఇవన్ వేరమాదిరి చిత్రం ద్వారా కోలీవుడ్లో రంగప్రవేశం చేసిన సురభి ఆ తరువాద వేలై ఇల్లా పట్టాదారి చిత్రాల్లో నటించినా అంతగా పేరు తెచ్చుకోలేక పోయింది. దీంతో టాలీవుడ్పై కన్నేసింది. అక్కడ అవకాశాలు బాగానే ఉన్నాయట. దీని గురించి సురభి మాట్లాడుతూ ఇవన్వేరమాదిరి చిత్రంలో పక్కింటి అమ్మాయిలా చాలా ఇన్నోసెంట్ పాత్రను పోషించానని, అదే విధంగా పుగళ్ చిత్రంలో ఆత్మ విశ్వాసం కలిగిన ధైర్యవంతురాలి పాత్రలో నటించినట్లు చెప్పింది. అయితే ఇక నటనకు అవకాశం ఉన్న పాత్రలోనే నటించాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. ఇవన్వేరమాదిరి చిత్రంలో మాదిరిగా ఇన్నోసెంట్ పాత్రలు వద్దని అంది. ప్రస్తుతం తమిళంలో అవకాశాలు లేకపోయినా తెలుగులో చేతినిండా చిత్రాలు ఉన్నాయని తెలిపింది. అక్కడి వారు చాలా ప్రేమగా మసలుకుంటున్నారని చెప్పింది. అయితే చెన్నైను చాలా మిస్ అవుతున్నానని, నటనకు అవకాశం ఉన్న మంచి పాత్ర లభిస్తే తమిళంలో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. హిందీ చిత్రం బాజీరావు మస్తానీ లాంటి చారిత్రక కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నానంది. ముఖ్యంగా ఝాన్సీరాణి పాత్రను పోషించాలని ఆశిస్తున్నట్లు సురభి తన కోరికను వ్యక్తం చేసింది. -
మగాళ్లు చెడ్డవాళ్లేం కాదు!
ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్కి కేరాఫ్ అడ్రస్లా కనిపిస్తుంది నిత్యామీనన్. దాపరికాలు లేకుండా ఏ రహస్యాన్నయినా విప్పి చెబుతుంది. నదురూ బెదురూ లేకుండా ఏ అభిప్రాయాన్నయినా కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంది. తన దగ్గర వేషాలేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానంటూనే, మగవాళ్లందరూ చెడ్డవాళ్లేమీ కాదంటూ నమ్మకాన్ని వ్యక్తపరుస్తోన్న నిత్య మనోభావాలు... మొదటిసారి మేకప్ వేసింది..? ఎనిమిదేళ్ల వయసులో. మా ఇంటి పక్కన ఓ ఫొటోగ్రాఫర్ ఉండేవారు. ఆయన నా ఫొటో ఒకటి తీసుకుని తన యాడ్ ఏజెన్సీలో పెట్టారు. అది ఓ డెరైక్టర్ చూసి ఫోన్ చేశారు. తను తీయబోతోన్న ఇంగ్లిష్ సినిమాలో టబుకి చెల్లెలిగా నన్ను తీసుకుంటానన్నారు. మొదట ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు కానీ నేను సరదా పడటంతో ఓకే అన్నారు. అలా ‘హనుమాన్’ సినిమాతో యాక్టర్ని అయిపోయా! నటిగా సెటిలవ్వాలని అప్పుడే ఫిక్సైపోయారా? లేదు. మా కుటుంబాల్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అందుకే నా దృష్టీ చదువుపైనే ఉండేది. మాస్ కమ్యునికేషన్స్ చదివి కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశా. కానీ ఆ ఫీల్డ్ నాకు సరిపడదనిపించి మానేశా. మరి ఈ ఫీల్డ్ మీకు సరిపడిందా? ఊహూ... నాకిది కరెక్ట్ ప్లేస్ కాదని ఎన్నోసార్లు అనిపించింది. ఈ ఫీల్డ్లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. ఓ మంచి పాత్ర చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ సెలెబ్రిటీ స్టేటస్ విసు గనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు దొంగచాటుగా ఫొటోలు తీయడం, మా గురించి ఏవేవో ఊహించి ప్రచారం చేయడం నాకు నచ్చదు. అలాగే మేము తమతో క్లోజ్గా ఉండాలని కొందరు ఆశిస్తారు. అలా చేయకపోతే మంచి అమ్మాయి కాదంటూ ముద్ర వేసేస్తారు. అయినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను. మీరు యారొగెంట్ అనేది అందుకేనా? ఏమో. నిజానికి నేను పొగరుగా ఉండను. స్ట్రిక్ట్గా ఉంటాను. అమ్మ, నాన్న ఉద్యోగస్తులు. నాతో రాలేరు. నా మేనేజర్ కూడా నాతో ఉండడు. అలాంటప్పుడు నా గురించి నేనే జాగ్రత్త తీసుకోవాలి కదా! అందుకే ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే ఊరుకోను. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అది యారొగెన్సీ కాదు. మంచి విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా నిర్భయంగా చెప్పేయాలి. లేదంటే మనల్ని మనమే తక్కువ చేసుకున్నవాళ్లం అవుతాం. ఎక్కువగా లేడీ డెరైక్టర్స్తో పని చేస్తారు... సేఫ్టీ కోసమా? అంజలీ మీనన్, నందిని, అంజు, శ్రీప్రియ లాంటి మహిళా దర్శకురాళ్లతో పని చేసే చాన్స్ అనుకోకుండానే వచ్చింది తప్ప నేను కావాలని వాళ్లని ఎంచుకోలేదు. అయినా నేనింత వరకూ పనిచేసిన వాళ్లలో ఏ మేల్ డెరైక్టర్, యాక్టర్ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మగాళ్లంతా చెడ్డవాళ్లు కాదుగా! గ్లామర్ పాత్రలు చేయరేం? నాకు సౌకర్యవంతంగా అనిపించనిదేదీ నేను చేయను. అందుకే కథ వినేటప్పుడే సీన్ల గురించి, కాస్ట్యూమ్స్ గురించి క్లియర్గా మాట్లాడేసుకుంటాను. అలా అయితే అవకాశాలు తగ్గవా? నాకు తగ్గలేదుగా! ఓ పాత్రకి నేనైతేనే సరిపోతాను అనుకున్నప్పుడు దర్శకులు నా దగ్గరకే వస్తున్నారు. వేరే వాళ్లకి ఇవ్వట్లేదుగా! లావుగా ఉంటారని... పొట్టి అని? (నవ్వుతూ) నేను ఫిజిక్ని మెయిం టెయిన్ చేయను. అందుకే కాస్త లావుగా ఉంటాను. నటన కోసం తిండిని త్యాగం చేయడం పిచ్చితనం అనిపిస్తుంది నాకు. ఇక హైట్ సంగతి. పొడవు, పొట్టి, అందం... ఇవన్నీ ఇచ్చేది దేవుడు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే విమర్శించాలి గానీ, దేవుడు ఇచ్చినవాటిని విమర్శించకూడదు. పెళ్లెప్పుడు? ఇతనితో నా జీవితం ఇప్పటికంటే బాగుంటుంది అనుకోదగ్గ వ్యక్తి ఎదురు పడినప్పుడు. తగనివాణ్ని చేసుకుని బాధపడే బదులు, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది. ఇంతవరకూ అలాంటి వ్యక్తి ఎదురు పడలేదా? లేదు. పద్దెనిమిదేళ్ల వయసులో ఓసారి ప్రేమలో పడ్డాను. కానీ అతనితో జీవితం అంత గొప్పగా ఉండదనిపించి విడి పోయాను. తర్వాత ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. చూద్దాం... మళ్లీ నా మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుందో! ఫన్డే మీద మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి. ప్రియదర్శిని రామ్, ఎడిటర్, ఫన్డే, సాక్షి దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
మగాళ్లు చెడ్డవాళ్లేం కాదు!
ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్కి కేరాఫ్ అడ్రస్లా కనిపిస్తుంది నిత్యామీనన్. దాపరికాలు లేకుండా ఏ రహస్యాన్నయినా విప్పి చెబుతుంది. నదురూ బెదురూ లేకుండా ఏ అభిప్రాయాన్నయినా కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంది. తన దగ్గర వేషాలేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానంటూనే, మగవాళ్లందరూ చెడ్డవాళ్లేమీ కాదంటూ నమ్మకాన్ని వ్యక్తపరుస్తోన్న నిత్య మనోభావాలు... మొదటిసారి మేకప్ వేసింది..? ఎనిమిదేళ్ల వయసులో. మా ఇంటి పక్కన ఓ ఫొటోగ్రాఫర్ ఉండేవారు. ఆయన నా ఫొటో ఒకటి తీసుకుని తన యాడ్ ఏజెన్సీలో పెట్టారు. అది ఓ డెరైక్టర్ చూసి ఫోన్ చేశారు. తను తీయబోతోన్న ఇంగ్లిష్ సినిమాలో టబుకి చెల్లెలిగా నన్ను తీసుకుంటానన్నారు. మొదట ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు కానీ నేను సరదా పడటంతో ఓకే అన్నారు. అలా ‘హనుమాన్’ సినిమాతో యాక్టర్ని అయిపోయా! నటిగా సెటిలవ్వాలని అప్పుడే ఫిక్సైపోయారా? లేదు. మా కుటుంబాల్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అందుకే నా దృష్టీ చదువుపైనే ఉండేది. మాస్ కమ్యునికేషన్స్ చదివి కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశా. కానీ ఆ ఫీల్డ్ నాకు సరిపడదనిపించి మానేశా. మరి ఈ ఫీల్డ్ మీకు సరిపడిందా? ఊహూ... నాకిది కరెక్ట్ ప్లేస్ కాదని ఎన్నోసార్లు అనిపించింది. ఈ ఫీల్డ్లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. ఓ మంచి పాత్ర చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ సెలెబ్రిటీ స్టేటస్ విసు గనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు దొంగచాటుగా ఫొటోలు తీయడం, మా గురించి ఏవేవో ఊహించి ప్రచారం చేయడం నాకు నచ్చదు. అలాగే మేము తమతో క్లోజ్గా ఉండాలని కొందరు ఆశిస్తారు. అలా చేయకపోతే మంచి అమ్మాయి కాదంటూ ముద్ర వేసేస్తారు. అయినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను. మీరు యారొగెంట్ అనేది అందుకేనా? ఏమో. నిజానికి నేను పొగరుగా ఉండను. స్ట్రిక్ట్గా ఉంటాను. అమ్మ, నాన్న ఉద్యోగస్తులు. నాతో రాలేరు. నా మేనేజర్ కూడా నాతో ఉండడు. అలాంటప్పుడు నా గురించి నేనే జాగ్రత్త తీసుకోవాలి కదా! అందుకే ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే ఊరుకోను. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అది యారొగెన్సీ కాదు. మంచి విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా నిర్భయంగా చెప్పేయాలి. లేదంటే మనల్ని మనమే తక్కువ చేసుకున్నవాళ్లం అవుతాం. ఎక్కువగా లేడీ డెరైక్టర్స్తో పని చేస్తారు... సేఫ్టీ కోసమా? అంజలీ మీనన్, నందిని, అంజు, శ్రీప్రియ లాంటి మహిళా దర్శకురాళ్లతో పని చేసే చాన్స్ అనుకోకుండానే వచ్చింది తప్ప నేను కావాలని వాళ్లని ఎంచుకోలేదు. అయినా నేనింత వరకూ పనిచేసిన వాళ్లలో ఏ మేల్ డెరైక్టర్, యాక్టర్ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మగాళ్లంతా చెడ్డవాళ్లు కాదుగా! గ్లామర్ పాత్రలు చేయరేం? నాకు సౌకర్యవంతంగా అనిపించనిదేదీ నేను చేయను. అందుకే కథ వినేటప్పుడే సీన్ల గురించి, కాస్ట్యూమ్స్ గురించి క్లియర్గా మాట్లాడేసుకుంటాను. అలా అయితే అవకాశాలు తగ్గవా? నాకు తగ్గలేదుగా! ఓ పాత్రకి నేనైతేనే సరిపోతాను అనుకున్నప్పుడు దర్శకులు నా దగ్గరకే వస్తున్నారు. వేరే వాళ్లకి ఇవ్వట్లేదుగా! లావుగా ఉంటారని... పొట్టి అని? (నవ్వుతూ) నేను ఫిజిక్ని మెయిం టెయిన్ చేయను. అందుకే కాస్త లావుగా ఉంటాను. నటన కోసం తిండిని త్యాగం చేయడం పిచ్చితనం అనిపిస్తుంది నాకు. ఇక హైట్ సంగతి. పొడవు, పొట్టి, అందం... ఇవన్నీ ఇచ్చేది దేవుడు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే విమర్శించాలి గానీ, దేవుడు ఇచ్చినవాటిని విమర్శించకూడదు. పెళ్లెప్పుడు? ఇతనితో నా జీవితం ఇప్పటికంటే బాగుంటుంది అనుకోదగ్గ వ్యక్తి ఎదురు పడినప్పుడు. తగనివాణ్ని చేసుకుని బాధపడే బదులు, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది. ఇంతవరకూ అలాంటి వ్యక్తి ఎదురు పడలేదా? లేదు. పద్దెనిమిదేళ్ల వయసులో ఓసారి ప్రేమలో పడ్డాను. కానీ అతనితో జీవితం అంత గొప్పగా ఉండదనిపించి విడి పోయాను. తర్వాత ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. చూద్దాం... మళ్లీ నా మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుందో! ఫన్డే మీద మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి. ప్రియదర్శిని రామ్, ఎడిటర్, ఫన్డే, సాక్షి దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
శునకంపై విశ్వాసం!
శునకం మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు. ఇలాంటి జంతువుపై కొందరు మనుషుల్లో ఎంతో విశ్వాసం ఉంటుంది. అపారమైన ప్రేమ ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు హాలీవుడ్ సుప్రసిద్ధనటుడు సిల్వెస్టర్ స్టాలోన్. తన కెరీర్ ఆరంభంలో తన పెంపుడు కుక్క గురించి పడ్డ తపన చాలా గొప్పది. ఆ మూగజీవి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు అబ్బురమనిపిస్తుంది. ఫుడ్డుకు లాటరీ కొడుతున్న దశలో సిల్వెస్టర్ స్టాలోన్కు ఒక పెంపుడు కుక్క ఉండేది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒకసారి చేతిలో ఉన్న డబ్బుఅయిపోయింది. ఇదే సమయంలో ఒక వ్యక్తి స్టాలోన్ పెంపుడుకుక్కను కొంటానని ముందుకు వచ్చాడు! అవసరం స్టాలోన్తో ఆ శునకాన్ని అమ్మించింది. రోజులు గడిచాయి.. అవకాశాలు కలిసి వచ్చాయి. స్టాలోన్కు మంచి సినిమా అవకాశం వచ్చింది. హీరో తనే, దర్శకుడు తనే! అడ్వాన్స్గా వేల డాలర్లు చేతిలో వచ్చి పడ్డాయి. ఆ డబ్బు చేతిలోకి రాగానే ఈ హీరో చేసిన మొదటి పని... తన శునకాన్ని కొనుకొన్న వ్యక్తిని కలవడం. తన పెట్ను తనకు తిరిగి ఇవ్వమని, ఎంత డబ్బయినా ఇస్తానని బతిమిలాడాడు. అవతలి వ్యక్తి స్టాలోన్కు తన పెట్ డాగ్ మీద ఉన్న ప్రేమను క్యాష్ చేసుకొన్నాడు. 50 డాలర్లకు కొన్న శునకాన్ని స్టాలోన్కే తిరిగి 15వేల డాలర్లకు అమ్మాడు. తన తొలి సంపాదనగా వచ్చిన మొత్తం డబ్బును అతడికిచ్చి తన శునకాన్ని తెచ్చుకున్నాడు. తర్వాతి కాలంలో తన సినిమాల్లో కూడా ఆ శునకాన్ని నటింపజేశాడు ఈ దర్శకహీరో! -
కొత్తగా... రెక్కలొచ్చెనా!
స్వప్నలిపి మీరెప్పుడైనా రెక్కలతో గాల్లోకి ఎగురుతూ వెళ్లారా? మీరెప్పుడైనా రెక్కలతో కొండకోనలపై, మహా సముద్రాలపై ఎగురుతూ వెళ్లారా?! అయితే ఈ స్వప్న విశ్లేషణ మీ కోసమే. సందర్భాన్ని బట్టి, మన మానసిక స్థితిగతులను బట్టి ఈ కల అర్థం మారిపోతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా అనుకూల జాబితాలోనో, ప్రతికూల జాబితాలోనో చేర్చలేం. విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నప్పుడు, ఆ ఒత్తిడికి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనుకున్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయి. సమస్య పరిష్కారం గురించి ఆలోచించి ఒత్తిడిని దూరం చేసుకోవ డానికి బదులు, పలాయనానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు, సమస్య నుంచి పారిపోవాలనుకున్నప్పుడు ‘రెక్కల కల’ వస్తుంది. ఒంటరితనం బాగా ఎక్కువైనప్పుడు, ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు, ఎప్పుడూ చేస్తున్న పనే చేస్తూ, ఎప్పుడూ ఉన్నచోటే ఉంటున్న క్రమంలో ఏర్పడే ఉత్సాహ రహిత స్థితిలోనూ ఇలాంటి కలలు వస్తాయి. అనుకూల కోణం ఏమిటంటే, సృజనాత్మకంగా ఏదైనా విషయాన్ని ఆలోచించే వాళ్లకు ఇలాంటి కలలు వస్తుంటాయి. ‘వాస్తవం ఇది. కాని ఇది నాకు నచ్చడం లేదు. నేను ఇలా ఆశిస్తున్నాను. ఇది నిజం కాదని తెలుసు. అయినా ఇదే బాగుంది’ తరహాలో ఆలోచించేవాళ్లకు కూడా... రెక్కలొచ్చి ఆకాశంలో విహరించే కలలు వస్తుంటాయి. -
పునర్జన్మ
కథ వృక్షాలు కనబరిచే విశ్వాసం - ఉత్తమం. జంతువులు కనబరిచే విశ్వాసం - మధ్యమం. మనుషులు కనబరిచే విశ్వాసం - అధమం.ఆ ఇంటి యజమాని రాఘవయ్య గేటువేపు నడుస్తున్నాడు. ఏదో మెడమీద పడింది. గొంగళిపురుగు అని తెలియగానే పడినచోట ఒక రకమైన దురద మొదలయ్యింది. మాటిమాటికీ తడుముకోవటం వల్ల ఆ భాగం వాచినట్లనిపించింది. కోపంగా పైకి చూశాడు. గొడుగులా విశాలంగా పరుచుకున్న ఆ మునగచెట్టు పడీ పడీ నవ్వుతున్నట్లనిపించింది. కేరింతలు కొడ్తూ, ఆకులు, పువ్వులు రాల్చింది. ఇంకా కోపంగా ఆ కొమ్మలవేపు చూస్తూ, గేటు దాటుకుని ఇంటి బయటకు నడిచాడు. మునగ చెట్టుకూ, ఆ ఇంట్లో ఉంటున్నవారికీ కొణ్నాళ్లుగా యుద్ధం జరుగుతోంది. అది పాతకాలపు భవంతి. అందులో మూడు వాటాలు. కింద రెండు, మొదటి అంతస్తులో ఒకటి. భవంతి ముందు విశాలమైన ఖాళీ జాగా. ఆ జాగాలో ప్రహరీనానుకుని ఇరవై ఏళ్ల క్రితం వేసిన మునగచెట్టు. ఆ చెట్టు విస్తరించి, విశాలమైన భవనం ముందు ఖాళీ జాగానంతటినీ కప్పేసింది. యజమాని రాఘవయ్య ఇరవై ఏళ్ల క్రితం ఎంతో దూరదృష్టితో మరేవో చెట్లు కాకుండా మునగచెట్టే నాటుకున్నాడు. మిగతా చెట్లు నీడనే ఇస్తాయి. మునగచెట్టు మాత్రం ఆకూ, పువ్వూ, కాయా అన్నీ ఉపయోగపడేవే! చివరకు మునగ బెరడును కూడా మందుల్లోకి వాడతారు. చింతచెట్లలాగా, ప్రతిభాగమూ ప్రయోజనకరమే! యజమాని ఆశించినదానికి ఏమాత్రమూ తీసిపోకుండా ఆ మునగచెట్టు దినదిన ప్రవర్ధమానమై, వృక్షంలా, ఏపుగా విస్తరించింది. కోసుకున్నవారికి కోసుకున్నంతగా ఆకూ, పువ్వూ, ములక్కాడలు అందజేస్తూ ఉంది. ఆ భవంతివాళ్లు ఏనాడూ, ములక్కాడలు కొని ఎరుగరు. దాన ధర్మాలకు పోగా, యజమానురాలు ఒక్కోసారి కూరగాయల బండి వాడిని 40-50 ములక్కాడల్ని రాల్చుకోనిచ్చి, బదులుగా ఆకుకూరలు, మరో రెండు మూడు కాయగూరలు తీసుకునేది.ఇంతటి ఉపయోగకరమైన చెట్టు వల్ల కూడా ఇబ్బందులుంటాయా? ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. గ్రౌండ్ ఫ్లోర్ ముందు భాగంలో యజమాని రాఘవయ్య ఉంటాడు. ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైరయ్యాడు. వెనక భాగం, పై అంతస్తు అద్దెకిచ్చాడు. అవే నేడు ఆయనకు ‘పెన్షన్’, ‘రికరింగు’ ఆదాయం! పిల్లలిద్దరూ, వాళ్ల ‘నిజ దారా సుతోదర పోషణార్థం’ వేరే దేశంలో స్థిరపడ్డారు. రాఘవయ్యకూ, ఆయన భార్యకూ వేరే పనులూ వ్యాపకాలూ ఏమీ లేవు. వారానికొకసారి పిల్లల నుండి వచ్చే ‘అతిదీర్ఘ’ ఫోను కాల్సు, టీవీలో ఎవరికిష్టమైన ప్రోగ్రాములు వాళ్లు చూడటం, పారాయణాలు, పక్కింటివాళ్లతో కబుర్లు వాళ్లకి కాలక్షేపం. వెనక వాటా రామారావుకు ఏదో బిజినెస్. స్కూళ్లకెళ్లే ఇద్దరు కుర్రాళ్లు ఆయన సంతానం. భార్య గృహిణి. రామారావు ఈ మధ్యే ఓ కారుకొన్నాడు. కొత్త కారు. పెపైచ్చు పెరిగిన పెట్రోలు ధరతో రోడ్డుమీద నిలిపి ఉంచే మోటర్ సైకిళ్లలోంచి పెట్రోలు తస్కరించడం తెలిసివుండటం వల్ల కారును రాత్రంతా వీధిలో ఉంచటానికి ఆయనకు మనస్కరించలేదు. ఇంట్లో పార్కింగు చేసుకోనిస్తే అదనంగా అద్దె ఇస్తానన్నాడు. పెపైచ్చూ కాంపౌండ్ గోడకు వెడల్పు గేటు తన ఖర్చుతోనే పెట్టిస్తానన్నాడు. కాంపౌండ్ గోడకు గేటు పెట్టాలంటే మునగచెట్టు అడ్డం వస్తోంది. అదనంగా వచ్చే అద్దె ఆదాయం రాఘవయ్యను ఆలోచనలో పడవేసింది. పనిమనిషికి యజమానురాలికి ఏదో వాగ్వాదం. ఆ వాగ్వాదపు సారాంశం. తాను ఇంటి లోపలి భాగం శుభ్రం చేస్తాను గాని బయట వాకిలి తన వల్ల కాదంటోంది. పెపైచ్చూ రోజూ నేలకు రాలుతోన్న ఆకూ, పూవు, చెత్తా చెదారం పక్షుల రెట్టలు, తన బాధ్యతల పరిధిలోకి రావని తేల్చేసింది. పైవాటాలోని శైలజ వచ్చింది. ఆవిడ ముఖం, చేతుల నిండా ఏవో దద్దుర్లు. తెల్లటి వంటిమీద ఎర్రటి మరకలు. బాల్కనీలో నించుంటే ఓ గొంగళిపురుగు బ్లవుజులోకి దూరిందట. ఎలర్జీ వచ్చి డాక్టరు చుట్టూ నాలుగు రోజులుగా తిరుగుతోందట. మునగచెట్టు కొట్టేయించాలనీ, లేకుంటే వాటా ఖాళీ చేస్తామనీ వార్నింగు ఇచ్చి వెళ్లింది. ఎటు వీలుంటే అటు ‘వీజీ’గా పార్టీ మార్చే రాఘవయ్య భార్య ‘నస’ ఎక్కువయ్యింది. ఏ పాయింటు మీద కచ్చితంగా నించోదు. మునగచెట్టు కొట్టేయించాలని రోజూ వారిద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ‘‘ఆరోగ్యానికి మంచిదంటండీ! నెలకు కనీసం ఓసారైనా మునగాకు తినాలట’’ అంటూ వండే మునగాకు కూరా, రుచిగా, వెరైటీగా ఉండే మునగపూవు కూర, అరగజంపైమాటే ఉండి ములక్కాడలు వేసిన్నాడు సాంబారులోంచి వచ్చే ఘుమఘుమలు, అప్పుడప్పుడు కూరగాయల బండి వాడిచ్చే పాతికా, పరకా, ఇవేవీ ఆవిడకిప్పుడు గుర్తుకు రావటం లేదు. పెపైచ్చూ, ఇన్నాళ్ల నుండీ ఆ ఖాళీ జాగా గ్యారేజీకి ఇవ్వకుండా నష్టపోయాం అన్న పాయింటే ఆవిడ బుర్రలో మెదలటమే కాదు, రాఘవయ్యగారి బుర్రను కూడా ‘కడిగి’ వేసింది. ఏటా కాండాన్నాశించి కొన్ని రోజులు చీకాకు పరిచే గొంగళిపురుగులు, నూనె ముంచిన గుడ్డను ఓ కర్రకు కట్టి వాటిని కాల్చటం, ఒక్కోసారి ఆ గొంగళిపురుగులు పాక్కుంటూ ఇంట్లోకి రావటం లాంటి ఆలోచనలు ఆయన్ని కలచివేస్తున్నాయి. పొందిన మేలు మరిచే ఇంతమంది విలన్ల మధ్య సాధ్వీమణి లాంటి ఆ మునగచెట్టు ఒక్కర్తి ఏం చేయగలదు! పెపైచ్చూ, మనుషుల్లాగ పెంపుడు జంతువులకు లాగా చెట్లకు నోరు ఉండదాయె! చెట్టు కొట్టేయటానికి రాఘవయ్య మనసు ‘పీకినా’, ఆయన పక్షం ఆయన ఒక్కడే! చెవిలో జోరీగలా సందడిలాగా అభియోగాల ‘రొద’లో మునగచెట్టు తప్పుచేసిన దోషిలాగా, పట్టుబడ్డ నరహంతకిలాగా జడ్జి ఎదుట నించున్నట్లయింది. ‘ఇక తప్పదు’ అన్న నిశ్చయానికి రావల్సి వచ్చింది. చెట్టును కొట్టేసేవాళ్లొచ్చారు. ‘ఆపరేషన్’ అంతా అరగంటలో ముగిసింది. భూతం లాంటి ఇరవయ్యేళ్ల చెట్టు ముక్కలు ముక్కలై నేలకొరిగింది. ఇంట్లో వారు, వీధిలోవారు మునగాకు, మునగపూవు, మునక్కాడల్ని - లేతవీ ముదురువీ అని చూడకుండా కోసుకుపోయారు. బరిగల్లాంటి కొసలు, కాండం, మొద్దులు, ఎండిపోయిన మునగకాయలు, దాంట్లోంచి అమాయకంగా బయటకి తొంగిచూస్తున్న మునగవిత్తులు... వీటన్నింటినీ ఎత్తుకుపోయి ఎక్కడో పడేయటానికి కూలీలు అదనంగా డబ్బులు కావాలన్నారు. అదనంగా మరో అయిదు వందలు! రాఘవయ్యగారికి మనస్కరించలేదు. మొద్దులు, కొమ్మలు, రెమ్మలు గోడవారగా ఓ కుప్పగా వేసిపోయారు. చెట్టు అడ్డం లేని ఆకాశంలోంచి సూర్యుడు ఆ ఇంటివేపు తీక్షణంగా చూస్తున్నాడు. అప్పుడప్పుడు చెట్టుకింద ఓ కుర్చీ వేసుకుని కూర్చునే రాఘవయ్యగారికి ఎండ మండిపోతోంది. ‘‘ఇన్నాళ్లూ తెలీలేదు కాని, ములక్కాడ ఒక్కోటి రూపాయటండీ’’ రాఘవయ్యగారి భార్య ముక్తాయింపు. ఆరోగ్యానికి మునగాకు కూర లేదు. పొద్దునా సాయంత్రం పక్షుల అరుపుల్తో వాకిలంతా గోలగోలగా ఉండటం లేదు. శవం లేచిన ఇల్లులా ఏదో వెల్తి, వెల్లడి.ఉన్నప్పుడు తెలీని విలువ చెట్టుని కొట్టేశాక ఆ ఇంట్లోవాళ్లకు తెలియవస్తోంది. రాఘవయ్యకైతే మరీను. ఈ నేపథ్యంలో పనిమనిషి సణుగుడు, శైలజ ఎలర్జీ... ఇవేమీ సమస్యల్లా అనిపించటం లేదు. ‘నాలుగు డబ్బులెక్కువిస్తే పనిమనిషి నోరెత్తదు. శైలజ వాళ్లు కాకపోతే మరో కుటుంబం అద్దెకు వస్తుంది’ అన్న ఆలోచనలు కలుగసాగాయి ఆయనకు.అయినా ఇప్పుడేం చేయగలడు. ఏనుగు లాంటి మునగచెట్టు, పీనుగై నేల కూలింది. ‘గత జల సేతు బంధం’తో ప్రయోజనం ఉండదు కదా! ఆ క్షణాన రాఘవయ్యకు తన బాల్యం, వాళ్ల నాన్న గుర్తుకు వచ్చాడు. లంకంత జాగాలో, మధ్యన మూడే మూడు గదుల ఇల్లు! మల్లె, మందార, కరేపాకు, బాదాం, జామ, సపోటా, గన్నేరు, దానిమ్మ లాంటి పెద్ద చెట్లు, ఆకుకూరల మడులు. రాఘవయ్యగారి నాన్న పెందరాళే లేచి, భూపాలాలు పాడుతూ, ఇంట్లోవాళ్లు ఎవరో ఒకరు నీళ్లు తోడి పోస్తూంటే, అంగవస్త్రం కట్టుకుని చెట్ల మొదళ్ల ముందు గొంతుక్కూర్చుని కలుపు తీసేవాడు. కొంకి కర్రతో మొదళ్ల వద్ద నేల గుల్ల బార్చేవాడు. పువ్వులుడిగిన కొమ్మల్ని కత్తిరిస్తూనో, చీకిన ఎరుపు వేస్తూనో ‘బిజీ’గా ఉండేవాడు. ‘‘ఒరే! ఈ సమస్త జీవ జాలంలో ఇచ్చింది ఉంచుకోకుండా, మోసం చెయ్యకుండా రెట్టింపు తిరిగి ఇచ్చేవి చెట్లేరా!’’ అనేవాడు. తోట పనితో ఇంటిల్లిపాదికీ దేహ పరిశ్రమ జరిగేది. మొక్కల సంరక్షణ జరిగేది. కాసిన కొద్దిపాటి పూలు, కూర, నార, కాయ, పండు ‘మా ఇంట్లోని వండీ! మా నాన్న మీకిచ్చి రమ్మన్నాడు’ అని పొరుగువారితో అంటుంటే, తనకూ ఎంతో గర్వంగా ఉండేది! ఓ రెండు నెలలు గడిచాయి. రాఘవయ్య అదృష్టము బావుంది. ఎవరో ఒకాయన ఆ మునగచెట్టు మొద్దుల్ని ఉచితంగా ఎత్తుకుపోవటానికి ముందుకు వచ్చాడు. ఆనాటి బేరంతో చూస్తే రాఘవయ్య అయిదు వందలు ఆదా! అయినా కాసేపు బేరం చేసి, బెట్టు చేసి ఒప్పుకున్నారు. వచ్చినవారు లారీలోకి, మొద్దుల్ని ఎండిన బరిగల్ని ఎక్కించారు. సుమారు లారీ నిండింది. శవాన్ని ఎత్తుతుంటే కలిగే ఆవేదన లాంటిది రాఘవయ్యకు కలిగింది. ఆత్మీయులు పోయినంత బాధ ఆయన గొంతులో అడ్డం పడింది.ముంగిలి అంతా శుభ్రం అయింది. అటేపు చూడటానికి ఆయనకు మనస్కరించలేదు. అయినా ఓసారి తల తిప్పి చూశాడు. మొద్దుల్ని తీసేసిన చోట రెండడుగుల ఎత్తున్న ఆకుపచ్చని మొక్క గాలికి తన్మయత్వంతో ఊగుతున్నట్లుంది. అమ్మ పొదుగు దగ్గరి లేగదూడ చెంగలించినట్లు, పసిపిల్లాడు ఆనందంతో గంతులేసినట్లు, మొదటిసారి వెలుతురు చూస్తున్న ఆ మొక్క మెరిసిపోతోంది. అది మునగ మొక్కలా అనిపించింది.దగ్గరిగా వెళ్లి చూశాడు. అవును. అది మునగ మొక్కే! బలమైన ఆకుల్తో ఆకుపచ్చ, ఊదారంగు కలయిక గల కాండం, రెమ్మలతో, ఆ చిన్ని మొక్క తనని గుర్తుపట్టి నవ్వినట్లు అనిపించింది. ఇరవయ్యేళ్ల నాటి మొక్కకు ఇంకా రుణానుబంధం తీరినట్లు లేదు. మళ్లీ ప్రాణం పోసుకుంది. మునగమొక్కను చూసిన రాఘవయ్య మనస్సు చెంగలించింది. దగ్గరగా వెళ్లి పొదుముకున్నాడు. ఆత్మీయపు స్పర్శ కలిగిందాయనకు. ఆ చిన్ని మొక్క చుట్టూ గొప్పు కట్టి పిల్లలెవరూ పాడుచేయకుండా ‘దడి’ కట్టడానికి పలుగు, పార తేవటానికి ఇంటివైపు అడుగులు వేశాడు. -
విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్
కాంగ్రెస్కు నష్టం జరిగినా సోనియా తెలంగాణ ఇచ్చారు స్వార్థం లేకుండా పనిచేసింది జేఏసీ ఒక్కటే.. కేంద్ర మంత్రి బలరాంనాయక్ కాంగ్రెస్లో చేరిన మానుకోట జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ మహబూబాబాద్, న్యూస్లైన్ : తెలంగాణలో విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని కేంద్రమంత్రి బలరాంనాయక్ తీవ్రంగా విమర్శించారు. మహబూబాబాద్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ, నాయకులు పిల్లి సుధాకర్, కళాకారుల జేఏసీ కన్వీనర్ కంబాలపల్లి సత్యనారాయణ, కుల సంఘాల జేఏసీ కన్వీనర్ గుంజె హన్మంతు, వడు ప్సా నాయకుడు గుండోజు దేవేందర్, బుర్ర గోవర్ధన్, నలమాససాయి, బత్తులకృష్ణ, బిక్షపతి, వాహెద్, సోహె ల్, ఖాజా, గాంధీ వెంకన్నతోపాటు పలువురు జేఏసీ, టీఆర్ఎస్ నాయకులు ఆదివారం మాజీ మంత్రి రెడ్యానాయక్, ఎమ్మెల్యే మాలోతు కవిత సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మానుకోటలోని వీఆర్ఎన్ గార్డెన్స్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బలరాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఏ స్వార్థం లేకుండా ఉద్యమించింది జేఏసీ ఒక్కటేనని కొనియాడారు. అయితే, కేసీఆర్ మాత్రం ఆది నుంచి స్వార్థంతో వ్యవహరించారని, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. వారిది కుటుంబ పునర్నిర్మాణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం పదవిపై ప్రేమ ఉండడం వల్లే ముందు చెప్పినట్లు కాంగ్రెస్లో విలీనం కావడం లేదని మాజీ మంత్రి రెడ్యానాయక్ అన్నారు. కేసీఆర్ పునర్నిర్మాణం కోసం కాకుండా కుటుంబ పునర్నిర్మాణం కోసం కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంతో ధైర్యంగా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వకుంటే మరో వందేళ్లయినా రాష్ర్టం ఏర్పడేది కాదన్నారు. కాంగ్రెస్లో చేరిన డోలి సత్యనారాయణకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. ఆ వెంట నే మానుకోటను జిల్లాకు ఏర్పాటుచేస్తామని రెడ్యా తెలి పారు. ఎమ్మెల్యే మాలోతు కవిత మాట్లాడుతూ సోని యాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇవ్వ డం వల్లే జేఏసీ బాధ్యులు కాంగ్రెస్లో చేరారని, వారికి రుణపడి ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరిన డోలి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్లో చేరానని తెలిపారు. టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు మనస్తాపం కలిగించామని, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి టీఆర్ఎస్ లో చేరి పార్టీ టిక్కెట్ తెచ్చుకున్నారని, ఇప్పుడు ఆమె తెలంగాణ కోసం ఉద్యమించినట్లుగా భావించాలా అని ప్రశ్నించారు. అలా గే, మానుకోటకు చెందిన టీఆర్ఎస్ నాయకులు ఇటీవలి ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని, ఇందులో కోట్లాది రూపాయ లు చేతులు మారాయని ఆరోపించారు. తొలుత జేఏసీ నాయకులు ర్యాలీగా వీఆర్ఎన్ గార్డెన్సకు చేరుకోగా.. సమావేశంలో అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్రెడ్డి, పర్కాల శ్రీనివాసరెడ్డి, దేవరం ప్రకాష్రెడ్డి, కాటా భాస్కర్, మల్గిరెడ్డి సుధ, ముత్యం వెంకన్న, వెన్నం లక్ష్మారెడ్డి, కైరంకొండ యాదగిరి, మూలగుండ్ల వెంకన్న, భూక్య ప్రవీణ్నాయక్, బాలు నాయక్, అయూబ్ తదితరులు పాల్గొన్నారు. -
సేవా శునకాలు
పెట్ వరల్డ్ ‘‘కుక్కలు నన్ను ఎప్పుడూ కరవలేదు. మనుషులు తప్ప’’ అని కుక్కల్లోని మానవత్వాన్ని ఎప్పుడో లోకానికి చాటారు హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో. శునకాలలో ‘విశ్వాసం’ మాత్రమే కాదు బోలెడు ‘మానవత్వం’ కూడా ఉందని ‘సహాయక శునకాలు’ నిరూపిస్తున్నాయి. లంకంత కొంప. అంత పెద్ద ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఆ వృద్ధదంపతుల పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. చుట్టపు చూపుగా వచ్చిన ఒకాయన ‘‘మీ ఇంట్లో కుక్క ఉంది కదా...ఇక ముందు చిన్న చిన్న పనులన్నీ అదే చేసి పెడుతుంది’’ అంటూ ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు. అది శునకాలకు సహాయ పనులు నేర్పించే సంస్థ అది. ఒక నెల రోజుల తరువాత... ‘‘స్టార్... వెళ్లి ఆ పాల పాకెట్ తెచ్చివ్వు’’, ‘‘స్టార్... వెళ్లి ఆ పేపర్ తెచ్చివ్వు’’ ... అలా చెబితే చాలు టకీమని చేసేస్తుంది ‘స్టార్’ అనే పేరున్న ఆ శునకం. ‘స్టార్’ చేస్తున్న పనుల గురించి ఇరుగు వారికి పొరుగు వారికి తెలిసిన వారు కూడా తమ శునకాలకు ‘సేవ’లో ప్రత్యేక శిక్షణ నిప్పించారు. విదేశాల్లో విరివిగా... విదేశాల్లో శునకాలకు సహాయక పనులు నేర్పే సంస్థలు ఎక్కువగా ఉంటాయి. శునకాలకు ఇచ్చే శిక్షణలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గైడ్ డాగ్స్: దృష్టి లోపం ఉన్న వాళ్లకు, అంధులకు సహాయపడే విధంగా శునకాలకు శిక్షణ నిస్తారు. హియరింగ్ డాగ్స్: వినికిడి సమస్య ఉన్నవాళ్లకు సహాయపడేలా శిక్షణ నిస్తారు. సర్వీస్ డాగ్స్: పైన వాటిలా ప్రత్యేకంగా ఒక పనికి కాకుండా రకరకాల పనులకు ఉపయోగపడేలా శునకాలకు శిక్షణ నిస్తారు. వీటితో పాటు మెడికల్ అలర్ట్ డాగ్స్, సైకియాట్రిక్ సర్వీస్ డాగ్స్... పేరుతో శునకాలకు శిక్షణ నిస్తారు. మన దేశంలో తొలి అడుగు... విదేశాల్లోలాగే మన దేశంలోనూ శునకాలకు శిక్షణ నిచ్చే సంస్థ ఏదైనా ఉంటే బాగుండేది కదా అనుకుంది షిరిన్ మర్చెంట్. ఆలోచన రాగానే లండన్కు వెళ్లి ప్రపంచ ప్రసిద్ధ డాగ్ థెరపిస్ట్ జాన్ రోగర్సన్ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఆ తరువాత ఆమె ‘కెనైన్ కెన్ కేర్’ పేరుతో ముంబయిలో ఒక సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా వర్క్షాప్లు నిర్వహించడం ప్రారంభించింది. యజమానులకు రకరకాలుగా సహాయపడే రీతిలో శునకాలకు శిక్షణ నివ్వడంలో ‘కెనైన్ కెన్ కేర్’ అగ్రగామిగా నిలిచింది. ‘వూఫ్’ పేరుతో ఒక ప్రతికను కూడా ప్రారంభించింది షిరిన్. శునకాల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను నడపడం మన దేశంలో ఇదే ప్రథమం. ఈ పత్రిక పేరు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి కూడా ఎక్కింది. ఒకసారి ముంబయిలో వర్క్షాప్ నిర్వహిస్తున్నప్పుడు ఒకాయన వచ్చి షిరిన్ను కలిశాడు. ఆయన వికలాంగుడు. గతంలో ఒకసారి తన శునకానికి షిరిన్ దగ్గర శిక్షణ ఇప్పించాడు. ‘‘ బిడ్డలు లేని లోటును మా పెంపుడు కుక్క తీరుస్తోంది. ప్రతి పనినీ ఓపికగా, చురుకుగా చేసి నాకు అన్నిరకాలుగా సహాయపడుతోంది’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన. అలా చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో వెలుగు! ఆయన చెబుతున్నది వింటున్నప్పుడు ఆమె కళ్లలో అంతకు రెట్టింపు వెలుగు!! -
సన్మార్గ ప్రదాత... మహాప్రవక్త ముహమ్మద్ (స)
ప్రవక్త చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, విశ్వసనీయత, వాగ్దానపాలన, మిత్రులు, సహచరుల పట్ల అమితమైన అంకితభావం, స్థిరచిత్తం, ఆయనలోని ధైర్యసాహసాలు, దైవం పట్ల, తన ధ్యేయం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం అన్ని అవరోధాలనూ అధిగమించగలిగింది. మానవజాతి సంస్కరణకు విశేష కృషి జరిపిన మహనీయుల్లో ముహమ్మద్ ప్రవక్త (స) అగ్రగణ్యులు. ఆయన మానవ సమాజాన్ని ఏదో ఒకకోణంలో మాత్రమే స్పృశించలేదు. మానవుడి పుట్టుక మొదలు మరణం వరకు జీవితంలోని సమస్త రంగాల సంస్కరణకు ఆయన ప్రయత్నించారు. ఎలాంటి అసమానతలూ, ఉచ్చనీచాలూ, భేదభావాలూ లేని ఉన్నత నైతిక, మానవీయ సమాజాన్ని ఆయన ఆవిష్కరించారు. ముహమ్మద్ ప్రవక్త (స) ప్రభవనకు పూర్వం నాటి అరబ్ సమాజం ఎలా ఉండేదో ఊహిస్తే ఒళ్లు జలదరిస్తుంది. అజ్ఞానాంధకార విష వలయంలో పడి కొట్టుమిట్టాడుతున్న సమాజమది. ‘కర్రగల వాడిదే బర్రె’ అన్న చందంగా బలవంతుడు బలహీనుడిని పీక్కుతినేవాడు. బడుగు, బలహీన వర్గాల హక్కులు, నిర్దాక్షిణ్యంగా కాలరాయబడేవి. అవినీతి, అక్రమాలు, దోపిడి, దౌర్జన్యాలు, సారాయి, జూదం, అశ్లీలత, వడ్డీ పిశాచం, హత్యలు, అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ ఖననం, భ్రూణహత్యలు తదితర సామాజిక నేరాలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. ఆ కాలంలో స్త్రీజాతికి అసలు ఏమాత్రం విలువ ఉండేది కాదు. ఒకరకంగా చెప్పాలంటే స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఉనికినే అంగీకరించేది కాదు ఆనాటి పురుషాధిక్య సమాజం. అలాంటి సమాజంలో, అలాంటి వాతావరణంలో జన్మించిన ముహమ్మద్ ప్రవక్త (స) తన ఇరవై మూడేళ్ల దైవ దౌత్యకాలంలో అంతటి ఆటవిక సమాజాన్ని అన్నివిధాలా సమూలంగా సంస్కరించారు. దేవుని ఏకత్వం, పరలోక విశ్వాసం అన్న భావజాలాన్ని ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠించి, దేవుని ముందు జవాబుదారీ భావనను ప్రోది చేశారు. అన్ని రంగాల్లో, అన్ని విధాలా పతనమై పోయిన ఒక జాతిని కేవలం ఇరవైమూడేళ్ల కాలంలో సంపూర్ణంగా సంస్కరించడమంటే మామూలు విషయం కాదు. యావత్తూ అరేబియా ద్వీపకల్పం విగ్రహారాధనను వదిలేసి, దేవుని ఏకత్వం వైపు పరివర్తన చెందింది. తెగల మధ్య అంతర్ యుద్ధాలు అంతమై, జాతి సమైక్యమైంది. అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితం, శిశుహత్యలు, అత్యాచారాలు అన్నీ పూర్తిగా సమసిపోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుండి స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్లూనుకుంది. అన్నిరకాల అసమానతలు అంతమైపోయాయి. బడుగు, బలహీనవర్గాల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ముహమ్మద్ మాత్రమేనని ఎన్సైక్లోపిడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూలగ్రంథాలు ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహాపురుషులను గురించి మైకేల్ హెచ్. హార్ట్ ఒక పుస్తకం రాశారు. అందులో రాసిన వందమంది మహాపురుషుల జాబితాలో ‘ముహమ్మద్’ ప్రవక్త (స)పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. థామస్ కార్లయిల్, తాను రాసిన ‘హీరోస్ అండ్ హీరో వర్షిప్’ గ్రంథంలో ముహమ్మద్ వ్రపక్తను ‘హీరో ఆఫ్ ది హీరోస్’ అని అభివర్ణించారు. అంతేకాదు, మహాత్మాగాంధీ మహనీయ ముహమ్మద్ ప్రవక్త (స)ను గురించి తాను రాసిన ‘యంగ్ ఇండియా’లో ఇలా అన్నారు. ‘లక్షలాదిమంది మానవుల హృదయాలను నిర్ద్వంద్వంగా గెలుచుకున్న ఆ ఉత్తమ వ్యక్తి గురించి తెలుసుకున్నాను. కేవలం ప్రవక్త చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, విశ్వసనీయత, వాగ్దానపాలన, మిత్రులు, సహచరుల పట్ల అమితమైన అంకితభావం, స్థిరచిత్తం, ఆయనలోని ధైర్యసాహసాలు, దైవం పట్ల, తన ధ్యేయం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం అన్ని అవరోధాలనూ అధిగమించగలిగింది.’ అజ్ఞాన తిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతుల వెలుగులో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తోంది. అయినప్పటికీ ఆ మహనీయుని బోధనలు మన వద్ద సురక్షితంగా ఉన్నాయి. వాటిని మనం ఆచరించగలిగితే నేడు మన సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించుకోవచ్చు. - యండీ ఉస్మాన్ఖాన్ -
ఎనీ గేమ్..సింగిల్ హ్యాండ్
ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. గణష్. ఇది సినిమా డైలాగ్. నిజ జీవితంలో కార్మికుడి కొడుకు ఆటైనా.. ఈతైనా.. పరుగైనా.. సైక్లింగైనా.. ఒంటి చేత్తో జాతయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు. మణికట్టు లేకపోయినా మనోధైర్యంతో ముందుకు సాగుతున్న మురళికి వికలాంగులే ప్రేరణ అయ్యారు. రామగుండం(కరీంగనర్), న్యూస్లైన్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖని రాంనగర్లో నివాసముంటున్న తడబోయిన రమేష్-లక్ష్మి దంపతులకు శ్రీనివాస్, మురళి, సరళ సంతానం. రమేష్ సింగరేణి రామగుండం-2 ఏరియా పరిధిలోని ఓసీపీ-3 మేయిం టనెన్స్ సెక్షన్లో జనరల్ మజ్దూర్గా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు మురళికి పుట్టుకతోనే కుడి చేయి మణికట్టు లేదు. దీంతో మానసికంగా కృంగిపోయిన అతడికి కుటుంబ సభ్యులు, మిత్రులు, కోచ్ల ప్రోత్సాహం ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న మురళి పట్టుదలతో సాధన చేసి క్రీడల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. వికలాంగులే ప్రేరణ చిన్నతనంలో సెలవు దినాల్లో కామారెడ్డి సమీపంలోని ముత్యంపేట గ్రామానికి వెళ్లిన మురళి అక్కడ చూసిన ఆ దృశ్యం అతడి జీవితాన్నే మార్చేసింది. రెండుకాళ్లు, ఒక చేయి లేని వ్యవసాయ కూలి చెరువులో ఈత కొడుతుంటే చూసి ఆక్చర్యపోయాడు. అంతే కాదు.. తన తాత మల్లయ్యకు కంటి చూపు లేకున్నా గోదావరిలో ఈత కొడుతుంటే గమనించాడు. కరీంనగర్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మాదాసు శ్రీనివాస్కు రెండు కాళ్లు లేవు. ఆయన క్రీడల్లో సత్తా చాటి అర్జున అవార్డుకు ఎంపికవడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఈ సంఘటనలన్నీ దగ్గరగా గమనించిన మురళిలో ఏదైనా సాధించాలనే తపన పెరిగింది. క్రీడారంగలో అడుగులు ముందుకు వేయడానికి దారి చూపాయి. డిగ్రీ చదువుతున్న కాలేజీ డెరైక్టర్ రాజేందర్, లెక్చర్లు రాజయ్య, రవీందర్ మిత్రులుగా మారిపోయారు. తోటి క్రీడాకారులు అఖిల్షాఖన్, మధు, ఆనంద్, కోచ్లు కష్ణమూర్తి, కొండయ్య, శ్రీనివా స్, లైఫ్సేవింగ్ టీం మెంబర్ గౌతం ప్రోత్సాహం పుష్కలంగా లభించింది. తొలిసారి వరంగల్లో స్టేట్లెవల్ స్విమ్మింగ్ మీట్కు వెళ్లడానికి భయం పడుతుంటే.. మిత్రులు అఖిల్షాఖన్, ఆనంద్ కాలేజీకి డుమ్మాకొట్టి పోటీలకు తీసుకుపోగా ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానం లో నిలిచాడు. ఇది మురళి క్రీడా జీవితంలో టర్నింగ్పాయింట్గా మారింది. దీంతో ప్రతీ ఈవెంట్ను ఛాలెం జ్గా తీసుకుంటూ ముందుకు సాగాడు. సాధించిన విజయాలు చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పారా ఒలంపిక్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటాడు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మూడు అంశాలలో(750 మీటర్ల ప్రీస్టైల్ స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైకిలింగ్, 5 కిలోమీటర్ల పరుగు పందెం) కోలకతాలో జరిగిన పారా ఒలంపిక్ త్రైత్లాన్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్లో గత ఏడాది అక్టోబర్ 2న జరిగిన రాష్ట్రీయ క్రీడల్లో ఒంటి చేత్తో బ్యాడ్మింటన్ ఆడి బంగా రు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ పోటీలే లక్ష్యం అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించడమే తన లక్ష్యం. ఇందుకోసం అవసరమైన కసరత్తు చేస్తున్నాను. రక్షణ శాఖ లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేష న్(డీఆర్డీఓ)లో ఉద్యోగం చేయాలని ఉంది. -తడబోయిన మురళి -
అన్నం బాగా లేదని ఆందోళన
వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి పిట్లం, న్యూస్లైన్: ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన స్వామి వివేకానందను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి ఆలె భాస్కర్ అన్నారు. పిట్లంలోని బాలుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివేకానంద 150 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఏబీవీపీ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులను ప్రదానం చేశారు. ఆలె భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశ విశిష్టతను తెలిపింది వివేకానందుడేనన్నారు. ఆయన మాటలే స్ఫూర్తిగా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అంతకు ముందు వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో తహశీల్దార్ ఖాద్రీ, ఎస్సైలు ప్రశాంత్, సతీశ్రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షేక్సలాం, ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్రెడ్డి, ఏబీవీపీ, కిసాన్మోర్చ నాయకులు రవికుమార్, భాస్కర్యాదవ్, ఉదయ్, తానాజీ, రాకేశ్, శివ, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
విశ్వాసి శక్తికి మూలం... దేవుడే!
దైవప్రజలైన ఇశ్రాయేలీయులకు వారి బద్ధ శత్రువులైన ఫిలిష్తీయులకు ఒకసారి యుద్ధం జరుగుతోంది. గొల్యాతు అనే ఫిలిష్తీయుని దేహదారుఢ్యం, పెడబొబ్బలకు జడిసి ఇశ్రాయేలీయుల్లో ఎవరూ అతన్నెదుర్కోవడానికి సాహసించడం లేదు. అయితే చాలా చిన్నవాడు, బలహీనుడు, యుద్ధ విద్యలేవీలేని గొర్రెల కాపరియైన దావీదు, తనతో దేవుడున్నాడన్న విశ్వాసం, విశ్వాసియైన తన ముందు సున్నతి లేని అల్పుడైన గొల్యాతు ఎంత? అన్న రోషంతో కేవలం తన వడిశెలతో చిన్న రాయితో అతన్ని పడగొట్టి చంపి గొప్ప విజయం సాధించిపెట్టాడు (1 సమూ 17:17-54). విశ్వాసానికి మరోపేరు రోషం. విజయసాధనలో ఆయుధాలు, సామర్థ్యం కన్నా మన దృక్పథమే కీలకం. ‘నేను గొప్పవాణ్ణి’ అని కాగ ‘నా దేవుడెంతో గొప్పవాడు’ అన్న దృక్పథం గలవాడే విజయుడవుతాడు. బల్బు వెలగడానికి మూలం అదృశ్యంగా ఉండే విద్యుచ్ఛక్తితో ఉన్నట్టే, విశ్వాసి శక్తికి మూలం, ప్రాప్తిస్థానం దేవుడే! దేవుడు తన తెలివిని, సామర్థ్యాన్నంతా మనిషిలో నిగూఢపర్చాడు. వాటితో అతడు తన జీవితాన్ని, చుట్టూ ఉన్న లోకాన్ని పరలోకానందమయం చేసుకోవాలని సంకల్పించాడు. కాళ్లు, చేతులు లేనివారిని వికలాంగులంటారు. కాని తాను దేవుని వాడనని, దేవుని రూపమే కాదు, శక్తి కూడా తనదేనన్న గ్రహింపు లేక జీవితాన్ని నిరర్థకం చేసుకునేవాడే నిజమైన వికలాంగుడు. మన పిడికిట్లో వెయ్యేళ్లున్నా, మొలకెత్తని విత్తనం, నేలలోపడ్డ మరుక్షణం మరో సృష్టి రూపమవుతుంటుంది. అది మొలకెత్తి మహావృక్షమై, ఫలదాతయై మానవాళి కల్యాణానికి కారకమవుతోంది. మనిషి ప్రజ్ఞకు, సామర్థ్యానికి దేవుని కృప అనే నేల, పరిశుద్ధాత్ముని సహవాసం అనే తేమతోనే సృజనాత్మక శక్తి రూపం వస్తుంది. ఇక్కడకొక విషయం గుర్తుంచుకోవాలి. తనకేది ఉత్తమమైనదో మనిషికి తెలయదు. ఉత్తమమైనది తప్ప మనిషికి మరొకటివ్వడం దేవునికిష్టం ఉండదు. మనకు ఆశీర్వాదాలు రావడంలో ఆలస్యానికి ఈ వైరుధ్యమే కారణం. అందువల్ల దైనందిన జీవన స్థితిగతులు, పరిణామాలను పరలోకపు దృష్టితో చూడగలిగితే విశ్వాసి జీవితమంతా విజయపథమే. దేవుని నిర్ణయాల్లో పొరపాట్లు ఉండవు. ఆయన శక్తిని, పద్ధతులను మనం అర్థం చేసుకోవడంలోనే పొరపాట్లుంటాయి. అంతటి తన సర్వజ్ఞత, అసమాన శక్తి మానవునికి అర్థమై అందుబాటులో ఉండేందుకే దేవుడు దాన్నంతా తన కుమారుడైన యేసుక్రీస్తులో నింపి మానవరూపంలో ఈ లోకానికి పంపాడు. యుగయుగాల మానవుని ఒంటరితనానికి, సందేహాలకు, ప్రశ్నలకు దేవుడు జవాబివ్వడం కాదు, దేవుడే జవాబై యేసుక్రీస్తుగా ఈ లోక సందర్శనకు వచ్చాడు. అదే క్రిస్మస్!! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
స్వధార్హోమ్ వంచితులకు ఆసరా, ఆత్మవిశ్వాసం
ఏ అమ్మాయీ తనకై తాను ఇల్లొదిలి వచ్చేయదు. ఎవరో ప్రేమించి మోసం చేసి ఉంటారు. ఎవరో దయతలచి, దగా చేసి ఉంటారు. ఎవరో నమ్మించి ‘అమ్మక’ ద్రోహం చేసి ఉంటారు. ఎవరో తోడుగా వచ్చి, చెయ్యి వదిలేసి ఉంటారు. మీ ఊళ్లో... మా ఊళ్లో... ఏ ఊళ్లోనైనా.... తలదాచుకోడానికి చాలా ఇళ్లే ఉంటాయి. కానీ ఇలాంటి అమ్మాయికి... దుఃఖంలో తడిచి నిలబడిన అమ్మాయికి... తలుపు తెరిచే ఇల్లు ఒక్కటీ కనిపించదు. కనీసం ‘ఎవరమ్మా నువ్వు?’ అనేవారొక్కరూ కనిపించరు. ఎవరి భయం వారిది. ఎవరి కారణాలు వారివి. అయితే జయశ్రీ భయపడలేదు. ఏ కారణమూ ఆమెను వెనుకంజ వెయ్యనివ్వలేదు. ఇల్లొదిలొచ్చిన పిల్లెవరైనా మా ఇంటి పిల్లే అని... పట్టెడన్నం పెడుతోంది. పచ్చని జీవితాన్నీ ఇస్తోంది. వంచితులకు ఆమె పంచుతున్న అనురాగం, ఆత్మవిశ్వాసమే... ఈవారం జనహితం. తమ వాళ్ల నుంచి తప్పిపోయినవారు, ట్రాఫికింగ్ నుంచి తప్పించుకున్నవారు, వంచనకు గురయినవారు, వివిధ కారణాలతో ఇళ్ల నుంచి పారిపోయి వచ్చినవారు... ఇలా రకరకాల కారణాలచేత సమాజానికి దూరమై ఏం చేయాలో పాలుపోని ఒంటరి స్త్రీలకు కరీంనగర్లోని ‘స్వధార్హోమ్’ కొండంత అండగా నిలుస్తోంది. వారికి పట్టెడన్నం పెట్టడంతో పాటు పచ్చటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తోంది. ‘బాధిత స్త్రీల పునరావాస కేంద్రం’ పేరుతో ఉన్న ఈ హోమ్ని నడిపిస్తోన్న జయశ్రీ ‘ప్రకృతి’ అనే స్వచ్ఛందసంస్థలో భాగంగా ఎనిమిదేళ్లక్రితం స్వధార్ హోమ్ని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి బాధిత స్త్రీలకు అండగా నిలుస్తూ... వారికి ఆత్మవిశ్వాసం కలిగించి, సమాజానికి మళ్లీ కొత్తగా పరిచయం చేస్తున్నారు. ‘ప్రకృతి’ నీడలో... సమాజం పంచభూతాలకు అండగా నిలబడకపోతే ప్రకృతి పచ్చగా ఉండలేదంటారు జయశ్రీ. అందుకే మొక్కలు నాటడం వంటి పనులతో పచ్చదనాన్ని పోషిస్తూనే... 1997లో ‘ప్రకృతి’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పి, మహిళా సంక్షేమం, స్వయం ఉపాధి శిక్షణల కోసం పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వరంలో నడుస్తోన్న స్వధార్ హోమ్ని తన సొంతిల్లులా భావించి బాధిత మహిళలకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ‘‘స్వధార్ హోమ్లో ఒక్కో మహిళది ఒక్కో కష్టం. వారిని సమస్యల నుంచి బయటపడేయడమే కాకుండా, సమస్యల్ని ఎదుర్కొనేలా కూడా తీర్చిదిద్ది, కొత్త జీవితాలివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటివరకూ 350 మంది ఇక్కడ ఆశ్రయం పొందారు. ప్రస్తుతం హోమ్లో 50 మంది మహిళలున్నారు. వీరిలో పదేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసువారున్నారు’’ అంటూ తమ సంస్థ గురించి వివరించారు జయశ్రీ. లా చదివిన జయశ్రీకి విద్యార్థి వయసు నుంచే సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండేది. ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తూ, ‘ప్రకృతి’ అనే ఎన్జీవోని నడుపుతున్నారు. ఆశ్రయంతో పాటు... ‘‘2005లో స్వధార్ హోమ్ స్థాపించాక... దాని గురించి జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాను. చిత్రం ఏమిటంటే... ఆ అవసరం లేకుండానే బాధిత మహిళలు ఒక్కొక్కరుగా హోమ్కి రావడం మొదలుపెట్టారు. అత్యాచారానికి గురైన ఓ నలుగురు అమ్మాయిలకు ఇక్కడే ఆశ్రయం కల్పించాం. వారిలో ఇద్దరు... తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో అమ్మాయికి మతిస్థిమితం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయింది. ఇంకో అమ్మాయి కూరగాయల షాపు పెట్టుకుని తన బతుకు తాను బతుకుతోంది. అత్తింటి వేధింపులు భరించలేక మా హోమ్కి చేరుకున్న మహిళలకు, ఆమె భర్త, అత్త్తమామలకు కౌన్సెలింగ్ చేయడం... ఉమ్మడి కుటుంబంలో కాపురం కష్టమనుకుంటే మేమే దగ్గరుండి వేరు కాపురం పెట్టించడం, అయినా భర్త నుంచి బాధలు తప్పడం లేదంటే మా హోమ్లోనే కొన్నాళ్లు ఉంచి వారి కాళ్లమీద వారు నిలబడేలా ఏదైనా వృత్తిశిక్షణ ఇప్పించడం వంటి పనులు చేస్తున్నాం. భర్త చనిపోయిన మహిళల్లో కొందరు... అందరూ ఉన్న అనాథల్లా ఉన్నారు. వీరినే కాదు, పట్టెడన్నం పెడితే చాలంటూ వచ్చే వృద్ధులను కూడా స్వధార్ హోమ్ అక్కున చేర్చుకుంటోంది. ఏదో ఒక పనిచేసుకుని బతికే ఓపిక ఉన్నవారితో వారికిష్టమైన పనిచేయిస్తున్నాం. అలా ఓ నలుగురు వృద్ధులు ఇక్కడే కూరగాయలు అమ్మి పొట్ట పోసుకుంటున్నారు’’ అంటూ తన హోమ్కి వచ్చిన మహిళల గురించి చెప్పారు జయశ్రీ. చదువు... ఉపాధి... స్వధార్ హోమ్లో పెద్దవాళ్లే కాదు, విద్యార్థులు సైతం ఉన్నారు. ‘‘తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలతోపాటు విద్యార్థి వయసులోనే ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వారికి కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించేవరకూ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. పెద్దవాళ్ల పరిస్థితి పక్కన పెడితే చిన్నపిల్లలను ఏళ్ల తరబడి మా దగ్గరే పెట్టుకుని చదువు చెప్పించి, వారికి దారి చూపించడం కొంచెం కష్టమైన పనే. నిజానికి స్వధార్ హోమ్ గైడ్లైన్స్ ఏంటంటే... ఇక్కడికి వచ్చిన బాధిత మహిళలు మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకూ ఉండొచ్చు. ఆ లోపు వారికి ఉపాధిమార్గం చూపించి బయటికి పంపేయాలి. పిల్లలు చదువులో పడ్డాక వారు సెటిల్ అవ్వడానికి ఏళ్ల సమయం పడుతుంది. వారిని మధ్యలోనే మీ దారి మీరు చూసుకోండంటే ఎక్కడికి వెళతారు? అందుకే మేం ఆ గైడ్లైన్స్ని ఫాలో అవ్వడంలేదు. ఇన్ని నెలలు... ఇన్ని సంవత్సరాలు అనే నిబంధనలు పెట్టుకోకుండా వచ్చినవారి పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీకు ఒక కేసు వివరాలు చెబుతాను... స్వప్న అనే అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఏడోతరగతిలో ఉండగానే మేనమామ మహారాష్ట్రకు చెందిన ఓ నలభైఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేసేశాడు. అక్కడికి వెళ్లాక ఆ అమ్మాయిని అతను మరోవ్యక్తికి అమ్మడానికి ప్రయత్నిస్తుంటే విషయం అర్థం చేసుకున్న స్వప్న వెంటనే కరీంనగర్లో ఉన్న స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆమె ఆ ఊరి సర్పంచ్కి తెలియజేస్తే అతను మా చెవిన వేశాడు. మేం పోలీసుల సాయంతో మహారాష్ర్ట నుంచి మా హోమ్కి రప్పించుకుని, స్కూల్లో చేర్పించాం. ప్రస్తుతం తను నర్సింగ్ ఫైనలియర్ చదువుతోంది. కొంత ప్రభుత్వసాయం, కొందరు దాతల చేయూతతో హోమ్ని నడుపుతున్నాం. ఇక్కడికి వచ్చే బాధిత మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో హోమ్ కెపాసిటి పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాను’’ అని ముగించారు జయశ్రీ. ఆ హోమ్కి వెళ్లేంతవరకే బాధ. అక్కడున్న మహిళల సమస్యలు తెలుసుకున్న తోటివారు తమ బాధల్ని మరిచిపోతారు. కాని హోమ్ నిర్వాహకులకు మాత్రం ఒక్కో మహిళా ఒక్కో ఛాలెంజ్. లేదంటే వారి సమస్యల్ని పరిష్కరించి వారిని తిరిగి మళ్లీ జీవితంలో స్థిరపర్చడం అంత తేలికైన విషయం కాదు. ఆ పూటకు ఆశ్రయం కల్పించమని వచ్చిన మహిళలకు భరోసా గల భవిష్యత్తుని ఏర్పాటుచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్. ఎస్ ఠాగూర్ -
ఇంకా లాల పోసినట్టే! ఇంకా జోల పాడినట్టే!
తల్లిదండ్రుల ప్రేమను ఎవరూ క్వొశ్చన్ చేయలేరు. కానీ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు... ఎవరో కాదు, పిల్లలే క్వొశ్చన్ చేస్తారు! ‘ఏంటి మమ్మీ... ప్రతిదానికీ...’ అనే మాట రావచ్చు. ‘ఐ యామ్ నాట్ ఎ కిడ్ డాడ్...’ అనే విసుగు కూడా. అప్పుడు తల్లీ, తండ్రీ షాక్ అవుతారు. ఆలోచనలో పడిపోతారు. జాగ్రత్తలు చెప్పడం తప్పా? అన్నీ అమర్చిపెట్టడం తప్పా? తప్పు కాదు కానీ... ఇంకా లాల పోసినట్టే, ఇంకా జోలపాడినట్టే ప్రతిదీ వెంటబడి వెంటబడి చేస్తుంటే, చెప్తుంటే... వయసొస్తున్న పిల్లలు అమ్మ ఒడిలో ఇముడుతారా? నాన్న వేలు పట్టుకుని నడిచేందుకు ఇష్టపడతారా? ప్రేమంటే పట్టు మాత్రమే కాదు, విడుపు కూడానని బాధ్యత అంటే... బాధ్యతలను నేర్పడం కూడానని పేరెంట్స్కి చెప్పడమే... ఈవారం ‘లాలిపాఠం’. ఈ తరం కుటుంబాలో పెరిగిన జీవన ప్రమాణస్థాయులు కావచ్చు, అధునాతనమైన సౌకర్యాల వల్ల కావచ్చు... పిల్లల విషయంలో తల్లిదండ్రుల ధోరణిలో మార్పు కనిపిస్తోంది. పిల్లలను భద్రంగా చూసుకోవాలనుకోవడంతోపాటు ప్రతిదీ తామే నేర్పించాలనే తపన పెరుగుతోంది. పిల్లల బాల్యమంతా తల్లిదండ్రులే అవుతున్నారు. అన్నిపనులూ తల్లిదండ్రులే చేసిపెడుతుండడంతో పిల్లల్లో సోమరితనం పెరుగుతోంది. ఏదీసొంతంగా చేసుకోవడం చేతకాకపోవడంతో వారిలో అభద్రత భావం పెరుగుతోంది. ‘పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఎక్స్పోజర్ పెరగాలి, వాళ్లు ఏదైనా చేయాలని సరదా పడితే ఆ పని హానికరం కానంతవరకు వాళ్లను నియంత్రించాల్సిన అవసరం లేదు. నేర్చుకునే అవకాశం ఉన్నంత వరకు ప్రోత్సహించాలి’ అంటున్నారు సైకియాట్రిస్టులు. తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టింగ్గా ఉంటే పిల్లల్లో తాము పెద్దవుతున్నామా లేదా అనే అయోమయం, నేనింత పెద్దయ్యాను కదా మరి! ఈ చిన్న పనిని కూడా సరిగా చేయలేననే సందేహమా నా మీద?... ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి. ఇదే పరిస్థితి మితిమీరితే పిల్లల్లో ‘ఏమో నాకు చేతకాదేమో’ అని సర్ది చెప్పుకోవడం మొదలవుతుంది. అది ఇంకా ప్రమాదకరం. సొంతంగా తెలుసుకోనివ్వాలి! పిల్లలు ఎదిగే క్రమంలో వచ్చే మార్పులను తమకు తాముగా గుర్తించగలరు, వారికి చైల్డ్హుడ్, టీనేజ్, ఎర్లీ అడల్ట్హుడ్ దశల్ని గుర్తించే అవకాశం ఇవ్వాలి. ఆ దశలో సాధారణంగా ఉండే భావోద్రేకాల మీద అవగాహన కలిగించుకునే అవకాశం ఇవ్వాలి. దేహంలో వచ్చే మార్పులు అంటే గొంతుమారడం, మీసాలు రావడం, అమ్మాయిల్లో దేహాకృతిలో వచ్చే మార్పులను తమకు తాముగా గ్రహిస్తారు. ఇదే సమయంలో సమాజం వారిని చూసే ధోరణి కూడా మారుతుంది. దానిని పిల్లలు ఎంజాయ్ చేస్తారు కూడ. ఆ దశలో ఎలా ఉండాలో అవగాహన పెంచుకుంటారు. హితబోధ ఎక్కువైతే! తల్లిదండ్రుల్లో ఒక రకం తత్వం ఎలా ఉంటుందంటే... ప్రమాదాన్ని భయంకరంగా ఊహించుకుని ముందు జాగ్రత్తగా పిల్లలకు ‘అలా చేయాలి ఇలా చేయకూడదు’ అని పూసగుచ్చినట్లు చెబుతుంటారు. ఘోరమైన ప్రమాదం ఏదో జరుగుతుందేమోననే భయంతో పిల్లలు ఆ జాగ్రత్తలను వింటారు. కానీ అంతా సాఫీగా జరిగిన తర్వాత ‘అబ్బా! అమ్మానాన్న అంతగా చెప్పారు, ఏమీ కాలేదు కదా వాళ్లది ఒట్టి చాదస్తం’ అనుకుంటారు. ఇలాంటి హితబోధ అవసరమే, కానీ ప్రతిసారీ చేస్తోంటే పిల్లల్లో విసుగు మొదలవుతుంది. క్రమంగా తలకెక్కించుకోవడం మానేస్తారు. ఈ తేడా పెద్దవాళ్లకూ అర్థమవుతుంది. అప్పుడు మరింత ఆందోళనకు లోనవుతూ ‘పిల్లలు తమ మాటలను పెడచెవిన పెడుతున్నారనే అభిప్రాయాన్ని పెంచుకుంటారు’. నిజానికి ఇది పిల్లల్లో వయసురీత్యా వచ్చే సహజమైన మార్పే. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలా మారడానికి వారి స్నేహితులే కారణం అని నెపాన్ని మోపడానికి కూడా వెనుకాడరు. పైగా ‘ఫలానా ఫ్రెండ్ కారణంగానే వీడు ఇలా తయారవుతున్నాడు’ అనుకుంటూ ఆ ఫ్రెండ్ పేరు చెప్పకుండా ఆ లక్షణాలను, ఆ ఫ్రెండ్ ప్రవర్తనను తప్పుబడుతూ కౌన్సెలింగ్ ఇస్తారు. ఇక్కడ తల్లిదండ్రులది ఊహాజనితమైన కారణం, పిల్లలు చూసేది వాస్తవం. వాళ్లు చూసే వాస్తవాన్ని కాదని, ఊహాజనితమైన భయాలను చెప్తూ పోతే పిల్లలు సింపుల్గా ‘అమ్మానాన్నల పోరు ఎక్కువైంది’ అనేసుకుంటారు. వాళ్ల మెదడు కూడా పేరెంట్స్ చెప్పే విషయాలకు ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు అనే కండిషన్లోకి వెళ్తుంది. పియర్ ప్రెషర్... టీనేజ్ పిల్లల్లో చాలా సహజంగా కనిపించే లక్షణం పియర్ ప్రెషర్ (సాటి పిల్లలతో పోల్చుకోవడం వల్ల కలిగే ఒత్తిడి). దీని ఫలితాలు ఇలా... అని స్పష్టంగా చెప్పలేం. కొందరు బాగా చదివే క్లాస్మేట్స్తో పోల్చుకుని పోటీపడుతుంటారు. ఇక పియర్ ప్రెషర్ చూపించే ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుందంటే... క్లాస్లో ఒకరు వాడుతున్న స్కూల్ బ్యాగ్ని ఫ్రెండ్స్ అంతా మెచ్చుకుంటే సహజంగానే అలాంటి ప్రశంసలు తనక్కూడా కావాలనుకుంటూ... ఇంటికి వచ్చి ‘నా స్కూల్బ్యాగ్ పాడయింది కొత్తది కావాల’ని డిమాండ్ చేస్తారు, ఫలానా మోడల్దే అయి ఉండాలని పట్టుపడతారు. అది తమ సొంతం చేసుకునేంతవరకు స్థిమితంగా ఉండలేరు. పియర్ ప్రెషర్ని సరైన క్రమంలోకి మార్చగలిగితే అది మేలు చేసే లక్షణమే. సాధారణంగా 90 శాతం పిల్లలు... తల్లిదండ్రుల మాటను కాదనరు. పిల్లలకు బోర్ కొట్టేలా చెప్పనంతవరకు అమ్మానాన్నల మాటలను పిల్లలు గౌరవిస్తూనే ఉంటారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఏం చేయకూడదు! చిన్న వయసులో జి.కె నేర్పించడం వల్ల పిల్లల మెదడు చాలా ఒత్తిడికి లోనవుతుంది. ప్రతిదీ తాము చెప్పినట్లు చేయాలని నియంత్రించడం వల్ల పిల్లలు మైనపు ముద్దల్లా, తోలుబొమ్మల్లా మారుతారు లేదా వారిలో తిరుగుబాటు ధోరణి తలెత్తుతుంది. టీవీల్లో చూసి, పేపర్లలో చదివిన ప్రమాదాలు తమ పిల్లలకే సంభవిస్తాయేమోనే ఆందోళనతో తమ కళ్లముందు నుంచి ఎటూ వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తూంటారు. పైగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అనుకుంటారు. అది జాగ్రత్తగా పెంచడం కాదు. భద్రత అనే వలయాన్ని గీసి అందులో బంధించడమే అవుతుంది. ఎలా చెప్పాలో తెలియక..! ఇటీవల మా దగ్గరకు వచ్చే చాలామంది పేరెంట్స్ని గమనిస్తే... వాళ్లకు పిల్లలకు ఎలా చెప్పాలో తెలియడం లేదనిపిస్తుంది. చిన్నదానికీ, పెద్దదానికీ విపరీతమైన భద్రత కోరుకుంటారు. కుర్చీలో కూర్చున్న పిల్లవాడు కిందకు దిగాలనుకుంటాడు. వాడు కదలగానే అమ్మ లేదా నాన్న ‘బాబూ! పడిపోతావ్! దిగకు అలాగే కూర్చో’ అంటారు. అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రమాద హెచ్చరిక మాత్రమే చేస్తున్నారు. కానీ, అధిగమించడానికి అవసరమైన నైపుణ్యా లను నేర్పడం లేదన్నమాట. - డా॥కల్యాణ్చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
డాక్టర్ సలహా లేకున్నా ఆ మందు వాడవచ్చా?
నా వయసు 34 ఏళ్లు. నాకు ఇటీవల అంగస్తంభనలు తగ్గాయి. నా అంతట నేనే మెడికల్ షాపుకు వెళ్లి వయాగ్రా టాబ్లెట్లు కొనుక్కోవచ్చా. అలా వయాగ్రా వాడటం వల్ల ఏమైనా ప్రమాదమా? నాకు తగిన సలహా ఇవ్వండి. - కె.ఆర్.ఆర్., ఒంగోలు సాధారణంగా యుక్తవయసులో ఉన్నవారికి అప్పుడప్పుడు అంగస్తంభన లోపాలు వచ్చి సతమతమవుతుంటారు. ఇలా కావడానికి నిర్దిష్టంగా కారణం ఏదీ ఉండదు. ఇటువంటి వారిలో వయాగ్రా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వాళ్లలో ఆత్మవిశ్వాసం కలిగి తమంతట తామే ఎలాంటి టాబ్లెట్ల సహాయం లేకుండానే సెక్స్ చేయగలుగుతారు. కాని ఎవరు పడితే వాళ్లు స్వయం నిర్ణయం తీసుకుని వేసుకోడానికి వయాగ్రా అన్నది జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసిటమాల్ లాంటి మందు కాదు. ఈ మందు చాలా ప్రమాదకరం కాకపోయినా కొద్దిమందిలో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇక గుండెజబ్బులు ఉండి కొన్ని రకాల మందులు తీసుకునేవారిలో మాత్రం ఇది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అంతేకాదు... సెక్స్ ప్రేరేపిత మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం చట్టబద్ధమైన నేరం. వయాగ్రాకు సరైన స్పెషలిస్ట్ల ప్రిస్క్రిప్షన్ అవసరం. అందువల్ల మీరు యూరాలజిస్ట్ను / మెడికల్ స్పెషలిస్ట్ను సంప్రదించడం అవసరం. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్