Confusion
-
మార్కెట్లో రూ.20 నాణెం.. తికమక పడుతున్న జనం
సిరిసిల్లటౌన్: మార్కెట్లో రూ.20 నాణేలు చలామణి అవుతున్నాయి. కొత్తగా ఈ కాయిన్స్ వచ్చినట్లు చాలా మందికి తెలియక అయోమయానికి గురవుతున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వీటిని మార్కెట్లోకి ఆర్బీఐ విడుదల చేసంది. కాస్త చిన్న సైజులోనే రూ.5 కాయిన్స్ కూడా చలామణి అవుతున్నాయి. రెండు చిన్నపాటి మార్పులతో ఉండడంతో ప్రజలు తికమకపడుతున్నారని చర్చించుకుంటున్నారు. -
చేతులెత్తేసిన చంద్రబాబు..
-
‘రంగారెడ్డి’ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పార్టీ క్యాడర్లో ఇంకా అయోమయం కొనసాగుతోంది. హస్తం శ్రేణుల్లో ఈ ఆందోళనకు కారణమేంటి? పాత, కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా ? గ్రూపు తగాదాలు పార్టీ క్యాడర్కు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు పెద్ద ఎత్తున చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ?ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ...గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అవుతారనే ప్రచారంతో పార్టీ క్యాడర్కు కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ వివిధ కారణాలతో కాంగ్రెస్లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ... పార్టీ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామా అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్ లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండోసారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు. తాండూరు కాంగ్రెస్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. -
ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
నరసరావుపేట రూరల్/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/పెనమలూరు: పోలింగ్తేదీ సమీపిస్తున్న కొద్దీ ఓటమి తథ్యమనే విషయం తెలుస్తుండటంతో టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను కొల్లగొట్టాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించి ప్రలోభాల వలలు విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సోమవారం కూడా నగదు ఎర వేస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, బెదిరిస్తూ.. ఏదో ఒకరకంగా ఓట్లు వేయించుకోవాలని బరితెగించి వ్యవహరించారు. ప్రశ్నించినవారిపై దాడిచేసి కిడ్నాప్ చేస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్సీపీ వారిపై రాళ్లదాడులకు దిగుతున్నారు. నరసరావుపేటలో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కిడ్నాప్ నరసరావుపేటలో ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్ల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఓటర్లకు నగదు ఎర చూపారు. దీన్ని సెల్ఫోన్లో చిత్రీకరించిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణరెడ్డి అక్కడున్న పోలీసు అధికారులకు చూపించారు. పోలీసులు.. టీడీపీ నాయకుల ప్రచారానికి అభ్యంతరం తెలిపి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో టీడీపీ వారు సత్యనారాయణరెడ్డిపై దాడిచేసి కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. విషయం తెలిసి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. అక్కడున్న టీడీపీ వారిని పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై తెలుగుదేశం వర్గీయులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా, తనపై దాడిచేసి బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మధిర సత్యనారాయణరెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులకు చెందిన ఈ విద్యాసంస్థలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై వైఎస్సార్సీపీ వర్గీయులు కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిస్పాక్షికంగా ఉన్న ఉద్యోగులే లక్ష్యం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ హై సూ్కల్కు ఎదురుగా ఉన్న పోలింగ్ కేంద్రం సమీపంలో టీడీపీ నాయకులు పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, బొట్ట రమణ నిస్పాక్షికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా హడావుడి చేశారు. ఓటర్ల వివరాలు నమోదు చేసుకున్న కార్యకర్తలు తర్వాత ఫోన్ పే, గుగూల్ పే వంటి వాటిని ఉపయోగించినట్లు తెలిసింది.ఉద్యోగి ఓటు వేసిన మరో వ్యక్తికృష్ణాజిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన 141 పోలింగ్ కేంద్రంలో పెనమలూరు సచివాలయం–1లో డిజిటల్ అసిస్టెంట్ మట్ట కిషోర్బాబు ఓటును గుర్తుతెలియని వారు వేశారు. సోమవారం ఓటేసేందుకు వచ్చిన కిషోర్బాబు తన ఓటు అప్పటికే వేసి ఉండటంతో అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు కూడా నిరసన తెలిపి కిషోర్కు ఓటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిషోర్బాబుకు మంగళవారం 140వ బూత్లో ఓటు కల్పిస్తామని ఏఆర్వో వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం హెల్ప్డెసు్కలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఎల్.గోవిందరాజులు టీడీపీకి ఓటేయాలని తమకు సూచించారని ఉయ్యూరు ఏజీ ఆండ్ ఎస్జీ కాలేజీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు చెప్పారు. దీనిపై వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఏఆర్వోకి ఫిర్యాదు చేశారు. దీంతో గోవిందరాజులును ఎన్నికల విధుల నుంచి తప్పించారు. -
కూటమి కుదురుకునేనా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘ఇండియాకూటమి’ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఇంకా అంతరం కొనసాగుతోంది. కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కీలకంగా ఉన్నా, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా..పొత్తులపై ఇప్పటికీ ఆ పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఒకవైపు బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నా, ఐక్యత మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కూడా గణనీయమైన ఎంపీ స్థానాలు వస్తాయనే అంచనాలున్న నేపథ్యంలో ఎంతోకొంత ప్రభావం చూపగలిగే వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉందని లెఫ్ట్ నేతలు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల వరకు నానబెట్టి చివరకు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ సీపీఎం రెండూ రాజీకి రాలేకపోయాయి. ఎన్నికల వేళ మాటల యుద్ధం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతోంది. ఈ నేపథ్యంలో తమతో చర్చలు జరపకపోవడంపై వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు వివిధ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నా, సమయం ఇవ్వడం లేదని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేరళ వెళ్లి అక్కడి సీపీఎం సీఎం పినరయి విజయన్ను విమర్శించడాన్ని కూడా కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. పార్టీలు మారిన వారికి పెద్దపీట వేస్తూ, తమకు ఒక ఎంపీ సీటు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీపీఐ విమర్శిస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్కు సూచించారు. అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం పొత్తులపై స్పష్టత రాకపోవడంతో సీపీఎం ఇటీవల భువనగిరి లోక్సభ సెగ్మెంట్కు జహంగీర్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంలో బీఆర్ఎస్ నుంచి తమకు ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పడం గమనార్హం. ఇక సీపీఐ కూడా కాంగ్రెస్ తీరుపై గరంగరంగా ఉంది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఒక స్థానంలో గెలవడంతో దూకుడుగా వెళ్లడానికి సీపీఐ కాస్తంతా వెనుకాముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో చర్చలుంటాయా? కాంగ్రెస్ పార్టీ నాలుగైదు రోజుల్లో తమతో చర్చలు జరుపుతుందని అంటున్నారని వామపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ చర్చల్లో చెరో సీటు అడగాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎంపీ సీట్లు ఇవ్వకుండా మద్దతు కాంగ్రెస్ కోరితే కనీసం చెరో ఎమ్మెల్సీ అడిగే ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు చెరో ఎంపీ స్థానంలో తమ అభ్యర్థిని స్నేహపూర్వకపోటీ పెట్టడం ద్వారా బరిలో నిలపాలని కూడా లెఫ్ట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. -
టీడీపీ, బీజేపీ మధ్య టిక్కెట్ల దోబూచులాట
సాక్షి, విజయవాడ: టీడీపీ, బీజేపీ మధ్య టిక్కెట్ల దోబూచులాట కొనసాగుతోంది. బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా స్ధానాలు పెండింగ్లో ఉన్నాయి. నాలుగు ఎంపీ స్ధానాలను చంద్రబాబు పెండింగ్లో ఉంచగా, రాజమండ్రి, ఒంగోలు, రాజంపేట, అనంతపురం, కడప స్ధానాల విషయంలో టీడీపీలో అయోమయం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోసం ఒంగోలు, రాజమండ్రి స్ధానాలు పెండింగ్లో పెట్టగా, ఈ రెండింటిలో ఒక స్ధానం నుంచి పోటీ చేయడానికి పురందేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేట లేదా అనంతపురం స్దానాల కోసం బీజేపీ నేత సత్యకుమార్ ప్రయత్నిస్తున్నారు. వెంకయ్యనాయుడు పీఏగా సుదీర్ఘ కాలం పనిచేసి.. వెంకయ్య ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ కొనసాగుతున్నారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు వాయిస్ వినిపించే సత్యకుమార్ కోసం రాజంపేట, అనంతపురం పెండింగ్లో ఉంచారు. కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల కోసం కడప స్ధానాన్ని చంద్రబాబు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. -
ఆ సర్వేతో చంద్రబాబు షాక్.. ముందు నుయ్యి వెనుక గొయ్యి
ఆ నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారట కానీ ఎవరిని బరిలోకి దించాలో తెలియక కిందామీదా పడుతున్నారట. ప్రస్తుతం ఉన్న ఇంఛార్జికే సీటివ్వాల.. లేక బయటి నుంచి ఎవరినైనా తెచ్చి పోటీ పెట్టాలో తేల్చుకోలేకపోతున్నారట. అందుకే మీ ఓటు ఎవరికి వేస్తారంటూ రోజుకొకరి పేరుతో సర్వే చేయిస్తున్నారట చంద్రబాబు. కాని.. ప్రజలు టీడీపీలో ఎవరికీ అనుకూలంగా లేకపోవడంతో పచ్చ బాస్ తలపట్టుకున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, అక్కడి పరిస్థితి ఎలా ఉంది? తొలి విడత సీట్లను ప్రకటించేసి చేతులు దులిపేసుకున్న చంద్రబాబుకు కృష్ణాజిల్లా పెనమలూరు సీటు విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోవడం లేదట. వాస్తవానికి సామాజికవర్గం పరంగా, పార్టీ పరంగా టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం పెనమలూరు నియోజకవర్గం. కానీ ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. దీంతో ఈసారి ఎలాగైనా పెనమలూరులో టీడీపీ జెండా ఎగరవేయాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కృష్ణాజిల్లాలో గన్నవరం, గుడివాడతో పాటు పెనమలూరు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట చంద్రబాబు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ...పెనమలూరులో వైసీపీని ఢీకొట్టే అభ్యర్ధి మాత్రం చంద్రబాబుకు దొరకడం లేదని టాక్. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి తనకే టిక్కెట్ అని ఆయన ఆశపడుతున్నారు. కానీ పెనమలూరు విషయంలో చంద్రబాబు ఆలోచనలు మరోలా ఉన్నాయని తెలుస్తోంది. బోడే కాకుండా గట్టి అభ్యర్ధిని బరిలోకి దించాలని రకరకాల ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నారట. ఇటీవల టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ తో పాటు దేవినేని ఉమా పేరు మొన్నటి వరకూ పెనమలూరులో బలంగా వినిపించాయట. కానీ వసంతకు మైలవరం దాదాపు ఖాయమైపోవడంతో ఉమా అయితే ఎలా ఉంటుందనే విషయంపై చంద్రబాబు ఓ సర్వే చేయించారట. పెనమలూరు అభ్యర్ధిగా ఉమా మీకు కావాలంటే ఓటేయండంటూ ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా సర్వేలో కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు సేకరించారట. ఈ సర్వేలో ఉమాకు అనుకూలమైన ఫలితాలు రాకపోవడంతో తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఎం.ఎస్.బేగ్ పేరుతో మరో సర్వే చేయించారట. దీనిలోనూ పెద్దగా అనుకూలత రాలేదట. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీలో చేరిన కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్.. కొలుసు పార్ధసారధి ద్వారా పెనమలూరు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇలా రోజుకో పేరుతో చంద్రబాబు సర్వేలు చేయిస్తున్న సమయంలో మాకేం తక్కువ అని నిలదీస్తున్నారట పెనమలూరు లోకల్ తెలుగు తమ్ముళ్లు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని ఎవరెవరి పేరుతోనే సర్వేలు చేయించడమేంటని మండిపడుతున్నారట. ఎక్కడెక్కడి నుంచో అభ్యర్ధుల్ని తెచ్చి బలవంతంగా తమపై రుద్దే బదులు ఆ టిక్కెట్ ఏదో తమకే ఇవ్వాలన్న డిమాండ్ను తెరపైకి తెస్తున్నారట. ఎం.ఎస్.బేగ్ పేరిట సర్వే చేయించిన తరుణంలో మైనార్టీ కోటాలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ షాహిద్. మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్కు సీటు ప్రకటిస్తారని అంతా ఆశించారు. అలా జరిగేలా లేదని తేలిపోవడంతో బోడేకు టిక్కెట్ ఇవ్వకపోతే మైనార్టీ అభ్యర్ధిగా తనకే కేటాయించాలి కానీ వలస వచ్చే వారికి ఇస్తే మాత్రం సహకరించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన వారిని చంద్రబాబు గుర్తించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారట. పెనమలూరు టిక్కెట్ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణి మాని త్వరగా తేల్చేయాలని అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పెనమలూరులో జెండా పాతడం ఎలా అంటూ చంద్రబాబు రకరకాలుగా తిప్పలు పడుతున్నారు. ఇదే విధంగా జాగు చేస్తే..అంతా కలిసి టీడీపీ జెండా పీకేసేలా ఉన్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందట. ఇదీ చదవండి: ఎచటి నుంచో ఆ పవనం! -
బిడ్డను చంకనెత్తుకుని... ఊరంతా వెతికాడట!
నెత్తిన కళ్లజోడు పెట్టుకుని.. అయ్యో నా కళ్ల జోడు అని వెతుక్కోవడం.. తాళాలు చేత్తో పట్టుకొని తాళాలు కోసం తెగ ఖంగారు పడి పోవడం మనలో చాలా మందికి అనుభవమే. అంతేకాదు ఒక్కోసారి ఫోన్ మాట్లాడుతూనే.. నా ఫోన్ ఏది అని గాభరా పడిపోతూ ఉంటాం కదా. మడి సన్నాక.. అయోమయం, మతిపరుపు కామన్ అంటారా? అయితే సరే.. ఈ వైరల్ వీడియో చూడండి..ఎండింగ్ అస్సలు మిస్ కాకూడదు మరి! ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బేబీ స్క్రోలర్లో బేబీ లేకపోవడంతో ఒక్కసారి కంగారు పడిపోయాడు. అటూ ఇటూ వెదుకుతూ తెగ ఆందోళన చెందాడు. తీరా .. చూస్తే ఆ పాపను భుజంపైన ఎత్తుకోవడం కనిపిస్తుంది. చివరికి అసలు సంగతి తెలుసుకున్న తరువాత తండ్రి రియాక్షన్ చూడాలి.. ఎంతో ఊరట చెంది పాపను హత్తుకుంటాడు హృద్యంగా. ఇంకో వీడియోలో ఒక మహిళ బేబీని ఎత్తుకుని, వాకర్ని ఊపుతూ ఉంటుంది బేబీని నిద్రపుచ్చాలని. కానీ కొన్ని క్షణాల్లో వాకర్లో ఏమీ లేకపోవడంతో బేబీని హడావిడిగా వెదుకుతూ ఉంటుంది. కాసేపటిరి బేబీ తన దగ్గరే.నన తన చంకలోనే ఉందన్న సంగతి తెలుసుకుని హమ్యయ్యా అనుకోవడమే కాదు తెగ నవ్వుకుంటుంది. మనమందరం కొన్నిసార్లు గందరగోళానికి గురవుతాము అంటూ నెటిజన్లు కమెంట్స్ చేశారు A man panicked when he realized that his daughter was missing, when he forgot that he was carrying her around his neck. We can all be confused sometimes! 😂pic.twitter.com/VVsMXmMprb — Figen (@TheFigen_) January 18, 2024 Many such cases 🤣 pic.twitter.com/F87jvkduTB — AGI - Tech Gone Wild 🤖❤️🔥🇳🇴 (@AGItechgonewild) January 18, 2024 -
కన్ఫ్యూజ్ చేస్తున్న వివేక్..విజయం కలేనా..?
సాక్షి,మంచిర్యాల: నాయకులు పార్టీ మారడం సాధారణంగా జరిగేదే. ఓ నేత పార్టీలు మారుతూ జనాన్ని కన్ఫ్యూజ్లోకి నెట్టేస్తుంటారు. అందుకే ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో విజయాన్ని చూడలేదు. తాజాగా మరోసారి పార్టీ మారారు. ఈసారి తనకొడుకును బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారని టాక్. గతంలో తండ్రిని ఓడించిన అధికార పార్టీ నాయకుడు ఈసారి ఆయన తనయుడిని కూడా ఓడిస్తానంటున్నారు. ఇంతకీ అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఆ నాయకులెవరో చూద్దాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి గులాబీ పార్టీలో పేరు తెచ్చుకున్న బాల్క సుమన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. విద్యార్థి నేతగా ఉద్యమంలో చురుగ్గా ఉన్నకాలంలోనే రాష్ట్రం ఏర్పాటైనపుడు 2014లో పెద్దపల్లి నుంచి గులాబీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో చెన్నూరు నుంచీ అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు కూడా చెన్నూరు నుంచే పోటీ చేస్తున్నారు సుమన్. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణకు ఈసారి చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. నిన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈసారి అసెంబ్లీ బరిలో వివేక్ నిలబడకుండా ఆయన తనయుడు వంశీతో రాజకీయం అరంగేట్రం చేయిస్తారని తెలుస్తోంది. వ్యాపారరంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్న గడ్డం వివేక్..రాజకీయాల్లో తత్తరపాటు నిర్ణయాలతో ఓటమిపాలవుతున్నారనే టాక్ నడుస్తోంది. తండ్రి కాలం నుంచి కాంగ్రెస్తోనే ఉన్న వివేక్ 2009లో ఎంపీగా ఒకసారి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు పోరాటం జరుపుతున్నా తెలంగాణ ఇవ్వడంలేదని కాంగ్రెస్ మీద కోపం వచ్చి ఆనాడు గులాబీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించాక కృతజ్ఞతతో మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ తరపున ఎంపీ సీటుకు పోటీ చేసి బాల్క సుమన్ మీద ఓడిపోయారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2016లో మరోసారి గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కాని.. గత ఎన్నికల్లో కేసీఆర్ సీటు ఇవ్వనందుకు కోపం వచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఎన్నికల టైమ్లో బీజేపీకి రాజీనామా చేసి మరోసారి సొంతగూటికి చేరుకున్నారు గడ్డం వివేక్. లోక్సభ ఎన్నికల్లో మరోసారి పెద్దపల్లి నుంచే బరిలోకి దిగాలనుకుంటున్న గడ్డం వివేక్...అసెంబ్లీ ఎన్నికల్లో తనయుడు వంశీకృష్ణకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు కాంగ్రెస్లో చేరినట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీ ఎన్నికల్లో తనను ఓడించిన బాల్క సుమన్ మీద చెన్నూరులో పోటీ చేయడానికి తనయుడిని సిద్ధం చేస్తున్నారట వివేక్. తండ్రిని ఓడించిన సుమన్ను ఓడించి అసెంబ్లీలో ప్రవేశించడానికి వివేక్ తనయుడు వంశీకృష్ణ రెడీ అవుతున్నారని టాక్. అయతే గతంలో ఒకసారి తండ్రిని ఓడించి ఎంపీగా గెలిచాను...ఈసారి కొడుకును ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అవుతానంటున్నారు గులాబీ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్. తండ్రీ, తనయులను ఓడించి చరిత్ర కెక్కుతానంటున్నారు బాల్కసుమన్. ఎన్నికల వేళ రాజకీయాల్లో కోలాహలం మామూలే. రాత్రి ఒక పార్టీ.. ఉదయం మరోపార్టీ మారే నాయకులు మనకు అనేకమంది కనిపిస్తారు. ఒక రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలూ మారే నేతల్ని మనం చూస్తున్నాం. గడ్డం వివేక్ ఈసారైనా ఆయన తీసుకున్న నిర్ణయం సరైందే అని భావిస్తున్నారా? వివేక్ నిర్ణయం కరెక్టా? కాదా అన్నది చెన్నూరు ప్రజలే తేలుస్తారు. -
తెలుగుదేశం పార్టీ పనైపోయిందా ?
-
ఎందుకీ కన్ఫ్యూజన్..! ఆ విషయంలో పవన్ లెక్క తప్పాడా?
పొత్తు ఎవరితో ఉంటుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదని ఆయనే చెబుతున్నారు. ప్రజల మద్దతు తనకు ఉంటుందో లేదో అన్న డైలమాని ఆయనే బయట పెట్టుకున్నారు. ఎవరితో పొత్తులు పెట్టుకుంటే జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తోరో ఇంత వరకు క్లారిటీయే రాలేదు. కానీ తాను మాత్రం ముఖ్యమంత్రి సీటుపై కూర్చోడానికి రెడీ అంటున్నారు పవన్ కళ్యాణ్. లెక్కలేనంత తిక్క.. తలతిక్కను మించిన కన్ఫ్యూజన్ను అణువణువునా నింపుకున్న పవన్ కల్యాణ్ అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్ధం అవుతోందా? అని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. గోదావరి జిల్లాల తర్వాత విశాఖలో వారాహి యాత్ర ముగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనలో ఉన్న అయోమయాన్ని బయట పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే పరిస్థితిలో లేని టీడీపీతో కానీ.. లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కానీ జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం కచ్చితంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. పొత్తులు అయితే గ్యారంటీగా ఉంటాయి కానీ.. అది బీజేపీతో ఉంటుందా? లేక టీడీపీతో ఉంటుందా? అన్న అంశాలపై చర్చ నడుస్తోందన్నారు పవన్. అంటే ఎవరితో పొత్తు ఉంటుందో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదన్నట్లే అంటున్నారు రాజకీయ పండితులు. సరే పొత్తులు బీజేపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీతో ఉంటాయా లేదంటే 2014 తరహాలో మళ్లీ మూడు పార్టీలు కలిసి జట్టు కడతాయా? అన్నదాంట్లోనూ క్లారిటీ లేదు. ఒక వేళ టీడీపీతో కానీ బీజేపీతో కాని పొత్తులు పెట్టుకుంటే అపుడు ఆ పార్టీలు జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తాయి? అన్నదానిపై క్లారిటీ లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఓ పాతిక సీట్లు జనసేనకు ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. మరీ ఎక్కువ అనుకుంటే 40 స్థానాల దాకా ఇవ్వచ్చు. ఒక వేళ జనసేనకి 40 స్థానాలు కేటాయిస్తే ఆ 40 నియోజక వర్గాల్లోనూ జనసేన అభ్యర్ధులను బరిలోకి దింపితే పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్నింట్లో విజయాలు సాధించే అవకాశాలుంటాయన్నది ప్రశ్న. గత ఎన్నికల్లో జనసేన గెలుచుకున్నది ఏక్ నిరంజన్ లా ఒకే ఒక్క సీటు. జనసేన ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆ జోడీ మొత్తానికి 88 స్థానాలు దక్కితేనే మ్యాజిక్ ఫిగర్ను అందుకోగలుగుతాయి. కానీ క్షేత్ర స్థాయిలో జనసేనతో టీడీపీ కలిసినా బీజేపీ కలిసినా ఈ ఫిగర్కు దరిదాపుల్లో కూడా స్థానాలు దక్కే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చదవండి: బాబూ.. కాస్త ప్రధాని మోదీని చాలెంజ్ చేయొచ్చుగా! అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాబోయేది మిశ్రమ ప్రభుత్వం అంటున్నారు. అంతే కాదు తాను ఈ సారి సీఎం సీటు ఎక్కడానికి రెడీ అంటున్నారు. అయితే దానికి ప్రజలు బలంగా తనకు మద్దతు తెలపాలంటున్నారు పవన్. దీని మీదనే సోషల్ మీడియాలో పవన్ను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు అమితాబ్ బచ్చన్న అన్నట్లు పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ పొత్తు పెట్టుకోబోయే పార్టీకి కానీ, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లు వస్తాయన్న గ్యారంటీయే ప్రస్తుతానికి లేదు. కానీ పవన్ మాత్రం సీఎం సీటుకు తాను రెడీ అంటున్నారు. సీఎం సీటులో కూర్చోడానికి పవన్ రెడీ కావచ్చు. కానీ రెడీగా ఉండాల్సింది సీఎం సీటు కదా? సీఎం సీటు రెడీగా ఉండాలంటే అసలు పవన్ని సీఎంగా చేయడానికి ప్రజలు రెడీగా ఉండాలి కదా? ఆ ప్రజలే పవన్ను సీఎంగా చేయడానికి రెడీగా ఉండే పరిస్థితులు ఉంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవలసిన అగత్యం ఎందుకొస్తుంది? తాను అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నానన్న దౌర్బల్య పరిస్థితిలోనే కదా పవన్ పొత్తుల కోసం పరితపిస్తున్నది. పొత్తులు లేనిదే తాను పోటీచేయలేనని చెప్పుకోడానికి నామోషీ అయ్యే కదా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే సవాల్ విసిరినట్లు పవన్ నటించింది? తన వైఫల్యలపై కూడా పవన్ కళ్యాణ్ మంచి కామెడీ చేస్తుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ గందరగోళంలోనే తనకున్న కన్ఫ్యూజన్ ని పవన్ అందరికీ పంచిపెడుతున్నారని వారు సెటైర్లు వేస్తున్నారు. -
ఇంత బిల్డప్ ఇచ్చారు.. తీరా చూస్తే.. ఇదేంటి ఆనం..
జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తిరుగులేదు. అన్ని చోట్లా నా అనుచరులు ఉన్నారంటూ బిల్డప్ ఇచ్చిన ఆ నేతకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అడుగుపెట్టిన ప్రతి చోటా.. స్థానిక నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడం ఇప్పుడు ఆయన్ని ఆందోళనలోకి నెట్టేసింది. నెల్లూరు జిల్లాలో రాజకీయ చరిత్ర కల్గిన ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని జిల్లాలో ఆయన గురించి తెలిసిన రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీ మీదే విమర్శలు చేసిన అనం.. తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి.. తనకు కావాల్సినవి జరగలేదన్న అక్కసుతో ప్రతిపక్షం చెంత చేరిన ఆనం.. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తన బలం.. బలగాన్ని చూపాలని ప్రయత్నించి బోర్లా పడ్డారు. లోకేష్ పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించి, జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలన్న ఆలోచన బెడిసి కొట్టిందట. ఆత్మకూరులో ఇటీవల జరిగిన పరిణామాలు ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు లోకేష్, అనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం రామనారాయణ రావడం వల్లే తనకు టీడీపీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని గ్రహించిన కొమ్మి.. పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మరోవైపు టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న గూటూరు కన్నబాబును చంద్రబాబు కరివేపాకులా తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్కు ద్రోహం చేసి వచ్చిన ఆనంకి ఆత్మకూరు బాధ్యత అప్పగించారు. దీంతో కన్నబాబుకి మండి ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికా ప్రయాణం కట్టేశాడట. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! ఆత్మకూరు టీడీపీలో ఎదురైన ఈ పరిణామం ఒకెత్తయితే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రకటించిన ఆత్మకూరు అభివృద్ధి అజెండాకు నియోజక వర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. విక్రం వివరిస్తున్న తీరుకు..చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఫిదా అయ్యారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు భారీగా జనాలు రావడం.. క్యాడర్ లో జోష్ గమనించిన ఆనం రామనారాయణ ఆత్మకూరు నుంచి తన దృష్టిని నెల్లూరు సిటీ వైపు మళ్ళించారట. ఆనం వేసిన ఈ ఎత్తును గమనించిన మాజీ మంత్రి నారాయణ అనుచరులు టీడీపీ సిటీ ఇంఛార్జి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. మా సీటు కోసం ఎవరు ప్రయత్నించినా ఒప్పుకోం అంటున్నారట. మరో వైపు ఉమ్మడి కుటుంబ సభ్యుల నుంచి ఆనంకి ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారం వినిపిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి భుజాలపై రాజకీయంగా ఎదిగి.. ఆయన మరణానతరం అందరినీ వదిలి తాను.. తన కుమార్తె అన్నట్టుగా రామ నారాయణ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారని ఉమ్మడి కుటుంబ సభ్యులు ఆగ్రహిస్తున్నారట. చదవండి: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీదే జయభేరీ ఒకవైపు టీడీపీలో పెత్తనం చేద్దామని వస్తే.. ఆదిలోనే ఎదురుగాలి మొదలైంది. ఇంకోవైపు తమది పెద్ద రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటున్నప్పటికీ అదే కుటుంబం నుంచి సహకారం లేకపోవడంతో ప్రస్తుతం ఆనం పరిస్థితి అయోమయంలో పడిందట. అక్కున చేర్చుకున్న అధికార పార్టీకి దూరమై అసమ్మతితో బయటకు వచ్చిన ఆనం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని టాక్ నడుస్తోంది. -
తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా?
తోచీ తోయనమ్మ తోడికోడలు.. పుట్టింటికి వెళ్లిందని ఒక సామెత. భారతీయ జనతా పార్టీ నేతల తీరుతెన్నులు అలాగే ఉన్నాయి. ఆయా రాష్ట్రాలలో మేధావులను,వివిధ వర్గాల ప్రముఖులను కలవడానికి ఆ పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుంది. మంచిదే!. ఆ సందర్భంగా వారు తమకు కాస్త సానుకూలంగా ఉండేవారినో, లేక తటస్థంగా ఉండేవారినో కలిస్తే ప్రయోజనం ఉంటుంది. అలాకాకుండా పూర్తి వ్యతిరేక సిద్దాంతంతో ఉండేవారిని, మరో పార్టీకి ఏజెంట్ గిరీ చేసేవారిని కలవడానికి ఆలోచించడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ✍️ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా.. హైదరాబాద్లో మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్లి కలిశారు. ఆయన కూడా వీరిని సాదరంగా ఆహ్వానించి ఇంటిలోకి తీసుకువెళ్లారు. ఆయనకు మోదీ పాలనకు సంబంధించిన వివిధ పుస్తకాలను నడ్డా అందించారు. సిద్దాంతాలు వేరైనా ఇలా రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియచేయడానికి రావడం ప్రజాస్వామ్యంలో మంచిదేనని నాగేశ్వర్ అన్నారు. బాగానే ఉంది. నాగేశ్వర్ మర్యాదస్తుడు. అందరితో గౌరవించబడే వ్యక్తి. అంతవరకు ఓకే. అసలు బీజేపీ పెద్దలు ఆయనను కలవడం వల్ల ఏమి ప్రయోజనం వచ్చిందన్నది ప్రశ్న. తెలంగాణ బీజేపీ నేతలే కొందరు ఈ ప్రశ్న లేవనెత్తడం విశేషం. నాగేశ్వర్ వామపక్ష సిద్దాంత భావాలు ఉన్న ప్రముఖుడు. ఆయన కొంతకాలం సీపీఎం ఆధ్వర్యంలోని ఒక టీవీ చానల్ ను కూడా నిర్వహించారు. వివిధ టీవీ చానళ్లలో విశ్లేషకుడిగా కూడా తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. ఇప్పుడు నడ్డా కలవడం వల్ల నాగేశ్వర్ తన భావాలను మార్చుకుంటారని అనుకోజాలం. తాను చెప్పదలచుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటారు. అందుకు బీజేపీ నేతలు ఇష్టపడతారా? బీజేపీ సిద్దాంతం అంటే అంతగా ఇష్టపడని వ్యక్తి అని తెలిసి కూడా ఆయనను కలవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. గతంలో బీజేపీ అభ్యర్ధిని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన చరిత్ర కూడా నాగేశ్వర్కు ఉంది. రాజకీయ వర్గాలలోను, రాజకీయేతర వర్గాలలోను ఈయన పట్ల చాలా మందికి అబిమానం ఉంది కనుక ఎవరో ఈ భేటీని అభ్యంతరంగా తీసుకోరు. కాకపోతే బీజేపీ తెలంగాణలో గందరగోళంలోనే ఉందన్న సంగతి మరోసారి స్పష్టం అవుతుంది. ✍️ కొంతకాలం క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జర్నలిస్టు ముసుగులో ఉన్న తెలుగుదేశం ఏజెంట్ ఒకరిని కలవబోతున్నారని వార్తలు వచ్చాయి. చంద్రబాబుకు డైరెక్ట్ ప్రతినిధిగానే కాకుండా ఫిరాయింపులు, రాజకీయ ఆర్దిక లావేదేవీలు వంటివాటిలో క్రియాశీలకంగా ఉంటూ పవర్ బ్రోకర్ గా పేరొందిన జర్నలిస్టును కలవబోతున్నారని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. గతంలో ఒకసారి ఈయనను పిలిపించుకుని ఢిల్లీలో మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో టీడీపీ కోసం ఈయన బీజేపీపై కారాలు, మిరియాలు నూరారు. కొంతకాలం రెండు పార్టీలు కలిస్తే ఏపీలో జగన్ ను ఇబ్బందిపెట్టవచ్చని అనుకున్నారు. ఆ దిశగానే పనిచేశారు. ఏపీ బీజేపీలోని ఒక నేతను ఈయన టీవీచానల్ లో డిబేట్ లోనే మరొకరు కొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. టీడీపీ నేతలు కొందరు బిజెపిలో చేరి కోవర్టులుగా వ్యవహరిస్తుంటారు. వారందరికి ఈయనే సలహాలు ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇలాంటి వ్యక్తిని జాతీయ స్థాయిలో హోం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కలవడమా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ✍️ ఆ తర్వాత కారణం ఏమో తెలియదు కాని అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు కావడంతో ఆ భేటీ అగిపోయింది. నిజమైన బీజేపీ నేతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడైనా కలుస్తారేమో తెలియదు. జేపీ నడ్డా తన పర్యటనలో ఆ జర్నలిస్టు ఇంటికి వెళ్లకపోవడం గమనించదగ్గ అంశమే అవుతుంది.అంతకుముందు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన అమిత్ షా మరో మీడియా అధిపతిని ఆయన ఫిలిం సిటీకి వెళ్లి కలుసుకుని మద్దతు కోరారు. అయినా ఆ మీడియా అంతగా పట్టించుకోలేదు. అది పూర్తి స్తాయిలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తోంది. కేసీఆర్ పాలన గురించి అద్భుతంగా పొగుడుతూ ఎడిటోరియల్ కూడా రాసింది. ఆ మీడియా అధిపతికి తన కారణాలు తనకు ఉండవచ్చు. కానీ అమిత్ షా ఆయన్ని కలవడం వల్ల బీజేపీకి ఒరిగే ప్రయోజనం ఏముంది?. ✍️ తెలంగాణలో బిజెపి పరిస్థితికి ఇది ఒక మచ్చుతునక కావొచ్చు. కర్నాటక ఎన్నికల ఓటమి తర్వాత తెలంగాణలో బీజేపీ అయోమయంలో పడిపోయింది. కారణం ఏమైనా దాని గ్రాఫ్ తగ్గుతున్న మాట వాస్తవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్ లో చేసిన విమర్శలు ఎలా ఉన్నా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవితను పలుమార్లు విచారించిన తీరు. ఆ తర్వాత పలువురు ఇతరులను అరెస్టు చేసినా, ఆమె జోలికి వెళ్లకపోవడంపై కాంగ్రెస్ పక్షం విమర్శిస్తుంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్లుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలికాలంలో బీజేపీపై విమర్శలు తగ్గించడం, కాంగ్రెస్పై దాడి పెంచడం చేస్తున్నారు. అంతేకాక దేశస్థాయిలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లకపోవడం, అదే టైమ్ లో కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంలో కొందరు మంత్రుల్ని కలవడం, చివరికి అమిత్ షా అప్పాయింట్మెంట్ పొందడం అందరి దృష్టిని ఆకర్షించాయి. కానీ, చివరి క్షణంలో అమిత్ షా తో భేటీ రద్దు అయింది. ✍️ మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా ఇప్పుడు కేంద్రాన్ని ఆయా డిమాండ్లపై కలవడంలో రాజకీయం కూడా ఉండొచ్చు. కానీ, రెండు పార్టీల అగ్రనేతల మధ్య ఏదో రాజీయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యాపించాయి. ఢిల్లీలో జాతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా.. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు చేస్తామని కేటీఆర్ చెప్పడం చిత్రంగానే అనిపిస్తుంది. కేటీఆర్ డిల్లీ టూర్ లో ఉన్నప్పుడే బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో డిల్లీలో అమిత్ షా, నడ్డాలు సమావేశం అయి పార్టీ వ్యవహారాలు చర్చించారు. కేటీఆర్ను కలవడం వల్ల బిజెపి గ్రాఫ్ మరింత పడిపోతుందని వారు స్పష్టం చేయడంతోనే షా రద్దు చేసుకున్నారని అంటున్నారు. తాము బిజెపితో కలిసిందే బిఆర్ఎస్ కు , ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా అయితే, వారితో కాంప్రమైజ్ అయితే తాము బిజెపిలో కొనసాగి ప్రయోజనం ఏమి ఉంటుందని వారు ప్రశ్నించారట. ✍️ ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. ఒకప్పుడు మంచి జోష్ వచ్చినా, ఇప్పుడు డల్ అవడంతో బీజేపీ పెద్దలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మళ్లీ నడ్డా, అమిత్ షాలు వచ్చి కేసీఆర్ను ఎంత ఘాటుగా విమర్శించినా గ్రాఫ్ పెరుగుతుందా అనేది అనుమానంగానే ఉంది. మొత్తం రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే.. తెలంగాణలో తాము గెలవలేకపోతే బీఆర్ఎస్ విజయం సాధించడం బెటరా? కాంగ్రెస్ గెలిస్తే లాభమా ? అనేది ఆలోచించుకుంటారు. కచ్చితంగా బీఆర్ఎస్ ఉండడం వల్ల తమకు వచ్చే నష్టం లేదని బీజేపీ వారు అనుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే దాని ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాలపై పడవచ్చు. అందువల్ల ఎన్నికల నాటికి బీజేపీ హడావుడి చేసినా, కాంగ్రెస్ గెలవకూడదనే కోరుకుంటుంది. అది బీఆర్ఎస్కు కలిసి వచ్చే పాయింట్ కావచ్చు. ✍️ ఎన్నికల సమయంలో ఆదాయపన్ను ,సిబిఐ , ఈడి వంటివాటిని ప్రయోగించకుండా ఉంటే బీఆర్ఎస్ కు ఇబ్బంది ఉండదు. కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై ఈడీ దాడులు చేసింది. అలాగే మెడికల్ కాలేజీలలో అక్రమాలపై దృష్టి సారించింది. అందులో బిఆర్ఎస్ కు బాగా దగ్గరగా ఉండే ప్రముఖులు కూడా ఉన్నారు. వారంతా ప్రస్తుతానికి మేనేజ్ చేసుకోగలిగారని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జోరు తగ్గిన బిజెపి ఆయా నియోజకవర్గాలలో కొత్త నేతలను ఇప్పటికైతే ఆకర్షించలేకపోతోంది. మాజీ ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లె కృష్ణారావు తదితరులు బిజెపి కన్నా కాంగ్రెస్ బెటర్ అనే భావనకు వచ్చారు. వారికోసం బిజెపి విఫల యత్నం చేసింది. ఈ నేపధ్యంలోనే ఈటెల రాజేందర్, రాజగోపాలరెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూడవచ్చన్న వార్తలు వస్తుండడంతో హైకమాండ్ అలర్ట్ అయింది. తెలంగాణ బిజెపి సీనియర్ నేతలలో ఉన్న విభేదాలు కూడా పార్టీని ఇరుకున పెడుతున్నాయి. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, మరో నేత డి.కె. అరుణ వంటివారు ఈ వాదనలను ఖండిస్తున్నా, బిఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకటేనని చెబుతున్నా, జనం సీరియస్ గా తీసుకోవడం లేదు. రాజగోపాలరెడ్డి ఆయా టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఎక్కువకాలం బిజెపిలో ఉండరేమోననిపిస్తుంది. రాజకీయాలు మొత్తం మారిపోవడానికి ఒక స్టెప్ చాలు అనడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో బిజెపి ఇలాంటి సందిగ్ద పరిస్థితిలోనే కొట్టుమిట్లాడుతోందని చెప్పాలి. ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
కన్ఫ్యూషన్ లో బీజేపీ
-
టీడీపీ అంతర్గత సమావేశం.. అంతా గందరగోళం
నెల్లూరు(టౌన్): జిల్లాలో నిర్వహించిన టీడీపీ అంతర్గత సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ ఘటన ఉదయమే చోటు చేసుకోవడంతో ఏ పరిస్థితికి దారి తీస్తుందోనని నేతలు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం నెల్లూరులోని ఎస్వీజీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జోన్–4కు సంబంధించి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల టీడీపీ క్లస్టర్, యూనిట్, మండల పార్టీ నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. దీనికి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు వచ్చారు. అయితే ఆయన అనుచరులకు అనుమతి లేదని రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఉండే వారు నిలిపివేశారు. దీంతో కోపోద్రిక్తుడైన కొమ్మి ఆత్మకూరు టీడీపీకి చెందిన కన్నబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అనుచరులకు అనుమతి లేకుండా వేరే వాళ్లను ఎలా పంపిస్తారని వాగ్వాదానికి దిగారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంచాలని కన్నబాబుకు ఇస్తే.. ఎక్కడా పంచకుండా దాచుకున్నాడని ఆరోపించారు. హైదరాబాద్లో ఉండి వ్యాపారాలు చేసుకుంటూ నెలకో, రెండు నెలలకో ఆత్మకూరుకు వచ్చే కన్నబాబుకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తారని దుర్భాషలాడారు. దీంతో కన్నబాబు అనుచరులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నాయకులు ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించారు. దీంతో అసంతృప్తికి లోనైన కొమ్మి సమావేశానికి చంద్రబాబు వచ్చిన తర్వాత కనిపించలేదు. ఇంకా భోజనాల దగ్గర మీడియా ప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. ఇంకా నెల్లూరు నగరం నుంచి రానున్న ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్న మాజీ మంత్రి నారాయణ ముఖ్యమైన సమావేశానికి హాజరుకాకపోవడాన్ని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో క్లస్టర్, యూనిట్ ఇన్చార్జి నుంచి ప్రతిస్పందన కరువైంది. -
కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్!
నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నైజమని టీడీపీలోనే ప్రచారముంది. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వారి కోసం సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీలో గందరగోళ పరిస్థితులకు చంద్రబాబు నిర్ణయాలే కారణమని అక్కడి నేతలు వాపోతున్నారు. ఇంతకీ సింహపురి రాజకీయాల్లో కలకలానికి కారణం ఏంటి? తెగేసి చెబుతున్నారట.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రాకను టీడీపీ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఇన్చార్జ్ అబ్దుల్ అజీజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. రూరల్లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి.. ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఏకంగా ముఖ్య నాయకుల్నే అజీజ్ ప్రశ్నించారట. అయితే వారు అజీజ్ను లైట్ తీసుకోవడంతో.. ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకువచ్చి అధిష్టానం తన గొంతు కోసిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారట. తమ మీద హత్యాయత్నం కేసులు పెట్టించి, బెదిరించిన కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలను అజీజ్ ప్రశ్నిస్తున్నారట. బాబు మంత్రాంగం అంటే అంతే సంగతి పార్టీ దారుణంగా ఓడిపోయినా నాలుగేళ్ల నుంచి రూరల్ లో పార్టీని బలోపేతం చేస్తున్న తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని ఎలా తీసుకుంటారని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇదే విషయాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పార్ఠీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర దగ్గర ప్రస్తావించారట. అయితే కోటంరెడ్డి సోదరుల రాక తమకు కూడా ఇష్టం లేదని వారు బదులివ్వడంతో అజీజ్ కు ఏం చెయ్యాలో అర్దం కాక సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. కోటంరెడ్డి అధికారాన్ని ఉపయోగించి.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి.. అజీజ్ వారికి అండగా నిలిచేవారు. కొంతకాలం క్రితమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీతో టచ్లోకి వెళ్లారు. వైసీపీ నుంచి టిక్కెట్ రాదని భావించిన ఆయన.. పచ్చ బ్యాచ్ తో చేతులు కలిపారు.. ప్రభుత్వం మీదే అనవసర విమర్శలు చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారని తేలడంతో శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పాపం.. బలిపశువు మరో నాలుగు నెలల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతారని.. ముందుగా తన తమ్ముడ్ని టీడీపీలోకి పంపారని రూరల్ లో చర్చ నడుస్తోంది. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే తనకు ఎమ్మెల్యే సీటు రాదని భావిస్తున్న అజీజ్.. అన్నదమ్ముల రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న తనకు మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట. గిరిధర్ రెడ్డికి సహాయ నిరాకరణ చేద్దామని.. తన అనుచరులతో చెబుతున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
తొలిరోజే ప్రయాణికులకు షాక్ ఇచ్చిన కువైట్ సమ్మర్ సర్వీస్
సాక్షి, గన్నవరం: విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్లు ప్రారభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కువైట్ సమ్మర్ ఎయిర్ఇండియా సర్వీస్ను బుధవారమే ప్రారంభమైంది. ఐతే తొలిరోజే కువైట్ సమ్మర్ సర్వీస్ ప్రయాణికులకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికులను వదిలేసి ముందే విమానం వెళ్లిపోవడంతో ఎయిర్పోర్ట్లో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఎయిర్ ఇండియా ఉదయం 9.55 నిమిషాలకు దాదాపు 67 మంది ప్రయాణికులుతో గన్నవరం నుంచి కువైట్కి బయల్దేరిపోయింది. అయితే ఫ్లైట్ వెళ్లిన కొద్ది నిమిషాలకు కువైట్కి వెళ్లేందుకు వచ్చిన సుమారు 20 మంది ప్రయాణికులు విషయం తెలుసుకుని ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. విమానం 1.10 నిమషాలకు వెళ్లాల్సి ఉండగా.. ముందుగా బయల్దేరడమేమిటని ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రశ్నించారు. అయితే సిబ్బంది మాత్రం విమానం ఉదయం 9.55 నిమిషాలకే బయల్దేరుతుందని మెసేజ్ పెట్టామంటున్నారు. ప్రయాణకులేమో మాకు ఎలాంటి మెసేజ్లు రాలేదంటూ ఎయిండ్ ఇండియా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ..గన్నవరం ఎయిర్పోర్టు వద్ద ఆందోళనకు దిగారు ప్రయాణికులు. కాగా, ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా దుబాయ్, కువైట్ల నుంచి గన్నవరం ఎయిర్పోర్టకి పూర్తిస్థాయిలో సర్వీస్లు నడిపేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎయిర్ ఇండియా ఈ కువైట్ సమ్మర్ సర్వీర్ని బుధవారం ప్రారంభించింది. ఈ సర్వీస్ను ఈరోజు నుంచి అక్టోబర్ చివరి వరకూ ప్రతి బుధవారం కువైట్కు ఎయిర్ ఇండియాను నడపనున్నారు. (చదవండి: 162 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు భర్తీ) -
గాల్లో గూఢచారులు: స్పై బెలూన్లు... కథా కమామిషు
ఓ బెలూన్ కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా గగనతలంపై 60 వేల అడుగుల ఎత్తున ఎగురుతూ కన్పించిన ఈ చైనా బెలూన్ కచ్చితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను భారీగా పెంచేసింది. అది కచ్చితంగా నిఘా బాపతేనని అమెరికా, వాతావరణ పరిశోధనలు చేస్తూ దారి తప్పిందని చైనా వాదిస్తున్నాయి. సైనిక రంగంలో నిఘా బెలూన్ల వాడకం ఈ ఉదంతంతో మరోసారి తెరపైకి వచ్చింది... ఈ కాలంలోనూ అవసరముందా? సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ఉపగ్రహాలు, డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ నిఘా బెలూన్లతో పనేమిటన్న సందేహాలు సహజం. కానీ ఇప్పటికీ మిలటరీలో ఈ బెలూన్లకు ఎంతో ప్రాధాన్యముంది. ఉపగ్రహాలతో పోలిస్తే వీటిని చాలా చౌకలో తయారు చేయొచ్చు. నిర్ధిష్ట గగన తలాలకు పంపడమూ ఎంతో సులభం. గాలివాటానికి అనుగుణంగా బెలూన్ల దిశను మార్చవచ్చు. అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లు సేకరించే సమాచారం, ఫొటోలు చాలా నాణ్యతతో ఉంటాయి. లక్షిత గగనతలాల్లో రోజుల తరబడి ప్రయాణించే సత్తా వీటికుంది. చైనా ప్రయోగం వెనక... అమెరికా, చైనా మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు, చైనాలో మానవహక్కుల నుంచి హాంగ్కాంగ్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం చేసే చర్యల దాకా తరచూ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటూనే ఉంది. కొంతకాలం క్రితం అప్పటి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శన నాటి నుంచీ విభేదాలు మరింత ముదిరాయి. చైనా 34 యుద్ధ విమానాలను,, 9 యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. ప్రతిగా తైవాన్ కూడా యుద్ధ విమానాల్ని సన్నద్ధం చేయడం, తైవాన్కు ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం ఉద్రిక్తతల్ని పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటనకు కొద్ది రోజుల ముందే చైనా నిఘా బెలూన్ ఇలా అమెరికా గగనతలంలోకి ప్రవేశించి కలకలం రేపింది. తద్వారా అగ్రరాజ్యానికి చైనా ఓ రకంగా హెచ్చరికలు పంపిందని భావిస్తున్నారు. ఎప్పట్నుంచి వాడుకలో ఉన్నాయి? ► ఈ బెలూన్లను ఫ్రెంచి విప్లవం కాలం నుంచే వాడుతున్నారు. యుద్ధ భూమిలో ఆస్ట్రియా, డచ్ సైనిక దళాల కదలికలు తెలుసుకునేందుకు 1794లో ఫ్రాన్స్ వీటిని తొలిసారి వాడింది. ► గాల్లో చాలా ఎత్తున ఎగిరే ఈ బెలూన్ల ద్వారా సమాచార సేకరణ తేలిక కావడంతో అమెరికా అంతర్యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వీటి వాడకం పెరిగింది. ► రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక అడుగు ముందుకేసి ప్రత్యర్థులపై ఈ బెలూన్లతో బాంబు దాడులకు దిగిన సందర్భాలూ ఉన్నాయి! జపాన్ సైన్యం ప్రయోగించిన బెలూన్ బాంబు అమెరికాలో ఒరెగాన్ వుడ్ల్యాండ్లో పడి ముగ్గురు పౌరులు మరణించారు. ► రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రాజెక్ట్ జెనెట్రిక్స్ పేరుతో అమెరికా ఈ బెలూన్లపై విస్తృతంగా ప్రయోగాలు చేసింది. 1950లో వీటి సాయంతో సోవియట్ భూభాగాన్ని ఫొటోలు తీసింది. ► అమెరికా ఆర్మీ ప్రాజెక్టు మొగల్ పేరుతో బెలూన్లకు మైక్రోఫోన్లను అమర్చి సోవియట్ యూనియన్ అణు పరీక్షలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసింది. ఏమిటీ నిఘా బెలూన్లు? నిఘా బెలూన్లను అత్యంత తేలికైన హీలియం వాయువుతో నింపుతారు. కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలు అమర్చుతారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు సుదూర ప్రాంతాల్లోని సమాచారాన్ని కూడా అత్యంత స్పష్టతతో సేకరించగలవు. ప్రయాణికుల విమానాలు 40 వేల అడుగుల ఎత్తు దాటవు. ఈ స్పై బెలూన్లు భూమికి 60 వేల నుంచి, లక్షా 50 వేల అడుగుల ఎత్తులో రోజుల తరబడి ప్రయాణించే సామర్థ్యం కలిగినవి. స్పై బెలూన్లు... కథా కమామిషు ► ప్రచ్ఛన్న యుద్ధ తొలినాళ్లలో వీటిని విరివిగా వాడారు ► అత్యంత ఎత్తుల్లో రాడార్లకూ చిక్కకుండా వెళ్లగలవు ► సౌర పలకలు ► నిఘా పరికరాలు ► గాలివాటంగా కదులుతాయి ► కిందివైపు కెమెరా ఉంటుంది ► రాడార్ వ్యవస్థలను అనుసంధానించవచ్చు ► 24వేల నుంచి 37వేల మీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం
-
టీడీపీలో ‘కరివేపాకులు’.. నమ్ముకున్నోళ్లనే ముంచేస్తున్నాడు మావా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో చంద్రబాబు పర్యటన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు భవిష్యత్పై అయోమయంలో పడ్డారు. తొలుత కందుకూరు, కావలి, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని ప్రకటించినా.. ఆఖరి క్షణంలో ఉదయగిరి పర్యటన వాయిదా వేసుకున్నారు. చివరాఖరుకు మూడు నియోజకవర్గాల్లో తిరిగినా.. వాటిల్లో ఫలానా అభ్యర్థి ఉంటారని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం, సీఎంను దూషించడం.. ఈ రెండింటి మీదే పర్యటన సాగింది. కోవూరు వరకు వచ్చిన చంద్రబాబు కూతవేటు దూరంలోని నెల్లూరులో ఉంటున్న నగర ఇన్చార్జిని కూడా పరామర్శించడానికి వెళ్లలేదు. టీడీపీలోకి పక్క పార్టీల్లోని సమర్థులైన నాయకులు రావాలని పిలుపునివ్వడం చూస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఆ పార్టీలో కింగ్లనుకునే అందరూ కరివేపాకులే అని సంకేతాలు ఇచ్చినట్లు అర్థమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరించింది. కందుకూరు సభలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కావలి, కోవూరు నియోజకవర్గాల్లో పర్యటించినా పార్టీ నేతల్లో జోష్ నింపలేకపోయారు. అధినేత పర్యటనకు ఆయా నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ఆశావహులు రూ.లక్షలు కుమ్మరించి భారీ ఫ్లెక్సీలతో హడావుడి చేశారు. అయితే అధినేత మాత్రం ఏ నియోజకవర్గంలో తన పార్టీ తరఫున ఫలానా నాయకుడు మీకు అండగా ఉంటారని, పోటీలో ఉండబోతారని ఎక్కడా చెప్పలేదు. కాగా పక్క పార్టీల్లో బలమైన, సమర్థులైన నేతలు టీడీపీలోకి రావాల్సిన అవసరం ఉందంటూ పిలుపునివడంతో ఇన్నాళ్లు పార్టీ కోసం పాకులాడుతున్న సీనియర్లు కంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. రేపటి ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసంతృప్తి జ్వాలలు.. వర్గ విభేదాలు చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత అడుగడుగునా ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి జ్వాలలు, వర్గ విభేదాలు రగిలాయి. కావలి నియోజకవర్గ ఇన్చార్జి కరివేపాకేనని స్పష్టమైంది. కావలిలో బీద రవిచంద్ర కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. పైకి మాత్రం కావలి తనకు వద్దంటూనే బీద గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డిని కాదని తన అనుచరుడిగా ఉన్న ఓ మండల స్థాయి లీడర్ సుబ్బానాయుడుకి ఏకంగా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించేలా చేశాడు. టీడీపీ హయాంలో సహజవనరులు దోచుకుని రూ.కోట్లు సంపాదించిన ఈ చోటా నేతతో చంద్రబాబు పర్యటనకు భారీగా ఖర్చు పెట్టించాడు. అయితే చంద్రబాబు సభలో కావలి అభ్యర్థి ఫలానా అని చెప్పకపోవడంతో సుబ్బానాయుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాడు. కోవూరులో పరిస్థితిలో మరోలా ఉంది. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి వర్గాల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. మొన్న జరిగిన చంద్రబాబు పర్యటనలో కూడా ఇరువురూ కలిసి పనిచేయలేదు. వేర్వేరుగా స్వాగతం పలికారు. కోవూరు సభలో మాత్రం పోలంరెడ్డి తనయుడు దినేష్రెడ్డి ప్రచార వాహనంలో ఉన్నాడు. కోవూరు టికెట్ తన కొడుక్కే దక్కుతుందని శ్రీనివాసులురెడ్డి ఇది వరకే కార్యకర్తలకు పరిచయం చేయడం, ఇంకా ప్రచార వాహనంలో బాబు పక్కనే ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక్కడ చేజర్ల కరివేపాకులా మారాడు. పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న ఆయనకు కనీసం ప్రచార వాహనంలో కూడా స్థానం ఇవ్వలేదు. కానీ చంద్రబాబు తమ అభ్యర్థిగా దినేష్ను పరిచయం కూడా చేయకపోవడం ఇరువర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఇకపోతే పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ కరివేపాకులా మారారనే చెప్పాలి. కోవూరు టికెట్ సాధించేందుకు రెండు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ముద్ర వేసుకుని పార్టీ కోసం కష్టపడుతున్న నాయకుడు. ప్రతి ఎన్నికల సమయంలో పెళ్లకూరుకు టికెట్ అంటూ ప్రచారం మాత్రం జోరుగా ఉంటుంది. చివరాఖరుకు ఇంకొకరు పోటీలో నిలబడతారు. ఒకానొక దశలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పేరు ఖరారు చేసి చివరి క్షణంలో ఆయన్ను తప్పించి వలస నేత అబ్దుల్ అజీజ్కు ఇచ్చారు. ఇలా ఎన్నోసార్లు పెళ్లకూరు మరో కరివేపాకు అయ్యాడు. చదవండి: నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పాలి‘ట్రిక్స్’ బలంగా వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీకి బలమైన పట్టు ఉన్న జిల్లాలో టీడీపీ ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడే పరిస్థితి నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థలు, తిరుపతి పార్లమెంట్, ఆత్మకూరు ఉప ఎన్నికల వరకు వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు సైకిల్ పంక్చరైంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేయక పోయినా బీజేపీకి లోపాయికారీ మద్దతు ఇచ్చినా వృథా అయింది. ఈ క్రమంలో జిల్లా పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా జిల్లాలో మూడు రో జుల పాటు పర్యటన చేసినా పార్టీలో జోష్ రాలేదు.. నేతల్లో అసంతృప్తి జ్వాలలను రగిల్చి వెళ్లాడు. ముఖం చాటేశారు పార్టీ కోసం చొక్కాలు చించుకుని పనిచేసిన టీడీపీ ముఖ్య నేతలకు సైతం చంద్రబాబు ముఖం చాటేశారు. టీడీపీ ముఖ్య నాయకుల్లో నెల్లూరు నగర నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఒకరు. ఇటీవల ఆయన ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమయ్యారు. మూడురోజులు జిల్లాలో ఉండీ.. నెల్లూరుకు కూతవేటు దూరంలోని కోవూరు వరకు వచ్చిన చంద్రబాబు కనీసం పరామర్శకు కూడా రాలేదు. బాబు పర్యటన షెడ్యూల్లో కోటంరెడ్డికి పరామర్శ కార్యక్రమం ఉన్నట్లు చూపించారు. అయితే రాకుండానే వెళ్లిపోయారంటే ముఖ్య నేతలకు చంద్రబాబు దగ్గర ఉన్న విలువెంతో అర్థమవుతోంది. జిల్లా పార్టీ నేతల ద్వారా కోటంరెడ్డి చంద్రబాబును తన ఇంటికి తీసుకురమ్మని శతవిధాలా ప్రయత్నాలు చేయించినా సక్సెస్ కాలేదు. ఆయన్ను బాబు కరివేపాకులా తీసేశాడని తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణకు సహకరించలేదనే లెక్కలు ఉండడంతో చంద్రబాబు ఆయన్ను పట్టించుకోలేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. -
తెలంగాణాలో కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి : జగ్గారెడ్డి
-
Russia-Ukraine War: పుతిన్ ‘తప్పు’టడుగులు
ఉక్రెయిన్పై దండయాత్ర రష్యా అధ్యక్షుడు పుతిన్ చారిత్రక తప్పిదమా ? ముందు వెనుక ఆలోచించకుండా యుద్ధానికి దిగి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారా? రష్యా సైన్యానికి వరస ఎదురు దెబ్బలు దేనికి సంకేతం ? 200 రోజులు దాటినా ఉక్రెయిన్పై పట్టు కోసం ఇంకా ఆపసోపాలు పడటానికి కారణాలేంటి ? ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడు నెలలు కావస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్ తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం మరింత పట్టుదలగా ముందుకు సాగుతూ ఉంటే, అపారమైన నష్టాన్ని చవి చూసిన రష్యా ఒకరకమైన గందరగోళంలో ఉంది. ఇటీవల ఖర్కీవ్లో ఉక్రెయిన్ సేన చేతిలో రష్యా ఓటమి ఆ దేశానికి గట్టి ఎదురు దెబ్బగా మారింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నా రష్యా ఇప్పట్లో యుద్ధానికి ముగింపు పలుకుందని భావించలేం. ఉక్రెయిన్లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుందని పుతిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ ఇటీవలే స్పష్టం చేశారు. తూర్పు డోన్బాస్ స్వాధీనమే తమ ముందున్న లక్ష్యమని, దాని సాధనకు తొందరేమీ లేదని తాజాగా షాంఘై సహకార సదస్సు సందర్భంగా పుతిన్ కూడా అన్నారు. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు. కానీ యుద్ధంలో రష్యా ఆత్మరక్షణలో పడిపోవడానికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్కు పశ్చిమదేశాల అండ అమెరికా సహా నాటో దేశాలన్నీ కలసికట్టుగా ఉక్రెయిన్కు ఇంతగా అండగా ఉంటాయని పుతిన్ ఊహించలేకపోయారు. యుద్ధం ఎన్నాళ్లు సాగినా సాయం కొనసాగించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తోంది. హిమార్స్ రాకెట్ వ్యవస్థతోనే ఉక్రెయిన్ సేనలు వందలాది రష్యన్ స్థావరాలను ధ్వంసం చేశారు. హౌటైజర్స్, స్విచ్బ్లేడ్ డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ ఆర్మర్ సిస్టమ్స్ ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి. అమెరికా తాజాగా 1500 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. దీంతో రష్యా పరోక్షంగా పశ్చిమ దేశాలతోనే యుద్ధం చేయాల్సి వస్తోంది. ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి ఉక్రెయిన్పై దాడులకి దిగితే అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా చమురు, గ్యాస్ కోసం తమపై ఆధారపడతాయని త్వరలోనే ఆంక్షలకి ముగింపు పలుకుతాయని పుతిన్ తప్పుగా అంచనా వేశారు. ఫిబ్రవరి నుంచి రష్యాపై 9,200కిపైగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వెయ్యికి పైగా మల్టీ నేషనల్ కంపెనీలు రష్యాను వీడాయి. ఆయుధాల ఉత్పత్తీ మందగించింది. దాంతో ఉత్తర కొరియా నుంచి కూడా ఆయుధాలు కొనుగోలుకు సిద్ధపడాల్సి వచ్చింది! రష్యాను ఆర్థికంగా చమురు, గ్యాస్ ఎగుమతులు మాత్రమే ఆదుకుంటున్నాయి. పుతిన్ మితిమీరిన ఆత్మవిశ్వాసం యుద్ధం చిటికెలో ముగుస్తుందనే భావనతో రంగంలోకి దిగిన పుతిన్కు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుద్ధాన్ని ముగిస్తే మంచిదన్న భావన రష్యాలో వివిధ వర్గాల్లో పెరుగుతోంది. ఆత్మవిశ్వాసం, అసహనం ఒకే నాణేనికి చెరోవైపు ఉంటాయన్న వాస్తవాన్ని పుతిన్ గ్రహించుకోలేకపోయారని బ్లూమ్బర్గ్ కాలమిస్ట్ లియోనిడ్ బెర్షిడ్స్కీ అన్నారు. కదనరంగంలో కిరాయి సైనికులు ఉక్రెయిన్లో కిరాయి సైనికుల్ని దింపడం పుతిన్ చేసిన మరో పెద్ద తప్పిదమంటున్నారు. వాగ్నర్ సంస్థతో పాటు పశ్చిమాసియా దేశాలకు చెందిన వారిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్పై నియమించుకున్నారు. రష్యా ఇలాంటివారిపై ఆధారపడగా, ఉక్రెయిన్ సైనికులు మాత్రం తమ దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో స్వచ్ఛందంగా యుద్ధరంగంలోకి దిగారు. కాంట్రాక్ట్ సైనికులకి తక్కువ జీతాలు ఇస్తూ ఉండడంతో వారు పూర్తి స్థాయిలో పోరాటపటిమను ప్రదర్శించడం లేదు. తమకు పరిచయం లేని భూభాగంలోకి వచ్చి పోరాడుతున్న రష్యా సైనికులు త్వరగా నిస్సత్తువకి లోనవుతూ ఉంటే, సొంతగడ్డపై స్థానికబలంతో పోరాడే ఉక్రెయిన్ సేనలు నిత్యం ఉత్సాహంగా ఉంటున్నాయి. దీంతో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి వెనక్కి తీసుకుంది. వ్యూహాత్మక తప్పిదాలు యుద్ధంలో రష్యా పలు వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేసింది. ఏప్రిల్లో కీవ్, ఉత్తర ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రతిఘటన ధాటికి రష్యా సేనలు వెనుదిరిగాయి. ఆ సమయంలో బలగాలను డోన్బాస్పైకి పంపడం వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయం వినబడుతోంది. ఇలా చేయడం వల్ల చిత్తశుద్ధితో రష్యా తరఫున పోరాడే సైనికుల్ని త్వరితగతిన దేశం కోల్పోయింది. ప్రస్తుతం కదనరంగంలో ఉన్న రష్యా సైనికుల్లో అంకితభావం కనిపించడం లేదు. ఎంత త్వరగా వెనక్కి వెళ్లి కుటుంబాలతో కలిసి గడుపుతామని వారు ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయోమయమా.. జట్టు రాలుతుందా..? అయితే ఈ కారణమే కావచ్చు..!
ఆరోగ్యకరమైన ఆహారం లేదా పోషకాల విషయానికి వస్తే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది ప్రోటీ న్లు, కాల్షియం లేదా విటమిన్లు. వీటిలో జింక్ ఒకటి. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. జింక్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది. అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం. మన శరీరానికి జింక్ చాలా అవసరం. రోగనిరోధక శక్తి, కణ విభజన, కణాల ఎదుగుదల, ప్రొటీన్లు, డీఎన్ఏ నిర్మాణం వంటి వాటికి దాదాపు 300 ఎంజైమ్లు అవసరం. ఆ ఎంజైమ్లను పనిచేసేలా చేయడం కోసం జింక్ అత్యవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో జింక్ లభిస్తుంది. శరీరం జింక్ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. మగవారికి రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం అయితే, మహిళలకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. అదే గర్భిణిలు, తల్లిపాలు ఇచ్చే మహిళలకు మాత్రం 12 మిల్లీ గ్రాములు అవసరం పడుతుంది. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి. బరువు తగ్గడం.. జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతో అనేక ఆరోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి. జుట్టు రాలిపోవడం.. జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు అధికంగా రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు. తరచూ జలుబు.. జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాని వల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు తగ్గుతుంది. చూపు మసక బారడం.. ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి కాబట్టి శరీరంలో జింక్ లోపిస్తే చూపు మసకబారుతుంది. గందరగోళం.. మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి. సంతానోత్పత్తిపై ప్రభావం.. జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనం.. శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. అయితే జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది కాబట్టి లోప నివారణకు సప్లిమెంట్లు తీసుకోక తప్పదు. ఇలా నివారించాలి.. జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లను తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు. -
పూడురు సర్పంచ్.. ఒకరోజు ఆమె, మరొకరోజు ఆయన.. ఏంటీ మాకీ కన్ఫ్యూజన్!
మండలంలోని మేజర్ పంచాయతీలలో పూడూర్ గ్రామ పంచాయతీ ఒకటి. పూడూర్ గోసాయిగూడ గ్రామాలు కలిపి పూడూర్ గ్రామ పంచాయతీగా ఉంది. అలాంటి పూడూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సీట్లో సస్పెన్షకు గురైన వ్యక్తి ఒకరోజు, ఉపసర్పంచ్గా అవిశ్వాసంతో ఉపసర్పంచ్ పదవి కోల్పోయిన వ్యక్తి మరొక రోజు సర్పంచ్ సీట్లో కూర్చుంటూ గ్రామస్తులను అయోమయంలో పడేస్తున్నారు. అధికారులు ఏ విషయం ఖచ్చితంగా తేల్చకపోవడంతో ఎవరికి వారే సర్పంచ్గా కొనసాగుతుండటం గమనార్హం. సాక్షి,మేడ్చల్: పూడూర్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా బాబుయాదవ్ను ప్రజలు ఎన్నుకున్నారు. అదే సమయంలో 7వ వార్డు నుంచి వార్డు సభ్యురాలిగా ఎన్నికైన జ్యోతిరెడ్డిని వార్డుసభ్యులు ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో అంతా సాఫీగా సాగింది. తదనంతరం మారిన రాజకీయ సమీకరణాలతో బాబుయాదవ్ టీఆర్ఎస్లో చేరారు. గత ఫిబ్రవరిలో బాబుయాదవ్ ఓ రియల్ ఎస్టెట్ వెంచర్ ఏర్పాటు వ్యవహారంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో జిల్లా అధికారులు బాబుయాదవ్ను సర్పంచ్ పదవి నుంచి తొలగించి ఉపసర్పంచ్ జ్యోతికి సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో జ్యోతిరెడ్డి కాంగ్రెస్ నుంచి మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అవిశ్వాసంలో పదవి కోల్పోయి.. తిరిగి ఇన్చార్జ్ సర్పంచ్గా బాధ్యతులు ఈ క్రమంలో వార్డు సభ్యులు ఉపసర్పంచ్ జ్యోతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అది నెగ్గడంతో ఉపసర్పంచ్ పదవి కోల్పోయింది. దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలు రెండు ఖాళీ కావడంతో ఒక వార్డుమెంబర్కు ఇన్చార్జ్ సర్పంచ్ బాధ్యతుల అప్పగించాల్సి ఉండగా.. తిరిగి 7వ వార్డు సభ్యురాలైన జ్యోతిరెడ్డి ఇన్చార్జ్ సర్పంచ్గా అధికారులు నియమించారు. కోర్టు ఆర్డర్తో సర్పంచ్గా బాబుయాదవ్.. రెండు నెలలు తర్వాత బెయిల్పై వచ్చిన బాబుయాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో బాబుయాదవ్ తిరిగి బాధ్యతలు తీసుకుని సర్పంచ్గా కొనసాగుతున్నారు. బాబుయాదవ్ కేవలం తప్పుడు పత్రాలతో ఎలాంటి అధికారిక పత్రాలు చూపెట్టకుండా సర్పంచ్ కుర్చీలో కూర్చుంటున్నాడని.. ఆయన సర్పంచ్గా ఉండటానికి అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని జ్యోతి తిరిగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుర్చీలో కూర్చుంటున్నారు. దీంతో పూడూర్ సర్పంచ్ ఎవరో తెలియక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. జాతరకు ముందే సర్పంచ్ ఎవరో తేల్చాలి.. గ్రామంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ, మైసమ్మ జాతరను వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ జాతర మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జాతర సాఫీగా జరగాలంటే గ్రామంలో సర్పంచ్ ఎవరో ముందుగా అధికారులు తేల్చాలి. లేకుంటే రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని స్థానిక నాయకులు అంటున్నారు. ఒత్తిళ్లతోనే ఆర్డర్ను ఆమోదించడం లేదా? దీనికి పుల్స్టాప్ పెట్టాలంటే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పూడూర్ సర్పంచ్గా బాబుయాదవ్ పేరును జిల్లా అధికారులు అధికారికంగా ప్రకటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోర్టు ఉత్తర్వులను జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే కోర్టు ఆర్డర్ను ఆమోదించడం లేదని అందరూ బాహాటంగానే అనుకుంటున్నారు. మరి దీనిపై జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి. నాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు బాబుయాదవ్ సస్పెన్షకు గురికావడంతో జిల్లా కలెక్టర్ నన్ను పూడూర్ ఇన్చార్జ్ సర్పంచ్గా నియమించారు. అధికారులు పదవి అప్పగిస్తే సర్పంచ్ సీట్లో కూర్చున్నాను. çబాబుయాదవ్ను తిరిగి సర్పంచ్గా నియమించినట్లు నాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ఆయన తానే సర్పంచ్ను అంటూ గ్రామస్తులు, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు – జ్యోతిరెడ్డి న్యాయస్థానం ఉత్తర్వుల అనుగుణంగానే.. జిల్లా కలెక్టర్ సర్పంచ్ పదవి నుంచి నన్ను తొలగించడంతో హైకోర్టును ఆశ్రయించాను. సర్పంచ్గా నన్నే కొనసాగించాలంటూ న్యాయస్థానాన్ని కోరాను. ఏప్రిల్ 11న ఇన్చార్జ్ సర్పంచ్ జ్యోతిని పదవి నుంచి తొలగిస్తూ నన్ను సర్పంచ్గా కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యాయస్థానం ఆర్డర్ కాపీలను జిల్లా కలెక్టర్, డీపీఓ, గ్రామస్థాయి అధికారులకు అందజేశాను. పిటిషన్లో జ్యోతిని సైతం పార్ట్ చేశాను. న్యాయస్థానం ఉత్తర్వుల అనుగుణంగానే.. అధికారుల ఆదేశానుసారమే నేను తిరిగి సర్పంచ్ బాధ్యతలు చేపట్టాను. స్వార్థ రాజకీయాలతో జ్యోతి వర్గీయులు గ్రామస్తులను తప్పుదోవ పట్టిస్తున్నారు. శుక్రవారం జ్యోతి సర్పంచ్ సీట్లో కూర్చోవంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. – బాబుయాదవ్ ప్రస్తుతానికి బాబుయాదవే సర్పంచ్ కోర్టు ఎవరిని ఉండమంటే వారే సర్పంచ్. పూడూర్ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి వివరణ కోరితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కొత్తగా అడుగుతారేంటి అక్కడ మొన్నటి వరకు ఎవరు ఉంటే వారే సర్పంచ్గా ఉంటారు. కోర్టు బాబుయాదవ్ను సర్పంచ్గా నియమించింది. ఆయనే సర్పంచ్గా కొనసాగుతారు. శుక్రవారం జ్యోతి సీట్లో కూర్చుంది కదా అని అడగగా తనకు తెలియదని... ఉదయం కూర్చుంటే కూర్చుండొచ్చు కాని ప్రస్తుతానికి బాబుయాదవే సర్పంచ్. – డీపీఓ రమణమూర్తి చదవండి: అయ్యో మౌనిక.. ప్రమాదం అని తెలియక మృత్యువు పక్కనే కూర్చున్నావా! -
త్రో వేయడంలో కన్ఫ్యూజన్.. అసలు మజా అక్కడే
లండన్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ తాజాగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. బంతిని త్రో వేయడంలో ఫీల్డర్లు కన్ఫ్యూజ్ కాగా బ్యాట్స్మెన్ మాత్రం రనౌట్ల నుంచి తప్పించుకుంటూ రన్స్ పూర్తి చేశారు. ఈ ఫన్నీ ఘటన యూరోపియన్ క్రికెట్ సిరీస్లో చోటుచేసుకుంది. వర్మ్డో సీసీ, స్టాక్హోమ్ సూపర్ కింగ్స్ మధ్య గురువారం లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో స్టాక్హోమ్ సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో వర్మ్డో బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్మన్ థర్డ్మన్ దిశగా ఫ్లిక్ చేశాడు. అయితే పరుగున వెళ్లిన కీపర్ క్యాచ్ను అందుకున్నట్లే అందుకొని జారవిడిచాడు. అప్పటికే ఒక పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ప్రయత్నించగా.. కీపర్ త్రో సరిగా వేయలేదు. అది ఓవర్ త్రో అవడం.. ఆ తర్వాత మరో ఫీల్డర్ త్రో సరిగ్గా వేసినా మరొక ఫీల్డర్ దానిని అడ్డుకొని రనౌట్ చేసే అవకాశాన్ని జారవిడిచాడు. అయితే అనతు వేసిన బంతి ఈసారి కూడా వికెట్లను తాకకుండా పక్కనుంచి వెళ్లిపోయింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ మాత్రం రెండు సార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొని 4 పరుగులు పూర్తి చేశారు. నాన్స్ట్రైకింగ్ ఎండ్లో ఒక ఆటగాడు బ్యాట్స్మెన్ను అవుట్ చేయడానికి నిలబడి ఉన్నా అతనికి ఒక్కసారి కూడా బంతి కరెక్ట్గా ఇవ్వకపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోనూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. ''ఎందుకో ఇది నాకు సరైన క్రికెట్లా అనిపిస్తుంది.. ఇలా ఆడితే వికెట్లు ఏం పడుతాయి ఎందుకు పడుతాయి'' అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. వాన్ షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వచ్చింది. కాగా ఇటీవలే భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సమయంలో తన చర్యలతో వాన్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైన తర్వాత పిచ్పై విమర్శలు కురిపిస్తూ నాలుగో టెస్టు మొదలయ్యే వరకు పిచ్కు సంబంధించి రోజుకో ఫోటో షేర్ చేస్తూ నవ్వులపాలయ్యాడు. భారత్ 3-1 తేడాతో సిరీస్ గెలిచిన తర్వాత కూడా వాన్ తన పంతాన్ని పక్కన బెట్టకుండా.. ఇండియా ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిస్తే తాను బెట్లు వేయడం మానుకుంటానని మరోసారి విమర్శలు చేశాడు. కాగా భారత్, ఇంగ్లండ్ల మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి 7 గంటకు అహ్మదాబాద్ వేదికగా మొదలుకానుంది. చదవండి: వైరల్: ధోని సిక్సర్ల వర్షం.. ఒక ఆటగాడు అలా ఔటవ్వడం ఇది ఏడోసారి Now this is proper cricket !!! pic.twitter.com/bhJ6rDLVAd — Michael Vaughan (@MichaelVaughan) March 10, 2021 -
తెలంగాణలో రెవెన్యూ తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. అవినీతిరహిత, పారదర్శక రెవెన్యూ లావాదేవీల కోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సర్కారు.. ఇప్పటి వరకు దాని అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయకపోవ డంతో అధికారుల ముందరి కాళ్లకు బంధం పడినట్టయింది. కొన్ని నిర్ణ యాల అమలుకు పాత చట్టాన్నే పరిగణ నలోకి తీసుకోవాలని చెబుతున్న ప్రభు త్వం.. మరికొన్నింటికి మాత్రం గత నెలలో ఆమోదముద్ర వేసిన భూ హక్కులు, పాస్పుస్తకాల చట్టం–2020(ఆర్వోఆర్) ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేస్తోంది. విధానపర నిర్ణయాల అమల్లో భాగంగా ఏకకాలంలో వేర్వేరు చట్టాలను అమలు చేయాలని భూ పరిపాలన శాఖ స్పష్టం చేస్తుండటం క్షేత్రస్థాయి అధికా రులను ఇరకాటంలో పడేస్తోంది. ఆర్వోఆర్ చట్టం–1971 స్థానంలో కొత్త చట్టానికి గత నెల 9న శాసనసభ ఆమోద ముద్ర వేసింది. అయితే కొత్త చట్టం మేరకు అధికారాలు, విధులు, బాధ్యతలపై ప్రభుత్వం ఇప్పటివరకు నియమావళి (రూల్స్)ని జారీ చేయలేదు. సాదాబైనామాలపై స్పష్టత ఏదీ? సాదాబైనామాల క్రమబద్ధీకరణకు పాత చట్టం ప్రకారమే నడుచుకోవాలని ప్రభు త్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం అధికారులను.. దరఖాస్తు దారులను అయోమయంలో పడేసింది. ప్రస్తుతానికి పాత చట్టమే మనుగడలో ఉన్నా.. కొత్త చట్టం అమలుపై నేడో, రేపో విధివిధా నాలు ఖరారైతే ఏ చట్టం ప్రకారం ముందుకెళ్లాలనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణను తిరస్కరిస్తే ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు సెక్షన్–5 (బీ) మేరకు అప్పీల్ చేసుకొనే వెసు లుబాటు అర్జీదారులకు ఉంటుంది. అయితే కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్, ఆర్డీవో, ఏసీల అధికారాలకు ప్రభుత్వం కోత పెట్టింది. రెవెన్యూ కోర్టులనూ రద్దు చేసింది. దీంతో సాదాబై నామాల అప్పీళ్లను విచారించే అవకాశం లేదు. ఎలాం టి వివాదమైనా సివిల్ కోర్టులను ఆశ్ర యించాల్సి ఉంటుంది. కొత్త యాక్ట్పై రూల్స్ వెల్లడించే వరకు పాత చట్టమే అమల్లో ఉం టుంది కనుక అధికారులు అభ్యంతరాలను ఎలా పరిష్కారిస్తారనే విషయమై స్పష్టత కొర వడింది. పాత చట్టం ప్రకారం ఒకవేళ వారు ఉత్తర్వులిచ్చినా కొత్త చట్టానికి అనుగుణంగా సవరణలతో ఉత్తర్వులు ఇవ్వకుండా పాత చట్టం మేరకు నడుచుకోవాలని అనడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. విధివిధానాల ఖరారులో జాప్యంతో రెవెన్యూ యంత్రాంగం డైలమాలో పడింది. పాత చట్టం ప్రకారం ముందుకెళ్లాలా లేక కొత్త చట్టం రూల్స్ వచ్చే వరకు వేచి చూడాలా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. సాదా బైనామాలకు మాత్రం పాత చట్టాన్ని వర్తిం పజేస్తూ జీవో విడుదల చేసిన భూ పరిపాలన శాఖ.. కొత్త చట్టంపై నియమావళి విడుదల చేసే వరకు ఎలాంటి నిర్ణయాలు (ఆర్డర్లు) వెల్లడించవద్దని ఆదేశించడం ఉన్నతా« దికారుల ద్వంద్వ విధానాలకు అద్దం పడుతోంది. ఆదాయ, కుల, నివాస ధ్రువ పత్రాల జారీ అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయిస్తున్నట్లు కొత్త చట్టంలో పొందుపరిచారు. అయితే ఇప్పటికీ వాటిని తహసీళ్లలోనే జారీ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు అధికారాలను సంక్రమింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వనందున జారీ తాము చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అదే ఇతరత్రా వ్యవహారాలకు వచ్చే సరికి కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ దాటవేస్తున్నారు. దరఖాస్తులకు మోక్షం ఎలా? కొత్త రెవెన్యూ చట్టం అంకురార్పణ జరిగిన మరుక్షణమే రెవెన్యూ కార్యాలయాల్లో పరిపాలనకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయ కూడదని ఆదేశాలివ్వడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రికార్డుల నిర్వహణ, కోర్టుల్లో వివాదాల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల్లో సమస్యల పరిష్కారం, అర్జీల పరిశీల న, భూముల సర్వే సబ్డివిజన్ అర్జీలు పెం డింగ్లో పడ్డాయి. రెవెన్యూ కేసుల జోలికి వెళ్లకూడదని.. ఏ వివాదమైనా కోర్టుల్లోనే తేల్చుకోవాలని కొత్త చట్టంలో స్పష్టం చేయ డంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. 38 (ఈ), లావణి, ఓఆర్సీ హక్కులను ధరణిలో ఎక్కించడానికి మార్గమేమిటో చెప్పకపోవడం... సవరణలకు అవ కాశం ఇవ్వక పోవడం ద్వారా ధరణిలో నమోౖ దెన తప్పుడు రికార్డులకే చట్టబద్ధత కల్పించడం సరికాదని రెవెన్యూ వర్గాలు అంటు న్నాయి. పైగా రెవెన్యూ కోర్టుల రద్దుతో సివిల్ కోర్టులకు వెళ్లాలన్నా.. కరోనా కారణంగా ప్రధాన కేసులు మినహా ఇతర కేసుల విచారణను కోర్టులు చేపట్టడం లేదని, కొత్త చట్టంపై స్పష్టమైన మార్గదర్శకాలు త్వరగా జారీ చేస్తే తప్ప ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
‘చైనాలో దేశీయ మెడికోల పరిస్థితి ప్రశ్నార్థకం’
ముంబై: దేశీయ విద్యార్థులు ఎక్కువగా చైనాలో విదేశీ విద్యను అభ్యసిస్తుంటారు. అయితే భారత్, చైనా దేశాల మద్య సరిహద్దు వివాదాల కారణంగా విదేశీ విద్యను అభ్యసిస్తున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సంవత్సరం చైనాకు వెళ్లకూడదని మెజారిటీ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఈ సమాచారాన్ని కన్సెల్టెన్సీలు ద్రువీకరిస్తున్నాయి. చైనాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల జాబితాలో భారత్ నాలుగవ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం చైనాకు వెళ్లవద్దని విద్యార్థులు నిర్ణయించుకున్నట్లు ఎడ్యూకేషన్ స్టార్టప్స్ కాలేజీఫై, యాకేట్ తదితర సంస్థలు అభిప్రాయపడ్డాయి. దేశంలోని 80నుంచి 90శాతం విద్యార్థులు చైనాలో విదేశీ విద్యను అభ్యసిస్తున్నారు. చైనాలో కేవలం రూ.20లక్షల లోపే విదేశీ విద్య పూర్తికావడంతో దేశీయ విద్యార్థలు చైనాలో చదవడానికి మక్కువ చూపుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పునరాలోచన చేస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు -
సడలింపులపై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, మున్సిపాలిటీల పరిధిలోని పరిశ్రమలకు కొన్ని షరతులతో లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపును ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రకటన వెలువడి ఐదు రోజులు కావస్తున్నా మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో పారిశ్రామికవర్గాల్లో అయోమయం నెలకొంది. పారిశ్రామిక పార్కుల్లో ఉన్న పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే మున్సిపాలిటీల పరిధిలోని పరిశ్రమలు జిల్లా పరిశ్రమల కేంద్రం వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో పారిశ్రామిక పార్కుల వెలుపల ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు డీఐసీలను సంప్రదిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పరిశ్రమలు నడుపుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాత పూర్వక అనుమతి ఇచ్చేది లేదని డీఐసీ అధికారులు చెప్తున్నారు. వాణిజ్య సంస్థలు తెరిస్తేనే! పరిశ్రమలు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు అనుమతి జారీ చేసినా, మరో కోణంలో ఇబ్బందులు తప్పవని పారిశ్రామికవర్గాలు అంటున్నాయి. పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలో రెడ్ జోన్ పరిధిలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లోనే ఉండటంతో రవాణా, కార్మికులు, ముడిసరుకుల సమస్య తలెత్తుతుందని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ పరిశ్రమ యజమాని చెప్పారు. పారిశ్రామిక ఉత్ప త్తుల మార్కెటింగ్ అంతా హైదరాబాద్లోనే కేంద్రీకృతం కావడంతో, ఉత్పత్తి చేసినా అమ్ముకునే పరిసి ్థతి లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. దుకాణాలు, వాణిజ్య సంస్థలు తెరుచుకుంటేనే ముడి సరుకులు రావడం, ఫినిషింగ్ గూడ్స్ మార్కెట్కు వెళ్లడం సాధ్యమవుతుందని చెప్తున్నారు. వెళ్లేందుకే వలస కార్మికుల మొగ్గు లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ పరిశ్రమలను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినా కార్మికుల కొరత తలెత్తే అవకాశముందనే ఆందోళన కూడా యాజమాన్యాల్లో కనిపిస్తోంది. తమ సంస్థలో బిహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన 20 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ప్రయాణానికి అనుమతిస్తే స్వస్థలాలకు వెళ్లేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడకు చెందిన ఓ పారిశ్రామికవేత్త వెల్లడించారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్తే మరో రెండు మూడు నెలల పాటు తిరిగి వచ్చే అవకాశం లేదని ఆందోళన వెలిబుచ్చారు. స్పష్టత కోసం ఎదురుచూపులు పరిశ్రమలపై ప్రభుత్వ మార్గదర్శకాల్లో స్పష్టత లోపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాతే అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. పరిశ్రమలతో పాటు దుకాణాలు, వాణిజ్య సంస్థలు తెరుచుకుంటేనే తిరిగి లావాదేవీలు పట్టాలెక్కుతాయని అటు అధికారులు, ఇటు పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాతే ఉత్పత్తి ప్రారంభించాలనే యోచనలో మెజారిటీ పరిశ్రమల యాజమాన్యాలు ఉన్నాయి. -
దరఖాస్తుపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్ ఉద్యోగాల నియామకాలపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గత నెల 14న ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో 19 ప్రిన్సిపాల్ పోస్టులకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న కొత్తగా ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మరో 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెలలో జారీ చేసిన నోటిఫికేషన్లోనే కొత్త పోస్టులను కలుపుతూ ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 34 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించేందుకు మార్చి 20 వరకు గడు వును నిర్దేశించింది. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటనే దానిపై బోర్డుకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. మొదటి నోటిఫికేషన్ ప్రకారం ఎస్సీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా ఎస్టీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవాలా అనే అం శంపై స్పష్టత లేక అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఆప్షన్లు మార్చుకుంటే సరి... గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్ ఉద్యోగాల దరఖాస్తుపై గురుకుల బోర్డు స్పష్టత ఇచ్చింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన యంత్రాంగం.. ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యాక ఆప్షన్లు మార్చుకోవాలని సూచిస్తూ వివరాలను గురుకుల బోర్డు వెబ్సైట్లో పొందుపర్చింది. మొత్తం 34 కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇందులో 5 పోస్టులు జనరల్ కాలేజీలు కాగా... మిగతా 29 మహిళా డిగ్రీ కాలేజీలు. -
‘మిర్యాల’లో ఆంధ్రా ఓటర్లు..!
సాక్షి, మిర్యాలగూడ : ఓటర్ల జాబితా తప్పుల తడకలుగా ఉన్నాయి. తప్పుడు అడ్రస్లతో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. కాగా అధికారులు కనీసం విచారణ కూడా చేయకుండా దరఖాస్తులు చేసుకున్న వారందరికీ ఓటు హక్కు కల్పించారు. దీనిలో భాగంగానే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి కూడా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఓటు హక్కు కల్పించారు. ఈ ఓట్లను గతంలో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మార్పులు, చేర్పులతో పాటు కొత్త ఓట్ల నమోదు సమయంలో చేర్పించారు. కానీ స్థానికులు వాటిని గుర్తించకపోవడం వల్ల అధికారులకు ఫిర్యాదులు చేయలేకపోయారు. కానీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆశావహులు ఓటర్ల జాబితాను పరిశీలించడంతో నకిలీ ఓట్లు బయటపడుతున్నాయి. మిర్యాలగూడ మున్సిపాలిటీలో గతంలో 36 వార్డులు ఉండగా ప్రస్తుతం వాటిని 48 వార్డులుగా విభజించారు. కాగా అన్ని వార్డుల్లో మొత్తం 88 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 85,709 మంది ఓటర్లు ఉన్నారు. ఒకే వార్డులో వందకు పైగా ఆంధ్రా ఓటర్లు మిర్యాలగూడ మున్సిపాలిటీలోని పునర్విభజన ప్రకారం చింతపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీని 22 వార్డుగా ఏర్పాటు చేశారు. కాగా అక్కడ 107, 108 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆ వార్డులో మొత్తం 1,650 ఓట్లు ఉన్నాయి. కాగా ఈ వార్డులోనే 170 ఓట్లు నకిలీ ఓట్లు నమోదయ్యాయి. వాటిలో వంద ఓట్లు పైగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారివి ఉండటం గమనార్హం. ఓటరు క్రమ సంఖ్య 550 నుంచి 587 వరకు ఆంధ్రా ప్రాంతం మాచర్లకు చెందిన వారి ఓట్లు ఉన్నాయి. అంతే కాకుండా ఒకే ఇంటినంబర్లలో పది మంది ఓట్లు, ఇంటికి బై నంబర్లు వేసి ఓటు హక్కు పొందారు. ఇందిరమ్మ కాలనీలో 34–364కు బై నంబర్లు వేసి ఓటర్లుగా నమోదు చేశారు. ఆర్డీఓకు స్థానికుల ఫిర్యాదు ఇందిరమ్మ కాలనీలోని 107, 108 పోలింగ్ స్టేషన్లలో సుమారుగా 170 ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయి. స్థానికేతరులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని స్థానికులు ఆర్డీఓ జగన్నాథరావుకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రా ప్రాంతం మాచర్లకు చెందిన వారి ఓట్లు ఉన్నాయని, అధికారులు విచారణ చేయకుండా ఓటు హక్కు కల్పించినట్లు ఆరోపించారు. కాగా స్థానికుల ఫిర్యాదు మేరకు ఇందిరమ్మ కాలనీలో విచార చేపట్టి నకిలీ ఓట్లు ఉంటే తొలగిస్తామని ఆర్డీఓ జగన్నాథరావు స్థానికులకు హామీ ఇచ్చారు. -
వార్డుల పునర్విభజన పై గందరగోళం
సాక్షి, పాలమూరు: మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన తీరుపై ప్రజలు, నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 2న విడుదలైన ముసాయిదా జాబితా సరిగాలేదని ఇప్పటికే చాలామంది అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారే పరిస్థితులను వివరిస్తున్నారు. సరిహద్దులు నిర్ణయించడంలో పొరపాటు చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార యంత్రాంగం చేసిన హడావుడితో జాబితా గజిబిజిగా తయారైంది. ఇష్టారీతిన వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టడంతో సవరించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఒకే క్రమ సంఖ్య ఇంటి నంబర్లను రెండు వార్డుల్లో కలపడంతో అవి ఏ కాలనీలకు వస్తాయో తెలియక స్థానికులు, పోటీ చేయాల్సిన ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ప్రక్రియ చేపట్టకపోవడం కారణంగానే సమస్యలు తలెత్తినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 49కి చేరిన వార్డుల సంఖ్య మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఇదివరకు ఉన్న 41 వార్డులను పునర్విభజన చేస్తూ 49 వార్డులకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 22 నుంచి 30 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల కులగణన చేపట్టారు. ఇది పూర్తయిన రోజు నుంచే వార్డుల పునర్విభజన చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఈనెల 2న జాబితా వెల్లడించాలని స్పష్టం చేయడంతో అధికారులు మున్సిపాలిటీ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, బిల్కలెక్టర్లకు బాధ్యతను అప్పగించారు. వీరు క్షేత్రస్థాయి కాలనీల్లో పర్యటించి వార్డుల వారీగా హద్దులు నిర్ణయించడం, ఓటర్ల వారీగా పునర్విభజన చేపట్టాల్సి ఉంటుంది. శాశ్వత నిర్మాణాలైన రోడ్లు, రైల్వేపట్టాలు, చెరువులు తదితర వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విభజన ప్రక్రియ సందర్భంగా ఇవి అడ్డుగా వస్తే అక్కడికే నిలిపివేయాల్సి ఉంటుంది. 2200 నుంచి 2700 వరకు ఒక వార్డుగా విభజించినప్పటికీ నిబంధనలు మాత్రం పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక వార్డులో ఓటర్లను కలపాల్సి వస్తే సమీపంలో ఉన్నవాటినే పరిగణనలోకి తీసుకోవాలి. కానీ వాటికి దూరంగా ఉన్న వాటిని కలిపేశారు. అధికారులు కార్యాలయంలో ముందుగా రూపొందించిన మ్యాప్లను పరిశీలించడం, ఇంటి నెంబర్ల వారీగా ఓటరు జాబితాలను తీసుకొపి వార్డులను ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో కచ్చితంగా పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్పడంతో హడావుడిగా ఈ ప్రక్రియ చేపట్టారు. ఫలితంగా జాబితా గజిబిజిగా మారేందుకు కారణమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు వార్డుల పునర్విభజన ప్రక్రియ గందరగోళంగా మారడంతో ప్రజలతో పాటు ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఇలా ఉండటం మూలంగా పూర్తి గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆయా కాలనీవాసులకు కూడా తాము ఏ వార్డు పరిధిలోకి వస్తామో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ వార్డుల విభజన ప్రక్రియ గందరగోళంగా ఉందని అధికార యంత్రాంగం తప్పిదాలను ఎత్తిచూపుతూ పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో పాటు పలువురు పట్టణవాసులు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారు పునర్విభజన ప్రక్రియపై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు 21ఫిర్యాదులు వచ్చాయి. అధికంగా పూజరితండా, పాత పాలమూరు, అప్పన్నపల్లి, పద్మవతికాలనీ, టిడిగుట్ట, షాషాబ్గుట్ట, పాలకొండ తదితర వార్డులు నుంచి అధికంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 13వ వార్డు పాత పాలమూరును విభజించి 16వ వార్డుగా, 23వ వార్డుగా ఏర్పాటు చేశారు. దాంట్లో పాత 13వ వార్డులో ఉన్న ఇంటి నెంబర్లు 5–10–1 నుంచి 5–10– 61/2 వరకు పాత పాలమూరుకు దూరంగా ఉన్న బండమీదిపల్లి, హన్మన్పుర వార్డుకు కలిపారు. అదేవిధంగా 5–10, 5–11, 5–12 బ్లాక్లతో పాటు పాత, కొత్త బాలాజీ నగర్ కలిపి 16వ వార్డుగా ఏర్పాటు చేయాలని గురువారం స్థానికులు మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అలాగే మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు చిన్నదర్పల్లి పరిధిలో ఉన్న పూజారితండాను తొలగిస్తూ 33వ వార్డులో కలుపుతున్నారని, ఆ తండాను గతంలో ఉన్న 34వ వార్డులోనే ఉండేవిధంగా చూడాలని మహబూబ్నగర్ మున్సిపాలిటీ కమిషనర్ సురేందర్కు ఆ వార్డుకు యువకులు వినతి పత్రం ఇచ్చారు. నిబంధనల ప్రకారం వార్డుల పునర్విభజన ఆయా వార్డుల సరిహద్దులను గుర్తిస్తూ ఓటర్లు, ఇంటి నంబర్ల ఆధారంగా విభజనచేయాల్సి ఉంటుంది. అయితే వార్డుల విభజన పూర్తిగా ఇంటి నంబర్ల ఆధారంగా చేపట్టడంతో భారీగా ఓటర్లు కన్పించకుండా పోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తాం వార్డుల విభజనపై అభ్యంతరాలు చెప్పడానికి శుక్రవారం వరకు సమయం ఉంది. ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తాం. స్థానికంగా ఉండే సమస్యలను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పరిశీలన చేస్తాం. ఓటర్లు, ఇంటి నెంబర్లు ఎవైనా తప్పుగా ఉంటే అభ్యంతరాలు చెప్పవచ్చు. –సురేందర్, కమిషనర్ -
చంద్రబాబు కేబినెట్ సమావేశం నిర్వహణపై గందరగోళం
-
వీడని ఉత్కంఠ!
సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎవరనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్యను ఖరారు చేస్తారా లేదా ఇతరులకు కేటాయిస్తారా అనే విషయంలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై కాంగ్రెస్ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి పి.రాములుకు కేటాయిస్తారనే చర్చ కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణకు కేవలం మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆ లోగానే అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులను ఎప్పుడు ఖరారు చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులను శనివారం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. శుక్రవారం జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థులు ఎవరనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిగా రాములు? శాసనసభ ఎన్నికల్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలకు గానూ ఆరు నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుని ఉత్సాహంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని కీలకంగా భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17ఎంపీ స్థానాలలో 16 స్థానా లు గెలవాలని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈనెల 9వ తేదీన వనపర్తిలో జరిగిన సన్నాహక సమావేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలకు దిశానిర్దే శం చేశారు. ఎలాగైనా నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గత మూడు పర్యాయాలుగా నాగర్కర్నూల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది లేదు. కానీ ఈసారి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొల్లాపూర్ మినహా మిగిలిన ఆరు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విజయం సాధించడం, అన్ని చోట్లా టీఆర్ఎస్ భారీ మెజార్టీ ఉండటం వంటి కారణాల నేపథ్యంలో ఈసారి నాగర్కర్నూల్ ఎంపీ స్థానం తమదేనన్న ధీమా ఆ పార్టీ నాయకత్వంలో వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నుంచి పలువురు టికెట్ ఆశిస్తున్నప్పటికీ మాజీ మంత్రి పి. రాములు పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. టీఆర్ఎస్ నేత మందా జగన్నాథం, గాయకుడు సాయిచంద్, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత శ్రీశైలం కూడా తమకు ఎంపీ టికెట్ కేటాయించా లని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థులపై కసరత్తు నాగర్కర్నూల్ స్థానంలో అత్యధిక సార్లు గెలిచిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లోనూ సరైన అభ్యర్థిని బరిలో ఉం చాలని కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం వద్ద జాబితా సిద్ధంగా ఉంద ని, అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుని శుక్రవారం జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థి ఎవరనేది ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్యకు అధిష్టానం మొగ్గుచూపుతోందని, ఒకవేళ ఆయన బరిలో లేకుంటే మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, సతీష్ మాదిగ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు, రేపు స్పష్టత కాంగ్రెస్ అభ్యర్థులను అధిష్టానం శనివారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి విడతలోనే నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో ఫోన్ ద్వారా సంప్రదించి లోక్సభ అభ్యర్థులు ఎవరు ఉండాలనే అంశంలో అభిప్రాయాలు సేకరించారు. ఈనేపథ్యంలోనే నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పి.రాములు పేరు దాదాపు ఖరారైందని వినిపిస్తోంది -
టీచర్ల పదోన్నతులు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులపై తీవ్ర గందరగోళం నెలకొంది. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో ఏకీకృత సర్వీసు రూల్స్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని స్పష్టమైంది. దీంతో పదోన్నతుల అంశాన్ని ఉపాధ్యాయ వర్గాలు తెరపైకి తెస్తున్నాయి. పదోన్నతి ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉండటంతో భర్తీ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ‘ఏకీకృతం’అంశం కోర్టు పరిధిలో ఉండటంతో పదో న్నతుల ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టు అంశాన్ని సాకుగా చూపుతూ బదిలీలే చేపట్టింది. కోర్టు తీర్పు తో స్పష్టత వచ్చినందున పదోన్నతులకు పాత పద్ధతే విద్యాశాఖ ముందున్న ఏకైక మార్గమని తెలుస్తోంది. పాత విధానంతోనే.. ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలంటే పార్లమెంటు చట్ట సవరణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటివరకు పదోన్నతులు చేపట్టకుంటే విద్యాశాఖలో మరింత ఆటుపోట్లు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఈవో, ఉపవిద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉండడంతో పాఠశాలల పర్యవేక్షణ అగమ్యగోచరంగా మారింది. ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నా అకడమిక్ కార్యక్రమాలు, పరిపాలన అంశాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. ‘ఏకీకృతం’విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పొస్తుందని భావించిన విద్యాశాఖ 4ఏళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టలేదు. తాజా హైకోర్టు తీర్పులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో పదోన్నతులకు పాత పద్ధతే విద్యాశాఖ ముందున్న ఏకైక మార్గమని తెలుస్తోంది. యాజమాన్యాల వారీగా స్థానిక సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులు చేపడితే సరిపోతుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెం ట్లు, జీహెచ్ఎం కేటగిరీ వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వ యాజమాన్య టీచర్లకు అనుకూలంగా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలనే అంశంపై మరోకేసు కోర్టు పరిధిలో ఉంది. దీంతో స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ హెడ్మాస్టర్ కేటగిరీల్లో పదోన్నతులు సులభతరమైనా ఎమ్ఈవో,డైట్ లెక్చరర్ తదితర పోస్టుల్లో చిక్కులు తప్పవని తెలుస్తోంది. -
ఏపీ బీజేపీ కమిటీ ఏర్పాటులో గందరగోళం
-
ఫెమినిస్ట్ని కాను
‘‘జెండర్ ఈక్వాలిటీని నమ్ముతాను. అంతే కానీ ఫెమినిస్ట్ (స్త్రీవాది) అని చెప్పుకోను’’ అంటున్నారు బాలీవుడ్ నటి కరీనా కపూర్. ఫెమినిజం అంటే స్త్రీ, పురుషుల సమానత్వం కోరుకోవడం అని అర్థం. కానీ ఈ మధ్య ఫెమినిజం అంటే మెన్ని హేట్ చేయడం అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘వీరి దే వెడ్డింగ్’. ఈ సినిమా ప్రమోషన్లో ఫెమినిజం గురించి కరీనా మాట్లాడుతూ – ‘‘నేను ఫెమినిస్ట్ అని చెప్పకోను. జెండర్ ఈక్వాలిటీ నమ్ముతాను. నేను ఓ ఉమెన్. దీనికంటే ముందు ఒక హ్యూమన్ బీయింగ్ని. కరీనా కపూర్గా గుర్తించినా, సైఫ్ భార్య అని సంభోదించినా ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. స్టైల్ కోసం ఫెమిసిస్ట్ అని చెప్పుకోవటం కంటే సగటు స్త్రీకి ఉపయోగపడే పనులు చేయడం ఇష్టం’’ అని పేర్కొన్నారు కరీనా. ‘వీరి దే వెడ్డింగ్’ జూన్ 1న విడుదల కానుంది. -
మళ్లీ మొదటికి..
గ్రామ పంచాయతీలకు ముందస్తు ఎన్నికల ప్రకటన నేపథ్యంలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపైనా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతమున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల విస్తరణకు సంబంధించి గతంలోనే టౌన్ ప్లానింగ్ విభాగం ప్రతిపాదనలు రూపొందించింది. తాజాగా దూరం ప్రాతిపదికన కాకుండా.. పట్టణీకరణ చెందుతున్న గ్రామాలను మాత్రమే మున్సిపాలిటీల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సంగారెడ్డి : జిల్లా కేంద్రంతో పాటు సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలు, అందోలు–జోగిపేట నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను విలీనం చేయాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఇటీవల ప్రతిపాదనలు రూపొందించింది. మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సంగారెడ్డి, సదాశివపేటలో ఏడేసి, జహీరాబాద్లో పది, అందోలు–జోగిపేట నగర పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ చొప్పున మొత్తం 25 పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రతిపాదిత విలీన గ్రామ పంచాయతీల తీర్మానం కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు 12 గ్రామ పంచాయతీలు తీర్మానం చేయగా.. అన్ని చోట్లా విలీనాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. మున్సిపాలిటీల్లో సమీప గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి.. మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేయాలని భావిస్తోంది. మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి దూరాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవద్దని తాజాగా ఆదేశించింది. మున్సిపాలిటీ సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి.. వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రామ పంచాయతీలను మాత్రమే విలీనం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించింది. కొత్తగా జనావాసాలు, వెంచర్ల ఏర్పాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉదాహరణకు గతంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో ఏడు గ్రామ పంచాయతీల విలీనాన్ని ప్రతిపాదించారు. తాజా ఆదేశాల ప్రకారం పట్టణీకరణ చెందుతున్న నాగాపూర్, మల్కాపూర్, పోతిరెడ్డిపల్లి, కందిగ్రామాలు మాత్రమే విలీనమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సమావేశం.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సరిహద్దుల విస్తరణ, కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది. ప్రత్యేక అధికారిగా నియమితులైన జాన్ ఎఫ్ కెన్నడీ శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల మున్సిపల్ అధికారులు, డీపీఓలతో సమావేశమయ్యారు. సోమవారం సిద్దిపేట జిల్లాకు చెందిన అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు, సరిహద్దు విస్తరణకు సంబంధించి ప్రతిపాదనల రూపకల్పనలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రత్యేక అధికారి సూచనలు చేస్తున్నారు. కాగా 20వేలకు పైబడిన జనాభా కలిగిన గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో అమీన్పూర్, బొల్లారం, నారాయణఖేడ్, కోహిర్, తెల్లాపూర్ పంచాయతీలకు నగర పంచాయతీ హోదా కోసం ప్రతిపాదనలు రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెల్లాపూర్, కోహిర్ జనాభా 15వేలకు మించడం లేదు. సమీప గ్రామ పంచాయతీలను విలీనం చేస్తే తప్ప ఈ రెండు పంచాయతీలకు నగర పంచాయతీ హోదా దక్కేలా లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిని ఆనుకుని ఉండడంతో అమీన్పూర్ (జనాభా 36,452)ను కూడా ప్రస్తుతానికి నగర పంచాయతీ హోదా ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. బొల్లారం, నారాయణఖేడ్ గ్రామ పంచాయతీలు మాత్రమే నగర పంచాయతీలుగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మళ్లీ మొదటికి! గ్రామ పంచాయతీ 2011 జనాభా సమీప గ్రామాలు కలిస్తే.. అమీన్పూర్ 36,452 44,132 బొల్లారం 34,667 36,480 నారాయణఖేడ్ 18,243 30,418 కోహిర్ 15,075 29,310 తెల్లాపూర్ 14,403 15,087 -
‘సీఏలకూ అంతుచిక్కడం లేదు’
సాక్షి,న్యూఢిల్లీ: జీఎస్టీపై గందరగోళం ఏ స్థాయిలో ఉందనేందుకు స్వయంగా మధ్యప్రదేశ్ బీజేపీ ఎంఎల్ఏ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. వివాదాస్పద జీఎస్టీ వ్యాపారులు, పన్ను నిపుణులే కాదు చివరికి సీఏలకూ అర్థం కావడం లేదని ఎంపీ బీజేపీ ఎంఎల్ఏ ఓం ప్రకాష్ దుర్వే అన్నారు. నూతన పన్ను వ్యవస్థను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. జీఎస్టీ ప్రస్తుతం ఎవరికీ అంతుచిక్కడం లేదని, ఒక్కసారి దీనిపై స్పష్టత వస్తే వ్యాపారులు సహా అందరూ ఊపిరిపీల్చుకుంటారని, పరిశ్రమకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఏడాది జులై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీపై సర్వత్రా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు జీఎస్టీని ఎలాంటి సన్నద్ధత లేకుండా తొందరపాటుగా ప్రవేశపెట్టారని కాంగ్రెస్ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. జీఎస్టీని అధికారులకు పూర్తి అధికారాలను ఇచ్చేలా, గత లైసెన్స్ రాజ్ వ్యవస్థను గుర్తుకుతెచ్చేలా ప్రవేశపెట్టారని నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు.ఇక జీఎస్టీని తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్గా అభివర్ణించిన విషయం తెలిసిందే. -
రసాభసగా కర్నూలు సర్వసభ్య సమావేశం
-
పీటముడి
హెచ్చెల్సీకి నీటి విడుదల సందిగ్ధం - నేడు టీబీ డ్యాం అధికారుల సమావేశం – జిల్లాలో పూర్తిగా అడుగంటిని తాగునీటి ప్రాజెక్టులు – ఎంపీఆర్, సీబీఆర్లో చుక్కనీరు కరువు – మరో 20 రోజుల్లో అడుగంటనున్న పీఏబీఆర్ – తీవ్రమవుతున్న తాగునీటి సమస్య సాక్షిప్రతినిధి, అనంతపురం: తాగునీటి ప్రాజెక్టులు అడుగంటినా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదా? ఎంపీఆర్, సీబీఆర్ తరహాలో పీఏబీఆర్లోనూ నీరు అడుగంటనుందా? ఇదే జరిగితే ‘అనంత’ తాగునీటి సంక్షోభంలో చిక్కుకోనుందా? తాజా పరిణాలు నిశితంగా పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. సాగునీరు పక్కనపెడితే కనీసం తాగునీటి విషయంలోనూ ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. తుంగభద్ర డ్యాంలో సరిపడా నీరున్నా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించడంలో ఘోరంగా విఫలమవడం విమర్శలకు తావిస్తోంది. హెచ్చెల్సీపై ఆధారపడి ‘సీమ’లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2.84లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే తుంగభద్ర బోర్డు మాత్రం 32.5టీఎంసీలలో ఏటా సగటున 22 టీఎంసీలు మాత్రమే కేటాయిస్తోంది. ఈ కేటాయింపులు కూడా సక్రమంగా అందడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. విడుదల చేసే నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి. ఈ క్రమంలో ‘అనంత’ సాగునీటి అవసరాలు తీర్చేందుకు టీబీడ్యాం నుంచి కేసీ కెనాల్(కర్నూలు–కడప కెనాల్)కు దక్కాల్సిన 10టీఎంసీలను హెచ్చెల్సీ ద్వారా మళ్లించేలా జీఓ జారీ చేశారు. దీంతో 42.5టీఎంసీలు హెచ్చెల్సీకి టీబీ బోర్డు కేటాయించాలి. ఈ కోటా నీళ్లు దక్కించుకునేలా ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. అయితే కేటాయింపులు సంగతి పక్కనపెడితే తాగునీటి అవసరాలకు కూడా నీరు తెప్పించలేకపోతుండటం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యంతోనే తాగునీటి సమస్య హెచ్చెల్సీపై ఆధారపడి పీఏబీఆర్, సీబీఆర్లతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమ్మర్స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. ఏటా జూలైలో టీబీ డ్యాంకు హెచ్చెల్సీ నుంచి నీరు విడుదల చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు ముగుస్తున్నా నీటి విడుదల ఊసే కరువయింది. దీంతో సీబీఆర్(చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లో పూర్తిగా నీరు అడుగంటింది. ఎంపీఆర్(మిడ్పెన్నార్డ్యాం)లో అదే పరిస్థితి. పీఏబీఆర్లో ఒక టీఎంసీలోపే నీరుంది. మరో 20–30రోజుల్లో ఈ నీరు అడుగంటనుంది. ఇప్పటికే సీబీఆర్ పరిధిలో ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు తాగునీటి సమస్య ఉత్పన్నమైంది. గతేడాది కంటే సమృద్ధిగానే డ్యాంలో నీటి నిల్వ గతేడాది ఈ సమయానికి టీబీ డ్యాంలో 52.703 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూలైలో ఐఏబీ సమావేశం నిర్వహించి 23.1 టీఎంసీలు కేటాయించారు. ఇందులో 8.5టీఎంసీలు తాగునీటికి, 14.6టీఎంసీలు సాగుకు కేటాయించారు. ప్రస్తుతం డ్యాంలో 53.775 టీఎంసీలు ఉండగా.. 4300 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా కనీసం తాగునీటికి కూడా నీటిని విడుదల చేయలేదు. మంత్రులు, జిల్లా యంత్రాంగం ఘోర వైఫల్యం ‘అనంత’కు తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్, హెచ్చెల్సీ ఎస్ఈ టీబీ బోర్డుకు కొద్దిరోజుల కిందట విజ్ఞప్తి చేశారు. అయితే బోర్డు అధికారులు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆధారపడి విడుదల చేస్తామని చెప్పారు. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టీబీబోర్డు అధికారులతో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత కూడా నీరు విడుదల చేయలేదు. కర్ణాటకలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది ఎలాగైనా కర్ణాటకలోని ఆయకట్టుకు నీరిచ్చి పంటలు పండించాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. అనంత తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేస్తే కర్ణాటక రైతులు చౌర్యానికి పాల్పడుతారని, అందుకే నీరు విడుదల చేయలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే సకాలంలో నీరు విడుదల చేయించడంలో ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు మంత్రులు కూడా ఘోర వైఫల్యం చెందారు. హెచ్చెల్సీపై ఆధారపడి 40వేల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. ఇందులో సింహభాగం మంత్రి కాలవ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోనే ఉంది. అయినప్పటికీ ఆయన స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 30న ఐఏబీ సమావేశం జరుగనుంది. ఆ సందర్భంగా నీటి విడుదల తేదీని ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా ఆదివారం టీబీ డ్యాం అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వచ్చే నెల 2న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
అయోమయంలో ‘దూర’ విద్యార్థులు
- అందని ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు - అధికారుల మధ్య సమన్వయలోపం ఎస్కేయూ : ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ జారీ విషయంలో సందిగ్ధం నెలకొనడంతో డిగ్రీ పూర్తి చేసి పీజీల్లో ప్రవేశించాలనుకొనే వర్సిటీ దూరవిద్య విభాగం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్కేయూ క్యాంపస్ కళాశాల, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుళకు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. అయితే ముఖ్యమైన టీసీ (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ) జారీ అంశంలో స్పష్టతలేదు. సమన్వయ లోపం.. డిగ్రీ , పీజీ (రెగ్యులర్), డిగ్రీ , పీజీ (దూరవిద్య) విభాగాలు గతంలో వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహించేవి. అప్పట్లోనే గందరగోళం ఉంది. కానీ ఈ రెండు విభాగాలకు ఒకే గూటికి చేర్చి ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ను నియమించారు. దూరవిద్య విభాగంలో అడ్మిషన్లకు ఒక డైరెక్టర్, పరీక్షలు నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాలు ప్రకటన అంశాలను ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్కు అప్పగించారు. ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం లోపించింది. ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ను ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అడిగితే దూరవిద్య డైరెక్టర్ వద్దకు వెళ్లాలని చెబుతున్నారని.. దూరవిద్య విభాగంలో వెళ్లి అడిగితే..పరీక్షలు నిర్వహించేది ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ కాబట్టి అక్కడే అడగాలని బదులుస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల ఇక్కట్లు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 14వేల మంది విద్యార్థులు డిగ్రీ ఫైనలియర్ ఉత్తీర్ణులయ్యారు. సింహభాగం డిగ్రీ సర్టిఫికెట్లు ఆయా అధ్యయన కేంద్రాలకు పంపారు. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు పంపకపోవడంతో విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ వివాదం తేలే వరకు ఎస్కేయూసెట్, ఇతర వర్సిటీలలో పీజీ అడ్మిషన్ పొందే విద్యార్థులకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిఫికెట్ల అంశంలో వెసులుబాటు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
పైసల్లేవ్.. పత్రాలు పెట్టుకోండి..
ఇన్పుట్, ఇన్సూరెన్స్ పంపిణీపై గందరగోళం 19 నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పత్రాలు రుణమాఫీ మాదిరిగానే అవుతుందంటూ అన్నదాతల్లో ఆగ్రహావేశాలు వ్యవసాయ శాఖ అధికారుల్లో గుబులు అనంతపురం అగ్రికల్చర్ : ‘పైసల్లేవు.. ప్రస్తుతానికి పత్రాలు పెట్టుకోండి.. పరిహారం ఇచ్చినప్పుడు తీసుకోండి’ అంటూ రైతులను మరోసారి మోసపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన రుణ ఉపశమన పత్రాల మాదిరిగానే ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ), వాతావరణ బీమాకు కూడా పత్రాలు ఇవ్వనుంది. ‘పెట్టుబడి రాయితీ మంజూరు పత్రాల’ పేరుతో వీటిని ఈ నెల 19 నుంచి రైతులకు పంపిణీ చేయనుంది. చేతిలో చిల్లిగవ్వ లేక ఖరీఫ్ పంటల సాగుకు దిక్కులు చూస్తున్న రైతులు.. ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇన్పుట్పై గందరగోళం తీవ్ర వర్షాభావం కారణంగా 2016 ఖరీఫ్లో 6.73 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసిన వేరుశనగతో పాటు ఇతర అన్ని రకాల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో పెట్టుబడి రాయితీ కింద 6,25,050 మంది రైతులకు రూ.1,032.42 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు ఈ నెల రెండు నుంచి పంపిణీ చేస్తామని మొదట తెలిపింది. ఆ తర్వాత 9వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి వేస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం 14 నుంచి పంపిణీ ఉంటుందని ఆశ పెట్టారు. ఇలా తేదీలన్నీ పోయినా పరిహారంపై ఏమీ తేల్చలేకపోయారు. ఈ నెల 9న రాయదుర్గంలో జరిగిన ఏరువాక పౌర్ణమి సభలో సీఎం చంద్రబాబు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన ‘మెగా చెక్కు’ విడుదల చేశారు. ఉన్నపళంగా ఇప్పుడు మంజూరు పత్రాలు ఇస్తామంటూ కొత్తపల్లవి అందుకోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇన్సూరెన్స్ను లాగేసుకుంటున్న ప్రభుత్వం హక్కుగా రావాల్సిన వాతావరణ బీమా పరిహారాన్ని రైతులకు నేరుగా ఇవ్వకుండా ప్రభుత్వం లాగేసుకుంటోంది. వేరుశనగ రైతులు గత ఏడాది పంట రుణాల రెన్యూవల్స్లో వాతావరణ బీమా పథకం కింద ప్రీమియం చెల్లించారు. తమ వాటాగా పంట రుణాల మొత్తంలో 2 శాతం ప్రీమియం అంటే మొత్తం రూ.56 కోట్లు చెల్లించారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా 8 శాతం జమ చేశాయి. అంటే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేసిన బజాజ్ అలయంజ్ కంపెనీకి ప్రీమియం రూపంలో రూ.280 కోట్ల వరకు జమ అయ్యింది. దెబ్బతిన్న పంటల విలువను బట్టి చూస్తే బీమా కింద రూ.2 వేల కోట్ల వరకు రావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ... నియమ నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా లెక్కకట్టిన బజాజ్ కంపెనీ అధికారులు 5.07 లక్షల మంది రైతులకు రూ.419 కోట్ల పరిహారం మంజూరు చేస్తున్నట్లు వారం రోజుల కిందట ప్రకటించారు. ఈ మొత్తమైనా ఇచ్చారా అంటే అదీ లేదు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని లాగేసుకుని ఇన్పుట్ సబ్సిడీకి లింకు పెట్టి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చేది రూ.60 కోట్లే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్కు లింకు పెట్టి వ్యవహారం నడుపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం, బజాజ్ కంపెనీ ఇచ్చేది పోనూ రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.60 కోట్లకు మించి ఉండదంటున్నారు. ఇవన్నీ పక్కనపెట్టి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రూపంలో పెద్ద మొత్తంలో ఇచ్చి ఆదుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. నిధులు విడుదల చేయకుండానే పెట్టుబడి రాయితీ మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. -
ఇదేం ‘పరీక్ష’ !
బీసీ గురుకుల గెస్ట్టీచర్ల స్క్రీనింగ్ టెస్ట్లో గందరగోళం సకాలంలో అందని ప్రశ్నపత్రాలు సెంటర్ల మార్పుతో ఉరుకులు పరుగులు భగీరథ కాలనీ(మహబూబ్నగర్): బీసీ గురుకుల గెస్ట్ టీచర్ల స్క్రీనింగ్ టెస్ట్లో శుక్రవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలోని మంజూరైన 12 బీసీ గురుకులాలతోపాటు గతంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో గెస్ట్ టీచర్లను భర్తీ చేసేందుకు నిర్ణయించారు. దీంతో సబ్జెక్టు వారీగా భర్తీ చేసేందుకు మహత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయల సంస్థ శుక్రవారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. నాలుగు జిల్లాల పరిధిలో సుమారు 2,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 10 సెంటర్లలో పరీక్ష నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షను నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే, ప్రశ్నపత్రాలు అందకపోవడంతో 11.30 గంటలు దాటినా ప్రారంభించలేదు. స్థానికన్యూరిషి విద్యాలయంలోని పరీక్ష సెంటర్కు మధ్యాహ్నం 12.00 గంటల వరకు ప్రశ్నపత్రాలు అందకపోవడంతో అభ్యర్థులు టెస్ట్ను రాయలేకపోయారు. హాల్టికెట్లలో తప్పులు దొర్లడంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రాల చుట్టూ ఉరుకులు పరుగులు తీశారు. దీంతో దాదాపు 300 మంది అభ్యర్థులు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ను ముట్టడించారు. జేసీ హామీతో అభ్యర్థులు ఆందోళన విరమించారు. -
ఆద్యంతం గందరగోళం
- టీడీపీ నేతల్లో లోపించిన ఐక్యత - జిల్లా మహానాడులో ఎవరికివారు యమునా తీరే - సోమిశెట్టికి అధ్యక్ష పదవి ప్రకటన వాయిదా కర్నూలు: మాసమసీదు సమీపంలోని ఎంఆర్సీ ఫంక్షన్ హాలులో బుధవారం... టీడీపీ జిల్లా మహానాడు కార్యక్రమం ఆద్యంతం గందరగోళంగా నడిచింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వర్ల రామయ్య, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, పార్టీ పరిశీలకులు గోవర్ధన్రెడ్డి అతిథిలుగా హజరయ్యారు. ముందుగా పార్టీ జెండావిష్కరణ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు నివాళి, సంతాప తీర్మానం అనంతరం సభ ప్రారంభమైంది. హాజరైన నేతలంతా ప్రసంగించిన వెంటనే పెళ్లిళ్లు, సొంత పనులంటూ ఎవరికి వారుగా వెళ్లిపోయారు. పాస్పోర్టు కోసం హైదరాబాద్కు వెళ్తున్నానంటూ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమంలో హాజరు కావాల్సి ఉన్నందున కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ప్రసంగించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. టీడీపీ కార్యకర్తలకు రూ.10 లక్షలలోపు నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చే విధంగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారని ఆదోని నియోజకవర్గ ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు తెలిపారు. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించకపోవడంతో పార్టీ చెడ్డపేరు వస్తోందన్నారు. జిల్లాలో ఉర్దూ కళాశాలలు లేకుండానే ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ చైర్మెన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, జయ నాగేశ్వర్రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్లు వీరభద్రగౌడ్, తిక్కారెడ్డి, బీటీ నాయుడు, మాండ్ర శివానందరెడ్డి, లబ్బి వెంకటస్వామి, డి.విష్ణువర్థన్రెడ్డి, తిక్కారెడ్డి, కేడీసీసీ చైర్మెన్ మల్లికార్జునరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు యాదవ్, మాజీ ఎమ్మెల్సీలు మసాల పద్మజ, సుధాకర్బాబు, టీడీపీ క్రమశిక్షణ సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర మహానాడుకు తీర్మానాలను ప్రతిపాదించారు. సోమిశెట్టికి అధ్యక్ష పదవి ప్రకటన వాయిదా... ఇన్చార్జిమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆదేశాల మేరకు చివరి నిమిషంలో శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన జిల్లా మహానాడు నిర్వహించారు. జిల్లా నాయకులంతా కలిసి ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్ష పదవికి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరును ప్రతిపాదించి అధిష్టానంకు పంపినప్పటికీ ప్రకటన వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షుల పేర్లు చంద్రబాబు ప్రకటించనున్నారని అందువల్ల సోమిశెట్టి పేరు ప్రకటించడం వాయిదా వేసినట్లు చక్రపాణిరెడ్డి ప్రకటించారు. -
ఎన్ఎస్జీ సదస్సులో భారత్కు అవకాశం?
-
సమ్మెటివ్ పోటు
వార్షిక పరీక్షల మూల్యాంకనంపై గందరగోళం ట్రిపుల్ఆర్ అమలుకు సమయమేది అసంబద్ధ విధానాలతో అస్తవ్యస్తం ఏలూరు సిటీ : సర్కారు బడుల్లో అమలు చేస్తున్న నూతన విధానాలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. కొత్త ప్రణాళికలు పాఠశాలలో విద్యను అభివృద్ధి చేయడానికి బదులు నిర్వీర్యం చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ), సమ్మెటివ్3 (వార్షిక) పరీక్షలు కొత్త ఇబ్బందులు తెస్తున్నాయి. పబ్లిక్ పరీక్షల తరహాలో 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మెటివ్ పరీక్షలు వారి పాలిట సమ్మెట పోటులా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూల్యాంకన ఎలా.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏకరీతిలో అమలు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనపై గందరగోళం నెలకొంది. 8, 9వ తరగతుల విద్యార్థుల జవాబు పత్రాలను మండల కేంద్రాల్లో మూల్యాంకన చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఒక్కో మండలం పరిధిలో సుమారు 5 వేల జవాబు పత్రాలు ఉంటాయి. వీటి మూల్యాంకన విధులకు 8 కిలోమీటర్ల దూరంలోని ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. నిబంధనల మేరకు 8 కిలోమీటర్ల పైబడి దూరంలోని ఉపాధ్యాయులను మూల్యాంకన విధులకు వినియోగిస్తే వారికి టీఏ, డీఏ చెల్లించాలి. ఈ సొమ్ములు ఎలా ఇస్తారు, ఉపాధ్యాయుల నియామకాలు ఎలా చేపడతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. త్రిపుల్ ఆర్ సాధ్యమా..! నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో భాగంగా ఉన్నత పాఠశాలల్లో సమ్మెటివ్ పరీక్షలు నిర్వహించి, మూల్యాంకన చేసి విద్యార్థులను పై తరగతుల్లోకి పంపించి ఆ పాఠాలు బోధించాలని నూతన విద్యావిధానంలో పొందుపరిచారు. ప్రాథమిక పాఠశాలల్లో చదవటం, రాయటం, అర్థ గణితం (ట్రిపుల్ ఆర్) విధానాన్ని, ఉన్నత పాఠశాలల్లో ప్రతిక్రియాత్మక బోధన (రెమీడియల్ టీచింగ్) విధానాన్ని తెరపైకి తెచ్చారు. సమ్మెటివ్3 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మంగళవారం నుంచి పాఠశాలల్లో తరగతులు ప్రారంభం అవుతాయి. వేసవి సెలవులు ఇచ్చే వరకు 18 రోజులపాటు పాఠశాలలు పని చేస్తాయి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి సబ్జెక్టు టీచర్లు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధులకు వెళతారు. ఈలోగా సమ్మెటివ్3 పరీక్షలకు సంబంధించి 8, 9 తరగతుల జవాబు పత్రాల మూల్యాంకన విధులకు మరికొందరు ఉపాధ్యాయులు వెళ్తారు. ఏప్రిల్ 12 నుంచి ఓపెన్ స్కూల్స్ పరీక్షల విధులకు ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా వెళతారు. దీనివల్లో ఉపాధ్యాయులు లేక పాఠశాలలన్నీ ఖాళీ అవుతాయి. ఈ పరిస్థితుల్లో ట్రిపుల్ ఆర్, రెమీడియల్ టీచింగ్ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారో సందేహంగా మారింది. లోపభూయిష్ట విధానాలు ప్రభుత్వం అమలు సాధ్యం కాని.. లోపభూయిష్ట విధానాలతో ప్రభుత్వ విద్యను గందరగోళంలోకి నెడుతోంది. కొత్త విద్యా విధానంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందే పరిస్థితులు కనిపించటం లేదు. ముందుగా పరీక్షలు నిర్వహించి, మళ్లీ తరగతులు పెట్టారు. ఉపాధ్యాయులను మూల్యాంకన విధుల్లోకి పంపితే పిల్లలకు చదువులు ఎవరు చెబుతారు. సమ్మెటివ్ పరీక్షల మూల్యాంకన వి«ధులకు హాజరైన 8 కిలోమీటర్లలోపు టీచర్లకు టీఏ, డీఏ ఇస్తారా. గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్1938 జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఆ ఘర్షణ
ప్రేమ అనుకుని ఆకర్షణలో పడింది... ఆకర్షణ అని తెలిశాక ఘర్షణలో పడింది. ప్రేమకు ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఉంటాయని తెలుసుకోలేకపోయింది! వన్వేలు, టూవేలు ఉంటాయని కూడా తెలుసుకోలేకపోయింది. ప్రేమ ఒక్కోసారి సడన్గా పుడుతుంది... love ఎట్ ఫస్ట్ సైట్. ఒక్కోసారి మెల్లగా పుడుతుంది... పరిచయం పెరిగాక. తరచు ప్రేమ ఆకర్షణ నుంచి పుడుతుంది. ఇది చాలా కన్ఫ్యూజన్ను పుట్టిస్తుంది. ఘర్షణను పెంచుతుంది. ద్వేషాన్ని పోషిస్తుంది. ఆ ఘర్షణ నుంచి.. ఆఘర్షణ నుంచి బయటపడేసే కథనమే ఇది. ‘‘నేహా, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్! నీ తెలివంతా నా దగ్గర చూపించకు..’ సౌరభ్ మాటలకు ఓ క్షణం బిత్తరపోయింది నేహ. ‘‘ఏంటీ, నీ దగ్గర తెలివి చూపించానా! అంత తెలివి ఉన్నదాన్నయితే ఇన్నాళ్లు నీ వెంట ఎందుకు తిరుగుతాను?’’ అంతే విసురుగా సమాధానమిచ్చింది నేహ. ‘‘ఇక డిస్కషన్స్ అనవసరం. ఎవరిదారి వాళ్లది. బై..’’ అని చెప్పేసి అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు సౌరభ్. ఆ మాటలతో నేహలో రోషం, ఆ వెంటనే దుఃఖం ఒకేసారి ముంచుకొచ్చేశాయి. ‘వీడ్ని ప్రేమించినందుకు తగినశాస్తి జరిగింది. బాధ్యత తెలిసినవాడనుకున్నాను. కానీ, వీడూ ఓ అవకాశవాది. ఆ అనూ ఉందిగా! అదొచ్చాకే నేను ‘వేస్ట్’ అయిపోయాను. చూస్తాను నన్ను కాదనుకొని ఎలా ఆనందంగా ఉంటారో.. ’ కోపంగా పళ్లునూరింది నేహ. ‘‘నేహ ఎంత అమాయకంగా ఉండేదిరా... ఎంత ఇష్టపడ్డాను తనను. ఇప్పుడు నన్నే అన్ని మాటలంటుందా? ఎంత హెల్ప్ చేశాను తనకి. కనీస కృతజ్ఞత కూడా లేదు .. ఛీ. చీ..’’ ఫ్రెండ్ దగ్గర వాపోయాడు సౌరభ్. దారి మళ్ళిన ఆకర్షణ ‘‘నేహ ఒంటరిగా గదిలోనే ఉంటోంది. కాలేజీకి వెళ్లమంటే వెళ్లనంటోంది. ఏమైనా అడిగితే ఏం లేదు అని తప్పించుకుంటోంది. మునుపటి సరదా లేదు తనలో... దాన్ని చూస్తుంటే మాకు భయమేస్తోందమ్మా. దాని బాగుకోరేదానివైతే ఏమైందో చెప్పు..?’’ బతిమాలుతూ వేదను ఫోన్లో అడిగింది నేహ తల్లి వనజ. నేహ స్నేహితురాలు వేద. ఇద్దరూ బి.టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.‘‘ఏంలేదాంటీ.. ఇంటికి వచ్చి కలుస్తాను’’ అని, నేహ దగ్గరకు వచ్చింది వేద. ‘‘ఆ సౌరభ్ అంతు చూడనిదే నేనేపనీ చేయలేను వేదా, ఎవరి మొహం చూడలేను’’ అంది నేహ. ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. వాణ్ణి చంపనైనా చంపుతాను కానీ, సంతోషంగా ఉండనివ్వను’’ కోపంతో ఊగిపోతూ అంటున్న నేహను చూస్తే భయమేసింది వేదకు. అనుకున్నంతా అయ్యింది. ముందునుంచీ చెబుతూనే ఉంది. కానీ, నేహ వినలేదు. ఇప్పుడు సమస్య తన చేయి దాటిపోయింది. మెల్లగా అక్కణ్ణుంచి వచ్చిన వేద.. నేహ తల్లితో సౌరభ్–నేహల ప్రేమ విషయమంతా చెప్పింది. ‘‘భయపడి ఇన్నాళ్లూ మీకీ విషయం చెప్పలేకపోయానాంటీ. కానీ, నేహ ఏం చేసుకుంటుందో అని భయమేస్తోంది’’ అని భయం భయంగా చెప్పింది వేద. వనజ షాక్ అయ్యింది. వెలుతురువైపు పయనం ‘‘నేహా, ఇది మీ జీవిత సమస్య. ఏం జరిగిందో మీరు వివరించనక్కర్లేదు. అవగాహన కలిగేందుకు ఈ థెరపీ మీకు ఉపయోగపడుతుంది. ఇందుకు మీరు సిద్ధమైతేనే..’’ కౌన్సెలర్ మాటలకు సిద్దమేనన్నట్టుగా తలూపింది నేహ. భార్య ద్వారా కూతురి పరిస్థితి తెలిసిన ప్రభాకర్ ఆమె జీవితాన్ని చక్కదిద్దడానికి ఈ థెరపీ సాయపడుతుందనే ఆశతో కౌన్సెలర్ దగ్గరకు తీసుకొచ్చాడు. థెరపీ మొదలైంది. ఆ థెరపీలో నేహతో పాటు తల్లీ తండ్రీ పాల్గొన్నారు. కౌన్సెలర్ సూచనలు నేహకు అందుతున్నాయి. ఆ తర్వాత 5–10–15 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఆ మౌనాన్ని ఛేదిస్తూ ‘‘నేహా, మీ అంతర్నేత్రంలో మీ కాలేజీని దర్శించండి. మీకు ఎదురైన అనుభవాలను తెలియజేస్తూ ఉండండి..’ అన్నారు కౌన్సెలర్. నేహ చెప్పడం మొదలుపెట్టింది... ‘‘నేను బి.టెక్లో చేరిన మొదటిరోజు. చాలా ఆనందంగా ఉంది. అక్కడే వేద పరిచయం అయ్యింది. ఫ్రెండ్స్తో రోజులు చాలా సరదాగా గడిచిపోతున్నాయి. మేమొక పార్టీకి వెళ్లాం. అక్కడ ఒకతను చాలా డీసెంట్గా కనిపించాడు. అతని పేరు సౌరభ్ అని తెలిసింది. మా క్లాస్మేట్కి ఫ్రెండ్ అట. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ డిగ్రీ చదువుతున్నాడని తెలిసి ఆశ్చర్యమేసింది. ఫ్యామిలీ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ. నాకతని బిõß వియర్ బాగా నచ్చింది. ఆ తర్వాత మేం మళ్లీ మళ్లీ కలుసుకున్నాం. సౌరభ్ నన్ను చాలా అపురూపంగా, చిన్నపిల్లలా చూసుకునేవాడు. నాకు సౌరభ్ అంటే చాలా ఇష్టం. నేనంటే సౌరభ్కు అంతే ఇష్టం’’ నేహ చెబుతూనే ఉంది. వనజ, ప్రభాకర్లు ఆశ్చర్యపోతూనే నేహ చెబుతున్నది వింటున్నారు. వెలుగు చూసిన నిజాలు ‘‘రెండేళ్లు మేం చాలా ఆనందంగా ఉన్నాం. ఎన్నో చోట్లకు తిరిగాం. ఎంత సంతోషంగా ఉన్నామో.. కానీ ఇప్పుడు ... ’’ అని చెబుతూనే నేహ ఏడ్వడం మొదలుపెట్టింది. వనజ, ప్రభాకర్ తల్లడిల్లిపోయారు. సైగలతోనే వారిని వారించిన కౌన్సెలర్ నేహ కన్నీళ్లు ఆగేంతవరకు ఎదురుచూశారు. ‘‘ఇప్పుడు ఏం జరిగింది నేహ... ఎందుకు మీరింత బాధ పడుతున్నారు’’ అడిగారు కౌన్సెలర్. ‘‘నేనంటే సౌరభ్కి నచ్చడం లేదు. నా మంచి చెడు పట్టించుకోవడం లేదు. పైగా నన్ను మునుపటిలా లేవు అంటున్నాడు..’’ అని చెప్పి మౌనంగా ఉండిపోయిన నేహ కాసేపటికి.. ‘‘మా జూనియర్ అనూ వల్లే సమస్య అనుకున్నాను. కానీ, ఆమె వల్ల కాదు. మా ఇద్దరి మధ్య ఉన్నది అసలు ప్రేమే కాదు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని ఇష్టపడ్డాను. అమ్మనాన్నలు వాళ్ల పనుల్లో వాళ్లు బిజీ నన్ను పట్టించుకోరు. సౌరభ్ అలా కాదు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒంటరితనం పోగొట్టుకోవడానికి సౌరభ్తో ఉన్నాను. ఇప్పుడు అతను దూరమైతే నన్ను పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. అందుకే సౌరభ్ వెళ్లిపోతుంటే నాకు బాధగా ఉంది. అతను దూరమవడం నాకిష్టం లేదు..’’ చెబుతూ ఆగిపోయింది నేహ. కౌన్సెలర్ సూచనలతో థెరపీ పూర్తయింది. నేహకు తనేంటో అర్థమైంది. సౌరభ్పై ఉన్న కోపం, పగ, ప్రతీకారాలు అవి తన ఒంటరితనం మీద అని గుర్తించింది. ఆకర్షణకు ప్రేమకు గల వ్యత్యాసం తెలుసుకొని, అవగాహన చేసుకొని తన భవిష్యత్తును ఆనందంగా మలుచుకోవడంపై శ్రద్ధ పెట్టింది. తల్లీతండ్రి తమ తీరిక లేని పనులను సడలించుకొని, కూతురి భవిష్యత్తు కోసం తమ సమయాన్ని కేటాయించారు. కృష్ణుడి ప్రేమ తత్వం గురించి మహాభారతం విశదపరు స్తుంది. ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు ఆకర్షణలు– ప్రేమ తత్వం గురించి తెలియజేశారు. పాస్ట్లైఫ్ రిగ్రెషన్ ఫ్యూచర్, లైఫ్ ప్రోగ్రెషన్ మీద విస్తృతమైన పరిశోధనలు జరిపిన డాక్టర్ బ్రియాన్ వెయిజ్ అమెరికన్ సైకియాట్రిస్ట్, హిప్నోథెరపిస్ట్. ఇతను ‘ఓన్లీ లవ్ ఈజ్ రియల్’ అనే పుస్తకంలో ప్రేమ–ఆకర్షణల గురించి తెలియజేశారు. ‘లైఫ్ బిట్వీన్ లైఫ్’ అని ఆకర్షణల గురించి తన పరిశోధనా గ్రంధం ద్వారా వివరించారు బ్రాండ్ విడ్త్. ఆకర్ణణ సిద్ధాంతం గురించి తెలియజేసిన వారిలో డా.జాన్ అబ్రహం ప్రముఖులు. 7 చక్రాలు... ఆకర్షణలు... మానవ శరీరంలో కుండలిని చక్రం ఉంటుంది. మూలాధార చక్రంతో మన ఆలోచనలు ముడిపడి ఉంటే శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా లైంగిక వాంఛలు తీర్చుకోవడంపై దృష్టి నిలుపుతారు. దీంతో అలాంటివారినే ఆకర్షిస్తుంటారు. మూలాధార చక్రంపైన ఉండే స్వాధిష్టాన, మణిపుర చక్రాలతో కనెక్ట్ అయితే భావోద్వేగాల నడుము కొట్టుమిట్టాడుతారు. రకరకాల ఉద్వేగాలకు ఆకర్షితులు అవుతారు అనహత, విశుద్ధ చక్రాలతో ముడిపెట్టుకుంటే జ్ఞానులు ఆకర్షిస్తుంటారు. ఆధ్యాత్మిక విషయాలకు అట్రాక్ట్ అవుతారు. సహస్రార చక్రంతో కనెక్ట్ అయితే ఏది అవసరం? ఏది అనవసరం? అనే విషయాల పట్ల అవగాహన కలుగుతుంది. గొప్ప గురువులు, జ్ఞానులు ఆకర్షిస్తారు. అవసరం లేనిది త్వరితంగా విడిచిపెట్టగల శక్తి వస్తుంది. ఇదంతా ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. సాధన ద్వారా ధ్యానం తద్వారా జ్ఞానం అలవడతాయి. తమను తాము కోల్పోయి బాల్యంలో పరిస్థితుల వల్ల కొన్ని సుగుణాలను పోగొట్టుకుంటాం. నేహ, సౌరభ్లకు థెరపీ చేశాక ఇది స్పష్టమైంది. నేహ తల్లీతండ్రి ఉద్యోగస్తులు. ఆమె బాల్యమంతా అభద్రతల మధ్య భయం భయంగా గడిచింది. సౌరభ్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. తల్లి నాలుగిళ్లలో పనిచేస్తేనే తమ పొట్ట గడిచేది. గడ్డు పరిస్థితులను దాటడానికి తల్లి బాధ్యతలనూ తను తీసుకున్నాడు. పార్ట్టైమ్ జాబ్ చేస్తూ కుటుంబ పోషణకు సాయపడేవాడు. ఈ క్రమంలో బాల్యపు అమాయకత్వం కోల్పోయాడు. బాల్యంలో తనలో మాయమైపోయిన అమాయకత్వం నేహలో చూసి ముచ్చటపడ్డాడు సౌరభ్. తనలో లేని సుగుణాలను సౌరభ్లో చూసి ఆకర్షితురాలైంది నేహ. ఈ కారణంగా ఇద్దరూ దగ్గరయ్యారు. రెండేళ్ల తర్వాత లోపాలు బయటపడటం మొదలుపెట్టాయి. దీంతో ఇద్దరూ దూరమయ్యారు. ఇది తెలియక ఇద్దరూ ఒకరినొకరిని తిట్టుకున్నారు. మనలో లేనిది తెలియజెప్పడానికి వ్యక్తులు వస్తూనే ఉంటారు. ఎందుకు వాళ్లు మనల్ని అట్రాక్ట్ చేస్తున్నారో గ్రహించి, సరి చేసుకుంటే మనలోని అవకతవకలు సరిదిద్దుకోవడం సులభం అవుతుంది. – డా.లక్ష్మీ న్యూటన్, పాస్ట్ లైఫ్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చ్ అకాడమీ, హైదరాబాద్ భవిష్యత్తు దర్శనం ఒంటరితనం, అభద్రతా భావాలకు సంబంధించిన బీజాలు శిశువు గర్భంలో ఉన్నప్పుడే పడిపోతాయి. ఆ శిశువుతో పాటు భయాలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు ప్రేమను చూపకపోతే బయట వెతుక్కునే ప్రయత్నం చేస్తారు పిల్లలు. ఎవరైనా ప్రశంసించడం, ముద్దు చేయడం చేస్తే సులువుగా అటువైపు అట్రాక్ట్ అవుతారు. అది తమ ఈడు వారైతే ఆకర్షణ స్థాయి ఇంకా పెరుగుతుంది. ఇంకొందరు గతజన్మలో పరిపూర్ణంగా అనుభవించని ప్రేమలను ఈ జన్మకు మోసుకొస్తారు. ప్రతి ఒక్కరూ తమలోని అర్థనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. మన లోపాలను సవరించడానికి వచ్చేవారివైపే ఆకర్షితులమౌతామని గుర్తించాలి. ఏడేళ్లకొకసారి మన శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఆకర్షణలు ఎంతకాలం ఉంటాయి? నిజమైన ప్రేమ – స్నేహం అంటే ఏంటి అనేది గుర్తించాలి. భవిష్యత్తును దర్శిస్తే శాశ్వతమైన బంధం ఏది అనే అవగాహన కలుగుతుంది. దుస్తులు మార్చినట్టుగా ఆత్మ.. దేహాలను జన్మ జన్మలుగా మార్చుకుంటూ వెళుతుంది. శాశ్వత ప్రేమ బంధం దైవంతోనే అని గుర్తిస్తే తమ జీవితం పట్ల సందేహాలు తలెత్తువు. – డాక్టర్ హరికుమార్, ఫ్యూచర్ థెరపిస్ట్, హైదరాబాద్ – నిర్మల చిల్కమర్రి -
నోట్ దిస్ పాయింట్!
-
డ్రోన్ కెమెరాల వినియోగం ఎందుకో..?
తుళ్లూరు: రాజధాని గ్రామాల్లో రోజు రోజుకూ డ్రోన్ కెమెరాల హడావిడి పెరుగుతోంది. కార్లలో డ్రోన్ కెమెరాలు తీసుకొచ్చి అప్పటికప్పుడు, అక్కడికక్కడ ఆకాశంలో ఎగుర వేసి చక్కర్లు కొట్టిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట సిబ్బంది హడావిడి చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే.. రాజధాని గ్రామాల గత వైభవాలను చిత్రీకరిస్తున్నామని కొంతమంది, రాజధాని గ్రామాలను సర్వే చేస్తున్నామని మరి కొంతమంది, రాజధానిలో నిర్మించే భవనాలు, వంతెలను, లోతట్టు ప్రాంతాలను షూట్ చేస్తున్నామని మరి కొందరు చెబుతున్నారు. మరో పక్క డ్రోన్ కెమెరాలు విచ్చలవిడిగా వినియోగించరాదని ప్రభుత్వమే నిబంధనలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని పరిసర గ్రామాలలో జరుగుతున్న దానిపై ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కెమెరాల వ్యవహారంపై సీఆర్డీఏ అధికారులు, స్థానిక అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని రాజధాని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
టెన్షన్.. టెన్షన్...
జిల్లాలకు కేటాయింపులపై ఉద్యోగుల్లో అయోమయం ఎవరు ఏ జిల్లాకు అనేదానిపై ఇప్పటికీ స్పష్టత కరువు బదిలీల కోసం ఎదురు చూపులు 10న ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు కొందరికి ప్రత్యేక మినహాయింపులపైనా సందిగ్ధం హన్మకొండ అర్బన్: ‘సార్... ఏమైనా తెలిసిందా.. ఇక్కడే ఉంచుతారా.. పంపిస్తారా..? ఏ జిల్లాకు పంపిస్తారు. మార్పులకు అవకాశం ఇస్తారా.. మా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు. అందుకే ఎక్కడిస్తారో అని టెన్షన్గా ఉంది. మీకేమైనా తెలిస్తే చెప్పండి’. ఇలా ఎక్కడ చూసినా ఉద్యోగుల మధ్య ఇదే సంభాషణ. అందరిలోనూ ‘కొత్త జిల్లాల’ టెన్షనే. వారిలో సద్దుల బతుకమ్మ... దసరా పండుగ సంతోషం కానరావడం లేదు. ఒకేసారి ఉత్తర్వులు చేతిలో పెట్టి ఏ జిల్లాకు వెళ్లమంటారోననే ఆందోళన ఉంది. కనీసం నాలుగు రోజుల ముందు తెలిసినా బదిలీ విషయంలో మానసికంగా సిద్ధమయ్యేవారు. ఇప్పుడలా లేదు. దీంతో మహిళా ఉద్యోగులు, ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు. టెన్షన్... టెన్షన్గా కాలం వెళ్లదీస్తున్నారు. పదో తేదీనే ఉత్తర్వులు ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు ఆయా శాఖల వారీగా సంబంధిత శాఖల ప్రధాన కార్యదర్శులకు చేరింది. వాటిని ఆమోదించి ఈ నెల 9న జిల్లాలకు పంపనున్నట్లు సమాచారం. వాటి ఆధారంగా జిల్లా కలెక్టర్ తుది ఉత్తర్వులు 10వ తేదీన మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే జిల్లా అధికారులు పంపిన ప్రకారం ఆమోదం పొందుతాయా... రాష్ట్ర స్థాయిలో మార్పులు చేస్తారా అన్న విషయంలో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ లెక్కన 9న రాత్రి లేదా 10న ఉదయం మాత్రమే ఎవరెక్కడికి అన్న విషయం తేలనుంది. రెవెన్యూలో రహస్యంగా.. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల వివరాలు, సీనియార్టీ విషయాలు, ప్రతిపాదనలు అందరికీ దాదాపు తెలిసే జరిగాయి. అయితే రెవెన్యూలో మాత్ర పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. రహస్య సమావేశాలు, నివేదికలతో ఉద్యోగుల్లో ఉత్కంఠ మరింత పెంతున్నారు. దీంతో ఉద్యోగుల్లో నిరసన వ్యక్త మవుతోంది. ముందస్తుగా ప్రాథమిక సమాచారం చెప్పడకుండా ఒకరిద్దరు కలెక్టరేట్లో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మినహాయింపులు ఎవరికి? బదిలీల విషయంలో మినహాయింపులు ఎవరికి ఉంటాయన్న విషయలో కూడా స్పష్టత లేదు. మహిళలు, ఉద్యోగ సంఘాల నేతలు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా ఏ మేరకు అమలవుతుందన్నది ప్రశ్నార్థకమే. కొత్త జిల్లాలకు సామగ్రి తరలింపు కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు సామగ్రి తరలింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలతోపాటు జనగామ జిల్లాకు జిల్లా అధికారులు సామగ్రి తరలిస్తున్నారు. శుక్రవారం కలెక్టరేట్ ట్రెజరీ కార్యాలయం నుంచి జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలకు సామగ్రిని వాహనాల్లో పంపించారు. డీడీ రాజుతోపాటు అధికారులు శ్రీనివాస్రెడ్డి, రాజేందర్ తదితరులు పంపిణీ కార్యక్రమాలు పర్యవేక్షించారు. పౌరసరఫరాల కార్యాలయం నుంచి మహబూబాబాద్కు, కలెక్టరేట్ నుంచి జనగామ జిల్లాలకు సామగ్రితో వాహనాలు బయల్దేరాయి. -
కొత్త కార్డులు హుళక్కే!
♦ ఇప్పటికే పూర్తయిన రేషన్కార్డుల ముద్రణ ♦ కొత్త జిల్లాల ఏర్పాటుతో గందరగోళం ♦ జిల్లాల పేర్లు మారడంతో నిలిచిన పంపిణీ ♦ తలపట్టుకుంటున్న పౌరసరఫరాల శాఖ ఎన్నాళ్లుగానో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. వాస్తవానికి ఈ నెలలోనే కొత్తకార్డులు వస్తాయని భావించారు. కానీ, వీటిపై కొత్త జిల్లాల ప్రభావం పడింది. జిల్లా, మండలాల పేరు మార్చాల్సి ఉండడంతో వాటి పంపిణీని నిలిపివేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్త రేషన్ కార్డుల భాగ్యం లబ్ధిదారులకు ఇప్పట్లో కలిగే అవకాశం లేదు. వాస్తవానికి ఈ నెల మొదటివారంలో లబ్ధిదారులకు తెలంగాణ లోగోతో ఉన్న కొత్త ఆహార భద్రత కార్డులు అందించాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ సైతం ఈ మేరకు టెండర్లు పిలిచి ముద్రణ ప్రక్రియలో వేగం పెంచింది. దీంతో చర్యలకు దిగిన కాంట్రాక్టర్లు కొత్తగా కేటాయించే కార్డులను ముద్రించి పౌరసరఫరాలశాఖకు అప్పగించారు. సెప్టెంబర్ మొదటివారంలో వీటిని పంపిణీ చేయాలని యంత్రాంగం భావించింది. తాజాగా కొత్త జిల్లాల ప్రక్రియ తెరపైకి రావడం.. ప్రభుత్వం కూడా జిల్లాల ఏర్పాటును యుద్దప్రాతిపదకన భావిస్తూ చర్యలు వేగిరం చేయడంతో కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. వృథా ప్రయాసేనా...? జిల్లాలో 11.65 లక్షల తెల్లరేషన్ కార్డులున్నాయి. క్షేత్రస్థాయిలో పౌరసరఫరాల శాఖ సర్వేలు నిర్వహిస్తూ అర్హతలేని కార్డుదారులపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నాలుగు చక్రాల వాహనాలు, రూ.వేలల్లో ఆస్తిపన్ను చెల్లించే వారి కార్డులను రద్దు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తొలివిడత సర్వే పూర్తిచేసిన పౌరసరఫరాల శాఖ 1.10లక్షల కార్డులు అర్హత లేనివిగా తేల్చింది. వీటిని రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా... అర్హత ఉన్న కార్డుదారులకు కొత్తగా తెలంగాణ ప్రభుత్వ చిహ్నం ఉన్న కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన సర్కారు వాటిని ముద్రణకు పంపింది. ఈ క్రమంలో గత నెలాఖర్లో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కొత్త కార్డులు చేరాయి. ఇందుకు సంబంధించి దాదాపు రూ.2.5 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ హామీ ప్రకారం సెప్టెంబర్ మొదటివారంలో వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం డెడ్లైన్ విధించడంతో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏకంగా జిల్లా పేరు, మండలాల పేర్లు మారే అవకాశం ఉండడంతో వాటి పంపిణీని యంత్రాంగం తాత్కాలికంగా వాయిదా వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిన తర్వాత వాటికి కాస్త మెరుగులు దిద్దాలా..? లేక తిరిగి కొత్త వాటిని ముద్రించి ఇవ్వాలా అనే అంశాన్ని పౌరసరఫరాల శాఖ తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలో లబ్ధిదారులకు కొత్తకార్డులు ఇప్పట్లో లేవనే చెప్పొచ్చు. -
మరోసారి భూసమీకరణకు సర్కార్ సిద్ధం
-
రూ.10 నాణెంపై అయోమయం!
ఫరీదాబాద్: గత రెండు వారాలుగా ఫరీదాబాద్ ప్రజలు రూ.10 నాణెం విషయంలో తికమకపడుతున్నారు. కొంతమంది దుకాణదారులు రూ.10 నాణెం చెల్లుతుందని తీసుకుంటుంటే.. మరికొందరు అంగీకరించటం లేదు. దీంతో ప్రజలు నాణ్యాన్ని తీసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆర్బీఐ రూ.10 నాణెం చెల్లదని చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే ఇందుకు ప్రధానకారణం. దీంతో రూ.10 నాణ్యాలతో అక్కడి ప్రజలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. రూ.10 నాణెంను బ్యాంకులో ఇచ్చి పది నోటును తీసుకుంటున్నారు. దీనిపై స్పందించిన నీలమ్ చౌక్ ఎస్బీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పారు. ఆర్బీఐ అటువంటి నిర్ణయం ఏం తీసుకోలేదని.. రూ.10 నాణెంను తీసుకోవడానికి తిరస్కరించిన వ్యాపారులు చట్టరీత్యా శిక్షార్హులని పేర్కొన్నారు. ఇప్పటివరకూ దాదాపు 2వేల పది రూపాయిల నాణ్యాలు బ్యాంకుకు వచ్చినట్లు చెప్పారు. నగరంలోని కొద్ది ప్రాంతాల్లో నాణ్యాలను తీసుకుంటున్నా.. టియాగాన్, పాత ఫరీదాబాద్ లలో తీసుకోవడం లేదని తెలిపారు. -
గందరగోళంగా పల్స్ సర్వే
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే (ప్రజాసాధికారిక సర్వే) గందరగోళంగా మారింది. యాప్ డౌన్లోడ్కాక, సర్వర్ పనిచేయక సర్వే నత్తనడకన సాగుతోంది. అసలు సర్వే ఎందుకుచేస్తున్నారో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. సర్వే సందర్భంగా అడుగుతున్న అంశాలను బట్టి పథకాల్లో కోత విధించేందుకే అని చాలామంది భావిస్తున్నారు. ► చాలాచోట్ల డౌన్లోడ్ కాని యాప్ ► నత్తనడకన సాగుతున్న సర్వే ► పనులు మానుకొని ఇళ్ల వద్ద ఎదురుచూస్తున్న ప్రజలు ► పథకాల్లో కోత విధిస్తారని ప్రచారం చేజర్ల : ప్రజాసాధికారిక సర్వేను ప్రభుత్వం ఈనెల ఈ నెల 8వతేదీన ప్రారంభించింది. ఎన్యూమరేటర్లు ప్రజలకు సంబంధించి పలు అంశాల సమాచారాన్ని ఒకేచోట పొందుపర్చడమే దీని ప్రధాన లక్ష్యం. బ్యాంకు లావాదేవీలు, గృహోకపరణాలైన టీవీ, ఫ్రిజ్, గ్యాస్, సొంతిల్లు, గ్యాస్ సబ్సిడీ, విద్యార్హత వివరాలు ఇలా వివిధ రకాల సమాచారాన్ని సర్వేలో సేకరిస్తారు. దీనికోసం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున యంత్రాగాన్ని ఏర్పాటుచేసింది. 47 మంది ఇన్చార్జ్ అధికారులు, 51 మంది మాస్టర్ ట్రైనర్లు, 176 మంది సూపర్వైజర్లు, 1,487 మంది ఎన్యూమరేటర్లు 1,487 మంది అసిస్టెంట్లు సర్వే చేసేందుకు నియమించబడ్డారు. ప్రారంభించిన తొలిరోజు నుంచే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వేకు అంతరాయం ఏర్పడుతోంది. యాప్ డౌన్లోడ్ కాక సిబ్బంది ఎంతో ఇబ్బందిపడ్డారు. మొదట 2.1 సాఫ్ట్వేర్ వర్షన్ డౌన్లోడ్ చేయగా అది పనిచేయకపోవడంతో తర్వాత 2.2, 2.3, 2.3.1 ప్రస్తుతం. 2.4.1 వర్షన్లో ప్రయత్నిస్తున్నా యాప్ డౌన్లోడ్ కావడం లేదు. ఒక్కో వ్యక్తిని సర్వేచేసేందుకు ఎన్యూమరేటర్లకు ఇచ్చేది కేవలం రూ.2 మాత్రమే. దీంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకో..? సర్వే ఎందుకోసం..? ప్రజలందరిలో మెదులుతున్న ప్రశ్న ఇది. సమాచారాన్ని సేకరించడమని చెబుతున్నా ఇందులో మర్మం దాగుందని రాజకీయపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే సర్వేసాగుతోంది. బైక్ ఉందా? లేదా? ఆదాయం ఎంత? ఎవరెవరు ఉద్యోగం చేస్తున్నారు? ఇలా పలు వివరాలు సేకరిస్తుండటంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాల్లో కోత విధించేందుకే సర్వే అనే ప్రచారం ఉంది. పనిపోయే.. గ్రామాల్లో సర్వే పేదలను ఇబ్బందిపెడుతోంది. క్షేత్రస్థాయి సిబ్బంది ఈ రోజు ఫలానా ఊరికి వస్తాం.. అందుబాటులో ఉండండని ప్రజలకు చెబుతున్నారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఒక్కో ఇంట్లోనే గంటలకొద్ది సమయం పడుతుండటంతో ఎక్కువమందిని సర్వే చేయలేకపోతున్నారు. దీంతో కూలి పనులకు వెళ్తేగానీ పూటగడవని పరిస్థితి దారుణంగా ఉంది. రెండు రోజుల క్రితం ఓ మండలంలోని గ్రామంలో సర్వే ప్రారంభించగా ఒక్క ఇంటి వివరాలు సేకరించేందుకే మధ్యాహ్నమైంది. దీంతో పక్కరోజు సర్వే చేస్తామని అధికారులు చెప్పగా మీవల్ల పనులు పోయాయని కొంతమంది అసంతృప్తి వ్యక్తంచేశారు. మెరుగైన సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెస్తున్నాం స్మార్ట్పల్స్ సర్వే విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరో రెండు రోజుల్లో ఎటువంటి ఆటంకాలు లేని మెరుగైన సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెస్తాం. సమస్యను పరిష్కరిస్తాం. -ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ -
'ఉద్యోగుల తరలింపులో గందరగోళం'
గుంటూరు : అమరావతికి ఉద్యోగుల తరలింపుపై గందరగోళం సృష్టిస్తున్నారని ఆదివారం గుంటూరులో జరిగిన రెవిన్యూ ఉద్యోగుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. హెచ్ఓడీ కార్యాలయాలు ఎక్కడో తెలియకుండా ఎక్కడికి వచ్చి పనిచేయాలని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి తాము రావడానికి సిద్ధంగానే ఉన్నామని, కానీ కనీస సౌకర్యాలు లేకుండా ఎలా పనిచేయాలని ఆయన అన్నారు. స్థానికత అంశంపై కూడా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటన చేయలేదని వెంటనే ఆ అంశంపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రెవిన్యూశాఖలో ఖాలీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
‘మెడికల్’ ప్రవేశాలపై గందరగోళం
► ఇప్పటికే ఎంసెట్ నోటిఫికేషన్ జారీ నేపథ్యంలో సందిగ్ధం ► ఎంసెట్ కచ్చితంగా నిర్వహిస్తామన్న విద్యా మండలి ► అవసరమైతే రివ్యూ పిటిషన్ వేస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలను 2016-17 విద్యా సంవత్సరం నుంచే ‘నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్టు (నీట్)’ ద్వారా చేపట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర విద్య, వైద్య శాఖలు తర్జనభర్జన పడుతున్నాయి. ‘నీట్’ నుంచి ఈ ఏడాది ఎలా బయటపడాలన్న దానిపై దృష్టి సారించాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎంసెట్, ప్రైవేటు మెడ్సెట్ నోటిఫికేషన్లు జారీ చేయడం, మేలో ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పుతో అధికారుల్లో గందరగోళం నెలకొంది. విద్యార్థులు ‘నీట్’ పరీక్షకు హాజరుకావాలా, లేదా అన్న సందిగ్ధంలో మునిగిపోయారు. ఎంసెట్ నిర్వహిస్తాం: పాపిరెడ్డి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉంటే మంచిదే అయినప్పటికీ..కోర్టు తీర్పు కాపీ అందకముందే ‘నీట్’పై తామేమీ వ్యాఖ్యానించబోమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంసెట్ను నిర్వహిస్తామని.. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరమైతే రివ్యూకు వెళతాం: లక్ష్మారెడ్డి ‘నీట్’పై కోర్టు తీర్పు కాపీ అందాక తదుపరి చర్యలు చేపడతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. నీట్ ద్వారానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టాలన్నది మంచిదేనని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాల కోసం అన్ని చర్యలు చేపడతామని... అవసరమైతే రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోందని, వారితోనూ చర్చించి ముందుకు సాగుతామని చెప్పారు. తెలుగు మీడియంకు కష్టమే ఎంసెట్లో ప్రశ్నపత్రం ఇంగ్లిషుతో పాటు తెలుగులోనూ ఉంటుంది. తెలుగు మీడియం విద్యార్థులకు అది ప్రయోజనకరం. ఏటా ఇంటర్ పూర్తి చేసే విద్యార్థుల్లో బైపీసీ విద్యార్థులు లక్ష మంది వరకు ఉంటున్నారు. అందులో 50 శాతానికిపైగా తెలుగు మీడియంలో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులే. ‘నీట్’ ఇంగ్లిషులోనే ఉండే అవకాశమున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు తప్పవు. ‘నీట్’ను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్ ప్రకారం నిర్వహిస్తారు. ఈ సిలబస్కు ఇంటర్లో చదువుకునే రాష్ట్ర సిలబస్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండింటికీ సిద్ధం కావాల్సిందే! ప్రస్తుత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా విద్యార్థులు ఎంసెట్తోపాటు నీట్కు కూడా సిద్ధం కావాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈసారికి తెలంగాణలో నీట్ వద్దని... వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ పిటిషన్ వేసినా దానిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడే తెలియదు. విచారణకు స్వీకరించినా తుది తీర్పు ఇచ్చేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో నీట్కు సిద్ధమైతేనే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. 371(డి) విషయంలో రావాల్సిన స్పష్టత! తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రాజ్యాంగపరంగా ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక చట్రంలో ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371 (డి) ప్రకారం స్పష్టమైన విధానాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఉస్మానియా, ఆంధ్రా, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ జోన్లుగా విభజించి 371(డి)లో చేర్చారు. ఒక్కో జోన్లో ఆ జోన్ పరిధిలోని విద్యార్థులకు 85 శాతం సీట్లు, మిగతా 15 శాతం సీట్లు ఓపెన్ కోటాలో మూడు జోన్లకు చెందిన విద్యార్థులకే చెందుతాయి. ఇతర రాష్ట్రాలవారు ఇక్కడికి రావడానికి వీల్లేదు. రాష్ట్ర విభజన చట్టం కూడా పదేళ్ల పాటు పాత ప్రవేశాల విధానమే అమలు చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయిన నీట్ పరిధిలోకి ఎలా వెళ్లాలి, వెళితే తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ సీట్ల భర్తీ పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
గందరగోళం
జల్లికట్టు అనుమతిపై ఆందోళన కేంద్రం నిర్ణయం ఎటో సర్వత్రా ఉత్కంఠ నోరు మెదపని కేంద్రమంత్రి జవదేకర్ మంత్రి వర్గంలో కానరాని చర్చ తమిళుల సాహసక్రీడ జల్లికట్టు నిర్వహణ మీద తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంతకీ అనుమతి దక్కుతుందా? లేదా అన్న ఉత్కంఠ బయలుదేరింది. బుధవారం నాటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో జల్లికట్టు ప్రస్తావనకు రాకపోవడంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ జల్లికట్టు ప్రశ్నకు సమాధానం దాట వేయడం అనుమానాలకు దారితీస్తోంది. చెన్నై : తమిళుల సాహసక్రీడగా, వీరత్వాన్ని చాటే క్రీడగా జల్లికట్టు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఎద్దులను హింసిస్తున్నారన్న నెపంతో వ్యవహారం కోర్టుకు చేరడంతో జల్లికట్టుపై నిషేధం విధించా రు. ఈ నిషేధం ఎత్తి వేతకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు గళం విప్పుతూ వస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని పట్టుబడుతూ రాజకీ య పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జల్లికట్టుకు అనుమతి తప్పనిసరి అంటూ కేంద్రంలోని బీజేపీ పాలకు లు స్పష్టమైన హామీలు, రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు సైతం స్పష్టత వ్యక్తం చేయడంతో ఈ ఏడాది సాహసక్రీడతో సంక్రాంతి సంబరాలు ఉంటాయన్న ఆశాభావం పెరిగింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సైతం రెండు మూడు రోజుల్లో మంచి నిర్ణయం ఉంటుందన్న వ్యాఖ్యలు చేయడంతో ఆశలు రెట్టింపు అయ్యాయి. జల్లికట్టుకు సిద్ధం అవుతూ క్రీడాకారులు సాధనల్లో మునిగారు. ఎద్దులకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టారు. బుధవారం నాటి పరిస్థితులు జల్లికట్టు నిర్వహణ అనుమతి దక్కుతుందా, లేదా అన్న ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. గందరగోళం : జల్లికట్టు వ్యవహారంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠతో తమిళులు ఉదయం నుంచి ఎదురు చూశారు. జల్లికట్టుకు అనుమతి ఏ రూపంలో ఇస్తారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇందుకు కారణం ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గం భేటీ కావడమే. అత్యవసర చట్టం తీసుకొస్తారా లేదా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అనుమతి ఇస్తారా..? అన్న ప్రశ్న నిర్వాహకుల్లో బయలు దేరింది. అయితే, జల్లికట్టు విషయంగా ఎలాంటి చర్చ కేంద్రం మంత్రి వర్గంలో సాగలేదన్న సమాచారంతో గందరగోళ పరిస్థితి బయలు దేరింది. అసలు జల్లికట్టు ప్రస్తావనే ఆ సమావేశంలో లేని దృష్ట్యా, ఇక ప్రత్యేక చట్టం విషయంగా, ప్రత్యామ్నాయ మార్గం అంశంగా నిర్ణయాలు తీసుకుంటారా..? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అదే సమయంలో ఈ సమావేశానంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ జల్లికట్టు విషయంగా ప్రశ్న లేవదీయగా దాటవేయడంతో మరింత ఉత్కంఠ బయలు దేరింది. ఇంతకీ జల్లికట్టుకు కేంద్రం అనుమతి ఇస్తుందా..? అన్న ప్రశ్న సర్వత్రా బయలు దేరింది. అయితే, జంతు సంరక్షణ సంస్థ ఎలాంటి అనుమతి ఇవ్వని దృష్ట్యా, జల్లికట్టు ప్రస్తావనను మంత్రి వర్గం దృష్టికి తీసుకురాలేదని, మరో రెండు మూడు రోజుల్లో కేంద్రం జల్లికట్టుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్న భరోసా ఇచ్చే పనిలో రాష్ట్రంలోని కమలనాథలు నిమగ్నమయ్యారు. అనుమతి వచ్చినా, రాకున్నా, ఈ సారి మాత్రం నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించైనా జల్లికట్టును నిర్వహించి తీరుతామన్న హెచ్చరికల స్వరం పలు చోట్ల పెరుగుతుండటం గమనార్హం. -
టీటీడీపీ తర్జన భర్జన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ తర్జన భర్జన పడుతోంది. రాష్ట్రంలో 12 స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి కనీసం ఒక్క చోటన్న గెలవకుంటే పార్టీ పరువు పోతుందన్న ఆందోళనలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. దీంతో ఎక్కడ అవకాశం దక్కుతుందా అని ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు కావడంతో ఈ లోగానే పోటీ చే సే స్థానాలపై మల్లగుల్లాలు పడుతోంది. తమ పార్టీ మిత్ర పక్షమైన బీజేపీకి స్థానిక సంస్థల్లో నామ మాత్రంగా కూడా ఓట్లు లేకపోవడంతో టీ టీడీపీ నేతలు కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నారు. లోపాయికారీగా కాంగ్రెస్ నేతలను కలిసి తమ ప్రతిపాదనలను ముందు పెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అవకాశ వాదంతో వ్యవహరిస్తోందని ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ మండిపడుతోందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో కలిసి చర్చించుకుని నిర్ణయానికి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించినా, ఆ మాటలను చెవికి ఎక్కించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పాలమూరులో కాంగ్రెస్తో దోస్తీ! ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో కొత్త కోట దయాకర్రెడ్డిని తమ అభ్యర్ధిగా ఖరారు చేసిన టీ టీడీపీ, రంగారెడ్డి జిల్లాలోనూ ఒక స్థానంలో పోటీ చేసే ఆలోచనలో ఉందంటున్నారు. దీనికోసం కాంగ్రెస్తో అవగాహనకు రావాలని ఆ పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఒక చోట ఆ పార్టీ మద్దతు కోసం అవగాహన కుదుర్చుకుంటే, మిగిలిన జిల్లాల్లో అనివార్యంగా టీటీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్కే వేయమని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ వంటి జిల్లాల్లో బీజేపీ కూడా స్థానిక సంస్థల్లో కొన్ని ఓట్లున్నాయి. టీడీపీతో ఉన్న పొత్తు వల్ల తాము ఓటు వేస్తే టీడీపీ అభ్యర్ధికి వేస్తాం కానీ, టీడీపీ అవగాహన కుదుర్చుకున్న కాంగ్రెస్కు ఎలా వేస్తామన్న ప్రశ్నం బీజేపీ శిబిరం నుంచి వస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సాయం తీసుకోవాలని టీడీపీ నేతలు భావించడంతో ఈ ఎన్నికల్లో తమకు అవసరం ఏమీ లేదన్న తరహాల్లో వ్యవహరిస్తున్నారని కొందరు బీజేపీ నాయకులు నేరుగా టీడీపీ నాయకులనే నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది. మండలి ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని, రెండు స్థానాలున్న మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో స్థానానికే అభ్యర్ధిని ప్రకటించిందని, టీడీపీతో కుదిరిన అవగాహన కారణమంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో టీడీపీ నుంచి అభిప్రాయం తెలుసుకునే మాజీ జెడ్పీ చైర్మన్ దామోదర్రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ మింగుడు పడని కమల నాథులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని, తెలంగాణ టీడీపీ మిత్ర ద్రోహానికి పాల్పడుతోందని తీవ్రంగానే విమర్శిస్తోందని సమాచారం. రెండు స్థానాలున్న మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీలు చెరో స్థానంలో పోటీ చేయడంతో పాటు ఓట్ల పంపిణీపైనా మాట్లాడుకున్నట్లు తెలిసింది. టీడీపీ తమ అభ్యర్ధులకు మొదటి ప్రాధాన్యం ఓటు వే సుకుని, కాంగ్రెస్ అభ్యర్ధికి రెండో ప్రాధాన్య ఓటు వేయనుందని, కాంగ్రెస్ కూడా ఇదే తరహాల్లో ఓట్లు వేసే వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారని అంటున్నారు. అయితే, రెండు చోట పోటీ పడినా, ఒక్క చోటనే టీడీపీ కొంత అవకాశం ఉందని, ఒక్క సీటు కోసం నానా తంటాలు పడుతున్న టీటీడీపీ నాయకులు కాంగ్రెస్తో చేతులు కలపడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముందు ముందు బీజేపీ, టీడీపీల మధ్య ఈ అంశం వివాదానికి కారణమయ్యే ముప్పు ఉందని, జిహెచ్ఎంసి ఎన్నికల జరగనున్న తరుణంలో టీడీపీ, కాంగ్రెస్తో చేతులు కలిపి బీజేపీని పక్కన పెట్టడం ఇబ్బంది కరమేనని అభిప్రాయ పడుతున్నారు. -
ఈసారీ ఆలస్యంగా ఇంజనీరింగ్ క్లాసులు
-
లిఫ్ట్ ఆగిపోయి సచివాలయంలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని 'బి' బ్లాక్లో సోమవారం ఉదయం లిఫ్ట్ ఆగిపోవడంతో కాసేపు గందరగోళం చెలరేగింది. ముఖ్యమంత్రికి గృహ నిర్మాణ దరఖాస్తులు ఇచ్చేందుకు నగరంలోని మీర్జాలగూడ నుంచి వచ్చిన 26 మంది మహిళలు లిఫ్ట్ ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో మధ్యలో ఆగిపోయింది. దీంతో కంగారుపడ్డ మహిళలు తలుపులు కొడుతూ రక్షించండి అంటూ పెద్దగా అరిచారు. వెంటనే స్పందించిన జీఏడీ అధికారిణి పద్మజ సంబంధిత టెక్నికల్ సిబ్బందిని పిలిపించి లిఫ్ట్ తలుపులు తెరుచుకునేలా చేశారు. -
డీఎడ్ ఉంటుందా? లేదా?
- డీఈఈసెట్-2015 నోటిఫికేషన్ కోసం 1.5 లక్షల మంది ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సుల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టేందుకు నిర్వహించాల్సిన ప్రవేశపరీక్ష డైట్సెట్ (డీఈఈసెట్-2015) నోటిఫికేషన్ కోసం విద్యార్థులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తరగతులు ప్రారంభించే సమయం వచ్చినా ఇంతవరకు నోటిఫికేషనే జారీ కాలేదు. అసలు ఈ ఏడాది డీఎడ్ కోర్సులో ప్రవేశాలు చేపడతారా? లేదా? అన్న విషయాన్ని ప్రభుత్వం తేల్చడం లేదు. దీంతో ఇంటర్ పూర్తి చేసుకుని డైట్సెట్ కోసం లక్షన్నర మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. డీఎడ్ కోసం ఎదురుచూస్తూ.. డిగ్రీ కోర్సుల్లో చేరలేక వారు ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్పై తేల్చని ప్రభుత్వం రాష్ట్రంలోని 258 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు, 10 ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో(డైట్) ప్రవేశాలు చేపట్టేందుకు డైట్సెట్ను నిర్వహించాలి. ఈ నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇవ్వాలని విద్యా శాఖ 3 నెలల కిందే ప్రభుత్వానికి ఫైలు పంపింది. కానీ ప్రభుత్వం ఇంతవరకూ ఈ వ్యవహారాన్ని తేల్చలేదు. ఏమంటే తెలంగాణలో సొంతంగా డైట్సెట్ నిర్వహణకు చట్టాన్ని అడాప్ట్ చేసుకోవాలని చెబుతోంది తప్ప ఆ చర్యలను వేగవంతం చేయడం లేదు. దీంతో 3 నెలలూ అయిపోయాయి. ఆలస్యం చేస్తే గతంలోలాగే డీఎడ్ ప్రవేశాలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. డైట్సెట్పై అనుమానాలు.. ఈ ఏడాది డైట్సెట్ ద్వారా ప్రవేశాలు చేపట్టకూడదన్న ఆలోచనలు ప్రభుత్వ వర్గాల్లో నెలకొన్నట్లు విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 2014 జూన్/జూలైలో జరగాల్సిన డీఎడ్ ప్రవేశాలు 2015 జనవరిలో ప్రారంభమై ఫిబ్రవరిలో ముగిశాయి. ఆ బ్యాచ్ విద్యార్థులకు ఇప్పుడిప్పుడే తరగతులు ప్రారంభమయ్యాయి. మళ్లీ 2015-16 విద్యా సంవత్సర ప్రవేశాలు చేపట్టాల్సిన సమయం వచ్చింది. అయితే 2 బ్యాచ్లకు మధ్య పెద్ద సమయం లేకపోవడంతో ఈసారి ప్రవేశాలను నిలిపేస్తారన్న వాదనలు వ్యక్తమవుతున్నాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డైట్సెట్ను నిర్వహిస్తారా? లేదా? అన్న విషయాన్ని త్వరగా తేల్చాలని కోరుతున్నారు. డైట్సెట్ కోసం ఎదురుచూస్తూ ఇతర కోర్సుల్లో చేరక.. విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అంతన్నాడు..ఇంతన్నాడే..!
-
గం'ధర'గోళం
కర్నూలు : పంట రుణాలపై వడ్డీ మాఫీ పథకం అమలులో సందిగ్ధం నెలకొంది. కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు పంట రుణాలపై రూ. లక్ష వరకు వడ్డీమాఫీ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించి అమలు చేశారు. ఆ తరువాత ఎన్నికలు సమీపించడం, అధికారంలోకి వచ్చాక రుణ విముక్తి కల్పిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించడంతో రైతులెవ్వరూ రుణాలు చెల్లించ లేదు. ఫలితంగా 2013-14లో తక్కువ మంది మాత్రమే వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకున్నారు. వాస్తవానికి రుణం తీసుకున్న ఏడాదిలోపు చెల్లిస్తే రూ. లక్ష వరకు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. రూ. 3 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్నా వడ్డీ మినహాయింపు రూ. లక్ష వరకు వర్తిస్తుంది. మిగిలిన మొత్తానికి బ్యాంకు నిబంధనల ప్రకారం 7 శాతం వడ్డీ చెల్లించాలి. చంద్రబాబు మాటలు నమ్మి రైతులెవ్వరూ రుణాలు చెల్లించకపోవడంతో వడ్డీ రాయితీ రాకపోగా.. ఏడాది దాటితే ఎలాంటి తగ్గింపులు లేకుండా 12 శాతం నుంచి 14 శాతం వరకు వడ్డీని బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రైతన్నల సంశయం.. 2013 డిసెంబరు 31కు ముందు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకొని 2014 మార్చి 31 నాటికి ఉన్న బకాయిలకు మాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నిర్దిష్ట తేదీలలో రుణాలు తీసుకొని తర్వాత రుణాలు చెల్లించినా అప్పటి రుణాలకు మాఫీ వర్తిస్తుందని ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటికే ఏడాది గడువు దాటిపోవడంతో అధిక శాతం మంది రైతులు వడ్డీ మాఫీ పథకం ద్వారా ప్రయోజనం పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించి మళ్లీ తీసుకోవడం ద్వారా వడ్డీ భారం తగ్గుతుందని రైతులు భావిస్తున్నారు. అయితే వడ్డీ మాఫీ పథకం అమలుపై ప్రభుత్వం నుంచి తమకు మార్గదర్శకాలు అందలేదని బ్యాంకు అధికారులు చెప్పడం రైతన్నలను నిరాశకు గురిచేస్తోంది. వడ్డీ మాఫీ కొనసాగితే పాత బకాయిలు ఏదోలా చెల్లించి వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నారు. దీనిపై బ్యాంకుల నుంచి స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో రుణాలు చెల్లించినా వడ్డీమాఫీ వర్తించదేమో అనే అనుమానం రైతులను వెంటాడుతోంది. రైతును చేరని రుణం.. ఇదిలా ఉండగా.. వ్యవసాయ అనుబంధ రుణాలతో కలిపి 2014-15లో జిల్లాలో రూ. 3,700 కోట్లు పంట రుణాలు (వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలపై) ఇవ్వాలని బ్యాంకులకు లక్ష్యం నిర్దేశించారు. బ్యాంకర్లకు, ప్రభుత్వం నిర్దేశించిన రుణ లక్ష్యానికి.. రైతుకు అందిన రుణ మొత్తానికి పొంతన లేదు. తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణం అందుతుందన్న ఆశతో రైతన్న ఉంటే.. బ్యాంకర్లు మాత్రమే అనేక సాకులు చూపుతూ కాలం గడిపేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరం దాదాపు పూర్తవుతోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు పెట్టుబడి అందకపోవడంతో నిర్దేశించిన లక్ష్యంలో 35 శాతం కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ. 2,888 కోట్ల మొత్తాన్ని వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ సాకుగా చూపి బ్యాంకర్లు కొత్త రుణాల జారీని దాదాపు నిలిపేశారు. రూ. 500 కోట్ల మొత్తాన్ని కూడా ఇవ్వలేదు. పోనీ, రబీలో రుణాలు ఇచ్చి రైతులను ఆదుకున్నారా? అంటే ఒక్కపైసా విదల్చలేదు. బ్యాంకర్ల రికార్డుల ప్రకారం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ. 435 కోట్లను మాత్రమే ఇచ్చారు. అంటే నిర్దేశిత లక్ష్యంలో 33 శాతం కూడా వ్యవసాయ రుణాలుగా బ్యాంకర్లు ఇవ్వకపోవడం గమనార్హం. మార్గదర్శకాలు వస్తేనే.. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ 2013-14 సంవత్సరానికి కూడా కొనసాగుతుందని వ్యవసాయశాఖ కమిషనర్.. ఎస్ఎల్బీసీ కన్వీనర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 2014-15 ఖరీఫ్, రబీ రుణాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల నుంచి బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. వ్యవసాయశాఖ కమిషనర్ లేఖ రాసినా నిధులకు సంబంధించి బడ్జెట్లో ప్రతిపాదనలు లేకపోవడం, నిర్వహణ మార్గదర్శకాలు లేనందున అమలు చేయలేని స్థితిలో ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల అమలుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు త్వరితగతిన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మాఫీ అమలుపై ఆశతో సకాలంలో రుణాలు చెల్లించని రైతులకు కొంతైనా ఉపశమనం కలుగుతుంది. -
తప్పుల తడక
గందరగోళంగా పట్టభద్రుల ఓటరు జాబితా ఫొటో ఒకరిది... పేరు ఇంకొకరిది ఫొటో మహిళది... పేరు పురుషుడిది ఒకేవ్యక్తి పేరు రెండునుంచి నాలుగు సార్లు నమోదు వేలాది మంది ఓటర్లకు ఫొటోల్లేవు.. గుర్తుపట్టలేని విధంగా ప్రింట్ అయిన ఫొటోలు చనిపోయిన వారి ఓట్లూ జాబితాలో ఉన్నాయి కొందరి ఇంటిపేర్లు గల్లంతు.. తుదిజాబితా ప్రకటించాక గందరగోళంలో ఓటర్లు అధికారుల నిర్లక్ష్యం.. రాజకీయ పార్టీల అత్యుత్సాహమే కారణం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఒక్క దేవరకొండే కాదండోయ్... జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు.. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యానికితోడు రాజకీయ పార్టీల అత్యుత్సాహం కారణంగా ఈసారి జిల్లాలో పట్టభద్రుల ఓటరు జాబితా గందరగోళంగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ఓటర్ల జాబితాలాగా లక్షల్లో ఓటర్లను నమోదు చేయాల్సిన పనిలేకపోయినా... ఈ వర్గానికి చెందిన ఓట్లు వేలసంఖ్యలోనే ఉన్నా సాధారణ ఓటరు జాబితా కన్నా తీవ్రంగా తప్పులు దొర్లడం గమనార్హం. పురుషులకు బదులు మహిళల ఫొటోలు... మహిళల పేర్లున్న చోట్ల మగవాళ్ల ఫొటోలు.. అసలు ఫొటోలు లేకుండానే తుదిజాబితా ప్రచురించడం... ప్రింట్ అయిన ఫొటోలు కూడా గుర్తుపట్టలేకుండా ఉండడం... చనిపోయిన వారి ఓట్లూ తొలగించకపోవడం... ఈ మండలంలోని ఓటరు పేరు పక్క మండలంలో నమోదు కావడం.. ఒక్కొక్కరికి గరిష్టంగా నాలుగు నుంచి రెండు సార్లు ఓటు నమోదు కావడం... కొందరి ఇంటిపేర్లు లేకపోవడం.. కొందరికయితే అసలు పేర్లే తారుమారు కావడం.. కొన్నిచోట్ల క్వాలిఫికేషన్ కూడా నమోదు కాకపోవడం.. ఇలా ఎన్ని రకాల విచిత్రాలు జరగాలో అన్ని రకాల విచిత్రాలు పట్టభద్రుల ఓటరు జాబితాలో జరగడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాస్తవానికి ఈ ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా గందరగోళంగానే జరిగింది. దరఖాస్తు చేసుకున్న వారి ఓట్లను పరిశీలించే బాధ్యతను రెవెన్యూ యంత్రాంగం తీసుకోకుండా, ఇతర శాఖలకు చెందిన చిన్నస్థాయి ఉద్యోగులకు ఇవ్వడం.. వారికి అవగాహన లేకపోవడం... ఆన్లైన్లో కొన్ని తప్పులు నమోదు కావడం కారణంగానే ఇన్ని తప్పులు దొర్లాయి. మరోవైపు కొన్ని రాజకీయ పక్షాలు గంపగుత్తగా ఓటరు దరఖాస్తులను తెచ్చి ఎమ్మార్వో కార్యాలయాల్లో డంప్ చేయడంతో నమోదు ప్రక్రియ గందరగోళంగా మారింది. వాస్తవానికి రాజకీయ పార్టీలు ఓటరు నమోదు ప్రక్రియలో పాలుపంచుకోవడం, ఓటర్లను చైతన్యవంతులను చేయడం మంచిదే కానీ... తమకు వచ్చిన దరఖాస్తులను గంపగుత్తగా కాకుండా ఎప్పటికప్పుడు కార్యాలయాలకు పంపి నమోదు చేయించుకుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాజకీయ పార్టీల టెంట్లలో నమోదు చేసుకున్న వారు కూడా మళ్లీ నేరుగా ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవడం కూడా రెండు, మూడు సార్లు ఓటరు నమోదుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఏదిఏమైనా పెద్దల సభకు ప్రతినిధులను పంపే ఓటర్ల జాబితాను నిర్లక్ష్యంగా తయారుచేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ పేరు ఎక్కడ తప్పు వచ్చిందో.. పోలింగ్ రోజు పోలింగ్ బూత్కు వెళ్లినా తమకు ఓటు వేసే అవకాశం వస్తుందో రాదోననే ఆందోళన ఓటర్లలో వ్యక్తమవుతోంది. పట్టభద్రుల ఓటరు జాబితాలో కొన్ని పదనిసలు... భువనగిరి ఖిలానగర్కు చెందిన కావలి నర్సింహాచారి బీఎస్సీ చదివి కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. ఆయన పేరు వరుస నంబర్లలో రెండుసార్లు ఉంది. వలిగొండ మండలంలోని వెల్వర్తికి చెందిన కల్లూరి నరేష్ (ఎమ్మెస్సీ లెక్చరర్ చేస్తున్నాడు సీరియల్ నంబర్ 1321 నుంచి 1323 వరకు) ) పేరు నాలుగుసార్లు, టేకులసోమారానికి చెందిన రాము, వేములకొండకు చెందిన రమేష్, గొల్నేపల్లికి చెందిన లింగమ్మ, వలిగొండకు చెందిన గుండాల సునిత, కూర భవానిలవి రెండుసార్లు నమోదయ్యాయి. మరి కొందరివి ఫొటోలు లేకుండా దర్శనమిస్తున్నాయి. ఆలేరులోని శ్రీరామోజీ వేణుగోపాలచారి ఫొటోకు బదులు మహిళ ఫొటో ప్రింటైంది. ఆత్మకూరు మండలంలో ఓ వ్యక్తికి బదులు మరో వ్యక్తి ఫఞటో ప్రింటైంది. రాజాపేట, ఆత్మకూరు, బొమ్మలరామారం మండలాల్లో పురుషునికి బదులు స్త్రీ ఫొటోలు ప్రింటయ్యాయి. చిట్యాల మండలంలో పట్టభద్రుల ఓటర్లుగా 1530 మంది నమోదు చేయించుకున్నారు. కానీ వీరిలో 70 శాతం మంది ఓటర్లుకు ఫొటోలు జాబీతాలో ముద్రించలేదు. ఆయా గ్రామ పంచాయతీలలో ఓటరు జాబితాను ప్రచురించకపోవడంతో ఓటర్లు తమ పేర్లును జాబితాలో చూసుకునేందుకు అధికారుల చుట్టు తిరగాల్సి వస్తుంది. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన ఓటర్ల మునుగోడు మండలంలో ప్రత్యక్షమయ్యాయి. దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి మండలంలో 513 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కాగా, 120 మంది ఫొటోలు లేకుండానే ఓటరు జాబితా తయారైంది. యాదగిరిగుట్ట మండలంలోని సోమారం గ్రామానికి చెందిన జంగ స్వామి ఫొటోకు బదులుగా లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన గిరిరాజు సిద్దిరాజు ఫొటో పడింది. ఇరువురి ఫొటోలు తారుమారు అయ్యాయి. యాదగిరిగుట్ట, వంగపల్లి, మల్లాపురం, సైదాపురం, సాదువెల్లి, జంగంపల్లి తదితర గ్రామాల్లో ఓటర్ల జాబితా తప్పులుగా వచ్చింది.నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలోని అప్పలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సీత్యాతండాకు చెందిన ధనావత్ మురళికి సీరియల్ నంబర్ 503,518,552లో మూడు చోట్ల ఓటు నమోదు అయ్యింది. అదే విధంగా బెజ్జికల్ గ్రామానికి చెందిన బాల్తీ జానకిరాములుకు సీరియల్నంబర్ 79,81లో రెండు చోట్ల ఓటు నమోదు అయ్యింది. మఠంపల్లి మండలంలో 775 మంది ఓటర్లుగా నమోదు కాగా ఎక్కువ మందికి ఓటర్ల జాబితాలో ఫొటోలు లేవు. అదేవిధంగా మరికొంత మందికి క్వాలిఫికేషన్ వివరాలు నమోదుకాలేదు. -
ఢిల్లీ సీఎం అభ్యర్థిపై బీజేపీలో సందిగ్థత
న్యూఢిల్లీ: బీజేపీలో ఢిల్లీ సీఎం అభ్యర్థిపై సందిగ్థత నెలకొంది. ఎన్నికల ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని పార్టీలోని కొందరు నేతలు చేసిన విజ్ఞప్తిని సీనియర్లు తోసిపుచ్చారు. పార్టీలో కొత్త సంప్రదాయాలకు తెరతీయొద్దని వారికి సూచించారు. ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని సీనియర్లు స్పష్టం చేశారు. అయితే నిన్న కాక మొన్న వచ్చిన కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సీనియర్లు ఆలోచనలో పడ్డారు. హస్తిన ప్రజల్లో కిరణ్ బేడీకి మంచి పేరు ఉందని వారు బీజేపీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై కిరణ్ బేడీని పోటీకి నిలపాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన న్యూఢిల్లీ పార్టీ అధ్యక్షుడు మూడో స్థానంలో నిలిచారు. దాంతో కిరణ్ బేడీనే బరిలో నిలపాలని సీనియర్లు సమాలోచనలు చేస్తున్నారని తెలిసింది. -
సంక్రాంతి గిప్ట్ ప్యాక్లో గోల్మాల్
-
ఎంసెట్పై విద్యార్ధుల్లో గందరగోళం
-
వెబ్సైట్ చూసి అవాక్కయిన రైతులు
-
ప్రభుత్వ బదిలీలలు
నెల్లూరు(విద్య): ఉపాధ్యాయుల ప్రభుత్వ(రాజకీయ) బదిలీలు జిల్లా విద్యాశాఖలో గందరగోళం సృష్టిస్తున్నాయి. అటు ఉపాధ్యాయలోకాన్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో ప్రభుత్వ బదిలీలు పొందిన ఉపాధ్యాయులు ఆర్డర్స్ తీసుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయ నాయకులకు, విద్యాశాఖ డెరైక్టరేట్లో రూ.లక్షలు చెల్లించి తీసుకున్న ఆర్డర్లు చేతికి అందకపోయే సరికి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేని చోట్ల నియమించారని జిల్లా విద్యాశాఖ వాదనను వారు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం బదిలీ చేసిన ప్రాంతానికి పంపేందుకు జిల్లా విద్యాశాఖకు ఉన్న అభ్యంతరం ఏమిటని అధికారులను నిలదీస్తున్నారు. పనిలోపనిగా అధికార పార్టీ నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. సాంకేతికపరమైన లోపాలు చూపుతూ పిల్లల నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వ జీఓలకు డీఈఓ అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. డీఈఓకు ముడుపులు చెల్లించేందుకే ఈ అంశాన్ని ఆయన లేవనెత్తుతున్నారని వారి వాదన. వారి హడావుడి పుణ్యమా అని రాజకీయ నాయకులకు, డెరైక్టరేట్లో చెల్లించిన ముడుపులు కాకుండా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సైతం ముడుపులు చెల్లించాలనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతా తప్పులతడక.. అడ్డదారిలో ప్రభుత్వ బదిలీలు పొందిన ఉపాధ్యాయులు పోస్టింగ్ ఆర్డర్ల కోసం డీఈఓ కార్యాలయం వద్ద మంగళవారం పడిగాపులు కాశారు. ఎవరిపాటికి వారు పైరవీలు నడిపి లక్షలు గుమ్మరించి తెచ్చుకున్న ప్రభుత్వ ఆర్డర్లు జిల్లా కలెక్టర్ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ క్రమంలో బదిలీల్లో చోటుచేసుకున్న పలు ఆసక్తికరమైన సంఘటనలు ఉపాధ్యాయుల అవస్థలను వెక్కిరిస్తున్నాయి. మొత్తం 22 ప్రభుత్వ బదిలీ ఉత్తర్వుల్లో వెంకటాచలం హెచ్ఎం పోస్టుకు ఒకే పేరుతో రెండు ఆర్డర్లు వచ్చాయి. వెంకటాచలంలో గతంలో పనిచేస్తున్న హెచ్ఎంను సస్పెండ్ చేసిన విషయం తెలిసింది. అయితే హెచ్ఎంపై విచారణ పూర్తికాక ముందే మరొక వ్యక్తిని నియమించడం నిబంధనలకు విరుద్ధమని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ పోస్టుకు ఒకే వ్యక్తికి ఇంటిపేరు మార్చి రెండు ఆర్డర్లు రావడం హాస్యాస్పదమని, డెరైక్టరేట్ నుంచి వచ్చే జీఓల లీలలు ఇలా ఉంటాయని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి ఎస్జీటీలుగా బదిలీ పత్రాలు వచ్చాయి. మరికొన్ని కేవలం మండలం మాత్రం సూచించి స్కూళ్లను సూచించకపోవడంతో వారు ఎక్కడ జాయిన్ కావాలో తెలియని పరిస్థితి నెలకొంది. లోపభూయిష్టంగా, తప్పుల తడకగా ఉన్న బదిలీ ఉత్తర్వులను అభ్యర్థులకు అందజేసేందుకు డీఈఓ కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. రాజకీయ పలుకుబడి, లక్షలు ఖర్చుచేసి తెచ్చుకున్న జీఓలు అందకపోవడంతో మళ్లీ రాజకీయ నాయకులతో ఫోన్లు, పైరవీలు జిల్లాస్థాయిలో నడిపేందుకు అభ్యర్థులు మళ్లీ పావులు కదుపుతున్నారు. కలెక్టర్ ఆమోదం పొందితేనే ఉత్తర్వులు అందజేస్తామని డీఈఓ తేల్చిచెప్పారు. కార్యాలయం వద్దకు బుధవారం సాయంత్రం వరకు రావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మొత్తం 22 ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులు జిల్లా కార్యాలయానికి అందాయి. అందులో 10 మాత్రమే ఖాళీగా ఉన్న ప్రాంతాలకు పోస్టింగ్లు వేయవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో సిబ్బంది కొరత, ఖాళీలు లేకపోవడం కొసమెరుపు. -
అయోమయానికి తెర ఎప్పుడో!
సాక్షి, రాజమండ్రి :పుష్కరాల పనులు డిసెంబర్లో ప్రారంభమవుతాయి. ఉభయ గోదారి జిల్లాల్లో 243 స్నానఘట్టాలను నిర్తిస్తాం. రూ.900 కోట్లతో పుష్కర పనులు చేస్తాం.- గోదావరి పుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల చేసిన ప్రకటనలివి. మొత్తం కేటాయించేదెంతన్నది ఇందులో ప్రకటించారే తప్ప.. ఈ మొత్తం నిధుల్లో ఏ శాఖకు ఎంత వస్తుందనేదానిపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితినిబట్టి డిసెంబర్ నెలాఖరు వరకూ వీటిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. శాఖల వారీగా అసలు ఇచ్చేదెంతో, తక్షణం విడుదల చేసేదెంతో తేలిస్తేనే.. ఆ తర్వాత మరో నెల రోజులకు పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పావన గోదావరికి జరిగే మహాపర్వ నిర్వహణకు చేపట్టే మొత్తం పనుల్లో ఇరిగేషన్ శాఖ పాత్రే కీలకం. ఈ మహత్తర సంరంభానికి ప్రధానమైన ఘాట్లు నిర్మించడంతోపాటు, అక్కడ జరిగే ఇతర ఏర్పాట్లలో కూడా ఈ శాఖ ముఖ్య భూమిక పోషించనుంది. పుష్కరాల కోసం జిల్లాలో మొత్తం 145 పనులకు రూ.43 కోట్లతో అంచనాలు తయారు చేశారు. వీటిలో సుమారు 64 పనులు ఘాట్ల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం ఉద్దేశించారు. ఇందుకు రూ.20 కోట్ల మేర ప్రతిపాదనలు తయారు చేశారు. గోదావరి తీరంలోని సుమారు 63 గ్రామాల్లో కొత్తగా ఘాట్లు నిర్మించేందుకు సుమారు రూ.18 కోట్లతో ప్రతిపాదించారు. ఇంకా ఘాట్లలో బారికేడ్ల నిర్మాణం, అత్యవసర సమయాల్లో వినియోగించే స్పీడ్ బోట్లను సిద్ధం చేయడం, పంట్ల మరమ్మతులు, ఘాట్లకు అనుబంధంగా ఉన్న రోడ్ల అభివృద్ధి వంటి మరో 18 పనులకు రూ.5 కోట్లు ఖర్చు కాగలవని ప్రతిపాదించారు. పుష్కరాలు విజయవంతంగా సాగాలంటే ఈ పనులు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత నిధులన్నీ ఇస్తే ప్రస్తుత అంచనాలపై సర్వే చేయించి పక్కాగా తుది నివేదిక తయారు చేయాలి. తర్వాత టెండర్లు పిలవడం లేదా ప్రభుత్వం ఇతర నిర్దేశించిన పద్ధతుల్లో పనులు చేపట్టాలి. మొత్తం 145 పనులకు తుది అంచనాలు ఖరారు చేయాలంటేనే అధికారులకు కనీసం 15 రోజులు పడుతుంది. దీనినిబట్టి చూస్తే రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే నిధులపై స్పష్టత వస్తే అంచనాలకు తుది రూపు ఇవ్వడం, తదనంతర ప్రక్రియకు మరో నెల రోజులైనా పడుతుంది. కనీసం డిసెంబరు నెలాఖరుకైనా పనులు ప్రారంభం కాకపోతే పుష్కరాలనాటికి కొత్త ఘాట్ల నిర్మాణ పనులు పూర్తి కావని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆశించిన నిధుల్లో ప్రభుత్వం కోత పెడితే, మళ్లీ అంచనాలను సవరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పుష్కరాల పనులను మరింత ఆలస్యం చేస్తుంది. ప్రణాళికారహితంగా... ఈసారి పుష్కరాలకు ప్రభుత్వం ప్రణాళికారహితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతిసారీ పుష్కరాలకు జూలై నెలలోనే అంచనాలు తీసుకుని, వాటికి తగినట్టు నిధులు కేటాయించేవారు. తర్వాత తమకు కేటాయించిన నిధుల ప్రకారం ఆయా శాఖలు అంచనాలు వేసుకుని పనులు ప్రారంభించేవారు. కానీ ప్రస్తుతం పుష్కరాలకు ఏడు నెలలు మాత్రమే వ్యవధి ఉన్నా ఇప్పటికీ ఓ స్పష్టతకు ప్రభుత్వం రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
రాజధానిలో రైతెక్కడ?
-
మెడికల్ సీట్ల భర్తీలో గందరగోళం
సీట్లు పొందినా కౌన్సెలింగ్కు రాని మూడు కళాశాలలు 550 సీట్లకు గాను 250 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ హైదరాబాద్: సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎంబీబీఎస్ సీట్లు పొందిన ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాల కోసం మంగళవారం జరిగిన కౌన్సెలింగ్ గందరగోళానికి దారితీసింది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, హైదరాబాద్లోని జేఎన్టీయూలో కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో పలువురు అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్, కొంతమంది అభ్యర్థుల తల్లిదండ్రులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఒకే సామాజిక వర్గానికి 97 సీట్లు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. తాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరించామని జేఎన్టీయూ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు గతంలో మంచి ర్యాంకులొచ్చినా సీటు రాకపోవడంతో యాజమాన్య కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు చాలామంది మంగళవారం కౌన్సెలింగ్కు వచ్చారు. తమకు మంచి ర్యాంకులు వచ్చినా సీట్లు దక్కలేదని, ఇప్పుడేమో సరైన ర్యాంకులు రాని వారికి కన్వీనర్ కోటాలో సీట్లు ఇవ్వడం దారుణమన్నారు. చేతులెత్తేసిన మూడు కళాశాలలు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సీట్లు పొందినా మూడు కళాశాలలు సీట్లు తీసుకునేందుకు నిరాకరించాయి. రెండు రాష్ట్రాల్లోని 5 కళాశాలల్లో 550 సీట్లకు సుప్రీం అనుమతి ఇచ్చింది. అరుుతే 250 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ జరిగింది. కాటూరి, జెమ్స్, బీఆర్కే కళాశాలలు తమకు సీట్లు వద్దంటూ కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి తప్పుకున్నారుు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ కళాశాలల్లో ఏడాదికి కేవలం రూ.10 వేలు వసూలు చేయాలి. అంతేకాదు రూ.10 కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఎంసీఐకి ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లోనే పై మూడు కళాశాలలు తమకు సీట్లు అక్కర్లేదని చెప్పేశాయి. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రారంభం కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కేంద్రంలో అడ్మిషన్ల ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు వర్సిటీ గేటు ముందు ధర్నాకు దిగారు. నిబంధనల మేరకు మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియను మంగళవారమే ముగించాల్సి ఉండగా.. వర్సిటీ అధికారులు సోమవారం అర్థరాత్రి తరువాత నోటిఫికేషన్ను వెబ్సైట్లో పెట్టారు. అరుుతే ఏపీలోని జెమ్స్, కాటూరి మెడికల్ కళాశాలల యాజమాన్యాలు తాము సుప్రీం తీర్పు మేరకు ప్రవేశాలకు కల్పించలేమని పేర్కొంటూ వర్సిటీ అధికారులకు లేఖలు సమర్పించాయి. దీంతో ఏపీలోని మైనార్టీ కళాశాలైన ఫాతిమా మెడికల్ కళాశాలలో మాత్రమే సీట్లు భర్తీ చేశారు. దీంతో ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో సీట్లే లేకుండా పోయాయి. ఏయూ అభ్యర్థులు తెలంగాణలోని మల్లారెడ్డి, మెడిసిటీ కళాశాలల్లోని 15 శాతం అన్ రిజర్వుడ్ సీట్ల కోసం పోటీపడాల్సి వచ్చింది. అరుుతే ఆ సీట్లు ఓయూ ప్రాంత అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో కైవసం చేసుకున్నారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యూరు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్ కేటగిరీ అభ్యర్థులకు కూడా కౌన్సెలింగ్ నిర్వహించారు. -
రుణమాఫీ పై తెలంగాణ సర్కారు మల్లగుల్లాలు
-
ఊరించి.. ఉసూరుమనిపించి
నోటిఫికేషన్ రాకపోవడంతో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన మంత్రుల విరుద్ధ ప్రకటనతో మరింత గందరగోళం అవనిగడ్డలో వినూత్న నిరసన దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్న అభ్యర్థులు చల్లపల్లి/మచిలీపట్నం : మాటలతో మభ్యపెడుతున్న పాలకులపై డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే ప్రకటించిన పాలకులు.. ఇప్పుడు నోరు మెదపకపోవడంపై మండిపడుతున్నారు. సిలబస్లో స్పష్టత కొరవడటం, డీఎస్సీ, టెట్ కలిసి నిర్వహించడం, పోస్టుల వివరాలు వెల్లడించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగానే శనివారం అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం ఎదుట డీఎస్సీకి శిక్షణ పొందేందుకు వచ్చిన అభ్యర్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. పోస్టుల ప్రకటనలో గందరగోళం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరిచుకుని సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని గతంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మొత్తం 10,603 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. కేవలం 7,000 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యా శాఖ గణాంకాలు ద్వారా తెలుస్తోంది. పిల్లలను బట్టే ఉపాధ్యాయులు ఉండేవిధంగా రేషనలైజేషన్ను ప్రకటించి పోస్టులను తగ్గించారని సమాచారం. గతంలో ప్రకటించిన పోస్టుల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు ఎవరికెన్నో వివరించలేదు. వీటిలో ఎస్జీటీ పోస్టులే 7,500 వరకూ ఉన్నట్టు సమాచారం. డీఎస్సీకి పోటీ పడుతున్న వారిలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది బీఈడీ అభ్యర్థులు, మరో 60వేల మంది డీఈడీ అభ్యర్థులు ఉన్నారు. సిలబస్, టెట్ల విషయంలోనూ అంతే డీఎస్సీ సిలబస్పైనా ఇంతవరకూ స్పష్టతలేదు. డీఎస్సీ-2012 సిలబస్నే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. పాత సిలబస్ ప్రకారం రెండేళ్లుగా అవనిగడ్డలో 40వేల మందికిపైగా శిక్షణ పొందారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన 10వేల మంది శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగాలు, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను వదిలి వచ్చారు. ఏడాది శిక్షణ పొందేందుకు భోజనం, వసతి, ఫీజులు కలిపి ఒక్కో అభ్యర్థికి రూ.1.50లక్షలు ఖర్చు అవుతుంది. డీఎస్సీలో అంతర్భాంగా టెట్ను కలిపి 180 మార్కులకు పరీక్షలు నిర్వస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికే టెట్లో అర్హత సాధించిన 3లక్షల మంది ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పిస్తారా.. లేదా.. అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. అందోళనకు సిద్ధమవుతున్న అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో జాప్యాన్ని నిరసిస్తూ అభ్యర్థులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే అవనిగడ్డలో వినూత్న నిరసన తెలియజేశామని, వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే తొలుత జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా, అనంతరం రాజధానిలో ఆందోళనలు చెపడతామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ విడుదల చేసి గందరగోళానికి తెరదించాలని అభ్యర్థులు కోరుతున్నారు. జిల్లాలో 379 పోస్టులు జిల్లాలో స్కూలు అసిస్టెంట్ పోస్టులు 104, లాంగ్వేజ్ పండిట్-49, పీఈటీలు-13, ఎస్జీటీలు-213 మొత్తం 379 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. రేషనలైజేషన్ ప్రకారం విద్యార్థుల సంఖ్యను బట్టి మిగులుగా ఉన్న ఉపాధ్యాయులను విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలలకు సర్ధుబాటు చేస్తే జిల్లాలో 30 ఎస్జీటీ పోస్టులే ఖాళీగా ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను బదిలీ చేస్తే ఆ పోస్టును ఖాళీగా చూపే అవకాశం లేదు. దీంతో ఎస్జీటీ పోస్టులను అధికంగా చూపేందుకు అవకాశం లేదు. విద్యాశాఖాధికారులు రేషనలైజేషన్ ప్రకారం సంబంధిత ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు బదిలీ చేసినా, ఆ పోస్టులను ఖాళీగా చూపటంతో ఎస్జీటీలను 213 మందిని నియమించాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఈ అంశాన్ని గమనించిన రాష్ట్ర ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ జాప్యం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాకముందే టీచర్లు అవసరమైన చోట అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించిం ది. జిల్లాలో 271 పోస్టుల్లో ఇన్స్ట్రక్టర్ల నియమిస్తారా.. లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్కు ఆర్టికల్ 371-డి వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు. ‘సుప్రీం’ తీర్పు ప్రకారమే నడవాలి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం గతంలో ఎస్జీటీలకు డీఎడ్ అభ్యర్థులను మాత్రమే అనుమతిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించేం దుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తి పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుంది - మెట్ల గురవయ్య, కంభం, ప్రకాశం జిల్లా మోసం చేశారు.. ఉపాధ్యాయ దినోత్సవం రోజు డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన పాలకులు మోసం చేశారు. పాలకులకు మా సమస్యలు తెలియవా. మా జీవితాలతో ఆటలాడుకోకుండా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. - పి.దావీదు, నూజివీడు పోస్టులను తగ్గించొద్దు మొత్తం 18,500 పోస్టులు ఉంటే గతంలో 10,600 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 7,500 పోస్టులకు మాత్రమే ఆమోదం లభించిందని మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. రెం డేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాం. పోస్టులు తగ్గించకుండా గతంలో ప్రకటించిన పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. - ఎస్.నాగరాజు, చోడవరం, విశాఖ జిల్లా -
హేతుబద్ధీకరణ ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఉన్న చోటికే టీచర్లను పంపించాలన్న హేతుబద్దీకరణ వ్యవహారం రెండు నెలలుగా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. దీంతో అనేక పాఠశాలల్లో బోధన కుంటుపడుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల కొరత తీవ్రంగా ఉండగా, తెలంగాణలో దాదాపు వేయి స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇక మరో 1,592 స్కూళ్లలో సబ్జెక్టుటీచర్ల కొరత వల్ల గత ఏడాది బదిలీ అయిన టీచర్లను కొత్తస్థానాల్లోకి పంపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే డీఎస్సీ నిర్వహించినా టీచర్లను ఆయా స్కూళ్లకు పంపించడానికి ఐదారు నెలల సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లేని స్కూళ్లలోని టీచర్లను విద్యార్థులు ఉన్నచోటకు పంపించే హేతుబద్దీరణకు ఇంకా మోక్షం లభించలేదు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విద్యార్థులుంటే టీచర్లు లేరు.. టీచర్లు ఉంటే విద్యార్థుల్లేరు. 350 స్కూళ్లలో విద్యార్థుల్లేకపోయినా టీచర్లు ఉన్నారు. 180 స్కూళ్లలో పదిమందిలోపే పిల్లలున్నా నలుగురేసి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక పిల్లలు ఉండీ.. టీచర్లు ఉన్న చోట సరైన బోధన అందడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితి ఇది. విద్యాశాఖ చేసిన అధ్యయనంలో తేలిన నిజాలివి. ఒకటి నుంచి పదో తరగతి వరకున్న పాఠ్యపుస్తకాలను విద్యాశాఖ మార్పు చే సింది. కాని వాటి బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. గత రెండేళ్లలో ఆర్ఎంఎస్ఏ ద్వారా శిక్షణ కోసం రూ. 10 కోట్లు వచ్చినా.. శిక్షణ ఇవ్వకపోవడంతో అవి వెనక్కివెళ్లాయి. ఇందుకు విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణం. టీచర్లకు హాండ్బుక్స్కూడా ఇవ్వలేదు. అలాంటపుడు ఎలా బోధించాలని టీచర్లు వాపోతున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధవిద్యను అమలు చేయాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిస్థితులు ప్రధాన ఆటంకంగా తయారయ్యాయి. ఇదీ స్కూళ్ల స్థితి... వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గురిజాల పాఠశాలలో 254 మంది విద్యార్థులుంటే ప్రభుత్వ నియమించిన టీచర్లు ఇద్దరే. 180 పాఠశాలల్లో పిల్లలు పది మంది లోపే ఉన్నారు. కాని వాటిల్లో ఒక్కో స్కూల్లో నలుగురు చొప్పున టీచర్లు ఉన్నారు. 350 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు. వాటిల్లో ఒక్కరు చొప్పున టీచర్లు ఉన్నారు. టీచర్లు ఉండీ 25 మంది లోపే విద్యార్థులు ఉన్న స్కూళ్లు 300 వరకు ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా ఉన్నా ఒక్క టీచర్తోనే కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలు 3,8,95. ప్రాథమికోన్నత పాఠశాలలు 22. సబె ్జక్టు టీచర్ల కొరత ఉన్న స్కూళ్లు 2 వేలకు పైనే. ఇక గత ఏడాది బదిలీ అయినా సబ్జెక్టు టీచర్ల కొరతతో పాత స్థానాల్లోనే కొనసాగిస్తున్న స్కూళ్లు 1,077. వారిని బదిలీ అయిన స్థానానికి పంపితే టీచరే లేకుండా పోయే స్కూళ్లు 717 ఉంటాయి. -
రాకోయి.. మా ఇంటికి!
ప్రచారానికి వస్తామంటున్నా పట్టించుకోని అభ్యర్థులు టీ కాంగ్రెస్ పెద్దలకు చిత్రమైన పరిస్థితి ప్రచారానికి వస్తాం.. ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు ఫోన్లు హెలికాప్టర్ సిద్ధంగా ఉందని.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని వెల్లడి పదే పదే చెబుతున్నా పట్టించుకోని స్థానిక కాంగ్రెస్ అభ్యర్థులు దీంతో నేడు సొంత జిల్లా వరంగల్లో పర్యటనకు పొన్నాల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: స్పీచ్లు రెడీగా ఉన్నాయి.. హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఉంది.. అస్త్రశస్త్రాలన్నీ సమకూర్చుకున్నారు. వీటితో ప్రచారంలో రేసుగుర్రంలా దూసుకుపోవాలని భావించారు.. అయితే రమ్మనేవారే కరువయ్యారు.. ఎక్కడి నుంచైనా ఆహ్వానం అందుతుందేమోనని చూసిన వారి ఆశలు అడియాసలయ్యాయి.. అలా చూసిచూసి, ఇక లాభం లేదనుకుని వారే రంగంలోకి దిగారు.. జిల్లాలోని అభ్యర్థులకు ఫోన్ చేసి, ప్రచారం చేసి పెడతాం.. ఎప్పుడు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాం.. ఏర్పాట్లు చేసుకోండి ప్లీజ్ అని బతిమాలారు.. అయినా అటునుంచి స్పందన లేకపోవడం చూసి అవాక్కయ్యారు.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్లోని బడా నేతల పరిస్థితి..! సాధారణంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు.. గెలుపు కోసం అందివచ్చే ప్రతి చిన్న అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. తమ పార్టీలోని పెద్ద నేతలతో ఎలాగైనా ప్రచారం చేయించుకోవాలని తహతహలాడతారు. అందుకోసం వారిని ఒప్పించి తమ తమ నియోజకవర్గాలకు తీసుకెళ్లి ప్రచారం చేయించుకుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మేం మీ నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేసిపెడతాం.. చేయించుకోండి ప్లీజ్ అంటూ బడా నేతలే అభ్యర్థులకు ఫోన్ చేసి అడుగుతున్నా, వారు స్పందించకపోవడం విశేషం. తెలంగాణలో ఎన్నికల సమరానికి ఇక పదిరోజులే గడువు ఉంది. ఓవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివిధ జిల్లాలను చుట్టేస్తూ, ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను కడిగిపారేస్తున్నారు. దీంతో కేసీఆర్ను దీటుగా ఎదుర్కోవాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు సొంత నియోజకవర్గాలకే పరిమితమైన ఆయా నేతలు.. ఇతర జిల్లాల్లో కూడా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో-చైర్మన్ షబ్బీర్అలీ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్బాబు, కో-చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ఈనెల 20 నుంచి 28 వరకు కొన్నిచోట్ల కలిసికట్టుగా, మరికొన్ని చోట్ల ృందాలు ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తొలివిడతగా ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పర్యటించేందుకు ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. తాము ప్రచారానికి వస్తున్నామని, ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా జిల్లాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, స్థానిక నేతలకు పదేపదే చెబుతున్నా.. అటునుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో వారికి ఏమి చేయాలో అర్థం కావడంలేదు. హలో.. నేను పోన్నాలను మాట్లాడుతున్నా! టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత రెండు రోజులుగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోటీచేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ చేసి.. ‘‘పార్టీ సమకూర్చిన హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. జిల్లాలో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో మీరే చెప్పండి. రూట్మ్యాప్ తయారు చేయండి’’ అని కోరినా ఇప్పటి వరకు ఆయా జిల్లాల నుంచి స్పందన రాలేదు. శనివారం ఉదయం కూడా పొన్నాల ఆయా జిల్లా నేతలకు ఫోన్ చేసినా.. అటువైపు నుంచి, జిల్లా నాయకులతో మాట్లాడి చెబుతామనే సమాధానమే ఎదురైంది. ఒకవైపు రూ.లక్షలకు లక్షలు అద్దె చెల్లించి తీసుకున్న హెలికాప్టర్ ఖాళీగా ఉండటం, మరోవైపు ప్రచారానికి వస్తున్నామని చెప్పినా అవతలివైపు నుంచి స్పందన లేకపోవడంతో.. ఇక చేసేదేమీ లేక తన సొంత జిల్లా వరంగల్లోనైనా పర్యటించాలని పొన్నాల నిర్ణయించుకున్నారు. వెంటనే వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఫోన్చేసి.. తాను ఆదివారం జిల్లాలో పర్యటిస్తానని, స్థానిక నేతలు, అభ్యర్థులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి భూపాలపల్లి, గీసుకొండ, వర్ధన్నపేట, హన్మకొండ ప్రాంతాల్లో పర్యటించడంతోపాటు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్షో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సొంత జిల్లాలో కాబట్టి నాయకులందరినీ సమన్వయం చేసి జనసమీకరణ చేయడం సమస్య కాదనే ఉద్దేశంతోనే అక్కడ ప్రచారానికి సిద్ధమయ్యారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా పర్యటనను విజయవంతం చేస్తే ఇతర జిల్లాల స్థానిక అభ్యర్థులు కూడా ప్రచారానికి పిలుస్తారని పొన్నాల భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలంతా కలిసికట్టుగా ఈనెల 22, 23, 24, 26, 28 తేదీల్లో జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకోసం ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే దానిపై రూట్మ్యాప్ను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కాంగ్రెస్ కార్యాలయాలకు సమాచారం పంపారు. కలిసికట్టుగా, విడివిడిగా ప్రచారం చేస్తాం: పొన్నాల తనతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, షబ్బీర్అలీ తెలంగాణలో ప్రచారం చేయనున్నట్లు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఈనెల 22 నుంచి 28 వరకు తామంతా కలిసికట్టుగా, కొన్నిచోట్ల విడివిడిగృ, బందాలుగా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు సోనియాగాంధీ, రాహుల్గాంధీ ప్రచారం చేయని ప్రాంతాల పై ప్రధానంగాృదష్టి పెట్టినట్టు తెలిపారు. -
ఉగాది ఎప్పుడు?
-
కిరణ్ ‘నిర్ణయాల’ ఫైళ్లపై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ఉత్తర్వులు జారీ చేసి, మంత్రివర్గం ఆమోదం పొందాల్సి ఉన్న ఫైళ్లపై అయోమయ పరిస్థితి నెలకొంది. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆ ఫైళ్లకు ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందో, ఏది తిరస్కరిస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ఫైళ్లను ఆమోదం (రాటిఫికేషన్) కోసం గవర్నర్కు పంపనున్నారు. ఈమేరకు గవర్నర్ నరసింహన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కేబినెట్ ఉనికిలో లేనందున కిరణ్ నిర్ణయాల ఫైళ్లను కేబినెట్ తరఫున గవర్నర్ ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేస్తారు. అయితే కేబినెట్ ముందు పెట్టాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను మాత్రం తనకు పంపించవద్దని ఆదేశాల్లో గవర్నర్ స్పష్టం చేశారు. ఆ ఫైళ్లను తాత్కాలికంగా సస్పెన్షన్లో ఉంచాలని సూచించారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో ఏర్పడే కొత్త కేబినెట్ల ఆమోదానికి వాటిని పంపాలని, ప్రస్తుతం వాటిని సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ విభాగానికి కూడా పంపవద్దని పేర్కొన్నారు. దీంతో గతంలో వచ్చిన అటువంటి ఫైళ్లను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ విభాగం ఇప్పుడు సంబంధిత శాఖలకు తిరిగి పంపిస్తోంది. -
టీడీపీతో పొత్తుపై కమలనాథుల్లో తర్జనభర్జన
-
కప్పల తక్కెడ ప్రత్యామ్నాయం
విశ్లేషణ: డాక్టర్ ఏపీ విఠల్ మరోసారి తృతీయ ప్రత్యామ్నాయం మాట వినవ స్తోంది. దానికి వెన్నెముక కావాల్సిన వామపక్షాలు 2009 ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదు. సంకుచితమైన ఎన్నికల ప్రయోజనా లకోసం రాజకీయ ఊసరవెల్లులతో పొత్తులకోసం ఎగబడటం మాని, నిజమైన ప్రజాప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించే దిశగా కమ్యూనిస్టులు ముందుకు సాగుతారని ఆశించగలమా! మళ్లీ సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న తొలి దశాబ్ద కాలంలో మన ప్రజాస్వామిక వ్యవస్థకు రాజకీయ, ఆర్థిక, సామాజిక దిశా నిర్దేశన అంటూ ఉండేది. ఆ తదుపరి పరిస్థితి నానాటికీ దిగజారి పోతూ, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం క్షీణ దశకు చేరింది. పార్లమెంటరీ వ్యవస్థకు మూల స్తంభాలైన రాజకీయ పార్టీలలో విలువలు, విశ్వసనీయత, ప్రజా సంక్షేమంపట్ల నిబద్ధత. లుప్తమైపోయాయి. అవినీతి, అధికార వ్యామోహం, అవకాశవాదం, కుల, మతోన్మాదాలకు అవి ఆలవాలంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో...యథావిధిగా ప్రధాన జాతీయ రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు, వాటి కూటములు పరస్పర దూషణల పర్వంలో మునిగిపోయాయి. ఏమైతేనేం ఇరు పక్షాలు ఒకరి గుట్టును మరొకరు రచ్చకెక్కిస్తూ దొందూ దొందేననే సత్యాన్ని విప్పిచెబుతున్నాయి. బీజేపీ నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే, కాంగ్రెస్ రాహుల్గాంధీ తమ ప్రధాని అభ్యర్థి అని చెప్పకుండానే చెబుతోంది. ఎన్నికలంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య పోరన్నట్టున్న నేటి తీరును చూస్తుంటే అధ్యక్ష తరహా పాలన దిశకు సాగుతున్నట్టు అనిపిస్తోంది. వ్యతిరేకతే ‘ప్రత్యామ్నాయం’? షరా మామూలే అన్నట్టు యూపీఏ, ఎన్డీఏలకు చెందని పార్టీలతో ‘తృతీయ ప్రత్యామ్నాయం’ రంగ ప్రవేశం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీల పట్ల వ్యతిరేకతే దాని ప్రధాన లక్ష్యం. ఆ వ్యతిరేకతకు మించి చెప్పుకోదగ్గ మరే ఉమ్మడి కార్యక్రమమూ లేని ఆ కూటమి ఎలాంటి ప్రత్యామ్నాయం? అసలు ఇలాంటి కప్పల తక్కెడ ప్రత్యామ్నాయం ప్రజలను ఎలా ఉద్ధరించగలదు? ప్రజల విశ్వసనీయతను చూరగొనడానికి కావల్సింది ప్రధాన కూటములు రెంటికి భిన్నమైన, విస్పష్ట విధానం. తృతీయ ప్రత్యామ్నాయం అంటున్న కూటమికి లేనిది అదే. సీపీఎం, సీపీఐ తదితర వామపక్షాలే తృతీయ కూటమికి వెన్నెముక. వామపక్షాలు 2009 ఎన్నికల పరాజయం నుంచి ఇంకా కోలుకోలేదు. గత ఎన్నికల్లోలాగా ఏదో ఒక విధంగా తృతీయ ప్రత్యామ్నాయానికి ఊపిరులూది, కనీస కార్యక్రమం ప్రాతిపదికపై బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను ఒక తాటిపైకి తీసుకురాగల శక్తి నేడు వాటికి లేదు. ‘ఉడతకెందుకు ఊళ్లేలే పని’ అని అవి అపహాస్యానికి గురవుతున్నాయి. అయినా, అవి కాక మరే బలమైన ప్రాంతీయ పార్టీ తృతీయ కూటమికి నేతృత్వం వహించగలమని చెప్పుకునే పరిస్థితి లేదు. సమాజ్వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్, జనతాదళ్ (యు) నేత నితీశ్కుమార్, బీఎస్పీ నేత్రి మాయావతి, అన్నా డీఎంకే నేత్రి జయలలిత ఎవరికి వారు తామే ప్రధాని పీఠం దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి వీరిలో ఎవరు నేతృత్వం వహిస్తామన్నా కూటమి ఉండనే ఉండదు. పోనీ వాటికి కాంగ్రెస్, బీజేపీలకు భిన్నమైన, పురోగామి, ప్రజానుకూల విధానాలున్నాయా అంటే అవీ లేవు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవి కాంగ్రెస్, బీజేపీలలాగే నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అనుసరిస్తూ, బడా కార్పొరేట్ సంస్థలకు పోటీలుపడి మేలు చేస్తున్నాయి, ఆర్థిక వ్యత్యాసాలను పెంచిపోషిస్తున్నాయి. ఎక్కడిదాకో ఎందుకు చంద్రబాబు చరిత్రను చూస్తే సరిపోతుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని అధినాయకునిగా ఒక్క వెలుగు వెలిగిన ఆయన కేంద్రంలో సైతం చక్రం తిప్పారు. తానే వాజపేయిని ప్రధానిని చేశానని, అబ్దుల్ కలామ్ను రాష్ట్రపతిని చేశానని ఆయన ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. దేశంలో వాజపేయి హవా నడుస్తున్నప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకొని పైకి ఎగబాకాలని ఆరాటపడ్డారు. కమ్యూనిస్టులతో మైత్రికి తిలోదకాలిచ్చి ‘అన్ని ఇజాలు అంతరించాయి, మిగిలింది టూరిజమే’ నని వారి మౌలిక సిద్ధాంతాన్నే హేళన చేశారు, మతతత్వ బీజేపీతో చేయి కలిపారు. 2002లో గుజరాత్ మారణకాండపై నరేంద్రమోడీ ని ఘాటుగా విమర్శించారు.తీరా పార్లమెంటులో ఆ అంశం చర్చకు వచ్చినప్పుడు తమ పార్టీని ఓటింగ్లో పాల్గొనకుండా చేసి బీజేపీ ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. 2004 ఓటమి తర్వాత అదే చంద్రబాబు... బీజేపీతో పొత్తు చారిత్రక త ప్పిదమని, భవిష్యత్తులో మరెన్నడూ దానితో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు. ఇప్పుడు మోడీ గాలి వీస్తోందని పసిగట్టి మోడీ నామ జపంతో అందలమెక్కాలని చూస్తున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే బాబులాంటి రాజకీయ ఊసరవెల్లితో కలిసి వామపక్షాలు 2009లో మహా కూటమిని నిర్మించడమే ఆశ్చర్యం. సైద్ధాంతిక నిబద్ధతగలవిగా పేరున్న కమ్యూనిస్టు పార్టీలు అప్రతిష్ట పాలయ్యాయే తప్ప, వ్రతం చెడిపోయినందుకు ఫలితం దక్కిందా అంటే అదీ లేదు. కమ్యూనిస్టు పార్టీలే ఇలా ఎన్నికల ప్రయోజనాల కోసం ఊసరవెల్లులతో కలుస్తుంటే... మూడో కూటమి పక్షాలంటున్న ప్రాంతీయ పార్టీల గురించి చెప్పేదేముంది? ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, అన్నా డీఎంకే, డీఎంకే, జేడీయూ, ఆర్జేడీ, ఆర్ఎల్డీలు వేసిన, వే స్తున్న కప్పదాట్లు ఎవరికి తెలియనివి? భ్రమలు వీడాల్సింది కమ్యూనిస్టులే సీపీఎం లక్ష్యం సోషలిజానికి తొలిమెట్టయిన జనతా ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన. 1964లో అది ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయింది. శాంతియుతంగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గంలో ఆ లక్ష్యాన్ని సాధిం చడం వీలుకాదనే అస్పష్టమైన అభిప్రాయం అప్పట్లో దానికి ఉండేది. ప్రజాబాహుళ్యంలో ఎన్నికల ద్వారా తమ జీవితాలను మార్చుకోగలమనే భ్రమ ఇంకా ఉంది. కాబట్టి ఎన్నికలు, చట్ట సభల్లో కొంతకాలం పాల్గొనక తప్పదు అని ఆ పార్టీ భావించింది. అనుభవంలో తేలిందేమిటి? ప్రజలలో భ్రమలు తొలగడం కాదు, మార్క్సిస్టు పార్టీలో ఆ భ్రమలు పెరుగుతున్నాయని! ఎన్నికల రాజకీయాలు, పాలకవర్గ పార్టీల పొత్తులతో తమ పార్టీలో కూడా ఆడంబర జీవితం, పదవీ వ్యామోహం, అహంకారం, ధనార్జనాపేక్ష, స్వార్థపరత్వం తరతమ స్థాయిలలో వ్యాపించాయని ఆ పార్టీ తన ‘ఆత్మవిమర్శ’లో పేర్కొంది. ‘ఎవరితో పొత్తులు పెట్టుకున్నా నష్టపోయింది మేమే’నంటూ ప్రస్తుత శాసనసభలోని ఏకైక సీపీఎం సభ్యుడు రంగారెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రజాఉద్యమాలే కమ్యూనిస్టులకు ప్రాణం. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, ప్రజాపోరాటాలకు మద్దతును కూడగట్టడమే చట్ట సభల్లో సైతం వారి ప్రధాన కర్తవ్యం. అంతేగానీ అవకాశవాద పొత్తులతో లక్ష్యాన్ని సాధించలేరు. అలా అని ఇతర పార్టీలతో అసలే కలవొద్దనీ కాదు. ఎలాంటి పొత్తులకైనా ముందు ప్రజాసమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు ఐక్య కార్యాచరణను సాగించాలి. ఎన్నికల పట్ల కూడా అదే వైఖరిని అనుసరించాలి. 1983లో సీపీఐ, సీపీఎంలు ముందే ఒక అవగాహనకు వచ్చి, ఎన్టీఆర్ తెలుగుదేశంతో చర్చలకు వెళ్లాయి. చర్చలు విఫలమయ్యాక, ఒక్క సీపీఎంతోనే పొత్తుకు సిద్ధమని, వారు కోరిన స్థానాలన్నీ ఇస్తామని ఎన్టీఆర్ రాయబారం పంపారు. నాలుగు సీట్లు గెలుచుకోవడం కంటే వామపక్ష ఐక్యతే తమకు ముఖ్యమంటూ పుచ్చలపల్లి సుందరయ్య తిరస్కరించారు. నేటి కమ్యూనిస్టుల నుంచి అలాంటి వైఖరిని ఆశించగలమా? కార్మికులు, రైతులు, బడుగు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ పెద్ద పీట వెయ్యాలి. ఆ ఐక్య కార్యాచరణపైనే వామపక్ష ఐక్యత పటిష్టమవుతుంది. కనీస ప్రజానుకూల, పురోగామి, ప్రజాస్వామిక ప్రణాళిక ప్రాతిపదికపైనే కమ్యూనిస్టేతరులతో ఐక్యకార్యాచరణగానీ, ఎన్నికల పొత్తులుగానీ ఉండాలి. అంకితభావంతో దీర్ఘకాలంపాటు సాగించాల్సిన ఈ కృషికి తృతీయ కూటమో, చతుర్థ కూటమో ప్రత్యామ్నాయం కావు. అలాంటి సుదీర్ఘ కార్యాచరణతో నిజమైన ప్రజా ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించే దిశగా కమ్యూనిస్టు పార్టీలు ముందడుగు వేస్తాయని ఆశించగలమా? (వ్యాసకర్త మార్క్సిస్ట్ విశ్లేషకులు)