counting
-
తెలంగాణలో కొనసాగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-
తెలంగాణలో కొనసాగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం అరాచకానికి పాల్పడింది: లక్ష్మణరావు
-
MLC ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
-
అనుమానాలను నివృత్తి చేస్తాం..రండి!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రతీ దశలోనూ పారదర్శకంగా జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని, ఆధారాలు చూపేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ రాసిన లేఖకు ఈసీ స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఈసీ ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియ ప్రతి దశలోనూ కాంగ్రెస్తోపాటు అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు/ఏజెంట్ల ప్రమేయం ఉందని వివరించింది. ఓటింగ్ సరళిపై ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదని, పోలింగ్ బూత్ల వారీగా అభ్యర్థులందరికీ ఆ డేటాను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని నొక్కి చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించి రాతపూర్వకంగా బదులిస్తామని ఈసీ స్పష్టం చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు మహాయుతి కూటమిలోని బీజేపీ 132, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్) 41 సీట్లు సాధించగా, మహా వికాస్ అఘాడీ పక్షాలైన కాంగ్రెస్కు 16, శివసేన (ఉద్ధవ్)కు 20, ఎన్సీపీ (శరద్) పార్టీకి 10 స్థానాలు దక్కడం తెలిసిందే. -
ఉత్కంఠ రేపుతున్న ప్రజాతీర్పు..
-
By Election Results: యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీదే హవా
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం(నవంబర్23) వెలువడ్డాయి. మహారాష్ట్రలో ఒక ఎంపీ సీటు, కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు జరగ్గా వయనాడ్ను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ 4లక్షలకుపైగా రికార్డు మెజారిటీ సాధించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ సీటును బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్..48 సీట్లలో యూపీలో కీలకమైన 9 సీట్లున్నాయి. యూపీలో ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా రెండు చోట్ల సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) గెలిచింది. వెస్ట్బెంగాల్..వెస్ట్బెంగాల్లో ఆరు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ మళ్లీ సత్తా చాటింది. ఇక్కడ ఆరింటికి ఆరు స్థానాలను మమతా బెనర్జీ పార్టీ కైవసం చేసుకుంది. బీహార్..బీహార్లో నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసింది.ఇక్కడ తరారీ (బీజేపీ ), రామ్గఢ్ (బీజేపీ), బేలాగంజ్ (జేడీయూ), ఇమామ్గంజ్ (హెచ్ఏఎం(ఎస్))రాజస్థాన్..రాజస్థాన్లో ఉప ఎన్నికలు జరిగిన 7 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 5 గెలుచుకుంది. ఒక సీటులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా భారత్ ఆదివాసీ పార్టీ(బీఏడీవీపీ) ఒక సీటు గెలుచుకుంది. కర్ణాటక..కర్ణాటకలోని 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కర్ణాటకలోకి శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై ఓటమి13 వేలకుపైగా ఓట్లతో బొమ్మైపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్పంజాబ్.. పంజాబ్లో మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా మూడింటిలో ఆమ్ఆద్మీపార్టీ, ఒక సీటులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. కేరళ..కేరళలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నకలు జరగగా ఒక చోట అధికార సీపీఎం మరొకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. 4 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన ప్రియాంక గాంధీ 👉కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ మరోసారి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4లక్షల 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో రాహుల్గాంధీ ఇదే స్థానం నుంచి 3,64,422 ఓట్ల ఆధిక్యత సాధించారు. 👉కేరళలోని పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతిల్ 18,840 ఓట్ల భారీ తేడాతో బీజేపీ అభ్యర్థి సి కృష్ణకుమార్పై విజయం సాధించారు.అస్సాం.. అస్సాంలోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగగా నాలుగింటిలో రెండింటిని అధికార బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి ఏజీపీ గెలుచుకున్నాయి. సిక్కిం..సిక్కింలోని రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగగా రెండు సీట్లలో ఎస్కేఎం గెలుపొందింది. గుజరాత్..గుజరాత్లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఒక్క సీటులో బీజేపీ గెలుపొందింది. చత్తీస్గఢ్..ఛత్తీస్గఢ్లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా దానిని బీజేపీ గెలుచుకుంది.ఉత్తరాఖండ్..ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఇక్కడ బీజేపీ గెలుపొందింది. మేఘాలయ..మేఘాలయాలోని ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఈ సీటును ఎన్పీపీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.ఇది కూడా చదవండి: Jharkhand Election Result: ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి: జేఎంఎం -
US Election Results 2024: ట్రంప్కు 50.8 శాతం, హారిస్కు 47.5 శాతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన మెజారిటీని మరింతగా పెంచుకునే దిశగా సాగుతున్నారు. విజయానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా ఆయనకు ఇప్పటికే 295 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ 226 ఓట్లు సాధించారు. మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నా 48 రాష్ట్రాల్లో ఇప్పటికే ఫలితం తేలింది. అరిజోనా, నెవడాల్లో మాత్రమే తేలాల్సి ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ట్రంపే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాటిలోని 17 ఎలక్టోరల్ ఓట్లు కూడా ఆయన ఖాతాలోనే పడితే ఆయన మొత్తం 312 ఓట్లు సాధిస్తారు. ఇది 2016లో తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు సాధించిన ఓట్ల కంటే (304) అధికం. ట్రంప్కు ఇప్పటిదాకా 50.8 శాతం, హారిస్కు 47.5 శాతం ఓట్లొచ్చాయి. ఆయన 7,27,34,149 ఓట్లు, హారిస్ 6,80,49,758 ఓట్లు సాధించారు. కాంగ్రెస్లో... అధ్యక్షునితో పాటు కాంగ్రెస్కు కూడా ఎన్నికలు జరిగాయి. సెనేట్లోని 100 స్థానాల్లో 34 సీట్లకు, ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు 11 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగాయి. బిల్లుల ఆమోదంలో అత్యంత కీలక పాత్ర పోషించే సెనేట్లో నాలుగేళ్ల అనంతరం రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో వారి స్థానాల సంఖ్య మెజారిటీ మార్కును దాటి 52కు చేరింది. డెమొక్రాట్లకు 45 స్థానాలకు పరిమితమయ్యారు. డెమొక్రాట్లు ఇప్పటికే 3 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. ప్రతినిధుల సభలో కూడా రిపబ్లికన్ల హవాయే సాగుతోంది. మెజారిటీకి 218 సీట్లు కావాల్సి ఉండగా వారికిప్పటికే 206 సీట్లు దక్కాయి. డెమొక్రాట్లు 192 సీట్లే గెలుచుకున్నారు. వారిప్పటికే 4 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. మరో 37 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. -
US Elections 2024: మరి ఓట్ల లెక్కింపు ఎలా?
యూఎస్ స్టేట్స్లో పోలింగ్ నడుస్తోంది. మొదటి దశ, చివరి దశల పోలింగ్ ముగిసిన వెంటనే.. ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అమెరికాలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయని తెలిసిందే. ఓటింగ్ మెషీన్లపై అక్కడి ఓటర్లలో నమ్మకం లేకపోవడం అందుకు ప్రధాన కారణం. అయితే అక్కడి ఎన్నిక విధానం తరహాలో కౌంటింగ్ కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది. మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది కదా. కానీ, అమెరికాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే పోలైన ఓట్లను మొదట లెక్కిస్తారు. తర్వాత మెయిల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. దేశాల నుంచి వచ్చిన ఓట్లను, మిలటరీ బ్యాలెట్లను ఆ తర్వాత లెక్కిస్తారు. ఇందుకోసం..కాన్వాసింగ్(canvassing) ప్రక్రియ ద్వారా ఎన్నికైన స్థానిక ఎన్నికల అధికారులు ఓట్లను పరిశీలించి లెక్కిస్తారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లున్నాయి? అనేది పోలుస్తూ.. అర్హత గల ప్రతిఓటూను లెక్కించేలా చూడటమే వీరి పని.బ్యాలెట్పై ఏమైనా మరకలు ఉన్నాయా?.. బ్యాలెట్ పాడైపోయిందా?.. ఇలా కక్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యంతరంగా అనిపిస్తే.. డాక్యుమెంటేషన్ చేసి దర్యాప్తు చేస్తారు. అలాగే.. కౌంటింగ్ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ స్కానర్లతో జతచేస్తారు. దీనివల్ల ఫలితాల పట్టిక కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ స్కానర్లతో కాకుండా మాన్యువల్గానూ లెక్కిస్తారు. మరికొన్ని సమయాల్లో రెండుసార్లు కౌంటింగ్ జరుపుతారు. అయితే.. కాన్వాస్లో ఎవరు పాల్గొనాలనేదానిపై కఠిన నిబంధనలుంటాయి. -
99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది
న్యూఢిల్లీ: ప్రతికూల ఫలితాలిచి్చన హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పద్ధతి, ఈవీఎంల పనితీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ‘‘ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం(లోక్తంత్ర) ఓడిపోయింది. మరో వ్యవస్థ(తంత్ర) అక్రమంగా గెలిచింది’’ అంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కుట్రకు పాల్పడిందని పరోక్షంగా విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది ‘‘ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వెల్లడైన ఫలితాలివి. వీటిని మేం ఒప్పుకోం. పారదర్శకమైన, ప్రజాస్వామ్యయుత పద్ధతి ఓటమిపాలైంది. హరియాణా అంకం ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది ఇంకా కొనసాగుతుంది. బ్యాటరీ 99 శాతం నిండిన ఈవీఎంలలో బీజేపీ గెలిస్తే, 70 శాతం బ్యాటరీ ఉన్న ఈవీఎంలలో కాంగ్రెస్ గెలిచింది. ఇందులో కుట్ర దాగుంది. 12 నుంచి 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరిగితే మొదట ఆశ్రయించేది ఎన్నికల సంఘాన్నే.పారదర్శకంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అది. అందుకే తీవ్రమైన ఈ అంశంపై లిఖితపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. నిరీ్ణత గడుపులోగా చర్యలు తీసుకోవాలని పట్టుబడతాం. ఓట్ల లెక్కింపు, ఈవీఎంల పనితీరుపై చాలా నియోజకవర్గాల్లో సందేహాలు పెరిగాయి. ప్రతి ఒక్కరితో మాట్లాడాం. ఇది విశ్లేషణల సమయం కాదు. మా నుంచి విజయాన్ని లాక్కున్నారు. వ్యవస్థను అధికార పార్టీ దుర్వినియోగం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పు కోరుకుంటున్నారనే వాస్తవం ప్రతి ఒక్కరికీ తెలుసు. దీనికి ఫలితాలు దర్పణం పట్టట్లేవు.ఫలితాలను కాంగ్రెస్ అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం కౌంటింగ్, ఈవీఎంల పనితీరు, సమగ్రత ప్రశ్నార్థకంలో పడటమే. దాదాపు 3–4 జిల్లాల్లోని 12–14 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు విధానం, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానిక యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిడి మోపారు. ఇదంతా కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఒత్తిడే’’ అని జైరాం రమేశ్ అన్నారు. 200 ఓట్ల తేడాతో ఓడారు : ‘‘ 200 ఓట్లు, 300 ఓట్లు, 50 ఓట్లు.. ఇలా అత్యల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడారు. చక్కని ఆధిక్యత కనబరిచిన అభ్యర్థులు హఠాత్తుగా 100–200 ఓట్ల తేడాతో ఓడిపోవడమేంటి?. అవకతవకలు, అక్రమాల వల్లే ఇది సాధ్యం. అనూహ్య, దిగ్భ్రాంతికర పరిణామమిది. మార్పును కోరుకుంటూ హరియాణా ప్రజలు ఆశించిన దానికి, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వెల్లడైన ఫలితమిది’’ అని జైరాం ఆరోపించారు. ఎందుకంత నెమ్మది? : అంతకుముందు మధ్యాహ్నం వేళ జైరాం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ‘‘ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా ఈసీఐ వెబ్సైట్లో అప్డేట్స్ అనూహ్యంగా నెమ్మదించాయి. దీనికి కారణమేంటి? అదమ్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి చందర్ ప్రకాశ్ 1,268 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ ఆయనకు గెలుపు సరి్టఫికేట్ ఇవ్వట్లేదు. ఈసీ వెబ్సైట్లో కూడా ఆయన గెలిచినట్లుగా చూపించట్లేదు. చివరి మూడు రౌండ్ల అప్డేట్స్ ఇవ్వట్లేదు. అనవసర ఆలస్యానికి కారణమేంటి?’ అని జైరాం ప్రశ్నించారు. ఆలస్యం జరగలేదు: ఈసీ : ఈసీ అప్డేట్స్ ఆలస్యమయ్యాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ ఆరోపణల్లో నిజం లేదు. బాధ్యతారాహిత్యంతో, తప్పుడు ఉద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల రూల్ నంబర్ 60 ప్రకారం ఆయా కౌంటింగ్ కేంద్రాల అధికారులు నడుచుకున్నారు. హరియాణా, జమ్మూకశీ్మర్లో లెక్కింపుపై అప్డేట్స్ ఆలస్యమయ్యాయన్న మీ మెమొరాండంలో ఎలాంటి వాస్తవాలు లేవు. ప్రతి ఐదు నిమిషాలకు అన్ని నియోజకవర్గాల నుంచి 25 రౌండ్ల ఫలితాలు అప్డేట్ అవుతూనే ఉంటాయి’ అని ఈసీ వివరణ ఇచి్చంది. ఈసీ వివరణపై కాంగ్రెస్ అసహనం వ్యక్తంచేసింది. ‘‘ తటస్థ వైఖరిని అవలంబించాల్సిన ఈసీ ఏకపక్షంగా విపక్ష పార్టీ విన్నపాలను తోసిపుచ్చడం సహేతుకం కాదు. ఫిర్యాదుపై సంప్రదింపుల స్థాయిని ఈసీ దిగజార్చింది’’ అని జైరాం అన్నారు. -
ఉప ఎన్నికల్లో ఎన్డీయేకు షాక్.. ఇండియా కూటమి జోరు
ఢిల్లీ, న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 10 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించగా.. కేవలం రెండు స్థానాల్లోనే ఎన్డీయే కూటమి విజయాన్ని అందుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కాగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే ఇండియా కూటమి అభ్యర్థులు లీడింగ్లో కొనసాగారు. ఇక, బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. బెంగాల్లోని రాయిగంజ్ (కృష్ణ కల్యాణి), రణఘాట్ సౌత్ (ముకుత్ మణి అధికారి), బాగ్ద (మధుపర్ణ ఠాకూర్), మాణిక్తలా(సప్తి పాండే) విజయం సాధించారు. ఇక్కడ బీజేపీకి గట్టి షాక్ తగింది. మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్లోని డెహ్ర, నలగార నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. హమీర్పూర్ స్థానంలో బీజేపీ గెలుపొందింది. ఇక, మధ్యప్రదేశ్లోని అమర్వర అసెంబ్లీలో బీజేపీ అభ్యర్ధి కమలేష్ ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. పంజాబ్లోని జలంధర్ వెస్ట్ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం అందుకున్నారు. తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ ఘన విజయం సాధించారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ (లాక్ పత్ సింగ్), మంగళూర్(క్వాజి మొహమ్మద్ నిజాముద్దిన్) కాంగ్రెస్ విజయభేరి మోగించింది. కాగా, బీహార్లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. ఉప ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి బూస్ట్ ఇవ్వగా, ఎన్డీయే కూటమికి షాకిచ్చాయి.సీఎం సతీమణి విజయం..హిమాచల్ ప్రదేశ్లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి, కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకుర్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 8,990 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక, హమీర్పుర్ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు.బెంగాల్లో తృణమూల్ క్లీన్స్వీప్..పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్ కాంగ్రెస్.. తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయ్గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్తలా.. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఉత్తరాఖండ్లో మంగలౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.పంజాబ్ బైపోల్ ఆప్దే..పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థి షీతల్పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని అమర్వాడాలో భాజపా నేత కమలేశ్ షా గెలుపొందారు. బిహార్లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ జయకేతనం ఎగురవేశారు. Assembly by-elections: Out of 13 Assembly seats, Congress won four seats. TMC won 4 seats. AAP won the Jalandhar West seat in Punjab. BJP won 2 seats, DMK won 1 seat. Independent candidate Shankar Singh won on Rupauli seat of Bihar. pic.twitter.com/lJWtsVWI46— ANI (@ANI) July 13, 2024 -
జగన్నాథ రహస్యం!
లక్షలాది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాల నిల్వ గది(రత్న భండార్)ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు, పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం చెప్పారు.180 రకాల ఆభరణాలు1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి. ‘‘ 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు నేనూ వెళ్లా. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతోపాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తరభారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్కు అందజేశాం’ అని ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా రెండేళ్ల క్రితం ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.2018లో మరోసారి ప్రయత్నించి..పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటిగదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరీ జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. అప్డేట్స్హోరాహోరీగా సాగిన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మూడో రోజు.. కొనసాగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నిక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఇప్పటివరకు 44 మంది అభ్యర్థులను ఎలిమినేట్తీన్మార్ మల్లన్న ( కాంగ్రెస్) : 1,23,873రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్): 1,04,990గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి: 43,797గెలుపు కోటాకు −31,222 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నగెలుపు కోటాకు 50105 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తిఅశోక్ ఫలితాలను వెల్లడించని అధికారులుఅశోక్ ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత మొదలుకానున్న బీజేపీ అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శుక్రవారం మధ్యాహ్నానికి 37 మంది ఎలిమినేట్కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,410 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,676 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,571 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 29,862 ఓట్లు గెలుపు కోటాకు 31,685 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా, 50,419 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి ఉన్నారు.మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచ్చినా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో గోల్ మాల్.. రాకేష్ రెడ్డి సీరియస్
సాక్షి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ తీరుపై బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గోల్మాల్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. మూడో రౌండ్లో కాంగ్రెస్కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారని ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదని దుయ్యబట్టారు.ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తామని చెప్పారు రాకేష్ రెడ్డి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. రిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందన్నారు. తమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తాజాగా మూడో రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) లీడ్లో ఉన్నారు. ఆయనకు ఈ రౌండ్లో 4207 ఓట్ల ఆధిక్యత లభించింది.మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234.. రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356.. ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516.. అశోక్ (స్వతంత్ర) 27,493 ఓట్లు పడ్డాయి. చెల్లిన ఓట్లు 2,64,216 కాగా చెల్లని ఓట్లు 15784గా ఉన్నాయి. ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్న 18878 ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి చేయగా. మరో 48013 ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం.. కౌంటింగ్లో హైడ్రామా
నల్లగొండ, సాక్షి: నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్డేట్స్ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లుగెలుపు కోటా 155095 గా నిర్ణయంమొత్తం చెల్లిన ఓట్లు 310189చెల్లని ఓట్లు 25824మొత్తం పోలైన ఓట్లు 336013చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) గెలుపుకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32282బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపుకి కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50847మరికాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం100 నుంచి 500 ఓట్ల ఎలిమినేషన్ చేయడానికి సుమారు 4 గంటల సమయం: అధికారులు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ లో అవకతవకలపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లీగల్ టీంకౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే ఆర్వో ఆదేశాలు జారీ చేయాలని కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డిముందు నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణతమకు వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చూపిస్తున్నారని ఆగ్రహంనల్లగొండముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవిన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లు కాసేపట్లో సీఈఓ వికాస్ రాజ్ ను కలవనున్న బీ ఆర్ ఎస్ నేతలు.నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ఆపాలని, అక్కడ జరుగుతున్న కౌంటింగ్ లో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్న నేతలు.కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ సక్రమంగా చేయటం లేదని ఫిర్యాదు చేయనున్న ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి, ఇతర బీ ఆర్ ఎస్ నేతలు నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి గోల్ మాల్ జరిగిందిమూడో రౌండ్ లో కాంగ్రెస్ కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారుమేం అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదుమూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదుఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తాంఎన్నికల సంఘం స్పందించాలిరిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాంఅధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందితమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలి నల్లగొండ జిల్లాఎమ్మెల్సీ ఉప ఎన్నికల నాలుగో రౌండ్ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యంనాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తై మూడు గంటలుఅయినా ఫలితాలు వెల్లడించని అధికారులు👉ముగిసిన నాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఅధికారికంగా వెలువడాల్సిన ఫలితాలు 👉నాల్గో రౌండ్లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను తేల్చనున్న అధికారులుఇప్పటి వరకు ఎవరికీ యాభై శాతం ఓట్లు రాకపోవడంతో కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుసాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం👉మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) లీడ్లో ఉన్నారు. అయితే.. మూడో రౌండ్లో 4,207 ఓట్ల ఆధిక్యం రాగా, ఓవరాల్గా 18,878 ఓట్ల ఆధిక్యంలో మల్లన్న కొనసాగుతున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మరో 48013 ఓట్ల లెక్కింపు చేస్తున్నారు అధికారులు. లీడ్ జాబితా.. ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516అశోక్ (స్వతంత్ర) 27,49318,878 ఓట్ల ఆధిక్యం లో తీన్మార్ మల్లన్నచెల్లిన ఓట్లు 2,64,216చెల్లని ఓట్లు: 23,784 -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
సాక్షి, నల్గొండ: వరంగల్ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ సాగుతోంది. మొదటి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.. రెండో రౌండ్లోనూ లీడ్లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో ఆయనకు 34,575 ఓట్లు పోల్ అయ్యాయి.రెండో రౌండ్ ఫలితాలుకాంగ్రెస్ అభ్యర్థి నవీన్(తీన్మార్ మల్లన్న)కు వచ్చిన ఓట్లు: 34,575బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 27,573బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 12,841స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు వచ్చిన ఓట్లు: 11,018నల్గొండలోని దుప్పలపల్లిలో నిన్న(బుధవారం) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. -
జనరల్ ఎన్నికల ఫలితాలు 2024
-
ప్రతిభింబించని ఎగ్జిట్ పోల్ అంచనాలు
-
ఆధిక్యంలో సీఎం జగన్ సహా పలువురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు
-
ప్రొద్దుటూరులో YSRCP ముందంజ
-
పులివెందులలో జగన్ ముందంజ
-
కడప ఎంపీ అభ్యర్థి అవినాష్రెడ్డి ఆధిక్యం
-
ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
-
8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
EVM కౌంటింగ్లో ప్రతి రౌండు 20 నుంచి 25 నిమిషాల సమయం
-
గెలిచేది జగనే ..ఎందుకంటే..
-
తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పూజలు
-
రాజస్థాన్లో బీజేపీ ముందస్తు సంబరాలు
2024 లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 543 స్థానాలకు 7 దశల్లో ఓటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ అలయన్స్ రెండూ తమ తమ విజయాలను ప్రకటించుకుంటున్నాయి.ఫలితాలు వెలువడకముందే విజయోత్సవ సంబరాలు జరుపుకునేందుకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఎగ్జిట్ పోల్స్లో భారీ ఆధిక్యం సాధించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ నేతల, కార్యకర్తల ఉత్సాహం తారా స్థాయికి చేరింది. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎగ్జిట్ పోల్స్ను తాము అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నాయి.మరోవైపు ఓట్ల లెక్కింపునకు ముందే రాజస్థాన్లోని బీజేపీ కార్యాలయాన్ని అందంగా అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్లోని 25 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు 13 వేల మందికి పైగా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. #WATCH | BJP party office in Rajasthan's Jaipur is decorated ahead of the Lok Sabha polls result, today.Vote counting of #LokSabhaElections to begin at 8 am.(Video Source: BJP, Rajasthan) pic.twitter.com/pq8MuZEemD— ANI (@ANI) June 4, 2024 -
మరికాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ
-
'అబ్కీ బార్ 400 పార్'.. అదే నిజమైతే పెనుసంచలనమే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి గెలుస్తారని ఇప్పటికే దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ రోజు (జూన్ 4) వచ్చే ఫలితాలే.. బీజేపీ సర్కార్ మళ్ళీ కేంద్రంలో వస్తుందా? వస్తే ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయాలు వెల్లడవుతాయి.ఎన్నికల ప్రచారంలో మోదీ చెప్పిన 'అబ్కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్' అనే నినాదాన్ని ప్రతిపక్షాలు అపహేళన చేశాయి. ఇప్పటి వరకు వచ్చిన 12 ప్రధాన సర్వేలు, బీజేపీ గెలుస్తుందనే చెబుతున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవేళా మోదీ ఈ మ్యాజిక్ ఫిగర్ను కొట్టినట్లయితే.. అది పెద్ద రికార్డ్ కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రికార్డ్ను ఎప్పుడో కాంగ్రెస్ దశాబ్దాల ముందే ఖాతాలో వేసుకుంది.1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.నాలుగు దశబ్దాలకు ముందు.. యూపీలో 83, బీహార్లో 48, మహారాష్ట్రలో 43, గుజరాత్లో 24, అలాగే మధ్యప్రదేశ్లో 25, రాజస్థాన్లో 25, హర్యానాలో 10, ఢిల్లీలో 7, హిమాచల్ప్రదేశ్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.2019లో బీజేపీ 353 స్థానాల్లో గెలిచింది. దీంతో నరేంద్ర మోదీ ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు. 2004లో కూడా బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయం సాధించింది. అయితే ఇప్పుడు అబ్కీ బార్ 400 పార్ నినాదం కీలకమైనదిగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ పార్టీ యుపి (68), బీహార్ (33), మహారాష్ట్ర (29), రాజస్థాన్ (21), మరియు హర్యానా (7), అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో క్లీన్ స్వీప్ను అందజేస్తుందని చెబుతున్నాయి. ఈ సారి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనేది సర్వత్రా ఉత్కంఠభరితమైంది. -
ఢిల్లీ: 12కు స్పష్టత.. 4కు తుది ఫలితం?
ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఈవీఎంలు తెరవనున్నారు. 8.30 గంటల నుంచి ఎన్నికల ఫలితాల ట్రెండ్లు మొదలు కానున్నాయి.ఓట్ల లెక్కింపు సమయంలో దాదాపు వెయ్యి సీసీ కెమెరాలు కౌంటింగ్ కేంద్రంలోని ఈవీఎంలపై నిఘా ఉంచుతాయి. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర బ్యాలెట్ పేపర్లను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో 100కు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల ఎన్నికల ఫలితాలపై మధ్యాహ్నం 12 గంటలకల్లా ఒక స్పష్టత వస్తుందని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అన్నారు. మే 25న ఢిల్లీలో జరిగిన లోక్సభ పోలింగ్లో 58.70 శాతం ఓటింగ్ జరిగింది. రెండు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్లో ఉంచారు. ఢిల్లీలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. -
ఏపీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్
AP Election 2024 Counting And Results Updates03:43 PM, June 4th, 2024పులివెందులలో వైఎస్ జగన్ గెలుపు61,169 ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపుఅధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలియాల్సి ఉంది02:43 PM, June 4th, 2024పులివెందుల 19వ రౌండ్ ముగిసేసరికి 56వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్02:41 PM, June 4th, 2024అన్నమయ్య జిల్లా:రాయచోటి 14 వ రౌండ్ ముగిసేసరికి 3929 ఓట్ల ఆదిక్యం లో శ్రీకాంత్రెడ్డిశ్రీకాంత్ రెడ్డి(వైఎస్ఆర్సీపీ) : 63824మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ): 5989502:40 PM, June 4th, 2024కడప పార్లమెంట్వైఎస్ అవినాష్రెడ్డి ముందంజ.63218 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ అవినాష్వైఎస్ అవినాష్ రెడ్డి: 500912టిడిపి భూపేష్ సుబ్బరామి రెడ్డి: 437694వైఎస్ షర్మిలా రెడ్డి: 11871202:40 PM, June 4th, 2024ముందంజలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిరాజంపేట: 20వ రౌండ్ ముగిసేసరికి 8378 ఓట్ల ఆధిక్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డివైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 89664టిడిపి సుగవాస బాలసుబ్రమణ్యం: 8128602:26 PM, June 4th, 2024పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజచిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 19 రౌండ్లకు గాను 17 రౌండ్ లు ఓట్ల లెక్కింపు పూర్తి6623 ఓట్ల లీడింగ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజ 01:50 PM, June 4th, 2024ముందంజలో అవినాష్రెడ్డి కడప: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్రెడ్డి16 రౌండ్లు ముగిసే సమయానికి 39,637 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్రెడ్డి ముందంజ01:05 PM, June 4th, 2024రాజంపేటలో వైఎస్సార్సీపీ ముందంజరాజంపేటలో వైఎస్సార్సీపీ 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 7,108 ఓట్ల మెజారిటీతో ముందంజకదిరిలో ఐదువేల ఓట్లతో వైఎస్సార్సీపీ లీడ్12:21 PM, June 4th, 2024పులివెందులలో 21,292 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్పుంగనూరు: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసత్యవేడులో వైఎస్సార్సీపీ ఆధిక్యంవైఎస్సార్సీపీ-23497బీజేపీ-16,60311:15 AM, June 4th, 2024పాలకొండలో వైఎస్సార్సీ ముందంజగుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధిక్యతగుంతకల్లులో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ఆధిక్యత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై 2608 ఓట్ల ఆధిక్యంలో వెంకట్రామిరెడ్డినరసరావుపేట అసెంబ్లీ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి 4700 ఓట్ల ఆధిక్యం10:54 AM, June 4th, 2024దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆధిక్యంలో దిశగా దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసేరికివైఎస్సార్సీపీ-22965టీడీపీ-20921పలాస అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5110టీడీపీ-12309టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5478టీడీపీ-6263ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (నాలుగో రౌండ్)వైఎస్సార్సీపీ-13805టీడీపీ -1786410:31 AM, June 4th, 2024తిరుపతి పార్లమెంట్.. ఆధిక్యంలో గురుమూర్తిగూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మూడో రౌండ్లో గురుమూర్తి 1596 ఓట్లు ఆధిక్యంవైఎస్సార్సీపీ-12,687బీజేపీ-11091నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 107 ఓట్లు ఆధిక్యం9:52 AM, June 4th, 2024వైఎస్ అవినాష్రెడ్డి ముందంజకడప పార్లమెంట్ పరిధిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్రెడ్డి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజ9:24 AM, June 4th, 2024అనపర్తి, తిరువూరులో వైఎస్సార్సీపీ లీడ్హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యంపుట్టపర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీధర్రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్రెడ్డి ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంసర్వేపల్లిలో కాకాణి గోవర్థన్రెడ్డి ఆధిక్యందర్శిలో వైఎస్సార్సీపీ ముందంజఅరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లీడ్9:20 AM, June 4th, 2024పాలకొల్లులో టీడీపీ ముందంజఆచంటలో టీడీపీ 3747 ఓట్లు ఆధిక్యం ఉండిలో టీడీపీ 5,729 ఓట్లు ఆధిక్యంభీమవరంలో జనసేన 7012 ఓట్లు ఆధిక్యంతణుకులో టీడీపీ 7580 ఓట్లు ఆధిక్యంతాడేపల్లిగూడెంలో జనసేన 1524 ఓట్లు ఆధిక్యం నర్సాపురం పార్లమెంట్లో బిజెపి 18384 ఓట్లు ఆధిక్యం9:15 AM, June 4th, 2024విశాఖ లోక్ సభ స్థానానికి పోలైన సర్వీస్ ఓట్లు మొత్తం 1350ఆరు స్కానర్లు ద్వారా స్కాన్ చేస్తున్న సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఆర్వోలుసర్వీస్ ఓట్లలో 13ఏలు పెట్టకుండా పోస్ట్ చేసిన కొంతమంది ఓటర్లుమరో గంటలో పూర్తి వివరాలు వచ్చేందుకు అవకాశం9:13 AM, June 4th, 2024పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందంజతిరువూరులో వైఎస్సార్సీపీ ముందంజఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆధిక్యం9:01 AM, June 4th, 2024ఆత్మకూరులో మేకపాటి విక్రమ్రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్రెడ్డి ఆధిక్యంనంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్8:53 AM, June 4th, 2024కడప ఎంపీ అభ్యర్థి అవినాష్రెడ్డి ఆధిక్యంఅవినాష్రెడ్డి 4362(ఆధిక్యం)భూపేష్ వెనుకంజ 2,088షర్మిల-11018:51 AM, June 4th, 2024చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంగజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంచంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యం8:36 AM, June 4th, 2024కాకినాడ: పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ చెల్లని ఓట్లుపిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్మొదట చెల్లని ఓట్లు వేరు చేస్తున్న సిబ్బంది8:27 AM, June 4th, 2024తూర్పు గోదావరిరాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్.. కూటమి అభ్యర్థి ముందంజ రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్ 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం8:25 AM, June 4th, 2024నంద్యాలనంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంపటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్8:22 AM, June 4th, 2024పశ్చిమగోదావరిజిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు8:15 AM, June 4th, 2024పల్నాడు నరసరావుపేట లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్ కి తరలింపు8:09 AM, June 4th, 2024అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా8:09 AM, June 4th, 2024ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియస్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపుతొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు 8:05 AM, June 4th, 2024పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఅభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్లుపోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు7:59 AM, June 4th, 2024అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరుస్తున్న అధికారులుకాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లుఎప్పడూ లేనంత హై అలర్ట్లో పార్టీల అభ్యర్థులుఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలుపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు7:43 AM, June 4th, 2024అమలాపురం కౌంటింగ్ సెంటర్లో పినిపే విశ్వరూప్అమలాపురంలో కౌంటింగ్ సెంటర్కి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి7:43 AM, June 4th, 2024చిత్తూరు జిల్లా: కర్ఫ్యూను తలపిస్తోన్న కుప్పంకుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులుఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులుకుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, దుకాణాలను మూసేసిన వైనం7:34 AM, June 4th, 2024కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు7:22 AM, June 4th, 2024ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లుపలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లుకుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లుపూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లుజీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లునగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుపుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లుసత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుశ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లుతిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లుచంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లుపీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లుతంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లుమదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు7:22 AM, June 4th, 2024కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలురామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 91710 టేబుళ్లు 24 రౌండ్లుముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163, 14 టేబుళ్లు, 19 రౌండ్లుఅమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,12 టేబుళ్లు, 20 రౌండ్లురాజోలు మొత్తం ఓటర్లు 1,56,40014 టేబుళ్లు, 15 రౌండ్లుపి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749 12 టేబుళ్లు, 18 రౌండ్లుకొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945 10 టేబుళ్లు-26 రౌండ్లుమండపేట మొత్తం ఓటర్లు 1,91,959 10 టేబుళ్లు-22 రౌండ్లు6:55 AM, June 4th, 2024గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బందితేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యంఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..18 నుంచి 21 రౌండ్లో వెలువడనున్న ఫలితాలుమొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగంకౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతకౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..6:47 AM, June 4th, 2024కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధంమచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపుమచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,9357 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,5797 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,7288 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభంపార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుఒక్కో టేబుల్కు ఏఆర్ఓ,ఒక సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకంమచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లుపెడన అసెంబ్లీ - 16 రౌండ్లుగుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లుఅవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లుగన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లుమొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటుపామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యేఅభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగాగన్నవరం అసెంబ్లీ - 12 మందిగుడివాడ అసెంబ్లీ - 12 మందిపెడన అసెంబ్లీ - 10 మందిమచిలీపట్నం అసెంబ్లీ - 14 మందిఅవనిగడ్డ అసెంబ్లీ - 12 మందిపామర్రు అసెంబ్లీ - 8 మందిపెనమలూరు అసెంబ్లీ - 11 మంది6:26 AM, June 4th, 2024తొలి ఫలితం ఏదంటే..ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభంపోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్కు గరిష్ఠంగా 2.30 గంటల టైంఈవీఎంలలో ఒక్కో రౌండ్కు 20-25 నిమిషాల సమయంఒక్కోరౌండ్లో ఒక్కో టేబుల్పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్లుకొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితంభీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టతలోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో6:25 AM, June 4th, 2024ప్రతి పోస్టల్ బ్యాలట్ టేబుల్ వద్ద ఒక ఏఆర్వోఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్లు, ఛైర్పర్సన్లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు.రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.6:20 AM, June 4th, 20241,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపురెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయంరాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్ పోలీసులుకౌంటింగ్ కోసం 25 వేల మంది సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.కౌంటింగ్ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు . ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలుసామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు6:15 AM, June 4th, 2024ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 6:05 AM, June 4th, 2024మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టతనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్సీపీ✊🏻సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది. -
వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి
సాక్షి, అమరావతి: కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఉ.6 గంటలకల్లా ఏజెంట్లు కౌంటింగ్ హాల్ దగ్గర ఉండాలి. ఫారం–17 సీ కాపీని తీసుకెళ్లాలి. ⇒ పోటీలో ఉన్న అభ్యర్థులందరి ప్రతి ఓటు కరెక్టుగా నోట్ చేసుకోవాలి. ఏదైనా తప్పు కన్పిస్తే వెంటనే అక్కడే ఉన్న ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ అనారోగ్యం, ఇతర కారణాలతో బయటకు వచ్చేవారు రిటర్నింగ్ అధికారికి చెప్పి బయటకు రావాలి. ఒకసారి బయటకొస్తే లోపలికి రానివ్వరని గమనించాలి. ⇒ స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ⇒ ఏజెంట్లు ప్రతి రౌండ్ తర్వాత షీట్పై సంతకం చేసే ముందు మన పార్టీ అభ్యర్థి ఓట్లు మాత్రమే కాకుండా, టీడీపీ–జనసేన–బీజేపీ, ఇతర అభ్యర్థులకు పోలైన ఓట్లను స్పష్టంగా సరిచూసుకోవాలి. తేడా ఉన్నట్లుగా గుర్తిస్తే మరొక మారు కౌంటింగ్ చేయమని కోరాలి. అన్ని సరిపోయినప్పుడే సంతకం చేయాలి. ⇒ కౌంటింగ్ ఏజెంట్లతో అభ్యర్థి టచ్లో ఉంటూ అక్కడ ఏదైనా అవాంతరాలు ఎదురైతే, కౌంటింగ్ ఏజెంట్తో కానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్తో కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. ⇒ ఏదైనా తప్పు జరుగుతోంది అని కౌంటింగ్ కేంద్రంలో గుర్తిస్తే చక్కటి లాజిక్తో ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ రిజెక్ట్ అయిన పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ మార్జిన్ వచ్చి ఉంటే మళ్లీ పోస్టల్ బ్యాలెట్స్ని లెక్కించమని కోరే అధికారం అభ్యర్థికి, కౌంటింగ్ ఏజెంట్కి ఉంది. ⇒ పోస్టల్ ఓట్లను సంబంధిత ఫారంలో నింపి అభ్యర్థి, అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తర్వాత ఆ రౌండ్ ఫలితం ప్రకటిస్తారు. ⇒ కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేవరకు కౌంటింగ్ హాల్లో అభ్యర్థి ఉండాలి. -
కౌంటింగ్ ముంగిట మరో కుట్ర
సాక్షి, అమరావతి: కీలకమైన ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు శాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఒత్తిడికి ఎన్నికల కమిషన్ (ఈసీ), రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి వ్యవహరిస్తున్నారన్నది మరోసారి స్పష్టమైంది. అత్యంత వివాదాస్పద పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) ఎస్పీ ఏఆర్ దామోదర్కు హఠాత్తుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అదీ పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆయన పోలింగ్ ముగిసిన తరువాత వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న దామోదర్ను హఠాత్తుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని.. కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీచేయడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. టీడీపీకి వీర విధేయుడు.. 2007 గ్రూప్–1 బ్యాచ్కు చెందిన ఏఆర్ దామోదర్ అత్యంత వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరడంలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారి మధ్య బంధుత్వం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు అండతో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. పశి్చమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక నాన్ కేడర్ ఎస్పీ అయినప్పటికీ దామోదర్ను 2019 సంవత్సరంలో ఎన్నికల కోసమని విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించారు. వైఎస్సార్సీపీ పటిష్టంగా ఉన్న విజయనగరం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే ఆయనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే 2019 ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులతో బీభత్సం సృష్టించి కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని బంధించాయి.దాదాపు నాలుగు గంటలపాటు టీడీపీ రౌడీమూకలు స్వైర విహారం చేసినా పోలీసులు, ఎస్పీగా ఉన్న దామోదర్ సైతం పట్టించుకోలేదు. సరికదా అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించలేదు. అప్పట్లో విశాఖపట్నం డీఐజీ స్పందించి అదనపు బలగాలను కురుపాం పంపించడంతో నాలుగు గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదీ దామోదర్ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ట్రాక్ రికార్డ్.అలాంటి అధికారికి కంట్రోల్ రూమ్ బాధ్యతలా?ఎన్నికల విధుల్లో ఉద్దేశపూర్వకంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్ దామోదర్కు ప్రస్తుతం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించారు. డీజీపీ హరీశ్కుమార్ గుప్తా, ఈసీకి నోడల్ అధికారిగా ఉన్న అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబాత్ర బాగ్చీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా విధ్వంసకర సంఘటనలు జరిగితే వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, అందుకోసం జిల్లా ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీచేయడం ఆయన బాధ్యత. అంటే.. డీజీపీ తరఫున జిల్లా ఎస్పీలకు ఆయనే ఆదేశాలు జారీచేస్తారు.2019 ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో విఫలమైన ఆయన ప్రస్తుతం కంట్రోల్ రూమ్ బాధ్యతలను ఎలా నిర్వహించగలరని డీజీపీ, అదనపు డీజీ భావించారో అర్థంకావడంలేదు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే దామోదర్కు ఈ బాధ్యతలు అప్పగించారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇటీవల పోలింగ్ రోజున పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ గూండాలు విధ్వంసానికి పాల్పడ్డాయి.అదే రీతిలో కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యానికి కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయినాసరే.. టీడీపీకి అనుకూల అధికారిగా గుర్తింపు పొందిన దామోదర్కు కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసేందుకు.. టీడీపీ గూండా మూకలపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎస్పీలను నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
బిగ్ డే.. కౌంటింగ్కు వైఎస్ఆర్సీపీ ‘సిద్ధం’
సాధారణ ఎన్నికల ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టీడీపీతో అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేసింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ప్రావీణ్యం సాధించిన టీడీపీ ఎటువంటి అక్రమాలకైనా తెగిస్తుందని హెచ్చరించారు. విజయం పట్ల ఎంత ధీమాగా ఉన్నా ప్రత్యర్థుల విషయంలో అజాగ్రత్తగా ఉండరాదనే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కౌంటింగ్కు సిద్ధం అవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్లో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అధికార వైఎస్ఆర్సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. గడచిన ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమకు మరోసారి అధికారాన్ని అందిస్తాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పోలింగ్ రోజున పోలింగ్ బూత్లకు సునామీలా ఉవ్వెత్తున వచ్చిన మహిళలే ఇందుకు నిదర్శనమంటున్నారు.రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్ళలో ఏపీలో జరిగినన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదని వైఎస్ఆర్సీపీ గుర్తు చేస్తోంది. అందుకే ఇచ్ఛాపురం నుంచి పులివెందుల వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం కనిపిస్తోందని చెబుతున్నారు.రాష్ట్రంలో నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో 81.86 శాతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది గత ఎన్నికల కంటే 2 శాతం ఎక్కువ. సహజంగా పోలింగ్ భారీగా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వెల్లువలా వచ్చారని భావించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో అనేక అనుభవాలు చూసినా..తాజా ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూసినా..ఇది ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు అందాయి. ప్రతి కుటుంబం లక్షలాది రూపాయల లబ్ధి పొందింది. వారంతా వైఎస్ జగన్ ప్రభుత్వం మరోసారి రావాలనే కోరుకున్నారు. పైగా పేదలకు సంక్షేమం ఇచ్చే విషయంలో, గడచిన మూడు నెలల్లో పెన్షన్ విషయంలో వృద్ధులను చంద్రబాబు టీమ్ పెట్టిన కష్టాలు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఎన్నికల్లో తమ ఓటమి ఖాయం అని ఖరారు చేసుకున్న పచ్చ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవస్థను మేనేజ్ చేయవచ్చనే దురాలోచనతోనే నానా తిప్పలు పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ విధంగానే ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికల్లో అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున కూడా అక్రమాలకు తెగబడతారనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా అసలైన ఫలితాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తమ శ్రేణులకు సూచించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
AP: ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభం
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం చేసినట్లు ఇప్పటికే సీఈవో ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ , ఉదయం 8.30 నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభంరాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల ఓట్లు పోల్ ఫెసిలిటేషన్ సెంటర్ లలో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్లుు పోల్ 26,721 సర్వీస్ ఓట్లు భీమిలి, పాణ్యంలో గరిష్టంగా 26 రౌండ్ల కౌంటింగ్కొవ్వూరు, నరసాపురంలో 13 రౌండ్లు మాత్రమే కౌంటింగ్అయిదు గంటల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలురాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్ల లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులోక్ సభ ఓట్ల లెక్కింపునకు 2,443 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటులోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 443 టేబుళ్లు ఏర్పాటుఅసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లుఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల కు అనుమతిమూడంచెల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుఈవీఎంల వద్ద కేంద్ర పారా మిలటరీ బలగాల మోహరింపురెండో దశలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులుకౌంటింగ్ కేంద్రం బయట లా అండ్ ఆర్డర్ పోలీసులుతుది ఫలితం రాత్రి 10 గంటల తర్వాత వెలువడే అవకాశంగెలుపొందిన వారు ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదు -
AP: కౌంటింగ్కు కౌంట్డౌన్.. ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం
-
భారీ బందోబస్త్..కౌంటింగ్ కు కౌంట్ డౌన్
-
పోస్టల్ బ్యాలెట్లపై YSRCP న్యాయపోరాటం
-
అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
-
రేపటి కౌంటింగ్ కు అధికారుల విస్తృత ఏర్పాట్లు
-
కంటోన్మెంట్ ఫలితంపై ఉత్కంఠ
హైదరాబాద్, సాక్షి: కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్కు రంగం సిద్ధమైంది.వెస్లీ కళాశాల ప్రాంగణంలోని రెండు వేర్వేరు హాళ్లలో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపికకు సంబంధించిన ఓట్ల లెక్కింపును వేర్వేరుగా నిర్వహించనున్నారు. మంగళవారం (రేపు) ఉదయం ఆయా కేంద్రాల్లో ఒకేసారి కౌంటింగ్ మొదలు కానుంది. మొత్తం 232 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అంటే ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్ల చొప్పున మొత్తం 17 రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. తొలుత బ్యాలెట్ ఓట్లు, అనంతరం సాధారణ ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు లెక్కింపు ప్రక్రియ కొలిక్కి రానుందని అధికారులు వెల్లడించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం జిల్లాల వారీగా హైదరాబాద్, పార్లమెంట్ స్థానం వారీగా చూస్తే మేడ్చల్– మల్కాజ్గిరి పరిధిలోకి వస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు బోగారంలోని హోలీ మేరీ కళాశాల ప్రాంగణంలో, ఎల్బీ నగర్ అసెంబ్లీ పరిధిలోని ఓట్ల లెక్కింపు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో జరగనుంది. కంటోన్మెంట్ పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు మాత్రం సికింద్రాబాద్ వెస్లీ కళాశాల ఆవరణలో జరగనుంది. సర్వత్రా ఆసక్తి కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆరు నెలల క్రితం నాటి ఎన్నికల్లో 1,23,297 ఓట్లు పోలవ్వగా, తాజాగా 1,30,929 మంది ఓటేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 59,057 ఓట్లు సాధించగా, బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీగణేశ్కు 41,888, కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలకు 20,825 ఓట్లు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్, కాంగ్రెస్ అభ్యరి్థగా మారారు. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ వంశ తిలక్కు టికెట్ ఇచి్చంది. బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత బరిలో నిలిచారు.వార్డు నేతల్లోనూ టెన్షన్కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు స్థానిక వార్డు నేతల్లోనూ టెన్షన్ కొనసాగుతోంది. తమ వార్డులో పార్టీకి మెజారిటీ వస్తుందా లేదా అని ఆయా నేతలు ఆలోచనలో పడిపోయారు. అభ్యర్థి గెలుపోటములతో సంబంధం లేకుండా, తమ వార్డులో మెజారిటీ వస్తే చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా ఓటింగ్ సరళిపై ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారు. -
కౌంటింగ్ లో రెప్పవాల్చొద్దు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో డ్రామాలాడటం, తప్పుడు లెక్కలు చూపించడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సిద్ధహస్తుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని, సంయమనం కోల్పోకుండా అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ ఏజెంట్లకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన తీరుపై ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఏజెంట్లకు ఆయన వర్చువల్గా దిశానిర్దేశం చేశారు. 175 నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు దీనికి హాజరయ్యారు. విశ్రాంత ఆర్డీవో ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల ఏమన్నారంటే.. రెచ్చగొట్టి ఏమార్చే యత్నాలు.. ప్రతీ ఓటు చాలా విలువైందనే విషయాన్ని ఏజెంట్లు మరచిపోవద్దు. ఎన్నికల నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు పార్టీకి దక్కేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలి. పోస్టల్ బ్యాలెట్పై అధికారి సంతకం విషయంలో అనుమానం వస్తే వెంటనే స్పందించాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ దృష్టి మళ్లించేందుకు చేసే ప్రయత్నాలపై జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మనమే గెలుస్తున్నాం. జాతీయ మీడియా సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోంది. తమిళనాడులో ఓ పార్టీ 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పుకొచ్చాయి. ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారు. ఇలాంటి విద్యలు ప్రదర్శించటంలో చంద్రబాబును మించిన వారులేరు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈవీఎంలపైనా జాగ్రత్త.. ఈవీఎంల కౌంటింగ్లో కూడా ధ్యాస పెట్టి జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు వచ్చినవి, ప్రత్యర్థులకు వచ్చినవి, స్వతంత్ర అభ్యర్థులకు లభించిన ఓట్లను సరిగ్గా నమోదు చేసుకుని సంఖ్య సరిచూడాలి. వివరాలు నమోదు చేసుకోకుండా ప్రత్యర్థులు మన దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలి. పోస్టల్ బ్యాలెట్లపై న్యాయ పోరాటం..కౌంటింగ్ రోజు కుట్రలకు కూటమి పథకం వేస్తోంది. మన ప్రత్యర్థులు వ్యవస్థల్లోకి చొరబడి అధికారులను వారికి అనుగుణంగా మలుచుకుంటున్న నేపథ్యంలో ఏజెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ వేళ మనసు లగ్నం చేసి పని చేస్తూ బ్యాలెన్స్ దెబ్బ తినకుండా చూసుకోవాలి. ఒకవేళ అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే రికార్డు అయి తీరాలి. పోస్టల్ బ్యాలెట్ వద్ద సంక్లిష్ట ప్రక్రియ ఉంది. ఇన్ వ్యాలిడ్ ఓటు (చెల్లనివి) పొరపాటున కూడా వ్యాలిడ్ కాకూడదు. వ్యాలిడ్ ఓటు ఇన్ వ్యాలిడ్ అవ్వకూడదు.కౌంటింగ్ విధానంపై అనుమానాలున్నా, కూడికలో తేడా వచ్చినా మళ్లీ చూపించమని అడగవచ్చు. దీన్ని పట్టించుకోకపోతే అబ్జర్వర్ దృష్టికి తేవాలి. పోస్టల్ బ్యాలెట్ కవర్లపై గెజిటెడ్ అధికారి సంతకం చేసి స్టాంప్ వేయాలి. స్టాంప్ వేయకపోతే ఆయన ఎక్కడ పని చేస్తున్నారో స్వయంగా చేతిరాతతో రాసి సంతకం చేస్తే అనుమతించాలని ఈసీ సూచించింది. కానీ ఏపీ సీఈవో మాత్రం చేతితో డిజిగ్నేషన్ (హోదా) రాయకపోతే స్పెసిమన్ సంతకాలు కలెక్ట్ చేసి కౌంటింగ్ అధికారులకు ఇవ్వాలని, ఆ విధంగా చెక్ చేసుకోవాలని తాజాగా ఆదేశాలిచ్చారు. మరి ఈ సంతకం ఎవరిదని తెలుస్తుంది? దీనిపై పార్టీ తరపున అభ్యంతరం చెబుతున్నాం. దేశంలో ఎక్కడా లేని నిబంధన ఇక్కడ తెచ్చారు. దీనిపై మన పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. సుప్రీం కోర్టులో కేసు వేస్తున్నాం. ఏ తీర్పు వస్తుందనేది సోమవారం నాటికి తెలుస్తుంది. ఒకవేళ రిలీఫ్ వస్తే సంతకంతోపాటు డిటెయిల్స్ కానీ, సీల్ కానీ ఉండాల్సి ఉంటుంది. దీనిపై స్పష్టత రాగానే మళ్లీ తెలియజేస్తాం. బీజేపీ టార్గెట్కు అనుగుణంగా ఫిగర్స్ సర్వేల అడ్డగోలు లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. సర్వే సంస్థలు జాతీయ స్థాయిలో బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా ఉంది. అందుకు అనుగుణంగా సర్వే లెక్కలు ఇచ్చుకుంటూ వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇండియా టుడే సర్వే చూస్తే మరింత ఆశ్చర్యమేస్తుంది. పొత్తులో ఉంటే చాలు.. పోటీ చేసిన స్థానాల కన్నా ఎక్కువగా ఫలితాల్లో చూపారు. బిహార్లో అలాగే చేశారు. మనకు సంబంధించి రెండు ఇచ్చారు. ఒడిశాలో సున్నా ఇచ్చారు. బీజేపీ 400 సీట్ల టార్గెట్కు అనుగుణంగా ఫిగర్స్ ఇచ్చుకుంటూ వెళ్లారు. ఇలా చేసి ఈ రెండు రోజుల్లో వీళ్లు ఏం సాధిస్తారో అర్థం కావట్లేదు. ఈవీఎంలో నమోదైన వాటిని వీళ్లు ఏం చేయగలుగుతారు? అధికారంలో వాళ్ల చేతిలో ఉంది కాబట్టి కౌంటింగ్లో ఏమైనా మిస్యూజ్ చేయటానికి అవకాశం ఉందా? అనే డౌట్ వస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబుకి వాళ్ల జోడీ దొరికిన తర్వాత ఏమైనా చేసే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ద్వారా ఇబ్బందులు కల్పిస్తున్నారు. ఎదుటివారికి ఇబ్బందులు కలిగించడంలో చంద్రబాబు పీహెచ్డీ పొందారు కాబట్టి మనం చాలా చాలా అలర్ట్గా ఉండాలి. మన పార్టీ నేతలు కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అందుబాటులో ఉంటారు. -
Mahabubnagar MLC Bypoll Updates: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
counting Updatesమహౠబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయంబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందారు.111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు.బీఆర్ఎస్ 763, కాంగ్రెస్ 652 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్-1 ఓటు వచ్చింది, 21 చెల్లని ఓట్లుగా నిర్ధారణమొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. హరీశ్ రావు శుభాకాంక్షలుమహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ శుభాకాంక్షలు తెలిపారు. గెలుపుకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన @BRSparty అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. గెలుపుకు కృషి చేసిన బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. pic.twitter.com/6ZWaoUZFxV— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2024 మహౠబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విమహౠబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.మొత్తం 1437 మంది ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తున్నారు.ముగ్గురు అభ్యర్దులు పోటీ పడుతున్నారు.పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహౠబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.విస్త్రత ఏర్పాట్లు చేసిన అధికారులుపోటీలో ముగ్గురు అభ్యర్దులుబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి బరిలో నిలిచారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.గత మార్చి28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మొత్తం 1437 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మున్సిపల్ కౌన్సిలర్లు ఓటేశారు.ఇద్దరు ఎంపీటీసీలు తమ వ్యక్తిగత కారణాలతో ఓటింగ్కు దూరంగా ఉన్నారు.మార్చి 28నే పోలింగ్ జరిగినా.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఫలితాలను నేటికి (జూన్ 2) వాయిదా వేసింది.దీంతో నేడు వెలువడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఇరు పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: 44 సీట్లలో బీజేపీ విజయం
Counting Updates అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ఘన విజయంఅరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 44 సీట్లలో విజయం2 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లలో గెలుపు10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమేజిక్ ఫిగర్ స్థానాలు 30పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సీట్లలో గెలుపునేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుపు , 2 ముందంజ ఇండిపెండెంట్లు 3 గెలుపు సిక్కింలో అధికార కాంత్రికారి మోర్చా ఘన విజయంసిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ 26 సీట్లలో విజయం5 స్థానాల్లో సీకేఎం లీడింగ్మేజిక్ ఫిగర్ 17 సీట్లుసిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానం గెలుపుసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ ప్రేమ్ సింగ్ తమంగ్ రెనోక్ స్థానంలో 7044 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ దూసుకుపోతోంది11 సీట్లలో సీకేఎం పార్టీ విజయం20 స్థానాల్లో సీకేఎం లీడింగ్సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక్కస్థానంలో లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది26 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీనేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 18 సీట్లలో విజయం సాధించింది28 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజపీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 స్థానాల్లో లీడింగ్10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీ#WATCH | Celebration begins at the BJP office in Itanagar as the party is set to return to power in Arunachal Pradesh The ruling BJP crossed the halfway mark; won 17 seats leading on 29. National People's Party is leading on 6 seats. The majority mark in the State Assembly is… pic.twitter.com/GEEfXggrEO— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిసిక్కిం క్రాంతికారి మోర్చా రెండు స్థానాల్లో గెలుపు29 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానంలో లీడింగ్లో ఉంది.#WATCH | Sikkim: Pintso Namgyal Lepcha from the Sikkim Krantikari Morcha (SKM) wins from the Djongu Assembly constituency He says, "I thank all the voters who supported me and made me win with a huge margin. I also thank my party president who gave me the ticket..." pic.twitter.com/BHVMQJvwB2— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్కేఎంసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్లో ముందంజలో ఉన్నారు.Sikkim CM and Sikkim Krantikari Morcha (SKM) chief Prem Singh Tamang, who is contesting the Assembly elections from Rhenock and Soreng-Chakung seats, is leading on both the seats.SKM crossed the halfway mark; leading on 29 seats. The majority mark in the Sikkim Assembly is 17… pic.twitter.com/1NIYCEmihZ— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్నేషల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్ ఫిగర్ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) 8 సీట్లలో లీడింగ్పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో లీడింగ్ఇండిపెండెంట్ ఒక స్థానంలో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎస్కేఏం భారీ లీడింగ్లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒక స్థానంలో లీడింల్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్లో కౌంటింగ్ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) 2 సీట్లలో లీడింగ్లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు. -
పోస్టల్ బ్యాలెట్ పై నేడు కీలక తీర్పు
-
ఇది ఈసీ వివక్షే
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరుతూ పిటిషనర్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు రిజిస్ట్రీని కోరారు. దీంతో రిజిస్ట్రీ ఈ కేసు ఫైల్ను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచింది. దానిని పరిశీలించిన ఆయన హౌస్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అనుమతి మంజూరు చేశారు. దీంతో జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ విజయ్ల ధర్మాసనం విచారణ చేపట్టింది.దేశ వ్యాప్తంగా కాకుండా ఏపీలో మాత్రమే అమలు చేస్తారా?వైఎస్సార్సీపీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు వివక్షాపూరితమని సింఘ్వీ తెలిపారు. ఈ ఉత్తర్వులు చాలా కొత్తగా ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులను దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమలు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు దేశం మొత్తానికి వర్తిస్తాయని, కానీ విస్మయకరంగా తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వర్తింప చేస్తోందని వివరించారు. ఇంత కన్నా అన్యాయం ఏమీ ఉండదన్నారు. తాజా ఉత్తర్వులు ఎన్నికల కమిషన్ స్వీయ నిబంధనలకు విరుద్ధమన్నారు. లేఖలు, సర్కులర్లు, మెమోల ద్వారా చట్టబద్ధ నిబంధనలను మార్చలేరన్నారు. అది పార్లమెంట్ పని అని తెలిపారు. పార్లమెంట్లో ఎలాంటి సవరణ చేయకుండా తాజా ఉత్తర్వులు తీసుకురావడానికి వీల్లేదని, అందువల్ల అవి ఎంత మాత్రం చెల్లుబాటు కావని ఆయన స్పష్టం చేశారు.కౌంటింగ్కు నాలుగు రోజుల ముందు ఎందుకిలా?రాష్ట్రంలో 5.39 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఇవి సరిపోతాయని సింఘ్వీ అన్నారు. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్స్ 27ఎఫ్, 54ఏ, 13 ఏ లకు విరుద్ధంగా ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు అమల్లోకి తెచ్చిందన్నారు. అటెస్టేటింగ్ అధికారి పేరు, హోదా వివరాలు లేకుండా ఆ పోస్టల్ బ్యాలెట్ను ఎవరో ధృవీకరించారో తెలియదని, దీని వల్ల అక్రమాలకు ఆస్కారం ఉంటుందన్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై ఎవరైనా సంతకం చేయవచ్చన్నారు. తప్పుడు, నకిలీ ఓట్లను కూడా ఆమోదించేందుకు తాజా ఉత్తర్వులు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే, ఇప్పుడు కౌంటింగ్కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ తాజా ఉత్తర్వుల వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదంగా ఉందని తెలిపారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఇలాంటి ఉత్తర్వుల ద్వారా నిష్పాక్షికతకు అర్థం లేకుండా చేస్తోందన్నారు. ఏకపక్షంగా జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరం ఉంటేనే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదని, అందువల్ల తమ వ్యాజ్యానికి విచారణార్హత ఉందని వివరించారు.పరిధి దాటి వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘంసీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమేనన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘామే చెబుతోందని, అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో మాత్రం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో తమ ఆందోళనను గానీ, తామిచ్చిన వినతి పత్రాన్ని గానీ ఎన్నికల సంఘం కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హడావుడిగా తాజా ఉత్తర్వులిచ్చిందన్నారు. అతి కొద్ది రోజుల్లో కౌంటింగ్ జరగబోతుండగా, ఇప్పటికిప్పుడు ఈ ఉత్తర్వులను తీసుకు రావాల్సిన అవసరం ఏముందో ఎన్నికల సంఘం చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంఘం చర్యల్లో నిజాయితీ ఉండి ఉంటే, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చి ఉండేదని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికల పిటిషన్లు వేయాలంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాఖలు చేయాల్సి ఉంటుందని, ఇది ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తన పరిధి దాటి వ్యవహరించిందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, బ్యాలెట్ ఫాంపై పేరు, హోదా వివరాలు, సీలు లేకుంటే ఆ ఓటును తిరస్కరించాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సాగుతున్నప్పుడు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వీరారెడ్డి తెలిపారు.తాజా ఉత్తర్వులు ఆ ఉద్యోగులకే వర్తింపుకేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకే తమ తాజా ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద అటెస్టేటింగ్ అధికారిని సంబంధిత రిటర్నింగ్ అధికారే నియమిస్తారని.. అందువల్ల డిక్లరేషన్ ఫాంపై ఆ అధికారి సంతకం ఉంటే చాలని చెప్పారు. పేరు, హోదా వివరాలు, సీలు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను మొత్తం నిబంధనలకు అనుగుణంగా వీడియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియను సవాలు చేయడానికి వీల్లేదని, ఒకవేళ పిటిషన్లు దాఖలు చేసినా అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్ పరోక్షంగా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుతున్నారని, అందువల్ల వారు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాల వ్యవహారంలో ఈపీ దాఖలు చేసుకోవాలన్న వాదన సరైందేనని, అయితే పిటిషనర్ తన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలు పూర్తిగా వేరని వ్యాఖ్యానించింది. ఇదేమీ వ్యక్తిగత కేసు కాదని స్పష్టం చేసింది. అనంతరం వైఎస్సార్సీపీ వ్యాజ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల నిర్వహణ నిబంధనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు సబబేనన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయాన్ని వెలువరిస్తామంది. -
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు ?
-
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై అనుమానాలు
-
CEO జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన CEC
-
జూన్ 4 జడ్జిమెంట్ డే: తొలి, చివరి ఫలితాలపై క్లారిటీ ఇదిగో
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా.. ఒక్కో రౌండ్ లెక్కింపునకు గరిష్ఠంగా 30 నిమిషాల సమయం పట్టనుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్) ఆధారంగా పోలైనవి లెక్కిస్తారు. ఆపై పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాతే ఈవీఎంల లెక్కింపు ప్రారంభంకానుంది. 11 గంటల కల్లా ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలుండగా.. మధ్యాహ్నానికి తుది ఫలితాలపై ఓ అంచనాకి వచ్చేయొచ్చు. తొలి ఫలితం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఇక అల్లూరి జిల్లా రంపచొడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు మాత్రం ఆలస్యంగా వెలువడనున్నాయి. ఈ రెండు చోట్లా 29 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరపనున్నారు. మరోవైపు.. భీమిలి(విశాఖ), పాణ్యం(నంద్యాల) ఫలితాల కోసం రాత్రి వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే.. ఈ రెండు నియోజకవర్గాల్లో 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు(మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్ చీటీలు) పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. -
కౌంటింగ్లో ఏజెంట్లు కీలకం!
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓట్లు లెక్కింపును జూన్ 4వ తేదీన చిత్తూరు సమీపంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఆ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రశాంతవాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ రోజున వివిధ పారీ్టల ఏజెంట్లు సైతం కీలక పాత్ర పోషించనున్నారు. ఇందుకోసం నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముందని పలువురు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని కోరుతున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు సమీపంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో చిత్తూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును జూన్ 4వ తేదీన చేపట్టనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్ సమయంలో అభ్యర్థి తరఫున ప్రతినిధిగా వ్యవహరించే ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కౌంటింగ్కు మూడు రోజుల ముందు సాయంత్రం 5గంటల్లోపు కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించిన ఫారమ్–18ను సంబంధిత రిటరి్నంగ్ అధికారికి సమరి్పంచాలి. ఆర్ఓలు ఈ మేరకు ఏజెంట్లకు ఐడీ కార్డులు అందిస్తారు. కౌంటింగ్కు గంట ముందు అపాయింట్మెంట్ లెటర్, ఐడీ కార్డును ఏజెంట్లు సంబంధిత ఆర్ఓలకు అందించాల్సిఉంటుంది. ఫారమ్–19 ద్వారా కౌంటింగ్ ఏజెంట్ అపాయింట్మెంట్ను రద్దు చేసే అధికారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్కు ఉంటుంది. అవగాహన తప్పనిసరి సార్వత్రిక ఎన్నికల లెక్కింపుప్రక్రియలో ఫారమ్–17సీ పార్ట్–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారమ్–17సీలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూసుకోవాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, పోలింగ్ కేంద్రం పేరు, అక్కడ వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఆ ఫారమ్లోనే నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన వారి సంఖ్య, పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారమ్–17సీలో ఉంటాయి. టెండర్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపర్ సీళ్లు (ఓటరుకు పోలింగ్ కేంద్రంలో ఇచ్చే రెండు రంగుల స్లిప్లు), సీరియల్ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు, వినియోగించని పేపర్ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి, పాడైపోయిన పేపర్ సీళ్లు, సీరియల్ నంబర్ల వంటి వివరాలు ఇందులో ఉంటాయి. తేడా వస్తే..! కౌంటింగ్ సమయంలో టేబుల్ వద్దకు కంట్రోల్ యూనిట్తో పాటు ఫారమ్–17సీలోని వివరాలను ఏజెంట్లు తప్పనిసరిగా రాసుకోవాలి. కంట్రోల్ యూనిట్ డిస్ప్లే సెక్షన్లో చూసిన పోలైన మొత్తం ఓట్లు, ఫారమ్–17సీలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్ తప్పిదం, మరో కారణంతో కానీ కంట్రోల్ యూనిట్ ఫారమ్–17సీలో ఓట్ల సంఖ్యలో తేడా వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్ యూనిట్లను రిటర్నింగ్ అధికారి పక్కన ఉంచి ఎన్నికల కమిషన్కు సమాచారం అందిస్తారు. కంట్రోల్ యూనిట్ టేబుల్ పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ కేంద్రానికి చెందినదో ఏజెంట్లు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వరుస క్రమంలో లెక్కింపు కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్ యూనిట్లను జనరల్ అబ్జర్వర్ తన టేబుల్ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు పరిశీలకులతో ఓట్లు లెక్కిస్తారు. కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్యకు ఫారమ్–17సీ, పార్టు–2లో కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేసిన ఓట్ల సంఖ్యకు సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పరిశీలకుడు తనిఖీ చేసిన మిగిలిన కంట్రోల్ యూనిట్లన్నిటినీ జనరల్ అబ్జర్వర్ మరోసారి లెక్కిస్తారు. అసాధారణంగా ఇద్దరు అభ్యర్థులకు కౌంటింగ్ ఓట్లు సమానంగా వస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రిటరి్నంగ్ అధికారి లాటరీ ద్వారా ఫలితం ప్రకటిస్తారు. మార్గదర్శకాలు ఇలా.. కౌంటింగ్ ఏజెంటకు 18 ఏళ్లు నిండి ఉండాలి. సాయుధ రక్షణ కలిగిన వారిని అనుమతించరు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్, జెడ్పీ చైర్మన్లు, పబ్లిక్రంగ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఏజెంట్లుగా కూర్చునేందుకు అనర్హులు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందేవారు, ప్రభుత్వ–ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే పార్ట్ టైమ్ ఉద్యోగులు, పారామెడికల్ స్టాఫ్, రేష¯Œన్ డీలర్లు, అంగ¯Œవాడీ ఉద్యోగులు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరిస్తే మూడు నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. సర్పంచ్లు, పంచాయతీ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. భారత పౌరసత్వం కలిగిన ఎన్ఆర్ఐ కూడా కూర్చోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తన గన్మన్ను స్వచ్ఛందంగా వదులుకుంటే కౌంటింగ్ హాల్లో కూర్చునేందుకు అనుమతిస్తారు. ఒక కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు ఉంటాయి. ఆ మేరకు అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు అవసరం అని భావిస్తే అందుకోసం వేరే కౌంటింగ్ హాల్లో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అభ్యర్థులు అక్కడ అదనంగా మరో కౌంటింగ్ ఏజెంట్ను నియమించుకోవచ్చు. పకడ్బందీగా ప్రక్రియ ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపడతాం. గుర్తింపు పొందిన రాజకీయ పారీ్టలవారు ఏజెంట్ల నియామకంలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఈ ప్రక్రియను పక్కాగా పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారు ఏజెంట్లుగా ఉండకూడదు. పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం. – శ్రీనివాసులు, చిత్తూరు అసెంబ్లీ రిటరి్నంగ్ అధికారి -
రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలు
పెదకాకాని: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత అక్కడక్కడా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్టు తెలిపారు. సున్నితమైన ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఘర్షణలకు పాల్పడే అనుమానితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కౌంటింగ్ రోజు డ్రై డేను ప్రకటిస్తున్నామని, 144 సెక్షన్ ఎంతవరకు అవసరమో అంతవరకు విధిస్తామన్నారు. జూన్ నాలుగో తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీలతో కలిసి మీనా పరిశీలించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, మీడియా సెంటర్ను పరిశీలించారు.ఏడు నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను, డైక్మెన్ హాల్లో ఏర్పాటు చేసిన టీవీలను పరిశీలించి.. హాజరైన అభ్యర్థులతో మాట్లాడారు. అభ్యర్థులు, వారి తరఫున ప్రతినిధులు కూడా ప్రత్యక్షంగా ఈవీఎంలు భద్రపర్చిన గదులను పరిశీలించుకోవచ్చని చెప్పారు. అభ్యర్థులుగానీ, వారి ప్రతినిధులు గాని రోజుకు రెండు సార్లు స్ట్రాంగ్ రూంలను ఫిజికల్గా పరిశీలించుకునేందుకు అవకాశం కలి్పంచామన్నారు. వారి వెంట వివిధ స్థాయిల అధికారులు ఉన్నారు. -
ఏపీలో కౌంటింగ్ భద్రతపై పోలీస్ శాఖ పత్యేక దృష్టి
-
రెడ్ జోన్ గా ప్రకటన
-
కౌంటింగ్ సమయంలో అల్లర్లకు కుట్ర!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ బృందం కోరింది. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయం అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ అభ్యర్థులే రోడ్లపైకొచ్చి దాడులకు తెగబడుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పారు. కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ అల్లర్లను సృష్టించే అవకాశముందని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలను 175 నియోజకవర్గాల్లోనూ తూచా తప్పకుండా పాటించేలా చొరవ తీసుకోవాలని కోరామన్నారు. పోలింగ్ రోజు దెందులూరు నియోజకవర్గం కొప్పులవారిపాలెంలో జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పోలీసులపైన దౌర్జన్యం చేశారని, తక్షణమే ఆయనను అరెస్ట్ చేసి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైందన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన తోట మల్లేష్ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమయ్యారని చెప్పారు. దాడులను ప్రోత్సహించిన అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని కోరినట్టు తెలిపారు. గురజాల, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం టీడీపీ నాయకులని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ సిట్ను తప్పుదోవ పట్టించేలా స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులపైనే ఫిర్యాదులు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని, ఈ నేపథ్యంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సిట్ అధికారులను కోరినట్టు వివరించారు.ఉయ్యూరు లోకేశ్ వంటి ఉన్మాదులనుచంద్రబాబు రెచ్చగొడుతున్నారు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటనను ఉన్మాది ఆలోచనలతో అడ్డుకునే కుట్ర చేసినందుకే ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు నీచ మనస్తత్వంతో లోకేశ్ వంటి వారిని రెచ్చగొడుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. అత్యంత భద్రత మధ్య ఉండే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలనే లోకేశ్ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ డాక్టర్ అయినప్పటికీ ఉన్మాద మనస్తత్వంతో టీవీ డిబేట్లలో వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతుంటారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలేనికి చెందిన ఉయ్యూరు లోకేశ్ 38 ఏళ్లుగా అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్నారని, ఆయనకు అమెరికా పౌరసత్వం కూడా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చారని, ఆ తర్వాత నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని సీఎం జగన్ విదేశీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ సానుభూతిç³రులకు మెసేజ్లు పెట్టినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయని వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన పక్షంలో దీని ప్రభావం లోక్సభ ఎన్నికలపై చూపే అవకాశం ఉండటంతో కౌంటింగ్ చేపట్టొద్దని ఎన్నికల కమి షన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ రెండో తేదీన ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఐదో తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల రెండో తేదీన అంటే మంగళవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ చేప ట్టాల్సి ఉంది. జిల్లాకేంద్రంలోని బాలుర జూని య ర్ కళా శాలలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందుగా ఉప ఎన్నిక రావడం.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ వ్యూహాలతో క్యాంప్ రాజకీ యాలకు తెరలేపడం.. సీఎం రేవంత్ సొంత ఇలా కాలో జరుగుతున్న పోరు కావటంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఉమ్మడి మహబూనగర్ జిల్లాపైనే పడింది. ఫలితాల కోసం పార్టీలు ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమంలో కౌంటింగ్ వాయిదా పడడంతో నాయకుల్లో నిరుత్సాహం అలుముకుంది. -
న్యాయస్థానాల్లో ‘పెండింగ్’ భారం ఎంత?
దేశంలోని పలు కోర్టుల్లో లెక్కకుమించిన కేసులు పెండింగ్లో ఉంటున్నాయనే విషయం విదితమే. అయితే నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్జేడీజి) అందించిన తాజా సమాచారం చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 25 హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టు 10.74 లక్షల కేసులతో ముందుంది. దీని తర్వాత బాంబే హైకోర్టులో 7.13 లక్షల కేసులు, రాజస్థాన్ హైకోర్టులో 6.67 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్జీడీజీ) అందించిన తాజా డేటాలో ఈ వివరాలు ఉన్నాయి. 2018 నుంచి పెండింగ్ కేసుల సంఖ్య పెరిగింది. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసులు 50.95 శాతం మేరకు పెరిగాయి. బాంబే హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు 53.85 శాతం మేరకు పెరిగాయి. అన్ని హైకోర్టుల్లో మొత్తం 62 లక్షల కేసులు పెండింగ్లో ఉండగా, వీటిలో 71.6 శాతం సివిల్ కేసులు, 28.4 శాతం క్రిమినల్ కేసులు. 2018 నుంచి ఈ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరిగింది. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్ల క్రితం నాటివి. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. 18.25 శాతం కేసులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం పెండింగ్లో ఉన్న కేసులకు న్యాయమూర్తుల సంఖ్య సరిపోకపోవడమే ప్రధాన కారణం. 2022 మే నాటికి దాదాపు 25,600 మంది న్యాయమూర్తులు నాలుగు కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులను విచారించే లేదా తీర్పునిచ్చే పనిలో ఉన్నారు. -
పోలింగ్ అవగానే కౌంటింగ్.. అదే బెటర్
ఎప్పుడో దేశ జనాభా నూరు కోట్లు దాటిన ఇండియాలో సాధారణ ఎన్నికలను దశలవారీగా నిర్వహించడం 20వ శతాబ్దం చివర్లో మొదలైంది. జనం ఓట్లేసే రోజున పోలింగ్ కేంద్రాల స్వాధీనం, ఇతర అక్రమాలు నివారించడానికి కొన్ని ‘సమస్యాత్మక’ పెద్ద, చిన్న రాష్ట్రాల్లో దశలవారీ ఎన్నికలు 21వ శతాబ్దంలో కూడా దేశంలో ఆనవాయితీగా మారాయి. లోక్ సభ 17వ ఎన్నికలు 2019 ఏప్రిల్–మే మధ్య ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 11న మొదటి దశ పోలింగ్, మే 19న చివరి ఏడో దశ పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు మే 23న పూర్తయింది. ఈ పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తవడానికి 39 రోజుల సమయం అవసరమైంది. ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ వేడి, జనాభా, జనసాంద్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏడెనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించడం ఇటీవలి సంత్సరాల్లో చూశాం. 2021లో కేరళ, తమిళనాడుతోపాటు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సుదీర్ఘకాలం జరిగిన ఎలక్షన్లుగా చరిత్రకెక్కాయి. మొత్తం 294 సీట్లలో 292కు 2021 మార్చి 27న తొలి దశ మొదలవ్వగా, ఏప్రిల్ 29న చివరి, ఎనిమిదో దశ ఎన్నికలు జరిగాయి. మిగిలిన రెండు స్థానాలకు కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేసి సెప్టెంబర్ 30న నిర్వహించారు. మొదటి 8 దశల ఎన్నికల ఓట్ల లెక్కింపు 2021 మే 2 ఉదయం ప్రారంభించి ఫలితాలు ప్రకటించారు. చివరి రెండు స్థానాల ఫలితాలు అక్టోబర్ 3న వెలువడ్డాయి. ఆఖరి రెండు సీట్ల విషయం పక్కనబెడితే...మొదటి దశ ఎన్నికల పోలింగ్ కూ, ఓట్ల లెక్కింపు తేదీకి మధ్య 36 రోజుల విరామం ఉండడం అమెరికా, ఐరోపా దేశాల ఎన్నికల విశ్లేషకులకు వింతగా కనిపిస్తుంది. అలాగే కిందటేడాది దేశంలోనే జనాభా, లోక్ సభ సభ్యుల సంఖ్య రీత్యా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. మొత్తం 403 సీట్లకు ఏడు దశల పోలింగ్ మొదట 2022 ఫిబ్రవరి 22న, చివరి ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరిగాయి. మొత్తం స్థానాలకు ఓట్ల లెక్కింపు మార్చి 10న పూర్తిచేసి ఫలితాలు ప్రకటించారు. అంటే, యూపీలో కిందటి శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తవడానికి (మొదటి దశ పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకూ) 34 రోజులు పట్టాయి. అమెరికా, బంగ్లాదేశ్లో పోలింగ్ రోజే కౌంటింగ్! వచ్చే ఏడాది ఫిబ్రవరిలో (8న పోలింగ్–కౌంటింగ్ సోదర దేశమైన పాకిస్తాన్ సాధారణ ఎన్నికలు జరగనుండగా, జనవరి 7న మరో భారత ఉపఖండ దేశం బంగ్లాదేశ్ పార్లమెంటు (సన్సద్) ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు, ఇంకా పాకిస్తాన్, నేషనల్ అసెంబ్లీ, వివిధ ప్రావిన్సుల చట్టసభల ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కంపు ఒకే రోజు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. అమెరికాలో సైతం అధ్యక్ష ఎన్నికలు, వాటితోపాటు జరిగే ఇతర పదవులకు ఎన్నికలు ప్రతి లీప్ సంవత్సరం నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు పోలింగ్ తర్వాత ఎప్పుడనేది ఆయా దేశాల ఎన్నికల చట్టాల నిబంధనలను బట్టి ఉంటుంది. అయితే, ఏ దేశంలోనైనా పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటిస్తేనే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బలపడుతోంది. అదీగాక, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, ఓట్ల లెక్కింపు పద్ధతుల ఆధునికీకరణ వంటి పరిణామాల ఫలితంగా ప్రస్తుతం పోలింగ్ రోజే కౌంటింగ్ చేపట్టడం చాలా తేలిక అయింది. ఒకే దశలో పోలింగ్ జరిగినప్పుడు మాత్రమే ఎన్నికల రోజే ఓట్ల లెక్కింపు మొదలుబెట్టడం సాధ్యమౌతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పంథాలో నడిచే దేశాల్లో ఒకే రోజు పోలింగ్ జరిగే దేశాల్లో ఎన్నికలు పూర్తయిన మరు క్షణమే ఓట్ల లెక్కింపు మొదలుబెట్టే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పోలింగ్ జరిగిన వెంటనే ఓట్ల లెక్కింపు ఆరంభించపోతే ఆ తర్వాత వెలుబడే ఎన్నికల ఫలితాలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసే ప్రమాదం ఉంటుందనే మాట పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు బాగా వినబడుతోంది. అయితే, 142 కోట్ల జనాభా, దాదాపు నూరు కోట్ల ఓటర్లు ఉన్న ఇండియాలో అమెరికా, పాక్, బంగ్లాదేశ్లో మాదిరిగా ఓకే రోజు పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించడం సాధ్యం కాదనేది తిరుగులేని వాస్తవం. విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP -
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు?
భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఓటర్లు ఏ అభ్యర్థినీ ఇష్టపడని పక్షంలో ఏమి చేయాలనే దానిపై గతంలో చర్చ జరిగింది. ఈ నేపధ్యంలోనే 2013 ఎన్నికల్లో నోటా ఆప్షన్ను ప్రవేశపెట్టారు. 2013 తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ప్రవేశపెట్టారు. అయితే నోటాపై ఓటర్ల స్పందన ఎలా ఉందనే ప్రశ్న ప్రతీ ఎన్నికల సందర్భంలోనూ అందరి మదిలో తలెత్తుతుంది. దీనిని తెలుసుకునేందుకు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో నోటా వినియోగం గురిచం పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు పూర్తియిన నాలుగు రాష్ట్రాల డేటాను అనుసరించి చూస్తే.. మూడు రాష్ట్రాల్లో, ఒక శాతం కంటే తక్కువ మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారని స్పష్టమైంది. మధ్యప్రదేశ్లో నమోదైన 77.15 శాతం ఓటింగ్లో 0.98 శాతం మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారు. ఛత్తీస్గఢ్లో 1.26 శాతం మంది ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లో నోటా బటన్ను నొక్కారు. తెలంగాణలో 0.73 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. తెలంగాణలో 71.14 శాతం ఓటింగ్ నమోదైంది. రాజస్థాన్లో 0.96 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. ఆ రాష్ట్రంలో 74.62 శాతం ఓటింగ్ జరిగింది. ‘నోటా’ ఆప్షన్ వినియోగం గురించి కన్స్యూమర్ డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘యాక్సిస్ మై ఇండియా’కు చెందిన ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ నోటా అనేది ఎన్నికల్లో .01 శాతం నుంచి గరిష్టంగా రెండు శాతం వరకు ఉపయోగితమవుతోంది. భారతదేశంలో అమలవుతున్న ‘ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్’ సూత్రం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఈ విధానంలో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అటువంటి పరిస్థితిలో ఓటర్లు.. ఎన్నికల్లో అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని భావించినప్పుడు వారు నోటాకు ఓటు వేయవచ్చు. అయితే నోటా ఆప్షన్ను ప్రజలు సక్రమంగా వినియోగించుకుంటేనే జనం నాడి తెలుస్తుందని, ప్రయోజనం ఉంటుందని, లేనిపక్షంలో అది లాంఛనప్రాయం అవుతుందని ప్రదీప్ గుప్తా అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం రేసులో బాబా బాలక్నాథ్?.. అధిష్టానం నుంచి పిలుపు! -
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-
మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం..
-
తెలంగాణలో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ షురూ
-
తెలంగాణలో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ షురూ
-
ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్: ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండీల్య ఉత్తర్తులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నిషేధిత కర్రలు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో సంచరించడం నిషేధమని, సంఖ్యలో గుంపులుగా ఐదుగురి కంటే ఎక్కువగా తిరగకూడదని, మైక్లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫొటోలు, సింబల్స్, ప్లకార్డులు, కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రసంగాలు చేయడంపై నిషేధా/æ్ఞలు విధించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలిటరీ, ఎన్నికల అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. -
అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే!
ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా 81 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల పండుగలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని, అత్యధిక ఓటింగ్కు కారణంగా నిలిచారు. మహిళల ఉత్సాహాన్ని చూసిన ఎన్నికల అధికారులు ఈసారి ఓట్ల లెక్కింపును కూడా మహిళలకే అప్పగిస్తున్నారు. కంకేర్ జిల్లాలో జరిగే ఈ ఓట్ల లెక్కింపులో సూపర్వైజర్ నుంచి సర్వెంట్ వరకు అన్ని విధులను మహిళలే నిర్వర్తించనున్నారని అధికారులు తెలిపారు. డిసెంబరు 3న జరిగే ఓట్ల లెక్కింపునకు మొత్తం 196 మంది మహిళలను విధుల్లోకి తీసుకున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీ ఉదయం ప్రారంభంకానుంది. ఈవీఎం లెక్కింపునకు 48 మంది మహిళా గెజిటెడ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 12 మంది.. మొత్తం 60 మంది మహిళా గెజిటెడ్ అధికారులను డ్యూటీ సూపర్వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ అసిస్టెంట్లుగా 72 మంది మహిళా అసిస్టెంట్ టీచర్లు, క్లర్క్లను నియమించారు. దీంతో పాటు కౌంటింగ్ టేబుళ్ల వద్దకు ఈవీఎం యంత్రాలను తరలించేందుకు 62 మంది మహిళా సేవకులను విధుల్లోకి తీసుకున్నారు. ఫలితాలను ప్రకటించేందుకు ఇద్దరు మహిళా అధికారులకు అనౌన్సర్లుగా బాధ్యతలు అప్పగించారు. ఈ విధంగా మొత్తం 196 మంది మహిళా ఉద్యోగులు ఓట్ల లెక్కింపును పూర్తి చేయనున్నారు. కాంకేర్ కలెక్టర్ ప్రియాంక శుక్లా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు పలు ప్రయోగాలు చేశామన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని రెయిన్ బో పోలింగ్ బూత్ నిర్మించామని, ఇక్కడ మోహరించిన భద్రతా బలగాలు కూడా థర్డ్ జెండర్ వారేనని తెలిపారు. ఇది కూడా చదవండి: ట్రైన్ ఎక్కుతూ కాలు జారిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్! -
7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్
-
'ఓట్ల లెక్కింపులో అక్రమాలు చూపినా ఆర్ఓ పట్టించుకోలేదు'
అనంతపురం క్రైం: ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, వాటిని సాక్ష్యాలతో సహా చూపించినా రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ), కలెక్టర్ నాగలక్ష్మి పట్టించుకోలేదని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల కౌంటింగ్లో అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం దేనికి సంకేతం అని ప్రశి్నంచారు. పైగా వారు తమకు పడ్డ ఓట్లను సైతం తగ్గించి చూపించారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలో కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని చూసి చాలా బాధేసిందన్నారు. ‘కౌంటింగ్ నిర్వహణలో కలెక్టర్, ఎస్పీ పూర్తిగా వైఫల్యం చెందారు. టీడీపీకి అనైతికంగా మద్దతుగా నిలి్చన వీరిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ప్రవీణ్, కమలాపురం ఇన్చార్జ్ నరసింహారెడ్డి, పులివెందులకు చెందిన పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆలం నరసానాయుడు, వడ్డే మురళీ, సరిపూటి రమణ.. ఇలా పది మందికిపైగా టీడీపీ ముఖ్య నేతలు ఏజెంట్లుగా కూర్చున్నప్పటికీ ఆర్ఓ పట్టించుకోలేదు. వీరు కౌంటింగ్ హాల్లోని ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి ప్రభావం చూపేలా వ్యవహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కౌంటింగ్ హాలులో పదుల సంఖ్యలో, పరిసర ప్రాంతాల్లో వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిష్ట వేసినా ఎస్పీ ఫక్కీరప్ప ప్రేక్షక పాత్ర పోషించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే కలెక్టర్ నాగలక్షి్మ, ఎస్పీ ఫక్కీరప్పలు ఏవిధంగా మాట్లాడారు? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయాన్ని మరచిపోయారా? ► కౌంటింగ్ హాల్లో టేబుల్ నంబర్ 19లో ఓ అధికారి టీడీపీ అభ్యర్థివి 44, మా పార్టీవి ఆరు ఓట్లు కట్టకట్టి ఒకే దానిలో వేశారు. దీనిపై మా ఏజెంట్ ఫిర్యాదు చేయగా అసలు నిజం వెలుగు చూసింది. ► అదే అధికారి 3, 4, 5 రౌండ్లలోనూ ఉన్నాడని ఫిర్యాదు చేస్తే తనకేం సంబంధం లేదని రిటర్నింగ్ అధికారి చెప్పడమేంటి? అక్రమాలు జరిగినప్పుడు విచారణ చేయకపోతే ఆర్ఓగా ఎందుకున్నట్లు? మరో అధికారి.. తమవి 70 ఓట్లు ఉంటే ఆ కట్టపై 50 అని రాశారు. టీడీపీవి 30 ఉంటే 50 అని నమోదు చేశారు. ► ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోలేదు. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అవకతవకలు
-
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్లో వివాదం
సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్లో వివాదం నెలకొంది. ఇండిపెండెంట్ల ఓట్లను కౌంటింగ్ సిబ్బంది టీడీపీ ఖాతాలో కలిపారంటూ వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. అనంతరం కౌంటింగ్ సిబ్బంది అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సిబ్బందిని టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండిల్స్లో కలిపారు. 8వ రౌండు ఓట్ల లెక్కింపులో 19వ టేబుల్ వద్ద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఓట్లను తిరిగి లెక్కించగా ఆరు ఓట్లు టీడీపీ కట్టలో కలిశాయని స్పష్టమైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఎన్ని ఓట్లను ఇలా కలిపారోనన్న అనుమానం ఉందని, మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలని రిటర్నింగ్ అధికారి కేతన్గార్గ్ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా రాశారు. -
టీడీపీ కట్టల్లోకి వైఎస్సార్సీపీ ఓట్లు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండిల్స్లో కలిపారు. 8వ రౌండు ఓట్ల లెక్కింపులో 19వ టేబుల్ వద్ద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఓట్లను తిరిగి లెక్కించగా ఆరు ఓట్లు టీడీపీ కట్టలో కలిశాయని స్పష్టమైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఎన్ని ఓట్లను ఇలా కలిపారోనన్న అనుమానం ఉందని, మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలని రిటర్నింగ్ అధికారి కేతన్గార్గ్ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా రాశారు. ఇంతమంది కౌంటింగ్లో ఉన్నప్పుడే ఇలా తమ ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపేయడం దారుణమన్నారు. తొలి, రెండో రౌండులో వెయ్యి ఓట్లకు పైగా మెజారిటీ వస్తే, మూడో రౌండు నుంచి 20, 30 ఇలా తూకమేసినట్టు మెజారిటీ రావడంపైనా అనుమానాలున్నాయన్నారు. కాగా, ఒకసారి కౌంటింగ్ పూర్తయి బండిల్స్ను కలిపేస్తే తిరిగి లెక్కించడం కుదరదని, అభ్యంతరం వ్యక్తం చేసిన ఏ బాక్స్ అయినా తిరిగి లెక్కిస్తామని రిటర్నింగ్ అధికారి చెప్పారు. -
AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
06:00PM ►అనంతపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఆధిక్యత ►పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ముందంజ ►చిత్తూరు: తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఫలితాలు ►రెండో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి చంద్రశేఖర్రెడ్డి ముందంజ 03:30PM ►అనంతపురం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఆధిక్యత ►తొలి రౌండ్లో ముందంజలో ఉన్న రామచంద్రారెడ్డి ►చిత్తూరు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి చంద్రశేఖర్రెడ్డి ఆధిక్యత ►మొదటిరౌండ్లో ముందంజలో ఉన్న చంద్రశేఖర్రెడ్డి 9:50 AM స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. బలం లేకపోయినా పోటీలో నిలిచి టీడీపీ భంగపడింది. ► పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం. వైఎస్సార్సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపొందారు. కవురు శ్రీనివాస్కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్కు 460 ఓట్లు వచ్చాయి. ► కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్రావు విజయం సాధించారు. ► శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. 9:40 AM ఏలూరులో ముందంజ ► ఏలూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయపథంలో దూసుకుపోతోంది. ఇతర స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 9:15 AM శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ విజయం.. ► శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ 632 ఓట్లు రాగా.. ఇండిపెండెంట్కి 108 ఓట్లే వచ్చాయి. 8:45 AM ► ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 8 లెక్కింపు కేంద్రాల్లో అధికారులు ఓట్లు లెక్కిస్తున్నారు. 8:00 AM ► ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మూడు గ్రాడ్యుయేట్ , రెండు టీచర్, నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మొదలైంది. 9 స్థానాలకు మొత్తం 139 అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాక్షి, అమరావతి/ సాక్షి, తిరుపతి: మార్చి13న ఎన్నికలు జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు పోటీ పడుతున్న 139 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభానికి అరగంట ముందు స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. 8 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించే విధంగా పోటీ చేసిన అభ్యర్థులు, ఓటర్ల సంఖ్యనుబట్టి టేబుల్స్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం–విజయనగరం–విశాఖ పట్టభద్రుల స్థానానికి 28 టేబుల్స్, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల స్థానానికి 40 టేబుల్స్, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు కౌంటింగ్కు 25 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గానికి 14, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గానికి 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు పశి్చమ గోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు 5, శ్రీకాకుళానికి 4, కర్నూలుకు 2 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇది సుదీర్ఘ ప్రక్రియని, ఫలితాల ప్రకటనకు రెండు మూడు రోజులు కూడా పట్టే అవకాశం ఉందని మీనా తెలిపారు. సాయంత్రానికి స్థానిక సంస్థల ఫలితాలను, రాత్రికి టీచర్ల నియోజకవర్గ ఫలితాలు వెలువడవచ్చని అంచనా. పట్టభద్రుల నియోజకవర్గాల ఫలితాలకు ప్రకటనకు 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉందంటున్నారు. తొలి ఫలితం కర్నూలు స్థానిక సంస్థలది, చివరగా ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్స్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు నిలిపివేయలేం: హైకోర్టు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఫలితాలు మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయంది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరుతూ కోడి శ్రీనివాస్ బుధవారం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. -
ఏపీలో రేపటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-
హిమాచల్ ఫలితాలు: కాంగ్రెస్ విజయంపై స్పందించిన ఖర్గే
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ అప్డేడ్ 07: 00PM హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ముగిసింది. హిమాచల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ఫిగర్ 35ను దాటేసింది. మొత్తం 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 53 స్థానంలో గెలుపొందింది.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి. అప్డేడ్ 06: 30PM హిమాచల్ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం వెనక శ్రమించిన కార్యకర్తలు, పార్టీ నేతలకు కృతజ్ఙతలు తెలిపారు. వారి కృషి వల్లే ఈ ఫలితం లభించిందన్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా తమకు సహకరించిందని తెలిపారు. సోనియా గాంధీ ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయన్నారు. ఈ విజయం క్రెడిట్ తను తీసుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సాధారణమని తెలిపారు. हिमाचल प्रदेश की जनता को इस निर्णायक जीत के लिए दिल से धन्यवाद। सभी कांग्रेस कार्यकर्ताओं और नेताओं को हार्दिक बधाई। आपका परिश्रम और समर्पण इस विजय की शुभकामनाओं का असली हकदार है। फिर से आश्वस्त करता हूं, जनता को किया हर वादा जल्द से जल्द निभाएंगे। — Rahul Gandhi (@RahulGandhi) December 8, 2022 కాగా హిమాచల్ ఎన్నికల్లో విజయం అందించినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.ఔ అప్డేడ్ 06: 00PM బీజేపీపై ఉన్న అభిమానానికి, పార్టీకి అందించిన మద్దతుకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు, రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. I thank the people of Himachal Pradesh for the affection and support for the BJP. We will keep working to fulfil the aspirations of the state and raise people’s issues in the times to come. @BJP4Himachal — Narendra Modi (@narendramodi) December 8, 2022 అప్డేడ్ 04: 15PM హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించనుందని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తెలిపారు. ప్రియాంక గాంధీ 10 పాయింట్ల మ్యానిఫెస్టో అక్కడ పనిచేసిందన్నారు. అయితే గుజరాత్ ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. ప్రచార సమయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, బీజేపీకి ఊహించని విజయమని అన్నారు. 2012, 2017, 2022 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. అప్డేడ్ 03: 45PM కాంగ్రెస్ విజయం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ఫిగర్ 35ను దాటేసింది. ఇప్పటికే 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 53 స్థానంలో గెలుపొందింది.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి. అప్డేడ్ 03: 15PM సీఎం జైరాం ఠాకూర్ రాజీనామా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. కాగా మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై జైరాం ఠాకూర్ గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి చెందడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. కసుంప్టి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత అనిరుధ్ సింగ్ మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి(బీజేపీ), రాష్ట్ర మంత్రి సురేష్ భరద్వాజ్పై 8,655 ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్డేట్ 3: 00PM హిమాచల్ ప్రదేశ్ మంత్రి రామ్ లాల్ మార్కండ ఓటమి చెందారు. లాహౌల్ &స్పితి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రవి ఠాకూర్ చేతిలో 1,616 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. అప్డేట్ 2: 300PM హిమాచల్ప్రదేశ్లోని హమీర్పూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి(బీజేపీ రెబల్) అభ్యర్థి ఆశిష్ శర్మ విజయం సాధించారు. అప్డేట్ 2: 00PM కాంగ్రెస్ దూకుడు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 24 సీట్లలో విజయం సాధించగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 35ను చేరుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు. అప్డేట్ 1: 10PM ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ ధీమా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోందని, కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలను ఛత్తీస్గఢ్కు తీసుకురాబోమని, కానీ, వారిని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ఏదైనా చేస్తుంది, ఏ స్థాయికైనా వెళ్తుందన్నారు. అప్డేడ్ 11: 25AM ఆధిక్యంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 36 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు.. బీజేపీ 28 సీట్లు, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అప్డేడ్ 11: 05AM రెబల్స్తో బీజేపీ చర్చలు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. మొత్తం 68 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 35 అవసరం. ఈ క్రమంలో ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింగి బీజేపీ. రెబల్స్తో చర్చలు చేపట్టింది. అందుకోసం వినోద్ తావ్డేను హిమాచల్కు పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ 32, కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇరు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండే అవకాశం ఉన్నందున రెబల్స్ను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలో ఆపరేషన్ లోటస్ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ అప్డేట్ 10:30AM ► శాసన సభ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు తలో 32 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అప్డేట్ 9:50AM ► అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు తలో 33 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్ ఇంకా ఖాతా తెరవలేదు. అప్డేట్ 9:25AM ► హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ 34, బీజేపీ 33, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరలవలేకపోయింది. అప్డేట్ 8:55AM ► పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ 33, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ► హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 22, కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ► హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 17, కాంగ్రెస్ 13 స్థానాల్లో కొనసాగుతున్నాయి. సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్లో 68 స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. 11 గంటలకు ఫలితాలపై ఒక అంచనా వస్తుంది. హిమాచల్లో మొత్తం 68 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కొత్త రికార్డులు నెలకొల్పాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. ఈ హోరాహోరీ పోరులో గెలుపెవరిదనే ఉత్కంఠ నెలకొంది. డబుల్ ఇంజన్ నినాదం, ప్రధాని మోదీ చరిష్మాతో చరిత్ర సృష్టించాలని బీజేపీ.. అధికార వ్యతిరేకత, ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదాయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. తొలిసారి బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షలకు పైగా ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇదీ చదవండి: ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక -
ఏడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ముందంజ
-
Munugode Bypoll: 15 రౌండ్లలో కౌంటింగ్.. మధ్యాహ్నానికి ఫలితం!
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఆదివారం జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఆర్జాలబావి గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కోసం మొత్తం 75 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈవీఎంలు అందించేందుకు, ఇతర అవసరాలకు గాను 300 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. పూర్తి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చే అవకాశం ఉంది. 23 టేబుళ్ల ఏర్పాటు..: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంలలో ఓట్లను లెక్కించేందుకు 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ను నియమించారు. ఒక్కో టేబుల్ మీద ఒక్కో పోలింగ్ స్టేషన్కు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అలా ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 9 గంటల కల్లా తొలిరౌండ్ ఫలితం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 686 లెక్కించిన తర్వాత అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేస్తారు. ఈవీఎంలను కౌంటింగ్ హాల్కు తీసుకొస్తారు. 21 టేబుళ్లమీద వాటిని లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం 9 గంటలోపు రానుంది. గంటలో 4 రౌండ్లు లెక్కించే అవకాశం ఉండడంతో.. ఒంటి గంట వరకు మునుగోడు ఉప ఎన్నికల ఫలితం తేలిపోనుంది. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల బందోబస్తు మధ్య కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, రాహుల్శర్మ, రిటర్నింగ్ అధికారి రోహిత్సింగ్ పరిశీలించారు. చదవండి:ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..? -
Presidential Election 2022: ద్రౌపది ముర్ము ఘన విజయం
Presidential Election 2022 Result Live: అప్డేట్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. 07:50 మూడో రౌండ్లోనూ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో కలిపి ఆమె సగానికి పైగా ఓట్లు సాధించారు. ద్రౌపది ముర్ముకు 5,77,777 ఓట్ల విలువ యశ్వంత్ సిన్హాకు 2,61, 062 ఓట్ల విలువ పోలైంది. 05:30 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. ద్రౌపది ముర్ముకు పోలైన ఓట్లు చూస్తుంటే అంచనాలకు మించి మెజార్జీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది.. 75 శాతానికిపైగా ఓట్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది 03: 00PM రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓట్ల లెక్కింపు ముగిసింది. కాసేపట్లో ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు. ద్రౌపది ముర్ముకు 62 శాతానికి పైగా ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. 02: 50PM రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఎంపీ ఓట్లు రాగా.. సిన్హాకు 208 ఎంపీ ఓట్లు పడ్డాయి. ఓటు విలువ ముర్ముకు 3,78,00 ఉండగా , యశ్వంత్ సిన్హాకు 1,45,600 గా ఉంది. చెల్లని ఎంపీ ఓట్లు 15గా తేలాయి. మొత్తం 4809 ఓటర్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలో దాదాపు 99 శాతం మంది ఓటేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడిన విషయం తెలిసిందే. కాగా ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1:50PM కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు 11:00AM రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం పార్లమెంట్ భవనంలో మొదలైన కౌంటింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పార్లమెంట్ హౌస్లో లెక్కిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ముర్ము విజయం సాధించడం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు. -
పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!...కచ్చితంగా షాక్ అవుతారు!!
ఇంతవరకు మనం చాలా ఎలక్షన్స్లో నిలబడ్డ నాయకులు వారికి వచ్చిన ఓట్లు గురించి విని ఉంటాం. అంతెందుకు చాలామంది కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన నాయకులను కూడా చూసి ఉంటాం. పోనీ ఎప్పుడూ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వచ్చే నాయకుడికి సైతం అత్యంత ధారుణంగా ఓట్లు వచ్చిన ఘటనలను చూసి ఉంటాం. కానీ గుజరాత్లోని ఒక వ్యక్తికి మాత్రం ఎంత ధారుణంగా ఓట్లు వచ్చాయంటే ఇప్పటి వరకు అన్ని ఓట్లు వచ్చి ఉండవు. (చదవండి: విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు) అసలు విషయంలోకెళ్లితే...గుజరాత్లోని వాపి జిల్లాలోని చర్వాలా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో సర్పంచి పదవికి సంతోష్ అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు ఎంతగానో మద్దతు ఇస్తారని సంతోష్ ఆశించారు. పైగా అతని కుటుంబంలోనే 12 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే తనకు ఒక్క ఓటు మాత్రమే వచ్చిందని తెలిసి సంతోష్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. పైగా సంతోష్ తన అభ్యర్థిత్వానికి కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వకపోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కోపంతో విరుచుకుపడ్డాడు. నిజానికి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఓటరు తన వార్డుకు సర్పంచ్ని ఎన్నుకోవడానికి ఒక ఓటు పంచాయతీ సభ్యులకు ఒక ఓటు అంటే మొత్తంగా ఎన్నుకునేందుకు రెండు ఓట్లు వేయాలి. (చదవండి: నిబంధనలకు విరుద్ధం!..జుట్టు కత్తిరించిన ప్రిన్స్పాల్) -
బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
-
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వ సిద్ధమైంది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాటు చేశారు. రేపు(మంగళవారం) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా, ముందుగా వాటిని లెక్కించనున్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేయగా హాలుకు 7 టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లు సిద్ధం చేశారు. ఫలితాలు సాయంత్రం నాలుగు గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఉప ఎన్నిక కౌంటింగ్ 22 రౌండ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్ ఫలితానికి అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పందించారు. వాటిని మార్చేందుకు అవకాశం లేదని తెలిపారు. ఆదివారం రాత్రి కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ... శనివారం రాత్రి పోలింగ్ ముగించుకుని కరీంనగర్కు వస్తున్న జమ్మికుంట మండలం కొరటపల్లి, వెంకటేశ్వరపల్లి 160,161,162 పోలింగ్ బూత్లకు సంబంధించిన ఈవీఎంలతో ఉన్న బస్సు జమ్మికుంట ఫ్లైఓవర్ వంతెన వద్ద టైర్ పంక్చర్ కావడంతో సేప్టీటైర్ అమర్చే క్రమంలో కొంత ఆలస్యమైందన్నారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
-
హుజూరాబాద్ ఫైట్
-
అక్టోబర్ 30న బద్వేలు ఉపఎన్నిక
-
AP ZPTC MPTC: కుప్పంలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్
-
అనంతపురంలో పరిషత్ ఎన్నికల ఓట్లలెక్కింపునకు ఏర్పాట్లు
-
రేపే పరిషత్ ఫలితాలు : మాక్ కౌంటింగ్ నిర్వహిస్తున్న అధికారులు
-
రేపు ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్
-
విశాఖ లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైందన్న అధికారులు
-
ఎన్నికల కౌంటింగ్కు ముహూర్తం ఫిక్స్
-
మ్యాగజైన్ స్టోరీ 17 September 2021
-
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఏలూరు కార్పొరేషన్: కాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్
-
ఏలూరు కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం
లైవ్ అప్డేట్స్ వైఎస్సార్సీపీ ప్రభంజనం ►ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఏలూరు కార్పొరేషన్ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఏలూరు మేయర్ పీఠం వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 50 డివిజన్ల ఫలితాలు వెల్లడికాగా, 47 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ► 1వ డివిజన్ ఎ.రాధిక (వైఎస్సార్సీపీ) విజయం ►2వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి నరసింహారావు గెలుపు, 787 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం. ► 3వ డివిజన్ బి.అఖిల (వైఎస్సార్సీపీ) విజయం ► 4వ డివిజన్ డింపుల్ (వైఎస్సార్సీపీ) విజయం, 744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు ► 5వ డివిజన్ జయకర్ (వైఎస్సార్సీపీ) విజయం, 865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం ► 10వ డివిజన్ పైడి భీమేశ్వరరావు (వైఎస్సార్సీపీ) గెలుపు, 812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం ► 11వ డివిజన్ కోయ జయగంగ (వైఎస్సార్సీపీ) గెలుపు, 377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం ► 12వ డివిజన్ కర్రి శ్రీను (వైఎస్సార్సీపీ) గెలుపు, 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం ► 17వ డివిజన్ టి.పద్మ (వైఎస్సార్సీపీ) విజయం, 755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు ► 18వ డివిజన్ కేదారేశ్వరి (వెస్సార్సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు ► 19వ డివిజన్ వై.నాగబాబు (వెస్సార్సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం ► 22వ డివిజన్ సుధీర్బాబు (వైఎస్సార్సీపీ) గెలుపు ► 23వ డివిజన్ కె.సాంబ (వైఎస్సార్సీపీ) విజయం, 1823 ఓట్ల మెజార్టీతో కె.సాంబ గెలుపు ► 24వ డివిజన్ మాధురి నిర్మల (వైఎస్సార్సీపీ) గెలుపు, 853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం ► 25వ డివిజన్ గుడుపూడి శ్రీను (వైఎస్సార్సీపీ) గెలుపు ►26వ డివిజన్ అద్దంకి హరిబాబు(వైఎస్సార్సీపీ) గెలుపు, 1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం ► 31వ డివిజన్ లక్ష్మణ్ (వైఎస్సార్సీపీ) విజయం, 471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు ► 32వ డివిజన్ సునీత రత్నకుమారి (వైఎస్సార్సీపీ) గెలుపు ► 33వ డివిజన్ రామ్మోహన్రావు (వైఎస్సార్సీపీ) విజయం, 88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్రావు గెలుపు ►36వ డివిజన్ హేమ సుందర్ (వైఎస్సార్సీపీ) విజయం ►38వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు ►39వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం ►40వ డివిజన్ టి.నాగలక్ష్మి (వైఎస్సార్సీపీ) గెలుపు, 758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం ► 41వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి కల్యాణి విజయం, 547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం ► 42వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం ► 43వ డివిజన్ జె.రాజేశ్వరి (వైఎస్సార్సీపీ) గెలుపు ► 45వ డివిజన్ ముఖర్జీ (వైఎస్సార్సీపీ) గెలుపు, 1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం ► 46వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ప్యారీ బేగం విజయం, 1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు ► 48వ డివిజన్ స్వాతి శ్రీదేవి (వైఎస్సార్సీపీ) విజయం, 483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు ►50వ డివిజన్ షేక్ నూర్జహాన్ (వైఎస్సార్సీపీ) విజయం, 1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు ► 26 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ ► 50వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి షేక్ నూర్జహాన్ ఆధిక్యం ►ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా ►20 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ ►41వ డివిజన్లో వైఎస్సార్సీపీఅభ్యర్ధి కల్యాణి విజయం ► 8వ డివిజన్లో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ► 2,10, 31, 33, 36, 39, 45, 46, 47 డివిజన్లలో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ► ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ► 50 పోస్టల్ బ్యాలెట్లలో పోలైన ఓట్లు 15, ► వైఎస్సార్సీపీ- 11, చెల్లనవి- 2, నోటా-1, టీడీపీ-1 ► ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ► తొలుత 50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్లింపు అనంతరం డివిజన్ల వారీగా ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్కి ప్రతీ రౌండ్లో1000 ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్కి 25 ఓట్లని బండిల్గా కట్టి 40 బండిల్స్గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. ► ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 47 డివిజన్లకు 48 టేబుల్స్పై ఒకే రౌండ్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తై తుది ఫలితాలు వెల్లడికాన్నాయి. నలుగురు సీనియర్ ఆఫీసర్లను నాలుగు కౌంటింగ్ హాళ్లకు సూపర్ వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీతో పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ టెస్టులు, మాస్క్, ఫేస్ షీల్డ్ లేనిదే కౌంటింగ్ హాలులోకి అనుమతి నిరాకరిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. కాగా, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 50 డివిజన్లలో ఇప్పటికే మూడు డివిజన్లు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు నేడు వెల్లడి కానున్నాయి. -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్కు లైన్క్లియర్
-
ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా
-
ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ అప్ డేట్
-
తెలంగాణ:మినీ మున్సి ‘పోల్స్’ కౌంటింగ్
-
తెలంగాణ: 2 కార్పొరేషన్, 5 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ వశం
లైవ్ అప్డేట్స్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 45 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో పొత్తులవారీగా.. టీఆర్ఎస్ + సీపీఐ =38 కాంగ్రెస్+ సీపీఎం = 11 బీజేపీ = 1 ఇతరులు = 2 తెలంగాణలో 5 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం నకిరేకల్ (20): టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 కొత్తూరు (12): టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 అచ్చంపేట (20): టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1 జడ్చర్ల (27): టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2 సిద్దిపేట (43): టీఆర్ఎస్ 36, బీజేపీ 1, ఎంఐఎం 1, ఇతరులు 5 సిద్దిపేట మున్సిపాలిటీ జనరల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు 1వ వార్డు టీఆర్ఎస్ 2వ వార్డు టీఆర్ఎస్ 3వ వార్డు టీఆర్ఎస్ 4వ వార్డు టీఆర్ఎస్ 5వ వార్డు టీఆర్ఎస్ 6వ వార్డు టీఆర్ఎస్ 7వ వార్డు టీఆర్ఎస్ 8వ వార్డు టీఆర్ఎస్ 9వ వార్డు టీఆర్ఎస్ 10వ వార్డు టీఆర్ఎస్ 11వ వార్డు టీఆర్ఎస్ 12వ వార్డు టీఆర్ఎస్ 13వ వార్డు టీఆర్ఎస్ 14వ వార్డు టీఆర్ఎస్ 15వ వార్డు టీఆర్ఎస్ 16వ వార్డు టీఆర్ఎస్ 17వ వార్డు బీజేపీ 18వ వార్డు టీఆర్ఎస్ 19వ వార్డు టీఆర్ఎస్ 20వ వార్డు స్వతంత్రుడు. కానీ టీఆర్ఎస్లో చేరిక 21వ వార్డు టీఆర్ఎస్ 22వ వార్డు టీఆర్ఎస్ 23వ వార్డు టీఆర్ఎస్ 24వ వార్డు టీఆర్ఎస్ 25వ వార్డు టీఆర్ఎస్ 26వ వార్డు టీఆర్ఎస్ 27వ వార్డు టీఆర్ఎస్ 28వ వార్డు టీఆర్ఎస్ 29వ వార్డు ఏఐఎంఐఎం 30వ వార్డు టీఆర్ఎస్ 31వ వార్డు టీఆర్ఎస్ 32వ వార్డు టీఆర్ఎస్ 33వ వార్డు టీఆర్ఎస్ 34వ వార్డు టీఆర్ఎస్ 35వ వార్డు స్వతంత్ర 36వ వార్డు స్వతంత్ర 37వ వార్డు టీఆర్ఎస్ 38వ వార్డు టీఆర్ఎస్ 39వ వార్డు టీఆర్ఎస్ 40వ వార్డు టీఆర్ఎస్ 41వ వార్డు టీఆర్ఎస్ 42వ వార్డు స్వతంత్ర 43వ వార్డు స్వతంత్ర ................................. 43 వార్డుల్లో టీఆర్ఎస్ 36 సొంతం చేసుకోగా, స్వతంత్రులు ఐదుగురు, ఒక బీజేపీ, ఒక ఏఐఎంఎం సొంతం చేసుకున్నాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తాజా లెక్కింపు వివరాలు మొత్తం డివిజన్లు 66 ఉండగా టీఆర్ఎస్ హవా సాగిస్తోంది. టీఆర్ఎస్ 28 విజయం + 23 ఆధిక్యం = మొత్తం 51 బీజేపీ 8 విజయం, రెండింటిలో ఆధిక్యం = మొత్తం 10 ఒక చోట కాంగ్రెస్ విజయం, మరో చోట ఆధిక్యం స్వతంత్రులు ఇద్దరు విజయం, ఒకరు ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మూడు స్థానాలు ఖమ్మం లెక్కింపు కేంద్రంలో గందరగోళం .. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్ బ్యాలెట్ బాక్స్ లో కంపించాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ ఆందోళన. 11 డివిజన్ బ్యాలెట్ బాక్స్లో 24వ డివిజన్ ఓట్లలో ఎలా వచ్చాయంటూ ఆందోళన. కౌంటింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి. కన్నీళ్లు పెట్టుకుంటూ కౌంటింగ్ కేంద్రం ముందు ఆందోళన. రీపోలింగ్ జరపాలని డిమాండ్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ అప్డేట్స్.. మూడు రౌండ్లు ముగిసేవరకు 28 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం..మరో 23 డివిజన్లలో ఆధిక్యం. 7 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం.. మరో మూడు డివిజన్లలో లీడ్. ఒక డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం. మరో డివిజన్లో లీడ్. రెండు డివిజన్లలో స్వతంత్రులు విజయం. మరో స్థానంలో లీడ్. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. రెండో రౌండ్లో దూసుకుపోతున్న కారు.. 22, 23 , 24 , 25 , 26, 27 వార్డుల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 9, బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఐఏఎఫ్ బీ ఒకరు గెలిచారు. టీఆర్ఎస్ నుంచి 9వ డివిజన్ టీఆర్ఎస్ చీకటి శారద 13 వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ జోషి విజయం 23 డివిజన్ టీఆర్ఎస్ యెలగం లీలావతి 24 డివిజన్ టీఆర్ఎస్ రామ తేజస్విని విజయం 28వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గందె కల్పన విజయం 29 డివిజన్ టీఆర్ఎస్ గుండు సుధారాణి 51వ డివిజన్ బోయినిపెల్లి రంజిత్ రావు 60వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి అభినవ్ భాస్కర్ 61వ డివిజన్ టీఆర్ఎస్ ఎలకంటి రాములు గెలిచారు. బీజేపీ 30 డివిజన్ రావుల కోమల 52 డివిజన్ చాడ స్వాతి 59వ డివిజన్ గుజ్జుల వసంత ఇతరులు 22 డివిజన్ ఐఏఎఫ్ బీ అభ్యర్థి బస్వరాజు కుమార్ 10వ డివిజన్ కాంగ్రెస్ తోట వెంకటేశ్వర్లు గెలిచారు. 2 డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజ. 10 టీఆర్ఎస్ గెలుపు. బీజేపీ 5, 3 డివిజన్లలో ముందంజలో స్వంతంత్ర అభ్యర్థి 1 గెలుపు, 1 కాంగ్రెస్ గెలుపు వరంగల్ : 6 డివిజన్ చెన్నం మధు టీఆర్ఎస్ గెలుపు 7 డివిజన్ వేముల శ్రీనివాస్ టీఆర్ఎస్ గెలుపు ఖమ్మం.. ఖమ్మం కార్పొరేషన్ 30డివిజన్ల లెక్కింపు పూర్తి టీఆర్ఎస్, సీపీఐ కూటమి -21 (టీఆర్ఎస్-19, సీపీఐ-2) కాంగ్రెస్, సీపీఎం కూటమి-7 (కాంగ్రెస్ 6, సీపీఎం 1) బీజేపీ-1 స్వతంత్ర -1 టీఆర్ఎస్-21 కాంగ్రెస్-07 బీజేపీ-01 స్వతంత్ర -01 నల్లగొండ: నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం నకిరేకల్ (20): టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం కొత్తూరు (12): టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 నాగర్కర్నూలు: అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం అచ్చంపేట (20): టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1 మహబూబ్నగర్: జడ్చర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం జడ్చర్ల (27): టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2 సిద్దిపేట: సిద్దిపేట 4 వ వార్డులో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థి లక్ష్మి మృతి .నాల్గు రోజుల నుంచి అనారోగ్యంతోబాధపడుతున్న లక్ష్మి సోమవారం మృతి చెందారు. ఖమ్మం: పోలింగ్ నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఖమ్మం 57వ డివిజన్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పోలింగ్ రోజు 57వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్, టీఆరెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ వాళ్ళు దొంగ ఓట్లు వేయించారని పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి ఆందోళన చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దాంతో పోలీసులు రెండు సార్లు లాఠీ ఛార్జ్ చేశారు. హైదరాబాద్: లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్రెడ్డి గెలుపొందారు. బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య. బీజేపీ కార్పొరేటర్ మృతితో లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక అనివార్యం అయింది. నల్గొండ జిల్లా: నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం నకిరేకల్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో టీఆర్ఎస్ 12 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 2, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు. ►ఒకటో వార్డులో 190 ఓట్లు మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి కందాల భిక్షం రెడ్డి గెలుపొందారు. 196 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ► రెండో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సునీల్ కుమార్ 400 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ► మూడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చింత స్వాతి త్రిమూర్తులు గెలిచారు. ► నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాజుల సుకన్య విజయం సాధించారు. ► ఐదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి వంటేపాక సోమలక్ష్మీ గెలుపొందారు. ► ఆరో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ మట్టిపల్లి కవిత విజయం సాధించారు. ► ఏడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండ శ్రీను గెలుపొందారు. ► ఎనిమిదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పన్నాల పావని శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ► తొమ్మిదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి చౌగోని రజిత విజయం సాధించారు. ► పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇ సునీత 74 మెజారిటీతో విజయం సాధించారు. ► 11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మురారి శెట్టి ఉమారాణి గెలుపొదారు. ► 12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు వెంకన్న విజయం సాధించారు. ► 13వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత విజయం సాధించారు. ► 14వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం స్వామి గెలుపొందారు. ► 15వ వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి యసారపు వెంకన్న గెలిచారు. ► 16వ వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సైదుల విజయం సాధించారు. ►17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లె విజయ్ గెలిచారు. ► 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దైద స్వప్న రవీందర్ విజయం సాధించారు. ► 19వ వార్డులో రాచకొండ శ్రీను (టీఆర్ఎస్) గెలుపొందారు. ► 20వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి రాములమ్మ విజయం సాధించారు. ఖమ్మం జిల్లా: ఖమ్మం కార్పొరేషన్ ఫలితాలు: ► ఒకటో డివిజన్ టీఅర్ఎస్ అభ్యర్థి తేజావత్ హుస్సేన్ గెలుపొందారు. ► 2వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్ధి వెంకటేశ్వర్లు గెలుపొందారు. ► 3వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తపల్లి నీరజ విజయం సాధించారు. ► 7వ డివిజన్లో బీజేపీ దొంగల సత్యనారాయణ గెలుపొందారు. ► 8వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సైదుల విజయం సాధించారు. ► 14వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి బలరాజు విజయం సాధించారు. ► 20వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ లక్ష్మీ గెలుపొందారు. ► 25వ డివిజన్లో టీఆఎస్ అభ్యర్థి చంద్రకళ గెలుపొందారు. ► 31వ డివిజన్లో సీపీఎం అభ్యర్థి ఎర్ర గోపి విజయం సాధించారు. ► 37వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా జోహార విజయం సాధించారు. ► 43వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్ధి క్లైమేట్ విజయం సాధించారు. ►44వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ గెలుపొందారు. ► 55వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మోతారపు శ్రావణి విజయం సాధించారు. ► 56వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పైడిపల్లి రోహిణి గెలుపొందారు. ►ఖమ్మం కార్పొరేషన్ 30 డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. టీఆర్ఎస్,సీపీఐ కూటమి-21(టీఆర్ఎస్-19, సీపీఐ-2), కాంగ్రెస్, సీపీఎం కూటమి-07(కాంగ్రెస్-6, సీపీఎం-1), బీజేపీ-01, ఇండిపెండెంట్-01 గెలుపొందారు. వరంగల్: వరంగల్ కార్పొరేషన్ ఫలితాలు: వరంగల్ కార్పొరేషన్లో కొనసాగుతున్నటీఆర్ఎస్ హవా. టీఆర్ఎస్ 23 డివిజన్లు, బీజేపీ 3 డివిజన్లు, కాంగ్రెస్ పార్టీ 1 డివిజన్లో ఆధిక్యంలో ఉన్నాయి. ► వరంగల్ కార్పొరేషన్లో కొనసాగుతున్నటీఆర్ఎస్ హవా. టీఆర్ఎస్ 23 డివిజన్లు, బీజేపీ 3 డివిజన్లు, కాంగ్రెస్ పార్టీ 1 డివిజన్లో ఆధిక్యంలో ఉన్నాయి. సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీ ఫలితాలు ► 1వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి విజేందర్ రెడ్డి గెలుపొందారు. ► 2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని చంద్రం 364 ఓట్ల మెజారిటీ గెలిచారు. ► 3వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి విజయం సాధించారు. ► 4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండం కవిత గెలుపొందారు. ► 5వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అనగోని వినోద్ విజయం సాధించారు. ► 6వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వడ్ల కొండ సాయి కుమార్ గెలుపొందారు. ► 7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవి 547 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ► 8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వరాల కవిత విజయం సాధించారు. ► 9వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పసుకుల సతీష్ 88 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ► 10వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ 222 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ► 11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపొందారు. ► 12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అత్తెల్లి శ్రీనివాస్ 331 ఓట్లతో విజయం సాధించారు. ► సిద్దిపేట మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. మొత్తం 43 వార్డుల్లో.. 14 వార్డుల్లో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా.. బీజేపీ రెండో స్థానంలో ఉంది. ► తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి. 12 వార్డుల్లో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 49. టీఆర్ఎస్ 44, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3 ఓట్లు వచ్చాయి. ►మొదటి రౌండ్లో 21 వార్డుల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 19 వార్డుల్లో టీఆర్ఎస్, బీజేపీ-1, ఇండిపెండెంట్-1 గెలుపొందారు. మహబూబ్నగర్: అచ్చంపేట మున్సిపాలిటీ ఫలితాలు.. ►అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం అయ్యింది. 20 వార్డుల్లో కౌంటింగ్ పూర్తయ్యింది. టీఆర్ఎస్-13, కాంగ్రెస్-6, బీజేపీ-1 విజయం సాధించారు. ►ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గౌరి శంకర్ విజయం సాధించారు. ►13వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అంతటి శివ గెలుపొందారు. వరంగల్: పరకాల 9వ వార్డులో బీజేపీ విజయం పరకాల 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పరకాల మున్సిపాలిటీ 9 వార్డులో 215 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి పూర్ణచారి విజయం సాధించారు. 261ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి చిదురాల దేవేంద్ర రెండో స్థానంలో నిలిచారు. 131 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దార్నా వేణుగోపాల్ మూడో స్థానంలో నిలిచారు. రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ ► ఏడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కమ్మరి జయమ్మ 26 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ► రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతోంది. మహబూబ్ నగర్: జడ్చర్ల మున్సిపాలిటీ జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు రౌండ్లలో ఫలితాలు కానున్నాయి.5 కౌంటింగ్ హాల్స్లో 19 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ► సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ► తెలంగాణ మినీ మున్సి ‘పోల్స్’ కౌంటింగ్ ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. ► తెలంగాణ మినీ మున్సి ‘పోల్స్’ కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో పాటు సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల ఓట్లను లెక్కిస్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. సాక్షి, హైదరాబాద్: మినీ మున్సి‘పోల్స్’ఫలితాలు నేడు(సోమవారం) వెల్లడికానున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలతోపాటు గజ్వేల్ మున్సిపాలిటీలోని 12వ వార్డు, నల్లగొండ 26వ వార్డు, బోధన్ 18వ వార్డు, పరకాల 9వ వార్డు, జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ డివిజన్కు గత నెల 30న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో సాయంత్రంలోగా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో కోవిడ్–19 నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులను ఆదేశించింది. ఫలితాలు వెల్లడైన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆంక్షలు విధించింది. ఎన్నికల అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకుని నెగెటివ్గా తేలిన తర్వాతే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్ -
లక్ష పైగా ఆధిక్యంలో వైఎస్సార్సీపీ
-
మమతా బెనర్జీ ఇంటిముందు టీఎంసీ కార్యకర్తల సంబరాలు
-
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాల విశ్లేషణ
-
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్: లక్షా 50 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ
-
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
-
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు: 10 స్థానాల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి విజయం
► పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) కూటమి 12 సీట్లు గెలుచుకుంది. మరో 3 అసెంబ్లీ విభాగాలలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్-డీఎంకె నేతృత్వంలోని కూటమి 5 స్థానాల్లో గెలిచి, రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► కామరాజునగర్లో బీజేపీ అభ్యర్థి జాన్కుమార్ గెలుపు ►కదిర్గమమ్లో కాంగ్రెస్ అభ్యర్థి సెల్వనాథనె గెలుపు ►మహెలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ విజయం ►మన్నాడిపేట బీజేపీ అభ్యర్థి ఎ.నమఃశివాయం గెలుపు ►యానాంలో తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ అశోక్ 3,877 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ►పుదుచ్చేరిలో 10 స్థానాల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. రెండు చోట్ల కాంగ్రెస్, ఒక చోట డీఎంకే విజయం కైవసం చేసుకుంది. ►యానాంలో మాజీ సీఎం రంగస్వామి వెనుకంజలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి 674 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏఐఎన్ఆర్సీ 6, బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. డీఎంకే, కాంగ్రెస్ కూటమి 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. యానాంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ ఆధిక్యంలో ఉన్నారు. ►పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎన్డీయే పయనిస్తోంది. ►పుదుచ్చేరిలో ఎన్డీయే ముందంజలో ఉంది. యానాంలో బీజేపీ అభ్యర్థి రంగస్వామి ఆధిక్యంలో ఉన్నారు. పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్లో భాగంగా పుదుచ్చేరిలో 31 హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను కనీసం 15 సార్లు శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్కు పరాభవం తప్పదని అంటున్నారు. ఇక్కడ బీజేపీ-ఏఐఏడీఎంకే-ఏఐఎన్ఆర్సీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
కేరళ: మరోసారి లెఫ్ట్ ప్రభుత్వం.. ధర్మదాం నుంచి పినరయి విజయం
లైవ్ అప్డేట్స్: ► "కేరళ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినందుకు పినరయి విజయన్, ఎల్డీఎఫ్ కు నా అభినందనలు. మేము ఇద్దరం కలిసి విస్తృతమైన విషయాలపై పనిచేస్తాము. కోవిడ్ -19 మహమ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టే విషయంలో కలిసి పనిచేయనున్నాం" అని పీఎం మోడీ ట్వీట్ చేశారు. ► కేరళ ఎన్నికల్లో ధర్మదాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సీపీఎం నాయకుడు పినరయి విజయన్ కాంగ్రెస్ సీ రఘునాథన్ పై 50,123 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ► "కేరళ ప్రజలు మరోసారి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. అయితే కోవిడ్ -19 వల్ల పెద్దగా సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదు. ప్రతి ఒక్కరూ కోవిడ్ -19కి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి" అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు ► శశి థరూర్ పినరయి విజయన్ ను అభినందించారు "గత 44 సంవత్సరాలలో మొదటిసారి తిరిగి ఎన్నికైనందుకు @CMOKerala @vijayanPinarayiకి నా అభినందనలు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని గౌరవించడం వారి కర్తవ్యం. #కోవిడ్ & మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు మన మద్దతు ఉండాలి "అని ఎల్డిఎఫ్ చారిత్రాత్మక విజయంపై శశి థరూర్ ట్వీట్ చేశారు. మెట్రోమాన్ ఈ శ్రీధరణ్కు షాక్...! ► మెట్రోమాన్ ఈ శ్రీధరణ్కు షాక్ తగిలింది. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. పాలక్కడ్ నియోజకవర్గంపై కాంగ్రెస్ మరోసారి తన సత్తాచాటింది. కాగా మరోసారి ఎల్డీఫ్ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ► కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ మట్టన్నూర్ నియోజకవర్గం నుంచి 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేరళ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ గెలిచిన చరిత్ర ఇదేనని చెబుతున్నారు. ► కేరళలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార ఎల్డీఎఫ్ ఆధిక్యంలో దూసుకు పోతుంది. 44 స్థానాల్లో గెలుపొంది, 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్డీఎఫ్ 10 స్థానాలను కైవసం చేసుకుని, 35 లీడ్లో ఉంది. ► ఎల్డీఎఫ్ 70 , యూడీఫ్ 37 స్థానాలలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎల్డీఎఫ్ 26, యూడీఫ్ 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ► త్రిశూర్లో బిజేపీ అభ్యర్థి సురేష్ గోపి ముందంజలో ఉన్నారు. ► రెండోసారి విజయం దిశగా దూసుకుపోతున్న లెఫ్ట్ ప్రభుత్వం.. ► పినరయి విజయన్దే ఈవిజయం అంటున్న విశ్లేషకులు.. ► ధర్మదాంలో సీఎం పినరయి విజయన్ ఆధిక్యం ► పుత్తుపల్లిలో ఊమెన్ చాందీ చాంది ఆధిక్యం ► కేరళలో పాలక్కడ్లో మెట్రోమాన్ శ్రీధరన్ ముందంజ.. ► కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ ధర్మదంలో పోటీ చేసిన పినరయి విజయన్(CPM) పుట్టుపల్లిలో పోటీ చేసిన ఊమెన్ చాందీ(కాంగ్రెస్) కళహాకూట్టంలో పోటీ చేసిన శోభా సురేంద్రన్(బీజేపీ) ► కేరళలో ఆధిక్యం దిశలో దూసుకుపోతున్న అధికార ఎల్డీఎఫ్.. ఎల్డీఎఫ్ 78 , యూడీఎఫ్ 48 ► కేరళలో తొలి రౌండ్లో ఎల్డీఎఫ్ ఆధిక్యం.. ఎల్డీఎఫ్ 68, యూడీఎఫ్ 47 ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 33, యూడీఎఫ్ 18 చోట్ల ఆధిక్యం ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 14, యూడీఎఫ్ 9 చోట్ల ఆధిక్యం ► కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు అధికారంలోకి రానున్నారో నేటి ఫలితాలు తేల్చనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్లో భాగంగా కేరళలో 633 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. కేరళలో 140 శాసనసభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: సువేందు అధికారి గెలుపు
లైవ్ అప్డేట్స్: ♦ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్లో చివరకు సువేందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువేందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది. ♦ నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్పై ఉత్కంఠ కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం మమతా బెనర్జీ ఓడిపోయిందంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై ఈసీ స్పష్టత ఇచ్చింది. ఇంకా లెక్కించాల్సిన ఓట్లున్నాయని, నందిగ్రాం ఫలితం ప్రకటించలేదని తేల్చి చెప్పింది. ♦16వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి సువేందు, దీదీపై 6 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ♦నంనదిగ్రామ్లో దీదీ మళ్లీ ముందంజలో కొనసాగుతున్నారు. సువేందుపై 2 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు దీదీ. ♦ టీఎంసీ 209 స్థానాల్లో ఆధ్యికంలో కొనసాగుతూ.. హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతుంది. బీజేపీ 80 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతుంది. ♦ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలిపారు. విచ్చినకర,విభజించే శక్తులను ప్రజలుతిప్పికొట్టారన్నారు. ♦ టీఎంసీకి అభినందనలు తెలిపిన శివసేన, ఎన్సీపీ ♦ క్రికెటర్ టర్న్డ్ పొలిటీసియన్ మనోజ్ తివారీ బీజేపీకి చెందిన రతిన్ చక్రవర్తిపై ఆధిక్యం ♦ స్పష్టమైన ఆధిక్యంతో పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంటిముందు టీఎంసీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ♦ బెంగాల్లో ఒక్క స్థానానికే కాంగ్రెస్, లెఫ్ట్ పరిమితం (మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్) ♦ బెంగాల్లో కమ్యూనిస్టులకు భారీ గండి ♦ నందిగ్రామ్లో దూసుకొచ్చిన మమత. సువేదు అధికారిపై ఇప్పటిదాకా దాదాపు 8వేలకుపైగా ఓట్ల వెనుకంజలో ఉన్న మమత 6వ రౌండ్లో 1427ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ♦ లీడింగ్లోడబుల్ సెంచరీ మార్క్ను దాటేసిన టీఎంసీ. 201 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ జోరు ♦ ఐదో రౌండ్లో పుంజుకున్న మమత 8,201 నుంచి 3వేలకు పడిపోయిన సువేందు ఆధిక్యం ♦ ఒకవైపు టీఎంసీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా,వరుసగా నాలుగో రౌండ్లోనూ సీఎం మమతకు భంగపాటు తప్పడం లేదు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందుకంటే 8106 ఓట్లు వెనుకబడి ఉన్నారు ♦లీడ్లో టీఎంసీ ప్రముఖులు: దమ్ దమ్ నార్త్లో చంద్రీమా భట్టాచార్య, మదన్ మిత్రా కమర్హతిలో బ్రాత్యా బసు దమ్ దమ్లో, సింగూర్లో బెచరం మన్నా, హబ్రాలో జ్యోతిప్రియో ముల్లిక్ లీడింగ్ ♦ ఉత్కంఠ భరితంగా సాగుతున్న పోరులో లీడింగ్లో టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ను దాటేసి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 159 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, 90 సీట్లలో బీజేపీ లీడ్లో ఉంది ♦ మూడో రౌండ్లోనూ మమత వెనుకబడి ఉన్నారు. సుమారు 7287 ఓట్లతో సువేందు అధికారి లీడింగ్ ♦ రెండో రౌండ్లోనూ మమత వెనుకబాటులో ఉన్నారు. సుమారు 4500 ఓట్లతో సువేందు అధికారి లీడింగ్ ♦ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత మొలాయ్ ఘటక్ అసన్సోల్లో ఆధిక్యం. ♦ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత తారకేశ్వర్ నియోజకవర్గంలోబీజీపీ స్వాపన్ దాస్గుప్తా ముందంజ. ♦ కృష్ణానగర్ బీజేపీ ముకుల్ రాయ్ లీడింగ్లో ఉన్నారు. ♦ టోలీగంజ్లో బీజేపీకి చెందిన బాబుల్ సుప్రియో లీడింగ్లో ఉన్నారు. ♦ పోస్టల్ బ్యాలెట్లో దీదీ ముందంజలోఉన్నారు. ♦ నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజ : టీఎంసీకి రాజీనామాచేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని, బీజేపీ తరపున బరిలోఉన్న సువేందు అధికారి ఇక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ♦ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ♦ ఈ హోరాహోరీపోరులో టీఎంసీ 55, బీజేపీ 51 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ♦ మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ♦ ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లోఅధికార పీఠం ఎవరికి దక్కనుందనే ఉత్కంఠకు ఈ రోజు తెరపడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బెంగాల్లో మొత్తం 292 సీట్లకు గాను పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. బెంగాల్లో అధికారం దక్కించుకోవాలంటే 148 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) సాధించాల్సి ఉంటుంది. (చదవండి: దీదీనా? మోదీనా?) కౌంటింగ్లో భాగంగా అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 1,113 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇక మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. కీలకమైన పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయనున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
అసోం: తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ కూటమి
లైవ్ అప్డేట్స్: Time 7.12 అసోంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలో రావడానికి కృషి చేసిన బీజేపీ పార్టీ కార్యకర్తలకు సర్బానంద సోనోవాల్ అసోం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండగా.., బీజేపీ 75, కాంగ్రెస్ 50, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటి, తిరిగి అసోంలో ఏన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. Time 5.38 హిమంత బిస్వా శర్మ భారీ మెజార్టీతో గెలుపు హిమంత బిస్వా శర్మ జలుక్బారి నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి గెలుపొందారు. సుమారు లక్షపైగా మెజార్టీని సాధించారు. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ నియోజక వర్గ ప్రజలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ప్రస్తుతం అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండగా.., బీజేపీ 73, కాంగ్రెస్ 52, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటి, తిరిగి అసోంలో ఏన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. @BJP4India won Jalukbari LAC-by a margin of 1,01,911 votes. It would be my Privilege to represent the constituency for 5th consecutive term. My gratitude to the people of Jalukbari,Honble PM @narendramodi , HM @AmitShah and national president @JPNadda JAI AAI ASOM,JAI HIND — Himanta Biswa Sarma (@himantabiswa) May 2, 2021 Time 5.03 సర్బనంద్ సోనావాల్కు అభినందనలు తెలిపిన రాజ్నాథ్ సింగ్ ► అసోంలో ఎన్డీయే కూటమి విజయం సాధించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అసోంలో ఎన్డీయే విజయానికి కృషి చేసిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు. The pro-people policies of Shri @narendramodi led Govt & the state Govt under @sarbanandsonwal have once again helped the BJP in winning assembly elections in Assam. Congratulations to PM Modi, CM Sonowal, Adhyaksh Shri @JPNadda & karyakartas on BJP’s impressive victory in Assam. — Rajnath Singh (@rajnathsingh) May 2, 2021 Time 4.52 బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ సీనియర్ నాయకురాలు ఓటమి ► కోక్రాజార్ ఈస్ట్ నుంచి పోటిచేస్తున్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) సీనియర్ నాయకురాలు ప్రమీలా రాణి బ్రహ్మ సమీప అభ్యర్థి యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపీపీఎల్) అభ్యర్థి లారెన్స్ ఇస్లారీ చేతిలో ఓడిపోయారు. 1991 నుంచి ప్రతిసారి ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వచ్చారు. అంతకుముందు సర్బానంద సోనోవాల్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి బీపీఎఫ్ బయటకు వచ్చి , కాంగ్రెస్ తో జత కట్టింది. కాగా ప్రస్తుతం అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 75, కాంగ్రెస్ 49, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది Time 4.00 ► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 71, కాంగ్రెస్ 53, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. Time 3.00 ► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 73, కాంగ్రెస్ 50, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. 12.50 ► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 76, కాంగ్రెస్ 47, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. Time 12.00 ► అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 81, కాంగ్రెస్ 44, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. Time 11.10 ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 83, కాంగ్రెస్ 41, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. బీజేపీ 78, కాంగ్రెస్ 35, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. Time 10.20 ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ దాటింది. 73 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. Time 10.00 ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. బీజేపీ 68, కాంగ్రెస్ 39, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ►అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జలుక్బరిలో బీజేపీ అభ్యర్థి హిమంత బిశ్వ శర్మ ముందంజ ►అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మజోలిలో సీఎం శర్బానంద సోనావాల్ వెనుకంజ. Time 9.40 ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ అధిక్యంతో కొనసాగుతోంది. బీజేపీ 49, కాంగ్రెస్ 24, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం 64 అవసరం అవుతాయి. సీఎం సోనోవాల్(బీజేపీ) మజులీలో పోటీ చేశారు. హిమంత బిశ్వశర్మ(బీజేపీ) జులుక్బారీలో పోటీ చేశారు. కేశబ్ మహంత(ఏజీపీ) సమగురిలో పోటీ చేశారు. 2016లో 86 సీట్లతో ఎన్డీఏ అధికారం దక్కించుకుంది. ► అసోంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 43, కాంగ్రెస్ 20, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 36, కాంగ్రెస్ 19, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 35, కాంగ్రెస్ 17 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 29, కాంగ్రెస్ 14 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 27, కాంగ్రెస్ 14 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 23, కాంగ్రెస్ 11 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 18, కాంగ్రెస్ 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ► అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 11, కాంగ్రెస్ 5 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి. ► అసోంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ముందంజలో ఉంది. ► అసోంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ► కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని అధికారులు థర్మల్ స్కానింగ్ చేసి సిబ్బందిని కౌంటింగ్ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. దిస్పుర్: అసోంలో ఎవరు అధికారంలోకి రానున్నారో నేటి ఫలితాలు తేల్చనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరిగిన 47 స్థానాల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అధికారాన్ని కాపాడుకోవడానికి బీజేపీ-ఏజీపీ కూటమి పకడ్బందీ వ్యూహాలను రచించిన విషయం తెలిసిందే. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 దాకా మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో బీజేపీ-ఏజీపీలు 47 స్థానాలకు గాను 35 సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అసోంలో ఈ ఎన్నికల్లో గెలిచి తప్పకుండా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. లోకల్ కార్డుతో కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్ కూడా బరిలో నిలవటంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేపథ్యంలో అస్సాం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. -
తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు: ఉదయనిధి స్టాలిన్ విజయం
Live Updates: ►ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి గెలుపొందారు. ►చెపాక్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన డీఎంకే అధినేత స్టాలిన్ కుమార్, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. ►తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో డీఎంకే దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన స్థానాలు దాటేసి, స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ విజయం చేజిక్కుంచుకునే దిశగా సాగుతోంది. దీంతో డీఎంకే శ్రేణులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నాయి. తమిళనాడు కాబోయే సీఎం తమ అధినేత స్టాలిన్ అంటూ కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, సర్వేల అంచనాలు నిజం చేస్తూ డీఎంకే గెలుపు దిశగా పయనిస్తున్న వేళ స్టాలిన్ సోదరి కనిమొళి ఆయన నివాసానికి చేరుకున్నారు. #WATCH | DMK workers and supporters celebrate outside Anna Arivalayam, the party headquarters in Chennai, as official trends show the party leading.#TamilNaduElections2021 pic.twitter.com/61tbcETHYk — ANI (@ANI) May 2, 2021 Time 11:30 AM ఆధిక్యం: డీఎంకే- 138, అన్నాడీఎంకే- 95, ఇతరులు-1 Time 11:00 AM ఆధిక్యం: డీఎంకే- 133, అన్నాడీఎంకే- 100, ఇతరులు-1 Time 10:50 AM బోడినాయక్కనూరులో పన్నీర్ సెల్వం వెనుకంజలో ఉన్నారు. Time 10:40 AM ► తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(117)కు కావాల్సిన స్థానాలను దాటేసి ముందంజలో నిలిచింది. ఇక తమిళనాడులో డీఎంకేదే అధికారం అంటూ సర్వేలన్నీ ఆ పార్టీకి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఆ అంచనాలన్నీ నిజమయ్యేలా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే రౌండ్ రౌండ్కు ఆధిక్యం కనబరుస్తుండటంతో పార్టీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. ► ఆధిక్యం: డీఎంకే- 145, అన్నాడీఎంకే- 74, ఇతరులు-2 Time 10:30 AM ► ఆధిక్యం: డీఎంకే-128, అన్నాడీఎంకే- 61, ఇతరులు-2 Time 10:15 AM ►విరుదాచలంలో విజయ్కాంత్ భార్య ప్రేమలత వెనుకంజలో ఉన్నారు. కొలత్తూర్లో స్టాలిన్ ముందంజలో ఉన్నారు. ►ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో చెపాక్ అసెంబ్లీ స్థానంలో పోటీచేసిన డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్ క్వీన్స్ మేరీ కాలేజీకి వచ్చారు. పార్టీ శ్రేణులతో కలిసి కౌంటింగ్ సరళిని పరిశీలించారు. ప్రస్తుతం ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. TIME 9: 55 AM ►ఆధిక్యం: డీఎంకే- 125, అన్నాడీఎంకే- 90 TIME 9: 40 AM ►ముందజంలో డీఎంకే- 112, అన్నాడీఎంకే- 82 ►థౌజండ్లైట్స్లో ఖుష్బూ వెనుకంజ ►కొలత్తూర్ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన డీఎంకే అధినేత స్టాలిన్ ముందంజలో ఉన్నారు. ►కోయంబత్తూర్ దక్షిణ నుంచి పోటీ చేసిన కమల్హాసన్ ఆధిక్యం కనబరుస్తున్నారు. ►ఎడప్పాడి నుంచి పోటీ చేసిన సీఎం పళనిస్వామి, బోడినాయక్కనూర్ నుంచి బరిలో దిగిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ముందంజలో ఉన్నారు. ►కోవిల్పట్టిలో వెనుకంజలో దినకరన్ ►డీఎంకే అభ్యర్థులు పలుచోట్ల ముందంజలో ఉన్నారు. ►డీఎంకే ఆధిక్యం-107, అన్నాడీఎంకే- 70 ►డీఎంకే ఆధిక్యం-93. అన్నాడీఎంకే-63 ►65 స్థానాల్లో డీఎంకే ముందంజ.. 42 చోట్ల అన్నాడీఎంకే ఆధిక్యం ►డీఎంకే 19 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. అధికార అన్నాడీఎంకే 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. ►శాసన సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 234 స్థానాలకు గానూ డీఎంకే 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. ►అసెంబ్లీ స్థానాలు - 234 ►పోటీలో ఉన్న అభ్యర్థులు - 3,998 ►మొత్తం ఓటర్లు - 6.28 కోట్లు ►పోలింగ్ శాతం - 72.81 శాతం ►లెక్కింపు కేంద్రాలు - 75 ►కౌంటింగ్ సిబ్బంది - 16 వేలు ►బందోబస్తు ఉన్న పోలీసులు - లక్ష ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాలు: ♦ఎడప్పాడి నుంచి బరిలో నిలిచిన సీఎం పళనిస్వామి ♦బోడినాయక్కనూర్లో పోటీ చేసిన పన్నీర్ సెల్వం ♦కొలత్తూర్ నుంచి రంగంలోకి దిగిన డీఎంకే అధినేత స్టాలిన్ ♦చెపాక్లో పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్(డీఎంకే) ♦కోవిల్పట్టి బరిలో శశికళ అల్లుడు టీటీవీ దినకరన్ ♦కోయంబత్తూర్ దక్షిణ నుంచి పోటీ చేసిన కమల్హాసన్ ♦థౌజండ్ లైట్స్ నుంచి రంగంలోకి దిగిన నటి ఖుష్బూ ►2016లో 136 సీట్లతో అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ►2016లో 89 సీట్లు మాత్రమే దక్కించుకున్న డీఎంకే సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తమిళనాడు అసెంబ్లీ పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏప్రిల్ 6న రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అన్నాడీఎంకే–డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేశాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వీటితోపాటు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సారథ్యంలోని కూటమి నుంచి విజయకాంత్ అధ్యక్షుడిగా ఉన్న డీఎండీకే పోటీకి దిగింది. నామ్ తమిళర్ కట్చి అధినేత సీమాన్ నేతృత్వంలో మరో కూటమి బరిలోకి దిగింది. రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొన్నా అధికార పీఠం మాత్రం అన్నాడీఎంకే, డీఎంకేలో ఏదో ఒక పార్టీకి దక్కే అవకాశం ఉంది. హోరాహోరీ ప్రచారాల అనంతరం ఏప్రిల్ 6న 72.81 శాతంతో పోలింగ్ ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల లెక్కింపునకు 25 రోజులు వేచి ఉండక తప్పలేదు. వరుసగా మూడోసారి గెలుపొంది అన్నాడీఎంకే చరిత్ర సృష్టించనుందని ఆ పార్టీ అగ్రనేతలు సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీచేసిన కమల్హాసన్ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రత్యేక విమానంలో కోవైకు రానున్నారు. ఆంక్షలు, బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 16 వేల మందిని ఎంపిక చేసి కరోనా పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేంద్రాల వద్ద థర్మల్స్క్రీనింగ్ చేసే లోనికి అనుమతించనున్నారు. ముందుగా తపాలా ఓట్ల లెక్కింపు చేస్తారు. అనంతరం 75 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 3,372 టేబుళ్ల ద్వారా ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద లక్ష మంది పోలీసులతో బందోబస్తు పెట్టినట్లు డీజీపీ త్రిపాఠి తెలిపారు. వీరిలో 50 వేల మంది పారామిలిటరీ దళాలు, సాయుధ పోలీసులు ఉంటారని చెప్పారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ముమ్మర తనిఖీలు తిరువళ్లూరు: జిల్లాలోని 10 నియోజకవర్గాలకు ఆదివరం కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి సుమారు ఐదు కి.మీ పరిధిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాలకు వచ్చే అన్నీ మార్గాలను పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. పోలీసుల కోసం ప్రత్యేకంగా మినీ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. కౌటింగ్ను పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై నిఘా ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. తిరువళ్లూరులో 23 రౌండ్లు, తిరుత్తణి 29, గుమ్మిడిపూండీ 29, మాధవరం 31, పొన్నేరి 27 , తిరువొత్తియూర్ 31, పూందమల్లి 36, అంబత్తూరు 39, ఆవడి 31, మాధవరం 31 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏర్పాట్లు పూర్తి వేలూరు: జిల్లాలోని ఐదు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేలూరు, అనకట్టు నియోజక వర్గాలకు వేలూరు తందై పెరియార్ కళాశాలలో, కాట్పాడి నియోజకవర్గం కాట్పాడి న్యాయ కళాశాలలో, గుడియాత్తం, కేవీ కుప్పం నియోజకవర్గాలకు గుడియాత్తం రాజగోపాల్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. -
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం
Time: 4:04 PM విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దు.. విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు, ఈసీ సూచనల మేరకు సంబరాలు చేయొద్దని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్సీపీ భారీ విజయం Time: 3:47 PM తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. Time: 3:10 PM 2 లక్షల 25 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ.. వైఎస్సార్సీపీ మెజార్టీ 2 లక్షల 25 వేలు దాటింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2,25,773 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. Time: 2:48 PM తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల శాతం ఇలా.. వైఎస్సార్సీపీ- 4,61,366(57 శాతం) టీడీపీ- 2,55,271 (31.5 శాతం) బీజేపీ-43,317 (5.4 శాతం) కాంగ్రెస్- 7,233(0.9 శాతం) సీపీఎం- 4,232 (0.6 శాతం) ఇతరులు- 26,316 (3.3 శాతం) నోటా-11,509 (1.4 శాతం) Time: 2:42 PM వైఎస్సార్సీపీ మెజార్టీ 2.12 లక్షలు దాటింది. ఇప్పటివరకు 2,12,227 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. వైఎస్సార్సీపీకి 4,47,819, టీడీపీకి 2,47,408, బీజేపీకి 42,334 ఓట్లు పోలయ్యాయి. Time: 2:06 PM లక్షా 50 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ.. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ మెజార్టీ లక్షా 81 వేలు దాటింది. ఇప్పటివరకు 1,81,570 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల శాతం ఇలా.. వైఎస్సార్సీపీ- 2,96,678 (56 శాతం) టీడీపీ-1,70,547 (32.2 శాతం) బీజేపీ- 30,519 (5.8 శాతం) కాంగ్రెస్- 4,821 (0.9 శాతం) సీపీఎం- 2,949(0.6 శాతం) ఇతరులు- 16,777 (3.2 శాతం) నోటా- 7,202(1.4 శాతం) Time: 1:50 PM లక్ష పైగా ఆధిక్యంలో వైఎస్సార్సీపీ తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఓట్ల సునామీ సృష్టిస్తోంది. 1,42,614 ఆధిక్యంలో వైఎస్సార్సీపీ దూసుకెళ్తోంది. టీడీపీ, బీజేపీ వెనుకంజలో ఉన్నాయి. Time: 1:07 PM 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్న వైఎస్సార్సీపీ.. వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. గురుమూర్తికి 2,29,424 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 23,223 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్కు 3,594 ఓట్లు పోలయ్యాయి. Time: 12:05 PM వైఎస్సార్సీపీకి తిరుగులేని ఆధిక్యత.. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. Time: 10:42 AM వైఎస్సార్సీపీకి భారీ ఆధిక్యం.. తిరుపతి: వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 76,202 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ 57.22 శాతం ఓట్లు సాధించింది. Time: 9:51 AM భారీ ఆధిక్యం దిశగా వైఎస్సార్సీపీ ముందజలో కొనసాగుతోంది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. Time: 8:53 AM తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ముందంజలో ఉంది. Time: 8:22 AM పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తారు. Time: 8:05 AM ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతి లోక్సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్లో పాల్గొనే అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్–19 నెగెటివ్ రిపోర్ట్ చూపించాలని, లేదా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నట్లు చూపించినవారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని విజయానంద్ స్పష్టం చేశారు. ఇద్దరు ఏజెంట్లలో ఒక ఏజెంట్ పీపీఈ కిట్ విధిగా ధరించాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొ బైల్ ఫోన్స్ అనుమతించరు. అత్యల్పంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్ 14 రౌండ్లు, సుళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌం డ్లు కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా లేదా ఓట ర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కౌంటింగ్ దృష్ట్యా మే 1 అర్ధరాత్రి నుంచి మే 3 ఉదయం 10 గంటల వరకు లోక్సభ నియోజకవర్గ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. గెలిచిన అభ్యర్థి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునేటప్పుడు అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తులను మించి అనుమతించరు. అలాగే ఫలితాల తర్వాత ఎటువంటి ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. -
నేడే ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ/కోల్కతా/చెన్నై/తిరువనంతపురం: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 2016లో ఆయా రాష్ట్రాలన్నింటిలో కలిపి 1,002 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 2,364 హాళ్లు సిద్ధం చేశారు. అంటే హాళ్ల సంఖ్యను ఏకంగా 200 శాతం పెంచారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 1,113, కేరళలో 633, అస్సాంలో 331, తమిళనాడులో 256, పుదుచ్చేరిలో 31 హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను కనీసం 15 సార్లు శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. కీలకమైన పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయనున్నారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 దాకా మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కేరళలో 140 శాసనసభ స్థానాలున్నాయి. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో 234 స్థానాలుండగా, దాదాపు 4 వేల మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలతోపాటు కన్యాకుమారి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఎవరిదో? దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమయ్యింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. అస్సాంలో అధికార బీజేపీ కూటమి ముందంజలో ఉన్నట్లు తేలింది. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్కు పరాభవం తప్పదని అంటున్నారు. ఇక్కడ బీజేపీ–ఏఐఏడీఎంకే–ఏఐఎన్ఆర్సీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమికి భంగపాటు ఎదురవుతుందని, ప్రతిపక్ష డీఎంకే–కాంగ్రెస్ కూటమి గద్దెనెక్కబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. -
ప్రాణాలు పోతుంటే ఎన్నికల కౌంటింగా? ప్రశ్నించిన సుప్రీం
లక్నో : ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్కు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనల్ని పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది. ఉత్తర ప్రదేశ్లో ఏప్రిల్ 15, 19, 26, 29 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించిన టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకింది. వీరిలో 577 మంది టీచర్లు మృతి చెందినట్లు టీచర్స్ అసోసియేషన్ చెబుతోంది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మే 2వ తేదీ పంచాయతీ ఎన్నికల ఫలితాలనైనా నిలిపివేయాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 'ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కౌంటింగ్ను వాయిదా వేయాలని మీరు భావించారా? ఎటు చూసినా సమస్యలే. మీకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. అందుకు ఎన్నికల సంఘం.. పంచాయతీ ఎన్నికల లెక్కింపును వాయిదా వేయడం వల్ల కరోనాపై పోరాడేందుకు నియమితులైన 5 లక్షల మంది సిబ్బంది సేవలు వృధా అవుతాయని వివరణిచ్చింది. ఈ వివరణపై సంతృప్తి చెందిన అత్యున్నత న్యాయం స్థానం..800 కేంద్రాల్లో 2 లక్షలకుపైగా సీట్లకు కౌంటింగ్ జరపాల్సి ఉంటుంది. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 800 సీట్లను లెక్కించే సమయంలో ఎక్కువ మంది ఉంటే ఎలా కట్టడి చేస్తారని అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ ఉన్నందున పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, అలా చేస్తే ప్రజల్ని నియంత్రిచడం సులభం అవుతుందని" అదనపు సొలిసిటర్ జనరల్ భాటి అన్నారు. ప్రతి అంశాన్ని అఫిడవిట్లో పొందుపరుస్తామని వివరించారు. దీంతో సుప్రీంకోర్ట్ కరోనా నిబంధనల్ని పాటిస్తూ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. -
రేయింబవళ్లు... 4 రోజులు
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఈసారి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టింది. ఈనెల 17వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేయింబవళ్లు కొనసాగి 20వ తేదీ అర్ధరాత్రికి ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ జరిగేందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికల బరిలో రెండు నియోజకవర్గాల్లో నూ ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడం, పోలింగ్ కూడా ఊహించిన దాని కన్నా ఎక్కువ కావడం, జంబో బ్యాలెట్లతో అధికారులు కుస్తీ పట్టాల్సి రావడం, ఓట్లను బండిల్స్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ ప్రక్రియ క్లిష్టతరం కావడంతో చాలా సమయం తీసుకుందని ఎన్నికల వర్గాలంటున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మూడున్నర లక్షలకుపైగా జంబో బ్యాలెట్లను ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో, ఆపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో దాదాపు లక్షన్నర బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి రావడం కత్తిమీద సాములానే మారింది. మొత్తంమీద దాదాపు 90 గంటలు జరిగిన ఈ ప్రక్రియ పెద్దగా సమస్యలు రాకుండానే ముగియడంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. బండిల్స్ నుంచి ఎలిమినేషన్ వరకు నల్లగొండలోని వేర్హౌసింగ్ గోదాములో నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానానికి కౌంటింగ్ జరిగింది. ఈనెల 17న ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరచి వాటిని కుప్పలుగా పోసి 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఈసారి నల్లగొండ స్థానంలో 3,88,011 (76 శాతం) ఓట్లు, రంగారెడ్డిలో 3,57,354 (65శాతం) ఓట్లు పోలయ్యాయి. వీటన్నింటినీ 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టేందుకు 12 గంటలకు పైగా సమయం పట్టింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల తొలిరౌండ్ లెక్కింపు 17న రాత్రి సమయంలో ప్రారంభమైంది. ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్లు లెక్కించాల్సి రావడంతో తొలిరౌండ్ ఫలితం వచ్చేసరికే అర్ధరాత్రి దాటింది. హైదరాబాద్ స్థానంలో అయితే తెల్లవారుజామున గానీ తొలిరౌండ్ ఫలితం రాలేదు. అలా ఏడురౌండ్ల కౌంటింగ్కు రెండు రోజులకు పైగా సమయం పట్టింది. ఈనెల 19న ఉదయానికి గానీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్న ఎన్నికల యంత్రాంగం 19వ తేదీ మధ్యాహ్నానికి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఒక్కొక్కరినీ తీసేస్తూ.. ఒక్కో ఓటు కలుపుతూ.. ఇక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు కూడా చాలా సమయం తీసుకుంది. ఈసారి నల్లగొండ స్థానం నుంచి 71 మంది, హైదరాబాద్ నుంచి 93 మంది బరిలో ఉండటంతో వారిలో అత్యంత తక్కువ ఓట్లు దక్కించుకున్న వారిని ఆరోహణ క్రమంలో ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ.. వారి బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన వారిని కలుపుతూ పోయారు. అభ్యర్థు లు ఎలిమినేట్ అయ్యే కొద్దీ ఎక్కువ ఓట్లు లెక్కపెట్టాల్సి వచ్చింది. అలా తొలి ఐదు స్థానాల్లో ఉన్న అభ్యర్థులను తేల్చేందుకు శనివారం ఉదయం అయింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని తీసివేస్తూ వారి ఓట్లను కూడా లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ ప్రారంభించిన అధికారులు అతికష్టం మీద శనివారం రాత్రికి లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. 4 రోజులు జరిగిన ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ ఏర్పా ట్లు చేసింది. 8 హాళ్లు, ఏడు టేబుళ్లలో, టేబుల్కు వెయ్యి ఓట్ల చొప్పున రౌండ్కు 56 వేల ఓట్లు లెక్కించారు. కౌంటింగ్ నిరంతరాయంగా జరగాల్సి రావడంతో అ«ధికారులు తమ సిబ్బందికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేశారు. కౌంటింగ్లో ఇబ్బందుల్లేకుండా ఎన్నికల యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుం డా పోలీసుశాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. -
ఎమ్మెల్సీ కౌంటింగ్: మూడో ప్రాధాన్యం తప్పదా?
సాక్షి,నల్లగొండ: నల్లగొండ– వరంగల్– ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదురౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక అధికార టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ముందంజలో ఉన్నారు. ఈ ఐదురౌండ్లలో 2,79,970 ఓట్లను లెక్కించగా, వాటిలో 15,533 ఓట్లు చెల్లకుండాపోయాయి. చెల్లిన 2,64,437 ఓట్లలో పల్లా 79,113 ఓట్లు సాధించా రు. ఆయనకు 18,549 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆ తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 60,564 ఓట్లు, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెస ర్ కోదండరామ్కు 49,200 ఓట్లు వచ్చాయి. నిర్ణయం కాని కోటా ఈ స్థానానికి జరిగిన పోలింగ్లో 3,86,320 ఓట్లు పోల్ కాగా, వీటికి అదనంగా మరో 1,759 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చి చేరాయి. దీంతో 3,88,079 ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి ప్రాధాన్య ఓట్లన్నీ లెక్కించాక కానీ, చెల్లని ఓట్లు ఎన్నో తేలే అవకాశం లేదు. చెల్లని ఓట్లు తీసేశాకనే.. చెల్లిన ఓట్లలో యాభై శాతం ప్లస్ ఒక ఓటును కోటాగా నిర్ణయించనున్నారు. అనధికారిక అంచనా మేరకు ఈ కోటా 1.82 లక్షల ఓట్లు కావొచ్చని అంటున్నారు. తొలి ప్రాధాన్య ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించే అవకాశం ఏ అభ్యర్థికీ కానరావడం లేదు. ప్రతిరౌండ్లో 15 వేల పైచిలుకు ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి వస్తున్నాయి. ఇప్పటికే 79,113 ఓట్లు ఆయన ఖాతాలో పడగా.. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. సరాసరి ఇదేస్థాయిలో రెండు రౌండ్లలో కూడా 15 వేల చొప్పున టీఆర్ఎస్కు వస్తే.. పల్లాకు దాదాపు 1.10 లక్షల ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఆయన విజయానికి మరో 70 వేల ఓట్ల దూరంలో ఉండిపోతారనుకుంటే.. ఆ ఓట్లన్నీ రెండో ప్రాధాన్యంలో రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఓట్లు రాని పక్షంలో మూడో ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు వెళ్లాల్సి ఉంటుంది. పార్టీల లెక్కలివీ...! ఇప్పటి వరకు రౌండ్ల వారీగా వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు దాదాపు 30 శాతం ఓట్లు పోల్ అవుతున్నాయి. ఆయన 18,549 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఐదు రౌండ్లలో వచ్చినట్లే సరాసరి 3,500 ఓట్ల లీడ్ మిగిలిన రెండు రౌండ్లలో వస్తే, ఆయన మెజారిటీ కనీసం 25 వేలకు చేరుతుందని అంచనా. రెండో స్థానంలో ఉన్న మల్లన్న విజయం సాధించాలంటే పల్లాతో ఉన్న తేడా(లీడ్) 25 వేల ఓట్లు, రెండో ప్రాధాన్యంలో 28 శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. మూడోస్థానంలో ఉన్న కోదండరాం విజయం సాధించాలంటే.. తొలి రెండు స్థానాల్లో ఉన్న వారికంటే సాధ్యమైనన్ని ఎక్కువ రెండో ప్రాధాన్య ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. రెండో ప్రాధాన్యంలో కూడా విజేత తేలకపోతే.. తొలి మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల నుంచి ఒకరు ఎలిమినేషన్కు గురవుతారు. అలా ఎలిమినేషన్కు గురైన అభ్యర్థి ఓట్లలోని మూడో ప్రాధాన్యాన్ని మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు పోల్ అయితే ఎవరి ఓట్లను వారికి కలిపి విజేతను ప్రకటిస్తారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయితే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. -
నేడే ‘మండలి’ కౌంటింగ్.. ఫలితాలకు 2 రోజుల సమయం?
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు ఈ నెల 14న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఫలితాలపై స్పష్టత బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘నల్లగొండ’స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లకుగాను 3,86,320(76.41%) ఓట్లు పోలవగా ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 ఓట్లకుగాను 3,57,354 (67.25%) ఓట్లు పోలయ్యాయి. ‘హైదరాబాద్’స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్ఎస్), ఎన్. రామచందర్రావు (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్రావు(ఇండిపెండెంట్) మధ్య నెలకొంది. ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ పల్లా రాజేశ్వర్రెడ్డి(టీఆర్ఎస్), ప్రొఫెసర్ ఎం. కోదండరాం (టీజేఎస్) మధ్య నెలకొంది. ఒక్కో రౌండ్కు 56 వేల ఓట్ల లెక్కింపు... మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి సంబంధించిన ఓట్లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లెక్కించనుండగా వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్లో ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ చేశాక.. ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కించనుండగా... మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10–12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. అంటే తొలి ప్రాధాన్య ఓట్ల ఫలితం 18న ఉదయం 8 గంటలకుగానీ తేలదని అంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టి వాటి లెక్క కూడా తీస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేశాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్కు 56 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు 7 రౌండ్లు పట్టనుంది. గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లు తొలగింపుతో... రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరూ విజయం సాధించకుంటే.. మొదటి ప్రాధాన్య ఓట్లు అతితక్కువగా వచ్చిన అభ్యర్థిని తొలగించి (ఎలిమేషన్ పద్ధతి) సదరు అభ్యర్థి బ్యాలెట్లలో పోలైన రెండో ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి వచ్చాయో ఆ అభ్యర్థి ఓట్లకు కలుపుతూ వెళ్తారు. ఇలా మొదటి ప్రాధాన్య ఓట్లు తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరినే తొలగిస్తూ వారి రెండో ప్రాధాన్య ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కలుపుతారు. చివరకు కోటా ఓట్లు ఎవరు పొందుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే తొలి ప్రాధాన్య ఓట్లలో ఎవరూ విజయం సాధించకపోతే.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మళ్లీ ఇంతే సమయం పడుతుందని.. తుది ఫలితం 18న రాత్రికి అంటే.. మొత్తంగా కౌంటింగ్ మొదలయ్యాక 48 గంటలు (రెండు రోజులు) పడుతుందని చెబుతున్నారు. షిఫ్ట్లవారీగా సిబ్బంది... ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు సైతం షిఫ్ట్లవారీగా ఏర్పాట్లు చేశారు. ‘నల్లగొండ’స్థానం పరిధిలోని 731 పోలింగ్ కేంద్రాలు, ‘హైదరాబాద్’స్థానం పరిధిలోని 799 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేర్లను ముందుగా కలపడం (మిక్సింగ్), ఆ తర్వాత 25 ఓట్ల చొప్పున ఒక్కో కట్టను కట్టడం వంటి పనులకే సుమారు 12 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతనే మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ‘నల్లగొండ’లో ఒక్కో టేబుల్కు ఐదుగురు సిబ్బంది చొప్పున, ‘హైదరాబాద్’లో ఒక్కో టేబుల్కు ఆరుగురు సిబ్బంది చొప్పున ఒక్కో షిఫ్ట్లో ఓట్లు లెక్కించనున్నారు. -
రేపే ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్..
సాక్షి, అమరావతి: రేపటి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పోరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత,144 సెక్షన్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం కార్పోరేషన్లలో 2204 టేబుళ్లు, మున్సిపాలిటీలలో 1822 టేబుళ్లు మొత్తం 4026 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కార్పోరేషన్లలో కౌంటింగ్ సూపర్ వైజర్లు- 2376, కౌంటింగ్ సిబ్బంది -7412 మంది, మున్సిపాలిటీలలో కౌంటింగ్ సూపర్ వైజర్లు-1941, కౌంటింగ్ స్టాఫ్ సిబ్బంది 5195 మందిని ప్రభుత్వం నియమించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 పోలీసు సిబ్బంది నియమించారు. ఇందులో 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు, 1345 మంది ఎస్ఐలు, 17292 మంది కానిస్టేబుళ్లు,ఇతరులు1134 మందిని ప్రభుత్వం నియమించింది. 11 కార్పోరేషన్లలో స్థానికంగా 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు.. ►విజయనగరం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- పాత బస్టాండ్ సమీపంలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ►విశాఖపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం,వాల్తేరు ►విజయవాడ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- ఆంధ్ర లయోలా కళాశాల ►మచిలీపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- కృష్ణా యూనివర్సిటీ ►గుంటూరు కార్పోరేషన్లో స్థానికంగా నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ♦ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ♦ప్రభుత్వ టెక్స్ టైల్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ న్యూబ్లాక్ ♦నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ ♦ప్రభుత్వ టెక్స్ టైల్స్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ ఓల్డ్ బ్లాక్ ►ఒంగోలు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- సెయింట్ క్సావియర్ హైస్కూల్ కళాశాల ►అనంతపురం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు -ఎస్ఎస్ బీఎమ్ జూనియర్ కళాశాల ►కర్నూలు కార్పోరేషన్లో 3 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ♦రాయలసీమ యూనివర్సిటీ ♦సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల ♦పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల ►చిత్తూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు - పీవీకెఎన్ ప్రభుత్వ కళాశాల ►తిరుపతి కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు - ఎస్ వీ ఆర్ట్స్ కళాశాల మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎక్కడికక్కడ అన్ని వార్డులను కలిపి ఒకే కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చదవండి: పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు లేవు రూపకర్తకు నీరాజనం.. జెండాకు వందనం -
నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 782 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఇతర గుర్తులున్న 544 ఓట్లలో టీఆర్ఎస్కు 278 ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. తమ పార్టీ అభ్యర్ధి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. బీజేపీ ఆందోళన నేరెడ్మెట్ కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరస్కరణకు గురైన 1300 ఓట్లు లెక్కించాలని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు అనుకూలంగా వ్యవహరించి 600కుపైగా చెల్లని ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేశారని ప్రసన్ననాయుడు ఇంతకుముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. 8 గంటలకు మొదలైన కౌంటింగ్ కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకొని లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. ఇదిలావుంటే, జీహెచ్ఎంసీ కౌంటింగ్ సమయంలో స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలతో కూడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. బీజేపీ ఈ నెల 4న హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఎన్నికల సంఘం వాదనలతో ఏకీభవించింది. దీంతో స్వస్తిక్తో పాటు ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణలోకి తీసుకోవాంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇతర ముద్ర ఉన్న మరో 544 ఓట్లను లెక్కించిన తర్వాత నేరేడ్మెట్ ఫలితం ప్రకటించనున్నారు. కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. -
ఆ ఓట్లను లెక్కించండి: హై కోర్టు
-
‘నేరేడ్మెట్’ కౌంటింగ్కు అనుమతిచ్చిన హై కోర్టు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపునకు అడ్డంకి తొలగింది. బ్యాలెట్ పేపర్పై స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్నా వాటిని లెక్కించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇతర గుర్తులు ఉన్న బ్యాలెట్ పేపర్ల లెక్కింపుపై అభ్యంతరాలున్న వారు ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి సోమవారం తీర్పునిచ్చారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర నిరి్ధష్టమైన గుర్తులు ఉన్నా వాటిని లెక్కించేందుకు అనుమతిస్తూ ఈ నెల 3న ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జీ అంథోనిరెడ్డితోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి సోమవారం విచారించారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్న ఓట్లను లెక్కించడానికి వీల్లేదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్రెడ్డి వాదనలు వినిపించారు. ఏ గుర్తు ఉన్నా వాటిని లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్ అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. నేరెడ్మెట్ డివిజన్లోని ఓ పోలింగ్ బూత్లో స్వస్తిక్ గుర్తుకు బదులుగా సిబ్బంది పోలింగ్ కేంద్రాన్ని తెలిపే గుర్తును ఇచ్చారని, కొంతసేపటి తర్వాత ఈ తప్పును గుర్తించి సరిచేశారని ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. అప్పటికే మరో గుర్తుతో ఓట్లు పడిన విషయాన్ని పోలింగ్ సిబ్బంది తెలియజేయడంతో ఆ ఓట్లను కూడా లెక్కించాలని 3వ తేదీ సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. నేరేడ్మెట్ డివిజన్లో మొత్తం 25,136 ఓట్లకు గాను, 24,612 ఓట్లను లెక్కించామని, ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లను మాత్రం లెక్కించకుండా పక్కనపెట్టామని పేర్కొన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ 504 ఓట్ల మెజారిటీలో ఉందని, బూత్ నంబర్ 50లో ఎన్నికల సిబ్బంది పొరపాటు కారణంగా ఓటర్ల మనోగతం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఇతర గుర్తులు ఉన్న ఓట్లను కూడా లెక్కించేందుకు అనుమతి ఇచ్చామని, ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని వివరించారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. (చదవండి: ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం) ఈ నెల 9న ఓట్ల లెక్కింపు... నేరేడ్మెట్: నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికపై కొనసాగుతున్న సస్పెన్షన్కు కోర్టు తీర్పుతో తెరపడింది. ఈ నెల 9న నేరేడ్మెట్లోని భవన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ (డీఆర్సీ)లో 544 ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు మల్కాజిగిరి ఉప ఎన్నికల అధికారి దశరథ్ చెప్పారు. -
నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకి మెజార్టీ దక్కలేదు. మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 55 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.106 చోట్ల పోటీ చేసిన టీడీపీకి.. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కలేదు. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా, 48 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాగా, స్వస్తిక్ గుర్తుపై నెలకొన్న వివాదం కారణంగా నేరెడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఫలితం వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం లెక్కింపు నిలుపుదల చేశారు. రిటర్నింగ్ అధికారి.. ఎస్ఈసీకి నివేదిక పంపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు.. కుత్బుల్లాపూర్ (8): టీఆర్ఎస్-7, బీజేపీ-1 పటాన్చెరు (3): టీఆర్ఎస్ - 3 శేరిలింగంపల్లి (10): టీఆర్ఎస్-9, బీజేపీ-1 జూబ్లీహిల్స్ (7): టీఆర్ఎస్ - 4, ఎంఐఎం - 2, బీజేపీ -1 ముషీరాబాద్ (6): బీజేపీ-5, ఎంఐఎం-1 అంబర్పేట్ (5): బీజేపీ-3, టీఆర్ఎస్-2 గోషామహల్ (6): బీజేపీ-5, ఎంఐఎం-1 చార్మినార్ (5): ఎంఐఎం-5 చాంద్రాయణగుట్ట (7): ఎంఐఎం-6, బీజేపీ-1 బహదూర్పురా (6): ఎంఐఎం-6 యాకుత్పురా (7): ఎంఐఎం-5, బీజేపీ-2 మలక్పేట్ (6): ఎంఐఎం-4, బీజేపీ-2 మహేశ్వరం (2): బీజేపీ-2 ఉప్పల్ (10): టీఆర్ఎస్-6, బీజేపీ-2, కాంగ్రెస్-2 ఎల్బీనగర్ (11): బీజేపీ-11 రాజేంద్రనగర్ (5): ఎంఐఎం-2, బీజేపీ-3 మైలార్ దేవుపల్లి డివిజన్లో బీజేపీ విజయం మైలార్ దేవుపల్లి డివిజన్లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్రెడ్డి విజయం సాధించారు. సమీప అభ్యర్థి మాజీ కార్పొరేటర్ ఎమ్మెల్యే సోదరుడు ప్రేమ్దాస్ గౌడ్పై గెలుపొందారు. ఫలితం ఆశించినంతగా రాలేదు: కేటీఆర్ గ్రేటర్ ఫలితం తాము ఆశించిన ఫలితాలు రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మరో 20 సీట్లు ఎక్కువ వస్తాయని ఆశించామని అన్నారు. 12 డివిజన్లలో స్వల్ప తేడాతో ఓటమి చెందామన్నారు. ఫలితాలపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మేయర్ పీఠంపై కూర్చునేందుకు రెండు నెలల సమయం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మచ్చబొల్లారం డివిజన్లో వివాదం.. మచ్చబొల్లారం డివిజన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 36 ఓట్లతో తొలత టీఆర్ఎస్ గెలుపొందగా, రీ కౌంటింగ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. కౌంటింగ్ కేంద్రం ముందు బీజేపీ ఆందోళనకు దిగింది. బీఎన్రెడ్డి నగర్లో టీఆర్ఎస్కు షాక్.. బీఎన్రెడ్డి నగర్లో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. డమ్మీ అభ్యర్థి కారణంగా టీఆర్ఎస్ పరాజయం పాలైంది. 32 ఓట్లు తేడాతో ఆ పార్టీ ఓడిపోయింది. టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థికి 39 ఓట్లు రాగా, 32 ఓట్లతో బీఎన్రెడ్డి నగర్ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఉత్తమ్కుమార్రెడ్డి రాజీనామా.. పీసీసీ అధ్యక్ష పదవికి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా. గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జంగమెట్లో హోరాహోరీ.. జంగమెట్లో ఉత్కంఠ నెలకొంది. పోటీ హోరాహోరి కొనసాగుతుంది. 603 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ కొనసాగుతుంది. గతంలో జంగమెట్ ఎంఐఎం సిట్టింగ్ సీటు కాగా, అక్బరుద్ధిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రాయణ గుట్ట అసెంబ్లీ పరిధిలోనిది. గోషామహల్లో ఆరు డివిజన్లు బీజేపీవే.. గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. బేగంబజార్ - శంకర్ యాదవ్, గోషామహల్ - లాల్ సింగ్, మంగళ్ హాట్ - శశి కళ, జాంబాగ్ - రాకేష్ జైస్వాల్, గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్లు విజయం సాధించారు. ప్రగతి భవన్కు సింధు ఆదర్శ్ రెడ్డి? గ్రేటర్ ఎన్నికల్లో 59 డివిజన్లలో విజయం సాధించిన టీఆర్ఎస్.. మేయర్ అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టింది. 111 డివిజన్ భారత్ నగర్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి ప్రగతి భవన్కు రావాలని పిలుపు అందుకున్నట్లు సమాచారం. కాగా సింధు ఆదర్శ్ రెడ్డి.. మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు. ఆల్విన్ కాలనీలో టీఆర్ఎస్ విజయం ఆల్విన్ కాలనీ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ 1249 ఓట్లతో గెలుపొందారు, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నరసింహ యాదవ్ 7470 ఓట్లతో విజయం సాధించారు. అల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సబిహా గౌసుద్దీన్ 10310 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ డివిజన్లలో బీజేపీ విజయం.. హయత్నగర్, నాగోల్, మాన్సూరాబాద్ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. హయత్ నగర్ డివిజన్లో కళ్లెం నవ జీవన్రెడ్డి, నాగోల్ డివిజన్లో చింతల అరుణ సురేందర్ యాదవ్, మాన్సూరాబాద్ డివిజన్లో కొప్పుల నర్సింహారెడ్డి గెలుపొందారు. మౌలాలి, మూసాపేట్ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మౌలాలి డివిజన్లో సునీత యదవ్, మూసాపేట్ డివిజన్లో కోడిచర్ల మహేందర్ గెలుపొందారు. బీఎన్ రెడ్డి నగర్లో రీ కౌంటింగ్.. టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు బీఎన్ రెడ్డి నగర్లో అధికారులు రీ కౌంటింగ్ జరుపుతున్నారు. 16 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే తమకు అనుమానం ఉందంటూ టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్ కోరింది. దాంతో అధికారులు మళ్లీ కౌంటింగ్ జరుపుతున్నారు. దూసుకుపోతున్న టీఆర్ఎస్.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. గోల్నాకా, మల్లాపూర్, ఫతేనగర్, సోమాజిగూడ, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మల్లాపూర్లో పన్నాల దేవేందర్ రెడ్డి, ఫతేనగర్లో పండాల సతీష్ గౌడ్, సోమాజిగూడలో వనం సంగీత, శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ గెలుపొందారు. గోల్నాకా డివిజన్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దూసరి లావణ్య 2,716 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంఐఎం, బీజేపీల మధ్య ఘర్షణ.. జంగంమెట్ డివిజన్ కౌంటింగ్లో ఎంఐఎం, బీజేపి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉప్పుగుడా, జంగంమెట్లో బీజేపీ లీడ్ను జీర్ణించుకోలేకే దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిసున్నారు. దాడిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, పోలీసుల ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. అడిషనల్ సీపీ చౌహన్, ఎస్పీ కోటిరెడ్డి అరోరా కళాశాలకు చేరుకున్నారు. పోటాపోటీగా.. ఎంఐఎం-బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఐంఎం, బీజేపీ పోటా పోటీగా దూసుకు వెళుతున్నాయి. ఇప్పటివరకూ ఎంఐఎం 31 డివిజన్లలో గెలుపొంది, 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కమల దళం కూడా 30 స్థానాలు కైవసం చేసుకుని 15 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆ డివిజన్లలో బీజేపీ గెలుపు.. కొత్తపేట, సరూర్నగర్, గడ్డి అన్నారం, వినాయక్నగర్, రామంతపూర్ డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. కొత్తపేటలో నాగకోటి పవన్కుమార్, సరూర్నగర్లో ఆకుల శ్రీవాణి అంజన్, గడ్డి అన్నారంలో బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వినాయక్నగర్లో రాజ్యలక్ష్మి, అమీర్పేటలో కేతినేని సరళ, రామంతపూర్లో బండారు శ్రీవాణి గెలుపొందారు. చిలుకానగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి గోనె శైలజ 200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఖైరతాబాద్, కూకట్పల్లిలో టీఆర్ఎస్ గెలుపు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. ఖైరతాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి విజయం సాధించారు. కూకట్పల్లిలో జూపల్లి సత్యనారాయణ గెలుపొందారు. హస్తినపురంలో బీజేపీ అభ్యర్థి సుజాత నాయక్ 680 ఓట్లతో గెలుపొందారు. కె.పి.హెచ్.పీ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు 1540 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వనస్థలిపురంలో బీజేపీ గెలుపు.. వనస్థలిపురం డివిజన్లో బీజేపీ అభ్యర్థి రాగుల వెంకట్ రెడ్డి గెలుపొందారు. నాచారం డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి సాయిజన్, జగద్గిరిగుట్ట డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ విజయం సాధించారు. హబ్సిగూడలో బీజేపీ అభ్యర్థి కే. చేతన గెలుపొందారు. మేయర్ సతీమణి విజయం గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవీ గెలుపొందారు. చర్లపల్లి డివిజన్ నుంచి టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన ఆమె విజయం సాధించారు. ఇక 8వ డివిజన్ హబ్సిగూడ నుంచి పోటీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్నపై బిజెపి అభ్యర్థి చేతన గెలుపొందారు. కూకట్పల్లి జోన్లో ఇరవై డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతుంది. 22 డివిజన్లకు 19 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కూకట్పల్లి జోన్లో మూడు చోట్ల బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. సోమాజిగూడ,చందానగర్, నేరెడ్మెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతుంది. పటాన్చెరు, క్రాపాలో టీఆర్ఎస్ విజయం: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్చెరు, కాప్రా డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. పటాన్చెరులో కుమార్ యాదవ్, కాప్రాలో స్వర్ణరాజ్ విజయం సాధించారు. ఏఎస్రావు నగర్, ఉప్పల్ ‘హస్త’గతం గ్రేటర్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లను గెలుచుకుంది. ఏఎస్ రావు నగర్, ఉప్పల్ను ‘హస్త’గతం చేసుకుంది. ఏఎస్ రావు నగర్లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్లో మందముల్లా రజిత విజయం సాధించారు. చింతల్లో టీఆర్ఎస్లో విజయం హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. చింతల్ డివిజన్లో ఆ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ ఆభ్యర్థి రషీదా బేగం గెలుపొందారు. అమీర్పేట్లో 960 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. మాదాపూర్లో 4,999 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్, మియాపూర్లో 1935 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. రాజేంద్రనగర్లో 1614 ఓట్లతో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. గచ్చిబౌలిలో 1000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. మల్లాపూర్లో 1,841 ఓట్లు, బాలాజీనగర్లో 7,501 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. సనత్ నగర్లో కారు విజయం సనత్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొలను లక్ష్మి రెడ్డి దాదాపు 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. దత్తాత్రేయ నగర్లో ఎంఐఎం గెలుపు పాతబస్తీలో ఎంఐఎం పార్టీ తన హవా కొనసాగిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి జాకిర్ బక్రీ గెలుపు దత్తాత్రేయ నగర్ డివిజన్లో విజయం సాధించారు. భారతినగర్లో టీఆర్ఎస్ గెలుపు సంగారెడ్డి జిల్లా భారతినగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి సుమారు 3900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ విజయం టీఆర్ఎస్ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాతం సుమారు 2025 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. రంగారెడ్డి నగర్లో టీఆర్ఎస్ గెలుపు టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కొనసాగుతోంది. రంగారెడ్డి నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయ్శేఖర్ గౌడ్ విజయం సాధించారు. కూకట్పల్లి సర్కిల్లో అధికార టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. కూకట్పల్లి పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, కూకట్పల్లి.. వివేకానందనగర్ కాలనీ, హైదర్నగర్, అల్విన్ కాలనీలో కారుపార్టీ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది. బాలానగర్లో టీఆర్ఎస్ గెలుపు బాలానగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్ధి ఆవుల రవీందర్రెడ్డి విజయం సాధించారు. చైతన్యపురిలో బీజేపీ విజయం పలు డివిజన్లలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ చైతన్యపురిలో గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి నర్సింహ గుప్తా విజయం సాధించారు. నవాబ్ సాహెబ్ కుంటలో ఎంఐఎం విజయం ఎంఐఎం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నవాబ్ సాహెబ్ కుంట డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి షిరీన్ ఖాతూన్ గెలుపొందారు. ఇప్పటి వరకు ఏడు డివిజన్లలో విజయం సాధించింది. రియాసత్నగర్లో ఎంఐఎసం విజయం: ఎంఐఎం పార్టీ రియాసత్ నగర్ డివిజన్లో గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి ముస్తఫా బేగ్ విజయం సాధించారు. బార్కాస్లో ఎంఐఎం గెలుపు ఎంఐఎం గెలుపు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు డివిజన్లలో ఎంఐఎం గెలుపొంది. బార్కాస్లో ఎంఐఎం విజయం సాధిందిచి మరో డివిజన్ను తన ఖాతాలో వేసుకుంది. బార్కాస్లో ఎంఐఎం అభ్యర్థి షబానా బేగం విజయం సాధించారు. ఆర్సీపురంలో టీఆర్ఎస్ విజయం టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. పలు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేష్యాదవ్ గెలుపొందారు. దీంతో టీఆర్ఎస్ ఖాతాలో నాలుగు డివిజన్లు చేరాయి. పుష్ప నగేష్ యాదవ్ సుమారు 5759 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బోరబండలో టీఆర్ఎస్ విజయం బోరబండలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీ తొలి గెలుపు.. పలు డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగిస్తున్న బీజేపీ బోణి కొట్టింది. మంగళ్హాట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి శశికళ గెలుపొందారు. పులు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. హైదర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు నువ్వా నేనా అనే తరహాలో కొనసాగుతన్న ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ మరో విజయం సాధించింది. హైదర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో మూడు డివిజన్లు చేరాయి. అహ్మద్నగర్లో ఎంఐఎం విజయం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం తన హవా కోనసాగిస్తోంది. ఇప్పటికే మూడు డివిజన్లలో విజయం సాధించిన ఎంఐఎం మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అహ్మద్నగర్లో ఎంఐఎం అభ్యర్థి రఫత్ సుల్తానా గెలుపొందారు. దీంతో ఇప్పటి వరకు ఎంఐఎం నాలుగు డివిజన్లను గెలుచుకొని ముందంజలో ఉంది. చాంద్రాయణగుట్టలో 10వేల ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం కొనసాగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. పలు డివిజన్లలో నువ్వా నేనా అనే తరహాలో ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటికే మూడు డివిజన్లలో గెలుపు సొంతం చేసుకున్న మజ్లీస్ సైతం మరోసారి తన పట్టునిలుపుకుంటోంది. కిషన్బాగ్లో ఎంఐఎం అభ్యర్థి విజయం హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ఫలితాల్లో కిషన్బాగ్లో ఎంఐఎం విజయ సాధించింది. దీంతో ఎంఐఎం చెందిన మూడో గెలుపొందారు. ఈ డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి హుస్సేనీ పాషా విజయం సాధించారు. డబీర్పురాలో ఎంఐఎం అభ్యర్థి గెలుపు డబీర్పురా డివిజన్లో ఎంఐఎం రెండో విజయం నమోదు చేసుకుంది. ఈ డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి అలందార్ హుస్సేన్ గెలుపొందారు. బార్కస్లో ఘర్షణ: బార్కస్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఖాతాలో ఏఎస్ రావు నగర్ కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టి ఏఎస్ రావు నగర్ డివిజన్లో విజయం సాధించింది. ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. యూసఫ్గూడలో టీఆర్ఎస్ గెలుపు ఉత్కంఠ రేపుతున్న జీహెచ్ఎంసీ కౌంటింగ్లో టీఆర్ఎస్ పార్టీ పలు డివిజన్లలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది. తాజాగా యూసఫ్గూడలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ విజయం సాధించారు. మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో టీఆర్ఎస్ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యంలో దూసుకుపోతుంది. మెట్టుగూడ డివిజన్లో టీఆర్ఎస్ తొలి విజయం నమోదు చేసుకుంది. మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు. మెహిదిపట్నంలో ఎంఐఎం విజయం జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్లో తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో చేరింది. మెహిదిపట్నం డివిజన్లో ఎంఐఎం మొదటి విజయం నమోదు చేసుకుంది. ఇక్కడ పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావటంతో తొలి రౌండ్లోనే ఫలితం తేలింది. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు 31 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 15, ఎంఐఎం 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆర్సీపురం, పఠాన్చెరు, భారతీనగర్, చందానగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, హఫీజ్పేట్, హైదర్నగర్, చర్లపల్లి, కాప్రా, మీర్పేట్ హెచ్బీకాలనీ, రంగారెడ్డి, శేరిలింగంపల్లి, గాజులరామారం డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇక బీజేపీ హయత్నగర్, ఆర్సీపురం, భారతీనగర్, గోషామహల్, బేగంబజార్, హయత్నగర్, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లలో ఆధిక్యం కొనసాగుతోంది. ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తర్వులపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఎలక్షన్ కమిషన్ లంచ్ మోషన్ దాఖలు చేయనుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని, రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే స్వీకరించాలని విజ్ఞప్తి చేయనుంది. బీజేపీ ఆధిక్యం ఓట్ల లెక్కింపులో భాగంగా మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. అందులో పార్టీల వారిగా.. బీజేపీ 92, టీఆర్ఎస్ 33, కాంగ్రెస్ 4, ఎంఐఎం 15 డివిజన్లలో ఆధిక్యం సాధించాయి. బీజేపీ అభ్యంతరం జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ డివిజన్లోని బూత్ నంబర్ 8లో పోలైన ఓట్లు 471 కాగా, బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తోంది. తొలి రౌండ్ ఫలితాలపై ఉత్కంఠ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం సాధించగా, టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో తొలి రౌండ్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీల వారిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. బీజేపీ 87, టీఆర్ఎస్ 30, ఎంఐఎం 16, కాంగ్రెస్ 2 ఓట్లు వచ్చాయి. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: 1926 కాగా, అందులో దాదాపు 40 శాతం చెల్లని ఓట్లు ఉన్నాయి. ఉత్తర్వులను తోసిపుచ్చిన హైకోర్టు ఎన్నికల కౌటింగ్ జరుగుతున్న క్రమంలో ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఓటును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవలని ఎన్నికల సంఘానికి హైకోర్టు అదేశం జారీ చేసింది. బీజేపీ నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. గెలుపు, ఓటముల దగ్గర మార్కింగ్ ఓట్లు ఉంటే.. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి తుది ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారంకు హైకోర్టు వాయిదా వేసింది. పెన్నుతో టిక్పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. ఆ వెంటనే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు హైకోర్టులో హౌజ్మోషన్ పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ హయత్నగర్ కౌంటింగ్ సెంటర్ వద్ద గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటికే బీజేపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం ప్రదర్శించగా, టీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. బీజేపీకి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీకి ఆధిక్యం ఉంది. మెజార్టీ డివిజన్లలో బీజేపీకే పోస్టల్ బ్యాలెట్లు దక్కాయి. పోస్టల్ బ్యాలెట్లలో రెండో స్థానంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. లెక్కింపు ప్రారంభం ఉత్కంఠ నడుమ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. తర్వాత బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్కు గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశముంది. పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యూలర్ జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఈసీ సర్క్యులర్పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఈసీ సర్క్యులర్పై హైకోర్టులో బీజేపీ హౌజ్మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యూలర్ జారీ చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈసీ సర్క్యులర్ను అమలు చేస్తారా, లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కోసం 30 కౌంటింగ్ కేంద్రాల్లో 166 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్ హాల్ ఉంటుంది. 16 డివిజన్లకు రెండు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. రౌండ్కు 14 వేల ఓట్లు లెక్కిస్తారు. తొలి రెండు రౌండ్లలోనే 136 డివిజన్ల ఫలితాలు వచ్చే అవకాశముంది. మూడోరౌండ్ తర్వాత 13 డివిజన్ల ఫలితాలు రానున్నాయి. రెడీ.. కౌంట్.. అనివార్య కారణాల నేపథ్యంలో రీ– పోలింగ్ జరిగిన ఓల్డ్ మలక్పేట సహా జీహెచ్ఎంసీలో ఉన్న 150 డివిజన్ల లెక్కింపు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న 30 కేంద్రాల్లో జరగనుంది. ఆయా ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ప్రాంతాలను సైతం కేటాయించారు. -
దుబ్బాక తీర్పు నేడే
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక విజేతలెవరో నేడు తేలిపోనుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా యి. ఈ నెల 3న పోలింగ్ జరగ్గా మంగళవా రం ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 315 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 23 మంది పోటీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో 7 టేబుల్స్ చొప్పున 14 టేబుల్స్ వేశారు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెలువడనుంది. రసవత్తరంగా పోటీ... అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ కూడా దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఈ ఎన్నిక రెఫరెండంగా ఉంటుం దని రాజకీయ వర్గాలు చెబుతుండగా తెలంగాణలో బలం పుంజుకుంటోందని రుజువు చేసుకొనేందుకు బీజేపీకి, క్షేత్రస్థాయిలో తమ బలం చెక్కు చెదరలేదని చాటేందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితం కీలకంగా మారింది. నేతల లెక్కలు.. ఫలితంపై వివిధ ఏజెన్సీలు, రాజకీయ ప్రముఖులు, సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలు అభ్యర్థులతోపాటు రాజకీయ నాయకుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు ముందుగా ఒక రకమైన వాతావరణం ఉండగా పోలింగ్ తర్వాత మరో తీరుగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంకన్నా మెజారిటీ కాస్త తగ్గొచ్చని భావిస్తున్నారు. 15 వేలలోపు మెజారిటీతో గెలుస్తామని టీఆర్ఎస్లోని కీలక నాయకులు పేర్కొనడం గమనార్హం. మరోవైపు సర్వేలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని తమ పార్టీ అభ్యర్థి రఘునందన్రావు గెలుపు ఖాయమని కమలదళం నేతలు అంటున్నారు. ఇక కాంగ్రెస్ సైతం తమ ఓటు బ్యాంకు తమకుందని చెబుతోంది. ముత్యంరెడ్డిపై సానుభూతి అనుకూలించిందని, గతంతో పోలిస్తే మెజారిటీ ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. రెండో స్థానం కీలకమై.. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎంత కీలకమో రెండో స్థానం కూడా అంతే కీలకంగా మారింది. గతంలో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. 2009లో సోలిపేట రామలింగారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. చివరకు 2,640 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిపై 37,925 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్రెడ్డిపై 62,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఇలా మూడు పర్యాయాలు పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగింది. మూడో స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు మెజారిటీ ఓట్లు సాధిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే రెండో స్థానాన్ని పదిలపరుచుకోవడం కోసం కాంగ్రెస్, సత్తా చాటి ముందు వరుసలో ఉండేందుకు బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. -
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, దుబ్బాక: కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందని ఉత్కంఠ నెలకొంది. టీవీల ముందుకూర్చున్న నేతలు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ బ్రేకింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లును అధికారులు పూర్తిచేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, సీపీ జోయల్ డేవిస్లు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. చదవండి: (దుబ్బాక: అందరూ ఆశల పల్లకీలో!) 10వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా, మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆ తర్వాత 8.30 నుంచి ఈవీఎంలు లెక్కింపు మొదలుకానుంది. ఈ ప్రక్రియలో14 టేబుల్స్ ఏర్పాటు చేసి 14 రౌండ్లలో అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో రికార్డ్ చేస్తూ లెక్కింపు చేపట్టనున్నారు. సిద్దిపేట జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. పాసులు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రం ఇందూర్ కాలేజి వరకు అనుమతి ఇస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో 14 టేబుళ్ల మధ్య 6 అడుగల భౌతిక దూరం ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. -
కోర్టుకెక్కిన ట్రంప్ మద్దతుదారులు
వాషింగ్టన్: జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్ను సవాల్ చేస్తూ ట్రంప్ మద్దతుదారులు కోర్టులో పిటిషన్లు వేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్లో అక్రమాలు జరిగాయంటూ ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానంలో సవాళ్లు ఇవీ.. జార్జియా: ఈ రాష్ట్రంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న జార్జియాలో అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ఓట్ల లెక్కింపుని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ అనుచరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విస్కాన్సిన్: విస్కాన్సిన్లో విజయం సాధించడంతో జో బైడెన్ శ్వేత సౌధానికి మరింత చేరువయ్యారు. 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్ వర్గం పిటిషన్ వేసింది. దీనిపై నవంబర్ 17లోగా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెన్సిల్వేనియా: 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో ట్రంప్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆలస్యంగా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించవద్దంటూ ట్రంప్ మద్దతుదారులు కోర్టుకెక్కారు. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. నవంబర్ 12 వరకు పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించడానికి గడువు పెంచడంపై ట్రంప్ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మిషిగాన్: ఈ రాష్ట్ర్రంలో ఇంచుమించుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ట్రంప్ అనుయాయులు కోర్టుకెక్కారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్ కంటే బైడెన్ 3శాతం అధికంగా ఓట్లను సాధించారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కోర్టుకెక్కినా పెద్దగా ఉపయోగం ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్కు ముందే వివాదాలు ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా ముందస్తు ఓటింగ్, మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రక్రియలు ఆది నుంచి వివాదాన్ని రేపుతున్నాయి. మెయిల్ ఇన్ ఓటింగ్లో అవకతవకలకు ఆస్కారం ఉందని ట్రంప్ శిబిరం ఆరోపిస్తోంది. పోలింగ్కు ముందే ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ 44 రాష్ట్రాల్లో 300కి పైగా కేసులు నమోదయ్యాయి. -
ఓటేసిన 6 కోట్ల అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దఫా ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 5.87 కోట్ల మంది ఎర్లీ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. 2016 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఎర్లీ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటే కౌంటింగ్ ఆలస్యమయి, రిజల్టు లేటవుతుంటుంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎర్లీ బాలెట్లు కూడా పెరిగాయని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. కరోనా సంక్షోభంతో ఎక్కువమంది ఓటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. అమెరికాలో సుమారు 24 కోట్లమంది ఓటర్లు ఈ దఫా ఓటు హక్కు ఉపయోగించుకుంటారని యూఎస్ఏ టుడే తెలిపింది. ఇప్పటివరకు ఎర్లీ ఓటు ఉపయోగించుకున్నవారిలో డెమొక్రాట్ మద్దతుదారులు అధికమని(70 శాతం) నివేదిక తెలిపింది. ఫలితాలు ఆలస్యం ఎర్లీ బ్యాలెట్టు లెక్కించేందుకు సమయం పడుతుందని, అందువల్ల ఎన్నికలైన 3వతేదీ అనంతరం వెంటనే ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని సీఎన్ఎన్ మరో నివేదికలో తెలిపింది. 2016లో సైతం ఈ ఆలస్యం జరిగిందని, ఈ దఫా జాప్యం మరింత ఎక్కువని పేర్కొంది. ప్రధాన ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఎర్లీ బ్యాలెట్లను లెక్కించే పని మొదలెడతారు. ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఒకటి రెండు రోజులు పట్టవచ్చని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఓటయిన 5.87 కోట్ల ఓట్లలో 54 శాతం ఓట్లు కీలకమైన 16 రాష్ట్రాల నుంచి వచ్చాయని వివరించింది. వీటిలో మిన్నిసోటాలో ఎర్లీ ఓట్లు ఈదఫా ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది. అలాగే ఎన్నికల్లో ముందుగా ఓటు ఉపయోగించుకున్న వారిలో యువ ఓటర్ల సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. గత ఎన్నికల్లో ట్రంప్ను ఆదుకున్న కీలక రాష్ట్రాల్లో ఈదఫా మార్పు ఉంటుందని అంచనా వేసింది. టెక్సాస్లో ఈదఫా భారీగా ఎర్లీ ఓట్లు పోలయ్యాయి. శతాబ్దిలో లేనంతగా 70 లక్షల మంది అమెరికన్లు ఇప్పటికే ఓటుహక్కును ఉపయోగించుకున్నారు. ఇది ఆ రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 43 శాతానికి సమానం. -
సింహాల గణనకు కొత్త విధానం
డెహ్రడూన్: దేశంలో సింహాల సంఖ్యను లెక్కించేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. దీంతో వాటి సంరక్షణ చర్యలు సమర్థంగా చేపట్టొచ్చని చెబుతున్నారు. సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా గుజరాత్లోని గిర్ అడవుల్లో ఉన్న 50 ఆసియా సింహాల సంఖ్య ప్రస్తుతం 500 వరకు పెరిగినట్లు వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కేశబ్ వివరించారు. ప్రస్తుతం ఉన్న లెక్కింపు విధానాల వల్ల కొన్ని సింహాలను లెక్కించకపోవచ్చు. లేదా డబుల్ కౌంటింగ్ జరగొచ్చు.. దీనివల్ల వాటి సంఖ్య వివరాలు పరిమితంగానే తెలుస్తాయి. అందుకే ఆయన సహచరులు కలసి కంప్యూటర్ ప్రోగ్రాం ఉపయోగించి లెక్కించే కొత్త విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో సింహం ముఖంపై ఉన్న మీసాలు, శరీరంపై ఉన్న మచ్చల ఆధారంగా గుర్తిస్తారు. సింహాల ఆహార లభ్యత, ఇతర కారకాలు సింహాల సంఖ్యను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేశబ్ చెప్పారు. తాజా అధ్యయనంలో గిర్ అడవుల్లో 368 సింహాల్లో 67 సింహాలను 725 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో గుర్తించారు. -
ఢిల్లీ పీఠం మాదే : బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ 55 స్ధానాల్లో గెలుపొందినా ఆశ్చర్యం లేదని అన్నారు. అంతకుముందు బీజేపీ నేత విజయ్ గోయల్ మంగళవారం ఉదయం కన్నాట్ప్లేస్లో హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఇక కౌంటింగ్కు ముందు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన నివాసంలో ప్రార్ధన చేశారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. -
కరీంనగర్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు
-
నిజామాబాద్లో ఇండిపెండెంట్కి ఎంత క్రేజో..
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంకు హోరాహోరిగా తపపడుతున్నాయి. మూడ పార్టీలకు సీట్లు సమానంగా వస్తున్నాయి. హంగ్ దిశగా ఫలితాలు వస్తుండడంతో మేయర్ పీఠంపై పార్టీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థులను వలలో వేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిని రెండు పార్టీల నాయకులు వెంబడించారు. బైక్పై వెళ్తుండగా అడ్డుకొని తమ కారులో ఎక్కాలంటే..తమ కారులో ఎక్కాలని పోటాపోటీగా అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. ఉక్కిరిబిక్కిరి అయిన ఇండిపెండెంట్ అభ్యర్థిని చివరికి టీఆర్ఎస్ కార్యకర్తలు ఓ కారులో తీసుకొని వెళ్లారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం నిజామాబాద్ కార్పొరేషన్లోని 60 డివిజన్లకు గాను బీజేపీ 24, టీఆర్ఎస్ 15, ఎంఐఎం 18, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించగా, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్లో మేయర్ పదవిని ఆశించిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత పరాజయం చెందారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయీమ్ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఆధిక్యంలో ఉంటారన్నది తెలుస్తుంది. -
నిజామాబాద్లో నువ్వా, నేనా?
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు ఉండటంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు హోరాహోరిగా తలపడుతున్నాయి. కార్పొరేషన్లోని 60 డివిజన్లకు గాను ఇప్పటివరకూ 24 స్థానాల్లో బీజేపీ, 19 స్థానాల్లో టీఆర్ఎస్, ఎంఐఎం 18 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లలో గెలిచింది. టీఆర్ఎస్లో మేయర్ పదవిని ఆశించిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత పరాజయం చెందారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయీమ్ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఆధిక్యంలో ఉంటారన్నది తెలుస్తుంది. కాగా, ఓట్ల లెక్కింపు జరుగుతున్న పాలిటెక్నిక్ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రం చుట్టూ భారీగా పోలీసులను మొహరించారు. మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను కమిషనర్ పోలీస్ కార్తికేయ పర్యవేక్షిస్తున్నారు. -
కేటీఆర్కు షాకిచ్చిన స్వతంత్రులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చేటుసుకున్నాయి. సిరిసిల్లలో పది వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించి.. కేటీఆర్కు ఊహించని షాక్ ఇచ్చారు. మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్ 24 వార్డుల్లో విజయం సాధించగా.. బీజేపీ 3, కాంగ్రెస్ 2, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. వీరంతా టీఆర్ఎస్కు చెందిన రెబల్స్గా తెలుస్తొంది. అయితే రెబెల్స్ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్ఎస్లోకి తీసుకునేది లేదని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) -
కారు జోరు.. తెలంగాణ భవన్లో సంబరాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే తెలంగాణ భవన్ చేరుకుని, అక్కడ నుంచి ఎన్నికల కౌంటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక ఫలితాల అనంతరం సంబరాలు జరపడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 120 మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాల్లో అధికార కారు పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ను చిత్తుచేస్తూ.. పూర్తి ఆధిక్యంలో దూసుకుపోతోంది. (మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణి) దీంతో తెలంగాణ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈనెల 22న ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార టీఆర్ఎస్ అనుకూల ఫలితం దాదాపు ఖాయమే అయినా ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఫలితాల అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) -
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెలువడుతున్నాయి. ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల్లో అధికార టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కొన్ని వార్డుల్లో విజయం సాధించినప్పటికీ.. అనుకున్న స్థాయిలో రాణించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే వర్థన్నపేట, జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) కమలం బోణి.. ఆమన్గల్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకున్న బీజేపీ.. అనుకున్న స్థాయిలోనే ప్రణాళిలకు రచించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పలుచోట్ల కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన భైంసాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 14 పోల్ అవ్వగా.. బీజేపీకి 8, ఎంఐఎం 3, కాంగ్రెస్ 1,ఇతరులకు 1 ఓటు దక్కించున్నారు. అయితే ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో నాలుగు వార్డుల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో బీజేపీ గెలుపొందింది. మరోవైపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నాలుగు వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. మరికొన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పలు వార్డుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
-
నేడే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
-
మున్సిపల్ ఫలితాలు: క్యాంప్లకు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను 109 స్థానాలను సొంతం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. 9 కార్పొరేషన్లకు గాను టీఆర్ఎస్ 8 చోట్ల విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ కథలో మార్పేమీ లేదు. ఆ పార్టీ కేవలం 4 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకుంది. బీజేపీ 3 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు (శనివారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2619 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల సంఖ్యను బట్టి 5 నుంచి 24 రౌండ్లపాటు కౌంటింగ్ ప్రక్రియ జరిపారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్ పత్రాల ఓట్ల కౌటింగ్ను మొదలు పెట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవేళ ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించారు. కాగా, ఈ నెల 27న మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరనుంది. తొలి సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎంపిక జరగనుంది. ఇప్పటికే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ అయింది. పార్టీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టీఆర్ఎస్ 109 08 కాంగ్రెస్ 04 0 బీజేపీ 03 1 ఇతరులు 03 0 కౌంటింగ్ అప్డేట్స్ : క్యాంప్లకు తరలింపు నల్గొండలో మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ సన్నాహాలు మొదలుపెట్టాయి. గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో కుటుంబ సభ్యులతో కలిసి క్యాంపులకు బయలు దేరారు. నల్గొండలో హంగ్ నల్గొండ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. 48 వార్డులకు గానూ కాంగ్రెస్ 20, టీఆర్ఎస్ 20, బీజేపీ 6, ఎంఐఎం, ఇండిపెండెంట్ ఒక్కో స్థానంలో గెలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో బీజేపీ మద్దతు కీలకం కానుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మొత్తం 24 స్థానాలకు గాను ఆ పార్టీ అభ్యర్థులు 17 చోట్ల విజయం సాధించారు. టీఆర్ఎస్ 5, బీజేపీ 1, స్వతంత్రులు 1 చోట గెలుపొందారు. స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎమ్మెల్యేను నెట్టేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు.. సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, టీఆర్ఎస్ కార్యకర్తలు నెట్టేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్కు మెజారిటీ స్థానాలు వచ్చాయని, ఆ అక్కసుతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి: రాష్ట్రమంతా మున్సిపల్ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఊరట లభించింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. ఇక్కడ కాంగ్రెస్ ఐదు, టీఆర్ఎస్ మూడు, సీపీఐ 1 ఒకటి, ఇండిపెండెంట్లు మూడు వార్డుల్లో విజయం సాధించారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కాంగ్రెస్కు ఉండటంతో ఇక్కడ ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకొనే అవకాశముంది. నిజామాబాద్లో టీఆర్ఎస్ తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత ఓటమి.. నిజామాబాద్ ఆరో డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల సుజాతపై 1509 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఉమారాణి ఘనవిజయం. మున్సిపాలిటీల వారీగా: నల్లగొండ మున్సిపాలిటీ: 48 కాంగ్రెస్- 20 టీఆర్ఎస్- 20 బీజేపీ- 06 ఎంఐఎం- 1 ఇండిపెండెంట్: 1 తుక్కుగూడ మున్సిపాలిటీ: మొత్తం 15 సీట్లు బీజేపీ- 9 టీఆర్ఎస్- 5 స్వతంత్రులు : 1 బడంగ్పేట్ మున్సిపాలిటీ: 22 టీఆర్ఎస్- 15 బీజేపీ- 3 కాంగ్రెస్ -3 స్వతంత్రులు : 1 జల్లపల్లి మున్సిపాలిటీ: టీఆర్ఎస్ - 5 ఎంఐఎం - 6 బీజేపీ - 2 తాండూరు (34) : టీఆర్ఎస్ 12 బీజేపీ 5 కాంగ్రెస్ 4 ఇండిపెండెంట్ 2 టీజేఎస్ 1 పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ (26) టీఆర్ఎస్ - 16 కాంగ్రెస్ - 3 బీజేపీ - 1 స్వతంత్రులు - 6 సూర్యాపేట జిల్లా : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఇలాకా అయిన హుజూర్నగర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మున్పిపాలిటీలో మొత్తం 28 సీట్లు ఉండగా 18 వార్డుల్లో కారు విజయం సాధించింది. మరో మూడు వార్డులు లెక్కింపు మిగిలి ఉండగానే టీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధించింది. ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్ రాజీనామా చేయడంతో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగగా.. ఇక్కడ ఉత్తమ్ సతీమణి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపొందారు. నిజామాబాద్లో తిరుగులేని కారు..! ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్స్వీప్ చేసింది. మొత్తం ఆరు మున్సిపాలిటీలకుగాను ఆరు మున్సిపాలిటీల్లో కారు దూసుకుపోయింది. భీంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 12 వార్డులు సాధించి క్లీన్స్వీప్ చేసిన గులాబీ పార్టీ.. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో పూర్తి మెజారిటీని సాధించింది. రామగుండం కార్పొరేషన్లో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. అందులో టీఆర్ఎస్ 19, కాంగ్రెస్ ఆరు, బీజేపీ ఐదు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుపొందారు. టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుపొందినప్పటికీ.. కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవాడానికి కావాల్సిన మెజారిటీ సాధించలేదు. దీంతో ఇతర, స్వతంత్ర అభ్యర్థులు చైర్పర్సన్ ఎన్నికలో కీలకం కానున్నారు. మంచిర్యాల: లక్సెట్టిపేట మున్సిపాలిటీ మూడో వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు. టాస్ ద్వారా తుదిఫలితం ఖరారు చేసిన పోలింగ్ అధికారులు. టాస్ ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి విజయం మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. బంగారు తెలంగాణ కేసీఆర్కే సాధ్యమని ప్రజలు నమ్మారు- ట్విటర్లో మంత్రి కేటీఆర్ ఎన్నికలేవైనా గెలుపుమాత్రం టీఆర్ఎస్దేనని మరోసారి రుజువైంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రభంజనం వీసింది. ఇందుకుగాను సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అభినందనలు. బంగారు తెలంగాణ కేసీఆర్కే సాధ్యమని చాటిన ప్రజానికానికి కృతజ్ఞతలు- ట్విటర్లో మంత్రి హరీష్రావు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ గులాబీ పార్టీ అంచనాలను అందుకుంటూ ఫలితాలను సాధించింది. ఇక్కడ మొత్తం 15 మున్సిపాలిటీలు ఉండగా 14 మున్సిపాలిటీలను కారు కైవసం చేసుకుంది. ఒక్క నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించగలిగింది. నిర్మల్: అత్యంత ఉత్కంఠ రేపిన నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది. హైదరాబాద్: మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్మీట్.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. తిరుగులేని జోరుతో దూసుకుపోతున్న కారు.. ఇప్పటికే మున్సిపాలిటీ విషయంలో సెంచరీ దాటేసింది. ఇప్పటివరకు 103 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు సత్తా చాటింది. అన్ని మున్సిపాలిటీలోనూ గులాబీ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్లో కారుకు ఎదురులేదు. ఇక్కడ అన్ని మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. భైంసా మినహా ఇక్కడ అన్ని మున్సిపాలిటీల్లోనూ కారు విజయం సాధించింది. ఇక, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ దూకుడు మీద ఉంది. కామారెడ్డి మినహా అన్ని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. మెజారిటీ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో కారు తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఇప్పటివరకు (మధ్యాహ్నం 12 గంటలవరకు) అందుతున్న సమాచారం ప్రకారం 80కిపైగా మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక, మూడు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో జూపల్లి వర్గీయులు సత్తా చాటారు. మహబూబ్నగర్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. ఆమన్గల్ మున్సిపాలిటీని బీజేపీ గెలుచుకుంది. బోడుప్పల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థి సంజీవరెడ్డి ఓటమి భువనగిరి మున్సిపాలిటీలో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరి నెలకొంది. ఇటు నల్లగొండ జిల్లాలోనూ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరి పరిస్థితి కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్రావు వ్యూహం ఫలించింది. ఇక్కడి సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేవంత్రెడ్డికి షాక్ తగిలింది. కొడంగల్ మున్సిపాలిటీలో కేవలం మూడు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇలాకాలో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం పది స్థానాల్లో స్వతంత్రులు గెలవడంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు షాక్ తిన్నారు. వీరిలో ఎక్కువమంది టీఆర్ఎస్ రెబెల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. రెబెల్స్ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్ఎస్లోకి తీసుకునేది లేదని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. యాదాద్రి: ఆలేరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ దూసుకుపోయింది. ఇక్కడ మొత్తం 12 వార్డుల్లోటీఆర్ఎస్ ఎనిమిది వార్డులు, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలుపొందగా.. కాంగ్రెస్, బీజేపీ తలా వార్డులో విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కారు తిరుగులేని జోరు ప్రదర్శిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు నాలుగు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. భీమ్గల్, బాన్సువాడ, ఆర్మూరు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. - మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్లో 12 వార్డులకు 12 వార్డులను గెలిచి టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. - స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడలో మొత్తం 19 వార్డుల్లో టీఆర్ఎస్ 15 వార్డులు గెలిచి సత్తా చాటింది. - ఆర్మూరు మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డుల్లో టీఆర్ఎస్ 22 గెలిచి ముందంజలో ఉంది. - ఎల్లారెడ్డిలోని 12 వార్డుల్లో ఏకంగా పది వార్డులు టీఆర్ఎస్ గెలుపొందింది. ఖమ్మం: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కోటకు బీటలు వారాయి. మధిర మున్సిపాలిటీలో మొదటి రౌండ్ ముగిసేసరికి ఎనిమిది వార్డులకుగాను ఐదుచోట్ల టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి. మూడు స్థానాల్లో కాంగ్రెస్, ఒక్కొక్క స్థానంలో టీడీపీ, సీపీఐ గెలిచాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్. భీమ్గల్, బాన్సువాడ మున్సిపాలిటీల్లో కారు జోరు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. మొత్తం 12 వార్డుల్లో టీఆర్ఎస్ విజయాన్ని సాధించింది. మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీ భీమ్గల్ కావడం గమనార్హం. కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. మొత్తం 19 వార్డుల్లో 11 వార్డులను టీఆర్ఎస్ సొంతం చేసుకొంది. ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పోలింగ్కు ముందే ఒక వార్డు 1 ఏకగ్రీవం అయింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి.. ఇండిపెండెంట్ అభ్యర్థి పైడి మాధవి విజయం రాజేంద్రనగర్లోనిబండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో రజియా సుల్తానా విజయం మేడ్చల్ జిల్లా: గుండ్లపోచంపల్లి ఐదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజు విజయం మేడ్చల్ జిల్లా : గుండ్లపోచంపల్లి 11వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ రెడ్డి విజయం మేడ్చల్ జిల్లా :గుండ్లపోచంపల్లి 10వ వార్డు తెరాస అభ్యర్థి ప్రభాకర్ విజయం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మడుపతి చంద్రమౌళి గెలుపు జవహర్నగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం భైంసా నాలుగు వార్డుల్లో ఎంఐఎం గెలుపు వర్థన్నపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం మీర్పేట్లో మున్సిపాలిటీ 1, 4, 10,19 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు హుస్నాబాద్ 13, 19 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం చిట్యాల మున్సిపాలిటీ 7,10 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు హూజుర్ నగర్ 9,12 వార్డుల్లో కాంగ్రెస్ విజయం ధర్మపురి మొత్తం వార్డులు 15 : టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 7 గెలుపు తెలంగాణ భవన్కు చేరుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ హుజూర్నగర్, సూర్యాపేట, మహబూబ్నగర్లో టీఆర్ఎస్ ముందంజ సత్తుపల్లి పదోవార్డు టీఆర్ఎస్ గెలుపు బొల్లారం 16, 17, 18 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ శ్రీ దేవసేన మంచిర్యాలలో గంటకు పైగా ఆలస్యంగా కౌంటింగ్, ఇప్పటికీ ప్రారంభం కానీ బ్యాలెట్ బాక్స్ల లెక్కింపు యాదాద్రి జిల్లాలో మొదలైన క్యాంప్ రాజకీయాలు.. యాదగిరిగుట్టలో తమ అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించిన కాంగ్రెస్ ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు భైంసాలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 14 అనూహ్యంగా బీజేపీకి 8, ఎంఐఎం 3, కాంగ్రెస్ 1,ఇతరులకు 1 ఓటు జగిత్యాల పోస్టల్ బ్లాలెట్ లెక్కింపులో ఆలస్యం, ఇంకా ప్రకటించని పోస్టల్ బ్యాలెట్ వివరాలు సిరిసిల్లలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్ వరంగల్ నర్సంపేట్లో ఏడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణ సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో 47 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ట్రెండ్.. ఫలితాలు రాకముందే క్యాంపులకు అభ్యర్థులు హైదరాబాద్ క్యాంపుకు తరలివెళ్తున్న ఉమ్మడి నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థులు ఇల్లందులో పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీల్ వేయని అధికారులు మహేశ్వరం, నాదర్గుల్ కేంద్రం వద్ద బీజేపీ ఆందోళన అభ్యర్థులు రాకముందే సీల్ తెరిచారని ఆరోపణ రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో రభస రామగుండం కేంద్రంలోకి వెళ్లిన ఎమ్మెల్యే చందర్.. బయటకు రావాలని అభ్యర్థుల ఆందోళన -
గతంతో పోలిస్తే ఈసారి తక్కువే: ఈసీ
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. రేపు(జనవరి 25) 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలకశాఖ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ... కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ రోజు (శుక్రవారం) కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 58 డివిజన్లకు పోలింగ్ జరిగింది. వీటి కౌంటింగ్ జనవరి 27న చేపట్టనున్నట్టు తెలిపారు. ఫలితాలు విడుదల చేసేంతవరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు.(మూడు చోట్ల రీపోలింగ్ ) గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం తక్కువ అయ్యిందని అన్నారు. ఈ సారి మున్సిపాలిటీల్లో 74.40 శాతం..గతంలో 75.85 శాతం పోలింగ్ నమోదయ్యిందని తెలిపారు. అదే విధంగా రాజకీయ పార్టీలు మేయర్, చైర్మన్ల పేర్లను ఏ-ఫారం, బీ-ఫారం రూపంలో ఇవ్వాలన్న ఈసీ ఈ నెల 26న 11 గంటల వరకు ఏ-ఫారం, 27న ఉదయం 10 గంటల వరకు బీ-ఫారం సమర్పించాలని సూచించింది. ఈ సారి కార్పొరేషన్ల లో 58.83 శాతం.. గతంలో60.63 శాతం నమోదు అయ్యినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ కు పూర్తి స్థాయి లో ఏర్పాట్లు చేశామన్నారు. చైర్మన్, మేయర్ ఎన్నిక ప్రక్రియ పరోక్ష పద్దతిలో సాగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీలు తన నియోజకవర్గం పరిధిలో ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ఓటు హక్కు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలెక్టర్కు ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. చదవండి : 27న మేయర్లు, చైర్మన్ల ఎన్నిక -
కొనసాగుతున్న జార్ఖండ్ ఓట్ల లెక్కింపు
-
కారు జోరు.. రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కారు జోరు చూపించింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,624 ఓట్ల మెజార్టితో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆదిపత్యంలో దూసుకుపోయింది. రౌండ్ రౌండ్కు మొజార్టీ పెంచుకుంటూ.. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ, బీజేపీ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇదిలా ఉంటే.. హుజూర్నగర్లో గెలిచి సైదిరెడ్డి రికార్డ్ బ్రేక్ చేశారు.ఆయన సాధించిన మెజార్టీ ఇంతవరకూ హుజూర్నగర్ చరిత్రలోనే ఇంతవరకూ ఎవరూ సాధించలేదు. ఇప్పటి వరకూ హుజూర్నగర్లో 29,194 ఓట్లు మెజార్టీ ఉంది. అయితే సైదిరెడ్డి ఏకంగా 43,624 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం.ఈనెల 21న జరిగిన ఉప ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండల్లాలోని 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున పద్మావతి ఉత్తమ్రెడ్డి, బీజేపీ తరఫున రామారావు బరిలోకి దిగిన విషయం తెలిసిందే. -
సంబరాల్లో టీఆర్ఎస్ శ్రేణులు
-
హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఆధిక్యం
-
మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ ముందంజ
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఇరు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్ధులు పలు స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలకు గాను ఇప్పటివరకూ అందిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కూటమి 130 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా 46 స్ధానాల్లో యూపీఏ ముందంజలో ఉంది. ఇక హరియాణాలోనూ బీజేపీ 41 స్ధానాల్లో కాంగ్రెస్ 29 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు విజయంపై ధీమాతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. -
హుజూర్నగర్ అప్డేట్స్ : కేటీఆర్ ట్వీట్
సాక్షి, సూర్యాపేట : కాంగ్రెస్ కంచుకోట హుజూర్నగర్లో గులాబీ జెండా రెపరెపలాడింది. తాజాగా జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43,624 రికార్డు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్రెడ్డిపై రికార్డు విజయం సాధించారు. తొలి నుంచి చివరి వరకు అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మారెడ్డి ఒక్క రౌండ్లోనూ ఆధిక్యం సాధించకపోవడం విశేషం. ఇక టీడీపీ, బీజేపీల డిపాజిట్లు గల్లంతయ్యాయి. హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, కవిత టీఆర్ఎస్ను అఖండ మెజార్టీతో గెలిపించిన హుజూర్ నగర్ ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ అనివార్య కారణాలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవడం రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తోందన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన సైదిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పార్టీ గెలుపుకు అహర్నిశలు కష్టపడిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాల తెలిపారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లుండి(శనివారం) హుజూర్నగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఓ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ గెలుపుకు సహకరించిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ‘కేసీఆర్పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, టీఆర్ఎస్కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు’అంటూ కవిత ట్వీట్ చేశారు. హుజూర్నగర్ అప్డేట్స్ : హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ బంపర్ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. 16వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి సైదిరెడ్డి 32 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగతున్నారు. ఇప్పటివరకు ఏడు సార్లు జరిగిన హుజూర్నగర్ నియోజకవర్గ ఫలితాల్లో.. 2009లో 29,194 ఓట్ల అత్యధిక మెజారిటీ నమోదైంది. అయితే తాజాగా సైదిరెడ్డి 15వ రౌండ్లోనే ఆ మెజారిటీని అధిగమించాడు. అయితే ఇంకా ఆరు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండటంతో.. ఆయన మెజారిటీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 16వ రౌండ్ ముగిసేసరికి టీఆరెస్ అభ్యర్థి సైదిరెడ్డి 32,256 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా 6 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది. టీడీపీ డిపాజిట్ గల్లంతైంది.జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీ ఓట్ల పరంగా ఆరో స్థానంలో కొనసాగుతోంది. హుజూర్నగర్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ స్పందించనున్నారు. సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్లడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలకు హుజూర్నగర్ ఫలితం చెంపపెట్టలాంటిదని విమర్శించారు. ప్రతిపక్షాలకు టీవీల్లో తప్ప ప్రజల్లో పట్టులేదన్నారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ భారీ మెజరిటీతో దూసుకుపోతుండటంతో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలంగాణ భవన్కు చేరుకుని సంబరాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను బట్టి చూస్తే.. టీడీపీ, బీజేపీలు డిపాజిట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. రౌండ్ రౌండ్కు పెరుగుతున్న టీఆర్ఎస్ మెజారిటీ రాష్ట్రం మొత్తం కేసీఆర్ను నమ్ముతుందని అనడానికి హుజూర్నగర్ ఉప ఎన్నికే నిదర్శమని సైదిరెడ్డి తెలిపారు. సైదిరెడ్డి భారీ ఆధిక్యంతో దూసుకుపోవడంతో.. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రౌండ్ల వారీగా ఫలితాలు.. మొదటి రౌండ్- టీఆర్ఎస్ -5583, కాంగ్రెస్-3107, బీజేపీ-128, టీడీపీ-113, టీఆర్ఎస్ లీడ్- 2476 రెండో రౌండ్- టీఆర్ఎస్ -4723, కాంగ్రెస్-2851, బీజేపీ-170, టీడీపీ-69, టీఆర్ఎస్ లీడ్- 1872, రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-4348 మూడో రౌండ్- టీఆర్ఎస్ -5089, కాంగ్రెస్-2540, బీజేపీ-114, టీడీపీ-86, టీఆర్ఎస్ లీడ్- 2549, మూడో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-6897 నాల్గో రౌండ్- టీఆర్ఎస్ -5144, కాంగ్రెస్-3961, బీజేపీ-102, టీడీపీ-127, టీఆర్ఎస్ లీడ్- 1183, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-8080 ఐదవ రౌండ్- టీఆర్ఎస్ -5041, కాంగ్రెస్-3032, బీజేపీ-105, టీడీపీ-57, టీఆర్ఎస్ లీడ్- 2009, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-10089 అరో రౌండ్- టీఆర్ఎస్ -5308, కాంగ్రెస్-3478, బీజేపీ-72, టీడీపీ-46, టీఆర్ఎస్ లీడ్- 1830, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-11919 ఎడో రౌండ్- టీఆర్ఎస్- 4900, కాంగ్రెస్-3796, బీజేపీ-45, టీడీపీ-46, టీఆర్ఎస్ లీడ్- 1104, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-13023 -
మహా కౌంటింగ్ : లడ్డూలు సిద్ధం చేసిన బీజేపీ
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీపికబురుపై ధీమాతో బీజేపీ రాష్ట్ర శాఖ కౌంటింగ్కు ముందే 5000 లడ్డూలు, పెద్దసంఖ్యలో పూలదండలకు ఆర్డర్ ఇచ్చింది. పార్టీ ముంబై కార్యాలయంలో ఎన్నికల ఫలితాలను ప్రదర్శించేందుకు భారీ స్క్రీన్ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి భారీ విజయం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన క్రమంలో కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. మొత్తం 288 స్ధానాలకు గాను బీజేపీ-శివసేన కూటమికి 197 స్ధానాలు లభిస్తాయని సీఎన్ఎన్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. దాదాపు 11 ఎగ్జిట్ పోల్స్ బీజేపీ-సేన కూటమికి 211 స్ధానాల వరకూ దక్కుతాయని అంచనా వేశాయి. ప్రసుత్తం మహారాష్ట్ర అసెంబ్లీలో ఇరు పార్టీలకూ 217 స్ధానాలున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచే విజయోత్సవాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు బీజేపీ నేతలు పిలుపు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తామని తమకు తెలుసని..అయితే ఎన్ని స్ధానాలు లభిస్తాయనే దానిపైనే ఉత్కంఠ నెలకొందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అక్టోబర్ 21న ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో 61.13 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ముందు రోజు బుధవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఫలితానిస్తున్న కానుకల లెక్కింపు ప్రయోగం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో విద్యార్థులతో చేపట్టిన కానుకల లెక్కింపు ప్రయోగం మంచి ఫలితాలు ఇస్తోంది. పరకామణిలోని కానుకలు విద్యార్థులు లెక్కించడంతో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకే లెక్కింపు పూర్తయింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు హుండీ కానుకల లెక్కింపు జరుగనుంది. సిబ్బంది కొరత కారణంగా రోజురోజుకు నగదు నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో విద్యార్థులతో హుండీ కానుకల లెక్కింపు చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. సోమవారం విద్యార్థులతో లెక్కింపు చేయించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. శ్రీవారి సేవకుల స్థానంలో విద్యార్థులతో శాశ్వత ప్రాతిపదికన కానుకలు లెక్కింపు చేయించే యోచనలో ఉన్నట్లు టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తెలిపారు. -
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
నేడు మూడు ఎమ్మెల్సీ స్ధానాల ఉప ఎన్నికల ఫలితాలు
-
‘ఓటు వేసింది మనుషులే.. దయ్యాలు కాదు’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసింది మనుషులే అని.. దయ్యాలు కాదంటున్నది ఎన్నికల సంఘం. ఈసీ ఇంత వ్యంగ్యంగా స్పందించడానికి ఓ కారణం ఉంది. లోఎక్సభ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లు.. లెక్కించిన ఓట్ల మధ్య పొంతన లేదని కొందరు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఈసీ శనివారం స్పందించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మనుషులే ఓట్లు వేశారని.. దయ్యాలు కాదని వివరించింది. తాము ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉంచిన పోలింగ్ సమాచారం తాత్కాలికమైనదని ఈసీ తెలిపింది. దీనిలో మార్పులు చేయవచ్చని పేర్కొంది. ఈ గణాంకాలు పోల్ అయిన ఓట్ల సంఖ్యపై తుది గణాంకాలు కాదని పేర్కొంది. 542 నియోజకవర్గాల్లో పోల్ అయిన ఓట్ల సంఖ్యపై తుది లెక్కలను త్వరలోనే రిటర్నింగ్ అధికారులు పంపిస్తారని, వెంటనే ఆ లెక్కలను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. గతంలో ఎన్నికలు జరిగినపుడు వాస్తవ ఎన్నికల సమాచారాన్ని రాబట్టడానికి కొన్ని నెలల సమయం పట్టేదని ఈసీ తెలిపింది. 2014లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాస్తవ వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు నెలలు పట్టిందని పేర్కొంది. తాజా ఎన్నికల్లో సరికొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదుపాయాలను వినియోగించుకున్నామని ఫలితంగా లెక్కించిన ఓట్లపై తుది సమాచారాన్ని ఫలితాలను ప్రకటించిన కొద్ది రోజుల్లోనే అందుబాటులో ఉంచగలిగామని పేర్కొంది.