Data theft
-
‘మన మిత్ర’.. మరో మారీచుడే!
సాక్షి, అమరావతి: మొన్న ‘‘సేవా మిత్ర..!’’.. నేడు ‘‘మన మిత్ర..!’’ పేర్లు మారినా కుతంత్రాలు మాత్రం మారలేదు!!రామాయణంలో మారీచుడు ఎలా రూపాలు మార్చుకుని దారుణాలకు ఒడిగట్టేవాడో... రాష్ట్ర రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మాయ వేషాలతో కుట్రలకు పదును పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో సర్కారు రాజకీయ కుతంత్రాలపై సర్వత్రా మండిపడుతున్నారు. వాట్సాప్ గవర్నెన్స్లో నమోదు చేసే ఆధార్ నంబర్తో ఆయా కుటుంబాల వివరాలు మొత్తం బహిర్గతం కావడంతో గిట్టని వారికి సంక్షేమ పథకాలను నిలిపి వేయడంతోపాటు ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర దాగి ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో అక్రమాలే అసలు లక్ష్యంగా పౌరుల వ్యక్తిగత డేటా మొత్తం ప్రైవేట్ సంస్థ గుప్పిట్లో పెట్టారని.. అసలు ప్రజల వ్యక్తిగత డేటా మూడో వ్యక్తి వద్దకు ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. తమ వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయో...! ఎన్ని చేతులు మారుతాయో? అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ ప్రభుత్వానికి పౌర సేవలపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ‘‘దిశ’’ యాప్ తరహాలో ప్రభుత్వమే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ సేవా మిత్ర మొబైల్ యాప్తో లక్షలాది మంది ఓట్లు తొలగించే కుట్రకు పాల్పడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తన కుతంత్రానికి సరికొత్త రూపాన్నిచ్చారు. అదే.. ‘మన మిత్ర’ మొబైల్ యాప్. మీ ఆధార్ నంబర్ వాట్సాప్ చేస్తే చాలు.. ప్రభుత్వ సేవలు ఇట్టే అందిస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈ అందమైన మాయాజాలం వెనుక భారీ కుట్ర దాగి ఉంది. బాలనాగమ్మను మాయల ఫకీరు చిలుకలో బంధించి ఎత్తుకుపోయినట్టు... యావత్ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా అంతా నిక్షిప్తం చేసి అక్రమాలకు పాల్పడేందుకు రాజకీయ మాయల ఫకీరు వేసిన ఎత్తుగడే మన మిత్ర యాప్. ఒక్క ఆధార్ నంబరుతో మొత్తం కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, చిరునామాలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు, ఓటరు నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు... సర్వం మాయల ఫకీరు గుప్పిట్లోకి వెళుతుంది. ఆ తరువాత ఏడు సముద్రాలు దాటి విదేశాలకు చేరుతుంది. అక్కడ నుంచి సైబర్ నేరస్తులు ప్రజల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టొచ్చు...! ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించవచ్చు...! అర్హులైనప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను తొలగించవచ్చు...! ప్రభుత్వ పెద్దలే ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరుల ఓట్లను గంపగుత్తగా తొలగించవచ్చు...! చంద్రబాబు సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ ఎత్తుగడ వెనుక ఇంత దారుణ పన్నాగం దాగి ఉంది. రాజ్యాంగం కల్పించిన ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించే కుతంత్రం ఇది. ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అరాచక పర్వం ఇది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న బరితెగింపు ఇది. ఎన్నికల్లో అక్రమాలకు బరి తెగించాలనే టీడీపీ దీర్ఘకాలిక దురాలోచన దీని వెనుక ఉన్నట్లు సాంకేతిక నిపుణులు, రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. యావత్ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.గవర్నెన్స్ ముసుగు.. డేటా చోరీ కుట్ర!వాట్సాప్లో మీ ఆధార్ నంబర్ మెసేజ్ చేస్తే చాలు.. 520 రకాల పౌర సేవలు అందిస్తామని మంత్రి నారా లోకేశ్ ఆర్భాటంగా ప్రకటించారు. ప్రస్తుతం 161 సేవలను అందుబాటులోకి తెచ్చామని, త్వరలో మిగిలినవి కూడా అందిస్తామంటూ దీనికి ‘మన మిత్ర’ అనే పేరు ప్రకటించారు. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. ఆ పౌర సేవలను ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థ ద్వారా కాకుండా ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో అందిస్తామని తెలిపారు. ‘వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా పౌర సేవలు పొందాలంటే 95523 00009 నంబర్కు ప్రజలు తమ ఆధార్ను వాట్సాప్ చేయాలి. అలా చేయగానే ప్రజల వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతున్నాయి. ఇక పౌర సేవలు పొందేందుకు ఆ వాట్సాప్ నంబరులో సూచించే ఫారాన్ని ఆన్లైన్లో పూరించాలి. దాంతో ఆయా వ్యక్తుల అదనపు వివరాలన్నీ వెల్లడవుతున్నాయి. పేరు, ఇంటి నంబరు, ఓటరు కార్డు నంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లు, మొబైల్ నంబర్లు, ఈ మెయిల్ ఐడీ... ఇలా సమస్త వివరాలు సంబంధిత వ్యక్తుల ప్రమేయం లేకుండానే బహిర్గతమవుతున్నాయి.అంటే ప్రజల వ్యక్తిగత గోప్యత అన్నది పూర్తిగా ప్రశ్నార్థకంగా మారినట్లు నిర్ధారణ అవుతోంది.పౌరుల డేటా ప్రైవేట్ సంస్థ గుప్పిట్లోకి...వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా ఎక్కడికి చేరుతోందన్నది అత్యంత కీలకంగా మారింది. వాట్సాప్ గవర్నెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ప్రవేశ పెట్టలేదు. ప్రభుత్వ విభాగం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా సొంతంగా ఎలాంటి మొబైల్ యాప్ను రూపొందించలేదు. ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. నిజంగా చిత్తశుద్ధి, పారదర్శకత ఉంటే ప్రభుత్వమే సొంతగా మొబైల్ యాప్ను రూపొందించవచ్చు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళల భద్రత కోసం ‘దిశ’ మొబైల్ యాప్ను పోలీసు శాఖే స్వయంగా రూపొందించింది.ప్రజలు అన్ని రకాల పోలీసు సేవలు పొందేందుకు ‘పోలీసు సేవా యాప్’ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా ప్రభుత్వాలే సొంతంగా మొబైల్ యాప్లు రూపొందించి పౌర సేవలు అందిస్తున్నాయి. అంతేగానీ సున్నితమైన ప్రజల వ్యక్తిగత సమాచారంతో ముడిపడిన అంశాలపై ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. మరి పౌర సేవల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం సొంతంగా యాప్ ఎందుకు రూపొందించలేదన్నది సందేహాలకు తావిస్తోంది. అంటే ప్రజల వ్యక్తిగత వివరాలన్నీ ప్రైవేట్ సంస్థకు అందుబాటులోకి వచ్చినట్లేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పథకాల్లో కోత... ఓట్ల తొలగింపు – ఎన్నికల్లో అక్రమాలే అసలు లక్ష్యం..వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ సర్కారు అసలు కుట్ర. వైఎస్సార్సీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులను వేధించడం.. వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడం.. టీడీపీకి ఓట్లు వేయరని భావించే వారి ఓట్లను తొలగించే పన్నాగం దాగి ఉంది. 2029 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్న దీర్ఘకాలిక దురాలోచన ఉందన్నది స్పష్టమవుతోంది. అందుకోసం ఎంత పకడ్బందీగా కుట్ర పన్నారంటే.. ఒకరి ఆధార్ నంబరు టైప్ చేస్తే చాలు ఆ కుటుంబంలోని ఇతర సభ్యుల ఆధార్ నంబర్లు, వారి వ్యక్తిగత డేటా కూడా మొత్తం బట్టబయలవుతోంది. సాధారణంగా ఎక్కడైనా ఆధార్ నంబరు నమోదు చేస్తే సంబంధిత వ్యక్తి మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేశాకే మిగతా ప్రక్రియను కొనసాగించేందుకు వీలుంటుంది. కానీ టీడీపీ ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్లో ఇలాంటిదేమీ లేదు. ఒకరి ఆధార్ నంబరు వెల్లడిస్తే ఆ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, వ్యక్తిగత డేటా సైబర్ నేరస్తులకు కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ అన్ని రకాల సైబర్ నేరాలు, మోసాలకు తలుపులు బార్లా తెరుస్తోంది.ఆధార్ చట్టం ఉల్లంఘన...ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధార్ చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. ఆధార్ సంబంధిత డేటా పరిరక్షణ కోసం కేంద్రం రూపొందించిన యూఐడీఏఐ చట్టం పటిష్ట మార్గదర్శకాలను నిర్దేశించింది. వాటి ప్రకారం..– ఆధార్ డేటాను భారత్లోనే భద్రపరచాలి. దేశ సరిహద్దులు దాటించి విదేశీ సర్వర్ల ద్వారా డేటా ప్రాసెసింగ్ అన్నది పూర్తిగా నిషిద్ధం. కానీ చంద్రబాబు ప్రభుత్వం విదేశీ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తద్వారా ప్రజల ఆధార్ డేటా దేశ సరిహద్దులు దాటేందుకు ఆస్కారం ఇచ్చింది. – ఆధార్ నంబరు, డేటాను ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రచురించకూడదని చట్టం చెబుతోంది. రేషన్ కార్డు, జనన ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లలో ఆధార్ పూర్తి నంబరు ప్రచురించకూడదు. కేవలం ఆధార్లోని చివరి నాలుగు అంకెలే ప్రచురించాలి. అందుకు విరుద్ధంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆధార్ నంబరును పూర్తిగా అంటే మొత్తం పది అంకెలను బహిర్గతం చేస్తున్నారు.ఐటీ, డేటా భద్రతా చట్టాలకు విరుద్ధంగా..పార్లమెంట్ ఆమోదించిన ఐటీ చట్టం–2000, ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్–2023’ను చంద్రబాబు ప్రభుత్వం యథేచ్చగా ఉల్లంఘిస్తోంది. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే ఐటీ చట్టం మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పించింది. ప్రజల వ్యక్తిగత డేటా పరిరక్షణలో విఫలమైతే ఒక్కో ఉల్లంఘనకు ఏకంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించేందుకు కేంద్ర డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అవకాశం కల్పించింది. వీటిని టీడీపీ సర్కారు ఏమాత్రం లెక్క చేయడం లేదు.సుప్రీం తీర్పు బేఖాతర్...వ్యక్తిగత డేటా పరిరక్షణ ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. తమ వ్యక్తిగత వివరాలను ఎలా ఉపయోగించాలన్నది పూర్తిగా ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇతరులు ఎవరికీ ప్రజల వ్యక్తిగత డేటా మీద నియంత్రణ ఉండకూడదని 2017లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనికి విరుద్ధంగా ప్రజల వ్యక్తిగత డేటాను వారి అనుమతితో నిమిత్తం లేకుండానే ఇతర విభాగాలు, ప్రైవేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తేవడం విస్మయపరుస్తోంది.2019లో ‘సేవా మిత్ర’ యాప్తో అక్రమాలు2014–19 మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఇదే తరహాలో ప్రైవేట్ సంస్థ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడింది. 2016లో నిర్వహించిన ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాలను హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా టీడీపీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించారు. టీడీపీ ఎన్నికల వ్యూహం కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్లోకి ప్రజల వ్యక్తిగత డేటాను చేరవేశారు. పేరు, చిరునామా, కులం, మతం, ఆధార్ నంబరు, ఓటరు కార్డు నంబరు, పోలింగ్ బూత్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు... ఇలా పూర్తి వివరాలు టీడీపీ సేవా మిత్ర యాప్లో అనుసంధానమయ్యాయి. అనంతరం వాటిని దుర్వినియోగం చేస్తూ టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడింది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని భావించిన దాదాపు 35 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు బరి తెగించింది. దానిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెచ్చిపోయిన కేటుగాళ్లు.. తెలంగాణ పోలీస్ యాప్స్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు.. టీఎస్ ఇప్పుడు ఏకంగా పోలీస్ యాప్స్నే హ్యాక్ చేసేశారు. కొన్ని రోజుల క్రితం ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు రూపొందించిన ‘హ్యాక్ ఐ యాప్’ను కూడా హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. యాప్లను హ్యాక్ చేసి డేటాను చోరీ చేస్తున్నారు.చోరీచేసిన డేటాను ఆన్లైన్లో అమ్ముతున్నారు 120 డాలర్లకు తెలంగాణ పోలీసుల డేటా అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. 12 లక్షల మంది డేటా బహిరంగ మార్కెట్లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హ్యాకింగ్కు పాల్పడిన ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. చోరీ చేసిన సమాచారంతో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
ట్యాపింగ్ వీరుడు.. డేటా చోరుడు.. బాబే
సాక్షి, అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ ఓటమికి ఇప్పటి నుంచే కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందంటూ చిత్తకార్తి రాతలు రాస్తూ వైఎస్సార్సీపీపై దుష్ప్రచార కుట్రకు తెరతీశారు. పచ్చ పైత్యం సోకి రామోజీరావుకు ఉద్దేశపూర్వక మతిమరుపు వచ్చిందేమోగానీ... రాష్ట్ర ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడటం, ఓటర్ల వ్యక్తిగత డేటా చౌర్యానికి బరితెగించడం అంతా ప్రజలకు గుర్తుంది. ఫోన్ల ట్యాపింగ్ కోసం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ వెళ్లి మరీ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ను కొన్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు బాగోతాన్ని శాసన సభ ఉప సంఘం కూడా నిగ్గు తేల్చింది. మరోవైపు చంద్రబాబు పెగసస్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే స్వయంగా ఆ రాష్ట్ర శాసన సభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పోలీసు అధికారీ ఇజ్రాయెల్ వెళ్లలేదు. ఎలాంటి సాఫ్ట్వేర్ కొనలేదు. వీటన్నింటినీ మరుగున పరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ధ్యేయంగా ఈనాడులో ఓ కట్టుకథ రాశారు. అసలు వాస్తవాలేమిటంటే... ట్యాపింగ్ చరిత్ర బాబుదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ అనే జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ కీలక అధికారిని, మరో పోలీసు ఉన్నతాధికారిని అందుకోసం ప్రత్యేకంగా నియమించారు. ప్రతిపక్ష నేత నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల వరకూ అందరి ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడ్డారు. ఆ కుట్రలో భాగస్వామి అయిన ఆ పోలీసు ఉన్నతాధికారికి 2014లో చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తరువాత రాష్ట్ర పోలీస్ బాస్గా పోస్టింగ్ ఇచ్చారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రధానంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారంలో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూచంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చేశారు. ఇక్కడ ఆయన మరోసారి ఫోన్ ట్యాపింగ్పై దృష్టి సారించారు. అందుకోసం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్ప్రైజస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు పెగసస్తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు బృందం ఇజ్రాయెల్లో పర్యటించింది. పెగసస్ సంస్థతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉగ్రవాద సంస్థలకు చిక్కితే దేశంలో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల దేశ భద్రత దృష్ట్యా ఈ నిబంధన విధించారు. కానీ, జాతీయ భద్రత చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే పెగసస్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంది. అందుకోసం నిధులు కూడా చెల్లించింది. రూ.25 కోట్లతోచంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించారని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని మమతా బెనర్జీ చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. వీటిని ఏనాడూ ప్రశ్నించని రామోజీరావు.. ఇప్పుడు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడకపోయినా, ఓ అసత్య కథనాన్ని ప్రజల్లోకి వదిలి, టీడీపీ ఓటమికి ఓ కుంటిసాకును సిద్ధం చేసుకున్నారు. యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్..35 లక్షల మందిడేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్తోపాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల డేటా (సమాచారం) మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్కు అనుసంధానించారు. రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసనసభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వ డేటా చౌర్యంపై విచారణకు సభా సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్నకు బదిలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసనసభకు సమర్పించింది. -
నిన్న రాజంపేట.. నేడు నెల్లూరు 'పచ్చ' మూకల డేటా చౌర్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా ఇప్పటి నుంచే టీడీపీ బరితెగిస్తోంది. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతోనూ, ఓటర్ల జాబితాలో ఓటు ఉందో, లేదో తెలుసుకునే పేరుతోనూ ప్రతి ఇంటికీ వెళ్తున్న టీడీపీ డేటా దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోంది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వివరాలు, ఓటీపీ వంటి అత్యంత సున్నిత సమాచారాన్ని ఈ ముఠా సేకరిస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ ఈ పచ్చ మూకల దండు ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపైన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీదకొచ్చి పడుతోందని.. పట్టపగలే ఇళ్లలోకి చొరబడుతోందని.. ఆ ముఠా చేసే తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇంతలోనే రాజంపేట కోవలోనే తాజాగా నెల్లూరులోనూ టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించింది. నెల్లూరులో నారాయణ గ్యాంగ్ బరితెగింపు.. నెల్లూరులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ గ్యాంగ్ శనివారం పట్టపగలే ప్రజల ఇళ్లలోకి చొరబడింది. ఇంటింటికీ తిరిగి ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరించింది. ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ సున్నిత వ్యక్తిగత సమాచారం రాబట్టింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు నంబర్లు, మొబైల్ ఫోన్ నంబర్, దానికి వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పాలని అడగడంతో నెల్లూరులో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. నెల్లూరు నగరంలోని మూలాపేట డివిజన్లో ఓ ఇంటికి వెళ్లి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ ముఠా సభ్యుడ్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ సున్నిత వ్యక్తిగత సమాచారం మీకెందుకంటూ నిలదీశారు. దీంతో ఆ డేటా దొంగ పరార్ కావడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన విద్యాసంస్థల్లో పనిచేసే చిరుద్యోగులను ముఠాగా ఏర్పాటు చేసి నారాయణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. నెల్లూరు నగర నియోజకర్గంలో దాదాపు 75 వేల కుటుంబాలు ఉన్నాయి. 2.35 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరందరి సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు నారాయణ తన ముఠాను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారాయణకు రూ.కోట్లు కుమ్మరించినా ఓటమి తప్పలేదు. తన విద్యాసంస్థల ఉద్యోగులు, అధ్యాపకులను రంగంలోకి దింపి విచ్చలవిడిగా కోట్ల రూపాయలు వెదజల్లినా ఓటర్లు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ ధపా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాలను సేకరించి వారి బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయడానికి కుట్ర పన్నారని చెబుతున్నారు. పచ్చ దొంగల డేటా తస్కరణ ఇలా.. టీడీపీ పచ్చ దొంగల ముఠా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ చెబుతున్నారు. ఆ ఇంటి ఓటర్ల పేర్లు చదువుతున్నారు. ఆపై వారిని మాటల్లో పెట్టి సున్నిత వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తున్నారు. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ కుటుంబం వైఎస్సార్సీపీ మద్దతుదారులైతే వారి ఓట్లు తొలగింపు ఫారం–7 నమోదు చేసి మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వచ్చిందని.. దాన్ని చెప్పాలని దబాయిస్తున్నారు. కొందరు అమాయకులు ఓటీపీ చెబుతుండటంతో వారి ఓట్లు తొలగింపునకు ఫారం–7 నమోదవుతుంది. దాంతో పాటు ఓటర్ల బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం టీడీపీ నేత నారాయణ మీ ఖాతాలో నగదు జమ చేస్తాడని చెబుతూ మాయ చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాల నగదు కూడా జమ అవుతుందని పచ్చి అబద్ధాలకు దిగుతున్నారు. ఓటీపీ క్లిక్ చేస్తే అంతే సంగతులు పట్టపగలే దొంగల్లా ప్రజల ఇళ్లల్లోకి చొరబడుతున్న టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని తమ దగ్గర ఉన్న ఒక యాప్లో నమోదు చేస్తున్నారు. మొబైల్ నంబర్కు ఓటీపీ, మేసేజ్ వస్తే దాన్ని క్లిక్ చేయమంటున్నారు. క్లిక్ చేస్తే ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ కార్డు వస్తోంది. ఆ కార్టులో.. ‘ఐదేళ్లలో రూ.2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు.. మీకు అభినందనలు.. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది’ అంటూ కనిపిస్తోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేటలో మర్రి మౌనిక అనే మహిళను ఇలాగే టీడీపీ దొంగల ముఠా బురిడీ కొట్టించింది. అంతటితో ఆగటంలేదు.. చంద్రబాబు సంతకం చేశారంటూ ఒక గ్యారెంటీ పత్రాన్ని సైతం ఇస్తుండటం ఈ ముఠా బరితెగింపుకు నిదర్శనం. ఆలూ లేదు.. సూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకం చేసి మరీ ఇస్తుండటం వీరి పైత్యానికి పరాకాష్ట. ఎల్లో మీడియా తీరు మారదా? రాష్ట్రంలో పచ్చ ముఠా ఇళ్లలోకి చొరబడి ఓటర్ల వ్యక్తిగత సమాచారం తస్కరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నా.. ఎల్లో మీడియా మాత్రం ఓటర్ల సవరణలు, చేర్పులు, తొలగింపుల్లో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తప్పుడు రాతలు రాస్తోంది. ఇటీవల సర్వేపల్లిలో టీడీపీ ముఠా వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు ఫారం–7 నమోదు చేసి అడ్డంగా దొరికినా ఎల్లో మీడియా పచ్చ కళ్లకు కనిపించడం లేదు. -
డేటా భారతంలో లీకుల భాగోతం
రకరకాల సందర్భాల్లో, డిజిటల్ వేదికల్లో మనం అందజేస్తున్న వ్యక్తిగత సమాచారం ఏ మేరకు సురక్షితం? చాలాకాలంగా వేధిస్తున్న ఈ ప్రశ్న సోమవారం మరోసారి ముందుకొచ్చింది. కోవిడ్ టీకాకరణకు డిజిటల్ బుకింగ్ సర్వీస్ వేదికైన ప్రభుత్వ పోర్టల్ ‘కోవిన్’ డేటాబేస్ నుంచి ప్రముఖుల వ్యక్తిగత డేటా సైతం టెలిగ్రామ్ యాప్లో దర్శనమిచ్చి, మనవాళ్ళ సమర్థతను వెక్కిరించింది. మలయాళ మీడియా ‘ది ఫోర్త్’ తన యూట్యూబ్ వీడియోలో చూపిన డేటా చోరీ వైనం దిగ్భ్రాంతికరం. అనేక వార్తాసంస్థలూ సదరు టెలిగ్రామ్ బాట్ను పరీక్షించి, లీక్ నిజమేనని నిర్ధారించాయి. ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ దీనిపై విచారణ చేపట్టిందే తప్ప, కనీసం అప్రమత్తత జారీ చేయకపోవడం విచారకరం. ప్రభుత్వం అసలీ వార్తల్నే కొట్టిపారే యడం మరీ విడ్డూరం. కానీ, కోవిన్లోనే లభించే మైనర్లు, మేజర్ల సమాచారం ఈ లీకుల్లో ఉంది. ఇది అనుమానాల్ని పెంచుతోంది. సైబర్ సెక్యూరిటీ, డేటా చట్టాల తక్షణావసరాన్ని గుర్తు చేస్తోంది. గతంలో 2018లోనే మన ఆధార్ డేటాబేస్ నుంచి భారీగా లీక్ జరిగినట్టు వార్తలొచ్చాయి. ఆ హ్యాకింగ్ను ప్రభుత్వం ఇప్పటి దాకా బాహాటంగా ప్రస్తావించ లేదు. ‘కోవిన్’ సంగతికే వస్తే, 2021 జూన్లోనూ ‘కోవిన్’ పోర్టల్ హ్యాకైంది. 15 కోట్ల మంది భారతీయుల డేటా అంగట్లో అమ్ముడైంది. అప్పుడూ మన సర్కార్ అదేమీ లేదంది. ఇక గత ఏడాది జనవరిలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పుడూ డేటాబేస్ ‘సురక్షితంగా ఉంద’ని నేషనల్ హెల్త్ అథారిటీ వాదించింది. కానీ, అసలు గోప్యతా విధానమంటూ ఏదీ లేకుండానే ‘కోవిన్’ జనంలోకి వచ్చింది. చివరకు 2021లో ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించాక, తప్పక విధాన ప్రకటన చేసింది. తాజా ఉదంతంలో ‘కోవిన్’ వేదిక నుంచి ‘నేరుగా ఉల్లంఘన’ జరగలేదని ప్రభుత్వం తెలివిగా జవాబిచ్చింది. గతంలో కోవిన్లో కాక వేరెక్కడో చోరీ అయిన సమాచారమే ఇదంటోంది. మరి ఒకప్పుడు ఇలాంటి చోరీలే జరగలేదన్న సర్కార్... ఇప్పుడు తాజా చోరీ సమాచారం పాతదే అంటోందంటే ఏది నిజం? ఏది అబద్ధం? అసలీ వార్తలన్నీ ‘ఆధారరహితం, తుంటరి చేష్టలు’ అన్నది ఎప్పటి లానే సర్కారు వారి పాత పాట. ఒకవేళ అదే నిజమనుకున్నా, ప్రభుత్వ సంస్థల చేతుల్లోని డిజిటల్ డేటా భద్రత, సత్వరమే వ్యక్తిగత డేటా రక్షణ చట్టం అవసరమైతే ఉంది. తాజా రచ్చ మరోసారి మనకు చెబుతున్న పాఠం అదే. ఢిల్లీలోని వైద్యసంస్థ ఎయిమ్స్ గత 8 నెలల్లో రెండుసార్లు సైబర్ దాడులకు గురైన సంగతి అంత తేలిగ్గా మర్చిపోలేం. వ్యక్తిగత ఆరోగ్య వివరాలు, అలాగే ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సమాచారం ఉన్న ఇతర పత్రాలకు మరింత భద్రత అవసరమని తాజా ఘటన అప్రమత్తం చేసింది. ‘వందకోట్ల సార్లు యత్నించినా ఆధార్ భద్రతను ఛేదించడం అసాధ్యమంటూ 2018లో అప్పటి ఐటీ మంత్రి పార్లమెంట్ సాక్షిగా బల్లగుద్దారు. కానీ, మరిప్పుడు తాజా డేటా ఉల్లంఘనలో మొబైల్ నంబర్ను బట్టి ఆధార్ వివరాలు అంత కచ్చితంగా టెలిగ్రామ్ బాట్లో ఎలా వస్తున్నాయి? నిజానికి శరవేగంతో అన్నీ డిజిటలీకృతమవుతున్న ప్రపంచంలో కొత్త ముప్పు – వ్యక్తిగత డేటా లీకులు. అది ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నదే. లక్షలాది రిటైల్ కస్టమర్లతో లావాదేవీలు నడిపే డొమినో ఇండియా నుంచి 18 కోట్ల మంది సమాచారం లీకు సహా అనేక పోర్టల్స్ నుంచి వ్యక్తిగత డేటా అంగట్లో సరుకు కావడం కొన్నేళ్ళుగా మన దేశంలో ఆనవాయితీ అయింది. 2020 నుంచి చూస్తే, అమెరికా, రష్యా, ఇరాన్ల తర్వాత ప్రపంచంలోనే అధికంగా 14 కోట్ల డేటా గోప్యత ఉల్లంఘనలు జరిగిన దేశం మనదే. ఇంత జరుగుతున్నా వ్యక్తిగత డేటా రక్షణపై దేశంలో ఇప్పటికీ సరైన చట్టం లేదు. భారత్లో 2017లో డేటా గోప్యత బిల్లు తొలిసారిగా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ఇప్పటికీ కొత్త చట్టం పనులు నత్తనడక నడుస్తున్నాయి. గడచిన వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అనుకున్నా, చివరకు దాన్ని పక్కన పడేసి, 2022 డిసెంబర్లో కొత్త ముసాయిదాను తెచ్చారు. అనేక విడతల సలహా సంప్రతింపులు జరిపినా, కొత్త బిల్లు ఇంకా పార్లమెంట్ మెట్లెక్కనే లేదు. కాగా, కేంద్రం త్వరలోనే ప్రతిపాదిత ‘డిజిటల్ ఇండియా’ చట్టాన్నీ, అలాగే సవరించిన ‘డిజి టల్ డేటా పరిరక్షణ బిల్లు 2022’నూ పార్లమెంట్లో పెడుతుందని సమాచారం. అలాగే అన్ని రకాల ప్రభుత్వ డేటా నిల్వ, అందుబాటు, భద్రతా ప్రమాణాలకు ఉమ్మడి చట్రాన్నిచ్చే ‘నేషనల్ డేటా గవ ర్నెన్స్ పాలసీ’ని ఖరారు చేస్తున్నామని అమాత్యుల మాట. భవిష్యత్తులో అవి ఊరట కావచ్చేమో. అయితే, ఇకనైనా సంస్థలు తాము సేకరించిన వ్యక్తిగత డేటాను ఒక్కసారికే, సదరు నిర్ణీత ప్రయోజనానికే వాడుకొనేలా చట్టంలో కట్టుదిట్టాలు చేయడం కీలకం. సంస్థలపైనే బాధ్యత మోపాలి. అలాగే, డేటా చోరీ అనుమానం రాగానే సంభావ్య బాధితులందరికీ సదరు సంస్థలు సమాచారమివ్వడం తప్పనిసరి చేయాలి. దానివల్ల వారు వెంటనే పాస్వర్డ్లు మార్చుకొని, సురక్షితులయ్యే వీలుంటుంది. అయినా, ప్రభుత్వం చేతిలోని ‘కోవిన్’ లాంటి వాటి నుంచే డేటా లీకవుతూ పోతే పౌరులకిక ఏం నమ్మకం మిగులుతుంది? సమస్తం డిజిటలైన వేళ ఉల్లంఘనలు తప్పవనుకున్నా, నష్టాన్ని తగ్గించడం, డేటా గోప్యతకు చట్టబద్ధ రక్షణ కల్పించడం ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వ కనీస కర్తవ్యం. లీకైన కోట్లాది ప్రజల డేటా నేరగాళ్ళ చేతిలో పడితే ఆర్థికంగా, సామాజికంగా చెలరేగే సంక్షోభం అనూహ్యం. అందుకే, ఈ లీకుల్ని కొట్టిపారేసే వైఖరి వదిలి, సర్కార్ కఠిన చర్యలకు దిగాలి. ప్రతిదానికీ పుట్టుపూర్వోత్తరాలన్నీ సేకరించే ధోరణి మాని, వీలైనంత వరకు అతి తక్కువ డేటానే సేకరించే పద్ధతి మేలంటున్న పౌరసమాజం మాటల్నీ పట్టించుకోవాలి. -
డేటా లీకుపై పోలీసుల దూకుడు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన డేటా చౌర్యం కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. గత నెల రోజుల వ్యవధిలో సైబరాబాద్ పోలీసులు నాలుగు డేటా చౌర్యం, విక్రయం, నకిలీ కాల్ సెంటర్ నిర్వహణ కేసులను ఛేదించారు. వీటిల్లో 30 మంది నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కేసులలో నిందితులు విక్రయానికి పెట్టిన వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ ఏజెన్సీలు, ఈ–కామర్స్ సంస్థల నుంచి లీకైనట్లు గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయా కంపెనీలను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే బిగ్ బాస్కెట్, ఫోన్పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యాట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో పది కంపెనీలకూ తాఖీదులు జారీ చేసింది. ఇప్పటికే సిట్ ముందు హాజరైన కంపెనీలు.. కస్టమర్ల డేటా, సమీకరణ, భద్రతా విధానాలు, థర్డ్ పార్టీ ఏజెన్సీలు తదితరాలపై సమగ్ర సమాచారాన్ని సమర్పించాయి. ఆయా సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు మరికొంత అదనపు సమాచారం కోసం మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు రాష్ట్రాల్లో గాలింపు.. ప్రధానంగా హరియాణాలోని ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ దేశంలోని 70 కోట్ల మంది వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయానికి పెట్టడం సంచలనం సృష్టించింది. ఇందులో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారంతో పాటు విద్యుత్, ఇంధనం వంటి ప్రభుత్వ శాఖలు, విద్యార్థులు, ప్రవాసులు, గృహిణులు, బ్యాంకు ఖాతాదారుల సమాచారం ఉండటం గమనార్హం. ఈ కేసులో నిందితుడు వినయ్ భరద్వాజ్ ఈ డేటాను గుజరాత్కు చెందిన అమీర్ సోహైల్, మదన్ గోపాల్ అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, పశ్చిమ బెంగాల్లో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నట్లు తెలిసింది. -
Pinduoduo: దగాకోరు యాప్
వినియోగదారుల సమాచారాన్ని దొంగిలిస్తాయన్న ఆరోపణలు చైనా మొబైల్ అప్లికేషన్ల(యాప్లు)పై ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇలాంటి యాప్లపై నిషేధం విధించాయి. చైనాలో బాగా జనాదరణ ఉన్న షాపింగ్ యాప్ ‘పిండువొడువో’ తమ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నట్లు ఇటీవలే వెల్లడయ్యింది. 75 కోట్ల మంది డేటాను సేకరించి, వ్యాపార అభివృద్ధి కోసం వాడుకున్నట్లు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. ఈ యాప్ను ఫోన్లలో ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే తొలగించడం చాలా కష్టమని సైబర్ సెక్యూరిటీ నిపుణు లు చెబుతుండడం గమనార్హం. చైనా ప్రభుత్వం ఇప్పటికీ పిండువొడువో యాప్పై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ► 75 కోట్ల మంది వినియోగదారుల విస్తృత డేటాను పిండువొడువో యాజమాన్యం వారికి తెలియకుండానే సేకరించింది. వారి ఆసక్తులు, అభిరుచులు, ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకుంది. ► వాటికి అనుగుణంగా నోటిఫికేషన్లు, ప్రక టనలు పంపించడానికి తన మెíషీన్ లెర్నింగ్ మోడల్ను మెరుగు పర్చు కుంది. అనుమతి లేకుండానే.. ► మన ఫోన్లలోని డేటాను ఇతరులు చూడాలంటే మన అనుమతి తప్పనిసరి. పిండువొడువో మాత్రం ఇలాంటి అనుమతుల జోలికి వెళ్లలేదు. ► యూజర్ల ఫోన్లలోకి పిండువొడువో యాజమాన్యం తమ యాప్ ద్వారా మోసపూరిత సాఫ్ట్వేర్(మాల్వేర్)ను జొప్పించింది. దాని సాయంతో ఫోన్లలోని లొకేషన్లు, కాంటాక్ట్లు, క్యాలెండర్లు, నోటిఫికేషన్లు, ఫొటో ఆల్బమ్స్ యాక్సెస్ చేసుకుంది. ► ఫోన్లలోని సిస్టమ్ సెట్టింగ్స్ మార్చే వెసులుబాటు సైతం సొంతం చేసుకుంది. ఫోన్లలో ఉండే ఇతర యాప్లపైనా నిఘా పెట్టింది. ► ఒక్కమాటలో చెప్పాలంటే యూజర్లకు తెలియకుండానే వారి ఫోన్లను స్వేచ్ఛగా వాడుకుంది. ► గూగుల్ సంస్థ మార్చి నెలలో తన ప్లేస్టోర్ నుంచి పిండువొడువోను తొలగించింది. ► తమ యాప్పై వచ్చిన ఆరోపణలను యాజమాన్యం ఖండించింది. ఏమిటీ పిండువొడువో? ► చైనాలో ఇంటర్నెట్ వినియోగించే ప్రజల్లో నాలుగింట మూడొంతుల మంది పిండువొడువో యాప్ ఖాతాదారులే. మార్కెట్ విలువ ప్రఖ్యాత షాపింగ్ యాప్ ‘ఈబే’ కంటే మూడు రెట్లు ఎక్కువ. ► గూగుల్ మాజీ ఉద్యోగి కోలిన్ హువాంగ్ 2015లో షాంఘైలో స్టార్టప్ కంపెనీగా పిండువొడువో యాప్ను 6.49.0 అనే వెర్షన్తో ప్రారంభించాడు. ఈ–కామర్స్ దిగ్గజాలైన అలీబాబా, జేడీ డాట్ కామ్కు పోటీగా ఈ కంపెనీ ప్రస్థానం ఆరంభమైంది. గూగుల్ ప్లేస్టోర్తోపాటు చైనా యాప్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. ► పిండువొడువో నగరాలను కాకుండా తొలుత చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తన లక్ష్యంగా చేసుకుంది. తక్కువ ఆదాయం కలిగిన ప్రజలకు చౌక ధరలకే వారు కోరుకున్న వస్తువులు చేరవేసింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్లకు భారీగా డిస్కౌంట్లు ఇచ్చింది. దాంతో అనతి కాలంలోనే పిండువొడువో జనంలోకి బాగా చొచ్చుకెళ్లింది. ► 2018 ఆఖరు నాటికి నెలవారీ యూజర్లలో మూడంకెల వృద్ధిని సాధించింది. అదే సంవత్సరం న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యింది. ► ఈ యాప్ ఫోన్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. అందుకే ఫోన్ల నుంచి సులభంగా తొలగించలేమని నిపుణులు వెల్లడించారు. ఎప్పుడు బయటపడింది? ► పిండువొడువో యాప్లో మాల్వేర్ ఉన్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతంలో అనుమానాలు బలపడ్డాయి. ► చైనా సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘డార్క్ నేవీ’ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. కానీ, ఆ యాప్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. ► యాప్ నిర్వాకంపై ఇతర పరిశోధకులు దృష్టి పెట్టారు. మాల్వేర్తో డేటాను దొంగిలిస్తున్న సంగతి నిజమేనని తేల్చారు. పిండువొడువో అనేది ఒక దొంగ యాప్ అని స్పష్టం చేశారు. ► ఆరోపణలు వెల్లువెత్తడంతో యాప్ యాజమాన్యం అప్రమత్తమైంది. మార్చి 5న వెర్షన్ 6.50.0 పేరిట కొత్త అప్డేట్ను విడుదల చేసింది. చాలామంది ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను తమ అనుబంధ సంస్థ అయిన ‘టెమూ’కు తరలించింది. ► 20 మందితో కూడిన సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ల బృందం ఇప్పటికీ పిండువొడువోలో కొనసాగుతోంది. చైనా ప్రభుత్వం మౌనమెందుకో? ► కొత్త వెర్షన్ కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. అందులో అండర్లైయింగ్ కోడ్ ఉందని, డేటా చౌర్యం కోసం దాన్ని ఎప్పుడైనా రీయాక్టివేట్ చేయొచ్చని హెచ్చరిస్తున్నారు. ► చట్ట ప్రకారం చూస్తే పిండువొడువోను నిషేధించాల్సిందేనని నిపుణులు తేల్చిచెబుతున్నారు. కానీ, ఆ యాప్పై ఇప్పటికీ చర్యల్లేవు. యాప్ కార్యకలాపాలపై బహిరంగంగా ఏనాడూ స్పందించలేదు. ► చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న యాప్ల పేర్లతో కూడిన జాబితాను చైనా సమాచార సాంకేతిక శాఖ తరచుగా విడుదల చేస్తోంది. ఈ జాబితాల్లో పిండువొడువో పేరును ఒక్కసారి కూడా చేర్చలేదు. ► పిండువొడువో అనుబంధ యాప్ అయిన ‘టెమూ’ అమెరికాలో డౌన్లోడ్లలో అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ దేశాల్లోనూ విస్తరిస్తోంది. ఇప్పుడు దీనిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
డేటా చోరీ సూత్రధారి దొరికాడు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం కేసులో కీలక సూత్రధారిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ జనాభాలో 50 శాతం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి విక్రయిస్తున్న ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాలకు చెందిన సుమారు 70 కోట్ల మంది రహస్య సమాచారాన్ని తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. రక్షణ, విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీవోలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితుడు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలివే.. వెబ్ డిజైనర్ నుంచి... హరియాణాలోని ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ వెబ్ డిజైనర్గా పనిచేసేవాడు. ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయంతో డేటా సమీకరణ, విక్రయం గురించి తెలుసుకున్నాడు. వెబ్ డిజైనింగ్ కోసం తన వద్దకు వచ్చే కస్టమర్ల వివరాలను మార్కెటింగ్ ఏజెంట్లకు, సైబర్ నేరస్తులకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. అప్పనంగా డబ్బు వస్తుండటంతో ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని సైతం తస్కరించాలని నిర్ణయించుకున్నాడు. డేటా సమీకరణ కోసం ఏకంగా 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ఇందులో అమీర్ సొహైల్, మదన్ గోపాల్లు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. విక్రయం కోసం వెబ్సైట్.. తస్కరించిన డేటాను విక్రయించేందుకు ఇన్స్పైర్ వెబ్జ్ వెబ్సైట్ను ప్రారంభించాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాడు. క్లౌడ్ డ్రైవ్ లింక్ల ద్వారా మాత్రమే డేటాను విక్రయించేవాడు. ఇలా గత 8–12 నెలలుగా నిందితుడు డేటా తస్కరణ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వినయ్ నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అమీర్, మదన్ల కోసం సైబరాబాద్ పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి నెల క్రితం ఓపెన్ సోర్స్ వెబ్సైట్లో తన వ్యక్తిగత సమాచారం చూసి కంగుతిన్నాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమాచారం ఎలా బహిర్గతమైందో కూపీ లాగారు. 10 రోజుల క్రితం రెండు కేసులలో 16 మంది డేటా చోరీ నిందితులను పట్టుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. వినయ్ భరద్వాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనికి నోటీసులు జారీ చేసి అరెస్టు చేశారు. ఈ డేటాతో ఏం చేసేవారంటే.. మార్కెటింగ్ బృందాలు, ఏజెన్సీలు, సైబర్ నేరస్తులు నిందితుడి నుంచి డేటాను కొనుగోలు చేసేవారు. ఉత్పత్తుల ప్రచారం, మార్కెటింగ్ కోసం బల్క్ మెసేజ్లు పంపించడం కోసం ఏజెన్సీలు డేటాను కొనుగోలు చేశాయి. సైబర్ నేరస్తులు కొనుగోలు చేసిన డేటాతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడేవారు. ఎవరెవరి డేటా లీకైంది? ఏ సంస్థ, వ్యక్తులు లీకు చేశారు? వంటి సమస్త సమాచారాన్ని ప్రజలకు ఎలా చేరవేయాలనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నామని సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ శింగేన్వర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల డేటా కూడా.. నిందితుడు విక్రయించిన డేటాలో తెలంగాణ, ఏపీ ప్రజల డేటా కూడా ఉంది. హైదరాబాద్కు చెందిన 56 లక్షలు, ఆంధ్రప్రదేశ్కు చెందిన 2.10 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను నేరస్తుడు విక్రయానికి పెట్టాడు. పన్ను చెల్లింపుదారులు, కంపెనీ సెక్రటరీలు, ఆడిటర్లు, ఉద్యోగస్తుల డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో వ్యక్తుల పేరు, ఫోన్ నంబరు, చిరునామా, ఈ–మెయిల్ ఐడీలు తదితర వివరాలున్నాయి. రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారం లీక్.. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన 2.55 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారాన్ని నేరస్తుడు తస్కరించి విక్రయానికి పెట్టాడు. ఇందులో ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతోపాటు ర్యాంకు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలున్నాయి. దీంతోపాటు ఎల్ఐసీ, విద్యుత్, ఇంధన శాఖ వంటి ప్రభుత్వ సంస్థల సమాచారం కూడా ఉంది. అలాగే 1.26 లక్షల మంది ప్రవాసులు, 5 లక్షల మంది హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)ల డేటా కూడా అంగట్లో విక్రయానికి పెట్టేశాడు. విద్యార్థుల డేటా నేరస్తుల చేతుల్లో.. విద్యాసంస్థలతోపాటు విద్యార్థుల డేటా కూడా నేరస్తుల చేతుల్లోకి చేరింది. బైజూస్, వేదాంతు వంటి ఆన్లైన్ విద్యాసంస్థలకు చెందిన 18 లక్షలు మంది విద్యార్థులు, 1.8 లక్షల మంది నీట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 30 లక్షల మంది సీబీఎస్ఈ (10, 12వ తరగతి), 3.5 కోట్ల మంది ఇతర విద్యార్థుల డేటాను నేరస్తులు విక్రయానికి పెట్టారు. -
16.8 కోట్ల మంది డేటా చోరీ!
గచ్చిబౌలి: వందలు.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది. రక్షణ శాఖ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షలాది మంది ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల డేటా అంగడి సరుకుగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల వివరాలూ కేటుగాళ్లకు చేరాయి. పాన్, ఫోన్ నంబర్లు, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల వివరాలు క్రిమినల్స్ పరమయ్యాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో డేటా చోరీకి పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సైబర్క్రైం పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని దొంగిలించి విక్రయిస్తున్న కేటుగాళ్ల ఆటకట్టించారు. ఢిల్లీ శివార్లలోని నోయిడా కేంద్రంగా ఈ దందా సాగిస్తున్న ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. రక్షణ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, నీట్ విద్యార్థులు, డీమ్యాట్ ఖాతాదారులు, ఐటీ సంస్థల ఉద్యోగులు, వాట్సాప్, ఫేస్బుక్ వినియోగదారులు, టెలికం, ఫార్మా కంపెనీలు, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల డేటా సహా మొత్తం 140 కేటగిరీలకు చెందిన సమాచారాన్ని నిందితులు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రక్షణ శాఖకు చెందిన (డిఫెన్స్ ఫోర్స్ ఢిల్లీ ఎన్సీఆర్ డేటాబేస్)కు చెందిన 2.55 లక్షల మంది డేటా సైతం చోరీకి గురికావడంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా చోరీలో జస్ట్ డయల్ అనే సెర్చ్ ఇంజన్ పాత్ర ఉందని, ఈ కేసులో ఆ సంస్థ వారినీ విచారిస్తామని ఆయన పేర్కొన్నారు. నిందితులు వీరే... యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో అనే కంపెనీల (కాల్సెంటర్లు) ద్వారా నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఏ1 కుమార్ నితీష్ భూషణ్తోపాటు టెలికాలర్ కుమారి పూజ, డేటా ఎంట్రీ ఆపరేటర్ సుశీల్ తోమర్, క్రెడిట్ కార్డుల డేటా విక్రయించే అతుల్ సింగ్, ఎంఎస్ గ్రో కంపెనీలో సేకరించిన డేటాను విక్రయించే ముస్కాన్ హసన్, గ్లోబల్ డేటాఆర్ట్స్లో జస్ట్ డయల్ ద్వారా డేటాను విక్రయించే సందీప్ పాల్, బల్క్ మెసేజ్లు పంపే జియా ఉర్ రెహమాన్లను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 సెల్ ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, 2 సీపీయూలు, 140 కేటగిరీలలో డేటా చోరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా కార్యాలయాల్లో ప్రజల పాన్, మొబైల్, టెలికం, ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ, పెట్రోలియం కంపెనీలు, బ్యాంకుల డేటా, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల డేటాను పోలీసులు కనుగోన్నారు. నిందితులు ఇప్పటివరకు సుమారు 100 మంది సైబర్ క్రిమినల్స్కు డేటాను విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అలాగే 50 వేల మంది పౌరులకు చెందిన సమాచారాన్ని కేవలం రూ. 2 వేలకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. డేటా చోరీపై సైబర్క్రైం పోలీసులకు అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. భారీగా డేటా చోరీ... నిందితులు చోరీ చేసిన డేటాలో 1.47 కోట్ల కార్ల యజమానుల, డొమైన్ వాయిస్ డేటాబేస్ 3.47 కోట్లు, మొబైల్ నంబర్ల డేటాబేస్ 3 కోట్లు, స్టూడెంట్ డేటాబేస్ 2 కోట్లు, వాట్సాప్ యూజర్లు 1.2 కోట్ల మంది డేటా చోరీ గురైంది. అలాగే జాబ్ సీకర్స్ డేటాబేస్ 40 లక్షలు, సీబీఎస్ఈ 12వ తరగతికి చెందిన 12 లక్షల మంది విదార్థులు, సివిల్ ఇంజనీర్ల వివరాలు 2.3 లక్షలు, డెబిట్ కార్డుల సమాచారం 8.1 లక్షలు, సీనియర్ సిటిజన్స్ 10.6 లక్షలు, వెబ్సైట్ ఓనర్స్ 17.4 లక్షలు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ డేటా చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. గుర్తించిన అంశాలు... ► పలు ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా, జస్ట్ డయల్ వంటి సంస్థలు ప్రజల అనుమతి లేకుండానే డేటాను సేకరిస్తున్నాయి. ► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో సేవలందించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, వ్యక్తుల ద్వారా డేటా చోరీకి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ► గోప్యంగా ఉంచాల్సిన డేటా భద్రంగా ఉందోలేదో సర్వీసు ప్రొవైడర్లు తనిఖీ చేయట్లేదని తేలింది. ► జస్ట్ డయల్ లాంటి సంస్థల్లో డేటా విక్రయానికి అందుబాటులో ఉంది. పోలీసుల సూచనలు... ► మీ డేటాను ప్రైవేటు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. ► క్రెడిట్ కార్డులు, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులకు, సంస్థలకు చెప్పొద్దు. ► మొబైల్, కంప్యూటర్, యాప్లు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేసు దర్యాప్తు సిట్కు బదిలీ దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ముడిపడి ఉన్నందున డేటా చోరీ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందుకోసం డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ నేతృత్వంలో ‘సిట్’ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ టీమ్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ రితిరాజ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర అధికారులు ఉంటారని తెలిపారు. క్రెడిట్ కార్డుదారుల డేటా చోరీ ముఠా అరెస్ట్ గచ్చిబౌలి: బ్యాంకుల్లో డేటా చోరీ చేసే ముఠాను సైబర్క్రైం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. క్రెడిట్ కార్డుల వెరిఫికేషన్ చేస్తున్న థర్డ్ పార్టీకి చెందిన సిబ్బంది డేటాను చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1,780 మంది కస్టమర్ల డేటాతోపాటు ఎస్బీఐకి చెందిన 140 మంది కస్టమర్ల డేటా చోరీకి గురైందన్నారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ప్రధాన నిందితుడు కఫిన్ అహ్మద్, మహ్మద్ సమాల్, మహ్మద్ అసీఫ్, చిరాగ్, విరేంద్ర సింగ్, ప్రదీప్ వాలియా, ఆకాశ్నిర్వాన్, విరాట్ పురి, అతీత్ దాస్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13 సెల్పోన్లు, ల్యాప్టాప్, క్రెడిట్ కార్డుల డేటా స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్: డేటా చోరీ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ వ్యవహారంగా సైబరాబాద్ పోలీసులు భావిస్తున్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఈ కేసును సిట్కు బదిలీ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. ఐపీఎస్ అధికారి పర్యవేక్షణతో సిట్ దర్యాప్తు ముందుకు సాగనున్నట్లు తెలిపారాయన. ఇక కేసులో కీలకంగా ఉన్న జస్ట్ డయల్కు నోటీసులు జారీ చేయడంతో పాటు విచారించనున్నట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. సుమారు 16 కోట్ల 80 లక్షల మంది డేటా చోరీ జరిగిందని చెబుతోంది సైబరాబాద్ పోలీస్ విభాగం. మరో పది కోట్ల మంది డేటా కొట్టేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. వక్తిగత వివరాలతో పాటు అంత్యంత గోప్యంగా ఉండాల్సిన వివరాలు, సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయని, కేసులో లీడ్స్ ఉన్నాయని, ఎక్కడి నుంచి లీక్ అయ్యిందనే దర్యాప్తులో తేలాల్సి ఉందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. అలాగే.. ఆర్మీకి సంబంధించిన డేటా(సిబ్బంది పేర్లు, ర్యాంకులు, పోస్టింగ్ ఇతర వివరాలు) సైతం లీక్ అయ్యిందని చెప్పారాయన. సాధారణ పౌరుల నుంచి ఎవరైనా కానీ.. డేటా తీసుకున్నప్పుడు సేఫ్గా, సెక్యూర్గా ఉంచాల్సిన బాధ్యత ఉందని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. -
30 లక్షల ఓట్లపై డేటా దొంగల గురి!
సాక్షి, అమరావతి: కంచే చేను మేసింది! ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచి కస్టోడియన్గా వ్యవహరించాల్సిన వారే సున్నితమైన డేటాను ఆగంతకులు, సంస్థలకు చేరవేశారు. 2019 ఎన్నికల సందర్భంగా 30 లక్షల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు పన్నిన పన్నాగం, అక్రమాల వ్యవహారం బట్టబయలైంది. స్టేట్ డేటా సెంటర్ కేంద్రంగా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు సమాచారాన్ని చేరవేసినట్లు నిర్ధారణ అయింది. డేటా చౌర్యంపై విచారించేందుకు శాసనసభ నియమించిన సభాసంఘం విచారణలో చంద్రబాబు సర్కారు బరితెగింపు బట్టబయలైంది. టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పన్నాగంతోనే డేటా చోరీకి తెగబడినట్లు తేలింది. సభా సంఘం విచారణలో వెల్లడైన అంశాలు సంగ్రహంగా... స్టేట్ డేటా సెంటర్ కేంద్రంగా.. చంద్రబాబు సర్కారు ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రజల కీలక సమాచారం పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు చేరింది. ఏకంగా స్టేట్ డేటా సెంటర్ నుంచే సున్నితమైన ఈ సమాచారాన్ని అక్రమంగా చేరవేశారు. స్టేట్ డేటా సెంటర్లో 264 కంప్యూటర్లు / సర్వర్లు ఉండగా 18 సర్వర్లను ప్రజా సాధికారిక సర్వే కోసం వినియోగించారు. ఆ సర్వర్ల నుంచే గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు భారీగా డేటాను చేరవేశారు. 18 సర్వర్లలో నాలుగు సర్వర్ల నుంచి ఏకంగా 24.3 టెరా బైట్ల సమాచారాన్ని చేరవేసినట్లు సభా సంఘం విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మొత్తం 18 సర్వర్ల నుంచి ఇంకెంతో సమాచారాన్ని అక్రమంగా బదలాయించారో అంతుబట్టడం లేదు. 2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31 మధ్య ఈ తతంగాన్ని నడిపారు. ► టీడీపీ సర్కారు స్టేట్ డేటా సెంటర్కే పరిమితమవ్వాల్సిన సమాచారాన్ని ఇతర శాఖల కార్యాలయాలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆ శాఖలు వాటి సర్వర్లను స్టేట్ డేటా సెంటర్లో కాకుండా బయట నిర్వహించాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఉన్నతాధికారులు సభా సంఘానికి నివేదించారు. అంటే ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించి స్టేట్ డేటా సెంటర్లో ఉంచాల్సిన సమాచారాన్ని ముందస్తు వ్యూహం ప్రకారమే బయటకు కార్యాలయాలకు కూడా అందుబాటులోకి తెచ్చారన్నది స్పష్టమైంది. అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు ఆ సమాచారాన్ని తరలించారు. ► సర్వర్ల నుంచి డేటాను ఎక్కడికి తరలించారన్నది కీలకంగా మారింది. అనుమతి లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు చెందిన ఐపీ అడ్రస్లకు డేటాను బదిలీ చేశారని విచారణలో వెల్లడైంది. వాటి ఐపీ అడ్రస్లను ఎవరు నిర్వహిస్తున్నారో గూగుల్ సంస్థ కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. పక్కాగా తప్పుడు చిరునామాలు, వివరాలతో నకిలీ ఐపీ అడ్రస్లతో ఉన్న గూగుల్ ఖాతాల్లోకి డేటాను చేరవేశారన్నది స్పష్టమైంది. ► ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రజల సమాచారానికి స్టేట్ డేటా సెంటర్, ఆర్టీజీఎస్ కస్టోడియన్గా ఉన్నాయి. అంటే ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత వాటిదే. కానీ ఆ శాఖల నుంచే సమాచారం బయటకు వెళ్లిందంటే కచ్చితంగా అత్యున్నత స్థాయి వ్యక్తుల అనుమతితోనే చేసి ఉంటారని సభా సంఘం నిర్ధారించింది. అత్యున్నత స్థాయి వ్యక్తుల అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని బయటకు తరలించడం సాధ్యపడదని స్టేట్ డేటా సెంటర్ ఉన్నతాధికారులు సభా సంఘానికి స్పష్టం చేయడం గమనార్హం. అంటే డేటా చోరీ పన్నాగం టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే సాగిందన్నది సుస్పష్టమైంది. క్రిమినల్ కేసులకు సిద్ధం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని శాసనసభా సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. గత సర్కారు హయాంలో డేటా చోరీకి పాల్పడ్డారని శాసనసభకు మధ్యంతర నివేదిక సమర్పించిన సభా సంఘం రెండో దశ విచారణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఫోన్ కాల్స్ ట్యాపింగ్, డేటా చోరీ కోసం నిఘా పరికరాల కొనుగోలుపై ప్రధానంగా దృష్టి సారించనుంది. అప్పటి ఐటీ శాఖ బాధ్యులు, పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్టీజీఎస్, స్టేట్ డేటా సెంటర్ ఉన్నతాధికారులతో పాటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలను కూడా సభా సంఘం విచారించనుందని తెలుస్తోంది. అత్యున్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతోనే డేటాను అనధికారిక వ్యక్తులు, సంస్థలకు తరలించినట్లు ఇప్పటికే సభా సంఘం విచారణలో వెల్లడైంది. దీంతో వారిని విచారణకు పిలవనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసుల నమోదుకు కూడా రంగం సిద్ధమవుతోంది. గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వ అధికారిక సమాచారం, ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు చేరవేయడం రాజ్యాంగ విరుద్ధం. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరమైన అంశం. దీన్ని సభా సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. 30 లక్షల ఓట్ల తొలగింపు కుట్ర – టీడీపీ సేవామిత్ర యాప్ చేతికి డేటా సెంటర్ సమాచారం: భూమన – డేటా చౌర్యంపై శాసనసభకు ఉపసంఘం మధ్యంతర నివేదిక రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా బయటకు తరలించి 2016–19 మధ్య కాలంలో టీడీపీ సర్కారు డేటా చౌర్యానికి పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయిందని శాసనసభ ఉపసంఘం అధ్యక్షుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న 30 లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు యత్నించారని నిగ్గు తేలిందన్నారు. ఉపసంఘం మధ్యంతర నివేదికను మంగళవారం శాసనసభకు సమర్పించిన అనంతరం ఆయన సభలో మాట్లాడారు. వివిధ శాఖల అధిపతులు, ఇతర అధికారులతో నాలుగుసార్లు సమావేశమై ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లి విచారించినట్లు తెలిపారు. స్టేట్ డేటా సెంటర్లో ఉండాల్సిన ప్రజల సమాచారాన్ని టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ ద్వారా దుర్వినియోగం చేసి ఇతరులను అందజేశారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. టీడీపీకి ఓట్లు వేయని వారి సమాచారాన్ని స్టేట్ డేటా సెంటర్ల ద్వారా సేకరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై మరికొంత మందిని విచారించి సమాచారాన్ని సేకరిస్తామన్నారు. ప్రస్తుతానికి మధ్యంతర నివేదికను శాసనసభకు సమర్పిస్తున్నట్లు తెలిపారు. -
డేటాదొంగ బాబు.. డేరాబాబా కన్నా డేంజర్: మంత్రి రోజా
సాక్షి, అమరావతి: డేటా చోరీపై హౌజింగ్ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికతో టీడీపీ నేతల గుండెలు జారిపోయాయని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజల డేటాను ప్రజాసాధికారత సర్వే పేరుతో.. సేవా మిత్ర యాప్ ద్వారా తెలుగు దేశం నాయకులకు అందించిందని, తద్వారా దుష్టరాజకీయానికి తెర తీసిందని ఆమె మండిపడ్డారు. సభాసంఘం కమిటీ ఇవాళ అసెంబ్లీకి సమర్పించిన మధ్యంతర నివేదికలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ నిర్ధారణ కావడంపై ఆమె స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. ‘హౌజ్ కమిటీ నివేదికపై స్టే తెచ్చుకోకుండా కోర్టుకు వెళ్తే గనుక చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి రోజా జోస్యం పలికారు. ఈ డేటా దొంగ.. డేరాబాబా కన్నా డేంజర్ అనే విషయం అందరికీ స్పష్టం అవుతోందని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ను చంద్రబాబు కొనుగోలు చేశారనే విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ధృవీకరించిన విషయాన్ని మంత్రి రోజా గుర్తు చేశారు. ఓటర్లను తొలగించడమే కాకుండా.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష సభ్యులను బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా లొంగదీసుకునే ప్రయత్నం కూడా జరిగిందని మంత్రి రోజా ఆరోపించారు. నారా లోకేష్ను చూస్తే జాలేస్తోందని, ఎన్టీఆర్గారి మీద లేనిపోని అభిమానం కురిపిస్తూ అన్నాక్యాంటీన్ల మీద రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వం పథకాల పేరుతో దోచుకుందని.. ఇప్పుడు సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాసంక్షేమం గురించి ఆలోచిస్తుందని, లేనిపోని విమర్శలు మాని ఆ పథకాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని ఆమె టీడీపీకి హితవు పలికారు. ఇదీ చదవండి: ఇది టీడీపీ భారీ కుట్రే: ఏపీ అసెంబ్లీ హౌజ్ కమిటీ -
డేటా చోరీ బాధ్యులను విచారణకు పిలిపిస్తాం
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016–19 మధ్య ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి బాధ్యులైనవారిని విచారణకు పిలిపిస్తామని శాసససభ ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి చెప్పారు. డేటా చోరీ, పెగసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కోసం ఏర్పాటుచేసిన శాసనసభ ఉపసంఘం హోం, ఐటీ శాఖలతోపాటు ఇతర అధికారులతో వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం సమావేశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల వ్యక్తిగత డేటా, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడంపై వివరాలు సేకరించింది. గత సమావేశంలో ఉపసంఘం అడిగిన వివరాలను హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులు సమర్పించినట్టు తెలుస్తోంది. అనంతరం ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. దీంతో ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లే ఉంచి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా యత్నించారని చెప్పారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగిలించి అడ్డదారుల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు కుట్రపన్నారని చెప్పారు. ఈ అంశంపై శాసనసభ ఉపసంఘం సమగ్రంగా విచారిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు కోటారు అబ్బయ్యచౌదరి, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
డేటా చోరీ జరిగింది.. అవసరమైతే కొందరిని హౌజ్ కమిటీ ముందుకు పిలుస్తాం: భూమన
సాక్షి, అమరావతి: పెగాసెస్, ఫోన్ ట్యాపింగ్పై హౌజ్ కమిటీ మంగళవారం భేటీ అయ్యింది. చైర్మన్ భూమన కరుణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హౌస్ కమిటీ సభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. హోం, ఐటీశాఖల నుంచి హౌజ్ కమిటీ సమాచారం సేకరించింది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. 2016-2019 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేటు భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలు తీసుకుందని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లను ఉంచి ఇతరుల ఓట్లు తొలగించిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గపు చర్చలు తీసుకుందని మండిపడ్డారు. కావాలనే డేటా దొంగిలించి రాజకీయ లబ్ధి పొందినట్లు స్పష్టత వచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణలో డేటా చోరీ జరిగిందని తెలంగాణ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసిందన్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటాను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిందని విమర్శించారు. డేటా చోరీ జరిగిందన్న భూమన కరుణాకర్రెడ్డి అవసరమైతే కొందరిని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో పార్టీ నియమావళికి సవరణలు -
ఫేస్బుక్ డేటా చోరీపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: దాదాపు 18 నెలల ప్రాథమిక విచారణ అనంతరం సుమారు 5.62 లక్షల మంది భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా వాడుకోవడంపై కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ), గ్లోబల్ సైన్స్ రీసెర్చ్(జీఎస్ఆర్) సంస్థలపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఐపీసీ, ఐటీ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద బ్రిటన్కు చెందిన ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేశామని సీబీఐ వెల్లడించింది. ఫేస్బుక్ వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు అక్రమంగా వినియోగించాయన్న వార్తలపై 2018 జులైలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరపి, సీబీఐ కేసు నమోదు చేసింది. పరిశోధన అవసరాల కోసం కొన్ని వర్గాల వినియోగదారుల సమాచారం ఇవ్వాలని కోరుతూ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ సంస్థ తరఫున అలెక్జాండర్ కోగన్ ఫేస్బుక్ను అభ్యర్థించారు. ఆ ఆనుమతితో ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ పేరుతో ఒక యాప్ను రూపొందించి, ఫేస్బుక్ అనుమతించిన 335 మంది వినియోగదారులతో పాటు అక్రమంగా, వారి స్నేహితుల జాబితాలోని వ్యక్తుల సమాచారం కూడా సేకరించారు. ఆ సమాచారాన్ని ‘కేంబ్రిడ్స్ అనలిటికా’కు అమ్మేశారు. భారత్లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఆ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా ప్రొఫైలింగ్ చేసిందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. అమెరికాలోని వినియోగదారుల సమాచారం మాత్రమే జీఎస్ఆర్ నుంచి తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వానికి కేంబ్రిడ్జ్ ఎనలిటికా తెలిపింది. -
చైనా హ్యాకర్లపై కేసు
వాషింగ్టన్: అమెరికాలోని, పలు ఇతర దేశాల్లోని 100కి పైగా కంపెనీలు, సంస్థల వెబ్సైట్స్ను హ్యాక్ చేసి, సున్నితమైన, విలువైన సమాచారం తస్కరించారని ఆరోపిస్తూ ఐదుగురు చైనా పౌరులపై అమెరికా కేసు నమోదు చేసింది. వారు హ్యాక్ చేసిన వాటిలో భారత ప్రభుత్వ విభాగాలకు చెందిన పలు వెబ్సైట్లు ఉన్నాయి. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఆ చైనా పౌరులకు ఇద్దరు మలేసియన్లు సహకరించారని అమెరికా డెప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ రోజెన్ బుధవారం వెల్లడించారు. ‘భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్ వీపీఎన్ నెట్వర్క్తో అనుసంధానమయ్యేందుకు వారు వీపీఎస్ ప్రొవైడర్ సర్వర్లను ఉపయోగించుకున్నారు. భారత ప్రభుత్వ కంప్యూటర్లలో కోబాల్ట్ స్ట్రైక్ మాల్వేర్ను ఇన్స్టాల్ చేశారు’ అని డెప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ వివరించారు. -
చైనా నుంచి చొరబాట్లు లేవు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల నుంచి గత ఆరునెలల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో పాక్ సరిహద్దుల నుంచి 47 చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నాయని బుధవారం రాజ్యసభకు తెలిపింది. గత మూడేళ్లలో పాక్ నుంచి కశ్మీర్లోకి జరిగిన చొరబాటు యత్నాల సంఖ్య 594 అని, వాటిలో 312 విజయవంతమయ్యాయని వెల్లడించింది. మూడేళ్లలో అక్కడ 582 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయని హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా చైనా సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆ ప్రకటన గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్లను అవమానించడమేనని పేర్కొంది. చైనా దురాక్రమణపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి చేసిన వేర్వేరు ప్రకటనలను వరుసగా ప్రస్తావిస్తూ.. ‘మోదీ ప్రభుత్వం మన సైనికుల పక్షాన ఉందా? లేక చైనా వైపు ఉందా?’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నేడు రాజ్నాథ్ ప్రకటన తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నేడు రక్షణ మంత్రి రాజ్నాథ్ రాజ్యసభలో ప్రకటన చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్నాథ్ ప్రకటన అనంతరం, విపక్ష సభ్యులను మాట్లాడే అవకాశం ఇస్తారని, ఆ తరువాత అవసరమైతే, రాజ్నాథ్ సభ్యుల అనుమానాలకు వివరణ ఇస్తారని వెల్లడించాయి. రాష్ట్రపతి, ప్రధాని కూడా.. చైనా టెక్నాలజీ కంపెనీ డేటా చౌర్యం అంశాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తింది. దాదాపు 10 వేల మంది ప్రముఖుల సమాచారంపై నిఘా వేశారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో, చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న షెంజెన్ కేంద్రంగా ఉన్న ఒక టెక్నాలజీ కంపెనీ 10 వేల మంది భారతీయ ప్రముఖుల డిజిటల్ డేటాను ట్రాక్ చేస్తోందని పత్రికల్లో కథనం వచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ వివరించారు. ఆ ప్రముఖుల్లో భారత రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్, ముఖ్యమంత్రులు ఉండడం షాక్కు గురిచేస్తోందన్నారు. డేటా చౌర్యంపై నిపుణుల కమిటీ భారత్లోని దాదాపు 10 వేల మంది ప్రముఖులపై చైనా టెక్నాలజీ సంస్థ నిఘాపెట్టి డేటా చౌర్యం చేస్తోందన్న ఆరోపణలపై కేంద్రం ఒక నిపుణుల కమిటీని నియమించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ నేతృత్వంలో ఈ కమిటీ ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారిస్తుంది. -
చైనా వక్రబుద్ధి; భారత ప్రముఖులపై నిఘా!
సాక్షి, న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు రోజురోజుకు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్పై గూఢచర్య కుట్రలకు చైనా పాల్పడుతున్నట్టు వెల్లడైంది. షెన్జెన్ ఆధారిత టెక్నాలజీ సంస్థ ‘జెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కో లిమిటెడ్ సంస్థ’ చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉంది. ఈ సంస్థ భారతదేశంలోని 10,000 మందికి పైగా సంస్థలపై ఒక కన్నేసి వుంచిన్నట్లు తెలుస్తోంది. 'హైబ్రిడ్ వార్ఫేర్', 'చైనా దేశ గొప్ప పునరుజ్జీవనం' కోసం పెద్ద డేటాను ఉపయోగిస్తున్నట్లు తనని తాను అభివర్ణించుకుంది. 1400 భారతీయ కంపెనీలు జెన్హువా డేటాబేస్లో ఉన్నాయి. ఈ సంస్థ ట్రాక్ చేస్తున్న వారిలో ప్రముఖ కంపెనీలు నైకా, ఉబెర్ ఇండియా, పేయు, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గి సంస్థల అధినేతలు, వ్యవస్థాపకులు ఉన్నారు. భారతదేశంలో జరుగుతున్న అనేక చెల్లింపు, విద్య, డెలివరీ అనువర్తనాలు కూడా చైనా పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనేక మంచి స్టార్టప్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫాంలు కూడా చైనా పరిశీలనలో ఉన్నట్టు వెల్లడైంది. డెలివరీ యాప్లు బిగ్బాస్కెట్, డైలీ బజార్, జాప్ఫ్రెష్, ఫ్రెష్ మీట్ మార్కెట్, జోమాటో, స్విగ్గి, ఫుడ్పాండా, ఆన్లైన్ మాంసం డెలివరీ ప్లాట్ఫాంలను కూడా చైనా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఇతర కేంద్రమంత్రులు, ప్రముఖ సంస్థల సీఈఓలు, సీఎఫ్ఓల కదలికలపై చైనా కంపెనీ కన్నేసినట్టు అర్థమవుతోంది. చదవండి: నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్ -
భారత్పై చైనా మరో మహా కుట్ర
-
చైనా దొంగదెబ్బ : భారత్పై మరో కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా భారత్ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. సరిహద్దుల్లో భారత సైనిక శౌర్యాన్ని ఎదిరించలేని డ్రాగాన్ దొంగదెబ్బ తీసేందుకు కుట్రపన్నింది. ఓ వైపు ఇరుదేశాల సరిహద్దుల నడుమ ఉద్రిక్త పరిస్ధితులు ఉన్న తరుణంలోనే దేశంలోని ప్రముఖ నేతలపై రహస్యంగా నిఘా పెట్టి సాంకేతిక యుద్ధానికి తెరరేపింది. దేశంలోని 10వేల మంది ప్రముఖలు, భారత్కు చెందిన కీలక సంస్థలపై చైనా గూడాచార విభాగం నిఘా పెట్టింది. ఈ మేరకు ఓ జాతీయ పత్రిక సోమవారం సంచలన కథనాన్ని ప్రచురించింది. (చైనా చిత్తశుద్ధి ప్రదర్శించాలి) నిఘా సంస్థలతో చైనా ఒప్పందం వివరాల ప్రకారం.. భారత్ను దొంగ దెబ్బ తీసేందుకు జిత్తుల మారి చైనా మరోసారి బరితెగించింది. సరిహద్దుల్లో తన కుట్రలు విచ్చిన్నం కావడంతో ఏకంగా దేశ నేతలు, ప్రముఖలపై నిఘా పెట్టింది. చైనా నిఘా నీడలో భారత రాష్ట్రపతి, ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు అన్ని రాష్ట్రాల మంత్రులు, మాజీ సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు ఉన్నట్లు జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనాకు చెందిన షేక్జేన్ అనే గూఢాచర సంస్థతో ఆ దేశ నిఘా విభాగం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా భారత్కు చెందిన ప్రముఖుల సమాచారాన్ని తస్కరించేందుకు మరికొన్ని రహస్య కంపెనీలతో చైనా నిఘా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. (భారత్తో కయ్యం చైనా పన్నాగమే) మోదీ.. సోనియాలపై నిఘా భారత్లోని ప్రముఖ రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక, మీడియా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సాంకేతికరంగంలోని ముఖ్యల వివరాలను సేకరించే పనిలో రసహ్య కంపెనీలు ఇప్పటికే బిజీగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ఆర్మీ అధికారుల సమాచారాన్ని సైతం తెలుసుకునే విధంగా చైనా ఓ ప్రత్యేక విభాగాన్ని తయారుచేసిందని ఆ పత్రిక స్పష్టం చేసింది. సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలతో మొదలు దేశ రహస్యాలనే చేరవేసేందుకు కుట్రలు పన్నినట్లు పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సోనియా, రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జై శంకర్ల డేటాను చోరీ చేయాలని డ్రాగన్ వ్యూహరచన చేసినట్లు వెల్లడించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన కథనం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరుణంలోనే చైనా కుట్ర బయటపడటం కలకలం రేపుతోంది. చైనా దురాగతాలు, సరిహద్దుల్లో ఆక్రమణలపై పార్లమెంట్లో చర్చించాలని ఇదివరకే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ చైనా తీరు మార్చుకోకపోవడంతో భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిఘా ఎలా? చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెన్జెన్లోని టెక్నాలజీ కంపెనీ షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ ద్వారా భారత ప్రముఖులపై రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తోందని ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ప్రముఖుల డేటాపై నిఘా ఉంచడానికి ప్రత్యేకంగా ఓవర్సీస్ కీ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ (ఓకేఐడీబీ) ఆ సంస్థ అభివృద్ధి చేసినట్లు తెలిపింది. షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకు చైనా కమ్యూనిస్టు పార్టీ, ఆ దేశ ప్రభుత్వంతో నేరుగా సత్ససంబంధాలు ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై ఆరా తీయడానికి బిగ్ డేటా టూల్స్ను వినియోగించి రెండు నెలల పాటు ఇన్వెస్టిగేట్ చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. -
యాప్స్ బ్యాన్: డేటా చోరి ఆగుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చెలరేగిన అలజడి, భారతీయ యూజర్ల ప్రైవసీ, భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్, చైనాకు చెందిన 59 యాప్స్పై నిషేధం విధించింది. ఈ యాప్స్ను తయారుచేసిన డెవలపర్స్కు అందరికీ చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయి. కానీ, ఇక్కడితో చైనా ముప్పు తొలగిపోలేదు. అనుమానిత లిస్టులో లేని వాటి నుంచి భద్రతాపరమైన ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ‘బ్లోట్వేర్’ప్రథమ స్థానంలో నిలుస్తుంది.(వెనుదిరిగేందుకు ఇంకొంతకాలం) బ్లోట్వేర్ కొన్ని మొబైల్ ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ చేసి ఇచ్చే యాప్స్ సిస్టంను బ్లోట్వేర్ అంటారు. వీటిని తీసేయడం కానీ, అన్ఇన్స్టాల్ కానీ, డిజేబుల్ కానీ చేయలేం. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ యాప్స్ను రెవెన్యూ కోసం మొబైల్ తయారుచేసే సంస్థలు ఇన్స్టాల్ చేస్తాయి. కొన్ని కంపెనీలు తక్కువ ధరకే ఫోన్లు అమ్ముతూ, థర్డ్ పార్టీ యాప్స్ను వాటిలో ఇన్స్టాల్ చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. చాలా చైనా కంపెనీలు మొబైల్స్ ఇలానే చేస్తున్నాయి. షావోమి ఇందుకు ఓ చక్కని ఉదాహరణ. 2018లో ఈ కంపెనీ తన ఆదాయంలో 9.1 శాతాన్ని మొబైల్స్లో ప్రీ ఇన్స్టాల్ చేసిన యాప్స్, సర్వీసుల ద్వారా రాబట్టింది. శాంసంగ్ తదితర కంపెనీలు కూడా ఇలాంటి బిజినెస్ మోడల్ను అనుసరించాయి. అయితే, తక్కువ ధర కలిగిన మొబైల్స్లో మాత్రమే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ను ఉంచుతున్నాయి. కొంపముంచుతున్న తక్కువ ధర! అతి తక్కువ ధరకే ఫోన్లు వస్తున్నాయని కొనేస్తున్న వినియోగదారులు మరో రూపంలో మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఫోన్లోని స్పేస్ను, బ్యాటరీని తినేయడం ఒక ఎత్తైతే, సెక్యూరిటీ పరంగా ఈ యాప్స్ చాలా డేంజర్. ఇవి నిరంతరం యూజర్ డేటాను ఊహించని రీతిలో కలెక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా వినియోగదారుడి సమాచారాన్ని మిస్ యూజ్ చేసేందుకు ఆస్కారం ఏర్పడుతోంది.(వాణజ్య శాఖతో పీఎంఓ సంప్రదింపులు) ఈ సమస్యపై పాలసీల్లోగానీ, అకడమిక్ సర్కిల్స్లో గానీ పెద్దగా పట్టింపులేకపోవడం ఆశ్చర్యం. ఐఎమ్డీఈఏ నెట్వర్క్స్ ఇనిస్టిట్యూట్లో‘ప్రీ ఇన్స్టాల్డ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్’పై పబ్లిష్ అయిన ఓ రీసెర్చ్ పేపర్ ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్లతో వచ్చే పెద్ద చిక్కులను వెలుగులోకి తెచ్చింది. ఏ డేటాను సేకరిస్తున్నాయి? ప్రీఇన్స్టాల్డ్ యాప్స్కు మరే ఇతర యాప్స్కు లేని ఫీచర్స్ను యాక్సెస్ చేసే అనుమతి ఉంటుంది. దీనివల్ల యాప్స్ను ఇన్స్టాల్ చేసి ఇచ్చిన వారు ఎప్పుడైనా వీటి ద్వారా యూజర్లకు చెందిన సున్నితమైన సమాచారాన్ని చూడగలిగే అవకాశం ఉంటుందని రీసెర్చ్ పేపర్ వెల్లడించింది. వీటిలో లొకేషన్, మిగతా యాప్స్ సమాచారం, పర్సనల్ విషయాలు తదితరాలు ఉంటాయని తెలిపింది. కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ను రూట్నిక్ అనే థర్డ్ పార్టీ లైబ్రరీతో జతపరిచి ఉంచుతున్నారని, ఫలితంగా యూజర్ల సమాచారం తస్కరణకు గురవుతుందని చెప్పింది. ప్రీ–ఇన్స్టాల్డ్ యాప్స్ను ఆపేదెలా? సరైన డేటా ప్రొటెక్షన్ చట్టం లేకపోవడం వల్లే యాప్స్ను రెగ్యులేట్ చేయలేకపోతున్నామని రీసెర్చ్ పేపర్ తెలిపింది. మొబైల్ తయారీ కంపెనీలు రకరకాల చిన్న సంస్థలతో కూడి పని చేస్తుండటం వల్ల ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ను ఎవరు తయారు చేస్తున్నారన్న విషయాన్ని కనిపెట్టడం కష్టతరం అవుతోందని చెప్పింది. దక్షిణ కొరియా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ను నిషేధించినట్లు వివరించింది. ఈ మేరకు తయారీదారులకు ఆంక్షలు పెట్టిందని వెల్లడించింది. దీని వల్ల ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ను డిలీట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారుడికి కలుగుతుంది. వైఫై కనెక్టవిటీ, ఎన్ఎఫ్సీ, కస్టమర్ సర్వీసు యాప్, ప్లే స్టోర్లను మాత్రమే డిలీట్ ఆప్షన్ లేకుండా రిలీజ్ చేసేందుకు అంగీకారం తెలిపింది. చైనా కూడా దక్షిణ కొరియా బాటలోనే నడుస్తోంది. అమెరికా, యూరప్లలో మాత్రం ఇలాంటి రూల్స్ ఏవీ లేవు. కానీ వాటికి బలమైన డేటా ప్రొటెక్షన్ చట్టాలు ఉన్నాయి. ఇండియా ఏం చేయాలి? ఇండియాలో ప్రస్తుతం ఎలాంటి డేటా ప్రొటెక్షన్ చట్టాలు లేవు. ఫలితంగా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వల్ల భారతీయులకు పెనుప్రమాదం పొంచి ఉంది. దక్షిణ కొరియాను పోలిన చర్యలు మన దేశంలోనూ అమల్లోకి తేవాలి. మొబైల్ యాప్స్ పనితీరుపై అవగాహన తక్కువగా ఉన్న సగటు భారతీయుడికి డిలీట్ ఆప్షన్ సరిపోదు. అందుకే యూజర్ల నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు, దాన్ని ఎవరెవరితో పంచుకుంటున్నారన్న దానిపై మొబైల్ తయారీదారుల నుంచి సమాచారం రాబట్టాలి. దీని వల్ల ఏయే యాప్స్ను వాడాలన్న దానిపై వినియోగదారులకు అవగాహన కలుగుతుంది. -
వ్యక్తిగత గోప్యతకు గట్టి చర్యలు
న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్న భారత్ ప్రభుత్వ వైఖరికి కట్టుబడి ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్ తెలిపింది. ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఎన్ఎన్వో గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్తో భారత్లోని జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల సమాచారాన్ని గుర్తు తెలియని సంస్థలు తస్కరించాయంటూ వాట్సాప్ చేసిన ప్రకటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం.. ఈ వ్యవహారంతోపాటు, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకున్న చర్యలపై 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్ను ఆదేశించింది. దీనిపై వాట్సాప్ ప్రతినిధి స్పందిస్తూ...‘పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను పరిరక్షించాల్సి ఉందన్న భారత ప్రభుత్వ ప్రకటనతో ఏకీభవిస్తున్నాం. సైబర్ దాడులపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం. యూజర్ల సమాచార పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు. అయితే, ఇటీవల పలుమార్లు జరిగిన చర్చల సందర్భంగా ఫోన్ హ్యాకింగ్ విషయాన్ని వాట్సాప్ వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలను మూడు నెలల్లోగా వివరించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హమన్నారు. -
‘వాట్సాప్’లో ‘గూఢాచోరులు’ ఎవరు?
న్యూఢిల్లీ : దేశంలోని 17 మంది మానవ హక్కుల కార్యకర్తలు, దళిత కార్యకర్తలు, జర్నలిస్టుల ‘వాట్సాప్’ ఖాతాలపై ఇజ్రాయెల్లోని ‘ఎన్ఎస్ఓ’ టెక్నాలజీ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ‘పెగాసస్’ సాఫ్ట్వేర్తో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిఘా కొనసాగిస్తున్నారనే విషయం గురువారం వెలుగులోకి రావడం అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక్క వాట్సాప్ సందేశాలను మాత్రమే తస్కరించడం లేదు. వాట్సాప్ ఫోన్ కాల్స్ను వింటున్నారు. రికార్డు చేస్తున్నారు. పెగాసస్ సాఫ్ట్వేర్కున్న శక్తి సామర్థ్యాల ప్రకారం ఫోన్లోని పాస్వర్డ్లను, ఫొటోలను, వీడియోలను కూడా తస్కరించవచ్చు. కేవలం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, డిజిటల్ చెల్లింపుల యుగంలో పౌరులను ఆర్థికంగా కొల్లగొట్టేందుకు, ఇతర విపరీత పరిణామాలకు దారితీయగల ఈ ‘గూఢచర్య’ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? డేటా భద్రత వైఫల్యంపై ఆందోళన చెందుతున్నామని, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కేంద్రానికి అందజేయాల్సిందిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘వాట్సాప్’ యాజమాన్యాన్ని కోరారు. ఆయన మాటలకు అర్థం కేంద్ర ప్రభుత్వానికిగానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకుగానీ సంబంధం లేదని చెప్పడం. మరి పౌరులపై నిఘా కొనసాగించాల్సిన అవసరం ఎవరికుంది? ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరానికి సమీపంలో 2010లో ఏర్పాటయిన ఈ ఎన్ఎస్ఓ సంస్థ పెగాసస్ అనే ‘స్పైవేర్’ను తానే విక్రయించినట్లు ఒప్పుకుంది. అయితే ఎవరికన్నది స్పష్టంగా చెప్పకపోయినా తాను ప్రభుత్వ సంస్థలకు తప్ప మరెవరికీ ఇలాంటి సాఫ్ట్వేర్ను విక్రయించడం లేదని చెప్పింది. ఆ సంస్థ 2016 నిర్ణయించిన ధరల పట్టిక ప్రకారం పది మంది యూజర్ల డేటాపై నిఘా కోసం పెగాసస్ సాఫ్ట్వేర్ ధరను ఒక మిలియన్ డాలర్లు. ఆ నిఘాను మరో పది మందికి పెంచాలంటే మరో రేటును చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వైరస్లాగా ఇది నెట్వర్క్ అంతటికి వ్యాపించకుండా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. మిస్సిడ్ కాల్ ద్వారా వాట్సాప్లోకి స్పైవేర్ ప్రవేశిస్తుంది. పది మందిపై నిఘాకే దాదాపు ఏడు కోట్ల రూపాయలను వెచ్చించి ప్రైవేటు వ్యక్తులు ఎవరు కొనుగోలు చేస్తారు? ఎన్ఎస్ఓ ప్రకారం ప్రభుత్వ సంస్థ అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సీబీఐ, లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని నేర పరిశోధనా సంస్థనో అయ్యి ఉండాలి. నిఘా నీడలో మానవ హక్కుల కార్యకర్త బేలా బాటియా, బీబీసీ మాజీ జర్నలిస్ట్ సుభ్రాన్షు చౌధరి తదితరులు సామాజిక నేపథ్యం చూస్తే ఎవరు నిఘా వహించారో, ఆ గూఢాచోరులు ఎవరు ఇట్టే తెలిసిపోతుంది. (చదవండి: వాట్సాప్ డేటాపై ‘పెగాసస్’ గురి) -
వాట్సాప్ డేటాపై ‘పెగాసస్’ గురి
న్యూఢిల్లీ: వాట్సాప్లో భారత్కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్’అనే స్పైవేర్ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ గురువారం వాట్సాప్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా 1,400 మందిని లక్ష్యంగా చేసుకుని సమాచార చోరీ జరిగినట్లు గుర్తించింది. ఇందుకు సంబంధించి ఎన్ఎస్వో కంపెనీపై అమెరికాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంతోపాటు, భారతీయ యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు తీసుకుంటున్న చర్యలను ఈ నెల 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్ను కేంద్రం ఆదేశించింది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో అనే నిఘా సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్ను గుర్తు తెలియని సంస్థలకు అప్పగించిందని, దీని సాయంతో నాలుగు ఖండాల్లోని సుమారు 1,400 మంది దౌత్యాధికారులు, రాజకీయ అసమ్మతివాదులు, జర్నలిస్టులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు చెందిన ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని వాట్సాప్ తెలిపింది. భారత్లో బాధితుల వివరాలు తెలిపేందుకు నిరాకరించింది. దీనిపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఎన్ఎస్వో గ్రూప్పై వాట్సప్ కేసు వేసింది. హక్కుల లాయర్ నిహాల్ సింగ్ రాథోడ్, ఛత్తీస్గఢ్కు చెందిన కార్యకర్త షాలిని గెరా, బీబీసీ మాజీ జర్నలిస్టు సుభ్రాన్షు చౌధరి తదితరులు బాధితులమంటూ ప్రకటించారు. ఉగ్రవాదం నేరాలపై పోరాడేందుకు గుర్తింపు పొందిన ప్రభుత్వ నిఘా సంస్థలకే ఈ సాంకేతికతను అందజేస్తున్నట్లు ఎన్ఎస్వో సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల వాట్సాప్ వినియోగదారుల్లో భారత్లో 40 కోట్ల మంది ఉన్నారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలను నేరస్తులుగా అనుమానిస్తూ మోదీ ప్రభుత్వం చేపట్టిన గూఢచర్యం తేటతెల్లమయిందని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్నే బాధ్యునిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును కోరింది. -
సైబర్ మోసాలపై టెకీల పోరు
బెంగళూరు: సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ట్రావెల్ సేవల సంస్థలు మేక్మైట్రిప్ గ్రూప్, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్.. మొబైల్ చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలతో పాటు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ మొదలైనవి ఇందుకోసం జట్టు కట్టాయి. సైబర్ మోసాల తీరుతెన్నులు, నివారణ తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు ఈ సంస్థలు గతవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కూడా సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసపూరిత టోల్ ఫ్రీ నంబర్లు మొదలైన మార్గాల్లో మోసాలు జరుగుతున్న తీరును అవి వివరించినట్లు పేర్కొన్నాయి. అమాయక కస్టమర్లను మోసగించేందుకు ఉపయోగిస్తున్న 4,000 పైచిలుకు సిమ్ కార్డు నంబర్లు, 350–400 దాకా బ్యాంకు ఖాతాల వివరాలను రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం కంపెనీలకు కూడా అందించినట్లు వివరించాయి. అటు నకిలీ టోల్ ఫ్రీ నంబర్లు పేజీలో ప్రముఖంగా పైన కనిపించే విధంగా నేరగాళ్లు ఏ విధంగా సెర్చి ఇంజిన్ను దుర్వినియోగం చేస్తున్నదీ టెక్ దిగ్గజం గూగుల్కు కూడా ఆయా టెక్ దిగ్గజాలు తెలియజేశాయి. సాధారణంగా ఇలా సెర్చి ఇంజిన్ పేజీలో పైన ప్రముఖంగా కనిపించే నకిలీ టోల్ ఫ్రీ నంబర్లను వినియోగదారులు అసలైనవిగా భావించి.. మోసాల బారిన పడుతున్న ఉదంతాలు అనేకం నమోదవుతున్నాయి. ఎస్బీఐకు లేఖ.. గత కొద్ది వారాలుగా ఈ ఇంటర్నెట్ కంపెనీలు.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం రంగానికి చెందిన ఎయిర్టెల్ తదితర సంస్థలతో కూడా సమావేశాలు జరుపుతున్నాయి. ప్రభుత్వ రంగంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఆన్లైన్ కంపెనీలు లేఖ రాశాయి. ఎస్బీఐ ఖాతాలను ఉపయోగించి భారీ స్థాయిలో జరుగుతున్న సైబర్ మోసాల గురించి తెలియజేశాయి. అమాయక ఖాతాదారులను మోసగించేందుకు.. కీలకమైన వారి అకౌంట్ల వివరాలను తెలుసుకునే నేరగాళ్లు చాలామటుకు ఎస్బీఐ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు వివరిం చాయి. ఎస్బీఐ భారీ బ్యాంకు కావడంతో ఇలాంటి వారిని పట్టుకోవడం కష్టతరం కావొచ్చని టెక్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ మోసాలను అరికట్టడానికి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ సంస్థలతో జట్టు కట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసాలు ఇలా.. ఎక్కువగా పట్టణేతర ప్రాంతాల వారు, సీనియర్ సిటిజన్లు ఇలాంటి సైబర్ నేరాల బారిన పడుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఖాతాగా భ్రమింపచేసే అకౌంటు నుంచి ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. సిసలైన కంపెనీగా కనిపించినప్పటికీ.. ఇలాంటి పోర్టల్ పేర్లలో ఎక్కడో ఒకటో అరా తేడాలుంటున్నాయి. ఉదాహరణకు.. మేక్మై ట్రిప్ పోర్టల్ వంటి పోర్టల్స్ పేర్లలో నకిలీ సైట్లు అదనంగా మరో అక్షరం చేరుస్తున్నాయి. ఆకర్షణీయ బహుమతుల ఆఫర్లతో తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇలాంటి మెసేజ్లను వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆయా లింక్లపై క్లిక్ చేయడం ద్వారా మోసాల బారిన పడుతున్నారు. -
యాపిల్ ఛార్జింగ్ కేబుల్తో డాటా చోరీ..!
సాన్ఫ్రాన్సిస్కో: ఈ వార్త చదివాక ఇక మీదట వేరే వారికి డాటా కేబుల్ ఇవ్వాలన్నా.. తీసుకోవాలన్నా కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే.. చార్జింగ్ కేబుల్స్ కూడా డాటాను చోరీ చేస్తున్నాయట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం అంటున్నాడో హ్యాకర్. ఇప్పటికే అవసరం నిమిత్తం కొన్ని.. అలవాటుగా కొన్ని యాప్స్ని మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకుని.. మన వ్యక్తిగత సమాచారాన్ని మూడో వ్యక్తికి అందజేస్తున్నాం. చార్జింగ్ కేబుల్ కూడా ఇదే పని చేస్తుందంటున్నాడు సదరు హ్యాకర్. చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. యాపిల్ యూఎస్బీ కేబుల్తో ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించాడు. దీని గురించి సదరు హ్యాకర్ వివరిస్తూ.. ‘ఈ కాలంలో చాలా మంది ఫ్లాష్ డ్రైవర్స్ని వారి డివైజ్కి కనెక్ట్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. అదే చార్జింగ్ కేబుల్ దగ్గరకు వచ్చే సరికి ఇలాంటి అనుమానాలేవి కలగవు. కానీ చార్జింగ్ కేబుల్ కూడా మీ డాటాను చోరీ చేస్తుంది. ఓ.ఎంజీ కేబుల్గా పిలవబడే యాపిల్ యూఎస్బీ లైటెనింగ్ కేబుల్ చూడ్డానికి సాధరణ చార్జింగ్ కేబుల్లానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ కేబుల్ని మీ డివైజ్కు కనెక్ట్ చేశారనుకోండి. వితిన్ వైఫై రేంజ్లో హ్యాకర్ మీకు తెలియకుండా మీ డివైస్లోకి హానికరమైన పేలోడ్స్ని వైర్లెస్గా పంపించగల్గుతాడు’ అని వివరించాడు. ‘ఈ చార్జింగ్ కేబుల్లో ఉండే కమాండ్స్, స్క్రిప్ట్స్, పేలోడ్స్ను ఉపయోగిస్తూ.. హ్యాకర్ మీ వ్యక్తిగత డాటాను చోరీ చేస్తాడు. అంతేకాదు ఒకసారి ఈ కేబుల్ను మీ సిస్టంకు కనెక్ట్ చేశారంటే.. అటాకర్ ఆటోమెటిగ్గా మీ కంప్యూటర్ను లాగాఫ్ చేయడం.. ఆ తర్వాత మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్ను కూడా తస్కరించడానికి అవకాశం ఉంది’ అంటున్నాడు సదరు హ్యాకర్. మరి దీనిపై యాపిల్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. -
టీ సర్కార్ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేస్తోంది
సాక్షి, హైదరాబాద్: ‘సమగ్ర వేదిక’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పౌరులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను అధికారికంగా అనుసంధానం చేయడంపై దర్యాప్తు చేస్తామని కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి కిషన్రెడ్డి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రావణ్ దాసోజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వేదిక పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, గోప్యంగా ఉండాల్సిన వివరాల్ని సేకరించి రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించిందని, డేటా గోప్యత రక్షణ చట్టం-2017, ఐటీ యాక్ట్లనే కాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని సైతం ఉల్లంఘించిందని ఫిర్యాదు చేశారు. అధికారిక డేటాను రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపించారు. గత నెల 5న హైదరాబాద్లో జరిగిన ఐసీఏఐ జాతీయ సదస్సులో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ’సిటిజెన్ 360’ పేరిట సేకరించిన వివరాలను తెలియజేయడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. వివిధ విభాగాల ద్వారా పౌరులకు సంబంధించిన ప్రైవేట్ డేటా సేకరించినట్లు జయేశ్ రంజన్ అంగీకరించారని వారు ఆరోపించారు. ‘జయేశ్ రంజన్ చేసిన ప్రకటన ద్వారా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా రహస్యంగా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని తేలింది. ప్రజల అనుమతి లేకుండా ఈ విధంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం చట్టాలను ఉల్లంఘించడమే’ అని శ్రవణ్ తెలిపారు. వ్యక్తుల వ్యక్తిగత, రహస్య డేటా సేకరణ చేయడం చట్టవ్యతిరేకమని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డాక్టర్ శ్రవణ్ కేంద్ర మంత్రిని కోరారు. ఏ ఏజెన్సీ ద్వారా ఈ డేటాను సేకరించారో వెల్లడించలేదని, ఆ ఏజెన్సీ దగ్గర డేటా గుట్టుగా ఉండదనే గ్యారెంటీ ఏముంటుందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యక్తిగత ఈమెయిల్స్, పాస్వర్డ్లు, మొదలైవన్నింటినీ, పౌరుల ప్రతి డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం సేకరించిందని స్పష్టం అవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌరుల సమాచారాన్ని గుట్టుగా సేకరించిన ప్రభుత్వం డేటాను ఎందుకు సేకరించిందో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఈ విధంగా చేయడం పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని, రాజ్యాంగం 14, 21 అధికరణాల కింద పౌరుల కల్పించిన హక్కులకు ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించిందని శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో ఐటి గ్రిడ్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయాన్ని డాక్టర్ శ్రవణ్ గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ’సేవామిత్ర’ అనే యాప్ పేరుతో రాజకీయ అవసరాల కోసం టీడీపీ డేటా సేకరించిందన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ‘సిటిజన్-360 ‘ని దుర్వినియోగం చేయట్లేదని గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ కేసులో నిందితులపై కేసులు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మాత్రం అదే తరహా నేరానికి పాల్పడి పౌరుల డేటాను చోర్యం చేస్తున్నట్లు అనుమానాలున్నాయియని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం విచారణ జరపాలని, లేకపోతే, తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని శ్రవణ్ విలేకరులతో తెలిపారు. -
కంపెనీలకు డేటా చోరీ కష్టాలు
న్యూఢిల్లీ: డేటా చోరీ, ఉల్లంఘనలు వ్యాపార సంస్థలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో డేటా ఉల్లంఘనల కారణంగా దేశీ సంస్థలు సగటున రూ. 12.8 కోట్ల మేర నష్టపోయాయి. టెక్ దిగ్గజం ఐబీఎం కోసం పోనిమాన్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2018 జూలై నుంచి 2019 ఏప్రిల్ మధ్య కాలంలో 500 పైగా సంస్థల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం అంతర్జాతీయంగా డేటా చౌర్య నష్టాలు సగటున 3.92 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 27.03 కోట్లు)గా ఉన్నాయి. సగటున దేశీయంగా 35,636 రికార్డుల డేటా ఉల్లంఘన జరుగుతోంది. అంతర్జాతీయంగా ఈ సగటు 25,575 రికార్డులుగా ఉంది. డేటా ఉల్లంఘన వల్ల చట్టపరమైన, నియంత్రణ నిబంధనలపరమైన వ్యయాలు మొదలుకుని బ్రాండ్ పేరు దెబ్బతినడం, కస్టమర్లు ఇతర సంస్థలకు మళ్లడం, ఉద్యోగుల ఉత్పాదకత తగ్గిపోవడం దాకా వివిధ రూపాల్లో ఉండే నష్టాలను ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకున్నారు. ‘భారత్లో సైబర్ నేరాల తీరుతెన్నుల్లో పెను మార్పులు వస్తున్నాయి. నేరగాళ్లు కూడబలుక్కుని ఒక పద్ధతిలో చేసే ధోరణులు పెరుగుతున్నాయి. దీంతో డేటా చౌర్యం కారణంగా వాటిల్లే నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి‘ అని ఐబీఎం ఇండియా/దక్షిణాసియా సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లీడర్ వైద్యనాథన్ అయ్యర్ పేర్కొన్నారు. మూడింటిపై దృష్టి పెట్టాలి.. డేటా చౌర్య ముప్పు నేపథ్యంలో వ్యాపార సంస్థలు సైబర్ సెక్యూరిటీపరంగా ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని అయ్యర్ చెప్పారు. వ్యాపార లక్ష్యాలకు పొంచి ఉండే రిస్కులను మదింపు చేసుకోవడం, ముప్పులను సమర్ధంగా ఎదుర్కొనే వ్యవస్థను రూపొందించుకోవడం, డిజిటల్ విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు తీసుకోవడంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందని వివరించారు. డేటా ఉల్లంఘనలకు ఎక్కువగా క్రిమినల్ దాడులు (51 శాతం), సిస్టమ్లో లోపాలు (27 శాతం), మానవ తప్పిదాలు (22 శాతం) కారణంగా ఉంటున్నాయని నివేదికలో వెల్లడైంది. డేటా ఉల్లంఘనలను గుర్తించేందుకు పట్టే సమయం సగటున 188 రోజుల నుంచి 221 రోజులకు పెరిగింది. అయితే ఉల్లంఘనలను నియంత్రించేందుకు పట్టే సమయం 78 రోజుల నుంచి 77 రోజులకు తగ్గింది. డేటా ఉల్లంఘనల కారణంగా అత్యధికంగా నష్టపోయిన సంస్థల్లో వరుసగా తొమ్మిదో ఏడాది కూడా హెల్త్కేర్ సంస్థలే నిల్చాయి. డేటా చౌర్య ప్రభావాలు కొన్ని సందర్భాల్లో అనేక సంవత్సరాల పాటు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది. -
ఐటీ గ్రిడ్స్ స్కాం : అశోక్కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్కు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒక రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆశోక్ను ఆదేశించింది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్పై సంజీవ్రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ అశోక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డాటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అశోక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను న్యాయస్థానం జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే రంగారెడ్డి కోరక్టు ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో అశోక్, అతని భార్య శ్రీ లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కేసుల రద్దు కోసం ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం , ముంబై , బెంగళూరులో అతని కోసం గాలిస్తున్నారు. -
డేటా దొంగలకు ఢిల్లీ లింక్!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు దీర్ఘకాలిక పన్నాగాన్ని పక్కాగా అమలు చేసినట్లు అధికార వర్గాలు గుర్తించాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించినట్లు విశ్వసనీయ సమాచారం. అందువల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల సమాచారాన్ని అంత పక్కాగా తస్కరించగలిగారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2015 నుంచే పన్నాగం... 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం టీడీపీ గుప్పిట్లోకి వచ్చేలా 2015లోనే చంద్రబాబు పథక రచన చేశారు. ముందస్తు వ్యూహంతోనే ఆధార్ అథారిటీ ఛైర్మన్గా ఉన్న జె.సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వ ఈ–గవర్నెన్స్, ఐటీ సలహాదారుగా నియమించడం గమనార్హం. ఇలా జోడు పదవుల్లో ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబు లెక్క చేయలేదు. టీడీపీ కార్యాలయానికి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రజాసాధికార సర్వే నిర్వహించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. దాన్ని రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్(ఆర్టీజీఎస్) ద్వారా టీడీపీకి అనుబంధంగా పని చేస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరవేసింది. సాధికారిక సర్వేలో సేకరించిన సమాచారాన్ని మించి ప్రజల వ్యక్తిగత వివరాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా 2019 ఎన్నికల్లో ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహం రచించింది. తెలంగాణ ప్రజల సమాచారం ఏపీ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. అనుకున్న విధంగానే ఢిల్లీలోని ఆధార్ అథారిటీ నుంచి టీడీపీకి పూర్తి స్థాయిలో సహకారం లభించినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా టీడీపీకి చేరవేశారు. పేర్లు, చిరునామా, బ్యాంకు ఖాతాలు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలు ఇలా మొత్తం వ్యక్తిగత సమాచారం అనధికారికంగా టీడీపీ కార్యాలయానికి చేరిపోయింది. సైబర్ నేరాలకు ఊతం తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు చేరడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో శాస్త్రవేత్తలు, రక్షణ పరిశోధనా సంస్థలు, త్రివిధ దళాల అధికారులు, సిబ్బంది వివరాలు కూడా ఉండటంతో ఈ వ్యవహారం అత్యంత సున్నితంగా మారింది. ఇది సైబర్ నేరాలకు ఊతమివ్వడంతోపాటు దేశ రక్షణకు ప్రమాదకరంగా మారిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శత్రు దేశాలకు ఈ సమాచారం చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి లోకేష్తో అశోక్ (ఫైల్) ఇంటి దొంగల హస్తం! ప్రజల వ్యక్తిగత సమాచారం అనధికారిక వ్యక్తుల చేతికి చిక్కడం అంటే పార్లమెంటులో చేసిన ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆధార్ సమాచారం బయటకు పొక్కడంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అథారిటీ రంగంలోకి దిగి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆధార్ అథారిటీ డేటా చోరీపై ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు అంతర్గత విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వేగవంతం.. డేటా చోరీపై తెలంగాణా పోలీసుల దర్యాప్తుతోపాటు ఆధార్ అథారిటీ అంతర్గత విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆధార్ అథారిటీ, పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. డేటా తస్కరించిన పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఈఏఎస్ శర్మ,, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరడం వెనుక ఆధార్ అథారిటీ పెద్దల పాత్ర కచ్చితంగా ఉంటుందని కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఆధార్ అథారిటీ అధికారుల పాత్ర లేకుండా కీలక సమాచారం అనధికారిక వ్యక్తుల చేతుల్లోకి చేరడం అసంభవమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన కేంద్ర ఐటీ శాఖకు ఓ లేఖ రాశారు. ఆధార్ అథారిటీ చైర్మన్గా ఉన్న జె.సత్యనారాయణను ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను గతంలోనే కేంద్ర ఐటీ శాఖకు లేఖ రాసినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ సత్యనారాయణ నియామకాన్ని పునఃసమీక్షించకపోవడాన్ని తప్పుబట్టారు. ఐటీ గ్రిడ్స్తోపాటు ఆధార్ అథారిటీ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన రాజకీయ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆధార్ అథారిటీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా సర్వర్లు భద్రం: యూఐడీఏఐ తమ సర్వర్లు పూర్తి భద్రంగానే ఉన్నాయని ఆధార్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ బుధవారం ‘పీటీఐ’ వార్తా సంస్థకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోసిటరీ (సీఐడీఆర్), ఇతర సర్వర్లు సురక్షితంగానే ఉన్నాయని తెలిపింది. తమ సర్వర్ల నుంచి ఎలాంటి డేటా చౌర్యానికి గురి కాలేదని అందులో పేర్కొంది. ఐటీ గ్రిడ్స్ అశోక్కు టీడీపీ సర్కార్ షెల్టర్ డేటా చోరీ కేసులో టీడీపీ సేవామిత్ర యాప్ను నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో డేటా చోరీ కేసులో దర్యాప్తును తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ డి.అశోక్ కుమార్తోపాటు తెరవెనుక సూత్రధారులపై తెలంగాణ సిట్ దృష్టి సారించింది. ఆధార్తోపాటు మరో 17 రకాల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్లు కొద్ది రోజుల క్రితం ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ భవానీప్రసాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలతో అశోక్ కోసం తెలంగాణ పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా అశోక్ లొంగిపోకపోవడంతో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. అశోక్తోపాటు ఆయనకు సహకరించిన మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏబీ పర్యవేక్షణలోనే ఆశ్రయం! మరోవైపు అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే తమ బండారం బయటపడుతుందనే భయంతో ఆయన్ను టీడీపీ సర్కారే కాపాడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం సేవామిత్ర యాప్ కోసం తరలించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ దోషులుగా నిలబడే పరిస్థితి రావడంతో అశోక్ను రహస్య ప్రదేశంలో దాచినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలోనే అశోక్కు ప్రభుత్వం షెల్టర్ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన విజయవాడ వ్యక్తి మేఘాలయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్గా ఉండటంతో ఆయన పర్యవేక్షణలో తొలుత అశోక్ను ఉంచినట్టు ప్రచారం జరిగింది. అనంతరం విజయవాడ గొల్లపూడిలోని ఇంటెలిజెన్స్ అతిధిగృహంలో అశోక్ను పోలీసుల రక్షణ నడుమ కొద్ది రోజులు దాచినట్టు తెలిసింది. తరువాత ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో అశోక్కు షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత నిఘా చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినా చంద్రబాబు కోసం అశోక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని షెల్టర్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. పోలింగ్కు ముందు రోజు సేవామిత్రతో సూచనలు డేటా స్కామ్ బయట పడిన మరుక్షణమే మూసివేసిన టీడీపీ సేవామిత్ర యాప్ను పోలింగ్కు ఒక రోజు ముందు మళ్లీ పని చేయించడం గమనార్హం. టీడీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లకు ఓటింగ్పై సూచనలు ఇచ్చేందుకు సేవామిత్ర యాప్ను వినియోగంలోకి తెచ్చారు. అజ్ఞాతంలో ఉన్న అశోక్ డైరెక్షన్లోనే మళ్లీ సేవామిత్ర యాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలంగాణ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా అశోక్ను ఎక్కడకు తరలించారనే అంశంపై తెలంగాణ పోలీసు ప్రత్యేక బృందాలు దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ కేసులో కీలకంగా మారిన అశోక్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన స్వచ్ఛందంగా లొంగిపోతే మంచిదనే చర్చ ఏపీ పోలీసు వర్గాల్లోనే జరుగుతోంది. ఇతర రాష్ట్రాల డేటా సైతం చోరీ సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికలో ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ఆధార్ వివరాలు కూడా ఉన్నట్లు తెలంగాణ సిట్ బృందం గుర్తించింది. దీంతో ఇన్నాళ్లూ భావించినట్లుగా ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా కూడా ఉండటంతో కేసు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరస్థుల గాలింపు కోసం పలు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆధార్ వివరాలు కోరినా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అంగీకరించలేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) కూడా దాదాపుగా ఇలాంటి విజ్ఞప్తే చేసినా నిరాకరించింది. ఆధార్ సెక్షన్ 29 ప్రకారం పౌరుల వేలిముద్రలు, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అత్యంత అరుదైన కేసుల్లో సెక్షన్ 33 ప్రకారం మాత్రమే పరిమిత సమాచారం ఇస్తామని పేర్కొంది. -
ఐటీగ్రిడ్స్ ప్రకంపనలు : ఐటీ కార్యదర్శికి ఈఏఎస్ శర్మ లేఖ
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాలకు చెందిన 7.82 కోట్ల మంది ఆధార్ డేటా, ఓటర్ ఐడీ సహా వ్యక్తిగత వివరాలు టీడీపీ యాప్ను డెవలప్ చేసిన ఐటీగ్రిడ్స్ వద్ద ఉన్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించడంపై భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కేంద్ర సమాచార సాంకేతిక (ఐటీ) మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. డేటా చోరీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐటీగ్రిడ్స్ వద్ద 7.82 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ఉండటం ఆందోళనకరమని ఐటీ కార్యదర్శి సాహ్నీకి రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు. ఐటీగ్రిడ్స్ అభియోగాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు యూఐడీఏఐ, ఈసీ తీవ్రంగా పరిగణించాలని కోరారు. యూఐడీఏఐ, ఈసీఐల పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతను ఐటీగ్రిడ్స్ దెబ్బతీసిందని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కధనాన్ని ఉటంకిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మటికీ పౌరుల వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనేనని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ డేటా చోరీతో ఏ రాజకీయ పార్టీ దాన్ని దుర్వినియోగం చేసిందనే వ్యవహారంతో సంబంధం లేకుండా యూఐడీఏఐ, ఈసీలు తెలుగు ప్రజలకు సంతృప్తికర వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.డేటా చోరీ, ఐటీ గ్రిడ్స్ నిర్వాకంపై యూఐడీఏఐ, ఈసీలు తమ బాధ్యత నుంచి తప్పించుకోజాలవన్నారు. యూఐడీఏఐ చైర్మన్ జే సత్యనారాయణ, ఏపీలో టీడీపీ ప్రభుత్వ ఈ గవర్నెన్స్, ఐటీకి సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తుండటంపై గతంలో తాను రాసిన లేఖను సమాచార సాంకేతిక శాఖ విస్మరించిందని శర్మ గుర్తుచేశారు. తెలుగు రాష్ర్టాల ప్రజల వ్యక్తిగత వివరాలను నిక్షిప్తం చేసిన ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో స్ధానిక యూఐడీఏఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసులో సరిపోదని పేర్కొన్నారు. యూఐడీఏఐ అధికారుల ప్రమేయం లేకుండా ఐటీగ్రిడ్స్ 7.82 కోట్ల మంది ఆధార్ వివరాలు, ఓటర్ ఐడీ వంటి డిజిటల్ రికార్డులను సమీకరించడం సాధ్యం కాదని అన్నారు. ప్రైవేట్ కంపెనీతో కుమ్మక్కై ఈ తతంగంలో పాలుపంచుకున్న యూఐడీఏఐ అధికారులందరిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ ప్రమేయం ఉందని తేలితే ఆయా బాధ్యులపైనా కేసు నమోదు చేయాలన్నారు. ఐటీగ్రిడ్స్ వ్యవహారంలో సరైన చర్యలు చేపట్టడంలో ఐటీ మంత్రిత్వ శాఖ విఫలమైతే తాము న్యాయస్ధానాలను ఆశ్రయించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
‘డేటా చోర్’తో జాగ్రత్త
(రాజమహేంద్రవరం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి): ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజలందరి వ్యక్తిగత సమాచారానికి కాపలాదారులుగా ఉండాల్సిన వారే దానిని దొంగిలిస్తే.. మళ్లీ మరోసారి అధికారాన్ని వారి చేతిలోనే పెడితే ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలే ఆలోచించుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇటీవల రాష్ట్రంలో టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా ప్రజల డేటా చోరీచేసిన కేసు గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో పెద్దపెద్ద సైబర్ క్రైమ్లు కూడా వెలుగులోకి వచ్చాయి. సేవామిత్రల పేరుతో ప్రజలందరి డేటాను వారి వద్ద పెట్టుకున్నారు. వాళ్లు సేవచేసే వారు కాదు, మనకేమీ మిత్రులు కాదు. ప్రజలను మోసం చేయడానికి వారందరి వ్యక్తిగత సమాచారాన్ని కూడా వాళ్లు దొంగిలించి వారి దగ్గర పెట్టుకున్నారు’.. అని ప్రధాని అన్నారు. మోదీ తన ప్రసంగంలో సీఎం చంద్రబాబును పదే పదే ‘యూటర్న్’ బాబుగా పేర్కొంటూ.. రాష్ట్రంలో ఇప్పుడు ‘యూ టర్న్ బాబు’ పరిస్థితి ఎలా ఉందంటే బాహుబలి సినిమాలో రాజు భల్లాలదేవుడి పాత్ర మాదిరే ఉందని చెప్పారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరిగి దానిని కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే వారైతే.. ఇక్కడి ‘యూటర్న్ బాబు’ మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారని ప్రధాని తూర్పారపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్నదైతే.. యూ టర్న్ బాబు నైజం మాత్రం తన సొంత ‘హెరిటేజ్’ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరని దుయ్యబట్టారు. కమీషన్ల కోసమే పోలవరం అంచనాల పెంపు సాగు, తాగునీటి అవసరాల కోసం అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటే.. యూ టర్న్ బాబు మాత్రం ఆ పోలవరం ప్రాజెక్టు తనకు అవినీతి డబ్బులను తెచ్చి పెట్టే ఏటీఎం మాదిరిగా భావిస్తున్నారని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో పాటు నిర్మాణానికయ్యే వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఈ ఐదేళ్లలో కేంద్రం రూ.7వేల కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని తెలిపారు. అయినా, యూటర్న్ బాబు తన కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూపోతూ, ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాకుండా గాలిలోనే పెట్టారని తూర్పారబట్టారు. ఏపీ కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు కూడా ఈ యూటర్న్ బాబు తన స్టిక్కర్లు వేసుకుంటూ స్టిక్కరు బాబుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. రైతుల కోసం కేంద్రంలో తమ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు చేస్తుంటే ఈ యూటర్న్ బాబు దానికీ ఉత్సాహంగా తన స్టిక్కరు వేసుకున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్లు మీ కోసమే పనిచేశా.. మళ్లీ అవకాశమివ్వండి 21వ శతాబ్ధంలో ప్రజలు కోరుకుంటున్నట్టుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు శక్తివంతంగా తీర్చిదిద్దడానికి తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ ప్రధాని మోదీ ప్రజలను కోరారు. గడచిన ఐదేళ్లూ దేశ ప్రజల బాగోగుల కోసమే పనిచేశానని చెప్పారు. నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఊరట కలిగించాలని ఐదు లక్షల ఆదాయంలోపు ఉన్న వారికి పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినట్టు చెప్పారు. ఆ నిర్ణయం ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్లకు ప్రజల భవిష్యత్ పట్టదని, మార్పు కోసం కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు. పాక్ను సమర్ధిస్తున్న బాబు బృందం దేశద్రోహుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి పాకిస్థాన్లోని ఉగ్రవాదులను వారి స్థావరాల దగ్గరికి వెళ్లి వాటితోపాటు ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టామని మోదీ చెప్పారు. చంద్రబాబు సహా దేశంలో ప్రతిపక్ష పార్టీలు పాకిస్థాన్ వైఖరి సమర్థించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుపేద యువత కోసం పది శాతం ప్రత్యేక రిజర్వేషన్ అమలుచేసినట్లు ఆయన చెప్పారు. దేశంలో సముద్ర తీర ప్రాంతంలో అత్యధికులున్న మత్స్యకారులకి ప్రత్యేక మంత్రిత్వ శాఖను తొలిసారి తమ ప్రభుత్వమే ఏర్పాటుచేసిందని.. వారికి కిసాన్ క్రెడిట్ కార్డుల తరహా రుణాలు పొందే కార్డులను అందజేశామని ప్రధాని చెప్పారు. రైతుల కోసం ధాన్యంతో పాటు 22 రకాల పంటల మద్దతు ధరలను రెండున్నర రెట్లు తమ ప్రభుత్వం పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర పార్టీ ఇన్చార్జి మురళీధరన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీమంత్రి మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను ప్రధాని మోదీ ప్రజలకు పరిచయం చేశారు. టీడీపీ ఓడిపోతుందని నమ్ముతున్నాను – మోదీ ట్వీట్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని తాను నమ్ముతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. రాజమహేంద్రవరం బహిరంగ సభలో పాల్గొనే ముందు ఆయన ఈ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇది నా రెండో పర్యటన. టీడీపీ ఓడిపోతుందని నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడం లేదు. ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. -
‘కాల్సెంటర్ల గుప్పిట్లో 14 లక్షల మంది డేటా’
సాక్షి, న్యూఢిల్లీ : ఎంబీఏ చదివిన ఓ యువకుడు 14 లక్షల మంది ఈకామర్స్ కస్టమర్ల డేటాను తస్కరించి మోసపూరిత కాల్సెంటర్లకు విక్రయించి సొమ్ముచేసుకున్న ఉదంతం వెలుగుచూసింది. ఈ హైటెక్ మోసగాడిని నోయిడాలోని తన కార్యాలయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లను బురిడీ కొట్టించేందుకు ఏర్పాటైన మోసపూరిత కాల్సెంటర్లకు అక్రమంగా డేటాను విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై నందన్ రావు పటేల్ అనే యువకుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డేటా చోరీపై కస్టమర్లతో పాటు పలు బ్యాంకులూ ఫిర్యాదు చేయడంతో అమిటీ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న బిహార్కు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసి రెండు మొబైల్ ఫోన్లు, 14 లక్షల మంది కస్టమర్ల డేటాతో కూడిన ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తాను ఓ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఉద్యోగుల సహకారంతో ఒక్కో కస్టమర్ డేటాను రూ 2-3కు సేకరించి నకిలీ కాల్సెంటర్లకు ఒక్కో కస్టమర్ డేటాను రూ 5-6కు విక్రయించేవాడినని నిందితుడు అంగీకరించాడని నోయిడా అడిషనల్ ఎస్పీ విశాల్ విక్రం సింగ్ వెల్లడించారు. -
సేవామిత్ర యాప్ను ఎందుకు క్లోజ్ చేశారు?
సాక్షి, హైదరాబాద్ : డాటా చోరీకి పాల్పడలేదని చెబుతున్న టీడీపీ.. తమ వెబ్సైట్ సేవామిత్ర యాప్ను ఎందుకు క్లోజ్ చేసిందో చెప్పాలని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా చోరీ కేసులో తాము అడిగిన ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. బుకాయింపు ధోరణిని టీడీపీ అవలంబించడం సరికాదన్నారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధి బయటపడ్డ తాజా వీడియోని ఎల్లో మీడియా ఎందుకు ప్రసారం చేయడం లేదని నిలదీశారు. -
ఐటీ గ్రిడ్స్ స్కాం : సుప్రీం కోర్టు సుమోటోగా కేసు పెట్టాలి
సాక్షి, న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న డేటా చోరీ అంశంపై సుప్రీం కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా చౌర్యం కచ్చితంగా క్రిమినల్ నేరమే అన్నారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన డేటా.. ప్రైవేట్ సంస్థల దగ్గర లభించడం దారుణమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక శుక్తులతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. -
అశోక్ ఐఫోనే అత్యంత కీలకం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా స్కాంకు సూత్రధారిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దాకవరపు అశోక్ వాడే ఐఫోన్ ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సంస్థ నిర్వహించిన సేవా మిత్ర యాప్కు చెందిన ప్రాసెస్డ్ డేటా మొత్తం దాని క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా భద్రపరిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సైబరాబాద్ పోలీసు లు మంగళవారం కూడా హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఎథికల్ హ్యాకర్ల సాయంతో చేసిన ఈ తనిఖీల్లో అత్యంత కీలకమైన సమాచారం లభించినట్లు తెలిసింది. తెలంగాణ పోలీసులకు చిక్కకుండా, దర్యాప్తుకు సహకరించకుండా ఏపీలో తలదాచుకున్న అశోక్కు అక్కడి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. (‘రియల్ టైమ్’తో కాజేశారు) నంద్యాల ఉప ఎన్నికలోనే ట్రయల్ రన్... ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్ కర్ణాటకలోని దావణగెరెలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశాడు. తొలినాళ్లలో టీడీపీ కార్యకర్తగా, అభి మానిగా ఉన్న అశోక్కు ఆ పార్టీకి చెందిన కొందరు కీలక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడైన లోకేశ్తో సన్నిహితంగా ఉన్న, ప్రస్తుతం పరిపాలనలోనూ జోక్యం చేసుకుంటున్న ఓ వ్యక్తి ద్వారా అశోక్ ఆ కోటరీలోకి చేరిపోయాడు. అప్పటికే అశోక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఐటీ గ్రిడ్స్ సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న లోకేశ్ అండ్ కో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారిలో ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాల్సిందిగా అశోక్కు సూచించింది. (బ్లూ ఫ్రాగ్ దాగుడు‘మూత’లు) అతనితోపాటు మరో నలుగురితో ఏర్పాటైన అనధికారిక కమిటీ ఈ మేరకు అధ్యయనం చేశాక సేవామిత్ర యాప్కు రూపం ఇచ్చింది. బాబుతోపాటు లోకేశ్తోనూ పలుమార్లు సమావేశమైన అశోక్... ఇందులో అనేక మార్పుచేర్పులు చేశాడు. చివరకు 2017లో నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో యాప్ ట్రయల్ రన్ చేపట్టారు. ఆ ఉప ఎన్నికలో పలు సర్వే లు, అంచనాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా వచ్చాయి. వివిధ కారణాల వల్ల నంద్యాల ఓటర్లు కూడా టీడీపీపై వ్యతిరేకతతో ఉన్నారు. అయినప్పటికీ సేవామిత్ర యాప్ ‘సర్వే’ల ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను గుర్తించడం, ప్రలోభాల నుంచి ఓట్ల తొలగింపు వరకు అనేక చర్యలు తీసుకోవడంతో అనూహ్యంగా ఆ ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. దీంతో చంద్రబాబు, లోకేశ్ తదితరులకు ‘సేవామిత్ర’ పనితీరుపై పూర్తి నమ్మకం ఏర్పడింది. (డేటాచౌర్యంలో చంద్రబాబే దోషి!) కస్టోడియన్లకు ఆదేశాలు ఇచ్చి... ఆ ఎన్నికలో తమకు బలం లేకపోయినా గెలిపించిన ‘సేవామిత్ర’ను మరింత విస్తరించాలని, టార్గెట్– 2019గా రూపొందించాలని లోకేశ్ అండ్ కో నిర్ణయించింది. ఆ వెంటనే అశోక్కు అవసరమైన అన్ని వన రులు కల్పించారు. ఏపీకి చెందిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ఓటర్లు, ఆధార్ డేటాతోపాటు రైతులు, ఇతరులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలన్నీ డేటాబేస్లుగా ఉంటాయి. వాటికి సీనియర్ ఐఏఎస్ అధికారులు, అత్యున్నత అధికారులు కస్టోడియన్లుగా ఉంటారు. అయితే వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన బాబు, లోకేశ్... ఆయా డేటాల సర్వర్లలోకి ఐటీ గ్రిడ్స్కు యాక్సెస్ ఇచ్చారు. దీనికి అవసరమైన యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ను ప్రభుత్వాధికా రులే అందించారనే ఆరోపణలున్నాయి. వాటన్నిం టినీ క్రోడీకరించి ‘సేవామిత్ర’ను అప్గ్రేడ్ చేసిన ఐటీ గ్రిడ్స్ సంస్థ.. దురుద్దేశపూర్వక సర్వేల నుంచి ఓట్ల తొలగింపు వరకు పలు అక్రమాలకు పాల్పడుతూ టీడీపీకి సహకరిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘సేవామిత్ర’ తమను గెలిపిస్తే ఊహకందని భారీ నజ రానా ఇస్తానంటూ లోకేశ్.. అశోక్కు హామీ ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అశోక్ ఇటీవలి కాలంలో తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్లో భారీగా విస్తరించాడు. ఎథికల్ హ్యాకర్ల సాయంతో సోదాలు... సైబరాబాద్ పోలీసులు మంగళవారం మరోసారి ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేశారు. ప్రధానంగా లాక్ చేసి ఉన్న మూడు అత్యాధునిక కంప్యూటర్లలో నిక్షిప్తమైన డేటాను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకున్నారు. పాస్వర్డ్ ప్రొటెక్టివ్గా ఉన్న ఆ కంప్యూటర్లను ఓపెన్ చేసిన ఎథికల్ హ్యాకర్లు... వాటి నుంచి 40 జీబీ ప్రాసెస్డ్ డేటాతోపాటు ఆ సంస్థ సర్వర్లో ఉన్న కలర్ ఫొటోలతో కూడిన ఏపీ ఓటర్ల జాబితా, ఆధార్ డేటాబేస్లను కొంత మేరకు సేకరించగలిగారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ తమ డేటా సేవ్ చేసుకోవడానికి ఉపకరించిన అమెజాన్, గూగుల్ సంస్థలకూ సైబరాబాద్ అధికారులు లేఖలు రాశారు. గూగుల్ ప్లేస్టోర్లో టీడీపీ సేవామిత్ర యాప్ అందుబాటులో ఉన్నందున ఆ సంస్థకు నోటీసులిచ్చారు. ఆ సంస్థలు 2, 3 రోజుల్లో ఐటీ గ్రిడ్స్ తమ సర్వర్లలో భద్రపరిచిన డేటా ఇస్తామని బదులిచ్చాయి. తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్కు సంబంధించిన రెండు కేసుల దర్యాప్తు జోరుగా సాగిస్తుండటంతో ఏపీ ‘ముఖ్యులు’, అధికారులు, పోలీసుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిఘా సిబ్బందిని రంగంలోకి దింపారు. వారు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లు, మాదాపూర్, ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్లు, మాదాపూర్ ఎస్ఓటీ, హైదరాబాద్ టాస్క్ఫోర్స్, సీసీఎస్ కార్యా లయాలు, డీజీపీ ఆఫీస్, ఇంటెలిజెన్స్ ఆఫీసుల వద్ద అనునిత్యం కాపలాకాస్తున్నారు. కాగా, ఎస్సార్ నగ ర్లో నమోదైన కేసును హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం సమీక్షించారు. ఈ కేసు దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులతో సమన్వ యం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఏపీ పోలీసుల రక్షణలో అశోక్... డేటా స్కామ్కు సంబంధించి ఐటీ గ్రిడ్స్పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో అశోక్ అప్రమత్తమయ్యాడు. ఫిర్యాదుకు, కేసు నమోదుకు మధ్య కొంత వ్యవధి ఉండటంతో చకచకా పావులు కదిపి సంస్థ నుంచి కీలక డేటా కొంత డిలీట్ చేశాడు. అలాగే బోగస్ సర్వే వివరాలను ప్రాసెస్ చేసిన ఈ సంస్థ... టీడీపీ వ్యతిరేక ఓట్లను గుర్తించింది. ఈ డేటాను క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అశోక్ తన ఐఫోన్లో భద్రపరిచాడు. హైదరాబాద్ నుంచి పారిపోయిన అశోక్... తనతోపాటు ఐఫోన్, మూడు హార్డ్డిస్క్లను తీసుకెళ్లాడు. తాను ఎక్కడ ఉన్నా టీడీపీ అక్రమాలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తెలిసింది. డేటా స్కాంకు సంబంధించి ఐటీ గ్రిడ్స్పై సైబరాబాద్లోని మాదాపూర్తోపాటు హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ ఠాణాలోనూ కేసులు నమోదయ్యా యి. సైబరాబాద్ పోలీసులు అశోక్కు సోమవారం నోటీసులు జారీ చేసి 24 గంటల్లోగా లొంగిపోవాలని సూచించినా అతను పట్టించుకోలేదు. ప్రస్తుతం అతను ఏపీలోనే ఉన్నా డని పోలీసులు గుర్తించారు. అశోక్ దేశం వదిలి పారిపోయే అవకాశం లేకుండా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు సైబరాబాద్ పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు మధ్య సంచరిస్తున్న అశోక్కు ఏపీ పోలీసులు ఇద్దరు గన్మన్లను కూడా సమకూర్చినట్లు తెలిసింది. అశోక్ను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలు ఏపీలో గాలిస్తున్నాయి. -
ముగిసిన అశోక్ లొంగుబాటు గడువు
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ లొంగుబాటు గడువు ముగిసింది. 24 గంటల్లో లొంగిపోవాలని సైబరాబాద్ పోలీసులు సోమవారం అశోక్కు నోటీసులు జారీ చేశారు. అయితే 24 గంటలు గడిచినా నోటీసులకు అశోక్ స్పందించలేదు .దీంతో తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అశోక్ ఆచూకి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరో వైపు సైబరాబాద్ పోలీసులు జారీ చేసిన నోటీసులకు అమెజాన్, గూగుల్ సంస్థలు స్పందిచాయి. రెండు రోజుల్లో ఐటీ గ్రిడ్స్ డేటాపై పూర్తి వివరాలు ఇస్తామని చెప్పాయి. (ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్కు నోటీసులు) -
డేటా చోరీ కేసులో ముగిసిన అశోక్ లొంగుబాటు గడువు
-
ఐటీ గ్రిడ్స్ స్కాం : టీడీపీ సర్కార్ తత్తరబాటు
-
ఐటీ గ్రిడ్స్ స్కాం : టీడీపీ సర్కార్ తత్తరపాటు
సాక్షి, అమరావతి : ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వం తత్తరపాటు పడుతోంది. డేటా చోరీతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే.. తమ డేటాను తెలంగాణ పోలీసులు తస్కరించారని ఉల్టా ఆరోపణలు చేస్తోంది. పొంతనలేని సమాధానాలు చెబుతూ ప్రజల మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. తమపై తెలంగాణ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతుదంటూ గగ్గోలు పెడుతోంది. చోరీ చేయలేదంటూనే.. కేబినెట్ సమావేశాలు పెట్టి మరీ ఈ విషయంపై చర్చిస్తున్నారు. తమ దొంగతనాన్ని ప్రజలకు తెలియకుండా కప్పిపుచ్చడానికి నానాయత్నాలు చేస్తున్నారు. తాజాగా డేటా చోరీపై మంత్రి కాల్వ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. డేటా చోరీకి, ప్రభుత్వానికి సంబంధంలేదని చెప్పకొచ్చారు. తెలంగాణ పోలీసులే తమ డేటాను దొంగిలించారన్న మంత్రి కాల్వ.. డేటా చోరీ అయిందని అంగీకరిస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమధానం చెప్పలేక తడబడ్డారు. పొంతన లేని సమాధానం చెబుతూ నీళ్లు నమిలారు. ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే తెలంగాణ పోలీసు వైఖరిని విమర్శించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని మీడియా నిలదీయగా.. మంత్రి సమాధానం చెప్పలేక ప్రెస్మీట్ నుంచి వెళ్లిపోయారు. -
‘ఐటీ గ్రిడ్స్’లో మరోసారి సోదాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ కంపెనీలో మరోసారి సైబరాబాద్ పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సున్నితమైన సమాచారం ఐటీ గ్రిడ్స్ కంపెనీ చేతికి రావడం వెనుకున్న వ్యక్తుల పాత్రపై ఆరా తీస్తున్నారు. బ్లూఫ్రాగ్ సంస్థతో ఐటీ గ్రిడ్స్ ఉన్న సంబంధం ఏమిటనే దానిపై కూడా దృష్టి సారించారు. బ్లూఫ్రాగ్ సంస్థకు తాళాలు ఎందుకు పడ్డాయనే దానిపై ఆరా తీస్తున్నారు. డేటా లీకేజీపై ఆయా అథారిటీలకు కూడా పోలీసులు లేఖలు రాయనున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. (అసత్య ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్!) అశోక్ కోసం గాలింపు ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. విజయవాడ చుట్టుపక్కల అశోక్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను పంపినట్టు తెలుస్తోంది. ఏపీ పోలీసుల కనుకసన్నల్లో అశోక్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. (డేటా చోర్.. బాబు సర్కార్) ఎలాంటి సమాచారం లేదు: ఏపీ డీజీపీ అమరావతి: ఐటి గ్రిడ్ డేటా చోరీ స్కామ్పై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. ఈ కేసులో తెలంగాణ పోలీసుల నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదన్నారు. ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు తమను కలవలేదని చెప్పారు. (‘చంద్రబాబు పరోక్షంగా నేరాన్ని అంగీకరించారు’) -
డేటా దోపిడీ.. జర భద్రం!
సాక్షి, చీరాల : తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ దర్శకత్వంలో నూతన దోపిడీకి తెరలేపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లే వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లు ఓ కొత్త నాటకానికి తెరదీశారు. ఎవరైనా ప్రత్యర్థి పార్టీ ఓట్లు తొలగించాలని ప్రయత్నించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగించాలని అదే పార్టీ నాయకులు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం ఏంటి? ఫారం–7 పేరుతో నియోజకవర్గంలోని చీరాల మున్సిపాలిటీ, చీరాల, వేటపాలెం మండలాల్లో 11 వేల వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు ఆన్లైన్లో రెవెన్యూ అధికారులకు చేరాయంటే ఏ స్థాయిలో అధికారపార్టీ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకెళితే.... చీరాల, వేటపాలెం మండలాల్లో 1,73,291 మంది ఓటర్లు ఉండగా మొత్తం 218 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. చీరాల మున్సిపాలిటీలో 60,078 ఓటర్లు ఉ ఉండగా వీరిలో పురుషులు 29,179, స్త్రీలు 30599 ఉన్నారు. చీరాల మండలంలోని 15 గ్రామాల్లోని 60,333 ఓటర్లు ఉండగా పురుషులు 29,827, స్త్రీలు 30,504 ఉన్నారు. వేటపాలెం మండలంలోని 9 గ్రామ పంచాయితీల్లో 52,872 ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 26,020, స్త్రీలు 26,852 ఉన్నారు. వైఎస్సార్ సీపీ ఓట్ల గల్లంతు.. వైఎస్సార్ సీపీ ఓటర్లను తొలగించాలని కోరుతూ బూత్ కన్వీనర్లే ఫిర్యాదు చేశారంటూ ఆన్లైన్లో వైసీపీ ఓట్లు తొలగింపుకు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. ఒక్కో బూత్ కన్వీనర్ ద్వారా 50 నుంచి 100 మంది వైసీపీ ఓట్లు తొలగించేలా ఆన్లైన్లో ఫారం–7 ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని చెప్పడం విశేషం. వీటిలో చీరాల మండలంలో 5965, మున్సిపాలిటీలో 3700, వేటపాలెం మండలంలో 2875 ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేయించారు. భవిష్యత్తుకు భద్రత ఉందా..? ప్రజాసాధికార సర్వేతో పాటుగా ఆధార్ అనుసంధానంతో ప్రజల బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు పొందిన వివరాలు, పొలం, కులం, ఏపార్టీకి సానుభూతిపరులు వంటి పూర్తి వివరాలు డేటా బేస్లో లభ్యం అవుతున్నాయి. అత్యంత నిక్షిప్తంగా ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన సమాచారం హైద్రాబాద్, విశాఖపట్నంలో టీడీపీ నాయకులకు చెందిన ఐటీ కంపెనీలకు ఓటర్లు, ప్రజల సమాచారం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు సైతం వేరే ఖాతాలకు వెళ్లే సైబర్ మోసాలు జరగనున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చక్రం తిప్పుతున్న టీడీపీ ఎమ్మెల్సీ, నేతలు.. చీరాల్లో గత నాలుగు దఫాలుగా ఓటమి చెందిన టీడీపీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే తలంపుతో అక్రమ మార్గాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ ఓటర్లును ఓటరు జాబితాలనుంచి తొలగిస్తే తమకు అడ్డు ఉండదని, టీడీపీ అధినేత, అతని కుమారుడు మంత్రి అండగా ఉండాడనే గర్వంతో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు తెరవెనక ఉండటం, మీసేవా కేంద్రాల నిర్వహకులు, మండల, నియోజకవర్గ అధికారులతో కలిసి చేశారని పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 50 నుంచి 100 వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగింపులు చేసేలా ఆన్లైన్ దరఖాస్తులు చేయించారంటే టీడీపీ నీచ రాజకీయాలకు అడ్డు అదుపులేదా అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. సైబర్ క్రైం కింద పోలీస్ కేసులు నమోదు.. నియోజకవర్గంలో 11వేల వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగింపుకు ఆన్లైన్లో ఫిర్యాదులు రావడంతో విస్తుపోయిన అధికారులు చీరాల ఒన్టౌన్, వేటపాలెం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అలానే ఫిర్యాదు దారుడికి, ఫిర్యాదులో పేర్కొన్న ఓటర్లుకు నోటీసులు అందించి వివరాలు, రికార్డులు చేయిస్తున్నారు. చీరాల్లో జరగుతున్న ఆన్లైన్ ఓటరు అక్రమాలపై పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైం క్రింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర.. నేను వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్గా ఉన్నాను. నా పేరుతో మా ఊరిలో వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించాలని ఫారం–7క్రింద 70 అర్జీలు పెట్టారు. తాను ఎవ్వరి ఓటు తీసేయమని అర్జీలు దాఖలు చేయలేదు. ఓట్లు తొలగించాలని మేం ఎందుకు అర్జీలు దాఖలు చేస్తాం. ఇదంతా టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర. నిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం. –బి. చిట్టిబాబు వక్రమార్గాలు టీడీపీకి పెట్టిన విద్య.. అధికారం కోసం అక్రమార్గాలకు పాల్పడటం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనం. తమ వారి ఓట్లు 37 తొలగించాలని మేమే అర్జీలు పెట్టామని నోటీసులు అందించడం దారుణం. తమ వారి ఓట్లు తొలగించడంతో పాటుగా డేటా అంతా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లడం రాజ్యాంగాన్ని అపహాసనం చేసినట్లే. నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలి. –జి.వెంకటేశ్వర్లు. ముందే గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా.. ఐటీ గ్రిడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేతులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు టార్గెట్ చేసి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. ఫారం–7 ద్వారా వైఎస్సార్ సీపీ సానుభూతి ఓటర్లే తమ ఓట్లు తొలగించాలని దరఖాస్తులు చేశారని దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో ప్రజలకు అర్థం అవుతోంది. దీన్ని ముందుగానే పసిగట్టి కొద్దిరోజుల క్రితమే జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశా. చివరకు నా సొంత మేనల్లుడు, కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించేదుకు కుట్ర చేయడం దారుణం. –ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, చీరాల -
మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కోసం యాప్ రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు నిర్బంధించారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. తమను పోలీసులు నిర్బంధించలేదంటూ సంస్థ ఉద్యోగులు రేగొండ భాస్కర్, కడులూరి ఫణి, గురుడు చంద్రశేఖర్, రెబ్బాల విక్రమ్గౌడ్ స్వయంగా నివేదించడంతో ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు) ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసినట్లు ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటుండటం, తమ సంస్థలోని నలుగురు ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖ లు చేయడం తెలిసిందే. దీనిపై ఆదివారం విచారణ జరిపిన జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం... నలుగురు ఉద్యోగులను సోమవారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుపరచాలని ఆదేశించడంతో పోలీసులు ఆ మేరకు వారిని సోమవారం హాజరుపరిచారు. అయితే ఆ నలుగురి కుటుంబ సభ్యుల్లో ముగ్గురే ప్రమాణపూర్వక అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలను ధర్మాసనం ఆలకించింది. (డేటా చోర్.. బాబు సర్కార్) ఆ పిటిషన్లో వాస్తవం లేదు... అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బి.ఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ నలుగురు ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న పిటిషనర్ వాదనల్లో వాస్తవం లేదన్నారు. వారిని హాజరుపరచాలని ధర్మాసనం ఆదివారం ఆదేశించాక పోలీసులు మరోసారి ఆ నలుగురికీ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియచేశామని వివరించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ఉద్యోగులు కూడా పోలీసుల వద్దకు వచ్చారని, వారికి కోర్టు ఆదేశాల గురించి వివరించి కోర్టు ముందు హాజరుపరుస్తున్నామని తెలిపారు. (‘ఐటీ గ్రిడ్స్’ నుంచి 3 హార్డ్డిస్క్లు మాయం) వ్యక్తిగతంగా మాట్లాడిన న్యాయమూర్తులు ఈ విషయాలను రూఢీ చేసుకునేందుకు ధర్మాసనం ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేపట్టింది. ఆ నలుగురు తప్ప, మిగిలిన వారందరినీ బయటకు పంపిన న్యాయమూర్తులు... వారితో వ్యకిగతంగా మాట్లాడారు. పోలీసులు బెదిరించారా నిర్బంధించారా వం టి వివరాలను వారి నుంచి ధర్మాసనం రాబట్టినట్లు తెలిసింది. తమను పోలీసులు అక్రమంగా నిర్బంధిం చలేదని ఆ నలుగురు ధర్మాసనానికి వివరించారు. తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారు... సంస్థ డైరెక్టర్ అశోక్ ఈ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారో తమకు తెలియదని ఉద్యోగులు హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. తమ కుటుంబ సభ్యుల నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని వివరించారు. ఆ పిటిషన్లో ఏం రాశారో తమకు ఏమాత్రం తెలియదని ధర్మాసనానికి వారు వివరించినట్లు సమాచారం. తాము ఆఫీసు నుంచి నేరుగా ఇం టికి వెళ్లకుండా బయటకు వెళ్లడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. టీవీల్లో వార్తల ద్వారా పిటిషన్ దాఖలు, కోర్టు ఆదేశాల గురించి తెలుసుకొని కుటుంబసభ్యులతో మాట్లాడామని, వారు అప్పుడు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయాన్ని చెప్పారన్నారు. అనంతరం తాము పోలీసుల వద్దకు వచ్చామని ధర్మాసనానికి వివరించారు. (హైటెక్... దొంగలు) అక్రమ నిర్బంధంగా పరిగణించడం సాధ్యం కాదు పోలీసులు తమను నిర్బంధించలేదని ఉద్యో గులు చెబుతున్నారని, అందువల్ల దీన్ని అక్రమ నిర్బంధంగా పరిగణించడం సాధ్యం కాదని పిటిషనర్కు ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణ ప్రకాశ్ స్పందిస్తూ ఇటువంటి కేసుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో అందరికీ తెలుసునన్నారు. ఏం జరిగి ఉం టుందో సులభంగా అర్థం చేసుకోవచ్చునన్నారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ పోలీసులు నిర్బంధించలేదని స్వయంగా ఆ నలుగురే చెబుతున్నప్పుడు, మిగిలిన విషయాల అవసరం ఏముం టుందని ప్రశ్నించింది. వారు చెబుతున్న మాటలనే విశ్వసిస్తామని పేర్కొంది. ఆ నలుగురిని తమ ముందు పోలీసులు హాజరుపరిచిన నేపథ్యంలో ఈ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. మాదాపూర్ ఎస్హెచ్ఓ నుంచి తీసుకున్న కేసు డైరీని తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ధర్మాసనం ఆదేశించింది. -
డేటా చోర్.. బాబు సర్కార్
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టైన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా ఈవీఎంలను చోరీ చేసిన కేసులో నిందితుడైన సీఎం చంద్రబాబు సన్నిహితుడు వేమూరు హరిప్రసాద్తోపాటు నారా లోకేశ్కు ఆప్తుడైన కిలారి రాజేశ్ ఇప్పుడు ఏకంగా రాష్ట్రానికి చెందిన మూడున్నర కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను అపహరించినట్లు వెలుగులోకి వస్తోంది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కనుసన్నల్లోనే సాగిందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారం అండతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను చోరీ చేశారనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన హరిప్రసాద్ ప్రస్తుతం ఫైబర్గ్రిడ్, ఆర్టీజీఎస్ల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఎలక్ట్రోరల్ రోల్స్కు సంబంధించిన డేటా ఉండడం నేరమని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. (చంద్రబాబు, లోకేశ్ మార్గదర్శనంలో...క్యాష్ ఫర్ ట్వీట్!) టీడీపీ యాప్లోకి ఓటర్ల మాస్టర్ డేటా.. ఓటర్ల మాస్టర్ డేటా ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉండదు. కేవలం ఓటర్ల పేర్లు, వారి చిరునామాలు మాత్రమే ఉంటాయి. ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటాను బయటకు వెల్లడించరు. అలాంటిది ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటా టీడీపీ సేవామిత్ర యాప్లోకి చేరిపోవడంపై నివ్వెరపోతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల్లో ఈసీ అందుబాటులో ఉంచుతుంది. కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటాను ఎన్నికల సమయంలో కూడా బయటపెట్టదు. గతంలో ఓటర్ల జాబితాకు 90 శాతం మేర ఆధార్ను అనుసంధానం చేశారు. ఆ తరువాత సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ అనుసంధానాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా ఆధార్ వివరాలు అందుబాటులో ఉండవు. కేవలం మాస్టర్ డేటాలోనే ఆధార్ వివరాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ సేవా మిత్ర యాప్లో ఆధార్ వివరాలతో కూడిన ఓటర్ల జాబితా ఉండటాన్ని బట్టి ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను కచ్చితంగా చోరీ చేసినట్లేనని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు) పెదబాబు, చినబాబుల కనుసన్నల్లో.. రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం అందచేసే ఓటర్ల జాబితాల్లో ఆధార్ వివరాలు ఉండవు. అలాంటప్పుడు ఆధార్ డేటాతో కూడిన మాస్టర్ ఓటర్ల జాబితా టీడీపీ సేవా మిత్ర యాప్లోకి ఎలా చేరిపోయిందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మాస్టర్ డేటాలోని 910 మంది ఓటర్ల వివరాలను ఒక్కో సేవామిత్రకు, పార్టీ బూత్ కన్వీనర్కు సేవామిత్ర యాప్లో అందుబాటులో ఉంచారు. దీని ద్వారా ఓటర్ ఏ కులానికి చెందిన వారనే వివరాలను సేవామిత్ర సేకరించాలి. ఓటర్లు ఆ ఊరులో ఉంటున్నారో లేదో తెలుసుకుంటున్నారు. ఎవరికి ఓటు వేస్తారో సేవా మిత్రలు ఆరా తీసి ఐటీ గ్రిడ్కు సమాచారం అందిస్తున్నారు. ఇతర పార్టీలకు ఓటు వేస్తామని చెప్పిన వారి ఓట్లను తొలగించేందుకు ఆన్లైన్లో పెద్దఎత్తున ఫామ్ 7లను సమర్పిస్తున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కనుసన్నల్లోనే కొనసాగుతోందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కేవలం నిమిత్తమాత్రుడని, చంద్రబాబు, లోకేశ్ చెప్పినట్లు చేస్తారని పేర్కొంటున్నాయి. అశోక్ ఎక్కువ సమయం ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ దగ్గరే ఉంటారని, పలుసార్లు సచివాలయంలోని సీఎం కార్యాలయానికి వస్తుంటారని అధికార వర్గాలు తెలిపాయి. అశోక్కు సీఎంసన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్ ఈ వ్యవహారాలను అప్పగించారని సమాచారం. (‘ఐటీ గ్రిడ్స్’ నుంచి 3 హార్డ్డిస్క్లు మాయం) ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు మెరుగైన సేవలందించడానికి వినియోగించాల్సిన ప్రభుత్వం టీడీపీ ప్రయోజనాల కోసం అప్రజాస్వామిక చర్యలకు వినియోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రజాధనంతో ఏర్పాటైన ఫైబర్ గ్రిడ్, ఆర్టీజీఎస్, 1100 నెంబర్లకు చెందిన సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్తో అనుసంధానంచేశారు. ప్రభుత్వ ధనంతో చేపట్టిన ప్రజాసాధికార సర్వే వివరాలను కూడా సేవా మిత్ర యాప్తో జోడించారు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తూ అధికార పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని 3.50 కోట్ల మంది ఓటర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు అకౌంట్ల సమాచారాన్ని కూడా సేవా మిత్ర యాప్లో నిక్షిప్తం చేశారు. సేవామిత్ర యాప్లో సమాచారం ఆధారంగా ఓటర్ల అకౌంట్లలోకి నగదు వేసి ఓట్లను కొనుగోలు చేయడానికి ఎత్తుగడ వేశారని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఆర్టీజీఎస్, ఇ–ప్రగతిని సమర్ధంగా వినియోగించుకోవాల్సిందిగా ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్, ఇ–ప్రగతి, 1100 నెంబర్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ వీటిని తమ అదుపులోకి తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ విశ్లేషకులు గట్టిగా సూచిస్తున్నారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు) -
ఆంధ్రప్రదేశ్లో భారీ డేటా స్కామ్!
సాక్షి, హైదరాబాద్ / అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గడానికి ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ అడ్డదార్లు తొక్కుతోంది. ఇందుకోసం 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవ్యతిరేకంగా వాడుకుంటోంది. ప్రభుత్వ పనితీరు పట్ల వ్యతి రేకంగా ఉన్నవారి ఓట్లను తొల గించడానికి, ఎన్నికల సమయంలో ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా నగదు జమచేయడానికి కుట్ర పన్నుతోంది. హైదరాబాద్లో బయటపడ్డ డేటా చోరీ కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే ఈ డేటా చోరీ స్కామ్కు పాల్పడినట్టు గుట్టురట్టు కావడంతో ‘పచ్చ’నేతల్లో వణుకు మొదలైంది. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసులను రంగంలోకి దించారు. ఈ కుంభకోణంపై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తుమ్మల లోకేశ్వర్రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు ఏపీ పోలీసులు ఆదివారం ప్రయత్నించడం గమనార్హం. (డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’ యాప్ను రూపొందించింది. ఇందుకోసం విశాఖపట్నంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ అవసరమైన సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందినవారితోపాటు ప్రజల వ్యక్తిగత సమా చారాన్ని వారి కలర్ ఫొటోలతో సహా భద్రపరుస్తోంది. అంటే ఈ వివరాలన్నింటినీ ఐటీ గ్రిడ్స్కు అందజేసిందన్నమాట. టీడీపీ కోసం రూపొందించిన సేవామిత్ర యాప్నకు ప్రజల ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలను అనుసంధానం చేశారు. వాస్తవానికి ఈ వివరాలను జిల్లా కలెక్టర్ల పరిధిలో రహస్యంగా ఉంచాలి. కానీ, రాష్ట్రంలో దాదాపు 3.50 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధికార పార్టీ యాప్లో చేర్చారు. ప్రజల ఆధార్, ఓటర్ ఐడీల వివరాలు ప్రైవేట్ సంస్థ చేతిలో ఉండడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. దీన్ని గుర్తించిన సామాజిక కార్యకర్త, ఇందూ ఫార్టూన్ ఫీల్డ్స్ వాసి తుమ్మల లోకేశ్వర్రెడ్డి కొద్దిరోజుల క్రితం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల పేర్లు 2019 ఓటర్ల జాబితాలో లేకపోవడాన్ని లోకేశ్వరరెడ్డి గుర్తించారు. (ఐటీగ్రిడ్స్ స్కాం: అధికారుల్లో టెన్షన్.. టెన్షన్) లోకేశ్వర్రెడ్డి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు 120(బి), 379, 420, 188 ఐపీసీ, సెక్షన్ 66(బి), 72 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి కొండాపూర్, కేపీహెచ్బీ కాలనీల్లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. కొన్ని హార్డ్డిస్క్లతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్ను సైతం ఆధీనంలోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఆ సంస్థ ఉద్యోగులైన రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్గౌడ్లు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్కు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన ఆదివారం విచారణకు హాజరు కాలేదు. డాకవరం అశోక్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడు. (చంద్రబాబు, లోకేష్ల కుట్రే) కీలక సమాచారం తొలగింపు! డేటా స్కామ్సై గత నెల ఆఖరి వారంలో సైబరాబాద్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ విషయం ఫిబ్రవరి 26న మీడియాలో వచ్చింది. దీంతో ఐటీ గ్రిడ్స్ సంస్థ వెంటనే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది. ఫిబ్రవరి 27న సేవామిత్ర యాప్లో మార్పులు చేర్పులు చేసి, అప్గ్రేడ్ చేసినట్లు స్పష్టమైంది. దీనికి సంబంధించిన ఫొటో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఐటీ గ్రిడ్స్ సంస్థ తమ వద్ద ఉన్న ప్రజల వ్యక్తిగత, ఓటర్ ఐడీ కార్డులు, ఆధార్ డేటాను తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సేవామిత్ర యాప్ను లోకేశ్వర్రెడ్డి గమనించినప్పుడు అందులో ఓటర్ జాబితా ప్రకారం ప్రజల ఫొటోలు, వివరాలు కనిపించాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలియడంతో ఐటీ గ్రిడ్స్ సర్వర్ నుంచి కీలక సమాచారాన్ని డిలీట్ చేయడంతోపాటు సర్వర్లను కూడా మార్చేసినట్లు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్స్ కార్యాలయాల్లో సోదాలు చేసిన పోలీసుల కొన్ని హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. డిలీట్ చేసిన వివరాలను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. (ఐటీ గ్రిడ్ డేటా స్కామ్ సూత్రధారి బాబే) లోకేశ్వర్రెడ్డి కిడ్నాప్కు ఏపీ పోలీసుల యత్నం ఇదిలా ఉండగా ఆదివారం హైదరాబాద్కు వచ్చిన ఏపీ పోలీసులు ఈ కేసులో ఫిర్యాదుదారుడైన లోకేశ్వర్రెడ్డిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. గుంటూరుకు చెందిన డీఎస్పీ కులశేఖర్, ఇన్స్పెక్టర్ బాలమురళీ కృష్ణ సహా నలుగురు పోలీసులు లోకేశ్వర్రెడ్డి ఇంటికి వచ్చారు. బలవంతంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుర్భాషలాడారు. ఫిర్యాదు చేయడానికి డేటా ఎక్కడి నుంచి వచ్చిదంటూ బెదిరించారు. ఓ దశలో కిడ్నాప్ చేసి తమతోపాటు ఆంధ్రప్రదేశ్కు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఆయన ఫోన్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కేపీహెచ్బీ, మియాపూర్ ఇన్స్పెక్టర్లు లోకేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. భాస్కర్ అనే ఉద్యోగి అదృశ్యంపై గుంటూరులోని ఓ పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని, దర్యాప్తులో భాగంగా లోకేశ్వర్రెడ్డిని ఏపీకి తరలిస్తున్నామంటూ ఏపీ పోలీసులు వాదించారు. తమ సంస్థ ఉద్యోగిభాస్కర్ కనిపించడం లేదంటూ ఐటీ గ్రిడ్స్ కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పడం గమనార్హం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు వచ్చారు? కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ పోలీసులు నిలదీయడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం లోకేశ్వర్రెడ్డి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్కు వెళ్లి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో అధికారులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఏపీ పోలీసులు అనధికారికంగా గస్తీ తిరిగారు. ఆ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పోలీసులకు ఏపీ ప్రభుత్వం బస ఏర్పాటు చేయడం గమనార్హం. అడ్వొకేట్ జనరల్తో చంద్రబాబు మంత్రాంగం ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వాకం బయటపడి, తామే దోషిగా నిలబడే పరిస్థితి రావడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఈ కేసు నుంచి ఎలా గట్టెక్కాలనే దానిపై ఆదివారం ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీధర్తో గంటన్నరపాటు చర్చించారు. డేటా స్కామ్పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఎదురు కేసు పెట్టాలా? మరేదైనా చేయాలా? అనేదానిపై సమాలోచనలు జరిపారు. డేటా చోరీ కుంభకోణాన్ని తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య వివాదంగా చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హడావుడిగా మీడియాకు లీకులు ఇచ్చి ఇదేదో ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగాను, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేపీలపై నెపాన్ని నెట్టేందుకు పాట్లు పడ్డారు. ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ సీరియస్ క్రైమ్ ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురికావడం సీరియస్ క్రైమ్ అని ఒక రిటైర్డ్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్నకు ఎలా అనుసంధానిస్తారని సైబర్ నిపుణులు తప్పుపడుతున్నారు. ఇదే పని యూరప్, అమెరికా దేశాల్లో చేస్తే తక్షణమే జైలులో పెడతారని గుర్తుచేస్తున్నారు. సోషల్ సెక్యూరిటీ నెంబర్(ఆధార్ కార్డు) లాంటి వాటిని చట్ట వ్యతిరేకంగా వాడినా, ప్రైవేట్ వ్యక్తులకి అందచేసినా అది తీవ్రమైన నేరమే. ఇలాంటి నేలరకు కఠిన శిక్షలు అమలు చేయాలని డేటా ప్రైవసీ చట్టాలు చెబుతున్నాయి. ఈ కేసు విచారణ సక్రమంగా జరపాలని, రాష్ట్రంలోని ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావడానికి ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, దీనిపై చంద్రబాబు, లోకేశ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కుంభకోణంలో అధికారుల పాత్ర! ఆధార్ డేటాబేస్ అనేది పూర్తిగా వ్యక్తిగత వివరాలతో కూడి ఉంటుంది. ఆధార్ చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ డేటా యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సహా ఎవరి వద్దా ఉండకూడదు. కనీసం నిఘా సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు, పోలీసులకు కూడా ఈ డేటాబేస్లోకి యాక్సెస్ ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ సంక్షేమ పథకాలకు సంబం«ధించిన లబ్ధిదారుల జాబితాలను వ్యక్తిగత వివరాలతో సహా ఎవరికీ/ప్రైవేట్ సంస్థలకు అందించకూడదు. తాజాగా బయటపడిన డేటా చోరీ కుంభకోణంలో ప్రభుత్వ అధికారుల పాత్ర (ఐపీసీ 188) కూడా ఉందని అనుమానిస్తున్నారు. చోరీ (ఐపీసీ 370) ద్వారానే డేటా సంగ్రహించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. దీన్ని వినియోగించి సేవామిత్ర సంబంధీకులు ప్రజల్ని మోసం చేస్తున్నారని (ఐపీసీ 420) కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం మొత్తం ఆన్లైన్ కేంద్రంగా జరగడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని 66, 72 సెక్షన్లనూ ఈ కేసులో జోడించారు. సేవామిత్ర యాప్తో ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు పకడ్బందీగా స్కెచ్ వేశారు. సేవామిత్ర యాప్ను డౌన్లోడ్ చేసిన ట్యాబ్లను తమ బృందాలకు ఇచ్చి, మైక్రో లెవెల్ సర్వేలు అంటూ గ్రామాల్లో పంపిస్తున్నారు. ఈ యాప్లో ప్రజలందరి వ్యక్తిగత వివరాలు ఉంటాయి. బృందాలుగా వెళ్లే యువకులు ఓటర్లను స్వయంగా కలుసుకుంటున్నారు. మీరు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారు, వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని నచ్చజెబుతున్నారు. సదరు ఓటరును టీడీపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోనే నివసిస్తున్నారా? ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలని భావిస్తున్నారు? తదితర ప్రశ్నలు సంధిస్తున్నారు. ట్యాబ్ల్లోనే సమాధానాలు నమోదు చేసి, పార్టీ పెద్దలకు అందజేస్తున్నారు. సర్కారు పనితీరుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేసిన, ప్రతిపక్షానికి ఓటు వేస్తామని చెప్పిన వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఇందుకోసం తమ ఓటును తొలగించాలంటూ ఓటర్ల పేరిటే ఆన్లైన్లో ఫారం–7 సమర్పిస్తున్నారు. యాప్లో ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఉంటాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఓట్లు కొనేయడానికి నేరుగా నగదు జమ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ‘మిస్సింగ్’ డ్రామా తమ ఉద్యోగి కన్పించడం లేదని ఒక సంస్థ నిర్వాహకుడు ఇచ్చిన వాట్సాప్ మెసేజ్పై ఏపీ పోలీసులు ఆగమేఘాలపై స్పందించారు. రాత్రికి రాత్రే కేసు నమోదు చేసారు. అంతేవేగంగా వందలాది మంది పోలీసులు అర్ధరాత్రికే హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయం వద్దకు చేరి కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం గాలించేందుకు వచ్చామన్నారు. హైదరాబాద్లో ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ స్కామ్ గుట్టురట్టు కావడంతో శనివారం రాత్రి జరిగిన ‘మిస్సింగ్ హైడ్రామా’ ఇది. డేటా చోరీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వాహకుడు రేగండ్ల అశోక్ తమ ఉద్యోగి కటకం భాస్కర్ కన్పించడం లేదంటూ గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావుకు శనివారం రాత్రి వాట్సాప్లో మెసేజ్ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గత నెల 28న పెదకాకాని ప్రాంతంలోని ఐజేఎం అపార్టుమెంట్కు వచ్చిన భాస్కర్ హైదరాబాద్కు తిరిగిరాలేదంటూ అశోక్ పంపిన వాట్సాప్ మెసేజ్ను ఎస్పీ పెదకాకాని సీఐకి పంపించి కేసు నమోదు చేయించినట్టు సమాచారం. పెదకాకాని పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేయగా, కేవలం గంటల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ ఆఫీస్కు చేరుకున్నారు. భాస్కర్ మిస్సింగ్ కేసు నమోదైనందునా అతని ఆచూకీ కోసం వచ్చినట్టు చెప్పిన ఏపీ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ వద్ద సోదాలు చేసే ప్రయత్నం చేశారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీ స్కామ్కు పాల్పడిందని, దానిపై కేసు నమోదు చేసి భాస్కర్తోపాటు మరికొందరు ఉద్యోగులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్టు తేల్చిచెప్పారు. -
ఈ యాప్ వాడుతున్నారా? ఆర్బీఐ హెచ్చరిక
సాక్షి, ముంబై: డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ వినియోగదారులే టార్గెట్గా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ లావాదేవీలు జరిపే మొబైల్ ఫోన్ యూజర్లు ఆయా యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ‘ఎనీ డెస్క్’ అనే ఓ మొబైల్ యాప్ ద్వారా ‘యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (యూపీఐ) ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో కొన్ని మోసాలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఎనీ డెస్క్ అనే యాప్ ఆన్లైన్ లావాదేవీలు జరిపే యూజర్లతోపాటు, బ్యాంకులు, ఇతర ఆపరేటర్లు అప్రమత్తంగా వుండాలని ఆర్బీఐ ప్రకటించింది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన అనంతరం ఈ యాప్ లోని లోపాల కారణంగా డేటా చోరీ అవుతోందని తెలిపింది. యూజర్ల మొబైల్స్లోని డేటాను చోరీ చేసి, తద్వారా నేరగాళ్లు మోసపూరిత లావాదేవీలకు ఉపయోగపడుతోందని ఆరోపించింది. అంటే యాప్ ద్వారా వినియోగదారుల ఫోన్లను ఆధీనంలోకి తీసుకొని వారి ఖాతాల్లోని డబ్బును కొందరు సైబర్ నేరగాళ్లు మాయం చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐకు చెందిన సైబర్ భద్రత, ఐటీ పరిశోధన విభాగం ఫిబ్రవరి 14వ తేదీన ప్రకటనను కూడా విడుదల చేసింది. మరోవైపు ఈ యాప్ ద్వారా ఏప్రిల్, 2018, జనవరి 2019 మధ్య రూ. 6.4 లక్షల కోట్ల విలువైన388 కోట్ల లావాదేవీలు జరిపిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెబ్సైట్ తెలిపింది. -
ప్రమాదంలో 50 కోట్ల మంది సమాచారం
బెథెస్డ: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హోటళ్లు కలిగిన మ్యారియట్ సంస్థలో అంతర్గత సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా దాదాపు 50 కోట్ల మంది వినియోగదారుల సమాచారం ప్రమాదంలో పడింది. మ్యారియట్ హోటళ్లలో రూమ్లు తీసుకున్న వారి క్రెడిట్ కార్డు నంబర్లు, పాస్పోర్టు నంబర్లు, పుట్టిన తేదీ వివరాలు, ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ అడ్రస్లు తదితర సమాచార భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆ కంపెనీ వెల్లడించింది. 2014 నుంచి స్టార్వుడ్ నెట్వర్క్లో కొందరు అనధికారిక వ్యక్తులకు ఈ సమాచారానికి యాక్సెస్ లభించిందని కంపెనీ తెలిపింది. 2016లో స్టార్వుడ్ను మ్యారియట్ సొంతం చేసుకుంది. మ్యారియట్ హోటల్స్కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,700 హోటళ్లున్నాయి. -
ఆదమరిస్తే అంతే సంగతి...
టెలికం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) చైర్మన్ ఆర్.ఎస్.శర్మ ఈ మధ్య ఉన్నట్టుండి హాట్ టాపిక్ అయ్యారు. కారణం... చేతనైతే నా డేటా హ్యాక్ చేయండంటూ తన ఆధార్ నెంబర్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హ్యాకర్లకు సవాల్ విసిరారు. ఇంది కొంత విమర్శలకు దారితీసినా... తన డేటా భద్రతపై తనకున్న నమ్మకమే అలా చేయించిందనే వాదనలు ఎక్కువగా వినిపించాయి. ఇది నిజమే కావచ్చు. కాకపోతే శర్మ మాదిరిగా అందరూ తమ డేటా భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోగలరా? తీసుకోగలరని గట్టిగా చెప్పలేం. ఎందుకంటే డేటా దుర్వినియోగం రోజురోజుకీ పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అందుకే ఆర్బీఐ, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ పరంగా వ్యవస్థలను పటిష్ట పరిచి, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కోసం చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘మన వ్యక్తిగత డేటాను బయటపెడితే ఎవరూ కూడా రక్షించలేరు’’ అనేది లక్ష్మీ విలాస్ బ్యాంకు రిటైల్ బ్యాంకింగ్ హెడ్ పీరుష్ జైన్ మాట. ఈ నేపథ్యంలో డేటా రక్షణ కోసం ఏ చర్యలు తీసుకోవాలో నిపుణుల సూచనల ఆధారంగా తెలియజేసే కథనమే ఇది... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం వైఫైకి రక్షణ తప్పనిసరి... మీ వైఫై కనెక్షన్ను భద్రంగా చూసుకోవడం అత్యంత ప్రధానం. చాలా పరికరాలు ఇపుడు వైఫైతో కనెక్ట్ అయిపోతున్నాయి. అందుకే డేటా చోరులు మీ వైఫై నెట్వర్క్లోకి చొరబడి సున్నితమైన డేటాకు హాని తలపెట్టొచ్చు. కాబట్టి మీరు వాడని సమయాల్లో వైఫైను స్విచాఫ్ చేయడం మంచిది. క్లిష్టమైన పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవడం, దాన్ని తరచుగా మారుస్తుండడం వంటివి చేయాలి. ఇన్విజిబుల్... అంటే మీ నెట్వర్క్ మరొకరికి సెర్చ్లో కనిపించకుండా ఉండే ఆప్షన్ ఎంచుకుంటే ఇంకా మంచిది. ఉచితం కనెక్షన్లతో ప్రమాదమే... బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ వైఫై నెట్వర్క్లను వినియోగించుకోవడానికి కాస్తంత దూరంగా ఉండాలనేది నిపుణుల సూచన. ‘‘పబ్లిక్ వైఫై నెట్వర్క్ వినియోగించే సమయంలో నేరగాళ్లు మీ పరికరం ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రమాదం ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే జాతి వ్యతిరేక కార్యకలాపాలకు మీ పరికరాలను వాడుకునే ప్రమాదం కూడా ఉంది’’ అని అర్క సీఈవో శివంగి నందకర్ణి చెప్పారు. పరికరాలకు కవచం... అధిక భద్రతా ప్రమాణాలు, నాణ్యతతో కూడిన యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఉచిత సాఫ్ట్వేర్లకు దూరంగా ఉండడం మంచిదన్నది నిపుణుల సూచన. బ్లూటూత్ను సైతం వినియోగంలో లేని సమయంలో కచ్చితంగా ఆఫ్లోనే ఉంచుకోవాలి. ఆన్లైన్ లావాదేవీలకు ఓటీపీ వస్తుండడంతో మొబైల్కు తప్పకుండా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలిసిన వారు కూడా మీ మొబైల్ను దుర్వినియోగం చేసే వీలుంటుంది. యాప్స్ పట్ల జర జాగ్రత్త! నిజానికి ఈ రోజుల్లో చాలా వరకు డేటా చౌర్యం అన్నది మొబైల్ యాప్స్ ద్వారానే జరుగుతోందన్నది నిపుణుల హెచ్చరిక. యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్న సమయంలో కాంటాక్టుల సమాచారం, ఎస్ఎంఎస్ల సమాచారం, మీడియా యాక్సెస్, లొకేషన్ యాక్సెస్, కెమెరా తదితర అనుమతులు అడుగుతుండడం అందరికీ అనుభవమే. తద్వారా మీ మొబైల్లోని ఆయా సమాచారాన్ని ఇవి కాపీ చేసేస్తుంటాయి. మీ ఫోన్లో సేవ్ చేసి ఉన్న ఇతరుల సమాచారాన్ని కూడా కొట్టేస్తుంటాయి. అలాగని ముఖ్యమైన యాప్స్ను వాడకుండా ఉండటం, డిలీట్ చేసుకోవడం సాధ్యం కాదనే చెప్పాలి. కాకపోతే ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్లి పర్మిషన్స్ చూడాలి. అనవసరమైన పర్మిషన్స్ను తీసేయాలి. అలాగే, తప్పనిసరి అయిన యాప్స్ వినియోగానికే పరిమితం కావడం మంచిది. మరో ముఖ్యమైన అంశమేంటంటే ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ యాప్ స్టోర్ నుంచి కాకుండా ప్రయివేటు వెబ్సైట్ల నుంచి ఇన్స్టాల్ చేసుకునే యాప్స్కు దూరంగా ఉండటమే మంచిది. ఈమెయిల్ అలర్ట్ ఈ మెయిల్ అన్నది ఎంతో కీలకమైనదిగా చాలా మంది భావించడం లేదు. ఈ మెయిల్ అనేది ఓ వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలకు, వ్యక్తిగత వివరాలకు కేంద్రం వంటిది. కనుక ఈ మెయిల్కు కఠినమైన పాస్వర్డ్ను పెట్టుకోవాలి. సెకండ్ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కూడా ఉండడం మంచిది. కొత్త డివైజ్పై మెయిల్ లాగిన్ అయిన ప్రతిసారీ అలర్ట్ వస్తుంటుంది. దీంతో అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కార్డులు భద్రం సుమా!! ఏటీఎం కేంద్రాలు కూడా మోసాలకు నిలయాలవుతున్నాయి. మీరు ఏటీఎం కేంద్రంలో కార్డు స్వైప్ చేసే చోట క్లోనింగ్ పరికరాలను మోసగాళ్లు ఉంచి, అందులో స్వైప్ చేసిన కార్డుల సమాచారాన్ని కొట్టేస్తున్న ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. అందుకే ఏటీఎం కేంద్రాల్లో కార్డులను స్వైప్ చేసే చోట క్లోనింగ్ పరికరాలున్నాయేమోనని గమనించాలి. క్లోనింగ్ పరికరాల ద్వారా కొట్టేసిన సమాచారంతో మోసగాళ్లు తమకు అనువైన చోట మోసాలకు పాల్పడుతుంటారు. అలాగే, పిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో అడ్డుగా ఓ చేయిని ఉంచడం ద్వారా చోరీకి అవకాశం లేకుండా చూసుకోవచ్చు. కార్డు వివరాలను ఆన్లైన్ రిటైలర్లతో పంచుకోవద్దు. పిన్ నంబర్ కూడా తరచుగా మారుస్తుండాలి. ఎక్కువగా జనసంచారం లేని ప్రాంతాల్లోని ఏటీఎంలను నేరగాళ్లు ఎంపిక చేసుకుంటుంటారు. కనుక రిమోట్ ప్రాంతాల్లో కాకుండా జన్మసమ్మర్థ ప్రాంతాల్లో, సెక్యూరిటీ ఉన్న ఏటీఎంలను ఎంచుకోవడం ఒకింత నయం. ఇక రెస్టారెంట్లు, పీవోఎస్ మెషిన్ల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్డులను అక్కడి సిబ్బందికి ఇచ్చి పక్కకు వెళ్లిపోకూడదు. ఈ లోపు వారు స్కిమ్మింగ్ పరికరంపై దాన్ని స్వైప్ చేయడం ద్వారా డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. మీ సమక్షంలోనే కార్డును స్వైప్ చేసేలా చూసుకోవాలి. పాస్వర్డ్లకు రక్షణ ఉందా? నేడు ఆన్లైన్లో దాదాపు ప్రతీ పోర్టల్ రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నాయి. దీంతో యూజర్ ఐడీ, పాస్వర్డ్ సెట్ చేసుకోవడం, ఆ తర్వాత వాటిని గుర్తుంచుకోలేక మర్చిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకరు ఎన్నో పోర్టల్స్లో లాగిన్ అవుతుంటారు. అన్నింటి వివరాలూ గుర్తుంచుకోవడం కష్టమే మరి. అందుకే వీటిని ఎక్కడైనా నమోదు చేసుకోవాలి. అందుకోసం మీకు మాత్రమే అర్థమయ్యే కోడ్ భాషలో రాసుకోవడం మంచిది. సామాజిక మాధ్యమాల వద్ద... ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో సున్నితమైన డేట్ ఆఫ్ బర్త్, ఇల్లు, కార్యాలయం చిరునామాలు, ఫోన్ నంబర్లు తదితర సమాచారాన్ని పోస్ట్ చేయకుండా జాగ్రత్తపడాలి. కొందరు డేట్ ఆఫ్ బర్త్ అన్నది పాస్వర్డ్గానూ పెట్టుకుంటుంటారు. కనుక ఈ వివరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ‘లక్కీడ్రా’ లీకేజీ లక్కీ డ్రా గెలుచుకున్నారని, వివరాలు తెలియజేస్తూ క్లెయిమ్ చేసుకోవాలనే తరహా ప్రకటనల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వివరాలు తీసుకున్న తర్వాత వాటిని వ్యాపార సంస్థలకు విక్రయిం చి సొమ్ము చేసుకునేవారున్నారు. మీ ఫోన్ బిల్లులు, బ్యాంకు స్టేట్మెంట్లలోనూ కీలకమైన వివరాలు ఉంటాయని మర్చిపోవద్దు. లక్కీ డ్రా గెలుచుకున్నారని సైబర్ నేరగాళ్లు మెయిల్స్ ద్వారానూ వ్యక్తిగత వివరాల తస్కరణకు ప్రయత్నిస్తుంటారు. మధ్యవర్తుల ద్వారా... టెలికం కంపెనీల ఏజెంట్లు, ఇతర మధ్యవర్తిత్వ సంస్థల ద్వారానూ మీ వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదం పొంచి ఉంది. మంచి వ్యవస్థలను కలిగి ఉన్న సంస్థల ద్వారానే సేవలను పొందడం ఒకింత సురక్షితం. యాప్స్తో ప్రమాదం మీరు ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ పేరున్న మంచి సంస్థలవి అయితే ఫర్వాలేదు. కానీ, అంతగా తెలియనివి, థర్డ్ పార్టీ యాప్స్తో చాలా ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఆ యాప్స్కు మీరిచ్చే పర్మిషన్స్తో మొబైల్లోని సమాచారం అంతా కొల్లగొడుతుంటారు. బ్యాంకు నుంచి అంటూ కాల్స్ వస్తే? కొందరు మోసగాళ్లు మీకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖ నుంచి కాల్ చేస్తున్నామంటూ మీ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. వివరాలు చెప్పారో ఆ తర్వాత మీ ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేయగలరు. హైదరాబాద్లోని జ్ఞానేంద్రకు ఎదురైన అనుభవం ఇందుకు ఉదాహరణ. జ్ఞానేంద్ర ఎస్బీఐ నుంచి గృహ రుణం తీసుకుని ఈఎంఐ చెల్లిస్తున్నాడు. ఈఎంఐ చెల్లింపునకు రెండు రోజుల ముందు ఓ రోజు ఓ వ్యక్తి జ్ఞానేంద్రకు కాల్ చేసి ‘‘మీ డెబిట్ కార్డు బ్లాక్ అయింది. ఈఎంఐ చెల్లింపులకు సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు గాను అన్బ్లాక్ చేయాలి. కార్డు వివరాలు ఓ సారి చెప్పండి’’ అని కోరాడు. అతడికి జ్ఙానేంద్ర తన కార్డు వివరాలు చెప్పగా, ఆ తర్వాత అరగంటకే అతని బ్యాంకు ఖాతా నుంచి ఐదు లావాదేవీల్లో రూ.50,000 డెబిట్ చేసుకున్నాడు. జ్ఞానేంద్ర బ్యాంకులు, పోలీసు స్టేషన్, ఆర్బీఐ చుట్టూ తిరిగినా ప్రయోజం లేకపోయింది. కనుక ఈ తరహా కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక నేరగాళ్లు వెండర్ల నుంచి వ్యక్తుల ఖాతా నంబర్, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, చిరునామా, డేట్ ఆఫ్ బర్త్ తదితర సమాచారాన్ని సేకరించి, ఆ వివరాల ఆధారంగా తాము మోసానికి ఎంచుకున్న వారికి కాల్ చేస్తుంటారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామంటూ ‘‘మీ ఖాతాలో సమస్య ఉంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ రీసెట్ చేయాలి లేదా ఓటీపీ చెప్పండి’’ అని అడగడం ద్వారా ఖాతాల్లోని నగదును కొల్లగొట్టేయగలరు. నిజానికి బ్యాంకు సిబ్బంది కస్టమర్లకు కాల్ చేసి ఈ తరహా సమాచారాన్ని అడగడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. బ్యాంకు కస్టమర్ కేర్కు కాల్ చేసిన సందర్భంలోనే వివరాలను నమోదు చేయాల్సి వస్తుంది. -
ఆ సీఈవో మా డేటా దొంగలించారు
వోల్ఫ్గ్యాంగ్ ప్రోక్ స్కావియర్... ఒకప్పుడు గోఎయిర్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. ప్రమోటర్లతో నెలకొన్న వివాదాలతో ఆయన గోఎయిర్కు గుడ్బై చెప్పారు. గోఎయిర్ నుంచి వెళ్లిపోయిన స్కావియర్, దాని ప్రత్యర్థి కంపెనీ ఇండిగోలో జనవరి చివరి నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అయితే అంతకముందు తమ సంస్థలో పనిచేసిన స్కావియర్, తమ డేటాను దొంగలించాడంటూ గోఎయిర్ ఆరోపిస్తోంది. అంతేకాక ఆయన నియామకంపై కూడా గోఎయిర్ బొంబై హైకోర్టు దావా దాఖలు చేసింది. ఈ దావాలో తమ రహస్య సమాచారాన్ని స్కావియర్ బహిర్గతం చేయకుండా నిరోధించాలని కోరింది. ఇద్దరు పోటీదారుల మధ్య పోరాటంలో స్కావియర్ను బలిపశువును చేస్తున్నారంటూ స్కావియర్ తరుఫున వాదిస్తున్న న్యాయవాది జనక్ ద్వారకాదాస్ ఆరోపిస్తున్నారు. గోఎయిర్లో చేరకముందు ఆస్ట్రేలియన్ అయిన స్కావియర్, జెట్ ఎయిర్వేస్లో పనిచేసేవారు. జూన్తో గోఎయిర్లో ముందుగా నిర్ణయించిన స్కావియర్ కాంట్రాక్ట్ ముగియబోతోంది. కానీ కొన్ని నెలల ముందు గానే ఆయను తన పదవికి రాజీనామ చేసేశారు. ప్రమోటర్లకు, స్కావియర్కు మధ్య నెలకొన్న వివాదాలే ఆయన రాజీనామాకు కారణమయ్యాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్కావియర్ వైదొలగడానికి కొన్ని రోజుల ముందు నుంచి కంపెనీ మేనేజ్మెంట్ నిర్మాణాన్ని మార్చి వేయడం ప్రారంభించింది. స్కావియర్ విదేశీ పైలెట్లను ఎక్కువగా నియమించుకుంటున్నారని గోఎయిర్ ప్రమోటర్లు ఎక్కువగా గుర్రుగా ఉండేవారని, ఆ విషయంలోనే వారికి వివాదాలు నెలకొన్నాయని ఫిబ్రవరిలో ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. -
8.7 కోట్ల ఎఫ్బీ యూజర్ల డేటా చోరీ
లండన్ : 8.7 కోట్ల మందికి పైగా ఫేస్బుక్ యూజర్ల డేటా చౌర్యానికి గురైందని కేంబ్రిడ్జ్ ఎనలిటికా మాజీ ఉద్యోగి వెల్లడించారు. మంగళవారం బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన సంస్థ మాజీ ఉద్యోగి బ్రిటనీ కైసర్పై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. పలు యాప్లు, సర్వేల ద్వారా కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఎఫ్బీ యూజర్ల డేటాను సంగ్రహించేందని, యూజర్ల నుంచి డేటాను రాబట్టే విధంగా సైకాలజీ, డేటా సైన్స్ బృందాలు కలిసి సర్వేలో ప్రశ్నావళిని రూపొందిస్తాయని ఆమె పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ప్రపంచవ్యాప్తంగా యూజర్ల డేటాను విక్రయిస్తోందనే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఫేస్బుక్కు కైసర్ వెల్లడించిన అంశాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫేస్బుక్ వెలుపల సైతం తమ సంస్థ ప్రజల నుంచి సమాచారం సేకరిస్తుందని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ గత వారం అమెరికన్ కాంగ్రెస్ విచారణలో అంగీకరించిన సంగీతి తెలిసిందే. -
గంతలు కడతారు జాగ్రత్త!
ఈ కూపీ వాళ్లకి ఎందుకు? ఇండియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమ సామ్రాజ్య ప్రయోజనాలకు, యుద్ధ ప్రయోజనాలకు, చేసే యుద్ధాలకు ‘సై’ అనిపించడానికి ఇది అవసరం. అమెరికాతో నీవు చేతులు కలపకపోతే నిన్నే తన శత్రువుగా ప్రకటించడానికి సామ్రాజ్య పాలకులు సంకోచించరని గుర్తించాలి. ఆ వైపుగానే ఇపుడు ఆంగ్లో–అమెరికన్ ప్రభుత్వాలు భారత ప్రభుత్వ విదేశాంగ విధానాలను మలచడానికి శక్తిమంతంగా ప్రయత్నిస్తున్నాయి. ‘నా గురించి డేటా కావాలా మీకు? తీసుకోండి బాబూ! కానీ అందుకు ముదరాగా మీరు ప్రతి ఆరునెలలకు నాకు విసుగు పుట్టించే కొత్త పనులు మాత్రం పురమాయించకండి! ఈ డేటా లీకులూ, గోప్యత పైన, ఫేస్బుక్, వ్యక్తుల భోగట్టా గురించి కేంబ్రిడ్జ్ ఎనలిటికా, నరేంద్ర మోదీ (నామో) యాప్, ఆధార్ వంటి కూపీ వ్యవస్థలు– టెక్నాలజీ ఆధారంగా మనం సమకూర్చుకున్న మన డేటాను కాస్తా ఎలా దొంగిలిస్తున్నామో తెలుసు. అయినా ఈ గందర గోళంలో తలదూర్చి ఈత కొట్టదలచలేదు. ఇప్పటికే యావత్తు ప్రపంచానికి తెలిసిపోయింది– తమ నోరు మెదపలేక అలా పడివున్న భారత ప్రజా బాహు ళ్యం ఆ మూగ వేదనలో కొద్ది కిలోల బియ్యం కోసం తమ గోప్యతను కాస్తా సంతోషంతో ఎలా మారకం చేసుకుంటున్నారో తెలిసిపోయింది. బహుశా ప్రపంచంలో రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి–ప్రభుత్వమూ, రెండు– కార్పొరేట్ శక్తి. ఇక్కడ ఈ క్షణాన ‘ఆధార్’ సాధికార శక్తిలో దాగి ఉంది. ఇక నుంచి ఈ శక్తి ‘దాయి’ (ఆయా)గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ రెండు శక్తులూ పరస్పరం చేతులు కలిపి ఆధార్లో నిక్షిప్తం చేసిన వ్యక్తిగత సమాచారం (డేటా) అంతా భద్రంగానే ఉందని మనకు వందలసార్లు భరోసా ఇచ్చారు. అంటే మీ డేటా అంతా భద్రంగానే ఉంది కనుక ఇక నుంచి దాన్ని గురించి నోరెత్తి చర్చించకండి అని శాసిస్తున్నారు. అలాగే ‘ఫేస్బుక్’ సృష్టించిన జుకర్బర్గ్ కూడా తాను ‘మంచి బాలుడనే’నని వెయ్యిన్నొక్కసార్లు ప్రకటించాడు. చివరికి ఇతడిని ప్రధాని మోదీ అక్కున చేర్చుకుని హత్తుకున్నాడు. ఇలా మోదీ హత్తుకున్న వాళ్లంతా ఎంతో కొంత హాని కలిగిస్తారని చెడు తలపెడతారని నేను నమ్మలేను.’ – జి. సంపత్ (ది హిందు సామాజిక వ్యవహారాల విశ్లేషక సంపాదకుడి వ్యంగ్య రచన) ‘నేడు ఇండియాలో ముమ్మరిస్తున్న పరిణామాలు దేశంలో ప్రవేశించిన ఆధునిక వలస విధానంగా తోస్తోంది’ – క్రిస్టోఫర్ వీలీ (భారత్లో సమాచార కూపీ, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి అంశాల గురించి ట్విటర్లో బట్టబయలు చేసిన వేగు) క్రిస్టోఫర్ వీలీ తన డాక్యుమెంట్లలో బంధించిన సమాచారాన్నంతా బ్రిటన్ కామన్స్ సభ ‘కల్చర్, మీడియా స్పోర్ట్స్ కమిటీ’ ముందు వెల్లడించాడు. ఈ విషయాలను పరిశీలిస్తే వలస సామ్రాజ్య పాలనావశేషాల నుంచి స్వతంత్ర భారత్ సంపూర్ణ విముక్తిని పొందిన దేశమేనా అని మనకు మనం ప్రశ్నించుకో వలసిన స్థితిలో ఉన్నామని అనిపిస్తుంది. అదే సమయంలో ‘ఆధునిక వలస విధానం ఇలా ఉంటుందన్న భావన’ కలుగుతోందన్నాడు (దిసీజ్ వాట్ మోడ రన్ కలోనియలిజం లుక్స్లైక్) క్రి స్టొఫర్ వీలీ. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశా బ్దాలు గడిచిపోతున్నది. అయినా భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక నైతిక వ్యవస్థలపై పాత, కొత్త వలస పాలకుల కనుసన్నలలోనే ఆంగ్లో–అమెరికన్ బహుళజాతి గుత్త సంస్థలు జోక్యం చేసుకోవడం సహించరాని పరిణామం. అంటే రక్షణ రంగం సహా దాదాపు కీలక రంగాలన్నీ కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ పాలనా వ్యవస్థల కింద విదేశీ, స్వదేశీ గుత్త సంస్థల అదుపాజ్ఞలలోకి వెళ్లి ప్రజా బాహుళ్యం మూల్గులను పీల్చేస్తున్నాయని స్పష్టమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం కాస్తా విదేశీ వాస్కోడిగామాల అడ్డాగా మార్చుతున్నారు. సాంకేతికత వెనుక సంక్షోభం భారత ఎన్నికల వ్యవస్థలోకి చొరబడిన కేంబ్రిడ్జ్ ఎనలిటికా, క్రిస్టోఫర్ వీలీ సమాచారం వికేంద్రీకరణ పేరిట, ఆధునిక టెక్నాలజీ ముసుగులో ప్రవేశిం చిన ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ట్వీటర్ వగైనా సోషల్ మీడియాను ప్రయోజనకర కార్యకలాపాలకు వినియోగించడం లేదు. దోపిడీ వ్యవస్థల రక్షణ కోసం, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే రాజకీయ పక్షాలకు వాటి నాయకత్వాలకు ఎన్నికలలో ఉపయోగపడేటట్టూ చేస్తున్నారు. ఎన్నికలలో ఫలితాలను తమకు సానుకూలంగా మార్చుకు నేందుకు అనుకూల ఏజెన్సీల ద్వారా సోషల్ మీడియాలో ద్వారా ప్రచార ‘ఊదర’ కొట్టుకుని, ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడానికి ఈ సంస్థలు పనిచేయడం– బీజేపీ 2012 నుంచి ప్రవేశపెట్టిన ఫలితమే. 2014 లోక్సభ ఎన్నికలలో ఇందుకు తెర తీసిన పెద్దమనిషి అరవింద్ గుప్తా. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పదిని వందగా చూపే సంఖ్యల తారుమారు విద్యలో డిజిటల్ మీడియా మ్యానిప్యులేటర్గా అతడే పనిచేశాడు. సంఖ్యా శాస్త్రాన్ని డిజిటల్ మీడియా ద్వారా ఎలా దుర్వినియోగం చేయవచ్చునో నిపుణులు నాకు చెప్పారు. ఇంతకు ముందు కృత్రిమ విద్య ద్వారా మనం స్నేహితులను జయించడం ఎలాగో కొందరు పుస్తకాలు రాశారు. అలాగే ఎన్నికలలో ఓడవలసిన వాడు కూడా డిజిటల్ టెక్నాలజీ సాయంతో ప్రచారం ద్వారా ఓటింగ్ ఫలితాన్ని ఎలా తారుమారు చేయవచ్చునో 2014 ఫలితాలు నిరూ పించాయి. ఒక నాయకుడు ఎన్నికలు, ఓటింగ్లకు ఆరు నెలలకు ముందే తానే ‘వస్తున్నాడు, వచ్చేస్తున్నాడ’ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో విజ యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇందుకు కాంగ్రెస్ పాలన తప్పిదాలు ఆ ఊదరకు దోహదం చేయడం యాదృచ్ఛికం. ఆ తర్వాత శ్రీలంక ఎన్నికల్లో ప్రజా కంటకునిగా మారిన అధ్యక్షుడు రాజపక్సకు సాయంగా బీజేపీ డిజిటల్ టెక్నాలజీ నిపుణుడిని పంపడం, అది తెలిసిన పాత్రికేయులు ‘మీ రాకలో రహస్యమేమిట’ని ప్రశ్నిస్తే ‘‘ఆ విషయం మీకు చెప్పవలసిన పనిలేద’’ని ఆ నిపుణుడు ఎదురు మాట్లాడ్డం గురించి ఆనాడు కొన్ని పత్రికలు ఒక మూలకు తోసేశాయి. దండగమారి చెత్త అమెరికా పత్రికా ప్రపంచంలోనూ, సీఎన్ఎన్ చానల్లోనూ, ‘న్యూయార్క్ టైమ్స్’లోనూ ప్రసిద్ధుడు బి.జె. మెండెల్సన్ సోషల్ మీడియా పేరిట చెలా మణి అవుతున్న కొన్ని శాఖలను ‘దండుగమారి చెత్త’గా (సోషల్ మీడియా ఈజ్ బుల్షిట్) 2012 లోనే వర్ణించాడు. ఆ పేరిటనే రాసిన గ్రంథంలో ఈ ప్రచార సాధనాన్ని మార్కెటింగ్ వ్యూహ రచనా మాధ్యమంగా వర్ణించాడు. 1998 నుంచీ మార్కెటింగ్ ప్లాట్ఫాంగానే ఈ వెబ్ వేదిక వ్యవహరిస్తూ వచ్చిం దని పేర్కొన్నాడు. సోషల్ మీడియా పేరిట చెలామణిలో ఉన్న చాలా వెబ్ సైట్స్ ఇండియాలో ఇటీవల కాలంలో పడిన ‘పాటు’ అంతా ఏమిటి? ఆ విష యాన్ని కూడా క్రిస్టొఫర్ వీలీ బట్టబయలు చేశాడు: ‘ఇండియాలోని ఏడు లక్షల గ్రామాలలో, 600 జిల్లాల్లో ఈ విదేశీ వెబ్ మాధ్యమాలు సమాచారం సేకరించాయి. వీటి సాయంతో రాజకీయ పార్టీల కక్షిదారులెవరో (ఆదరణ పొందగోరినవారు) కూపీ లాగి ఆయా రాజకీయ పార్టీలు సదరు ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాయి. తద్వారా అనుకున్న సానుకూల ఫలితాన్ని రాబట్టుకోడానికి ఓటర్లను ప్రభావితం చేస్తాయి. ఇదే ఆధునిక వలస విధాన ప్రక్రియ’’ అన్నాడు వీలీ. ఎస్.సి.ఎల్ ఇండియా అనే కంపెనీ కేంద్ర కార్యాలయం ఘజియాబాద్లో ఉంది. అనేక రాష్ట్రాలలో కార్యా లయాలున్నాయి. ఈ కూపీ యంత్రాంగాన్ని బీజేపీ రాజస్తాన్ ఎన్నికల్లో ఉపయోగించింది. ఫేస్బుక్ నిర్మాత ఎఫ్.బి. వాడకందార్ల యంత్రంలో నమో దైన వారి సమాచారాన్ని, నంబర్లను తస్కరించి అమెరికా, బ్రిటన్లకు పంపించే వీలు కల్పించి, జుకర్బర్గ్ కాస్తా ‘జోకర్’బర్గ్ అయ్యాడు. మన డేటా అంతా అమెరికన్ కంపెనీలకు చేరిన తర్వాత ‘క్షమించాలి, తప్పు చేశా’నని అతడు లెంపలు వాయించుకున్నా, జరగవలసిన అన్యాయం జరిగిపోయింది. అలాగే ‘ఆధార్’ డేటా అంతా (మన కళ్ల కదలికలతో సహా– ఐరిష్ పరీక్ష) అమెరికా, బ్రిటన్లలో నమోదైపోయింది. ఈ కూపీ వాళ్లకి ఎందుకు? ఇండియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమ సామ్రాజ్య ప్రయోజనాలకు, యుద్ధ ప్రయోజనాలకు, చేసే యుద్ధాలకు ‘సై’ అనిపించడానికి ఇది అవసరం. అమెరికాతో నీవు చేతులు కలపకపోతే నిన్నే తన శత్రువుగా ప్రకటించడానికి సామ్రాజ్య పాలకులు సంకోచించరని గుర్తించాలి. ఆ వైపుగానే ఇపుడు ఆంగ్లో–అమెరికన్ ప్రభుత్వాలు భారత ప్రభుత్వ విదేశాంగ విధానాలను మలచడానికి శక్తిమంతంగా ప్రయత్నిస్తు న్నాయి. మన ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాల పునరుద్ధరణకు, శాంతి ప్రతిష్టాపనకు గల అవకాశాల్ని కూడా నిరోధించగల్గుతున్నాయి. ‘కేంబ్రిడ్జి ఎనలిటికా’ ఇండియాలో తిష్ట వేయడానికి కారణం ఈ విన్యాసంలో భాగమే. రాజకీయ పార్టీలు కులాలను విభజించి ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందవచ్చునో దశాబ్దాలుగా వ్యూహాలు సాగిస్తూనే ఉన్నాయి. కుల వ్యవస్థ మూలాలనీ, కుల, మత వైమనస్యాలనూ చెక్కు చెదరకుండా కాపాడగోరే రాజకీయ పార్టీలకు వెన్నుదన్నుగా ఉండటం కూడా ఆ సంస్థ ధ్యేయమే. తద్వారా భారత సామాజిక, రాజకీయ వ్యవస్థను సెక్యులర్ రాజ్యాంగానికి దూరంగా ఉంచడం కూడా. అందుకే ప్రధానమంత్రి ‘యాప్’ సహితం సోషల్ మీడి యాలో వినియోగదార్ల అనుమతి లేకుండా వారి డేటాను వాడుకుంటోందన్న ఆరోపణకు గురి కావలసి వచ్చింది. ‘నమో (మోదీ) యాప్’ ద్వారా భారత వినియోగదార్ల ‘డేటా’ను కాస్తా దొంగిలించడం జరిగిందని ఫ్రెంచి హేకర్ వెల్లడించాడు. మోదీ యాప్ డేటా ‘అమెరికన్ కంపెనీలలోని ఆయన స్నేహి తులకు’ చేరిందని కూడా ఆ ఫ్రెంచి హాకర్ వెల్లడించాడని వార్త. మున్ముందు వీర విహారం 2014 ఎన్నికలతో ముమ్మరంగా ప్రారంభమైన ఈ ‘డిజిటల్ మాయాజాలం’ 2019 సాధారణ ఎన్నికల నాటికి మరింతగా జడలు విప్పుకుని రాజకీయుల ‘నర్తనశాల’ను చూపించవచ్చు. ఎందుకంటే ‘ఫేస్బుక్’ వ్యవస్థాపక అధ్య క్షుడు సీన్పార్కర్ ‘సమాజంతో మీకున్న సంబంధ బాంధవ్యాలను ఫేస్బుక్ తారుమారు చేస్తుందన్నది అక్షరసత్యం’ అన్నాడంటే వచ్చేవి చెడ్డ రోజులా, మంచి రోజులా అన్నది చర్చనీయాంశమే. ఎందుకంటే ఫేస్బుక్ అనేది డేటా దొంగతనానికి పెట్టింది పేరనీ, ఆ మాటకొస్తే ఘరానా సోషల్ నెట్వర్క్ అనీ, దొంగ బుద్ధులకు నిలయమనీ, అందుకనే అది అమెరికన్లకు శిరోధార్యమైం దనీ అమెరికా నిపుణులే వాపోతున్నారని మరువరాదు. బానిసల, నీగ్రోల విమోచన ప్రదాత, అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ మాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి: ‘‘ప్రజలలోనే నా ప్రగాఢ విశ్వాసమంతా. ఎలాంటి జాతీయ విపత్తు కైనా, సంక్షోభాన్నయినా ఎదుర్కోడానికి ప్రజలనే విశ్వసించాలి. అసలు విషయం ఏమిటంటే, ముందుగా వారికి అబద్ధాలను, అసత్యాలను తెల్పకుండా నికా ర్సయిన నిజాలను వారి ముందుంచాలి. పాలకులపై విశ్వాసానికి అదే మూల స్తంభం’’! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఫేస్బుక్ డేటా స్కామ్.. మరో బాంబు
న్యూయార్క్ : ఫేస్బుక్ సమాచార గోప్యత విషయంలో మరో బాంబు పేలింది. సోషల్ మీడియా దిగ్గజం ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెడుతుందని వైట్హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బన్నొన్ తెలిపారు . గురువారం ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ‘సందేహమే లేదు. ఫేస్బుక్ తన ఖాతాదారులా డేటాను అమ్మేసుకుంది. ఇది అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అందుకే దాని వ్యాపారం, మార్కెట్లో దాని షేర్ల విలువ ఇప్పుడు అంత స్థాయిలో ఉంది’ అని తెలిపారు. అయితే రాజకీయ సంబంధిత డేటా చోరీ అంశంపై మాత్రం తనకు స్పష్టత లేదని.. కాబట్టి ఆ అంశంపై స్పందించబోనని బన్నొన్ తెలిపారు. ఇక సదస్సు ముగిశాక బయటకు వచ్చిన ఆయన ది గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ.. కేంబ్రిడ్జ్ ఎనలైటికా(ట్రంప్ ప్రచారం కోసం పనిచేసిన డేటా విశ్లేషణ సంస్థ) యూఎస్ ఓటర్ల డేటాను అమ్ముకుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కేంబ్రిడ్జ్ ఎనలైటికా(సీఏ) మాతృక సంస్థ ఎస్సీఎల్(బ్రిటన్కు చెందిన సంస్ధ) సుమారు 50 మిలియన్ల ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో బన్నొన్ హస్తం కూడా ఉందంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ట్రంప్ మాజీ కార్యదర్శి, కేంబ్రిడ్జ్ అనలైటికా మాజీ ఉపాధ్యక్షుడు అయిన బన్నొన్.. గతంలో ‘ఫైర్ అండ్ ఫ్యూరీ : ఇన్సైడ్ ద ట్రంప్ వైట్ హౌజ్’ పుస్తకం ద్వారా అధ్యక్ష భవన సమాచారాన్ని బహిర్గత పరచటంతోపాటు.. అవినీతి, అసమర్థత పాలన అంటూ అధ్యక్షుడు ట్రంప్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. -
హిట్లర్కు గోబెల్స్.. మోదీకి ఆయనే!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ను కుదిపేస్తున్న కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణంలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ వినియోగదారులు సమాచారాన్ని తస్కరించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్టు అపఖ్యాతి ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని, జీఎస్టీని ఉద్దేశించి ‘గబ్బర్సింగ్ ట్యాక్స్’ కామెంట్ వెనుక ఉన్నది ఆ సంస్థేనని కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జి అనలిటికా సేవలను కాంగ్రెస్ పార్టీ పొందిందని విమర్శించారు. అయితే, ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే విషయంలో హిట్లర్కు గోబెల్స్ అనే మంత్రి ఉండేవాడని, ఇప్పుడు ప్రధాని మోదీకి రవిశంకర్ప్రసాద్ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా మండిపడ్డారు. బూటకపు కథనాలను సృష్టించే కార్ఖానా బీజేపీ ప్రభుత్వమేనని, అతిపెద్ద సమాచార దొంగే.. అందరికంటే గట్టిగా అరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్పై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇలా ఆరోపణలు ఎలా చేస్తారని మండిపడ్డారు. -
నమ్మించి ఐదేళ్లుగా దోచుకుంటున్న చైనా
అడ్డిస్ అబాబా, ఇథియోపియా : చైనా అంటే స్నేహం కాదు.. ఓ నమ్మకం అనే భావనను ప్రపంచదేశాల్లో తీసుకురావడానికి ఆ దేశం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా చైనాపై ఆఫ్రికన్ యూనియన్(ఏయూ) ఫైర్ అయింది. స్నేహం పేరుతో గిఫ్ట్గా ఇచ్చిన భవనం ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని ఆఫ్రియన్ ఏయూ ఆరోపించాయి. అడ్డిస్ అబాబాలోని ఏయూ కేంద్ర కార్యాలయ కంప్యూటర్ల నుంచి ప్రతి రోజు రాత్రి సమాచారం తస్కరణకు గురవుతున్నట్లు ఫ్రెంచ్ వార్తపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో షాక్కు గురైన ఏయూ సర్వర్ల ద్వారా నిజంగానే డేటా తస్కరణకు గురవుతున్నట్లు గుర్తించింది. మిగిలిన సమాచారం చోరికి తరలిపోకుండా అడ్డుకుంది. ఆఫ్రికా ఖండంలోని 55 దేశాలు కలసి 2001లో ఆఫ్రికన్ యూనియన్గా ఏర్పడ్డాయి. 2002లో ఇథియోపియా రాజధానిలోని అడ్డిస్ అబాబాలో ఏయూ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రపంచ శక్తిగా ఎదగాలని తపన పడుతున్న చైనా.. ఈ అతిపెద్ద కూటమిపైన కన్నేసింది. పేదరికంలో మగ్గుతున్న ఆ దేశాలకు వ్యాపార ఆశ జూపి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో పెట్టుబడులు పెట్టాలని కోరింది. బీఆర్ఐలాంటి బృహత్తరమైన ప్రాజెక్టు ఆఫ్రికా గుండా వెళ్తే దేశాలు అభివృద్ధి చెందుతాయని నమ్మబలికింది. చైనా మాటకు సరేనన్న ఆఫ్రికన్ దేశాలు ఆ దేశం నుంచి అప్పులు తీసుకుని బీఆర్ఐలో పెట్టుబడులు పెట్టాయి. బీఆర్ఐలో పెట్టిన పెట్టుబడుల మొత్తానికి ఏటా భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తుండటంతో ఆఫ్రికన్ దేశాలు చైనాకు వ్యతిరేకంగా గొంతెత్తాయి. ఈలోగా బహుమతి కింద ఆఫ్రికన్ యూనియన్కు చైనా నిర్మించి ఇచ్చిన కార్యాలయం నుంచి సమాచారం తస్కరణకు గురవుతోందన్న వార్త ఆఫ్రికన్ దేశాలను ఆత్మరక్షణలో పడేసింది. 200 మిలియన్ల డాలర్లతో అడ్డిస్ అబాబా కార్యాలయాన్ని నిర్మించిన చైనా 2012లో ఏయూకి దాన్ని అప్పగించింది. ఆనాటి నుంచి నేటి వరకూ అంటే గత ఐదేళ్లుగా ప్రతి రాత్రి ఏయూకి చెందిన రహస్యాలు షాంఘైలోని ఓ బేస్కు చేరుతున్నాయి. ఫ్రెంచ్ పత్రికలో వార్తకథనాల తర్వాత జాగ్రత్తపడ్డ ఏయూ చైనా సర్వర్లను పక్కనపడేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త సర్వర్లను అందుబాటులోకి తెచ్చుకుంది. వాటి నిర్వహిస్తామని చైనా చేసిన ఆఫర్ను తిరస్కరించింది. అల్జీరియా నుంచి అబాబాకు వచ్చిన భద్రతా బృందం వెతుకులాటలో డెస్క్ల కింద పెద్దమొత్తంలో మైక్రోఫోన్లు కూడా లభ్యమయ్యాయి. బీఆర్ఐలో భాగంగా పెట్టుబడుల పేరుతో వర్ధమాన దేశాలకు ఎదురుఅప్పులు ఇస్తున్న చైనా.. వడ్డీల రూపేణ వాటి రక్తాన్ని జలగలా పట్టిపీల్చుతోంది. ఆసియా దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్లకు బీఆర్ఐలో భాగంగా చైనా భారీగా నిధులు అప్పుగా ఇచ్చింది. కాగా, ఏయూ చేసిన గూఢచర్య ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఆఫ్రికా-చైనా సంబంధాలు దెబ్బతినే ప్రభావం ఉందని హెచ్చరించింది. -
5.7 కోట్ల ఉబెర్ కస్టమర్ల డేటా చోరీ
న్యూయార్క్: పలు దేశాల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5.7 కోట్ల మంది ఉబెర్ కస్టమర్ల పేర్లు, ఈ మెయిల్ అడ్రెస్లు, ఫోన్ నంబర్లు మొదలైనవి హ్యాకింగ్కి గురవడం వెలుగులోకి వచ్చింది. అలాగే 6 లక్షలమంది అమెరికన్ డ్రైవర్ల లైసెన్సుల నంబర్లతో పాటు మొత్తం 70 లక్షల మంది డ్రైవర్ల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్లు వెల్లడైంది. అయితే, హ్యాకింగ్ గత సంవత్సరం అక్టోబర్లోనే జరిగినప్పటికీ.. కంపెనీ ఏడాదిపైగా ఈ విషయం బైటికి రాకుండా జాగ్రత్తపడింది. తస్కరించిన డేటాను డిలీట్ చేసేందుకు, విషయం బైటికి తెలియకుండా చూసేందుకు హ్యాకర్లకు ఉబెర్ సుమారు 1,00,000 డాలర్లు కూడా చెల్లించింది. ఉబెర్ స్వయంగా ఈ విషయాలు వెల్లడించిన నేపథ్యంలో డేటా హ్యాకింగ్పై న్యూయార్క్ అటార్నీ జనరల్ విచారణ జరుపుతున్నారు. అయితే, డేటా దుర్వినియోగమేమీ జరగలేదని, ఇకపై ఇలాంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఈవోగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన దారా ఖుస్రోవ్షాహీ తెలిపారు. -
‘కీలాగే’స్తారు!
⇒ కీ లాగర్స్ సాఫ్ట్వేర్ ప్రయోగిస్తున్న సైబర్ క్రిమినల్స్ ⇒ ‘నెట్ బ్యాంకింగ్ హ్యాకింగ్’ ⇒ ఈ పంథాలోనే దేశ వ్యాప్తంగా నేరాలు చేసిన ఘరానా గ్యాంగ్ సిటీబ్యూరో: కంప్యూటర్ ఆధారంగా చేసే సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ కోవలోనిదే ‘కీ లాగర్స్’. ఎదుటి వ్యక్తుల డేటాను చోరీ చేయ డం దీని ప్రత్యేకత. ఈ పంథాలో నగరానికి చెందిన ఓ బాధితుడి నుంచి రూ.8 లక్షలు స్వాహా చేసిన ముఠాను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు గత నెల లో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన విషయం విదిత మే. దేశ వ్యాప్తంగా మోసాలు చేసిన ఈ ముఠాకు చెంది న మరో నలుగురి కోసం పోలీసులు వేటాడుతున్నారు. ఏమిటీ కీ లాగర్స్? ఇంటర్నెట్లో విరివిగా లభిస్తున్నదే ఈ కీ లాగర్స్ సాఫ్ట్వేర్. సైబర్ నేరగాడు దీన్ని డౌన్లోడ్ చేసుకుని తాను కోరుకున్న కంప్యూటర్లో నేరుగా ఇన్స్టల్ చేస్తాడు. పరి చయస్తుల పర్సనల్ కంప్యూటర్ను ఒకసారి విని యోగించుకోవడానికి తీసుకుని అదును చూసి దీన్ని ఇన్స్టల్ చేస్తాడు. అలాగే, ఎవరికైనా జోక్స్, బొమ్మలు, ఉద్యోగావకాశాలంటూ ఈ-మెయిల్ పంపడం ద్వారా నూ అవతలి వ్యక్తి కంప్యూటర్లో ఇన్స్టల్ అయ్యేలా చేస్తాడు. ఆవిషయం మెయిల్ను క్లిక్ చేసిన వ్యక్తికి కూడా తెలీదు. ఒకసారి కీ లాగర్స్ కంప్యూటర్లో ఇన్స్టల్ అయితే... ఆ కంప్యూటర్ను వినియోగించే వ్యక్తి చేసిన ప్రతి కార్యకలాపం సైబర్ నేరగాడి ఈ-మెయిల్ ఐడీకి చేరిపోతుం ది. చివరకు కీ బోర్డులో ఒక్క బటన్ నొక్కినా ఆ వివరాలు పూర్తిగా సైబర్ నేరగాడికి ఈ-మెయిల్ రూపంలో చేరిపోతాయి. వీటి ద్వారా వ్యక్తిగత సమాచారమైన ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్ తదితరాలు నేరగాళ్లకు అందుతాయి. వీటిని విని యోగించి సైబర్ నేరగాళ్లు అవతలి వ్యక్తి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు. అంతేకాకుండా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడంతో పాటు దుశ్చర్యలకు పాల్పడతారు. అప్రమత్తత అవసరం... ఇంటర్నెట్లో కీ లాగర్స్ తరహా సాఫ్ట్వేర్లు అనేకం అందుబాటులో ఉన్నాయి. వీటి బారి న పడకుండా ఉండాలంటే వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అపరిచిత చిరునామాల నుంచి వచ్చే ఈ-మెయిల్స్ను వెంటనే డిలీట్ చేయాలి. మొబైల్ ఫోన్కు వచ్చే అన్ని ఎస్ఎమ్మెస్లకు సైతం స్పందించకూడదు. సైబ ర్ కేఫ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్నెట్ బ్యాం కింగ్ వంటి కీలక లావాదేవీలు చేయరాదు. పర్సనల్ కంప్యూటర్స్లో అత్యాధునికమైన యాంటీ వైరస్ సాఫ్ట్వేర్స్ను ఏర్పాటు చేసుకోవాలి. నమ్మకస్తులైన వారికి మాత్రమే పర్సనల్ కంప్యూటర్ వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలి. సైబర్ కేఫ్ల యజమానులు ఎప్పటికప్పుడు తమ కేఫ్లోని సిస్టమ్స్ల్లోని సాఫ్ట్వేర్స్ను పరీక్షిస్తుండాలి. ఈ తరహా సైబర్ నేరగాళ్లలో విద్యాధికులే ఎక్కువగా ఉంటున్నారు. వీరు పట్టుబడటం కూడా చాలా కష్టం. ‘నీలం’ రంగులో ఉంటాయి సాధారణంగా మెయిల్లో వచ్చే కీలాగర్స్ లింకులు నీలం రంగులో ఉంటాయి. అపరిచిత ఈ-మెయిల్స్ లో ఇలాంటి లింక్స్ ఉంటే వాటి జోలికి పోకపోవడం ఉత్తమం. ఆ లింకును కాపీ చేసి యూఆర్ఎల్ బార్లో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే ఈ-మెయిల్ అసలుదా? నకిలీదా తెలుసుకునే అవకాశం ఉంటుంది. - వీపీ తివారీ, సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్