dharmendra
-
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్రకు కోర్టు సమన్లు
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర వల్ల మోసపోయానంటూ ఒక వ్యాపారి చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీ కేసుకు సంబంధించి ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సమన్లు జారీ చేసింది. ‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టించి తనను తప్పుదోవ పట్టించారని ఢిల్లీ వ్యాపారవేత్త సుశీల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) యశ్దీప్ చాహల్ సమన్లు జారీ చేశారు.2018 ఏప్రిల్ నెలలో, ఉత్తరప్రదేశ్లోని NH-24/NH-9లో గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీ ఇస్తామని ధర్మేంద్ర తనను సంప్రదించినట్లు సుశీల్ కుమార్ తెలిపారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.63లక్షల వరకు పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఢిల్లీ, హర్యానా వటి నగరాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచ్లు సుమారుగా రూ. 70 నుంచి 80 లక్షల వరకు నెలవారీ టర్నోవర్ను ఆర్జిస్తున్నాయని ఆశ చూపించడంతో తాను కూడా ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితుడయ్యానని తెలిపారు. ఆ సమయంలో ఒప్పంద పత్రంపై సంతకాలు కూడా చేశారన్నారు. ఈ ప్రక్రియ ముగుసిన తర్వాత ధర్మేంద్ర నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి కోర్టును ఆశ్రయించినట్లు సుశీల్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని ఆయన వాపోయారు.‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీ కేసులో భాగంగా ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ అయ్యాయి. 420, 120B సెక్షన్ల కింద వారికి సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసు 2025 ఫిబ్రవరి 20 విచారణ జరగనుందని కోర్టు వాయిదా వేసింది. -
థియేటర్లలో ఫ్లాప్.. కానీ 25 కోట్ల టికెట్స్ సేల్.. ఆ సినిమా ఏదంటే? (ఫొటోలు)
-
విజయానందంలో సీనియర్ హీరోయిన్.. కాలికి కట్టుతో భర్త!
సీనియర్ నటుడు ధర్మేంద్ర డియోల్ 88 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా కనిపిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు కబుర్లు చెప్తూ ఉంటాడు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ సీనియర్ హీరో ఓ వీడియో షేర్ చేశాడు. గాయపడ్డ సింహం.. మళ్లీ బిజీ అయిపోయానంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో ఆయన తన ఫామ్ హౌస్లో ప్రకృతి నడుమ సేద తీరుతున్నాడు. చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అందులో అతడి కుడి కాలికి పట్టీ వేసి ఉంది. ఇది చూసిన అభిమానులు ఆయనకు ఏమైందని కంగారుపడుతున్నారు. ఆ గాయం త్వరగా మానుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఈయన చివరగా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, తేరి బాటీ ఐసా ఉల్జా జియా అనే సినిమాల్లో కనిపించాడు. ఇకపోతే ధర్మేంద్ర రెండో భార్య హేమమాలిని సంతోషంలో మునిగి తేలుతోంది. మధుర నియోజకవర్గం నుంచి ఆమె మూడోసారి ఎంపీగా గెలుపొందింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) చదవండి: నేను వాడిపడేసిన టిష్యూ ఏరుకుంది: నటి -
రెండో పెళ్లి.. ఇప్పటికీ విడిగానే.. యానివర్సరీ మాత్రం గొప్పగా
ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి మనసులు కలిశాయంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని దాటి మరీ ఒక్కటయ్యేందుకు రెడీ అయిపోతారు. బాలీవుడ్ సీనియర్ జంట ధర్మేంద్ర- హేమమాలిని విషయంలో ఇదే జరిగింది. ధర్మేంద్రతో ప్రేమలో పడేనాటికే అతడికి ప్రకాశ్ కౌర్ అనే భార్య ఉంది. ఈ జంటకు నలుగురు పిల్లలు సంతానం. రెండో పెళ్లిఈ బంధాన్ని కాపాడుకుంటూనే మోవైపు హేమమాలినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరు 44వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హేమమాలిని భర్తతో కలిసున్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని దండలు మార్చుకున్నారు. భర్త ప్రేమగా ముద్దుపెడుతుంటే సిగ్గుపడిపోయింది హేమ. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.అప్పుడే చిగురించిన ప్రేమహేమమాలిని, ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో తొలిసారి నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికి రెడీ అయ్యారు. అయితే హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. అయినా వినకుండా 1980లో ఈ జంట పెళ్లి పీటలెక్కింది. వీరికి ఈషా, అహనా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ధర్మేంద్ర తన మొదటి భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉండగా హేమమాలిని తన పిల్లలతో వేరుగా ఉంటోంది. Photos from today at home pic.twitter.com/JWev1pemnV— Hema Malini (@dreamgirlhema) May 2, 2024More photos for you pic.twitter.com/20naRKL8gA— Hema Malini (@dreamgirlhema) May 2, 2024చదవండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ -
ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?
బాలీవుడ్ నటి హేమ మాలిని అద్భుతమైన నటిగా రాణించడమే కాదు..రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఆమె భారతీయ జనతా పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని మూడోసారి యూపీలోని మధుర నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని 2014 నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె.. తన భర్తకు తాను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదనే విషయాన్ని వెల్లడించారు. హేమ మాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం తన భర్త, నాటి హీరో ధర్మేంద్రకు ఇష్టంలేదంటూనే, మరో హీరో వినోద్ ఖన్నా సూచనలతో రాజకీయాల్లో కాలుమోపానని తెలిపారు. రాజకీయాల్లో నెగ్గుకురావడం చాలా కష్టమని, అందుకే ధర్మేంద్ర తనను రాజకీయాల్లోకి వెళ్లవద్దని సూచించారన్నారు. ధర్మేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అందుకే తనకు అలాంటి సలహా ఇచ్చిరని హేమ మాలిని తెలిపారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ధర్మేంద్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. అయితే తాను తన భర్త ఎదుర్కొన్న పరిస్థితులను సవాల్గా స్వీకరించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టానని అన్నారు. ధర్మేంద్ర 2004 నుండి 2009 వరకు బికనీర్ నుండి ఎంపీగా ఉన్నారని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో నాడు నటుడు వినోద్ ఖన్నా తనకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎన్నికల్లో ఎలా ప్రసంగించాలో వినోద్ను చూసి నేర్చుకున్నానని, పబ్లిక్ని ఎలా ఫేస్ చేయాలో కూడా ఆయనే నేర్పించారన్నారు. బీజేపీ నేత వినోద్ ఖన్నా గురుదాస్పూర్ నుండి రెండుసార్లు ఎంపీగా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కూడా వ్యవహరించారు. -
స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అనేది అత్యంత కీలకమని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులు ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీలో 100శాతం స్వచ్చత ఎంత ముఖ్యమో... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈసీఐ ప్రతినిధుల బృందం సారథి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, అండర్ సెక్రటరీ సంజయ్కుమార్తోపాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్ పోలీస్ నోడల్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ తదితరులు హాజరయ్యారు. ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ అర్హత ఉన్నవారందరూ ఓటు నమోదు చేసుకునేలా, ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం ప్రధానమని చెప్పారు. బూత్, నియోజకవర్గ స్థాయిలో గతంలో నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలించి... తక్కువగా ఉన్నచోట అందుకు కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సమగ్ర, పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) అవసరమని, స్వచ్చమైన ఓటర్ల జాబితాతోపాటు సుశిక్షితులైన మానవవనరులు, మెటీరియల్ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలు ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఈఎస్ఎంఎస్, సువిధ, ఈఎన్కోర్, సీ విజిల్, ఈటీపీబీఎంఎస్, ఓటర్ టర్నవుట్, కౌంటింగ్ ఓట్స్ యాప్లపై అధికారులు, సిబ్బందికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు. జిల్లాస్థాయిలోనూ సమర్థ మానవ వనరులతో ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, ఓటు హక్కుపై స్ఫూర్తిదాయకమైన ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు, విశ్వసనీయత పెంపొందిస్తూ క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, మద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఎన్నికల సమయంలో నమోదైన కేసుల విచారణ, రాజకీయ తటస్థత కలిగిన ఎన్జీవోలు, పౌర సంస్థల భాగస్వామ్యం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం, ఓటింగ్ శాతం పెంపు కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు తదితరాలపై ఈసీఐ అధికారులు పలు సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు ఎస్ఎస్ఆర్–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎస్పీలు శాంతిభద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణ, అక్రమ మద్యం, డబ్బు తరలింపులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, చెక్పోస్టుల మ్యాపింగ్, సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారదర్శకంగా ఎస్ఎస్ఆర్–2024: సీఈవో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్–2023 కింద ఈ ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురించిన తర్వాత నుంచి దాదాపు 90 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 89 లక్షల దరఖాస్తుల పరిష్కారం పూర్తయిందన్నారు. మిగిలినవి ఈ నెల 26లోపు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎస్ఎస్ఆర్–2024, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ప్రతి దశలోనూ సమస్యను గుర్తించడంతోపాటు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జెయింట్ 7-టైర్ కేక్తో ధర్మేంద్ర 88వ పుట్టినరోజు వేడుకలు (ఫోటోలు)
-
కేంద్ర గిరిజన వర్సిటీకి నేడు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు. -
నిరాశ్రయులకు ఓటు హక్కు కల్పించేలాచర్యలు చేపట్టండి
సాక్షి, విశాఖపట్నం: అర్హత కలిగి ఉండి.. నిరాశ్రయులుగా ఉన్నవారికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్కుమార్ వ్యాస్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ–2024పై రెండు రోజుల సమీక్ష విశాఖలో గురువారం ముగిసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనా అధ్యక్షతన సదస్సు జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హృదేశ్కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర ఎన్ బుటాలియా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్కుమార్ హాజరయ్యారు. ప్రత్యేక సంక్షిప్త సవరణపై అవగాహన కలెక్టర్లకు ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్)–2024పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మానవ వనరుల లభ్యత, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఎన్నికల సిబ్బందికి, పోలింగ్ స్టేషన్లకు కనీస సౌకర్యాలు, ఫిర్యాదు నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ముగింపు సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితీష్కుమార్ వ్యాస్ మాట్లాడుతూ అర్హులైన వారందర్నీ ఓటరు జాబితాలో 100 శాతం చేర్పించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా నిరాశ్రయులపై శ్రద్ధ వహించాలనీ, అట్టడుగు సమాజంలో ఉన్న వారిని, మురికివాడలు, సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు, గిరిజన తండాల్లో నివాసితులు, పీవీజీటీ పరిధిలో (బలహీన గిరిజన సమూహాలు) ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ విలువైన ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనంతరం ఓటర్ల నమోదుపై వచ్చే ప్రతి ఫిర్యాదుపై శ్రద్ధ వహించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు ఓటింగ్, ఎన్నికల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. ఈవీఎంలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని స్పష్టం చేశారు. యువ ఓటర్లు, వలస ఓటర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఎస్ఆర్–2024 ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అర్హులైన ఓటర్లతో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకంగా ఉన్న ఓటర్ల జాబితా తయారు చేసేందుకు 26 జిల్లాల కలెక్టర్లు నిరంతరం కృషి చేయాలని ధర్మేంద్రశర్మ, నితీష్ ఆదేశించారు. -
87 ఏళ్ల వయసులో లిప్లాక్ సీన్.. అవసరమే అంటున్న నటుడు
నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు.. ఏమని చెప్పగలం? అన్నింటిలోనూ ఒక అడుగు ముందే ఉంటాడు ధర్మేంద్ర. ఆరు దశాబ్ధాలుగా బాలీవుడ్లో తిరుగులేని స్టార్గా వెలుగొందుతున్న ఈయన ఇప్పటివరకు 300కు పైగా చిత్రాలు చేశాడు. ఇప్పటికీ వెండితెరపై తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న ఈయన తాజాగా రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో నటించాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న విడుదలైంది. ఈ మూవీలో ధర్మేంద్ర, అలనాటి నటి షబానా అజ్మీ.. లిప్లాక్ సీన్లో నటించారు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. 87 ఏళ్ల వయసులో ముద్దు సన్నివేశంలో నటించడమేంట్రా బాబూ అని ఆశ్చర్యపోయారు. కొందరైతే ముసలాడికి దసరా పండగలా ఉంది.. అస్సలు బాగోలేదు అని విమర్శించారు. తాజాగా ఈ సన్నివేశంపై ధర్మేంద్ర స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నేను, షబానా కిస్ సీన్తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసినట్లున్నాం. చాలామంది ఈ సీన్ చూసి చప్పట్లు కూడా కొట్టినట్లున్నారు. మా నుంచి జనాలిది అస్సలు ఊహించి ఉండరు కదా! అందుకే దీనికింతలా రెస్పాన్స్ వస్తోంది. నేను ఇంతకుముందు చివరిసారిగా లైఫ్ ఇన్ ఎ మెట్రో అనే సినిమాలో నఫీసా అలీతో ముద్దు సన్నివేశంలో నటించాను. అప్పుడు కూడా జనాలు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో మా ముద్దు సన్నివేశం గురించి డైరెక్టర్ కరణ్ జోహార్ మాకు ముందే చెప్పాడు. అప్పుడు నేనేమీ అంత సర్ప్రైజ్ అవలేదు. ఈ సినిమాకు అది అవసరం అనిపించింది. అందుకే నేను చేస్తానని చెప్పాను. అయినా రొమాన్స్కు వయసుతో పనేంటి? వయసు అనేది కేవలం నెంబర్స్ మాత్రమే సూచిస్తాయి. ఏ వయసు వాళ్లైనా ఇద్దరి మధ్య ప్రేమను ముద్దు ద్వారానే బయటపెడతారు. ఈ సీన్లో నటించేటప్పుడు నేను, షబానా ఏమాత్రం ఇబ్బందిగా ఫీలవలేదు' అని చెప్పుకొచ్చాడు ధర్మేంద్ర. చదవండి: ప్రేమకో దండం.. బ్రేకప్ చెప్పిన రీతూ వర్మ ఆ సినిమాకు రూ.250 కోట్లా? దాన్నెవరు చూస్తారు?: కంగనా -
ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఇదే! బాహుబలి, దంగల్ కాదు!
సినిమా అంటే వినోదం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి కలర్ఫుల్ స్క్రీన్స్ వరకు, మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాల దాకా ఎక్కడా ఎంటర్టైన్మెంట్కు ఇసుమంత లోటు కూడా కనిపించదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంటుంది చిత్రపరిశ్రమ. అటు ప్రేక్షకులు కూడా సినిమాలను ఆస్వాదిస్తారు, అందులో నటించే హీరోహీరోయిన్లను ఆరాధిస్తారు. ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో పాతిక, యాభై, వంద, రెండు వందల రోజులు కూడా ఆడేవి. కానీ ఇప్పుడు.. ఎంత పెద్ద సినిమా అయినా మూడు వారాలకు తట్టాబుట్టా సర్దాల్సిందే! ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఏ చిత్రాన్ని ఎక్కువమంది చూశారో తెలుసా? బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, దంగల్ సినిమాలనుకుంటే పొరపాటే! అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన షోలే. అంజాద్ ఖాన్కు ఇది తొలి చిత్రం. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్.. ఇలా అగ్రతారలు నటించారు. అప్పట్లో ఈ సినిమాకు టికెట్ల ఊచకోత జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. దర్శకుడు రమేశ్ సిప్పీ తెరకెక్కించిన ఈ ఐకానిక్ చిత్రం 1975లో రిలీజైంది. తొలి షోకే హిట్ టాక్.. ఫలితంగా ఆల్టైం బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రికార్డును దశాబ్ద కాలంపాటు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారు. షోలే తొలిసారి రిలీజైనప్పుడు, అలాగే రీరిలీజ్ అయినప్పుడు మొత్తంగా భారత్లో 15-18 కోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇతర దేశాల్లో కూడా షోలేకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇది ఏ రేంజ్లో ఉందంటే ఒక్క రష్యాలోనే 6 కోట్ల టికెట్లు కొనేశారు అక్కడి జనాలు. ఇతర దేశాల్లో తక్కువలో తక్కువ 2 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోయాయట! అంటే ప్రపంచవ్యాప్తంగా 22 -26 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోవడంతో భారతీయ సినీచరిత్రలో షోలే రికార్డు సృష్టించింది. అప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్ల దాకా రాబట్టింది. ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే దాని విలువ సుమారు రూ.2800 కోట్ల దాకా ఉంటుంది. టాప్ 10 చిత్రాలు కేవలం భారత్లో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాల జాబితా విషయానికి వస్తే.. షోలే 15 కోట్లతో తొలి స్థానంలో ఉంది. బాహుబలి 2: ది కన్క్లూజన్ 12 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొఘల్ ఇ ఆజమ్, మదర్ ఇండియా.. చెరో 10 కోట్లు, హమ్ ఆప్కే హై కోన్..7.4 కోట్లు, ముఖద్దార్ కా సికిందర్.. 6.7 కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని.. 6.2 కోట్లు, క్రాంతి.. 6 కోట్లు, బాబీ.. 5.3 కోట్లు, గంగా జమున.. 5.2 కోట్లు, గదర్, కేజీఎఫ్ చాప్టర్ 2, సంఘం.. చెరో 5 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక? -
భర్తకు దూరంగా ఉండటంపై మొదటిసారి స్పందించిన హేమమాలిని
బీటౌన్ సీనియర్ నటుడు ధర్మేంద్ర హేమమాలినిని వివాహం చేసుకున్నప్పటికీ, తన మొదటి భార్య నుంచి ధర్మేంద్ర విడాకులు తీసుకోలేదు. దీంతో తన కుమార్తెలు ఈషా, అహ్నాలతో కలిసి ప్రస్తుతం హేమ ఉంటున్నారు. వీరిద్దరి వివాహం 1980లోనే అయింది. కానీ వేర్వేరు ఇళ్లలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భర్త నుంచి వేరుగా ఉండటంపై హేమమాలిని స్పందించారు. (ఇదీ చదవండి: పవన్ 'బ్రో' విషయంలో సీరియస్ అయిన థమన్..!) మొదటి భార్య ప్రకాశ్ కౌర్తో ధర్మేంద్ర ఇంటర్వ్యూయర్ ఆమెను ఫెమినిస్ట్ ఐకాన్గా పరిగణిస్తూ.. మీరు ఒంటరిగా ఉండేందుకు ఇది కూడా ఒక కారణమనే చెప్పవచ్చా అనే ప్రశ్నకు హేమా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను స్త్రీవాదానికి చిహ్నమా..? (నవ్వుతూ). ఎవరూ భర్తకు దూరంగా ఉండాలని కోరుకోరు. జీవితం ఏదిస్తుందో అది జరుగుతుంది. దానిని మనం స్వీకరించాల్సిందే. ప్రతి స్త్రీకి భర్త, పిల్లలు కావాలని కోరుకుంటుంది. కానీ ఎక్కడో ఆ లెక్కలు తప్పుతాయి. లేకపోతే, ఎవరికీ తమ జీవితాన్ని ఇలా గడపాలని అనిపించదు. అని హెమ తెలిపారు. 'బాధపడటం లేదు' 'భర్తకు దూరంగా ఉండటంలో నేను బాధపడటం లేదు. నాతో నేను సంతోషంగా ఉన్నాను. నాకు నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను వారిని చాలా బాగా పెంచాను. అయితే, అతను (ధర్మేంద్ర) ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. ప్రతిచోటా. పిల్లలకు తొందరగా పెళ్లి చేయాలి అని భయపడేవాడు. నేను ఇది జరుగుతుంది అనే చెప్పేదానిని. సరైన సమయం వచ్చినప్పుడు, సరైన వ్యక్తి వస్తాడు అని ఆయనకు ధైర్యం చెప్పేదాన్ని. భగవంతుడు, గురువుల ఆశీర్వాదంతో నా పిల్లల ఇద్దరి పెళ్లిల్లు అయిపోయాయి. మేమిద్దరం అనుకున్నది ప్రతిదీ జరిగింది.' అని హేమ అన్నారు. రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర హేమమాలినిని ధర్మేంద్ర మొదటిసారి కలిసినప్పుడు ప్రకాష్ కౌర్ను వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్లకు ఇద్దరు కుమారులు - సన్నీ డియోల్,బాబీ డియోల్తో పాటు ఇద్దరు కుమార్తెలు అజీత, విజేత ఉన్నారు. ఇటీవల, ధరమేంద్ర మనవడు కరణ్ డియోల్ వివాహం జరిగింది. హేమమాలిని కుటుంబం నుంచి ఎవరూ ఆ పెళ్లికి హాజరు కాలేదు. దీంతో భార్య, కుమార్తెల కోసం ఒక భావోద్వేగ పోస్ట్ కూడా ధర్మేంద్ర రాశారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్) -
భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో!
బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని 1970ల్లో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత హేమ ధర్మేంద్రతో కలిసి 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలోమొదటిసారి నటించారు. ఈ సినిమాతోనే హేమమాలిని, ధర్మేంద్ర మధ్య ప్రేమ చిగురించింది. కానీ అప్పటికే ధర్మేంద్రకు పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ధర్మేంద్ర, హేమ మాలిని 1980లో వివాహం చేసుకున్నారు. (ఇది చదవండి: బిగ్బాస్ హౌస్లో ముద్దులాట.. తప్పు మీది.. నన్నెందుకు పంపించేశారు?) అయితే ఈ జంటకు మొదట ఈషా డియోల్ జన్మించింది. అయితే పాప పుట్టినప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. హేమమాలిని డెలివరీ కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసుకున్నారట. దీనికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే ఈ విషయాన్ని హేమ మాలిని స్నేహితుల్లొ ఒకరు వివరించారు. హేమ ప్రసవించిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇలా చేశారని చెప్పుకొచ్చారు. ఈషా పుట్టడానికి ధర్మేంద్ర 100 గదుల ఆసుపత్రిని ఎందుకు బుక్ చేయాల్సి వచ్చిందో అప్పుడు చాలామందికి అర్థం కాలేదని వెల్లడించారు. ఓ షోలో పాల్గొన్న హేమమాలినికి ఆమె స్నేహితురాలు నీతూ కోహ్లి ఈ సంఘటనను గురించి అడిగారు. అయితే దీనిపై కొందరు భిన్నంగా స్పందించారు. దీనివల్ల ఇతరులు ఇబ్బందులు పడతారని తెలియదా అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు అనవసరమైనవని మండపడుతున్నారు. మరికొందరేమో ఆస్పత్రికి బదులు ఒక ఫ్లోర్ బుక్ చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. ధర్మేంద్ర, హేమ లవ్ స్టోరీ కాగా.. హేమ ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో మొదటిసారి నటించారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న జంట 1980లో వివాహం చేసుకున్నారు. హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. ఈ జంటకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతకుముందు 1954లో ప్రకాశ్ కౌర్ను వివాహం చేసుకోగా.. నలుగురు పిల్లలు జన్మించారు. (ఇది చదవండి: అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్) -
ఇంట్లో పెళ్లికి డుమ్మా కొట్టిన భార్యాపిల్లలు.. సోషల్ మీడియాలో నటుడి భావోద్వేగం
బాలీవుడ్ నటదిగ్గజం ధర్మేంద్ర మనవడు కరణ్ డియోల్ ఓ ఇండివాడైన సంగతి తెలిసిందే! దృష ఆచార్యతో అతడు ఏడడుగులు నడిచాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ పెళ్లికి ధర్మేంద్ర భార్యాకూతురు డుమ్మా కొట్టారు. అదేంటి? కుటుంబంలోని వ్యక్తి పెళ్లికి రాకపోవడం ఏంటనుకుంటున్నారా? అయితే ముందు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోవాల్సిందే! మొదటి భార్య ప్రకాశ్ కౌర్తో ధర్మేంద్ర మొదటి భార్య.. నలుగురు సంతానం ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. అతడు 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్ను పెళ్లాడాడు. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజీత అని నలుగురు సంతానం. ఇటీవల పెళ్లి చేసుకున్న కరణ్.. సన్నీ డియోల్ తనయుడు! సుమారు 70 ఏళ్లుగా ధర్మేంద్ర- ప్రకాశ్ కౌర్ కలిసి జీవిస్తున్నారు. ఇకపోతే అతడికి పెళ్లైన విషయం తెలిసి కూడా నటి హేమమాలిని ధర్మేంద్రను ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు ఈషా, అహానా సంతానం. వీరిని సన్నీ డియోల్.. కరణ్ పెళ్లికి రావాలని ఆహ్వానించినప్పటికీ ఈ కుటుంబం మాత్రం వేడుకకు వచ్చేందుకు మొగ్గు చూపలేదు. పెళ్లి పందిట్లో హేమమాలిని, ఆమె కూతుర్లు ఎక్కడా కనిపించనేలేదు. ధర్మేంద్ర పిలవకపోవడంతోనే వాళ్లు రాలేదని ప్రచారం జరిగింది. రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర పిలవనందుకే క్షమాపణలు! ఈ క్రమంలో ధర్మేంద్ర సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. 'హేమ, నా డార్లింగ్ పిల్లలు ఇషా, అహానా.. అల్లుళ్లు తక్తానీ, వోహ్రా.. మిమ్మల్ని నేను ఎంతగానో గౌరవిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వయసు పైబడటం, అనారోగ్యం నాకో విషయాన్ని గుర్తు చేశాయి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సింది. కానీ..' అంటూ వాక్యాన్ని సగంలోనే ఆపేస్తూ క్షమించండి అన్నట్లుగా చేతులు జోడించిన ఎమోజీని జత చేస్తూ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) చదవండి: రెండో భర్తకు విడాకులు.. కారణాలు అనవసరం అంటున్న నటి -
హీరోలందరికి ఎఫైర్లున్నాయి.. నా భర్తను మాత్రమే ఎందుకంటారు?
అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు పాత తరంలో చెప్పలేనంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో.. ఇప్పటికీ తను నటించిన షోలే(1975) సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉంది. దీంతో నేటి తరం వారికి కూడా ఆయనంటే అభిమానం. (ఇదీ చదవండి: అభిమాని చేసిన పనికి భావోద్వేగానికి గురైన తమన్నా) ప్రముఖ నటి హేమమాలిని ధర్మేంద్ర జీవితంలో అడుగుపెట్టేనాటికే అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ హేమమాలినితో అతడు ప్రేమలో పడ్డాడు. అటు ఆమె కూడా ధర్మేంద్రను ఎంతగానో ప్రేమించింది. ఈ ప్రేమకు మొదటి పెళ్లి అడ్డవుతుందని అంతా అనుకున్నారు, కానీ వారు మాత్రం అలాంటి భయాలేమీ పెట్టుకోలేదు. 1980లో హేమమాలినిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితంలోకి స్వాగతించాడు. కాగా వారికి 1981లో ఇషా డియోల్, 1985లో అహనా డియోల్ జన్మించారు. తాజాగా ఇదే విషయంపై హేమమాలినిని ధర్మేంద్ర పెళ్లి చేసుకోవడంపై మొదటి భార్య ప్రకాష్ కౌర్ సమర్థించింది. హేమమాలిని కూడా ధర్మేంద్రకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యులతో చాలా మర్యాదగానే ప్రవర్తిస్తుందని ప్రకాష్ కౌర్ చెప్పుకొచ్చింది. గతంలో దర్మేంద్రను 'ఉమెనైజర్' అని పలువురు కామెంట్లు చేశారు.. అదే కామెంట్లను ఇప్పుడు కూడా కొందరు చేస్తూ ఉంటారు. అని ప్రకాష్ కౌర్ ఇలా స్పందించింది. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) 'నా భర్త మాత్రమే ఎందుకు, ఏ మగాడైనా నాకంటే హేమమాలినినే ఇష్టపడతారు. ఇండస్ట్రీలో సగం మంది ఇదే పని చేస్తున్నప్పుడు నా భర్తను ఉమెనైజర్ అని పిలవడానికి ఎవరైనా ఎంత ధైర్యం చేస్తారు? హీరోలందరూ ఎఫైర్లు పెట్టుకుని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అతను నాకు మంచి భర్త కాకపోవచ్చు, కానీ అతను ఖచ్చితంగా ఉత్తమ తండ్రి. అతని పిల్లలు అతన్ని చాలా ప్రేమిస్తారు. అతను వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.' అని చెప్పింది. ధర్మేంద్ర మొదటి భార్య పిల్లలు బాలీవుడ్లో టాప్ హీరోలైన సన్నీ డియోల్,బాబీ డియోల్ అని తెలిసిందే. కాగా వారికి విజేత,అజీత అనే సోదరీమణుల ఉన్నారు. -
ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తనయుడు, నటుడు కరణ్ డియోల్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి దృష ఆచార్యతో ఏడడుగులు నడిచాడు. జూన్ 18న ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి శ్రీకారం చుట్టే వివాహ వేడుక కోసం సుందరంగా ముస్తాబైందీ కొత్త జంట. నూతన వధువు ఎరుపు లెహంగాలో మెరిసిపోగా, వరుడు కరణ్ డియోల్ షేర్వానీ ధరించాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆదివారం రాత్రి సినీప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఇకపోతే కరణ్ డియోల్.. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుక సైతం ఘనంగా జరిగింది. బరాత్ వేడుకలో కరణ్ తండ్రి సన్నీ డియోల్తో పాటు బాబీ, అభయ్ డియోల్, తాతయ్య ధర్మేంద్ర కూడా స్టెప్పులేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం?: ఆదిపురుష్ రచయిత -
నా భర్తకు మొదటి భార్య ఉందని ఎప్పుడూ టార్చర్ పెట్టలేదు: నటి
ప్రముఖ నటి హేమమాలిని నటుడు ధర్మేంద్ర జీవితంలో అడుగుపెట్టేనాటికే అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ హేమమాలినితో అతడు ప్రేమలో పడ్డాడు. అటు ఆమె కూడా ధర్మేంద్రను ఎంతగానో ప్రేమించింది. ఈ ప్రేమకు మొదటి పెళ్లి అడ్డవుతుందని అంతా అనుకున్నారు, కానీ వారు మాత్రం అలాంటి భయాలేమీ పెట్టుకోలేదు. 1980లో హేమమాలినిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితంలోకి స్వాగతించాడు. తాజాగా ఓ షోకి హాజరైన ఆమెకు.. ధర్మేంద్ర మొదటి భార్యను చూస్తే అసూయ కలగలేదా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె స్పందిస్తూ.. ఏరోజూ నాకు అసూయ పుట్టలేదు. అందుకే నేనిప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాను. లవ్లో ఉన్నప్పుడు ప్రేమను పంచాలే తప్ప ఇతరత్రా వాటిని ఆశించకూడదు. నువ్వు ప్రేమించే వ్యక్తి నీకు అంతకన్నా ఎక్కువ ప్రేమను పంచుతున్నప్పుడు ఏదో చిన్నచిన్న విషయాల కోసం అతడిని ఎందుకు టార్చర్ చేస్తాం? తను నన్ను బాగా చూసుకున్నాడు కాబట్టే నేనెప్పుడూ బాధపడలేదు, తనపై కోప్పడలేదు, టార్చర్ పెట్టలేదు. అందుకే ఇప్పటికీ మేము ఒకరికొకరం ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటున్నాం. మా మధ్యలోకి దేన్నీ దూరనివ్వం. అతడి సమస్యలు నాకు తెలుసు కాబట్టి కొన్నికొన్ని సందర్భాల్లో నేను సర్దుకుపోతాను. మనం ఏదైనా ఇస్తే దానికి రెట్టింపు మనకు లభిస్తుంది. అది ప్రేమేనని నేను నమ్ముతాను. ఆ ప్రేమకు విలువ ఇవ్వాలన్నది నా అభిప్రాయం' అని చెప్పుకొచ్చింది నటి. కాగా ధర్మేంద్ర- హేమమాలినిలకు 1981లో ఇషా డియోల్, 1985లో అహనా డియోల్ జన్మించారు. చదవండి: త్వరగా ఎదిగేందుకు ఇంజక్షన్స్ తీసుకున్న హన్సిక? -
ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ హీరో సిద్ధార్థ్తో డేటింగ్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరి నుంచి అధికారిక సమాచారం లేదు. చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్ రీసెంట్గా యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా అదితి సిద్ధార్థ్కు షాకిచ్చింది. సిద్ధార్థ్కు కాకుండ మరో సీనియర్ హీరోకి ఆమె ప్రపోజ్ చేసింది. వాలంటైన్స్ డే సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్కి బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్రతో పాటు అదితి కూడా ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా అదితి ఆయనకు రెడ్ గులాబి ఇచ్చి సరదగా ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఈ ఫొటోని అదితి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీనికి ‘ది మోస్టెస్ట్ హ్యాండ్సమ్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పోస్ట్పై హీరో సిద్ధార్థ్ స్పందించడం విశేషం.పోస్ట్ 2 హార్ట్ ఎమోజీలతో అదితి పోస్ట్పై స్పందించాడు. అయితే వాలంటైన్స్ డే రోజున సిద్ధార్థ్కు ప్రపోజ్ చేయకపోవడం ఏంటి? అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్పై స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. కాగా సిద్ధార్థ్, అదితి రావు హైదరీలు మహాసముద్రం చిత్రంలో ప్రేమికులుగా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
కాపురాలు కూల్చడం మాకు సరదా కాదు: నటి
పచ్చని కుటుంబం చిన్నాభిన్నం కావడానికి ఆడవాళ్లే కారణం కాదంటోంది సీనియర్ నటి అరుణ ఇరానీ. మగవాళ్లే ఇల్లాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారని, కానీ వారిని పక్కనపెట్టి ఇతర మహిళలనే లోకం తప్పుపడుతోందని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆడవాళ్లు తమ కాపురాలు కూలిపోవడానికి మరో ఆడదే కారణం అని వారిని తిడుతుంటారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి.. మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యత మీ భర్తది కానీ వేరేవాళ్లది ఎలా అవుతుంది? ముందు అతడిని అదుపులో పెట్టండి. కేవలం ఒకరి సంసారాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఏ అమ్మాయి వివాహేతర సంబంధానికి పూనుకోదు. ఉదాహరణకు హేమమాలినిని తీసుకోండి. ఆమె ధర్మేంద్ర కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాన్న ఉద్దేశంతో అతడిని పెళ్లి చేసుకుందా? కాదు కదా! ఏదో ఒక కాగితం మీద రాసుకున్నదాన్ని బట్టి అతడు నా భర్త, ఆమె నా భార్య అంటుంటారు, కానీ ఆ పేపర్కు పెద్ద విలువేమీ ఉండదు. ప్రేమకు ఉన్న సెక్యూరిటీ పెళ్లికి లేదు. ప్రేమ లేనిచోట పెళ్లి చేసుకున్నా వృధానే.. అయినా ఆల్రెడీ పెళ్లైన మగవారితో మళ్లీ ఏడడుగులు నడవడం అంత సులువైన విషయం కాదు. అర్ధరాత్రి నా బిడ్డకేదైనా అయితే ఆ మనిషికి నేను ఫోన్ చేయలేను. అలాంటి బాధలు పడటం ఎందుకని పిల్లలు వద్దనుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా అరుణ ఇరానీ 1990లో ఫిలింమేకర్ కుకు కోహ్లిని పెళ్లాడింది. అప్పటికే అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన నటి, కొడుకుతో కలిసి విదేశాలకు -
'త్వరలో షోలే-2 రాబోతుంది.. సిద్ధంగా ఉండండి'
ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా టి20 సిరీస్పై కన్నేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా తొలి టి10 ఆడేందుకు రాంచీలో అడుగుపెట్టింది. సీనియర్లు అయిన రోహిత్, కోహ్లి లేకుండానే పాండ్యా కెప్టెన్సీలో మరో టి20 సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్లో సెమీస్ వైఫల్యం అనంతరం బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ నుంచి పాండ్యాకు అప్పజెప్పింది. వచ్చే టి20 వరల్డ్కప్ వరకు సరికొత్త జట్టును తయారు చేయాలనే లక్ష్యంతో పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వగా.. దానిని అతను సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఐర్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకలపై టి20 సిరీస్లు గెలిచిన పాండ్యా.. తాజాగా మరోసారి రోహిత్ గైర్హాజరీలో కివీస్తో టి20 సిరీస్కు టీమిండియాను నడిపించనున్నాడు. ఇక శుక్రవారం(జనవరి 27న) రాంచీ వేదికగా కివీస్, భారత్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఇక రాంచీ టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి స్వస్థలమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా బుధవారం రాత్రి టీమిండియా రాంచీలో అడుగుపెట్టింది. మరుసటి రోజే హార్దిక్ పాండ్యా తన అభిమాన ఆటగాడు ధోనితో గడిపేందుకు అతని ఇంటికి వెళ్లాడు. ధోని ఇంట్లో ఉన్న బైక్ గ్యారేజీ సెంటర్లో సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా పాండ్యా.. ధోనిని మోటార్సైకిల్లో సైడ్కార్లో ఎక్కించుకున్న ఫోటోను షేర్ చేశాడు. ''త్వరలో షోలే-2 మీ ముందుకు రాబోతుంది.. సిద్ధంగా ఉండండి'' అంటూ కామెంట్ చేశాడు. షోలే(1975) సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉంది. భారతీయ సినిమా గర్వించదగ్గ షోలే సినిమాలో అమితాబ్, ధర్మేంద్రలు ''యే దోస్తీ హమ్ నహీ చోడేంగే..'' పాట సందర్భంగా ఇదే తరహాలో బైక్పై వెళ్లడం గుర్తుండే ఉంటుంది. డ్రైవర్ సీటులో ధర్మేంద్ర ఉంటే.. పక్కన సైడ్కార్లో అమితాబ్ కూర్చొని పాట పాడుకుంటూ వెళ్తారు. అచ్చం అదే ఫోటోని రిపీట్ చేసిన పాండ్యా.. మోటార్సైకిల్ను తాను డ్రైవ్ చేయగా.. పక్కన సైడ్కార్లో ధోని దర్జాగా కూర్చొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Sholay 2 coming soon 😉 pic.twitter.com/WixkPuBHg0 — hardik pandya (@hardikpandya7) January 26, 2023 చదవండి: టాప్లెస్గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్ప్రెషన్కు అర్థమేంటి! -
షాకింగ్ ఘటన: స్టేజ్పై ఉన్నట్టుండి పాడటం ఆపేసిన సింగర్
కొత్త గొంతుకలను వెలుగులోకి తీసుకొచ్చే షో ఇండియన్ ఐడల్. ఈ ప్రఖ్యాత పాటల పోటీల్లో పాల్గొన్న వారు భావి గాయకులుగా మారి సంగీతప్రియుల మది దోచుకుంటున్నారు. మన తెలుగు సినీ గాయకుడు రేవంత్ కూడా ఆ కోవకు చెందిన వాడే. తాజాగా హిందీ ఇండియన్ ఐడల్ 12వ సీజన్ కొనసాగుతోంది. ఈ పోటీల్లో తన పాటలతో మెస్మరైజ్ చేస్తున్న పవన్దీప్ రాజన్ అనూహ్యంగా ప్రేక్షకులతో పాటు జడ్జిలను షాక్కు గురి చేశాడు. తన్మయత్వంతో పాట పాడుతుండగా అందరూ మరో లోకంలో తేలుతున్న సమయంలో హఠాత్తుగా పవన్దీప్ అర్ధాంతరంగా పాట ఆపేసి.. ఇక చాలు అని వెళ్లిపోయాడు. ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమోను సోనీ టీవీ విడుదల చేసింది. పవన్దీప్ ‘హోతన్ సే చులో తుమ్’ పాట పాడుతూ అకస్మాత్తుగా ఆపేశాడు. అంతసేపు ఆసక్తిగా వింటున్న జడ్జిలు ఒకప్పటి నటీనటులు ధర్మేంద, అనితా రాజ్ పాట ఆగిపోవడంతో జడ్జిలు, తోటి పోటీదారులు షాకయ్యారు. మైక్ ఆపేసి వెళ్తున్న పవన్దీప్ను మరో పార్టిస్పెంట్ నిలువరించి పాటను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ప్రేమ్గీత్ సినిమాలో ఆ పాటను గజల్ కింగ్ జగ్జీత్ సింగ్ పాడారు. ఆయనను మరిపించేలా పాడుతున్న పవన్దీప్ ఇలా చేయడంతో ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు. ఉత్తరాఖండ్కు చెందిన పవన్ దీప్ సీజన్ మొదటి నుంచి ప్రేక్షకులను తన పాటలతో రంజింపజేస్తున్నారు. అతడి మధురమైన గాత్రానికి సోషల్ మీడియా ఫిదా అవుతోంది. ఇండియన్ ఐడల్ 12వ విజేతగా పవన్దీప్ రాజన్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటి రాజన్ అకస్మాత్తుగా ఇలా చేయడంతో షోలో అతడిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న పవన్దీప్ గతంలో కరోనా బారినపడ్డాడు. దీంతో పవన్దీప్ వర్చువల్గా ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొని వార్తల్లో నిలిచాడు. #IdolPawandeep ki iss performance se kya rang layega iss shaam ka mausam? Dekhiye #DharmendraAndAnitaRajSpecial #IndianIdol2020 aaj raat 9:30 baje, sirf Sony par! pic.twitter.com/YxptSJS1QO — sonytv (@SonyTV) July 18, 2021 -
నా భర్తను కలిసి ఏడాది దాటిపోయింది: హేమ మాలిని
‘కలసి ఉంటే కలదు సుఖం’ అంటారు. కానీ ఇదే విషయాన్ని సీనియర్ నటి హేమ మాలిని వేరే విధంగా చెబుతున్నారు. దూరంగా ఉంటే క్షేమంగా ఉంటాం అంటున్నారు. భర్త ధర్మేంద్రను హేమ కలసి ఏడాది పైనే అయింది. ఈ ఇద్దరూ దూరం కావడానికి కారణం కరోనా. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో ఎక్కడివాళ్లు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. ధర్మేంద్ర, హేమ మాలిని విషయంలో ఇదే జరిగింది. నిజానికి గతేడాది లాక్ డౌన్ నుంచే ధర్మేంద్ర ముంబయ్కి దూరంగా ఉన్న ఫామ్హౌస్లో ఉన్నారు. హేమ ఏమో ముంబయ్లో ఉన్నారు. తాజాగా లాక్డౌన్ విధించడంతో ఇద్దరూ ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోయారు. ఈ విషయం గురించి హేమ మాలిని మాట్లాడుతూ –‘‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండటం అవసరం. ఇప్పుడు ఒకరినొకరు కలుసుకోవడం కన్నా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆయన్ను (ధర్మేంద్ర) మేం కలవడంకన్నా ఆయన ఆరోగ్యంగా ఉండటం మాకు ముఖ్యం. వందేళ్ల మానవ చరిత్రలో ఇంత పెద్ద అంటువ్యాధిని మనం ఇప్పుడే ఎదుర్కొంటున్నాం. సమాజాన్ని కాపాడుకోవాలంటే.. మనం ధైర్యంగా నిలబడాలంటే మనిషికీ మనిషికీ దూరం పాటించాల్సిందే. ఈ త్యాగం చేయాలి’’ అన్నారు. ధర్మేంద్ర వయసు దాదాపు 85. హేమకు 70 ఏళ్లు పైనే. ఈ కరోనా టైమ్లో వయసు పైబడినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇంటిపట్టునే ఉండాలి. అందుకే ధర్మేంద్ర–హేమ ఇలా దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరూ 1980లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే ధర్మేంద్రకి పెళ్లయి, ఇద్దరు కుమారులు సన్నీ, బాబీ డియోల్ ఉన్నారు. ధర్మేంద్ర–హేమకు ఇద్దరు కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. -
కోవిడ్ టీకా వేయించుకున్న బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర!
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంబిస్తొంది. ప్రతిరోజు కేసులు సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. దీని వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే కేంద్రం వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే దీన్నిచాలా మంది సెలబ్రీటిలు వ్యాక్సిన్ను వేయించుకున్నారు. తాజాగా, బాలీవుడ్ హిందీ నటుడు ధర్మేంద్ర కూడా ఆ జాబితాలో చేరిపోయారు. 85 ఏళ్ళవయసులో కొవిడ్19 వ్యాక్సిన్ను వేయించుకొని అందరిలోను జోష్ను నింపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే, హేమమాలినీ, జితేంద్ర, కమల్హసన్, మోహన్లాల్, అక్కినేని నాగార్జునా, రాకేష్ రోషన్, పరేష్రావల్ తదితరులు వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర తన ట్విటర్ ఖాతలో వీడియోను పోస్ట్ చేస్తూ..‘ ఇదేదో చూపించాలని కాదూ’ నన్నుచూసి నా అభిమానులు కూడా వ్యాక్సిన్ వేసుకుంటారని అనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. ‘కర్తే కర్తే..జోష్ ఆగయా..ఔర్ మై నికల్ గయా వ్యాక్సిన్లేనే’ ( సోషల్ మీడియా వేదికగా కొవిద్ నిబంధనల పట్ల ట్విట్లు చేశాను..నాకు జోష్ వచ్చింది..వెంటనే వ్యాక్సిన్ తీసుకున్నాను.. అని పోస్ట్ పెట్టారు. నా మిత్రులు, ప్రజలు, అభిమానులంతా విధిగా కరొనా వ్యాక్సిన్ను వేయించుకోవాలని కోరారు. ధర్మేంద్ర బాలీవుడ్లో అనేక హిట్ సినిమాల్లో నటించారు. షోలే, ఫుల్ ఔర్ పత్తర్, కాజల్, దర్మ్ ఔర్ కానున్, భగవత్ ,చరాస్..వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు. ఆయన 2018లో చివరిసారిగా ‘యమ్లా పగ్లా దివానా’లో నటించారు. ఈయన తన కుమారులు సన్నీ, బాబీడియోల్లతో కలిసి నటించారు. చదవండి: కరోనా నివారణకు లాక్డౌన్ ఒక్కటే మార్గం’ -
ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమే
పెట్రోల్, డీజిల్పై విధించిన పన్నులను తగ్గించాలని అని వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్న కారణంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఈ విషయంపై స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమేనని అని అన్నారు. అయితే, ఇంధన ధరలపై విధించిన పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉంది అన్నారు. "అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదల కారణంగా భారతదేశం కూడా ఇంధన ధరలను పెంచవలసి వచ్చింది. కానీ, ఇది తాత్కాలికం త్వరలో క్రమంగా ధరలు తగ్గుతాయి" అని కేంద్ర మంత్రి అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ఇంధనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై పన్నులను విధిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పెట్రోలియం ధరపై కేంద్రం మాత్రమే సుంకాలు విధించడం లేదు రాష్ట్రాలు కూడా సుంకాలు విధిస్తున్నాయి కాబట్టి రాష్ట్రాలు, కేంద్రం చర్చించాల్సిన అవసరం ఉంది అన్నారు. కేంద్రం వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొంది. చదవండి: దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్ మారుతి సుజుకి బంపర్ అఫర్ -
మా నాన్నను ధర్మేంద్ర ఏడిపించారు..
‘ఒక విదేశీ షూటింగ్కు నాతోపాటు మా నాన్న వచ్చారు. ధర్మేంద్రతో పాటలో యాక్ట్ చేయాలి. నాన్నకు అప్పటికే ధర్మేంద్ర నా వెంట పడటం తెలుసు. అందుకని నాన్న ప్రతిసారి మా కారు ధర్మేంద్ర ఎక్కకుండా అడ్డుకునేవారు. అయినా సరే ధర్మేంద్ర మా కారులోనే వస్తానని అనేవారు. నేను బ్యాక్సీట్లో కూచోగానే మా నాన్న వెంటనే డోర్ తీసుకుని నా పక్కన కూచునేవారు. ధర్మేంద్ర చాలా క్లవర్. ఇంకో డోర్ నుంచి ఆయన ఎక్కి నా పక్కన కూచునేవారు. వాళ్లు ఇలా నా కోసం ప్లాన్లు వేయడం సరదాగా అనిపించేది’ అన్నారు హేమమాలిని. 72 సంవత్సరాల హేమమాలిని నేటికి బాలీవుడ్ ‘డ్రీమ్గర్ల్’గా ఉన్నారు. అందుకే మొన్నటి ఆదివారం (మార్చి 7) విమెన్స్ డే సందర్భంగా ఇండియన్ ఐడెల్ ఎపిసోడ్ను ఆమె పేరున నిర్వహించారు. హేమమాలిని ఆ ఎపిసోడ్కు హాజరయ్యి ఆ సందర్భంగా చాలా విశేషాలు చెప్పారు హేమ మాలిని. అంతేకాదు, అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్స్ చేశారు. ఆమె స్టెప్పులేసిన పాటల్లో ‘షోలే’లోని ‘జబ్ తక్ హై జాన్’ పాట ఒకటి. ‘షోలే’లో ఈ పాట క్లయిమాక్స్ లో వస్తుంది. గబ్బర్ సింగ్ ముందు మండుటెండలో బండరాళ్ల మీద పగిలిన గాజుపెంకులపై డాన్స్ చేస్తుంది హేమ మాలిని, ధరేంద్రను విడిపించుకోవడానికి. ఆ పాట వెనుక ఉన్న విశేషాలను కూడా ఆమె చెప్పారు– ‘ఆ పాట ఇలా ఉంటుందని దర్శకుడు రమేశ్ సిప్పి చెప్పారు. చేద్దాం... కాని షూటింగ్ నవంబర్, డిసెంబర్లో పెట్టుకోండి. అప్పుడు మైసూరు (షూటింగ్ జరుగుతున్న ప్రాంతం) చల్లగా ఉంటుంది అన్నాను. కాని రమేశ్ సిప్పీ వినలేదు. ఏప్రిల్ నెలఖారున షూటింగ్ పెట్టారు. అంత ఎండ లో రాళ్ల మీద డాన్స్ చేయడం ఎలా అనుకున్నాను. మా అమ్మ పాదాలకు ప్రత్యేకమైన సాక్సులు తయారు చేయించింది. అవి వేసుకుంటే కాళ్లు కాలవు.. సాక్సులు వేసుకున్నట్టు తెలియదు కూడా. వాటిని తొడుక్కుంటుంటే రమేశ్ సిప్పీ దూరం నుంచి చూసి ‘వద్దొద్దు్ద అవి వేయకండి’ అని వార్నింగ్ ఇచ్చారు. సరే... రాళ్ల మీద కాసిన్ని నీళ్లైనా పోయండి చల్లబడతాయి అన్నాను. దానికీ ఒప్పుకోలేదు. చివరకు పాటను అలాగే చేశాను. మొత్తం పాట తీయడానికి పది రోజులు పట్టింది. కాని ఫలితం ఎలా ఉందో మీరే చూశారుగా’ అన్నారామె. ‘జానీ మేరా నామ్ సినిమా సమయానికి నేను ఇంకా ఫీల్డుకి కొత్త. ఆ సినిమాలో వాదా తూ నిభాయా... పాట దేవ్ ఆనంద్ గారితో చేయాలి. రోప్ వేలో ఒక చైర్లో దేవ్ ఆనంద్ కూచుంటే ఆయన వొడిలో నేను కూచోవాలి. సరే.. సినిమాల్లో ఇవన్నీ తప్పవు. నేను దేవ్ గారి వొడిలో కూచున్నాక ప్రతిసారీ కరెంటు పోయేది. నేను అలాగే కూచుని ఉండాల్సి వచ్చేది. ఏమిటా అని చూస్తే తర్వాత తెలిసింది... కావాలనే కరెంట్ తీసేస్తున్నారని. ఇలాంటివి కూడా షూటింగ్లలో జరుగుతుంటాయి’ అన్నారామె. తను ఇంట్లో మూడో సంతానమని, తను గర్భంలో ఉండగానే ఈసారి పుట్టేది ఆడపిల్లే.. దానికి హేమ మాలిని అని పేరు పెట్టాలి అని తన తల్లి అనుకుందని ఆమె చెప్పారు. పుట్టక ముందే పేరు రెడీ చేసుకున్న ఆమె పుట్టాక ఆ పేరును డ్రీమ్ గర్ల్ హేమమాలినిగా నిలబెట్టుకున్నారు. -
ఉత్తరాల ‘లంకె’బిందెలు
ఇంట్లో పెద్దవాళ్లు, ‘అప్పటి రోజులే వేరు. మళ్లీ రావు, బంగారం లాంటి రోజులు’ అని తరచు అంటే వినటం అందరికీ అనుభవమే. నిజమే. ఆ రోజులు అలాంటివే మరి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆధునిక గ్యాడ్జెట్లు, సకల సదుపాయాలు... జీవితాన్ని సులభం చేసుకునే సాధనాలేవీ లేని రోజులు. ఉత్తరాల ద్వారా మాత్రమే క్షేమసమాచారాలు అందుకున్న రోజులు. ముఖ్యంగా సినీ నటులు అభిమానులు రాసిన ఉత్తరాలకు వారి సంతకం తో ఉన్న ఫొటోలు పోస్టులో పంపిన రోజులు. అటువంటి ఒక చిన్న సంఘటన ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. అది చూసిన విదేశీయులు, భారతీయులకు పాత జ్ఞాపకాలంటే అభిమానమే అనుకుంటున్నారు. ఎఎల్టి అనే ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ కోఫౌండర్గా పని చేస్తున్నారు శామ్జావేద్. పదిహేను సంవత్సరాల క్రితం కన్నుమూసిన తన ఆంటీకి సంబంధించిన చిన్న అంశాన్ని ట్విటర్లో ఉంచారు శామ్. ఈ ట్వీట్ వారం రోజులుగా ట్రెండింగ్ అవుతోంది. అసలు కథ... మెహరున్నీసా నజ్మా పదిహేను సంవత్సరాల క్రితం అంటే 2006లో కన్నుమూశాక, ఆవిడకు సంబంధించిన కొన్ని వస్తువులను మేనకోడలు శామ్జావేద్ భద్రపరిచారు. ఇటీవలే అక్కడ ఉన్న సామానులను బయటకు తీస్తుంటే అందులో ఒక ఆల్బమ్ కనిపించింది. ఆ ఆల్బమ్ ను చాలా ఆసక్తితో పరిశీలించారు శామ్. అందులో ప్రముఖ సినీతారల స్వదస్తూరితో ఉన్న ఉత్తరాలు శామ్ను ఆకర్షించాయి. ఒకసారి తన మేనత్తను జ్ఞాపకం చేసుకున్నారు శామ్. శామ్జావేద్ సినిమాలంటే ఇష్టం... నజ్మాకు భారతీయ చిత్రాలంటే ప్రాణం. సినిమాలు చూసి ఊరుకోకుండా, ఆ తారలకు ఉత్తరాలు రాసేవారు. ఇది తల్లికి నచ్చేది కాదు. అయినా నజ్మా ఎవ్వరికీ తెలియకుండా ఉత్తరాలు రాస్తూ. తనకు వచ్చిన సమాధానాలను భద్రంగా ఆల్బమ్లో భద్రపరిచారు. ఆల్బమ్ అంతా సినిమా తారలు తమ సంతకాలతో ఆమె ఉత్తరాలకు రాసిన సమాధానాలతో నిండిపోయింది. ఎల్విస్ ప్రెస్లీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న షమ్మీ కపూర్ ఇంగ్లీషులో, ‘‘మీరు నా అభిమాని అని తెలిసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఉత్తరం రాశారు. ధర్మేంద్ర, సునీల్ దత్త్.. చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత మంది నజ్మాకు ఉత్తరాలు రాశారు. అప్పట్లో పెద్ద పెద్ద తారలైన కామినీ కౌశల్, సాధన, ఆశాపరేఖ్, సైరాబాను, తబస్సుమ్, సురయ్యా, రాజేంద్రకుమార్, రాజ్కుమార్... లెక్కలేనంతమంది. ఇంతమంది నుంచి ఉత్తరాలు అందుకున్న నజ్మా జీవితం చాలా చిత్రంగా అనిపిస్తుంది. నజ్మా 1930 లో ఢిల్లీలో పుట్టారు. తండ్రి పంజాబీ, తల్లిది బర్మా. నజ్మాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. నజ్మా చిన్నతనంలోనే తండ్రి కన్నుమూయటంతో, మేనత్త ఈ కుటుంబ బాధ్యత తీసుకున్నారు. తమ్ముడు, చెల్లాయి.. పెరిగి పెద్దయ్యాక, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో పై చదువులు చదువుకున్నారు. నజ్మాకు చదువు మీద ఆసక్తి లేదు. సినిమాలంటేనే ఇష్టం. సిలోన్ రేడియోలో పాటలు వినేవారు. తన అభిమాన నటులకి ఉత్తరాలు రాసేవారు. 20 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇలాగే గడిపారు నజ్మా. ఆ తరవాత వివాహం జరిగింది. అప్పటి నుంచి ఉత్తరాలు రాయటం ఆపేసి ఉంటారంటారు. నజ్మాకి వివాహం జరిగిన ఎనిమిది సంవత్సరాలకే ఆమె భర్త గతించారు. మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నజ్మాకు పిల్లలు లేరు. చెల్లెళ్లు, తమ్ముడి పిల్లలతో చాలా చనువుగా ఉండేవారు. తనకు ఇష్టమైన సినిమాలను జీవితాంతం హాయిగా చూశారు నజ్మా. ‘‘మా ఆంటీ చాలా అందంగా ఉండేవారు. సినిమాల మీద, సినీ తారలకు ఉత్తరాలు రాయటం మీద ఆవిడకున్న అభిమానం అప్పట్లో అందరికీ తెలుసు. ఇప్పుడు నా ట్వీట్ చూసి అందరూ మా ఆంటీని ప్రశంసిస్తున్నారు. నా దగ్గర లంకెబిందెల్లాంటి చాలా విలువైన సంపద ఉంది అంటున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు శామ్జావేద్. పాత బంగారం కోసం... ఇప్పుడు బాలీవుడ్ తారలంతా ఆ ఉత్తరాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రియాంక చోప్రా జొనాస్.. ఈ ఉత్తరాలను ట్వీట్ చేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ‘ఇవి చాలా ప్రత్యేకమైన ఉత్తరాలు. అన్ని ఉత్తరాలు నా మనసును హత్తుకున్నాయి. వీటిని షేర్ చేసినందుకు ధన్యవాదాలు’ అన్నారు ప్రియాంక. ఇవి ట్విటర్లో బాగా వైరల్ కావటంతో, నేషనల్ ఫిల్మ్ అర్కైవ్ వారు నజ్మా ఉత్తరాలను సేకరించి భద్రపరచాలనుకుంటున్నారు. సరదా గా దాచుకున్న ఉత్తరాలకు ఇప్పుడు ఇంత గుర్తింపు వస్తుందని ఆ రోజు నజ్మా ఊహించి ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉత్తరాలు ఒకరినొకరు కలిపే ‘లంకె’బిందె ల్లాంటివేనంటూ వీటిని విలువైనవిగా గుర్తిస్తోంది సినీ పరిశ్రమ. సునీల్ దత్త్ ఒకటో రెండో వాక్యాలు కాదు, స్వదస్తూరితో పెద్ద ఉత్తరమే రాశారు. ‘ఆ ఉత్తరం చూస్తుంటే ఆయన బహుశ మా అత్తయ్యను చిన్న అమ్మాయి అనుకుని ఉంటారనిపిస్తుంది. ఆయన ఎంతో జాగ్రత్తగా సిస్టర్ అని సంబోధిస్తూ ఉత్తరం రాశారు. అది కూడా ఒకసారి కాదు, పదేపదే అదే పదం ఉపయోగించారు’’ అంటారు శామ్జావేద్. ఒక్క అక్షర దోషం కూడా లేకుండా రాసిన ఉర్దూ ఉత్తరం అది. ధర్మేంద్ర కూడా స్వదస్తూరితో హిందీలో రాశారు. ఆ ఉత్తరం చదివితే, నజ్మా... ధర్మేంద్ర పుట్టినరోజుకి రాసిన ఉత్తరానికి సమాధానమని అర్థం అవుతుంది. ‘‘నా పుట్టినరోజుకి మీరు పంపిన శుభాకాంక్షలు అందుకున్నాను. మీ ఉత్తరం చూసిన నా హృదయం ఎంతో సంతోషంతో నాట్యం చేసింది. నా ఆటోగ్రాఫ్తో ఉన్న నా ఫొటో మీకు పంపుతున్నాను, మీకు నా అభినందనలు’’ అంటూ ధర్మేంద్ర జవాబు రాశారు. ఈ సమాధానం చదివిన నజ్మా ఆంటీ మనసు ఎలా ఉండి ఉంటుందో చెప్పక్కర్లేదు’ అంటారు శామ్జావేద్. తబస్సుమ్ రాసిన ఉత్తరాలు చూస్తే, వారిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తుంది. -
వీధి వీధినా వాడవాడలా మార్మోగే పాట ఇది!
స్వాతంత్య్ర దినోత్సవం వచ్చినా, గణతంత్ర దినోత్సవం వచ్చినా వీధి వీధినా వాడవాడలా మార్మోగే పాట ఒకటి ఉంది. అదే ‘కర్ చలే హమ్ ఫిదా జాన్ ఒ తన్ సాథియో.. అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో’ పాట. ఇది 1964లో వచ్చిన ‘హకీకత్’ సినిమాలోని పాట. ధర్మేంద్ర, బల్రాజ్ సహానీ ప్రధాన తారాగణం. 1962లో జరిగిన ఇండో–చైనా యుద్ధ నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఆ యుద్ధం మీద వచ్చిన తొలి హిందీ సినిమా కూడా. లడాక్లో వొరిజినల్ లొకేషన్స్లో చిత్రీకరించారు. చేతన్ ఆనంద్ దర్శకుడు. ఇండో చైనా వార్లో మనం ఓడిపోయాం. కాని ‘రెజాంగ్ లా’ అనే చోట 120 సైనికులు ఉన్న మన బృందం చైనా సైనికుల పై పైచేయి సాధించింది. అందులో 114 మంది మనవారు చనిపోయారు. చైనా సైనికులు భారీగా చనిపోయారని అంటారు. మొత్తం మీద ఆ ఒక్క స్థలంలో మనవారు తమ బలిదానంతో భారత భూభాగాన్ని నిలుపుకోవడాన్ని కథగా తీసుకొని దర్శకుడు చేతన్ ఆనంద్ ‘హకీకత్’ తీశాడు. నిజానికి ఇది ప్రభుత్వం చెప్పాలనుకున్న ‘హకీకత్’ (వాస్తవం). చైనా యుద్ధానికి కారణం చైనా తప్పిదమే అనే నెహ్రూ అభిప్రాయానికి ప్రచారం ఇచ్చిన సినిమా ఇది. విశేషం ఏమిటంటే దేశభక్తి కలిగిన ఈ సినిమాలో పని చేసినందుకు వామపక్ష భావజాలం ఉన్న చేతన్ ఆనంద్, కైఫీ ఆజ్మీ, బల్రాజ్ సహానీ రూపాయి డబ్బు కూడా తీసుకోలేదు. దీని క్లయిమాక్స్లో గెలిచినా కూడా ప్రాణాలు కోల్పోయిన సైనికుల మృతదేహాల నేపథ్యంలో విషాద భరితంగా ఒక పాట కావాల్సి వచ్చింది. ఆ పాటను విజయ్ ఆనంద్ కైఫీ ఆజ్మీ చేత చేయించాడు. మదన్ మోహన్ దానికి బాణీ కట్టాడు. కర్ చలే హమ్ ఫిదా జాన్ ఒ తన్ సాథియో అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో... అంటే ‘మీ కోసం మా దేహప్రాణాలను బలిదానం చేశాం. దేశాన్ని మీకు అప్పగించి వెళుతున్నాం’ అని తోటి సైనికులకు, దేశప్రజలకు సైనికులు చెబుతున్నట్టుగా ఉండే పాట ఇది. ఐదు నిమిషాలకు పైగా వచ్చే ఈ పాట సినిమా సైనికుల మృతదేహాలను... నిజ సైనికశకటాలను చూపుతూ భావోద్వేగంగా ఉంటుంది. మహమ్మద్ రఫీ పాడిన విధానం శోకాన్ని, గగుర్పాటును, దేశభక్తిని కలిగించేలా ఉంటుంది. అందుకే ఆ పాట వచ్చి దాదాపు 60 ఏళ్లు అవుతున్నా నేటికీ వినపడుతూ ఉంది. అయితే ఈ సినిమా రిలీజుకు ముందే నెహ్రూ మరణించారు. ఈ సినిమాను నెహ్రూకు అంకితం ఇచ్చారు. ఎందరి బలిదానాలో ఈ దేశం మట్టిలో ఉన్నాయి. ఎందరి త్యాగాల ఫలితమో ఇది. అందరూ దీనికోసం ప్రాణాలు వొడ్డారు. ఈ దేశం అందరిది అనే భావనను పునశ్చరణ చేసుకోవాల్సిన సందర్భం ఇది. -
మళ్లీ వస్తున్నాం
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ఆయన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్ కలసి స్క్రీన్ మీద నవ్వులు పండించిన చిత్రం ‘అప్నే’. ధర్మేంద్ర, సన్నీ, బాబీ, కత్రీనా కైఫ్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ మ్యాజిక్ను మళ్లీ రిపీట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘అప్నే’కు సీక్వెల్గా ‘అప్నే 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నట్టు ఆదివారం ప్రకటించారు ధర్మేంద్ర. ‘మీ అందరికీ ‘అప్నే 2’ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ∙సన్నీ డియోల్, ధర్మేంద్ర, బాబీ డియోల్ -
ఆ జంట ప్రేమకథకు తొలి సన్నివేశం
‘ఆమె ఏం ఇష్టపడతారు?’ అడిగాడొక యువనటుడు తన స్నేహితుడిని అక్కడే ఉన్న ఓ సీనియర్ హీరోయిన్ను చూపిస్తూ. ‘ఆమె ఏం ఇష్టపడితే మనకేంగానీ సెట్స్ మీదకు వెళ్లగానే ఆమె కాళ్లకు దండం పెట్టు చాలు’ సలహా ఇచ్చాడు స్నేహితుడు. తర్వాత.. ముంబైలోని చాందీవలీ స్టూడియోస్లో ఈ యువనటుడిని ఆ సీనియర్ హీరోయిన్కు పరిచయం చేశారు. ఆమె వాత్సల్యంగా అతని భుజం తట్టి ‘ఈ అబ్బాయికి మంచి భవిష్యత్ ఉంది’ అని చెప్పింది. ఇది ఆ జంట ప్రేమకథకు తొలి సన్నివేశం. ఆ సీనియర్ హీరోయిన్.. మీనా కుమారి, ట్రాజెడీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్. ఆ యంగ్స్టర్.. ధర్మేంద్ర. . ధర్మేంద్రను పిచ్చిగా ప్రేమించింది మీనా కుమారి. చూడగానే అతని భవితను అంచనావేయడమే కాదు సినిమా రంగంలో ధర్మేంద్రను నిలబెట్టేందుకూ ప్రయత్నించింది.. ఎంతోమంది నిర్మాత,దర్శకులకు అతని పేరు సిఫారసు చేసి. ధర్మేంద్ర ఎదురుపడేనాటికే మందు సాహచర్యంలో ఉంది మీనాకుమారి. బేషరతుగా తనకు ప్రేమను పంచే మనసు కోసం తపిస్తోంది. నిజాయితీగా తనను లాలించే తోడు కోసం నిరీక్షిస్తోంది. అప్పుడు ధర్మేంద్ర వచ్చాడు ఆమె పట్ల తన కళ్లల్లో ఆరాధన నింపుకొని. దాన్ని మీనాకుమారి ప్రేమ అనుకుంది. తాను ఎదురుచూస్తున్న వ్యక్తి ధర్మేంద్రే అని స్థిరపరచుకుంది. అతని సాంగత్యంలో ఈ లోకాన్ని మరిచిపోయేది. ఆమెతో ఉన్నంతసేపు అతనూ తన లోకాన్ని పక్కన పెట్టేవాడు. ఆ కాలక్షేపంలో ఆమె అతణ్ణి తన సాంత్వనగా మలచుకునేది. అతను ఆమెనో గురువుగా, గైడ్గా భావించేవాడు. తన గురించి అతను ఏమనుకుంటున్నాడోనని ఏనాడూ ఆలోచించలేదు మీనా కుమారి. తాను ఆనందంగా ఉంది చాలు అనే భద్రతను కాపాడుకోసాగిందంతే. ఆమె తన నుంచి ఏం ఆశిస్తోందో అతని మెదడుకి చిక్కినా.. తాను ఎలా ఉండదలుచుకున్నాడో అలాగే ఉన్నాడు. అందుకే కడవరకు కలిసే ఉంటారని నమ్ముకున్న బంధం మూడేళ్లకే ముగిసిపోయింది. మీనా కుమారి మళ్లీ మందు మాయలో పడిపోయింది. ఆ మూడేళ్లలో.. ఈ ఇద్దరి గురించి వచ్చినన్ని వదంతులు బాలీవుడ్లో ఇంకే జంట గురించీ వచ్చి ఉండవు. తర్వాత కాలంలో ఆ రూమర్సే నిజాలుగా, నిజాలు రూమర్స్గా ప్రచారం అయ్యాయి. సత్యాసత్యాలు ఈ ఇద్దరి ఆత్మకథల అచ్చులో కనిపించినప్పటికీ ఆ ప్రేమ కథలో ధర్మేంద్ర విలన్గా మిగిలాడు. కాని తన కెరీర్ ప్రారంభంలో మీనా కుమారి అందించిన ప్రోత్సాహాన్ని మాత్రం అతను మరిచిపోలేదు. చాందీవలీ స్టుడియోస్లో ఆమెను కలిసినప్పుడు స్నేహితుడు సూచించినట్టుగా ధర్మేంద్ర ఆమె కాళ్లకు నమస్కరించాడో లేదో కాని మీనా కుమారి చేసిన మేలును తలచుకుంటూనే ఉంటాడు ఇప్పటికీ. ఫ్లాష్బ్యాక్ ఆల్కహాల్, డిప్రెషన్తోనే మీనా కుమారికి కాలం గడుస్తోంది. అప్పుడు ఆమెకు మళ్లీ చేరువయ్యాడు.. ధర్మేంద్ర కాదు కమల్ ఆమ్రోహి. ఆమె భర్త. దర్శకుడు. ఈ ఇద్దరినీ కలిపింది ప్రసిద్ధ నటుడు అశోక్ కుమార్. తొలిచూపులోనే మీనాను ‘నా అనార్కలి’ అనుకున్నాడు కమల్. తాను తీయబోతున్న సినిమా అది. ఆ ఆఫర్కు అంగీకారం తెలిపి మహాబలేశ్వర్ వెళ్తుంటే రోడ్డు ప్రమాదంలో గాయపడింది మీనా కుమారి. దాదాపు మూడు నెలల ఆసుపత్రిలోనే ఉంది. ప్రతి వారాంతాలు ఆమె దగ్గరకు వెళ్లి బాగోగులు చూసుకునేవాడు కమల్. వచ్చినప్పుడల్లా ఆమె మణికట్టు మీద ‘నా అనార్కలి’ అని రాసేవాడట. ఇదీ ఓ విఫల ప్రేమ, పెళ్లి గాథ. వచ్చే వారానికి వాయిదా వేద్దాం. ఒకసారి మీనా కుమారి తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పిక్నిక్ వెళ్లిందట. అందులో ధర్మేంద్ర కూడా ఉన్నాడు. తిరుగు ప్రయాణంలో పొరపాటున ధర్మేంద్ర మరో కారులో కూర్చున్నాడు. దాంతో ‘నా ధరమ్ ఏడి?ఎక్కడ?’ అంటూ కంగారు పడిందట మీనా కుమారి. ‘ఇంకో కార్లో వస్తున్నాడు’ అని ఆమె అసిస్టెంట్ చెప్పినా వినకుండా తన కారు ఆపేయించి, రోడ్డుకు అడ్డంగా వెళ్లి ‘ధరమ్.. ఎక్కడా?ఎక్కడన్నావ్?’ అంటూ వెనకాల వస్తున్న తన స్నేహితుల కార్లలో ధర్మేంద్రను వెదుక్కోసాగిందట. అంత అబ్సేషన్గా తయారయ్యాడు ధర్మేంద్ర.. మీనా కుమారికి అంటూ ఈ విషయాన్ని ఉటంకించాయట మరుసటిరోజు... పత్రికలన్నీ. ‘కాజల్’ సినిమా సక్సెస్ వేడుక కోసం ఢిల్లీ వెళ్లాడు ధర్మేంద్ర. పార్టీ అయిపోయాక రాత్రి ఫ్లయిట్కు మళ్లీ ముంబై చేరుకోవాలి. కాని ఎయిర్పోర్ట్ సిబ్బంది అతణ్ణి ఫ్లయిట్ ఎక్కనివ్వలేదు. మోతాదుకు మించి మద్యం సేవించాడని. ‘నేను వెళ్లాలి... అక్కడ మీనా కుమారి నా కోసం ఎదురుచూస్తోంది.. తన కోసం నేను వెళ్లాలి.. వెళ్లాల్సిందే’ అంటూ చిందులు తొక్కాడట ధర్మేంద్ర. మీనా కుమారి, ధర్మేంద్ర కలిసినటించిన చిత్రాలుకాజల్, పూర్ణిమ, చందన్ కా పల్నా, మై భీ లడ్కీ హూ, బహారోంకీ మంజిల్, ఫూల్ ఔర్ పత్థర్ మొదలైనవి. – ఎస్సార్ -
‘నా మీద నాకే జాలి.. మద్యం అలవాటయ్యింది’
కెరీర్లో చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని.. అప్పుడు తన మీద తనకే జాలి వేసేదన్నారు నటుడు బాబీ డియోల్. ఆ బాధను మర్చిపోవడానికి తాను మద్యానికి అలవాటు పడ్డానని తెలిపారు. ఎంతో ఉన్నతంగా సాగిన ఈ హీరో కెరీర్ కొన్నేళ్ల క్రితం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యింది. అయితే తాజాగా బాబీ డియోల్ ‘క్లాస్ ఆఫ్ 83’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో బాబీ డియోల్ మాట్లాడుతూ..‘మన మీద మనం జాలి పడుతున్నాం అంటే మన జీవితంలో అదే అత్యంత కఠినమైన దశ. ఇక అప్పుడు ప్రపంచాన్ని శపించడం మొదలుపెడతాం. నా జీవితంలో రెండు మూడేళ్ల పాటు ఇదే జరిగింది. నా మీద నాకే జాలేసేది. ప్రపంచం నాతో పని చేయాలనుకోవడం లేదని భావించాను. దాంతో మద్యానికి దగ్గరయ్యాను. మౌనంగా మారిపోయాను. అయితే ఓ రోజు నా పిల్లలు నా వైపు చూసిన చూపు నాలో మార్పుకు కారణమయ్యింది. నా తప్పేంటో తెలిసి వచ్చింది’ అన్నారు బాబీ డియోల్. ‘ఓ రోజు నా పిల్లలు ‘మా నాన్న ఏంటి రోజంతా ఇంట్లోనే ఉంటాడు.. ఏం పని చేయడు.. తాగుతూనే ఉంటాడన్నట్లు’ చూశారు. ఇదే భావం నా భార్య, తండ్రి కళ్లలో కూడా కనిపించేది. దాంతో నాలో మార్పు మొదలయ్యింది. నేను ఎక్కడ తప్పు చేశానో తెలిసింది. నేనే ముందుకు సాగాలి తప్ప ఎవరి కోసం ఎదురుచూడకూడదు అని అర్థం అయ్యింది. నా ప్రయాణం నేనే చేయ్యాలని తెలిసింది. ఈ ఆలోచన వచ్చాక నేను పని చేయడం మొదలు పెట్టాను. గత రెండు మూడేళ్లుగా నేను చాల బిజీగా ఉన్నాను’ అన్నారు బాబీ డియోల్. అంతేకాక ‘సల్మాన్, షారుక్ ఖాన్ జీవితాల్లో కూడా కష్టాలు ఉంటాయి. కానీ వారు పోరాడుతున్నారు తప్ప వదిలేయలేదు’ అన్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఇన్సైడర్, ఔట్సైడర్ చర్చపై స్పందించారు బాబీ డియోల్. (మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు) ‘పరిశ్రమలో ఎవరి నుంచి మనకు మద్దతు లభించదు. నా కుటుంబం పరిశ్రమలో ఉన్నారంటే దానర్థం వారు నాకు మద్దతిచ్చారని కాదు. అదే నిజమయితే ధర్మేంద్ర కొడుకుగా నేను పెద్ద పెద్ద చిత్రాల్లో నటించాలి. కానీ అలా జరగలేదు కదా. ధర్మేంద్ర కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కానీ అది ఫస్ట్ సినిమా వరకే పనికొస్తుంది. ఆ తర్వాత నా ప్రతిభ మీదనే నా మనుగడ ఆధారపడి ఉంటుంది’ అన్నారు. ప్రస్తుతం బాబీ డియోల్ షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో వస్తోన్న ‘క్లాస్ ఆఫ్ 83’లో నటిస్తున్నారు. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో శుక్రవారం విడుదల కానుంది. -
‘కలకాలం మీరు ఇలాగే ఉండాలి.. అమ్మానాన్నా’
‘‘అమ్మా, నాన్నా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీరిలాగే కలకాలం కలిసి ఉండాలని.. ప్రేమ, సంతోషం, ఆరోగ్యం మీకు ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను! ప్రేమతో ఇషా, భరత్, రాధ్యా, మియూ’’అంటూ అలనాటి బాలీవుడ్ డ్రీమ్గర్ల్ హేమమాలిని, నటుడు ధర్మేంద్రకు వారి తనయ, నటి ఇషా డియోల్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇషా సోదరి అహానా సైతం హేమ, ధర్మేంద్రలకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వారికి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు స్పందించిన హేమ మాలిని తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా బాలీవుడ్లో డ్రీమ్గర్ల్గా ఓ వెలుగు వెలిగిన హేమ మాలినిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది హీరోలు ప్రయత్నించి విఫలమయ్యారు. సంజీవ్ కుమార్, జితేంద్ర ఆ జాబితాలో ప్రముఖులు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్) ఇక జితేంద్ర హేమ మాలిని ఇంట్లో వాళ్లను ఒప్పించి.. తన ప్రేమను పెళ్లి పీటలదాకా తీసుకువచ్చాడు. మద్రాసులో వివాహం చేసుకోవడానికి తేదీ ఖరారు చేయించాడు. కానీ అప్పటికే హేమతో కలిసి షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్గర్ల్ వంటి చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. ఆ పెళ్లిని అడ్డుకుని ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. దీంతో 1959లో ధర్మేంద్ర జీవితంలో రెండో భార్యగా హేమమాలిని అడుగుపెట్టారు. ఇద్దరూ వైవాహిక బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా ఎన్నడూ ఒకరినొకరు విమర్శించుకోలేదు. అంతేకాదు ధర్మేంద్ర జీవితంలోకి తాను ప్రవేశించినప్పటికీ ఆయనను ఏనాడు తన కుటుంబం నుంచి వేరు చేయలేదని హేమ మాలిని పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన తనకోసమే పుట్టారని భావిస్తానని.. ఆయనతో జీవితం పంచుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని భర్తపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇక హేమమాలిని ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.(లాక్డౌన్తో గెలుద్దాం: హేమ పిలుపు) View this post on Instagram Happy wedding anniversary my darling parents! My mamma & papa I love u both soooooooo much & pray to god to bless you both with infinite years of togetherness ,love , happiness & the best of health !🧿🤗 @dreamgirlhemamalini @aapkadharam Love you , Esha , Bharat,Radhya & Miu ♥️♥️♥️♥️♥️♥️💕 A post shared by Esha Deol (@imeshadeol) on May 1, 2020 at 9:46pm PDT Dharam ji & I thank all those who have wished us on our wedding anniversary today. It is your blessings & good wishes that have always been with us all through these years🙏 pic.twitter.com/tEtO6L4Boj — Hema Malini (@dreamgirlhema) May 2, 2020 -
తాగొచ్చి హేమ మాలిని పెళ్లి ఆపాడు
అలనాటి సూపర్ స్టార్ జితేంద్ర నేడు 78వ వడిలోకి అడుగుపెట్టాడు. అతను తన ప్రేయసి శోభా కపూర్ను 1974లో అక్టోబర్18న వివాహం చేసుకున్నాడు. అయితే దీనికన్నా ముందు అలనాటి అందాల తార హేమమాలినిని పెళ్లి చేసుకోబోయాడు. ఈ విషయాన్ని ఆమె జీవిత కథ ఆధారంగా వచ్చిన "హేమ మాలిని: బియాండ్ ద డ్రీమ్గర్ల్" పుస్తకం వెల్లడించింది. ఈ పుస్తకం ప్రకారం ఆమె తల్లిదండ్రులకు హేమ, వివాహితుడైన ధర్మేంద్రతో ఉండటం అస్సలు నచ్చేది కాదు. దీంతో ఆమెకు జితేంద్రతో వివాహం జరిపించాలనుకున్నారు. వెంటనే అతని కుటుంబసభ్యులతో మాట్లాడటం, ఇంట్లో వాళ్ల సంతోషం కోసం జితేంద్ర కూడా పెళ్లికి అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ముహూర్తం కూడా ఖరారు చేసుకుని, చెన్నైలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఓ వార్తాపత్రిక ఈ విషయాన్ని చాటింపు చేసి చెప్పింది. దీంతో విషయం తెలుసుకున్న ధర్మేంద్ర్ర, జితేంద్ర ప్రేయసి శోభా(ప్రస్తుతం అతని భార్య)తో కలిసి పెళ్లిని ఆపేందుకు చెన్నైకు పయనమయ్యారు. (ఎంతో నేర్చుకున్నా) మద్యం సేవించిన ధర్మేంద్ర.. హేమ ఇంటికి చేరుకుని ఆమెను ఇంత పెద్ద తప్పు చేయవద్దని కోరుకున్నాడు. మరోవైపు శోభా కూడా జితేంద్రను కలిసి ఆగ్రహం వ్యక్తం చేయగా అతను మాత్రం హేమను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించాడని పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ధర్మేంద్ర మాటలతో కదిలిపోయిన హేమ పెళ్లికి మరింత గడువు కావాలని తన పేరెంట్స్ను అభ్యర్థించింది. అలా ఆ పెళ్లి వాయిదా పడింది. కాగా షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్గర్ల్ వంటి చిత్రాల్లో హేమతో కలిసి నటించిన ధర్మేంద్ర ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. అనంతరం 1979లో ఆగస్టు 21న హేమను రెండో భార్యగా చేసుకున్నాడు. అయినప్పటికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇక వీరికి కూతుళ్లు ఈషా, అహాన్ డియోల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈషా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం గృహిణిగా ఉండగా.. అహానా క్లాసికల్ డ్యాన్సర్గా పలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ సంతానం సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. -
ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..
న్యూఢిల్లీ : ధర్మేంద్ర జీవితంలోకి తాను ప్రవేశించినప్పటికీ ఆయనను ఏనాడు తన కుటుంబం నుంచి వేరు చేయలేదని అలనాటి డ్రీమ్గర్ల్, బీజేపీ ఎంపీ హేమ మాలిని అన్నారు. త్వరలోనే రాజకీయాలకు స్వస్తి పలికి తన కూతుళ్లు, మనవలతో జీవితం గడపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హేమ మాలిని.. ధర్మేంద్రతో ప్రేమ, పెళ్లి తదితర అంశాల గురించి చెప్పుకొచ్చారు. ‘ ధరమ్ జీని చూసిన నిమిషంలో ఈయన నా మనిషి.. నా కోసమే పుట్టారు అనిపించారు. అందుకే ఆయనతోనే జీవితం గడపాలనుకున్నా. అందుకోసం ఆయనను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నా. అయితే మా పెళ్లి ఎవరినీ బాధించుకూడదనే.. నేనెప్పుడూ ధర్మేంద్రను ఆయన మొటటి భార్య, పిల్లలకు దూరంగా ఉండనివ్వలేదు. వాళ్లు కూడా నేను ఏనాడు వాళ్ల జీవితంలో జోక్యం చేసుకున్నట్లుగా భావించలేదు. ఆయనను వివాహం చేసుకున్నానే తప్ప.. కుటుంబ సభ్యుల నుంచి ఏనాడు వేరుచేయలేదు’ అని పేర్కొన్నారు. ఇక బాలీవుడ్లో డ్రీమ్గర్ల్గా ఓ వెలుగు వెలిగిన హేమ మాలినిని వివాహం చేసుకోవడానికి చాలామంది హీరోలు ప్రయత్నించారు. వారిలో సంజీవ్ కుమార్ ఒకడు. ఆ తర్వాత జితేంద్ర ఆ ప్రయత్నం చేశాడు. వాళ్లిద్దరు మద్రాసులో వివాహం చేసుకోవడానికి దాదాపు తేదీ ఖరారు చేశారు. అయితే అప్పటికే హేమతో కలిసి షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్గర్ల్ వంటి చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఈ నేపథ్యంలో మద్రాసులో జరుగనున్న పెళ్లిని ఆపించి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. దీంతో 1959లో ధర్మేంద్ర జీవితంలో హేమమాలిని అడుగుపెట్టారు. అయితే... రెండో భార్యగా ఉన్నప్పటికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇద్దరూ ఆ బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా విమర్శలకు దిగలేదు. వారిరువురూ కలిసి ప్రయివేట్గా కనిపించడం కూడా చాలా అరుదు. ఇక వీరికి కూతుళ్లు ఈషా, అహాన్ డియోల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈషా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం గృహిణిగా ఉండగా.. అహానా క్లాసికల్ డ్యాన్సర్గా పలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ సంతానం సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. -
డోపింగ్తో నిషేధం ఎదుర్కొని...
‘ఆకలిగొన్న సింహంలా ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నా’... సెమీస్లో విజయం తర్వాత అమిత్ పంఘాల్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్య ఇది. ఒక బాక్సర్కు ఉండే సహజసిద్ధమైన దూకుడు అతని మాటల్లో కనిపించింది. తన స్వల్ప కెరీర్లోనే అతను ఇదే తరహా దూకుడు ప్రదర్శించి పతకాలు కొల్లగొట్టాడు. అయితే 2012లో అతని కెరీర్కు పెద్ద దెబ్బ తగిలింది. ఒక టోర్నీ సమయంలో అనబాలిక్ స్టెరాయిడ్ వాడినందుకు అతనిపై రెండేళ్ల నిషేధం పడింది. చికెన్పాక్స్ రావడంతో సరైన సమాచారం లేకుం డా మందులు వాడటమే ఇందుకు కారణమంటూ అతను అప్పీల్ చేశాడు. దాంతో శిక్ష ఏడాది కాలానికి తగ్గినా... అంత తొందరగా ఆ మరక పోలేదు. గత ఏడాది అర్జున అవార్డులకు అతని పేరు నామినేట్ చేసిన సమయంలో కూడా ఇదే వివాదం ముందుకొచ్చి అవార్డును దూరం చేసింది. అయితే నిషేధం తొలగిన అనంతరం పట్టుదలతో శ్రమించిన అమిత్ తన సత్తాను ప్రదర్శిస్తూ సాధించిన విజయాలు మాత్రం ప్రశంసార్హం. హరియాణా రాష్ట్రంలోని రోహ్టక్ సమీపంలోని మాయనా అమిత్ స్వస్థలం. రోహ్టక్ పరిసర గ్రామాల్లో భారీగా డ్రగ్ కేసులు నమోదవుతున్నా... సున్నా క్రైమ్ రేటింగ్ ఉన్న గ్రామం ఇది. తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఆటల్లోనైనా బిజీగా ఉంచాలనేది అక్కడి చాలా మంది తల్లిదండ్రుల ఆలోచన. అన్న ప్రోత్సాహంతో పాఠశాల స్థాయిలోనే బాక్సింగ్ వైపు అడుగులు వేసిన అమిత్ 2009 నుంచి 2016 వరకు సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలలో విశేషంగా రాణించి పలు విజయాలు నమోదు చేశాడు. ఆ తర్వాత సీనియర్ స్థాయిలో అతని బాక్సింగ్ కెరీర్ చాలా జోరు గా దూసుకుపోయింది. 2017లో జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న అతను రెండేళ్ల వ్యవధిలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణానికి చేరువ కావడం విశేషం. 2017 వరల్డ్ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్ చేరిన అమిత్ ఆ తర్వాత వరుసగా పతకాలు సాధించి తన స్థాయిని పెంచుకున్నాడు. జాట్ల కుటుంబం నుంచి వచ్చిన అమిత్కు చాలా మందిలాగే హిందీ అగ్రశ్రేణి హీరో ధర్మేంద్ర కుటుంబం అంటే అమితాభిమానం. గత ఏడాది కామన్వెల్త్లో పతకం నెగ్గిన తర్వాత తన తొలి ట్వీట్లోనే అతను నాన్న, కోచ్లను గుర్తు చేసుకుంటూ ధర్మేంద్రను కలవాలని ఉందంటూ రాశాడు. అతని అభిమానానికి స్పందిస్తూ ఆ తర్వాత అమిత్కు కలిసే అవకాశం ఇచి్చన ధర్మేంద్ర... అప్పటి నుంచి ప్రతీసారి అతడిని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు కూడా తన వరల్డ్ చాంపియన్షిప్ విజయానికి సంబంధించి ట్వీట్లో కూడా ధర్మేంద్ర, సన్నీ డియోల్లను అమిత్ ట్యాగ్ చేయడం విశేషం. -
‘సినిమాల్లో తప్ప రియల్గా చీపురు పట్టింది లేదు’
ప్రముఖ నటి, ఎంపీ హేమామాలిని ‘స్వచ్ఛ్ భారత్’లో భాగంగా చీపురు పట్టి పార్లమెంట్ పరిసరాలను శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే హేమా మాలిని చేసిన పనికి ప్రశంసలు లభించకపోగా.. విమర్శల పాలవుతోంది. తాజాగా ఇలా విమర్శించే వారి జాబితాలో హేమా మాలిని భర్త ధర్మేంద్ర డియోల్ కూడా చేరారు. హేమా మాలిని చేసిన పని తనకు కూడా అసహజంగా తోచిందన్నారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మేంద్ర ఇలా బదులిచ్చాడు. హేమా మాలిని నిజ జీవితంలో ఎప్పుడైనా చీపురు పట్టుకున్నారా అని ఓ అభిమాని ట్విటర్లో ధర్మేంద్రను ప్రశ్నించాడు. అందుకు ఆయన బదులిస్తూ.. ‘సినిమాల్లో తప్ప నిజ జీవితంలో తను ఎన్నడు చీపురు పట్టి ఎరగదు’ అన్నాడు. హేమా మాలిని ఆలోచన మంచిదే.. అయితే దాన్ని అమలు చేయడంలో ఆమె విఫలం అయ్యారన్నారు ధర్మేంద్ర. ఆమె ప్రచారం చేయదల్చుకున్న శుభ్రత సందేశాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు ధర్మేంద్ర. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు ధర్మేంద్ర. Haan films main , mujhe bhi अनाड़ी लग रहीं थीं . मैं ने मगर बचपन में , अपनी माँ का हमेशा हाथ बटाया है । मैं झाड़ू में माहिर था । I love cleanliness 🍀🍀🍀🍀🍀🍀🍀🍀 — Dharmendra Deol (@aapkadharam) July 14, 2019 -
ఆనందంలో ఈషా డియోల్
బాలీవుడ్ నటి ఈషా డియోల్ రెండో సారి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాగా, తన కూతురు పేరు మిరయా తక్తానీ అని తెలిపారు. హేమ మాలిని, ధర్మేంద్రల కూతురైన ఈషా.. భరత్ తక్తానీని 2012లో పెళ్లి చేసుకోగా.. అక్టోబర్ 2017 ఈ దంపతులకి రాధ్య జన్మించింది. తాజాగా తనకు రెండోసారి ఆడపిల్ల జన్మించిందని, ఆ సంతోషాన్ని అభిమానులతో కలిసి పంచుకున్నారు. రెండో కాన్పు ద్వారా ఆడబిడ్డ జన్మించిందని ఇషా డియోల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మీ ప్రేమ, ఆశీర్వాదానికి ధన్యవాదాలు అని ఇషా తన పోస్ట్లో పేర్కొన్నారు. పెళ్ళి తర్వాత ఇషా డియోల్ పూర్తిగా సినిమాలకి దూరమయ్యారు. 2002లో కోయి మేరే దిల్ సే పూచ్చే చిత్రంతో బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈషా డియోల్.. ధూమ్, యువ, నో ఎంట్రీ, ధస్ చిత్రాలతో ఈషా బాగా పాపులర్ అయ్యారు. తనకి మరో కూతురు జన్మించడంతో హేమమాలని దంపతులు సంతోషంగా ఉన్నారని ఈషా పేర్కొన్నారు. -
సునీల్ జాఖడ్ అభ్యర్థని ముందు తెలియదు: ధర్మేంద్ర
గురుదాస్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖఢ్ అని ముందే తెలిస్తే తన కొడుకు సన్నీ దేవల్ను ఆయనపై పోటీచేయనిచ్చేవాణ్ని కాదని సన్నీ తండ్రి, ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సునీల్ తండ్రి, లోక్సభ మాజీ స్పీకర్ బలరామ్ జాఖడ్పై తనకు ఎనలేని గౌరవం ఉందని ఆయన అన్నారు. పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి సన్నీని బీజేపీ ఎన్నికల్లో నిలిపింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన మరో బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా మరణించాక జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్పై పోటీచేసిన సునీల్ జాఖడ్ గెలిచారు. ఆయన మళ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు. ‘‘నేను గురుదాస్పూర్ చేరుకున్నాకే సునీల్ పోటీచేస్తున్న విషయం తెలిసింది. ఆయన నాకు కొడుకులాంటి వాడు. అయితే, ఇప్పుడు ప్రచారం కూడా ప్రారంభమయ్యాక పోటీ నుంచి వైదొలగడం కుదరదు,’’ అని 83 ఏళ్ల ధర్మేంద్ర చెప్పారు. సన్నీతో బహిరంగ చర్చకు సునీల్ ఆహ్వానించారన్న విషయం గుర్తుచేయగా, ‘‘సన్నీ ఆయనతో చర్చించలేడు. సునీల్కు రాజకీయానుభవం ఉంది. ఆయన తండ్రి రాజకీయవేత్త. మేమేమో సినీరంగం నుంచి వచ్చాం. మేం ఇక్కడకు చర్చించడానికి రాలేదు. ప్రజల సమస్యలు వినడానికి వచ్చాం,’’అని ధర్మేంద్ర వివరించారు. బలరామ్ రాజకీయ పాఠాలు నేర్పారు ‘‘మొదట నాకు ఎమ్మెల్యేకు, ఎంపీకి తేడా తెలియదు. రాజకీయాల్లో మౌలిక పాఠాలు నాకు బలరామ్ జాఖడ్ నేర్పారు. ఆయన రాజస్తాన్ నుంచి మొదట పోటీచేసినప్పుడు నేను ఆయన తరఫున ప్రచారం చేశాను,’’అని ధర్మేంద్ర తెలిపారు. 2004 ఎన్నికల్లో రాజస్తాన్లోని చురూ స్థానంలో బలరామ్ జాఖడ్పై పోటీచేయాలని బీజేపీ కోరితే అందుకు తాను నిరాకరించానని, చివరికి బికనీర్ నుంచి బీజేపీ తరఫున పోటీకి దిగి గెలిచానని ఆయన గుర్తుచేశారు. ‘‘ఆ ఎన్నికల్లోనే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ భార్య ప్రణీత్ కౌర్పై పాటియాలాలో పోటీచేయాలని ఓ దశలో బీజేపీ కోరింది. అందుకు నేను అంగీకరించలేదు. అమరీందర్ తండ్రి పాటియాలా సంస్థానాధీశుడు. మొదట ఆయనే తన రాజ్యాన్ని భారత్లో విలీనం చేశారు. ప్రణీత్ నా సోదరి వంటిది. ఆమెపై పోటీకి అందుకే నిరాకరించాను,’’ అని ఆయన అన్నారు. ‘‘రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని సన్నీకి చెప్పాను. ఎన్నికల్లో పోటీచేయడానికి అప్పటికే ఒప్పుకున్నానని సన్నీ జవాబిచ్చాడు. గురుదాస్పూర్ నుంచి పోటీకి సన్నీని ఎవరు ఒప్పించారో నాకు తెలియదు. ఒకసారి దిగాక ఎన్నికల రంగం నుంచి పారిపోయేది లేదు. సినిమా రంగంలో కూడా అగ్రస్థానాలకు చేరుకోవడానికి కొందరు రాజకీయాలు చేస్తారు. కాని, నేనెన్నడూ అక్కడ రాజకీయాలు చేయలేదు.’’ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో యూపీలోని మథుర నుంచి తన భార్య, నటి హేమమాలిని మరోసారి పోటీకి దిగడం గురించి ప్రస్తావిస్తూ, తమది రాజకీయ కుటుంబం కాదని ఆయన అన్నారు. -
నాన్నకు హ్యాట్సాఫ్
బాలీవుyŠ సూపర్స్టార్ ధర్మేంద్ర అభిమానులకు ఆయన కుమారుడు సన్నీ డియోల్ ఓ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదేంటంటే... ధర్మేంద్ర జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించనున్నారు సన్నీ. పంజాబ్ నుంచి ముంబై వచ్చి సినిమాల్లో సూపర్ స్టార్గా ధర్మేంద్ర ఎలా ఎదిగారు? అనే విషయాల్ని ఇందులో ప్రస్తావించనున్నారట. అలాగే ధర్మేంద్ర జీవితం ఆధారంగా ఓ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇందులో నటుడిగా ఆయన చేరుకున్న మైలు రాళ్లు, జ్ఞాపకాలు, ఆశ్చర్యకర సంఘటనలు షేర్ చేసుకుంటారట. ‘‘నాన్నగారి లైఫ్ గురించి తన ప్రతి అభిమానికి తెలియాలి. అందుకే ఈ డాక్యుమెంటరీ. మా టీమ్ అందరితో నాన్నగారు ప్రయాణిస్తారు. తన ప్రతి జ్ఞాపకాలను చూపిస్తారు. వాటిని షూట్ చేస్తాం. నాన్నగారితో పని చేసిన అందర్నీ ఇంటర్వ్యూ చేయనున్నాం. నాన్నగారి సుదీర్ఘ ప్రయాణం గ్రేట్. నాన్నగారికి హ్యాట్సాఫ్’’ అని పేర్కొన్నారు సన్నీ డియోల్. -
బయోపిక్ వద్దు
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరూ బయోపిక్స్ బాట పట్టారు. ఆడియన్స్ కూడా పాత తరం యాక్టర్స్ మీద బయోపిక్ చూడాలనుకుంటున్నారు. మరి మీ బయోపిక్ను మీరు చూడాలనుకుంటున్నారా? అని ధర్మేంద్రని అడగ్గా– ‘‘లేదు లేదు. నాకు బయోపిక్ వద్దు. గట్టిగా మాట్లాడితే నేను ఇప్పటి వరకు నా బయోగ్రఫీనే రాయలేదు. నా తోటి యాక్టర్స్ కొందరు నాలుగైదు పుస్తకాలు రాసేశారు కూడా. ప్రస్తుతం నాకైతే బయోపిక్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పటివరకూ చేసిన జర్నీల తాలూకు ఎక్స్పీరియన్స్ నుంచి ఓ బుక్ రాస్తానేమో. ఎప్పుడైనా పాత ఫొటోలు (స్ట్రగ్లింగ్ యాక్టర్గా ఉన్నప్పటివి) చూసుకుంటే ఫొటోలో ఉన్న నన్ను చూసుకుంటూ నేను ‘నువ్వు హీరో అయ్యావు’ అనుకుంటాను’’ అని పేర్కొన్నారు. -
డేట్ మారింది
ఈ ఏడాది ఆగస్టు 15కు బాక్సాఫీస్ వద్ద అక్షయ్కుమార్ ‘గోల్డ్’, జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’, ధర్మేంద్రల ‘యామ్లా పాగ్లా దీవానా ఫిర్ సే’ చిత్రాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. కానీ ఇప్పుడు ‘యామ్లా పాగ్లా దీవానా..’ చిత్రబృందం తమ నిర్ణయాన్ని మార్చుకుని సినిమాను ఆగస్టు 31కి వాయిదా వేసుకున్నట్లు బీటౌన్ టాక్. ‘గోల్డ్, సత్యమేవ జయతే’ రెండూ దేశభక్తికి సంబంధించిన చిత్రాలే కావడం ఇందుకు కారణమట. నవనీత్సింగ్ దర్శకత్వంలో తండ్రీకొడుకులు ధర్మేంద్ర, సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్య తారలుగా రూపొందిన ‘యామ్లా పాగ్లా దీవానా ఫిర్ సే’ కామెడీ జానర్ మూవీ. రెండు దేశభక్తి చిత్రాలతో కామెడీ జానర్ మూవీ ఎందుకు? అని విడుదలను వాయిదా వేసుకున్నారట. ఈ ప్రాంచైజీలో వచ్చిన తొలిపార్ట్కు సమీర్ కార్నిక్ దర్శకత్వం వహించగా, రెండో పార్ట్కు సంగీత్ శివన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. -
జిమ్కి వెళ్లేవాణ్నే కాదు
యాక్టర్స్ ఫిట్గా ఉండటానికి గంటల తరబడి జిమ్లో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. కష్టతరమైన వర్కౌట్స్ చేస్తూ ఫిట్గా ఉంటుంటారు. కానీ, నా యంగర్ డేస్లో ఎప్పుడూ జిమ్కి వెళ్లలేదు అంటున్నారు బాలీవుడ్ ‘యాక్షన్ కింగ్’ ధర్మేంద్ర. జిమ్కు వెళ్లకుండా కూడా ఫిట్గా ఉండగలిగిన సీక్రెట్ షేర్ చేస్తూ –‘‘పొలమే నా జిమ్. నా యంగ్ డేస్లో జిమ్కు ఎప్పుడూ వెళ్లలేదు. పొలాన్ని దున్నడం, బావిలో నుంచి నీళ్లు తోడటం వంటి పనులు చేస్తుండేవాణì్న. అలాంటి వర్కౌట్సే బెస్ట్ వర్కౌట్స్. మనల్ని ఫిట్గా ఉంచుతాయి’’ అని పేర్కొన్నారు ధర్మేంద్ర. -
సవతి కొడుకు గురించి హేమ మాలిని
సాక్షి, సినిమా : బాలీవుడ్ లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలియని వారుండరేమో. మొదటి భార్య ప్రకాశ్ కౌర్ ఉండగానే నటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే మతం మారి మరి ఆయన హేమను వివాహం చేసుకున్నారంటూ అప్పట్లో ఆయనపై విమర్శలు వెలువెత్తాయి. అదంతా ట్రాష్ అంటూ వాటిని ధర్మేంద్ర ఖండించారు కూడా. ఇదిలా ఉంటే మొదటి భార్య కుమారులైన సన్నీ, బాబీ డియోల్లు.. హేమ మాలిని-ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ కనిపించరు. అసలు వీరు కలవటం అనేది కూడా చాలా అరుదనే చెప్పుకోవాలి. కానీ, గ్యాప్ గురించి బాలీవుడ్లో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు కూడా. అయితే ఫస్ట్ టైమ్ ధర్మేంద్ర మొదటి భార్య పిల్లల గురించి హేమ మాలిని ఓపెన్ అయ్యారు. వారితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె స్వయంగా చెప్పారు. ప్రముఖ రచయిత రాజ్ కమల్ ముఖర్జీ రచించిన ఆమె ఆత్మకథ హేమా మాలిని : బియాండ్ ది డ్రీమ్ గర్ల్ పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మా మధ్య బంధం ఎంతో అందమైంది. ముఖ్యంగా నాకు ఎప్పుడు ఏం సాయం కావాలన్న ధర్మేంద్రతోపాటు సన్నీ కూడా ముందుంటాడు’’ అని ఆమె చెప్పారు. 2005లో రాజస్థాన్లో ఆమెకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హేమను ముందుగా పరామర్శించటంతోపాటు.. తోడుగా సన్నీ డియోల్ నిలిచాడంట. ఆమె వెంటే ఉండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నాడని ఆమె చెప్పారు. ఇక ఈ పుస్తకావిష్కరణ సభకు సన్నీడియోల్ రాకపోయినప్పటికీ.. రమేష్ సిప్పీ, జూహి చావ్లా,సుభాష్ ఘాయ్, నటి దీపికా పదుకునే, మాలిని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
పంట నష్టంతో రైతు ఆత్మహత్య
జూపాడుబంగ్లా: కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ధర్మేంద్ర నాయుడు (౩౦) గతంలో మినుములు పంట వేస్తే నష్టం వచ్చింది. దాంతో ఈ సారి వరి పంట వేయగా నీళ్లు లేక పంట ఎండి పోయింది. దీంతో ఈసారి కూడా నష్టాలు తప్పవనే దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆస్పత్రి పాలైన సీనియర్ నటుడు
ముంబై: అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో, అబితాబ్ బచ్చన్తో కలిసి 'షోలే' లాంటి సూపర్హిట్ సినిమాలో నటించిన ధర్మేంద్ర (81) అస్వస్థతకు గురయ్యారు. జీర్ణకోశ (గ్యాస్ట్రోఎంటెరిటిస్) సమస్యతో బాధపడుతున్న ఆయనను వెంటనే ముంబైలోని నానావతికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజేపీ ఎంపీ హేమామాలిని ధర్మేంద్రకు సతీమణి. 70వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మాస్ హీరోగా ధర్మేంద్ర అలరించాడు. 1975లో వచ్చిన 'షోలే' సినిమాలో ధర్మేంద్ర కెరీర్లో మేలిమలుపుగా నిలిచిపోయింది. ధర్మేంద్ర ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, రెండురోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ విశేష్ అగర్వాల్ తెలిపారు. -
నాకు హీరోయిన్గా జయ నటించారు
ముంబై: జయలలిత మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు ధర్మేంద్ర అన్నారు. ఇజ్జత్ సినిమాలో జయలలిత, తాను కలసి నటించామని నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని విన్నానని, కోలుకోవాలని ప్రార్థించానని, ఇంతలోనే ఆమె మరణవార్త తనను కలచివేసిందని చెప్పారు. జయలలిత మృతి పట్ల సంతాపం ప్రకటించారు. జయలలిత, ధర్మేంద్ర కలసి నటించిన ఇజ్జత్ సినిమా 1968లో విడుదలైంది. హిందీలో జయలలిత నటించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాలో ధర్మేంద్ర ప్రియురాలి పాత్రలో ఆమె నటించారు. టీ ప్రకాశ్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. -
ఎంసెట్ లీకేజీలో కొత్త పేరు
► 2005 ఎయిమ్స్ ప్రశ్నపత్రం లీకు వీరుడు ధర్మకూ పాత్ర ► గాలిస్తున్న మూడు ప్రత్యేక బృందాలు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ధర్మ అలియాస్ ధర్మేంద్ర అనే వ్యక్తికి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ధర్మ గతంలో పలు ప్రశ్నపత్రాల లీకేజీల్లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా 2005లో ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా ఎంసెట్ లీకేజీలోనూ కీలకపాత్ర పోషించినట్లు సీఐడీకి ఆధారాలు లభ్యమయ్యాయి. కీలక బ్రోకర్లు గుడ్డూ, ఇక్బాల్, రాజగోపాల్రెడ్డి, రాజేశ్లతో ధర్మ తరచూ ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ధర్మను అదుపులోకి తీసుకుంటే ఎంసెట్ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధర్మను పట్టుకొనేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, ముంబై, చండీగఢ్లలో గాలిస్తున్నాయి. ముకుల్జైన్ అరెస్టు ఇక ఈ కుంభకోణంలో ఢిల్లీకి చెందిన బ్రోకర్ ముకుల్ జైన్ను సీఐడీ అరెస్టు చేసింది. అతను సబ్ బ్రోకర్లు చంద్రశేఖర్రెడ్డి, రాజేశ్, షకీరాల ద్వారా ఆరుగురు విద్యార్థులకు కోల్కతాలో శిక్షణ ఇప్పించినట్లు విచారణలో వెలుగు చూసింది. అయితే కోల్కతాలోని ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని మరో బ్రోకర్ మోహిత్ కుమార్ సింగ్ నిర్వహించినట్లు గుర్తించింది. అతడిని కూడా అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. -
సీనియర్ హీరోలకు మెగాస్టార్ విషెష్
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సినీ పరిశ్రమలోని తన స్నేహితులు, సీనియర్ హీరోలు ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హాలకు శుభాకాంక్షలు చెప్పారు. ధర్మేంద్ర, సిన్హాలతో అమితాబ్ కలిసున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ 73 ఏళ్ల అమితాబ్ ట్వీట్ చేశారు. అమితాబ్, ధర్మేంద్ర (80) 1975లో బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో కలసి నటించారు. ఈ సినిమాల్లో వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గా నటించారు. ఈ సినిమా గురించి అమితాబ్ ప్రస్తావిస్తూ కొన్ని సంఘటనలు ఎప్పటికీ మధురంగా ఉంటాయి అంటూ, షోలేలోని ధర్మేంద్ర స్టిల్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే అమితాబ్, శత్రుఘ్న సిన్హాలు దోస్తానా సినిమాలో నటించారు. -
'హేమ నా ఇంటికి దగ్గరే.. కానీ కలుసుకోలేదు'
ముంబయి: దాదాపు 40 ఏళ్ల తరువాత.. అలనాటి సూపర్ డూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం 'షోలే' తారాగణమంతా ఒకే వేదికపై తళుక్కుమన్నారు. వారందరినీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఏకం చేసింది. హేమమాలిని తొలి సంగీత ఆల్బమ్ 'డ్రీమ్ గర్ల్' ఆవిష్కరణ వారంతా ఒక వేదికపైకి రావడానికి అవకాశం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పీ తదితరులు హాజరయ్యారు. '40 ఏళ్ల తరువాత హేమామాలిని మ్యూజిక్ ఆల్బమ్ షోలే చిత్ర సభ్యులను ఒకే చట్రంలోకి తీసుకొచ్చింది' అని అమితాబ్ మంగళవారం తన బ్లాగులో పోస్ట్ చేశారు. 'మా జట్టులోని సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్ మన మధ్యలో లేరు. సమయం ఎవరి కోసం ఆగదు. కానీ ఆ ఎదురుచూపులను గుర్తిస్తుంది. ధర్మేంద్ర, హేమమాలిని మా ఇంటికి దగ్గర్లోనే ఉంటారు. కానీ మేం ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ కార్యక్రమంలో ఇలా కలుసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది' అని అమితాబ్ అన్నారు. ఈ ఆల్బమ్లోని 'అజీ సునియే జరా' అనే పాటను సంగీత దర్శకుడు బాబుల్ సుప్రియోతో కలిసి హేమమాలిని పాడింది. ఈ పాటలోని బిగ్ బిసే లేకే పాజి అనే పదాలు అమితాబ్, ధర్మేంద్రలను సూచిస్తాయి. 'కళలు, వినోదాలే నన్ను నడిపిస్తున్నాయి. అవి నాలో కలిసిపోయాయి. గతంలో నా గాన ప్రతిభను పరీక్షించుకోలేదు. ఇప్పుడు వినిపించేందుకు ఆత్రుతతో ఉన్నాను. గతంలోమాదిరిగానే ఈసారీ ఆదరిస్తారని భావిస్తున్నాను' అని హేమమాలిని అన్నారు. 1973లో కిశోర్ కుమార్ను చూసి స్ఫూర్తి పొందిన హేమ అప్పటి నుంచి సంగీత ఆల్బమ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
డిసెంబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ధర్మేంద్ర (నటుడు), షర్మిలా ఠాగూర్ (నటి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యసంబంధ సంఖ్య కావడం వల్ల స్వతస్సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు, జీవితంలో పైకి రావాలనే కోరిక బలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, వాటిని తమ ఉన్నతికి ఉపయోగించుకుంటారు. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. అధికారుల సహకారంతో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. వీరు పుట్టిన తేదీ 8 శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఒక గాడిన పడతాయి. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సామాజిక పరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తాయి. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి. లక్కీ నంబర్స్: 1,3, 5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, బ్లాక్, ఎల్లో, సిల్వర్, గోల్డెన్. సూచనలు: రుద్రాభిషేకం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం, తండ్రిని, తత్సమానులను గౌరవించడం, తోబుట్టువులను ఆదరించడం, వికలాంగులకు సహాయం చేయడం, శనికి తైలాభిషేకం, కాకులకు,శునకాలకు ఆహారం పెట్టడం, మంచిది - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ధర్మేంద్ర సోదరుడు మృతి
ముంబై : బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ తండ్రి, ప్రముఖ నటుడు ధర్మేంద్ర సోదరుడు.. అజిత్ సింగ్ డియోల్ శుక్రవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అజిత్ కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అజిత్ తుది శ్వాస విడిచారు. శనివారం ఉదయం ముంబై నగర శివారులోని పవన్ హన్స్లోని అంత్యక్రియలు జరిపినట్లు చెప్పారు. అజిత్ నటుడు, దర్శకుడిగా పలు పంజాబీ, హిందీ చిత్రాలు తీశారు. అలాగే పలు చిత్రాలలో ఆయన నటించారు. -
ది బర్నింగ్ ట్రైన్....
బి.ఆర్.చోప్రా కొడుకు రవిచోప్రా భారీగా తీసిన సినిమా ఇది. ఇంత భారీగా తీయడం వెనుక ‘షోలే’ ఘన విజయం ఉంది. 1975లో విడుదలైన షోలే సృష్టించిన కలెక్షన్లు అసామాన్యమైనవి. దీంతో రవి చోప్రా కూడా చాలా ఖర్చు పెట్టి భారీ హంగామాతో సినిమా తీసి హిట్ కొట్టాలనుకుని ఈ కథ తీశాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళుతున్న కొత్త రైలు ‘సూపర్ ఎక్స్ప్రెస్’ అగ్ని ప్రమాదానికి గురైతే అందరూ కలిసి దానిని ఎలా ఆపారు, ప్రయాణికులను ఎలా రక్షించారు అనేది కథ. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, జితేంద్ర, పర్విన్బాబీ, హేమమాలిని, నీతూ సింగ్ ఇంత మంది హేమాహేమీలు ఈ సినిమాలో నటించారు. డానీ విలన్. 1980 మార్చిలో విడుదలైంది. ఓపెనింగ్స్ భారీగా వచ్చినా చాలా తొందరగా కలెక్షన్లు పడిపోయాయి. షోలేలో ఉన్న కథ, మానవోద్వేగాలు, విలన్ ఇందులో అంత గట్టిగా లేకపోవడం కథ రైలు వరకే కుదించుకోవడం ప్రేక్షకులకు నచ్చలేదు. కాని టెక్నికల్గా సినిమా మంచి ప్రమాణాలు అందుకుంది. ఇందులో రఫీ ఖవాలి (సాహిర్ రచన) ‘పల్ దో పల్ కా సాథ్ హమారా... పల్ దో పల్ కే యారానే హై’ పెద్ద హిట్. ఈ సినిమాకు సంబంధించి ఈ పాటే మిగిలింది. -
'మా అబ్బాయిలతో కలిసి నటించాలని ఉంది'
న్యూఢిల్లీ : తన కుమారులతో కలిసి నటించాలని ఉందని బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర అన్నాడు. మంచి కథ దొరికితే తన కుమారులతో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. సన్నీడియోల్, బాబీడియోల్లు ధర్మేంద్ర మొదటి భార్య సంతానం అన్న విషయం అందరికి విదితమే.గతంలో వీరు ముగ్గురి కలయికలో అప్నే, యమ్లా పగ్లా దీవానా చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో మరో మూవీ చేయాలని వెటరన్ నటుడు, షోలే సూపర్ స్టార్ ధర్మేంద్ర ఉవ్విళ్లూరుతున్నాడు. తొలి రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ, యమ్లా పగ్లా దీవానా సీక్వెల్ ఫ్లాప్ అవడంతో మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్పై కనిపించలేదు. ధరమ్ ఘరమ్ అనే ఓ స్టార్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. సన్నీ, బాబీలతో కలిసి మరోసారి వెండితెరపై కనిపించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కానీ ఓ మంచి స్క్రిప్ట్ దొరికితే ఈ తండ్రీకొడుకులను మరోసారి సిల్వర్స్ర్ర్కీన్పై అభిమానులను కనువిందు చేస్తామన్నాడు. యాక్టింగ్ కింగ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధర్మేంద్ర 1960లలో బాలీవుడ్లో తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగినా తనను తాను ఎప్పుడు ఓ స్టార్ అని భావించనని 'షోలే' సూపర్ స్టార్ మరిన్ని ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నాడు. -
ఆడవాళ్లు అలానే బావుంటారట!
ముంబై: 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' సినిమాతో బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హీరో ధర్మేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల అందం గోప్యంగా ఉంటేనే బాగుంటుందట. 'టూ మచ్' ఓపెన్గా ఉండడం అనేది కొంతకాలం తర్వాత బోర్ కొడుతుందనీ, రహస్యంగా ఉంటేనే బాగుంటుందన్నారు. చక్కగా బొట్టు పెట్టుకుని, నిండా ముసుగు కప్పుకొని ఉంటే ఆడవాళ్ల అందం మరింత ఇనుమడిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వెనుకటి తరం హీరోయిన్లు పొడుగు జాకెట్లతో పూర్తిగా శరీరాన్ని కవర్ చేసేలా, నిండుగా ఉండేవారని పేర్కొన్నారు. ఇపుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. అంతమాత్రాన ప్రస్తుత ట్రెండ్ను తాను విమర్శించడం లేదని.. తాను ఎవరినీ తప్పుబట్టడం లేదంటూ సమర్థించుకున్నారు. అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తన సినిమా ముచ్చట్లను మీడియాతో పంచుకున్న ధర్మేంద్ర ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వగలాడి భర్తను రెడ్ హ్యాండెడ్గా బుక్ చేసే కథాంశంతో రూపొందిన సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ మంచి సినిమా అవుతుందన్నారు. అసభ్యతకు తావు లేకుండా సినిమాను నిర్మించామంటూ చెప్పుకొచ్చారు. హిందీలో అనేక యాక్షన్, థ్రిల్లర్ సినిమాల్లో కథానాయకుడిగా నటించిన ధర్మేంద్ర ... అలనాటి హీరోయిన్ హేమమాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. -
ఆయన లాగే... అప్పటి దాకా..!
‘‘అభిమానులు, ఇతర ప్రేక్షకులు, మీడియావాళ్లు నా మీద చూపిన అభిమానానికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నా ఆరోగ్యం గురించి వాళ్లు పడిన ఆందోళన చూసి, ఉద్వేగానికి గురయ్యా’’ అని అలనాటి హిందీ హీరో ధర్మేంద్ర అన్నారు. ఏంటీ? ధర్మేంద్ర అనగానే ‘షోలో’ గుర్తొస్తోందా? ఆ జ్ఞాపకాలను కాసేపు పక్కనపెట్టి, ఇటీవల ధర్మేంద్ర తాజా ఆరోగ్య పరిస్థితి గురించి చాలామంది కలవరపడ్డారు. కానీ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదనీ, ‘ఐయామ్ ఫైన్’ అని ధర్మేంద్ర ప్రకటించారు. ‘‘మూడు నెలల క్రితం ఓ చిత్రం షూటింగ్లో షాట్ గ్యాప్లో వ్యానిటీ వ్యాన్లో రిలాక్స్ కావాలనుకుని, ఎక్కబోయా. స్లిప్ అయ్యి, కిందపడ్డాను. అప్పుడు కుడి భుజం దగ్గర నొప్పిగా అనిపించింది. అది సామాన్యమైన నొప్పి కాదనీ, శస్త్ర చికిత్స అవసరం అనీ తెలుసుకున్నా. కానీ, అప్పుడు కుదరలేదు. ఇక, ఇటీవల బ్లడ్లో హెమోగ్లోబిన్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరాను. రెండు రోజులు చెకప్స్ జరిగాయి. అనంతరం డిశ్చార్జ్ అయ్యాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. పస్తుతం ‘సెకండ్ హ్యాండ్ హజ్బండ్’ అనే చిత్రంలో నటిస్తున్నా. త్వరలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నా. ఆ తర్వాత వీలు చేసుకుని, కుడి చేతికి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నా’’ అన్నారు. సినిమాల్లోకి రావాలనుకోవడానికి నటుడు దిలీప్ కుమార్ ఆదర్శమనే ధర్మేంద్ర హాలీవుడ్ నటుడు, దర్శక, నిర్మాత క్లింట్ ఈస్ట్వుడ్ 105 ఏళ్ల వయసు వరకూ పని చేస్తానని ఓ సందర్భంలో అన్నారనీ, తానూ ఆయనను అనుసరించాలనుకుంటున్నాననీ చెప్పారు. -
ఐదు కోట్లకు తగ్గేది లేదు: సోనమ్ కపూర్
మూవీ బజ్: ‘భాగ్ మిల్కా భాగ్’, ‘రాన్ఝానా’ వంటి సూపర్హిట్ చిత్రాలతో అభిమానులకు చేరువైన సోనమ్ కపూర్ తన పారితోషికాన్ని అమాంతం ఐదు కోట్లకు పెంచేసింది. ప్రస్తుతం కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన సూరజ్ బర్జాత్యా రూపొందిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో నటిస్తున్న సోనమ్, సినిమాలకు సంతకం చేయాలంటే ఐదు కోట్లకు తగ్గేది లేదని కరాఖండిగా చెబుతోందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఎవరికైనా కష్టమే తెరపై సన్నిహితంగా కనిపించే శృంగార సన్నివేశాల్లో నటించడం నటీనటులెవరికైనా కష్టమేనని రిచా ఛద్దా చెబుతోంది. నిఖిల్ ద్వివేదీతో కలసి త్వరలోనే విడుదల కానున్న ‘తమాషే’ చిత్రంలో హాట్హాట్ సన్నివేశాల్లో నటించిన రిచా, మీడియాతో తన అనుభవాల్ని పంచుకుంది. చుట్టూ జనం ఉండగా, ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్గా చిత్రించే ఈ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమని, అంతకంటే స్టంట్ సన్నివేశాల్లో నటించడమే తేలికని అంటోంది. అత్యుత్తమ ‘తెర’మైత్రి షోలే చిత్రంలో జయ్ (అమితాబ్ బచ్చన్), వీరూ (ధర్మేంద్ర)లదే అత్యుత్తమ తెర మైత్రి అని ఒక తాజా సర్వేలో తేలింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక మాట్రిమోనియల్ వెబ్సైట్ ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలో 4,700 మంది మహిళలు పాల్గొనగా, వారిలో 39.1 శాతం మహిళలు జయ్, వీరూ మైత్రికే ఓటేశారు. ‘కుఛ్ కుఛ్ హోతా హై’లో అంజలి (కాజోల్), రాహుల్ (షారుక్ ఖాన్) మైత్రి 33.8 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. -
ప్రచారంలో హేమామాలినికి పెళ్లి కష్టాలు!
మథుర: బీజేపీ అభ్యర్థి 'డ్రీమ్ గర్ల్' హేమామాలినికి మధుర నియోజకవర్గంలో సానుకూల పవనాలు వీస్తున్నా... గెలుపు కోసం చెమటోడ్చక తప్పడం లేదు. అయితే ఈ నియోజక పరిధిలో ప్రచారంలో దూసుకుపోతున్న హేమామాలినికి విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. ప్రచారంలో భాగంగా ఏ చోటుకెళ్లినా ధర్మేంద్ర ఎప్పుడొస్తున్నారని హేమామాలిని అడుగుతున్నారు. ప్రజల అభ్యర్థన మేరకు ధరమ్ జీని త్వరలోనే ప్రచారంలోకి దించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే ధర్మేంద్ర ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని.. బీఎస్పీ అభ్యర్థి యోగేంద్ర ద్వివేదికి ప్రచారం నిర్వహిస్తున్న రామ్ ధార్ అనే కార్యకర్త అంటున్నారు. ప్రచారంలో ధర్మేంద్ర పాల్గొంటే.. హేమామాలినితో వివాహ సంబంధంపై నిలదీస్తామన్నారు. హేమామాలినితో ఉన్న సంబంధమేమిటనే ప్రశ్నకు ధర్మేంద్ర సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అందుకే హేమామాలిని ప్రచారంలో ధర్మేంద్ర పాల్గొనడానికి వెనకడుగు వేస్తున్నారని చేస్తున్న ప్రచారాన్ని సినీ దర్శకుడు అనిల్ శర్మ ఖండించారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికావని.. ధర్మేంద్ర సోమవారం నుంచి ప్రచారంలో పాల్గొంటారని అనిల్ శర్మ తెలిపారు. ఇదిలా ఉండగా తల్లి హేమామాలినికి కూతుళ్లు ఇషా, అహానాలు గ్రామీణ ప్రాంతాల్లో కలుసుకుని తల్లి విజయానికి కృష్టి చేస్తున్నారు. జాట్ కులస్థులు ఎక్కువగా ఉన్న మథుర నియోజకవర్గంలో 'డ్రీమ్ గర్ల్' కు రాష్రీయ లోక్ దళ్ అభ్యర్థి జయంత్ చౌదరీ గట్టిపోటీనిస్తున్నారు. -
సతుల కోసం బాలీవుడ్ పతుల పాట్లు
పలువురు బాలీవుడ్ నటీమణులు ఈసారి ఎన్నికల బరిలో ఉండటంతో వాళ్ల పతులకు ఎన్నికల పాట్లు తప్పడం లేదు. ఇప్పటికే కిరణ్ ఖేర్ తరఫున ఆమె భర్త అనుపమ్ ఖేర్ ప్రచారపర్వంలో తలమునకలుగా ఉన్నారు. చండీగఢ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ మీద కిరణ్ ఖేర్ బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే స్థానం నుంచి మరో బాలీవుడ్ నటి గుల్ పనగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. కిరణ్ తరఫున బాలీవుడ్ అగ్రనటుడు అనుపమ్ ఖేర్ కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇందుకోసం ఆయన దాదాపు నెల రోజుల పాటు తన సినిమా షూటింగులన్నీ రద్దు చేసుకున్నారు కూడా. ఇక మరోవైపు ఉత్తరప్రదేశ్లోని మథుర స్థానం నుంచి పోటీ చేస్తున్న అలనాటి కలల సుందరి హేమమాలిని కూడా తన భర్తను ప్రచార బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హేమమాలిని భర్త, ఒకప్పటి టాప్ హీరో ధర్మేంద్ర వచ్చే వారం నుంచి ప్రచారపర్వంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హేమమాలినే ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా హేమమాలినికి మద్దతుగా రావట్లేదంటూ ఇతర పార్టీల నాయకులు విమర్శలు గుప్పించడంతో ఆమె ఒకింత నొచ్చుకున్నారు. పెద్దకూతురు ఈషా డియోల్ ఇప్పటికే ప్రచారంలో అక్కడక్కడ పాల్గొంటుండగా, చిన్నకూతురు అహానా కూడా ప్రచారం చేసింది. ధరమ్జీ మరికొన్ని రోజుల్లో వస్తారని హేమ మాలిని చెప్పారు. అయినా జనం తన కుటుంబం గురించి ఎందుకు అడుగుతారో అర్థం కాదని, తన అల్లుళ్లు, వియ్యపురాళ్లు కూడా ప్రచారానికి వస్తామని చెప్పారని.. అయితే వాళ్లను ఎవరూ గుర్తుపట్టరు కాబట్టి వద్దన్నానని ఆమె అన్నారు. -
అహనా డియోల్ పెళ్లిసందడి
-
సోదరి వివాహానికి బాబీ, సన్నీడియోల్ దూరం!
సోదరి ఇషా డియోల్ పెళ్లికి గైర్హాజరైన సన్నీ, బాబీ డియోల్ లు అహనా పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ప్రకాశ్జీల సంతానం సన్నీ, బాబీ డియోల్ కాగా, ధర్మేంద్ర రెండవ భార్య సినీనటి హేమమాలినిలకు ఇషా, అహనా డియోలు ఇద్దరు కూతుళ్లు. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్న కారణంగా 2012 లో జరిగిన ఇషా డియోల్ వివాహానికి హాజరుకాలేదు. అయితే అహనా పెళ్లికి హాజరుకాకపోవడం వెనుక ఎలాంటి కారణాలు లేవని సన్నిహితులు వెల్లడించారు. ఇషా, అహనా, బాబీ, సన్నీ డియోల మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయన్నారు. అహనా పెళ్లి కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన మెహందీ వేడుకలో ఇషా డియోల్ జారి కింద పడిపోవడంతో ఆమె భుజానికి స్వల్పంగా గాయమైంది. చేతికి ఉన్న కట్టుతోనే వివాహ వేడుకల్లో ఇషా హడావిడి చేస్తోంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరా తో అహనా వివాహం ఆదివారం సాయంత్రం ముంబైలోని ఐటీసీ మరాఠాలో జరుగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ కు చెందిన షారుక్ ఖాన్ తోపాటు పలువురు తారలు, రాజకీయ నేతల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, రాజ్ థాకరేలు హాజరుకానున్నారు. -
దిలీప్ కుమార్ పుట్టినరోజు వేడుకలు
-
హాస్టల్ నుంచి ఐదుగురు యువతుల అదృశ్యం
పెనమలూరు, న్యూస్లైన్ : పెనమలూరులోని అనాథ బాలికల హాస్టల్ నుంచి ఐదుగురు యువతులు ఆదివారం వేకువజామున అదృశ్యం కావడంతో కలకలం రేగింది. తొలుత పోలీసులు ఈ ఘటనను అత్యంత గోప్యంగా ఉంచి విచారణ చేసినా.. ఆదివారం రాత్రికి యజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ ధర్మేంద్ర తెలిపిన ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరు వంతెన వద్ద నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో నవీన ఫర్ గాళ్స్ హాస్టల్ ఉంది. దీనిలో మొత్తం 19మంది అనాథ యువతులు ఉంటున్నారు. వీరికి నవజీవన్ బాలభవన్ యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. శనివారం రాత్రి ఈ యువతులు భోజనాల అనంతరం నిద్ర పోయారు. వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ఎస్.లక్ష్మి, కె.కావ్యలు బాత్రూమ్కు వెళ్లటానికి లేవగా నెట్వాచ్ఉమెన్ మేరీ తాళాలు తీసింది. బాత్రూమ్కు వెళ్లిన వారు తిరిగి రాగానే మళ్లీ తాళం వేసింది. అప్పటికి అందరూ ఉన్నారు. ఉదయం లేచి చూసేసరికి ఐదుగురు యువతులు అదృశ్యం కావడాన్ని వార్డెన్ గుర్తిం చారు. హాస్టల్లో రెండేళ్లుగా ఉంటున్న పరిటాలకు చెందిన ఎం.రమణ, కృష్ణలంకకు చెందిన ఎస్.లక్ష్మి, విజయవాడ శిఖామణి సెంటర్కు చెందిన ఎన్.గాయత్రి, రాజమండ్రికి చెందిన ఎం.సంతోషి, గుడివాడకు చెందిన కావ్య అదృశ్యమైనవారిలో ఉన్నారు. నిద్రలో ఉన్న వాచ్ఉమెన్ వద్ద నుంచి గప్చుప్గా తాళం తీసుకుని వారు పారిపోయి ఉంటారని వార్డెన్ భావిస్తున్నారు. వీరందరి వయస్సు 18-19 సంవత్సరాలే. వీరు విజయవాడలో చిన్నచిన్న ప్రైవేటు ఉద్యోగాలు, టైలరింగ్ వంటి పనులు చేస్తుంటారు. ఈ యువతుల అదృశ్యం విషయాన్ని హాస్టల్ యాజమాన్యానికి వార్డెన్, వాచ్మెన్ తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. హాస్టల్వద్ద భద్రత కరువు యువతులు ఉంటున్న ఈ వసతిగృహం వద్ద కనీస భద్రత కూడా లేదు. ఇక్కడ ఉండే యువతులందరూ పగలు వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ రాత్రివేళ హాస్టల్లో ఉంటున్నారు. ఈ యువతులు ఏం చేస్తారు, ఎక్కడకు వెళతారు తదితర అంశాలను ఆరా తీసేవారే లేరని సేకరించిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదని, రాత్రికి రాత్రే యువతులు అదృశ్యం కావడం దురదృష్టకరమని హాస్టల్వార్డెన్ రమాదేవి అన్నారు.