du plessis
-
గెలవాల్సిన మ్యాచ్ ఓడిన ఆర్ సీబీ కి మరో దెబ్బ
-
Viral Video: ఆహా.. ఏమా మాయాజాలం, కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్సీ క్లీన్ బౌల్డ్
IPL 2023 KKR VS RCB: ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 7) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (4-0-16-2), వరుణ్ చక్రవర్తి (3.4-0-15-4), సుయాశ్ శర్మ (4-0-30-3) ఆర్సీబీని కకావికలం చేశారు. వీరి ధాటికి ఆర్సీబీ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ICYMI - TWO outstanding deliveries. Two massive wickets. Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on. Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW — IndianPremierLeague (@IPL) April 6, 2023 ముఖ్యంగా సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్వెల్, హర్షల్ పటేల్లను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. నరైన్ బౌలింగ్లో కోహ్లి, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డుప్లెసిస్ ఒకే రీతిలో క్లీన్ బౌల్డ్ కాగా.. చక్రవర్తి బౌలింగ్లో మ్యాక్సీ, హర్షల్ పటేల్ కూడా ఇంచుమించు అలాగే బౌల్డ్ అయ్యారు. కేకేఆర్ స్పిన్నర్ల మాయాజాలానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఆహా.. ఏమా మాయాజాలం అని కామెంట్లు పెడుతున్నారు. Varun Chakravarthy was absolutely unplayable in that spell! 3.4-0-15-4 🔥🔥pic.twitter.com/jvhyU8fOdS — Prasenjit Dey (@CricPrasen) April 6, 2023 ఇదిలా ఉంటే, చారిత్రక ఈడెన్ గార్డెన్స్లో నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్కతా నైట్రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్లో శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్లు) శివాలెత్తగా.. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
వేలంలో తగ్గేదేలే.. ఆ ముగ్గురిపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్!
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్దమైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. కాగా ఈ వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఇక ఐపీఎల్ మెగా 2022 వేలంకు ముందు చెన్నై సూపర్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కోడుతుంది. రానున్న వేలంలో సీఎస్కే.. డుప్లెసిస్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ను మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేలంకు ముందు డు ప్లెసిస్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ను సీఎస్కే రీటైన్ చేసుకోలేదు. “వేలంలో మా వ్యూహాన్ని బయటకు చెప్పడం సరైనది కాదు, అయితే సీఎస్కేకు ఎక్కువ కాలం సేవలందించిన ఆటగాళ్లను తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మేము టార్గెట్ చేసుకున్న పేర్లును నేను బయటకు వెల్లడించాలి అనుకోవడం లేదు. చాలా మంది ఆటగాళ్లు ఎక్కువ కాలం జట్టుకు సేవలు అందిచారు. అయితే రీటెన్షన్ నిబంధనల కారణంగా మేము వదులుకోవాల్సి వచ్చింది" అని చెన్నై సూపర్ కింగ్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సీఎస్కే వేలానికి ముందు రవీంద్ర జడేజా,మొయిన్ అలీ,ఎంస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్లను రీటైన్ చేసుకుంది. చదవండి: 6 సిక్స్లు, 2ఫోర్లు.. కేవలం 19 బంతుల్లోనే.. బౌలర్లకు చక్కలు! -
ధోని పక్కా వ్యూహం.. వారి వయసు 35 ఏళ్లకు పైనే..
సాక్షి క్రీడా విభాగం: ‘మేం వచ్చేసారి బలంగా తిరిగొస్తాం... అభిమానులకు ఇదే నా సందేశం’... గత ఏడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్య ఇది. జట్టుపై, తనపై ఎంత నమ్మకముంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు. ఎందుకంటే అతను ధోని కాబట్టి! చూస్తుంటే టీమ్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. వయసు పెరిగిపోయి, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్లతో ఈసారే కాలేదు, వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు. కానీ ఇలాంటి స్థితి నుంచి టీమ్ను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం. సీఎస్కేకు తొలి సీజన్ నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ ధోనినే. జట్టు గెలిచినా, ఓడినా, చాంపియన్షిప్లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే నమ్మింది. ఇన్నేళ్ల విజయాల్లో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. కానీ మారనిది ధోని, అతని వ్యూహ చతురతే! సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో 40 ఏళ్ల ధోని బ్యాటింగ్ చూస్తే సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లు, ఒక కెప్టెన్తో ఆడినట్లు ఉంది. కేవలం నాయకత్వం కారణంగానే అతను టీమ్లో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీమ్ ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం! చెన్నై టీమ్లో ఐదుగురు ఆటగాళ్లు 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. టి20లు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది. అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు. వీరంతా టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 37 ఏళ్ల డు ప్లెసిస్ ఏకంగా 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్గా శుభారంభాలు అందించాడు. 38 ఏళ్ల బ్రావో 14 కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు. 34 ఏళ్ల సీనియర్, అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేశ్ రైనా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో 35 ఏళ్ల రాబిన్ ఉతప్పను తుది జట్టులోకి తీసుకొని చేసిన వ్యూహం సూపర్గా పేలింది. తొలి క్వాలిఫయర్లో మెరుపు బ్యాటింగ్ చేసిన ఉతప్ప, ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళుతున్న సమయంలో 3 సిక్సర్లతో ఆట మార్చేశాడు. 36 ఏళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక ఐపీఎల్ గెలిచిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచిన 34 ఏళ్ల మొయిన్ అలీని కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్ జట్టుకు ఎంతో పనికొచ్చాయి. ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది. ఇక టీమ్ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు రుతురాజ్ గైక్వాడ్. గత ఏడాది ఐపీఎల్ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైనా... చివరి మ్యాచ్లలో సత్తా చాటాడు. ఈసారి తనలోని పూర్తి స్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా 635 పరుగులు సాధించడం చెన్నై టైటిల్ విజయంలో కీలకంగా మారింది. వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. చివరగా... వచ్చేసారి ఐపీఎల్లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే విజేతలుగా నిలిచిన ఈ టీమ్లోని సభ్యుల్లో కూడా ఎంత మంది మళ్లీ ఐపీఎల్లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే. ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్ఫుల్ టీమ్ ఒక్క చోటికి చేరడం సహజంగానే కష్టం. ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమీ కాదు. చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు, సగటు క్రికెట్ అభిమాని కూడా... ఏం ఆడిందిరా ఈ టీమ్ అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది. -
నాలుగోసారి ‘కింగ్స్’
ఐపీఎల్లో మళ్లీ ‘విజిల్ పొడు’... పసుపు మయమైన దుబాయ్ మైదానంలో తమ ఆరాధ్య ఆటగాడు మాహి మళ్లీ ఐపీఎల్ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తుంటే... దసరా రోజున చెన్నై క్రికెట్ అభిమానుల పండగ ఆనందం రెట్టింపైంది... అనుభవం, అద్భుత నాయకత్వం వెరసి చెన్నై మరోసారి ధనాధన్ లీగ్లో తమ విలువేంటో చూపించింది. తుది పోరులో అన్ని రంగాల్లో మెరిసి నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. మెరుపు బ్యాటింగ్తో మొదటి భాగంలోనే విజయానికి బాటలు వేసుకున్న జట్టు, బౌలింగ్లో కీలక సమయంలో సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టింది. ఫైనల్ పోరులో తమదైన పాత్ర పోషించిన ప్రతీ ప్లేయర్ హీరోలుగా నిలిచారు. అటు కోల్కతా నైట్రైడర్స్ ఆరంభంలోనే భారీగా పరుగులు సమరి్పంచుకొని పట్టు కోల్పోయింది. నమ్ముకున్న బౌలర్లంతా విఫలం కాగా... బ్యాటింగ్లో టోర్నీ ఆసాంతం వెంటాడిన మిడిలార్డర్ వైఫల్యం అసలు సమయంలో పెద్ద దెబ్బ కొట్టింది. ఫలితంగా తమ మూడో ఫైనల్ను ఓటమితో ముగించాల్సి వచి్చంది. దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నాలుగో టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మొయిన్ అలీ (20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 31; 3 సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు. అనంతరం కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శుబ్మన్ గిల్ (43 బంతుల్లో 51; 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఒకదశలో 91/0తో లక్ష్యం దిశగా సాగిన జట్టు... 34 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ కోల్కతా జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... సీజన్ మొత్తంలో ఆడిన తరహాలోనే చెన్నైకి మరోసారి ఓపెనర్లు రుతురాజ్, డు ప్లెసిస్ శుభారంభం అందించారు. షకీబ్ ఓవర్లో రుతురాజ్ వరుసగా 4, 6 కొట్టగా, అదృష్టం కలిసొచ్చిన డు ప్లెసిస్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. నరైన్ ఈ జోడీని విడదీసిన సమయంలో కోల్కతా స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది. అయితే మూడో స్థానంలో వచి్చన రాబిన్ ఉతప్ప ఉన్న కొద్దిసేపు మెరుపు బ్యాటింగ్తో ఆట గమనాన్ని మార్చేశాడు. మరోవైపు ఫెర్గూసన్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన 35 బంతుల్లోనే డు ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ బౌలింగ్లో ఉతప్ప వెనుదిరిగినా అలీ దూకుడుతో చెన్నై ఇన్నింగ్స్లో జోరు తగ్గలేదు. శివమ్ మావి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అలీ, వరుణ్ చక్రవర్తి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ కొట్టాడు. ఫెర్గూసన్ ఓవర్లో 19 పరుగులు రాబట్టి కింగ్స్ పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి బంతికి డు ప్లెసిస్ అవుటైనా... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల్లో (61, 63, 68) అతను తన పాత్రను సమర్థంగా పోషించాడు. ఓపెనర్లు మినహా... చెన్నైతో పోలిస్తే ఛేదనలో కోల్కతా మరింత దూకుడు కనబర్చింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వరుస బౌండరీలతో జోరును ప్రదర్శించగా, గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహర్, శార్దుల్ ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టాడు. పవర్ప్లేలో 55 పరుగులు రాగా, జడేజా ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. అయితే ఈ దశలో శార్దుల్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతని ఓవర్లో భారీ షాట్కు ప్రయతి్నంచిన వెంకటేశ్... జడేజా అద్భుత క్యాచ్కు వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడగా, అదే ఓవర్లో రాణా (0) అవుటయ్యాడు. నరైన్ (2), కార్తీక్ (9), షకీబ్ (0), గాయంతో బ్యాటింగ్కు దిగిన త్రిపాఠి (2), పేలవ ఫామ్లో ఉన్న కెపె్టన్ మోర్గాన్ (4) వరుసగా విఫలమయ్యారు. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్ వేగంగా పతనమైంది. చివర్లో 21 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన శివమ్ మావి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫెర్గూసన్ (18 నాటౌట్) కొన్ని మెరుపు షాట్లు ఆడి 39 పరుగులు జోడించినా అది వృథా ప్రయాసే అయింది. డు ప్లెసిస్కు అవకాశం ఇచి్చ... సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ చేసిన పెద్ద తప్పు చెన్నైకి ఊపిరి పోసింది. షకీబ్ బౌలింగ్లో డు ప్లెసిస్ ముందుకు దూసుకు రాగా, సునాయాస స్టంపింగ్ అవకాశాన్ని కార్తీక్ వదిలేశాడు. ఆ సమయంలో ప్లెసిస్ స్కోరు 4 మాత్రమే! ఆ తర్వాత అతనే భారీ స్కోరుకు కారణమయ్యాడు. కోల్కతా ఆటగాడు వెంకటేశ్ ‘0’ వచి్చన ఇచ్చిన క్యాచ్ను అనూహ్యంగా ధోని వదిలేసి అతని అర్ధ సెంచరీకి అవకాశం ఇచి్చనా... చివరకు అది నష్టం కలిగించలేదు. మరోవైపు 27 పరుగుల వద్ద గిల్ క్యాచ్ను రాయుడు అందుకున్నా... బంతి స్పైడర్ క్యామ్ వైర్కు తగిలి రావడంతో అంపైర్లు డెడ్బాల్గా ప్రకటించడం ధోనికి అసహనం తెప్పించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మావి (బి) నరైన్ 32; డు ప్లెసిస్ (సి) వెంకటేశ్ (బి) మావి 86; ఉతప్ప (ఎల్బీ) (బి) నరైన్ 31; మొయిన్ అలీ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–61, 2–124, 3–192. బౌలింగ్: షకీబ్ 3–0–33–0, మావి 4–0–32–1, ఫెర్గూసన్ 4–0–56–0, వరుణ్ 4–0–38–0, నరైన్ 4–0–26–2, వెంకటేశ్ 1–0–5–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 51; వెంకటేశ్ (సి) జడేజా (బి) శార్దుల్ 50; రాణా (సి) డు ప్లెసిస్ (బి) శార్దుల్ 0; నరైన్ (సి) జడేజా (బి) హేజల్వుడ్ 2; మోర్గాన్ (సి) చహర్ (బి) హేజల్వుడ్ 4; దినేశ్ కార్తీక్ (సి) రాయుడు (బి) జడేజా 9; షకీబ్ (ఎల్బీ) (బి) జడేజా 0; త్రిపాఠి (సి) అలీ (బి) శార్దుల్ 2; ఫెర్గూసన్ (నాటౌట్) 18; మావి (సి) చహర్ (బి) బ్రేవో 20; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–91, 2–93, 3–97, 4–108, 5–119, 6–120, 7–123, 8–125, 9–164. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–32–1, హేజల్వుడ్ 4–0–29–2, శార్దుల్ ఠాకూర్ 4–0–38–3, బ్రావో 4–0–29–1, జడేజా 4–0–37–2. ఐపీఎల్–2021 అవార్డులు ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ రుతురాజ్ గైక్వాడ్ –ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) హర్షల్ పటేల్–32 వికెట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హర్షల్ పటేల్ – ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ హర్షల్ పటేల్ – ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ రవి బిష్ణోయ్ (పంజాబ్ కింగ్స్) ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ హెట్మైర్ – ఢిల్లీ క్యాపిటల్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వెంకటేశ్ అయ్యర్ కోల్కతా నైట్రైడర్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ కేఎల్ రాహుల్ (30 సిక్స్లు) పంజాగ్ కింగ్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఫెయిర్ ప్లే టీమ్ ఆఫ్ ద సీజన్: రాజస్తాన్ రాయల్స్ -
ధోని సేనకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు విదేశీ స్టార్లు దూరం..!
దుబాయ్: ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఇద్దరు గాయాల బారిన పడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ప్రస్తుతం సీపీఎల్ 2021లో ఆడుతున్న బ్రావో, డుప్లెసిస్ గాయపడగా.. ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, మొయిన్ అలీలు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్లేఆఫ్స్కు దూరం కానున్నారు. గాయం కారణంగా బ్రావో కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితం కానుండగా, పాకిస్తాన్ ప్రిమియర్ లీగ్లో తగిలిన గాయం తిరగబెట్టడంతో డుప్లెసిస్ ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్, మొయిన్ అలీలు ఐపీఎల్ అనంతరం రెండు రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం బయో బబుల్లోకి వెళ్లిపోనున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం వారు మెగా టోర్నీ ప్రారంభానికి మందే ఇంగ్లండ్ బృందంలో చేరాల్సి ఉంది. ఇలా ఒకేసారి నలుగురు స్టార్ ఆటగాళ్లు దూరం కానుండడంతో సీఎస్కే టైటిల్ గెలవాలన్న ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ తొలి సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే మొదటి దశలో కీలకపాత్ర పోషించిన డుప్లెసిస్, మొయిన్ అలీ, సామ్ కరన్లు కీలక దశలో జట్టును వీడితే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా, సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ మలిదశ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. చదవండి: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి.. రోహిత్కు పగ్గాలు..? -
ఈ ఏడాది ఐపీఎల్లో వీరి మెరుపులు లేనట్టేనా..?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పలువురు విదేశీ ఆటగాళ్ల మెరుపులను అభిమానులు మిస్ కానున్నారా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వారు తమ దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాల్సి ఉండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఐపీఎల్కు దూరంకానున్న ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. అందులో అందరూ దక్షిణఫ్రికా క్రికెటర్లే ఉన్నారు. స్వదేశంలో పాకిస్థాన్తో 3 వన్డేలు, 4 టీ20లు ఆడాల్సి ఉండటంతో ఆ స్టార్లందరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్కు దూరంకానున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్వింటన్ డికాక్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రబాడ, అన్రిచ్ నోర్జ్, చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు లుంగి ఎంగిడి, ఫాఫ్ డుప్లెసిస్లు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా క్వింటన్ డికాక్, రబాడ, ఫాఫ్ డుప్లెసిస్లు తమతమ ఫ్రాంఛైజీల గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. డికాక్ గత సీజన్లో ముంబై ఇండియన్స్కు తరుపుముక్కగా నిలిచాడు. అతను ఆడిని 16 మ్యాచ్ల్లో 140.5 స్ట్రెక్రేట్తో 503 పరుగులు చేసి, ముంబై టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఫాఫ్ డుప్లెసిస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన ఆయన గత సీజన్లో 13 మ్యాచ్ల్లో 40.81 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రబాడ.. గత రెండు సీజన్లలో 29 మ్యాచ్లాడి 55 వికెట్లు తీశాడు. గత సీజన్లో 17 మ్యాచ్లాడిన ఆయన 8.34 ఎకానమీతో ఏకంగా 30 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్లు అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడిలు సైతం వారివారి ఫ్రాంఛైజీల జయాపజయాలను ప్రభావితం చేయగల ఆటగాళ్లే. -
డుప్లెసిస్ 199.. శ్రీలంక 180
సెంచూరియన్: శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను రెండో ఇన్నింగ్స్లో 180 కుప్పకూల్చి ఇన్నింగ్స్ విజయాన్ని సఫారీలు నమోదు చేశారు. 65/2 ఓవర్నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన లంకేయులు మరో 115 పరుగులు జత చేసి మిగతా ఎనిమిది వికెట్లను చేజార్చుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ దెబ్బకు లంకేయులు చేతులెత్తేశారు. కుశల్ పెరీరా(64), వానిందు హసరంగా( 59)లు మినహా మిగతా ఏ ఒక్కరూ ఆకట్టుకోలేదు. లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్తేలు లంకను ఆరంభంలోనే దెబ్బ కొట్టడంతో ఆ జట్టు ఇక తేరుకోలేకపోయింది. లంకేయులు తమ ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా, దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో 621 పరుగులు చేసింది. ఇక్కడ డుప్లెసిస్ పరుగు తేడాతో డబుల్ సెంచరీ కోల్పోయాడు. డుప్లెసిస్ 199 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఫలితంగా టెస్టుల్లో 199 పరుగుల వద్ద ఔటైన 11వ బ్యాట్స్మన్గా డుప్లెసిస్ నిలిచాడు. కాగా, డుప్లెసిస్ తొలి ఇన్నింగ్స్లో కొట్టిన పరుగుల కంటే శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్లో తక్కువ స్కోరు నమోదు చేయడం గమనార్హం. డుప్లెసిస్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. (రహానే ఖాతాలో స్పెషల్ మెడల్.. దాని ప్రత్యేకత ఏమిటి?) -
బౌండరీ లైన్పై ఇదేమి ‘మాయ’ డుప్లెసిస్
దుబాయ్: ఈ ఐపీఎల్లో సీఎస్కే ఆటగాడు డుప్లెసిస్ మాయచేస్తున్నాడు. అరే ఇది సిక్స్ అనుకునేలోపే దాన్ని బౌండరీ లైన్పై ఎగిరేసి అమాంత క్యాచ్ పట్టేసి ఔరా అనిపిస్తున్నాడు. క్యాచ్ పట్టే క్రమంలో నియంత్రణ చేసుకోవడానికి బౌండరీ లైన్ దాటేసినా బంతిపై ఏకాగ్రత మాత్రం కోల్పోవడం లేదు. బంతిని అలా బౌండరీ లైన్ బయటకు గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి క్యాచ్లను అందుకునే తీరు శభాష్ అనిపిస్తోంది. ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్లో సౌరవ్ తివారీ, హార్దిక్ పాండ్యాలను ఇలాగే మింగేసిన డుప్లెసిస్.. తాజాగా సన్రైజర్స్తో మ్యాచ్లో కీలకమైన డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్ను పట్టేసుకున్నాడు. సీఎస్కే స్పిన్నర్ పీయూష్ చావ్లా వేసిన 11వ ఓవర్ ఐదో బంతికి వార్నర్ భారీ షాట్ కొట్టాడు. ఇది సిక్స్ అనుకున్నారంతా. కానీ అక్కడ డుప్లెసిస్ ఉన్నాడు. అంతే అమాంతం గాల్లోకి ఎగిరి ముందు క్యాచ్ అందుకున్నాడు. అదే సమయంలో బౌండరీ లైన్ను దాటేస్తూ బంతిని బయటకు విసిరాడు. మళ్లీ వచ్చీ తీరిగ్గా క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్పై క్యాచ్లు పట్టడానికి అంతా ఆపసోపాలు పడుతూ ఉంటే డుప్లెసిస్ మాత్రం ఇట్టే వాటిని అందుకుంటున్నాడు. బౌండరీ లైన్పై క్యాచ్లు పట్టడం ఇంత ఈజీని అని అనుకునేలా మైమరిస్తున్నాడు.వార్నర్ క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో ఎస్ఆర్హెచ్ 69 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది. ఆపై అదే స్కోరు విలియమ్సన్(9)ని అంబటి రాయుడు రనౌట్ చేశాడు. దాంతో సన్రైజర్స్ కష్టాల్లో పడింది. -
ఐసీసీ.. ఇది ఎలా సాధ్యం?
కేప్టౌన్: ఏ ఒక్కరూ బంతిపై సలైవా(లాలాజలాన్ని)ను రుద్దు కూడదనే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మార్గదర్శకాలపై మళ్లీ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఈ ప్రతిపాదన తర్వాత పలువురు క్రికెటర్లు దీన్ని తప్పుపట్టగా, దాన్ని పాటించాలనే కచ్చితమైన గైడ్లైన్స్ తర్వాత కూడా అదే తరహా నిరసన వ్యక్తమవుతుంది. ఈ నిబంధనను ప్రవేశ పెట్టినంత సులువుగా అమలు చేయడం సాధ్యపడదని ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. ఈ విషయంలో రాత్రికే రాత్రే ఇందులో మార్పులు ఆశించడం తగదన్నాడు ఎప్పుట్నుంచో అలవాటుగా వస్తున్న దీన్ని ఆకస్మికంగా నిషేధం విధించడం చెప్పినంత తేలిక కాదనే విషయాన్ని ఐసీసీ తెలుసుకోవాలన్నాడు. మనం బంతిని పట్టుకున్న వెంటనే వేళ్లను నోటితో తడిచేసుకుని రుద్దడం ఎప్పుట్నుంచో వస్తుందని, దీన్ని వదిలేయాలంటే క్రికెటర్లు కత్తిమీద సాము చేసినట్లేనన్నాడు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) ఇక డుప్లెసిస్ మాట్లాడుతూ.. ఒక బౌలర్ల విషయంలోనే కాకుండా, ఫీల్డర్లు కూడా దీన్ని అనుసరిస్తూ వస్తున్నారన్నాడు. తాను బంతిని స్లిప్లో అందుకున్న వెంటనే నోటితో వేళ్లను తడిచేసుకుని రుద్దుతూ ఉంటానన్నాడు. అది తనకు అలవాటుగా మారిపోయిందన్నాడు. గతంలో రికీ పాంటింగ్ కూడా ఇలానే చేసేవాడనే విషయాన్ని ప్రస్తావించాడు. అది అనుకోకుండా జరిగిపోయే చర్య అని, దీన్ని ఒక్కసారిగా వదిలేయాలంటే ఈజీ కాదన్నాడు. కాగా, కరోనా వైరస్ సంక్షోభంతో భౌతిక దూరం అనే నిబంధనను మనం ఇప్పుడు చూస్తున్నాం. దాంతోపాటు పెద్ద ఎత్తున మాస్క్లు ధరించడం కూడా నిబంధనల్లో భాగమైపోయింది. కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి నోటి ద్వారానే ఎక్కువ శాతం సోకే అవకాశం ఉండటంతో ఐసీసీ కీలక మార్పులు తీసుకొచ్చింది. క్రికెట్ గేమ్లో భాగమై పోయిన బంతిపై సలైవా రుద్దడాన్ని ఉన్నపళంగా నిలిపివేసింది. దాంతో క్రికెటర్లకు ఇది పెద్ద సవాల్గా మారిపోయింది. (నలుగురు టీమిండియా క్రికెటర్లు.. కానీ కోహ్లి లేడు) -
‘ధోని వ్యూహాలకు తగ్గ కెప్టెన్లను తీసుకున్నాడు’
కేప్టౌన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ కావడానికి ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని అనుసరించిన విధానాలే కారణమని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. తమ వ్యూహాలకు అండగా ఉండే అంతర్జాతీయ కెప్టెన్లను తీసుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టు విజయం కోసం తెగించి ఆడేవాళ్లను ఎంచుకోవడమే ధోని సక్సెస్ సూత్రమన్నాడు. సీఎస్కే వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డుప్లెసిస్ పలు విషయాల్ని వెల్లడించాడు. ‘నాతో పాటు బ్రెండన్ మెకల్లమ్, బ్రేవోలాంటి అంతర్జాతీయ కెప్టెన్లను లక్ష్యంగా పెట్టుకుని చెన్నై టీమ్ను ఎంచుకుంది. ధోనీ, రైనా ఎలాగూ ఉంటారు. ఈ ఇద్దరు క్రికెట్ గురించి చాలా ఆలోచిస్తారు. అంతేకాకుండా జట్టులో చాలా మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ల అనుభవం, ఆలోచన జట్టుకు ఉపయోగపడుతుంది. చాలా మ్యాచ్ల్లో అది నిరూపితమైంది. ఇందులో ధోనితో పాటు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పాత్ర కూడా చాలా ఉంది. వీరిద్దరూ కలిసి సీఎస్కేను బలమైన జట్టుగా తీర్చిదిద్దారు. చెన్నై జట్టులో అద్భుత ఫీల్డర్లు కూడా ఉన్నారని ఈ సఫారీ బ్యాట్స్మన్ తెలిపాడు. అందులో జడేజా సూపర్బ్ ఫీల్డర్ అని కితాబిచ్చాడు. తన ఫీల్డింగ్తో సుమారు 20 నుంచి 30 పరుగులను జడేజా ఆపుతాడని దీనివల్ల బౌలర్లలో ఉత్సాహం వస్తుందన్నాడు తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో చెన్నై జట్టుతో ఎన్నో మధుర క్షణాలున్నాయని డుప్లెసిస్ తెలిపాడు. సురేశ్ రైనా విసిరిన ఐపీఎల్ ఫేవరేట్ మూమెంట్ చాలెంజ్లో భాగంగా తన ఆల్టైమ్ ఫేవరేట్ మూమెంట్స్ను పంచుకున్నాడు. గతేడాది ఆర్సీబీతో జరిగిన ఓ మ్యాచ్లో ధోని (84 నాటైట్) విధ్వంసకర ఇన్నింగ్స్, 2013లో రైనా చేసిన సెంచరీ, 2018లో బ్రేవో అందించిన అనూహ్య విజయం, గత రెండు సీజన్ల ఫైనల్లో షేన్ వాట్సన్ చేసిన పోరాటాలు ఫేవరెట్ మూమెంట్స్గా డుప్లెసిస్ పేర్కొన్నాడు. -
విసిరేసి పడిపోతే.. పడిపోయి పట్టేశాడు..!
పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తొలి టీ20లో ఆసీస్ గెలిస్తే, అందుకు సఫారీలు ఘనంగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా, ఆసీస్ను 146 పరుగులకే కట్టడి చేసి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో డుప్లెసిస్-డేవిడ్ మిల్లర్లు పట్టిన క్యాచ్ హైలైట్గా నిలిచింది. లక్ష్య ఛేదనలో భాగంగా లుంగి ఎన్గిడి వేసిన 18 ఓవర్ ఐదో బంతిని ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్ట్రైట్గా సిక్స్ కొట్టే యత్నం చేశాడు. అయితే ఆ క్యాచ్ కోసం బౌండరీ లైన్ వద్దకు డుప్లెసిస్-మిల్లర్లు ఇద్దరూ పరుగెత్తుకొచ్చారు. ముందుగా డుప్లెసిస్ క్యాచ్ను పట్టేసి బౌండరీ లైన్ లోపల పడే సమయంలో బంతిని గ్రౌండ్లోపలికి వేగంగా విసిరేయగా, దాన్ని మిల్లర్ వృథా కానివ్వ లేదు. ఆ బంతిని ఎంతో చాకచాక్యంతో పట్టేసుకుని గ్రౌండ్లో పడిపోయాడు. క్యాచ్ను పట్టే క్రమంలో ఇలా ఒకరు బంతిని విసిరేసి పడిపోతే, మరొకరు పడిపోయి మరీ ఒడిసి పట్టుకోవడం సఫారీల చురుకైన ఫీల్డింగ్కు అద్దం పడుతోంది. ఇదే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. మిచెల్ మార్ష్ ఔటయ్యే సమయానికి ఆసీస్ 138 పరుగులతో ఉంది. ఆ తర్వాత మాథ్యూ వేడ్(1), ఆస్టన్ ఆగర్(1)లు నిరాశపరచడంతో ఆసీస్పై ఒత్తిడి పెరిగింది. డేవిడ్ వార్నర్(67 నాటౌట్) చివరి వరకూ క్రీజ్లో ఉన్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 17 పరుగులు కావాల్సి న తరుణంలో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచి సిరీస్ను సమం చేసింది.సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం జరగనుంది. (ఇక్కడ చదవండి: సమష్టి వైఫల్యం.. 10 వికెట్ల పరాభవం) Wowee! What a catch! #SAvAUS pic.twitter.com/3UPDKpNZuU — Trishan Naidoo (@trishannai) February 23, 2020 -
డుప్లెసిస్ సంచలన నిర్ణయం
కేప్టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ క్రికెట్ దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న డుప్లెసిస్ ఉన్నపళంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే అన్ని ఫార్మాట్ల క్రికెట్కు తాను ఆటగాడిగా అందుబాటులో ఉంటానని డుప్లెసిస్ తన ప్రకటనలో వెల్లడించాడు. కొత్త నాయకత్వంలో దక్షిణాఫ్రికా మరింత ముందుకు వెళుతుందని ఆశించే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. దక్షిణాఫ్రికాకు నూతన సారథ్యం అవసరం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇంతకాలం దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్గా చేయడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు డుప్లెసిస్ తెలిపాడు. (ఇక్కడ చదవండి: ఏబీ ఫామ్లో ఉంటేనే: బౌచర్) టీ20 వరల్డ్కప్ తర్వాత తన భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని ఇటీవల తెలిపిన డుప్లెసిస్.. దానిలో భాగంగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి ముందుగా గుడ్ బై చెప్పడం గమనార్హం. ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్కు, టీ20 సిరీస్కు డుప్లెసిస్కు విశ్రాంతి ఇచ్చారు. దాంతో సఫారీ కెప్టెన్సీ పగ్గాలను డీకాక్ తీసుకున్నాడు. డీకాక్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లను కోల్పోయినా ఆశించిన స్థాయిలో రాణించింది. కెప్టెన్సీ పగ్గాలను మోస్తూనే డీకాక్ తన బ్యాటింగ్ జోరుతో ఆకట్టుకున్నాడు. తన వారసుడిగా డీకాక్ సరైనడివాడని భావిస్తున్న డుప్లెసిస్.. అందుకు ఇదే తగిన సమయం అని భావించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. డుప్లెసిస్ కెప్టెన్సీ పగ్గాలను వదులుకున్న విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన ట్వీటర్ అకౌంట్లో ‘బ్రేకింగ్’ అంటూ పోస్ట్ చేసింది. (ఇక్కడ చదవండి: మైదానంలోకి మహిళా అతిథి.. డీకాక్ దరహాసం) గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో డుప్లెసిస్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ఘోరంగా చతికిలబడింది. ఇటీవల టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్ను 3-1తో డుప్లెసిస్ సారథ్యంలోని సఫారీ జట్టు కోల్పోయింది. మరొకవైపు డుప్లెసిస్ సైతం పేలవమైన ఫామ్లో ఉన్నాడు. గత 14 టెస్టు ఇన్నింగ్స్ల్లో డుప్లెసిస్ యావరేజ్ 20.92గా ఉంది. దాంతో డుప్లెసిస్ కెప్టెన్సీపై విమర్శలు రాకముందే అతను ఆ బాధ్యతల నుంచి తప్పుకుని ఒత్తిడి తగ్గించుకున్నాడు. It has been the greatest honour of my life to lead my country. Read my full statement here: https://t.co/QVRrvQGLmO pic.twitter.com/d5qH9pQJ9d — Faf Du Plessis (@faf1307) February 17, 2020 BREAKING! Faf du Plessis has announced he is stepping down as South Africa captain from all formats! pic.twitter.com/ukBYGgduiX — ICC (@ICC) February 17, 2020 -
ఏబీ టైమ్ లేదు.. తొందరగా వచ్చేయ్!
కేప్టౌన్: గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ కోసం కసరత్తులు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే ఆ దేశ క్రికెట్ జట్టు నూతన ప్రధాన కోచ్గా ఇటీవల ఎంపికైన మార్క్ బౌచర్ .. డివిలియర్స్ పునః రాగమనం కోసం తన చర్చలను వేగవంతంగా చేశారు. ఆ క్రమంలోనే జట్టు కెప్టెన్ డుప్లెసిస్తో ముందుగా చర్చించగా అందుకు అతను కూడా ఒప్పుకున్నాడు. దాంతో ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ దాదాపు షురూ అయ్యింది. దీనిలో భాగంగా తన సహచర క్రికెటర్ ఏబీతో చర్చలు ఆరంభించినట్లు డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్ టీ20కి ఎంతో సమయం లేనందున డివిలియర్స్ ఎంత తొందరగా జట్టుతో కలిస్తే అంత బాగుంటుందన్నాడు. ఈ విషయంపై రెండు-మూడు నెలల క్రితమే చర్చించినా బౌచర్ కొత్త కోచ్గా వచ్చిన తర్వాత ఏబీ రాకపై కామెంట్ చేయడంతో దానిపై డుప్లెసిస్ స్పందించాడు. ‘ టెస్టు క్రికెట్ అనేది ప్రస్తుతం మాకు చాలా ముఖ్యమైనది. కానీ టీ20 క్రికెట్ అనేది చాలా భిన్నమైనది. ఏబీ రాకతో మా జట్టు మరింత బలోపేతం అవుతుంది. ఏబీ వస్తానంటే సాదరంగా స్వాగతిస్తాం. టీ20 వరల్డ్కప్కు ఎంతో సమయం లేదు. అదే సమయంలో మా రోడ్ మ్యాప్ కూడా చాలా బిజిగా ఉంది. ప్రత్యేకంగా ఈ సీజన్ టీ20 షెడ్యూల్ ఎక్కువగా ఉంది. డివిలియర్స్ తొందరగా జట్టులో కలిస్తే అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు’ అని డుప్లెసిస్ తెలిపాడు.ప్రస్తుతం సఫారీ క్రికెట్ సంధి దశలో ఉన్నందున దాన్ని చక్కదిద్దే పనిలో పడ్డారు కోచ్ బౌచర్, కెప్టెన్ డుప్లెసిస్లు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి డుప్లిసిస్తో పాటు హషీమ్ ఆమ్లా కూడా రిటైర్మెంట్ తీసుకోవడంతో ఆ జట్టు గాడి తప్పింది. -
ఆదిలోనే సఫారీలకు షాక్
రాంచీ: టీమిండియా జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్(1) విఫలమయ్యాడు. ఓవర్నైట్ ఆటగాడిగా సోమవారం తన ఇన్నింగ్స్ ఆరంభించిన డుప్లెసిస్ ఎంతో సేపు క్రీజ్లో నిలవలేదు. ఈ రోజు ఆటలో ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. డుప్లెసిస్ నిన్నటి ఆటతో కలుపుకుని తొమ్మిది బంతులు ఆడగా పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి డుప్లెసిస్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సఫారీలు 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్నారు. 9/2 ఓవర్నైట్ స్కోరుతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను కొనసాగించడానికి డుప్లెసిస్-హమ్జాలు బ్యాటింగ్కు దిగారు. కాగా, ఈ రోజు ఆటలో ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్ నాలుగు బంతుల్ని హమ్జా ఆడగా, ఐదో బంతిని డుప్లెసిస్ ఎదుర్కొన్నాడు. కాకపోతే ఉమేశ్ బంతిని అంచనా వేయడంలో విఫలమైన డుప్లెసిస్ వికెట్ను సమర్పించుకున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 438 పరుగుల వెనుకబడి ఉంది. రెండో రోజు ఆటలో డీన్ ఎల్గర్(0), డీకాక్(4)లు పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా కోల్పోయిన మూడు వికెట్లలో ఉమేశ్కు రెండు వికెట్లు లభించగా, షమీకి వికెట్ దక్కింది. (ఇక్కడ చదవండి:టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఉమేశ్ ఫాస్టెస్ట్ రికార్డులు) -
హాఫ్ సెంచరీలతో గాడిలో పెట్టారు!
విశాఖ: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ ఆరంభంలో కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికా తేరుకుంది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను ఓపెనర్ డీన్ ఎల్గర్ నిలబెట్టాడు. ఎల్గర్ సుదీర్ఘం క్రీజ్లో పాతుకుపోయి హాఫ్ సెంచరీతో మెరిశాడు. శుక్రవారం మూడో రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు శ్రమించినా ఎల్గర్ వికెట్ ఇవ్వలేదు. బావుమా(18)ను తొందరగా పెవిలియన్కు పంపినప్పటికీ ఎల్గర్ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. అతనికి జతగా సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ అర్థ శతకం సాధించాడు. దాంతో దక్షిణాఫ్రికా గాడిలో పడింది. 39/3 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే బావుమా వికెట్ను చేజార్చుకుంది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో బావుమా ఎల్బీగా ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా నాల్గో వికెట్ను కోల్పోయింది. దాంతో 63 పరుగులకు సఫారీలు నాల్గో వికెట్ను నష్టపోయారు. ఈ తరుణంలో ఎల్గర్-డుప్లెసిస్ జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. ముందుగా ఎల్గర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, లంచ్ తర్వాత డుప్లెసిస్ సైతం అర్థ శతకం సాధించాడు. వీరిద్దరూ వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 502/7 వద్ద డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే. -
సాగర తీరంలో సమరానికి సైరా...
ఒకవైపు వరుస విజయాలతో సిరీస్ల మీద సిరీస్లు కొడుతూ దూసుకుపోతున్న జట్టు... మరోవైపు సీనియర్లు తప్పుకోవడం నుంచి జట్టు ఎంపికలో రాజకీయాలు చేరడం వరకు గందరగోళ స్థితిలో మరో జట్టు... అసాధారణ నాయకత్వంతో, రికార్డులతో, ఆత్మవిశ్వాసంతో జట్టును నడిపిస్తున్న కోహ్లి ఒకవైపు, వరల్డ్ కప్ తర్వాతే వేటు తప్పదనుకున్నా మరో దిక్కు లేక కొనసాగుతున్న సారథి డు ప్లెసిస్ మరోవైపు... వరల్డ్ నంబర్వన్ బౌలర్ బుమ్రా లేకపోయినా అసలు అలాంటి విషయం గుర్తుకే రాని స్థితిలో అతి బలంగా కనిపిస్తున్న టీమిండియా సొంతగడ్డపై మరో సిరీస్పై గురి పెట్టగా... గతంలో ఐదుసార్లు ఇక్కడ పర్యటించిన సఫారీలతో పోలిస్తే అతి బలహీనంగా ఉన్న బృందం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్కు సాగర నగరం విశాఖపట్నం వేదికైంది. విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడిన గత టెస్టు సిరీస్లో భారత్ 3–0తో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సొంతగడ్డపై డు ప్లెసిస్ ఇదే తరహాలో తాము దెబ్బ తీస్తామంటూ వ్యాఖ్యలు చేసినా చివరకు సఫారీలకు చచ్చీ చెడి 2–1తో సిరీస్ విజయం దక్కింది. భారత బౌలింగ్ బలాన్ని తక్కువగా అంచనా వేసి పేస్ పిచ్లను సిద్ధం చేయడం, దానిని మన బౌలర్లు వాడుకోవడం జరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ రెండు జట్లు టెస్టుల్లో ముఖాముఖీ తలపడేందుకు సన్నద్ధమయ్యాయి. ప్రస్తుత స్థితిలో భారత్ను నిలువరించడం దక్షిణాఫ్రికాకు దాదాపు అసాధ్యమే. రోహిత్ రాణించేనా... సెహా్వగ్, రవిశాస్త్రి, జయసూర్య, దిల్షాన్... మిడిలార్డర్ బ్యాట్స్మెన్లుగా ఆడి ఆ తర్వాత ఓపెనర్లుగా మారి అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లలో కొందరు. ఇప్పుడు రోహిత్ శర్మ నుంచి కూడా భారత్ ఇదే ఆశిస్తోంది. తన కెరీర్ 28వ టెస్టులో తొలిసారి ఓపెనర్గా ఆడబోతున్న రోహిత్.... రబడ, ఫిలాండర్ వేసే మెరుపు ఎరుపు బంతులను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. ప్రాక్టీస్ మ్యాచ్లో డకౌటైనా దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సెహా్వగ్ శైలిలో తొలి బంతి నుంచే విరుచుకుపడే ఆటనూ చూపిస్తాడా లేక రెగ్యులర్ ఓపెనర్ల తరహాలో ఓపిగ్గా సుదీర్ఘ సమయం క్రీజ్లో గడిపేందుకు రోహిత్ ప్రయతి్నస్తాడా అనేది చూడాలి. ఈ స్థానంలో ఎక్కువ అవకాశాలు ఇస్తామంటూ కెపె్టన్ ధైర్యం చెప్పడం రోహిత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. మరో ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ ఖాయం కాబట్టి శుబ్మన్ గిల్ తొలి అవకాశం కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ఇతర జట్టు కూర్పు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పుజారా, కోహ్లి, రహానే తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్ భారీ స్కోరు సాధించడం, సఫారీ అవకాశాలకు దెబ్బ పడటం ఖాయంగా జరిగిపోతాయి. విండీస్లో సెంచరీ తర్వాత జోష్ మీదున్న తెలుగబ్బాయి హనుమ విహారి కూడా స్వదేశంలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. పైగా బౌలింగ్లో కూడా ఒక చేయి వేయగలడు. షమీ, ఇషాంత్ శర్మల రూపంలో ఇద్దరు పేసర్లున్నారు కాబట్టి ఉమేశ్ యాదవ్ పెవిలియన్కే పరిమితం. చాలా కాలం తర్వాత అశి్వన్, జడేజా ద్వయం సంయుక్తంగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పని పట్టేందుకు సిద్ధమైంది. వీరిద్దరిని ఎదుర్కోవడం దక్షిణాఫ్రికాకు కత్తి మీద సామే. కీపర్గా, బ్యాట్స్మన్గా కూడా విలువైన ఆటగాడైన సాహా రాక జట్టును మరింత పటిష్టపరచింది. మార్క్రమ్పై దృష్టి... భారత గడ్డపై 2015లో జరిగిన సిరీస్లో స్టార్లు ఆమ్లా, డివిలియర్స్లాంటి వాళ్లు స్పిన్ను సమర్థంగా ఆడటంలో ఇబ్బంది పడ్డారు. ఫలితంగా జట్టు ఓటమి పాలైంది. ఇప్పుడు కనీస మాత్రం అనుభవం కూడా లేని బ్రూయిన్, బవుమా ఆ జట్టును ఏమాత్రం నిలబెడతారో చూడాలి. డు ప్లెసిస్ స్పిన్ను సమర్థంగా ఆడగలడు, పోరాడగలడు కానీ అతని ఇటీవలి ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. ‘ఎ’ జట్టు తరఫున, ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా బాగా ఆడి భారత్లో పిచ్లకు కొంత అలవాటు పడిన మార్క్రమ్ ఈ సిరీస్లో కీలకం కావచ్చు. అతను గట్టిగా నిలబడితే జట్టుకు మేలు జరుగుతుంది. టెస్టుల్లో డి కాక్ చెప్పుకోదగ్గ బ్యాట్స్మన్ ఏమీ కాదు. ఆ జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం ఖాయమైంది. ఫిలాండర్ బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి ఏడో స్థానంలో ఆడతాడు. జట్టులోని ఒకే ఒక స్పిన్నర్ కేశవ్ మహరాజ్పై సఫారీలు ఆశలు పెట్టుకుంటున్నారు కానీ అభేద్యమైన టీమిండియా లైనప్ను ఛేదించడం అతని వల్ల అవుతుందా సందేహమే. వాతావరణం, పిచ్ తొలి టెస్టును వర్షం ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి సోమవారం వరకు ఇక్కడ వర్షాలు కురిసినా... మ్యాచ్ ముందు రోజు తెరిపినిచ్చింది. ఒక్క చినుకు కూడా లేకపోగా, మంచి ఎండకాసింది. అయితే మళ్లీ మళ్లీ వాతావరణం మారుతూ వచ్చి ఒక్కసారిగా చల్లబడింది కూడా. టెస్టు జరిగే రోజుల్లో వాన పడవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే పూర్తిగా కాకపోయినా అప్పుడప్పుడు అంతరాయం కలగడం ఖాయం. వికెట్ ఆరంభంలో బ్యాటింగ్కు అనుకూలం. ఆ తర్వాత స్పిన్ ప్రభావం చూపించే సాధారణ భారతీయ పిచ్. జట్ల వివరాలు భారత్ తుది జట్టు: కోహ్లి (కెపె్టన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, విహారి, సాహా, అశి్వన్, జడేజా, ఇషాంత్, షమీ. దక్షిణాఫ్రికా (అంచనా): డు ప్లెసిస్ (కెపె్టన్), మార్క్రమ్, ఎల్గర్, బ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, కేశవ్, రబడ, ఇన్గిడి, పీట్. -
మన సమరం నేడే ఆరంభం
టోర్నీ ప్రారంభమై ఆరు రోజులైంది...అన్ని జట్లు మైదానంలో దిగాయి... ఇప్పటికే ఏడు మ్యాచ్లు జరిగిపోయాయి... చిన్నాచితక సంచలనాలూ నమోదయ్యాయి... అయినా మన అభిమానుల్లో ఆ జోష్ లేదు... వారందరి నుంచి ఎదురవుతోంది ఒకటే ప్రశ్న......ఈసారి ప్రపంచ కప్లో ఊపు లేదెందుకని?...అంతా సాదాసీదాగా సాగుతుందేమని? దీనికి సమాధానం నేడే దొరకనుంది. వంద కోట్లమందిపైగా ఆశలను మోస్తూ... అంచనాలు నిలబెట్టుకుంటామని భరోసా ఇస్తూ... అదరగొట్టే ఆటతో కప్పు కొట్టుకొస్తామని ఊరిస్తూ... విశ్వ విజేతగా మువ్వన్నెలను రెపరెపలాడిస్తామంటూ... కోహ్లి సారథ్యంలోని భారత్ బరిలో దూకనుంది... మరిక...వినేవారికి వీనుల విందు కళ్లారా చూసేవారికి చూడ ముచ్చట టీవీల ముందు ప్రేక్షకులకు కన్నుల పండుగే! వీరాభిమానులకైతే మజా మజానే! ఇంకెందుకు ఆలస్యం...? ఆసాంతం ఆస్వాదిద్దాం... టీమిండియాకు శుభాభినందనలు చెబుదాం. సౌతాంప్టన్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ, మన వీరుల ప్రతాపం ఎలా ఉంటుందోనన్న ఊహల్లో విహరిస్తూ, ఎవరెవరు అదరగొడతారని లెక్కలేసుకుంటూ వస్తున్న భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ కోసం టీమిండియా పోరాటం బుధవారం నుంచే ప్రారంభం కానుంది. సౌతాంప్టన్ మైదానం వేదికగా విరాట్ కోహ్లి సేన తమ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తగినంత విశ్రాంతితో, తీరైన సన్నాహంతో, మంచి ప్రాక్టీస్తో భారత్ బల ప్రదర్శనకు దిగనుండగా... పరాజయాలు, ఫామ్ లేమితో సఫారీల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వారికిది మూడో మ్యాచ్. ఇందులోనూ ఓడితే ఇకపై ప్రతి మ్యాచ్ నెగ్గితేనే కానీ కప్లో ముందుకెళ్లలేరు. మరోవైపు తుది కూర్పు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తున్న టీమిండియా తాజాగా ప్రయాణం ప్రారంభించనుంది. వారిలో ఎవరు? సౌతాంప్టన్లో మబ్బులు కమ్మిన వాతావరణం ఎదురయ్యే వీలుండటంతో భారత్ రెండో ప్రధాన పేసర్గా భువనేశ్వర్ను ఆడించే యోచనలో ఉంది. టోర్నీలో ఫ్లాట్ వికెట్లపై షార్ట్ పిచ్ బంతులు వేయగల భువనేశ్వర్లాంటి బౌలర్లు విజయవంతం అవుతున్నారు. దీంతో షమీ స్థానంలో అతడిని తీసుకునే వీలుంది. ముగ్గురు పేసర్లనూ తీసుకుంటారని వార్తలు వచ్చినా అందుకు పెద్దగా అవకాశం లేదు. రెండో స్పిన్నర్ స్థానం కోసం జడేజా, చహల్ మధ్య పోటీ నెలకొంది. ఫిట్నెస్ సాధించిన మిడిలార్డర్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ మైదానంలో దిగడం ఖాయమైంది. స్పిన్ కూడా వేయగల అతడి చేరిక జట్టుకు బలాన్నిస్తుంది. ఐదో స్థానంలో ధోనినే రావొచ్చు. 6, 7లో జాదవ్, హార్దిక్ ఆడతారు. బ్యాట్ దూసే జడేజా, విలువైన పరుగులు చేయగల భువీని లెక్కలోకి తీసుకుంటే మొత్తం 9 మందితో లోతైన బ్యాటింగ్ ఆర్డర్ కనిపిస్తోంది. కష్టాల దక్షిణాఫ్రికా... గత మ్యాచ్ ప్రారంభంలోనే ఇన్గిడి సేవలను కోల్పోయిన దక్షిణాఫ్రికాకు ప్రధాన పేసర్ స్టెయిన్ సైతం దూరమయ్యాడు. లెక్క ప్రకారం చూస్తే ఆ జట్టుకు ఇప్పుడు నలుగురే స్పెషలిస్ట్ బౌలర్లున్నారు. ఐదో బౌలర్ కోటాను మార్క్రమ్, డుమిని తదితరులతో భర్తీ చేయాల్సి వస్తోంది. వీరిలో రబడ మాత్రమే పక్కా పేసర్. మోరిస్, ఫెలుక్వాయోలకు ప్రత్యర్థి ఇన్నింగ్స్ను దెబ్బతీయగల సత్తా లేదు. బంగ్లాదేశ్ చేతిలో సఫారీల ఓటమికి సరైన బౌలింగ్ వనరులు లేకపోవడమూ ఓ కారణమైంది. వెటరన్ ఆమ్లా తిరిగి రావడం బ్యాటింగ్ను పటిష్ట పరుస్తోంది. ఈ జట్టులోనూ 9వ నంబరు స్థానం వరకు బ్యాటింగ్ చేయగల వారుండటం గమనార్హం. బౌలింగ్లో ఎలాగూ దమ్ము లేదు కాబట్టి... మొదట క్రీజులో దిగితే భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిని సవాల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైదానం ఇలా... సౌతాంప్టన్ మైదానంలో చివరి ఐదు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 311. మూడుసార్లు తొలుత బ్యాటింగ్కు దిగిన జట్టే గెలిచింది. ఈ మ్యాచ్ల్లో పేసర్లు 6.4 ఎకానమీతో సగటున 58.4 పరుగులు ఇచ్చారు. స్పిన్నర్లు 6 ఎకానమీతో సగటున 60.1 పరుగులు ఇచ్చారు. ముఖాముఖి రికార్డు ఇరు జట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్ల్లో తలపడ్డాయి. భారత్ 34 మ్యాచ్ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా 46 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్లో నాలుగు సార్లు ఎదురుపడగా భారత్ ఒక్కసారే (2015లో) నెగ్గింది. మిగతా మూడు సార్లు సఫారీలనే విజయం వరించింది. కమాన్ కోహ్లి... రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో కోహ్లి మంచి ఇన్నింగ్సే ఆడాడు. కప్ కోసం సంసిద్ధమైనట్లు కనిపించాడు. ఎప్పటిలాగే అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. మార్చిలో ఆస్ట్రేలియా సిరీస్, తర్వాత ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోని కోహ్లి కప్లో రాణిస్తే.. లోతైన బ్యాటింగ్ ఆర్డర్తో స్కోరును ముందుకు తీసుకెళ్లొచ్చు. అనుకోకుండా ఓపెనర్లు విఫలమైనా పెద్దగా ఇబ్బంది రాదు. రాహుల్... రాహుల్... ఎంతో ఊగిసలాట మధ్య ఎట్టకేలకు నంబ ర్–4గా కేఎల్ రాహుల్ స్థానం ఖాయమైంది. టీవీ షో వివాదం నుంచి తేరుకుని, ఐపీఎల్లో సత్తా చాటిన రాహుల్... రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై సెంచరీ (108)తో తప్పక ఆడించే పరిస్థితి కల్పించాడు. ఇదే మ్యాచ్లో ఆల్రౌండర్గా వైఫల్యం, గాయం బెడద విజయ్ శంకర్ను పక్కనపెట్టేలా చేసింది. క్లాస్ బ్యాట్స్మన్ అయిన రాహుల్ అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే భారత్ నిశ్చింతగా ఉండొచ్చు. పిచ్, వాతావరణం వర్షం కారణంగా క్రితం రోజంతా పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. పచ్చికను పూర్తిగా తొలగించారు. మంగళవారం వర్షం కారణంగా భారత నెట్ ప్రాక్టీస్ సెషన్కు అంతరాయం కలిగింది. పిచ్ బ్యాటింగ్కు బాగా సహకరించే వీలుంది. బుధవారం వర్షం కురిసే అవకాశం తక్కువే అయినా... చల్లని వాతావరణం మ్యాచ్పై ప్రభావం చూపొచ్చు. శుభ సూచకం మొత్తమ్మీద వన్డే గణాంకాలు చూసినా, కప్లో వారిపై గెలుపోటములు చూసినా దక్షిణాఫ్రికా కఠిన ప్రత్యర్థే. సఫారీలపై విజయం అంత తేలిక కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. అంతేకాక, వరుసగా పెద్ద జట్లతో ఆడాల్సిన పరిస్థితుల్లో... దక్షిణాఫ్రికాను తొలి మ్యాచ్లోనే ఎదుర్కొనడం సహజంగానే ఒత్తిడి, ఉత్కంఠ రేపుతుంది. కానీ, ఈసారి ప్రత్యర్థిని ముందే దెబ్బతీసి కాలం పరోక్షంగా మనకు మేలు చేసింది. రెండు మ్యాచ్ల్లోనూ ఓడటంతో పాటు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో అందుబాటులో లేకపోవడంతో దక్షిణా ఫ్రికా ఒకవిధంగా ఆత్మరక్షణలో పడింది. దీంతో మానసికంగా భారత్దే పైచేయిగా ఉంది. ఈ ఆత్మ విశ్వాసంతో మైదానంలో రాణిస్తే టీమిండియాకు శుభారంభమే. ఎట్టకేలకు ప్రపంచ కప్లో మొదటి మ్యాచ్ ఆడబోతుండటం సంతోషంగా ఉంది. ఆలస్యంగా బరిలోకి దిగడం వల్ల మాకు కొంత మేలు జరిగిందనేది వాస్తవం. ఇతర జట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడుతున్నాయి, వాతావరణం ఎలా ఉంటోంది అనేవి పరిశీలించి, ప్రణాళికలు రూపొందించుకోవడానికి అవకాశం దక్కింది. అయితే ఎన్ని వ్యూహాలు పన్నినా మ్యాచ్ రోజున ఎలా ఆడతామనేదే ముఖ్యం. మా టీమ్ ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది. ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగల సత్తా అందరిలో ఉంది. పిచ్ను బట్టే తుది జట్టు ఎంపిక ఉంటుంది. తొలిసారి ప్రపంచకప్లో దేశానికి నాయకత్వం వహిస్తుండటం గర్వంగా అనిపిస్తోంది. 2015లో టోర్నీ ఆడేటప్పుడు దీని గురించి అసలు ఏమాత్రం ఊహించలేదు. వేరే సిరీస్లతో పోలిస్తే ప్రపంచ కప్ ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక ప్రత్యర్థి జట్టుకు గాయాల సమస్య ఉంది కాబట్టి వారిని బలహీనంగా భావించడం లేదు. మేం ఎవరినీ తేలిగ్గా తీసుకోం. మా బలాన్నే నమ్ముకున్నా. స్టెయిన్ నాకు మంచి మిత్రుడు కూడా కాబట్టి అతను టోర్నీకి దూరం కావడం బాధగా అనిపిస్తోంది. 2017 చాంపియన్స్ ట్రోఫీ నుంచి కొన్ని పాఠాలైతే నేర్చుకున్నాం. ఇంగ్లండ్లో పరిస్థితుల దృష్ట్యా తొలి పది ఓవర్లు ఎంతో కీలకం. గత రెండు ప్రపంచకప్ల తరహాలో తొలి మ్యాచ్లో నేను సెంచరీ కొట్టినా, కొట్టకపోయినా జట్టు గెలుపు అన్నింటికంటే ముఖ్యం. – విరాట్ కోహ్లి, భారత్ కెప్టెన్ వరుసగా రెండు ఓటముల తర్వాత బాధ ఉండటం సహజమే. అయితే నాలాంటి సీనియర్లలో ఆత్మవిశ్వాసం లోపిస్తే తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న కొత్త కుర్రాళ్లు మానసికంగా మరింత బేలగా తయారవుతారు. తమపై తామే జాలి పడేలా వారిని వదిలేయలేం. బలమైన మాటలతో వారిలో విశ్వాసం నింపడం ముఖ్యం. లేదంటే జట్టు మొత్తం కుప్పకూలిపోతుంది. మా ప్రయత్నంలో లోపం లేకుండా కష్టపడతాం. కానీ ఫలితం మా చేతుల్లో లేదు. భారత్తో మ్యాచ్ను చావోరేవోగా భావించి ఆడమని మావాళ్లకు చెబుతున్నా. స్టెయిన్ తప్పుకోవడంతో ఇప్పుడు మాకు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు కూడా తక్కువగా ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా అతను గాయాలతో బాధపడ్డాడు. కోలుకుంటున్న సమయంలో ఐపీఎల్లో ఆ రెండు మ్యాచ్లు ఆడకుండా ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. –డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్ తుది జట్లు (అంచనా) ►భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), రాహుల్, జాదవ్, ధోని, హార్దిక్, జడేజా/చహల్, కుల్దీప్, భువనేశ్వర్/షమీ, బుమ్రా. ►దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్, డు ప్లెసిస్ (కెప్టెన్), డసెన్, మార్క్రమ్, మిల్లర్, డుమిని, మోరిస్, ఫెలుక్వాయో, తాహిర్, రబడ. -
దక్షిణాఫ్రికా ఢమాల్
ప్రపంచ కప్లలో ఫేవరెట్గా బరిలోకి దిగి... వరుస విజయాల తర్వాత కీలక దశలో అదృష్టం మొహం చాటేస్తేనో లేక అనూహ్యంగా ఓటమి పాలై ‘చోకర్స్’గా ముద్రపడిన దక్షిణాఫ్రికా జట్టును ఇప్పటి వరకు చూశాం. మేం ’చోకర్స్’ కాదని నిరూపించుకుంటాం అని చెప్పిన సఫారీలు... టోర్నీ చివర్లో కాదు, ఆరంభం నుంచే ఓడిపోయి ఆ ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది! మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన డు ప్లెసిస్ బృందం ఇప్పుడు బంగ్లాదేశ్ ముందు కూడా కుప్పకూలింది. ముందుగా పేలవ బౌలింగ్తో బంగ్లాదేశ్ వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసేందుకు అవకాశమిచ్చి... ఆపైన పేలవ బ్యాటింగ్తో ఓటమిని ఆహ్వానించింది. జట్టులో ఒకరితో మరొకరు పోటీ పడుతూ స్ఫూర్తిదాయక ఆటతీరుకనబర్చిన బంగ్లా పులులు అద్భుత విజయంతో టోర్నీని ఆరంభించారు. ప్రపంచ కప్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమై వచ్చి సవాల్కు సిద్ధమైనఆ జట్టు తమను ఇంకెవరూ బేబీలుగా చూడవద్దంటూ, తక్కువగా అంచనా వేయవద్దంటూ హెచ్చరిక జారీ చేసింది. లండన్: వరుసగా సాగిన ఏకపక్ష మ్యాచ్ల తర్వాత వరల్డ్ కప్ ఒక ఆసక్తికర పోరుకు వేదికైంది. అయితే తుది ఫలితం మాత్రం అందరూ ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. ఆదివారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (80 బంతుల్లో 78; 8 ఫోర్లు)... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’షకీబ్ అల్ హసన్ (84 బంతుల్లో 75; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... మహ్ముదుల్లా (33 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (30 బంతుల్లో 42; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (53 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా... జేపీ డుమిని (37 బంతుల్లో 45; 4 ఫోర్లు), మార్క్రమ్ (56 బంతుల్లో 45; 4 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (38 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. 142 పరుగుల భాగస్వామ్యం... ఒక భారీ సెంచరీ పార్ట్నర్షిప్, మరో రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల సహాయంతో బంగ్లాదేశ్ తమ అత్యుత్తమ వన్డే స్కోరును నమోదు చేయగలిగింది. ఓపెనర్లలో సర్కార్ దూకుడు ప్రదర్శించగా, తమీమ్ ఇక్బాల్ (16) తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. తొలి ఐదు ఓవర్లను జాగ్రత్తగా ఆడిన బంగ్లా 14 పరుగులే చేసింది. అయితే ఇన్గిడి వేసిన ఆరో ఓవర్లో సర్కార్ మూడు ఫోర్లు కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. ఇన్గిడి తర్వాతి ఓవర్లో కూడా బంగ్లా మరో మూడు ఫోర్లతో 13 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్ వేయగానే ఇన్గిడి కండరాల గాయంతో మైదానం వీడటంతో దక్షిణాఫ్రికా తమ ప్రధాన పేసర్ సేవలు కోల్పోయింది. అనంతరం తమీమ్ను ఔట్ చేసి ఫెలుక్వాయో 60 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీయగా, తొలి పవర్ప్లేలో బంగ్లా 65 పరుగులు చేయగలిగింది. మోరిస్ తన తొలి ఓవర్లోనే జట్టుకు వికెట్ అందించాడు. మరో భారీ షాట్కు ప్రయత్నించిన సర్కార్...డి కాక్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. ఆ తర్వాత షకీబ్, ముష్ఫికర్ మూడో వికెట్ భాగస్వామ్యం బంగ్లా భారీ స్కోరుకు బాటలు వేసింది. భారీ షాట్లు ఆడే సాహసం చేయకుండా వీరిద్దరు చక్కటి సమన్వయంతో, జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ముందుగా షకీబ్ 54 బంతుల్లో, ఆ తర్వాత ముష్ఫికర్ 52 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడి దక్షిణాఫ్రికా జట్టులో తీవ్ర అసహనం రేపుతున్న దశలో ఎట్టకేలకు ‘ట్రంప్ కార్డ్’తాహిర్ ఈ జంటను విడదీశాడు. తాహిర్ వేసిన చక్కటి బంతికి షకీబ్ క్లీన్బౌల్డయ్యాడు. పార్ట్టైమర్ మార్క్రమ్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన మిథున్ (21)ను కూడా తాహిరే బౌల్డ్ చేయగా...కొద్ది సేపటికే ముష్ఫికర్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో బంగ్లా స్కోరు 250 పరుగులు. తర్వాతి 7.5 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 80 పరుగులు సాధించడం విశేషం. కెప్టెన్ అర్ధ సెంచరీ.... భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా జట్టులో తడబాటు కనిపించింది. గత మ్యాచ్లో తలకు బంతి తగిలిన ఆమ్లా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. మార్క్రమ్, డి కాక్ (23) తొలి వికెట్కు 49 పరుగులు జోడించినా వీరిద్దరు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయలేకపోయారు. మార్క్రమ్ను సునాయాసంగా రనౌట్ చేయడంలో విఫలమైన బంగ్లా... కొద్ది సేపటికి డి కాక్ను రనౌట్గా వెనక్కి పంపించింది. మెహదీ బౌలింగ్లో డి కాక్ ఇచ్చిన క్యాచ్ను కీపర్ ముష్ఫికర్ వదిలేయగా, బ్యాట్స్మన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే వేగంగా వెనక్కి వెళ్లి బంతిని అందుకున్న ముష్ఫికర్ నేరుగా వికెట్లపైకి కొట్టడంతో డి కాక్ ఔటయ్యాడు. వరుస బౌండరీలతో కెప్టెన్ డు ప్లెసిస్ దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నం చేయగా... మరో ఎండ్లో మార్క్రమ్ను బౌల్డ్ చేసి షకీబ్ తన కెరీర్లో 250వ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ప్లెసిస్... మెహదీ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయి బౌల్డ్ కావడంతో సఫారీ జట్టులో ఆందోళన పెరిగింది. 16 పరుగుల వద్ద సర్కార్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన డేవిడ్ మిల్లర్ (43 బంతుల్లో 38; 2 ఫోర్లు) తన స్కోరుకు మరికొన్ని పరుగులు జోడించి వెనుదిరిగాడు. ముస్తఫిజుర్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన డసెన్ను సైఫుద్దీన్ బౌల్డ్ చేయడంతో బంగ్లా శిబిరంలో విజయానందం కనిపించింది. చివర్లో డుమిని కొన్ని చక్కటి షాట్లతో పోరాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. గెలుపు తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎలాంటి అతి సంబరాలకు పోకుండా ప్రశాంతంగా కనిపించడం ఆ జట్టు ఆలోచనల్లో వచ్చిన మార్పుగా చెప్పవచ్చు. ►5 షకీబ్ అల్ హసన్ వన్డేల్లో 250 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 5 వేల పరుగులు చేయడంతో పాటు 250 వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా (జయసూర్య, ఆఫ్రిది, కలిస్, రజాక్ తర్వాత) షకీబ్ నిలిచాడు. అందరికంటే తక్కువ వన్డేల్లో (199) అతను ఈ ఘనత సాధించడం విశేషం. ►330బంగ్లాదేశ్కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో పాకిస్తాన్పై చేసిన 329 పరుగుల రికార్డును ఆ జట్టు అధిగమించింది. ►100దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 100 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. అతను ఇప్పటికి 166 వికెట్లు పడగొట్టాడు. ►2 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాపై బంగ్లాకు ఇది రెండో విజయం. గతంలో 2007 ప్రపంచ కప్లోనూ ఆ జట్టు గెలిచింది. -
మాకు బౌలింగే కావాలి...
ఈ ప్రపంచ కప్లో టాస్ గెలిచిన కెప్టెన్లు తడుముకోకుండా చెబుతున్న ఒకే ఒక్క మాట... ‘మేం ముందుగా బౌలింగ్ చేయదల్చుకున్నాం’ అని. టాస్ ఓడిన కెప్టెన్ సైతం తమ ఉద్దేశం తొలుత బౌలింగ్ చేయాలన్నదే అని అంటుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. పిచ్పై మొదట్లో కనిపిస్తున్న కాసింత పచ్చిక అనుకోని వరంలా వారిని ఊరిస్తుండటమే దీనికి కారణం. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు జరగ్గా... చిన్న జట్టయిన అఫ్గానిస్తాన్ మినహా మిగతా మూడు పెద్ద జట్లు తొలుత బౌలింగ్కే మొగ్గుచూపాయి. పచ్చికపై పేస్, స్వింగ్తో ప్రత్యర్థి టాపార్డర్ను ఇబ్బంది పెట్టాయి. ఆసీస్పై ముందు బ్యాటింగ్కు దిగి అఫ్గాన్ తొలుతే రెండు వికెట్లు కోల్పొయింది. వెస్టిండీస్, న్యూజిలాండ్ సరిగ్గా ఇలానే ఫలితాన్ని పొందాయి. ప్రారంభ మ్యాచ్లో దక్షిణాఫ్రికా సైతం తొలుత కొంత లాభపడినా... సొంతగడ్డ అనుకూలతతో ఇంగ్లండ్ వెంటనే పుంజుకొంది. ముఖ్యంగా తొలి గంట పిచ్ నుంచి పేసర్లకు మంచి మద్దతు దొరుకుతోంది. దీంతో పేస్ను ఆడటంలో బలహీనులైన పాకిస్తాన్, శ్రీలంక బ్యాట్స్మెన్ వికెట్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఓపెనర్లు కనీసం పది ఓవర్లు నిలిస్తేనే ఏ జట్టయినా మంచి స్కోరు చేసేందుకు వీలుంటుంది. అనంతరం బ్యాటింగ్కు అనువుగా మారుతున్న పిచ్పై పరుగులు సులువుగా వస్తున్నాయి. ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపకున్నా, టోర్నీ సాగే కొద్దీ మబ్బులు కమ్మిన వాతావరణం ఎదురయ్యే వీలుంది. దీన్నిబట్టి చూస్తే బలమైన పేస్ దళం ఉన్న జట్లు టాస్ గెలిస్తే మ్యాచ్ దాదాపు వారి చేతుల్లోకి వెళ్లినట్లేనేమో? -
అదిరే ఆరంభం ఎవరిదో?
లండన్: వన్డే వరల్డ్కప్ సమరానికి రంగం సిద్ధమైంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగనున్న ఆరంభపు మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇరు జట్లు బలంగా ఉండటంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఆసక్తి నెలకొంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుండగా, సంచలనాలకు మారుపేరైన సఫారీలు శుభారంభం చేయాలని భావిస్తున్నారు. ఎన్నోసార్లు అందినట్లే అంది చేజారిన కప్పై ఆతిథ్య ఇంగ్లండ్ ఈసారి చాలా ఆశలే పెట్టుకుంది. జట్టంతా బలంగా ఉన్నా... ముఖ్యంగా ఓపెనర్ జేసన్ రాయ్, కీపర్ బట్లర్, ఆల్రౌండర్ స్టోక్స్ వారి బ్యాటింగ్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రాయ్, బట్లర్ విధ్వంసక బ్యాటింగ్కు పెట్టింది పేరు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అద్భుతమైన ఫామ్లోనూ ఉన్నారు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్గా స్టోక్స్పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. (ఇక్కడ చదవండి: పన్నెండో ప్రపంచ యుద్ధం) ఇక ప్రపంచ కప్లో దురదృష్టం వెంటాడే దక్షిణాఫ్రికా పెద్ద స్టార్లంటూ ఎవరూ లేకుండా ఈసారి బరిలో దిగుతోంది. ఆమ్లా, తాహిర్, మిల్లర్ వంటివారున్నా... కెప్టెన్ డు ప్లెసిస్, బ్యాట్స్మన్ డికాక్, పేసర్లు స్టెయిన్, రబడల పైనే ఎక్కువ అంచనాలున్నాయి. ఐపీఎల్లో అదరగొట్టిన డికాక్, డు ప్లెసిస్ ఫామ్ చాటుకున్నారు. గాయం బెడద లేకుంటే.... వేగం, కచ్చితమైన యార్కర్లు వేసే రబడ ఎంత వరకూ ప్రభావం చూపుతాడో చూడాలి. తుది జట్లు దక్షిణాఫ్రికా డుప్లెసిస్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, డీకాక్, మర్కరమ్, వాన్ డెర్ డస్సెన్, జేపీ డుమినీ, డ్వైన్ ప్రిటోరియస్, ఫెహ్లుకోవాయా, కగిసో రబడా, లుంగి ఎన్గిడి, ఇమ్రాన్ తాహీర్ ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్, జోనీ బెయిర్ స్టో, జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, లియామ్ ప్లంకెట్, జోఫ్రా ఆర్చర్ -
డు ప్లెసిస్ అజేయ సెంచరీ
జొహన్నెస్బర్గ్: స్వదేశంలో తొలిసారి శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా... వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ డు ప్లెసిస్ (114 బంతుల్లో 112 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీ చేసి తమ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. తొలుత శ్రీలంక జట్టు 47 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఒషాదా ఫెర్నాండో (49 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్లు), కుశాల్ మెండిస్ (73 బంతుల్లో 60; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి, ఇమ్రాన్ తాహిర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 38.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్వింటన్ డి కాక్ (72 బంతుల్లో 81; 11 ఫోర్లు), డు ప్లెసిస్ రెండో వికెట్కు 136 పరుగులు జోడించారు. డి కాక్ ఔటయ్యాక... వాన్ డెర్ డసెన్ (43 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు), డు ప్లెసిస్ మూడో వికెట్కు అజేయంగా 82 పరుగులు జత చేసి దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చారు. రెండో వన్డే బుధవారం జరుగుతుంది. -
కోహ్లితో పెట్టుకోవద్దు!
మెల్బోర్న్: సొంతగడ్డపై భారత్తో టెస్టు సిరీస్కు సిద్ధమైన ఆస్ట్రేలియా జట్టుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బంగారం లాంటి సలహా ఇచ్చేశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో వాదనకు దిగే ప్రయత్నం చేయవద్దని, కోహ్లితో మౌనంగా ఉండటమే మెరుగైన భాష అని అతను సూచించాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్లో కోహ్లి సెంచరీ సహా 286 పరుగులు చేశాడు. తొలి రెండు టెస్టుల్లో ఓడిన భారత్ చివరి టెస్టులో గెలిచి 1–2తో సిరీస్ చేజార్చుకుంది. నాటి తమ అనుభవాన్ని ప్లెసిస్ గుర్తు చేసుకున్నాడు. ‘కోహ్లి అద్భుతమైన ఆటగాడు. ఆడుతున్నప్పుడు అతడిని ఏమీ అనకుండా మౌనంగా ఉండేందుకే ప్రయత్నించాం. అయినా సరే అతను పరుగులు సాధించాడు. ప్రతీ జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు ఉంటారు. వారిని ఏమైనా అంటే మరింతగా చెలరేగిపోతారని తెలుసు కాబట్టి దానికి దూరంగా ఉండాలని జట్టుగా మేం ముందే నిర్ణయించుకుంటాం. అంతర్జాతీయ క్రికెట్లో వాగ్వాదాలను ఇష్టపడే ఆటగాళ్లూ కనిపిస్తారు. కోహ్లితో ఆడినప్పుడు అతనూ గొడవకు దిగేందుకు సిద్ధమనే వ్యక్తని అర్థమైంది. మౌనంగా ఉండటం ద్వారానే అతడిని నియంత్రణలో ఉంచవచ్చు’ అని సఫారీ కెప్టెన్ కంగారూలను హెచ్చరించాడు. -
కోహ్లిని రెచ్చగొట్టొద్దు: డు ప్లెసిస్
కేప్టౌన్: ప్రస్తుతం ప్రపంచ టెస్టు ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలంటూ ఆసీస్ క్రికెట్ జట్టును దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ హెచ్చరించాడు. త్వరలో భారత్-ఆసీస్ జట్ల మధ్య సుదీర్ఘ ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘ విరాట్ కోహ్లి వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్మన్ అనే సంగతి మరచిపోవద్దు. అతన్ని ఎంత రెచ్చగొట్టకుండా ఉంటే అంత మంచిది. కోహ్లిలో పోరాట స్ఫూర్తి ఎక్కువ. సాధారణంగా జట్టులోని ప్రధాన ఆటగాళ్లను ప్రత్యర్థి జట్లు టార్గెట్ చేస్తూ ఉంటాయి. అందులో ఆసీస్ ముందు వరుసలో ఉంటుంది. కానీ కోహ్లి విషయంలో ఆసీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కోహ్లికి సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడమే కరెక్ట్. గతంలో భారత్తో జరిగిన సిరీస్లో కోహ్లి వ్యవహారంలో మేము ఇలానే చేసి సక్సెస్ అయ్యాం. అతనొక అసాధారణ ఆటగాడు. ప్రతీ జట్టుకు వారి వారి ప్రణాళికలు ఉంటాయి. మేము కోహ్లిని భారీ ఇన్నింగ్స్లు నమోదు చేయకుండా ఎలా చేసేమో అనేది మాత్రమే స్పష్టం చేశా.. కోహ్లిని రెచ్చగొట్టొద్దు అనేది ఆసీస్కు నేనేచ్చి సలహా మాత్రమే’ అని డుప్లెసిస్ తెలిపాడు. ఇక్కడ చదవండి: ఆస్ట్రేలియా బయల్దేరిన టీమిండియా భారత్ సిరీస్ నెగ్గక పోతేనే ఆశ్చర్యం! ఆసీస్-టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. -
ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్
-
అతడిలా ఆడితే కెప్టెన్లు, బౌలర్లకు కష్టమే
టైమింగ్ను దొరకబుచ్చుకుని చెలరేగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇలాగే ఆడితే... ప్రత్యర్థి కెప్టెన్లు, బౌలర్లకు కష్ట కాలమేనని ఆ జట్టు బ్యాట్స్మన్ డుప్లెసిస్ అన్నాడు. ‘ధోని అద్భుత ఫామ్లో ఉన్నాడు. వైడ్ వేసినా లెగ్ సైడ్లో భారీ షాట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. తలచుకున్నదే ఆలస్యం... ఎలాంటి బంతినైనా షాట్ కొట్టేలా ఉన్న తనకు ఈ సమయంలో బౌలింగ్ చేయడం చాలా కష్టం’ అని కొనియాడాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల అంబటి రాయుడు సామర్థ్యం తనను ఆకట్టుకుందని చెప్పుకొచ్చాడు. -
ఆస్ట్రేలియా లక్ష్యం 612
జొహన్నెస్బర్గ్: అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడిన 7 సిరీస్లలోనూ విజయం సాధించలేకపోయిన దక్షిణాఫ్రికా ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు చేరువైంది. ఆసీస్తో సిరీస్ను గెలుచుకునేందుకు ఆ జట్టు మరో 7 వికెట్లు తీస్తే చాలు! అసాధ్యమైన 612 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్ మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు మరో 524 పరుగులు చేయాల్సి ఉండగా... హ్యాండ్స్కోంబ్ (23 బ్యాటింగ్), షాన్ మార్‡్ష (7 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 134/3తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్ను 6 వికెట్ల నష్టానికి 344 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దూకుడుగా ఆడిన కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (120; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా, డీన్ ఎల్గర్ (81) ఆ అవకాశం కోల్పోయాడు. నాలుగో రోజు ఆధిక్యం 401 పరుగుల నుంచి 450, 500, 550 పరుగులు దాటిపోయినా దక్షిణాఫ్రికా డిక్లేర్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తమ ముగ్గురు ప్రధాన పేసర్లు రబడ, ఫిలాండర్, మోర్కెల్ గాయాలతో బాధపడుతుండటంతో సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసేందుకే ఆ జట్టు మొగ్గు చూపింది. -
మొన్న ఏబీ... నిన్న డు ప్లెసిస్... నేడు డికాక్
కేప్టౌన్: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓటములతో పాటు గాయాలతోనూ విలవిల్లాడుతోంది. వన్డేల్లో కోహ్లి సేన చేతిలో వరుస పరాజయాలు... గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమవడంతో సఫారీ జట్టు కుదేలవుతోంది. ఇప్పటికే ఏబీ డివిలియర్స్ తొలి మూడు వన్డేల్లో ఆడట్లేదు. డు ప్లెసిస్ ఏకంగా భారత్తో సిరీస్కే దూరమయ్యాడు. వీళ్లిద్దరు చేతి వేలి గాయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు వికెట్ కీపర్–బ్యాట్స్మన్ క్వింటన్ డికాక్ ఈ జాబితాలో చేరాడు. రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా అతని ఎడమ మణికట్టుకు గాయమైంది. దీంతో అతను మిగతా నాలుగు వన్డేలతో పాటు టి20 సిరీస్కు దూరమయ్యాడు. డికాక్ పూర్తిగా కోలుకునేందుకు రెండు నుంచి నాలుగు వారాలు పడుతుందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టులో ఉన్న వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. బుధవారం కేప్టౌన్లో జరిగే మూడో వన్డేతో అతని కెరీర్ మొదలవనుంది. ఆరు వన్డేల సిరీస్లో భారత్ 2–0తో ఆధిక్యంలో ఉంది. -
సిరీస్ నుంచి దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ ఔట్
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ చేతి వేలి గాయం కారణంగా సిరీస్లోని ఐదు వన్డేలకు... ఆ తర్వాత మూడు టి20 మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు.ఇప్పటికే స్టార్ బ్యాట్స్మన్ డివిలియర్స్ తొలి మూడు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి స్థానంలో ఫర్హాన్ బెహర్దీన్, హెన్రీ క్లాసెన్లను జట్టులోకి తీసుకున్నారు. -
అందువల్లే ఓడిపోయాం: డుప్లెసిస్
డర్బన్: ఆరు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలుకావడానికి బ్యాటింగ్లో విఫలం చెందడమే ప్రధాన కారణమని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఓవరాల్గా తమ బ్యాటింగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే భారత్తో ఘోర పరాజయం చూడాల్సి వచ్చిందన్నాడు. మ్యాచ్ అనంతరం పోస్ట్ కాన్పరెన్స్లో మాట్లాడిన డుప్లెసిస్..' మా బ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. మా బ్యాటింగ్ యూనిట్లో రెండో అత్యధిక స్కోరు 30 నుంచి 40 పరుగుల మధ్యలో మాత్రమే ఉంది. దాంతో సరైన భాగస్వామ్యాలు నమోదు కాలేదు. ఇదే మా విజయంపై తీవ్ర ప్రభావం చూపింది. వన్డే క్రికెట్లో కనీసం ఇద్దరు ఆటగాళ్లు నిలకడైన భాగస్వామ్యాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అది వన్డే క్రికెట్లో విజయానికి బేసిక్ సూత్రం. దాన్ని మేము సాధించడంలో విఫలం కావడంతోనే ఓటమిని చవిచూశాం' అని డుప్లెసిస్ తెలిపాడు. మరొకవైపు భారత స్పిన్నర్లపై డుప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు. తమపై టీమిండియా స్పిన్నర్లదే పైచేయిగా నిలిచిందన్నాడు. ఈ పిచ్పై కనీసం 300 స్కోరు చేస్తే కాపాడుకోవడం సాధ్యమవుతుందన్నాడు. 260 స్కోరు అనేది ఎంతమాత్రం కాపాడుకునే లక్ష్యం కాదన్నాడు. ఇదే పిచ్పై ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 370 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన విషయాన్ని డుప్లెసిస్ గుర్తు చేశాడు. దాంతో భారత్తో మ్యాచ్లో తమ బౌలర్లను నిందించడం ఎంతమాత్రం సరైనది కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇంకా 60-70 పరుగులు చేసుంటే అప్పుడు బౌలర్లపై భారం వేసే వాళ్లమని డుప్లెసిస్ తెలిపాడు. తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 45.3 ఓవర్లలో ఛేదించింది. -
తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్గా డుప్లెసిస్
డర్బన్: భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్పై స్వదేశంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్గా డుప్లెసిస్ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో డుప్లెసిస్ 120 పరుగుల వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఫలితంగా వారి దేశంలో భారత జట్టుపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన దక్షిణాఫ్రికా కెప్టెన్గా నిలిచాడు. ఓవరాల్గా భారత్పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్. 2005లో కోల్కతాలో గ్రేమ్ స్మిత్ అజేయంగా 134 పరుగులు సాధించాడు. అదే భారత్పై అత్యధిక దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్ ఇన్నింగ్స్. భారత్పై అత్యధిక స్కోర్లు సాధించిన దక్షిణాఫ్రికా కెప్టెన్లలో ఏబీ డివిలియర్స్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాడు. 2015లో చెన్నైలో జరిగిన వన్డేల్లో డివిలియర్స్(112) శతకం సాధించగా, ఆపై ముంబైలోని వాంఖేడే స్టేడియంలో డివిలియర్స్(119) మరో శతకం సాధించాడు.ప్రస్తుత తొలి వన్డేలో సఫారీలు 270 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
డు ప్లెసిస్ శతక్కొట్టుడు
డర్బన్: భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ శతకం సాధించాడు. ఒకవైపు వికెట్లుపడుతున్నా డుప్లెసిస్ నిలకడగా బ్యాటింగ్ చేసి సెంచరీ నమోదు చేశాడు. 101 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఇది డు ప్లెసిస్కు తొమ్మిదో వన్డే సెంచరీ. చివరి ఓవర్లో డుప్లెసిస్(120;112 బంతుల్లో) అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఇన్నింగ్స్ను డీకాక్, హషీమ్ ఆమ్లాలు ఆరంభించగా సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆమ్లా(16) తొలి వికెట్గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. బూమ్రా బౌలింగ్లో ఆమ్లా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆపై సఫారీ ఇన్నింగ్స్ను డీకాక్-డు ప్లెసిస్లు ముందుకు తీసుకెళ్లారు. అయితే జట్టు స్కోరు 83 పరుగుల వద్ద డీకాక్(34) రెండో వికెట్గా అవుయ్యాడు. అటు తరువాత మర్క్రామ్(9), డుమినీ(12), మిల్లర్(7)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు చేరడంతో దక్షిణాఫ్రికా 134 పరుగుల వద్ద ఐదో వికెట్ను నష్టపోయింది. ఆ తరుణంలో క్రిస్ మోరిస్-డు ప్లెసిస్ జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జంట 74 పరుగులు జోడించడంతో సఫారీలు రెండొందల మార్కును చేరారు. మోరిస్(37) ఆరో వికెట్గా పెవిలియన్ చేరాడు. కాగా, టెయిలెండర్ ఫెలూక్వాయో(27) సాయంతో డు ప్లెసిస్ సమయోచిత ఇన్నింగ్ ఆడి సెంచరీ చేశాడు. దాంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఇక బూమ్రా, భువనేశ్వర్లకు తలో వికెట్ దక్కింది. బ్రేక్ ఇచ్చిన కుల్దీప్, చాహల్ ఆమ్లా తొలి వికెట్గా బూమ్రా బౌలింగ్లో అవుటైన తర్వాత టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్, చాహల్లు సఫారీలను కట్టడి చేశారు. వీరిదర్దూ వరుస విరామాల్లో ఐదు వికెట్లు సాధించి దక్షిణాఫ్రికాకు కళ్లెం వేశారు. డీకాక్, మర్క్రామ్లను చాహల్ అవుట్ చేయగా, డుమినీ, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్లను కుల్దీప్ యాదవ్ పెవిలియన్కు పంపాడు. కాగా, డు ప్లెసిస్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో సఫారీలు గౌరవప్రదమైన స్కోరు సాధించారు. -
టీమిండియా అసంతృప్తి.. వెంటనే ఫిర్యాదు!
జొహన్నెస్బర్గ్ : అసలే దక్షిణాఫ్రికాతో సిరీస్లో భారత్ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలపాలైన విరాట్ కోహ్లీ సేన జొహన్నెస్ బర్గ్లో జరగనున్న మూడో టెస్టులో విజయం సాధించాలని భావిస్తోంది. 24న వాండరర్స్ మైదానంలో ప్రారంభం కానున్న మూడో టెస్ట్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. బౌలర్లు భువనేశ్వర్, షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ కొంతసేపు బౌలింగ్ సాధన చేశారు. అయితే అక్కడే ఉన్న బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రాక్టీస్ పిచ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేందుకు పిచ్ అనుకూలంగా లేదని క్యూరేటర్లకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నుంచి టీమిండియా కసరత్తులు మొదలుపెట్టగా.. ప్రాక్టీస్ కోసం ఏర్పాటు చేసిన మూడు పిచ్లను పరిశీలించిన బంగర్ భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. చీఫ్ క్యూరేటర్ బూటియల్ బూటెలెజితో సమస్యను చర్చించిన రవిశాస్త్రి ప్రాక్టీస్ వికెట్లను మళ్లీ రోలింగ్ చేసి సిద్ధం చేయాలని సూచించారు. రీ రోలింగ్ చేసి ప్రాక్టీస్ పిచ్ మళ్లీ తయారు చేయగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు సమాచారం. బంతి బౌన్స్ అవ్వడం లేదని, బ్యాట్పైకి కూడా రాకపోవడంతో బ్యాట్స్మెన్ ఇబ్బందులు పడతారని గమనించి రీ రోలింగ్ చేయమని సూచించినట్లు కోచ్ బృందం వెల్లడించింది. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాత్రం ఫాస్ట్, బౌన్సీ పిచ్ భారత ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తోందని సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు. చీఫ్ క్యూరేటర్ సైతం డుస్లెసిస్ నిర్ణయానికి కట్టుబడి పిచ్ సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరి టెస్టుల్లో నెగ్గి సిరీస్ దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించాలని కోహ్లీ సేన భావిస్తోంది. -
టీమిండియా వీక్నెస్ బయటపెట్టిన డుప్లెసిస్
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు వరుస టెస్టుల్లో ఓటమిపాలై సిరీస్ను కోల్పోయిన టీమిండియాను మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, ఆ టీమ్ కెప్టెన్ డుప్లెసిస్ మాత్రం భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. సిరీస్ను కోల్పోవడం కంటే కూడా విరాట్ కోహ్లీ సేన మెరుగైన ప్రదర్శన చేసిందని డివిలియర్స్ మెచ్చుకోగా, బాగా ఆడినా టీమిండియా ఓటమికి గల కారణాలపై డుప్లెసిస్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. ‘దక్షిణాఫ్రికా, భారత్ జట్లలో ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే విజయం కోసం మా జట్టులో డివిలయర్స్, నేను, డీన్ ఎల్గర్, ఓపెనర్ మర్క్రాం పరుగులు సాధిస్తున్నాం. కానీ భారత్ విషయానికొస్తే కేవలం కోహ్లీ చేసే పరుగుల పైనే ఆ జట్టు ఆధారపడుతోంది. ఇదే భారత జట్టు మైనస్ పాయింట్. అలా ఒకే ఆటగాడిపై ఆధారపడితే సత్ఫలితాలు రాబట్టం కష్టం. మా తరహాలోనే టీమిండియా సమష్టిగా రాణిస్తే వారి విజయావకాశాలు మెరుగవుతాయి. ఇరుజట్ల బౌలర్లు అద్బుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో టెస్ట్ సిరీస్ అంటే ఏ దేశానికైనా సవాల్ వంటిదే. కానీ ప్రతి విభాగంలో ఆటగాళ్లు సత్తాచాటితే ఎక్కడైనా విజయం సాధించవచ్చు. కీలక సమయాల్లో భారత బ్యాట్స్మెన్ ఒత్తిడికి లోనవుతున్నారు. ఇతర అన్ని విషయాల్లో రెండు జట్లు సమ ఉజ్జీలుగానే ఉన్నాయని’ డుప్లెసిస్ వివరించాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 24న జొహన్నెస్బర్గ్లో సిరీస్లో చివరిదైన మూడో టెస్టు ప్రారంభంకానుంది. కేప్టౌన్, సెంచూరియన్ టెస్టుల్లో ఓటమి పాలైన టీమిండియా ఇదివరకే 2-0తో సిరీస్ను కోల్పోయింది. చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది. -
'నేను ఒత్తిడికి లోనయ్యా'
కేప్టౌన్:టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో బోణి కొట్టిన సంగతి తెలిసిందే. 208 పరుగుల విజయలక్ష్యాన్ని కాపాడుకున్న సఫారీలు శుభారంభం చేశారు. అయితే టీమిండియాకు నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని చూసి తాను చాలా ఒత్తిడికి లోనయ్యానని దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ పేర్కొన్నాడు. ప్రధానంగా తమ రెండో ఇన్నింగ్స్లో 130 పరుగులకే పరిమితం కావడం ఆందోళనకు గురిచేసిందన్నాడు. 'టీమిండియాకు మేము నిర్దేశించిన లక్ష్యాన్ని చూసి ఒత్తిడికి లోనయ్యా. ఎందుకంటే ఇది కష్టసాధ్యమైన లక్ష్యం ఎంతమాత్రం కాదు. అందులోనే భారత జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. అదే నన్ను ఆందోళనకు గురి చేసింది. అయితే కొత్త బంతి అనేది కీలక పాత్ర పోషిస్తుందనే విషయం నాకు తెలుసు. ఆదిలోనే టీమిండియా వికెట్లను తీస్తే వారిని ఒత్తిడిలోకి నెట్టవచ్చనే ధైర్యం కూడా ఒకవైపు ఉంది. దాన్ని మా బౌలర్లు నిజం చేసి చూపించారు. 350 పరుగుల ఆధిక్యం ఉండాలనేది మా వ్యూహం. అయితే మా ప్రణాళిక సక్సెస్ కాలేదు. స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాం. మా అసాధారణ బౌలింగ్ ఎటాక్తో 200పైగా లక్ష్యాన్ని కూడా కాపాడుకుని విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది' అని డు ప్లెసిస్ పేర్కొన్నాడు. , , , -
వారెవ్వా.. వాట్ ఎ డెలివరీ!
కేప్టౌన్: అరంగేట్ర మ్యాచ్ల్లో దిగ్గజ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టిన బౌలర్లలో టీమిండియా పేసర్ జస్ర్పిత్ బూమ్రా ఒకడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అరంగేట్రం మ్యాచ్లో కోహ్లిని అవుట్ చేసిన ఈ ముంబై ఆటగాడు.. అరంగేట్ర వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ను పెవిలియన్కు చేర్చాడు. టీ20లో ప్రమాదకర ఆటగాడు డేవిడ్ వార్నర్ను అవుట్ చేశాడు. షార్ట్ ఫార్మాట్లో తనదైన శైలితో స్పెషలిస్ట్ బౌలర్గా ముద్ర వేసుకున్న బుమ్రా లాంగెస్ట్ ఫార్మట్లో అరంగేట్రం చేయడానికి చాలా రోజులు నిరీక్షించాడు. తాజాగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనతో ఆ అవకాశం కూడా ఈ ముంబై ఆటగాడికి వచ్చింది. దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ద్వారా బుమ్రా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో సైతం తన మార్కును చూపించిన బుమ్రా.. దిగ్గజ ఆటగాడు సఫారీ మాజీ కెప్టెన్ డివిలియర్స్ను అవుట్ చేసి తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంచితే, తొలి టెస్టులో బూమ్రా మొత్తంగా నాలుగు వికెట్లు సాధించి సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్లో వికెట్కు మాత్రమే పరిమితమైన బూమ్రా.. రెండో ఇన్నింగ్స్లో మూడు కీలక వికెట్లు తీశాడు. అందులో డివిలియర్స్, డుప్లెసిస్, డీకాక్లు ఉన్నారు. అయితే డు ప్లెసిస్ను బూమ్రా బోల్తా కొట్టించిన తీరు ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో భాగంగా 29 ఓవర్ను అందుకున్న బూమ్రా.. నాల్గో బంతికి డు ప్లెసిస్ను అవుట్ చేసిన తీరు ఔరా అనిపించింది. బంతిని డిఫెన్స్ ఆడదామని డు ప్లెసిస్ అనుకునేలోపే బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లిపోయింది. దాంతో ఒకింత ఆశ్చర్యానికి లోనైన డు ప్లెసిస్ పరుగులేమీ చేయకుండానే భారంగా నిష్క్రమించాల్సి వచ్చింది. -
కోహ్లి సేనతో తలపడే సఫారీ జట్టు ఇదే
కేప్టౌన్: కోహ్లిసేన దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్కు ఆ దేశ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. డుప్లెసిస్ కెప్టెన్గా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో గాయపడి జట్టుకు దూరమైన క్రిస్ మోరిస్కు చోటు దక్కింది. అలాగే గాయం, ఇన్ ఫెక్షన్ నుంచి కోలుకున్న డీకాక్, స్టెయిన్లు కూడా జట్టులో చోటు సంపాదించారు. తాజాగా జింబాబ్వేతో నాలుగు రోజుల ప్రయోగాత్మక టెస్టు మ్యాచ్లో విజయం సాధించి ఊపుమీదున్న దక్షిణాఫ్రికా జనవరి 2 నుంచి శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. స్టెయిన్ కూడా గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గాయపడి ఏడాదిగా క్రికెట్కు దూరమైన విషయం తెలిసిందే. జింబాంబ్వేతో ఏకైక టెస్టుకు ఎంపికైనా అతను రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. భారత్తో సిరీస్ కోసమే స్టెయిన్కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక భారత్ జట్టు కేప్టౌన్కు చేరుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టు: డుప్లెసిస్(కెప్టెన్), డికాక్(వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, బవుమా, ఏబీ డివిలియర్స్, డి బ్రూన్, ఎల్గర్, కేశవ్ మహారాజ్, మర్ర్కమ్, మోర్కెల్, క్రిస్ మోరిస్, అండిలే పెహ్లుక్వాయో, ఫిలాండర్, రబాడ, డేల్ స్టెయిన్. -
లాహోర్కు చేరుకున్న వరల్డ్ ఎలెవన్ జట్టు
లాహోర్: గత ఎనిమిదేళ్లుగా ఏ జట్టు చేయని సాహసం ప్రపంచ ఎలెవన్ క్రికెట్ జట్టు చేసింది. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సు పై దాడి జరిగిన అనంతరం పాకిస్తాన్లో ఇంతవరకు ఏ అంతర్జాతీయ జట్టు పర్యటించలేదు. అయితే తాజాగా పాకిస్తాన్తో టీ20 సిరీస్ను ఆడేందుకు 13 మంది ఆటగాళ్ల ప్రపంచ ఎలెవన్ జట్టు ఈ రోజు లాహోర్ చేరుకుంది. ఈనెల 12, 13,15 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో పాకిస్థాన్-వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య మూడు టీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం తమ దేశానికి విచ్చేసిన అంతర్జాతీయ ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పటిష్ట భద్రత నడుమ ప్రత్యేక బస్సులో వారిని హోటల్కు తరలించారు. ప్రపంచ ఎలెవన్ జట్టుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే బీసీసీఐ నుంచి అనుమతి లేకపోవడంతో వరల్డ్ ఎలెవన్ తరపున భారత క్రికెటర్లు ఎవరూ పాల్గొనడం లేదు. వరల్డ్ ఎలెవన్: డు ప్లెసిస్(కెప్టెన్-దక్షిణాఫ్రికా),హషీమ్ ఆమ్లా(దక్షిణాఫ్రికా), శామ్యూల్ బద్రీ(వెస్టిండీస్), జార్జ్ బెయిలీ(ఆస్ట్రేలియా), పాల్ కాలింగ్ వుడ్(ఇంగ్లండ్), బెన్ కట్టింగ్, గ్రాంట్ ఎలియట్(న్యూజిలాండ్), తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), మోర్నీ మోర్కెల్(దక్షిణాఫ్రికా), టిమ్ పానీ(ఆస్ట్రేలియా), తిషారా పెరీరా(శ్రీలంక), ఇమ్రాన్ తాహీర్(దక్షిణాఫ్రికా), డారెన్ సామీ(వెస్టిండీస్) -
వరల్డ్ ఎలెవన్ క్రికెట్ జట్టు ఇదే..
లాహోర్: ఇండిపెండెన్స్ కప్ సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ లో పర్యటించే వరల్డ్ ఎలెవన్ క్రికెట్ జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు దక్షిణాఫ్రికాకు చెందిన డు ప్లెసిస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 14 మంది సభ్యులతో కూడిన జట్టులో ఐదుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లకు స్థానం దక్కడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టెస్టు, టీ 20 జట్టుకు సారథిగా ఉన్న డు ప్లెసిస్ ను వరల్డ్ ఎలెవన్ కెప్టెన్ నియమించగా, ఇందులో ఏడు దేశాలకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడుతున్నారు. అయితే పాక్ కు వెళ్లే వరల్డ్ ఎలెవన్ జట్టులో భారత ఆటగాళ్లకు స్థానం దక్కకపోవడానికి కారణం బీసీసీఐ నుంచి అనుమతి లేకపోవడమే. వచ్చేనెల 12, 13,15 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో పాకిస్థాన్-వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య మూడు టీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. వరల్డ్ ఎలెవన్ కు జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. 2009లో లాహోర్ లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన తరువాత పాక్ కు వెళ్లడానికి ఏ అంతర్జాతీయ జట్టు ముందుకు రావడం లేదు. ఇప్పుడు వరల్డ్ ఎలెవన్ జట్టు పాక్ లో ఆడటంతో అక్కడ పూర్వవైభవం తీసుకురావాలని పీసీబీ యత్నిస్తోంది. మరొకవైపు శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాక్ పర్యటనకు అంగీకారం తెలపడం కూడా పీసీబీకి ఊరట కల్గించే విషయమే. వరల్డ్ ఎలెవన్: డు ప్లెసిస్(కెప్టెన్-దక్షిణాఫ్రికా),హషీమ్ ఆమ్లా(దక్షిణాఫ్రికా), శామ్యూల్ బద్రీ(వెస్టిండీస్), జార్జ్ బెయిలీ(ఆస్ట్రేలియా), పాల్ కాలింగ్ వుడ్(ఇంగ్లండ్), బెన్ కట్టింగ్, గ్రాంట్ ఎలియట్(న్యూజిలాండ్), తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), మోర్నీ మోర్కెల్(దక్షిణాఫ్రికా), టిమ్ పానీ(ఆస్ట్రేలియా), తిషారా పెరీరా(శ్రీలంక), ఇమ్రాన్ తాహీర్(దక్షిణాఫ్రికా), డారెన్ సామీ(వెస్టిండీస్) -
'మాకు కొత్త కల్లిస్ దొరికాడు'
నాటింగ్హమ్:ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో ఆల్ రౌండర్ పాత్ర పోషించి దక్షిణాఫ్రికా భారీ విజయంలో పాలుపంచుకున్న ఫిలాండర్ పై కెప్టెన్ డు ప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. తమ జట్టుకు కొత్త కల్లిస్ దొరికాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఫిలాండర్ కచ్చితంగా తమ 'కొత్త కల్లిస్' అని కొనియాడాడు. ఇంగ్లండ్ తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 340 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఫిలాండర్ 54 పరుగులు నమోదు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు సాధించాడు. ప్రత్యేకంగా ఫిలాండర్ ప్రదర్శనపై డు ప్లెసిస్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 'అతనొక అసాధారణమైన క్రికెటర్. ఎప్పుడు పిచ్ లో కి అడుగుపెట్టిన తనదైన ముద్రవేయడానికి ఫిలాండర్ వందశాతం యత్నిస్తాడు. బహుశా అదే అతన్ని బెస్ట్ గా నిలబెడుతూ ఉండొచ్చు. ప్రధానంగా ఫిలాండర్ టెక్నిక్ చాలా బాగుంటుంది. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి కొన్ని విలువైన పరుగుల్ని సాధించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు'అని డు ప్లెసిస్ తెలిపాడు. -
ఐసీసీ తీరు ఆశ్చర్యకరం
నా పట్ల కఠినంగా వ్యవహరించారు భారత్, ఆసీస్ డీఆర్ఎస్ వివాదంపై డు ప్లెసిస్ డ్యునెడిన్: భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ రివ్యూ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం తీవ్రస్థాయిలో దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డు ప్లెసిస్ తెలిపాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో స్మిత్ తన అవుట్పై రివ్యూ కోరేందుకు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం... భారత కెప్టెన్ కోహ్లి జోక్యంతో అంపైర్ అతడిని వెంటనే వెళ్లమనడం జరిగింది. ఆసీస్ మోసపూరితంగా ఆడుతోందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఆరోపించాడు. అయితే తాను కావాలని అలా చూడలేదని, ఆ సమయంలో తన మైండ్ సరిగ్గా పనిచేయలేదని మ్యాచ్ అనంతరం స్మిత్ చెప్పాడు. కానీ ఆస్ట్రేలియా పర్యటనలో మాత్రం తాను బాల్ టాంపరింగ్ చేశానని ఐసీసీ కఠినంగా వ్యవహరించిందని డు ప్లెసిస్ గుర్తుచేశాడు. ‘నిజంగా ఐసీసీ తీరు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ విషయంతో పోలిస్తే ఆసీస్ పర్యటనలో నాపై వచ్చిన ఆరోపణలు చాలా చిన్నవి. అయినా నాపై సీరియస్గా చర్యలు తీసుకున్నారు. ఈసారి కూడా ఐసీసీ అలాగే స్పందిస్తుందని అనుకున్నాను. కానీ ఐసీసీ మాత్రం ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. నేనేమీ వివాదం సృష్టించాలనుకోవడం లేదు. భారత్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లు ఆడినప్పుడు ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. అయితే ఈసారి మాత్రం నేను అక్కడ లేకపోవడం మంచిదైంది’ అని డు ప్లెసిస్ ఎద్దేవా చేశాడు. గతేడాది నవంబర్లో ఆసీస్తో జరిగిన టెస్టులో బంతి మెరుపు కోసం ఉద్దేశపూర్వకంగా నోటిలో ఉన్న మింట్ తీసి రుద్దినట్టు డు ప్లెసిస్పై వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించింది. -
నా పట్ల కఠినంగా ప్రవర్తించారు!
దునేదిన్: భారత్ తో రెండో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ డీఆర్ఎస్ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డు ప్లెసిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వివాదం చాలా పెద్దదైనప్పటికీ దాన్ని ఐసీసీ చాలా తేలిగ్గా తీసుకోవడాన్ని డుప్లెసిస్ తప్పుబట్టాడు. అసలు మొత్తం విషయాన్ని పక్కకు పెట్టిన ఐసీసీ.. ఆ రగడపై కనీస చర్యలు ఎందుకు చేపట్టలేదో తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశాడు. 'ఇటీవల మా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు నేను బాల్ టాంపరింగ్ చేశానని ఆ జట్టు తీవ్రంగా ఆరోపించింది. నోటిలో ఉన్న మింట్ ను తీసి రుద్దానంటూ అనవసర రాద్దాంతం చేసింది. దానిపై ఐసీసీ కూడా తీవ్రంగా స్పందించింది. నేను ఏ తప్పు చేయలేదని విన్నవించుకున్నా చివరికు జరిమానా విధించారు. అప్పుడు నా పట్ల ఐసీసీ కఠినంగా ప్రవర్తించింది. మరి ఇప్పుడు ఇంత పెద్ద విషయాన్ని ఎలా పక్కకు పెట్టేసింది. ఆ వివాదంపై ఏ ఆటగాడిపై చర్యలు కనీస చర్యలు తీసుకోలేదు. ఇది నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచిన విషయమే కాదు.. చాలా సీరియస్ గా ఆలోచింపజేసిన అంశం'అని డు ప్లెసిస్ పేర్కొన్నాడు. -
వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా వశం
ఆక్లాండ్: న్యూజిలాండ్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా 3–2తో కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో వన్డేలో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 41.1 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. డి గ్రాండ్హోమ్ (32) టాప్ స్కోరర్. సఫారీ బౌలర్లలో రబడ 3, ఇమ్రాన్ తాహిర్, ఫెలుక్వయో చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. డు ప్లెసిస్ (51 నాటౌట్; 6 ఫోర్లు), మిల్లర్ (45 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ బుధవారం డునెడిన్లో మొదలవుతుంది. తాజా విజయంతో సఫారీ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంకును నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా... ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కివీస్తో చివరి మ్యాచ్లో ఓడిపోయివుంటే దక్షిణాఫ్రికా ఒక పాయింట్ కోల్పోయి ఆసీస్తో సమంగా నిలిచేది. అప్పుడు ఆస్ట్రేలియా డెసిమల్ పాయింట్ల తేడాతో అగ్రస్థానంలో నిలిచేది. -
దక్షిణాఫ్రికా జోరు
సెంచరీతో చెలరేగిన డు ప్లెసిస్ పోరాడి ఓడిన శ్రీలంక కేప్టౌన్: డు ప్లెసిస్ (141 బంతుల్లో 185; 16 ఫోర్లు, 3 సిక్స్లు) వీరవిహారం చేయడంతో.... శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం వరించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 40 పరుగుల ఆధిక్యంతో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరు చేసింది. డు ప్లెసిస్ సెంచరీతో అదరగొట్టగా... కెప్టెన్ డివిలియర్స్ (64; 4 ఫోర్లు), డి కాక్ (55; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.1 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్ ఉపుల్ తరంగ (119; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఓ దశలో 307/5 పరుగులతో గెలిచే స్థితిలో నిలిచిన లంక... చివర్లో అనూహ్యంగా కుప్పకూలింది. 20 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. -
‘డబుల్’ అవకాశం చేజారింది!: క్రికెటర్
కెప్ టౌన్: వన్డేల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును టెస్ట్ కెప్టెన్ డుప్లెసిస్ (185, 141 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో చేజార్చుకున్నాడు. అయితే తనకు డబుల్ సెంచరీ ఆలోచన గానీ, అత్యధిక స్కోరు రికార్డు గానీ తన మైండ్ లోకి రాలేదని, 180 పరుగులు చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు. మంగళవారం రాత్రి లంకపై నాలుగో వన్డేలో గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ చేసిన 188నాటౌటే ఆ జట్టు తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 1996 ప్రపంచ కప్లో భాగంగా రావల్పిండిలో యూఏఈతో మ్యాచ్లో ఈ ఫీట్ను సాధించాడు కిర్స్టెన్. టెస్ట్ కెప్టెన్సీ తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని, నాలుగో వన్డే సెంచరీ హీరో డుప్లెసిస్ అన్నాడు. వాస్తవానికి చివరి ఓవర్లో ఆడిన షాట్ ఫోర్ అయింటే కిర్స్టెన్ రికార్డును అధిగమించేవాడినని, అయితే దురదృష్టవశాత్తూ ఔటయ్యానని చెప్పాడు. ఏది ఏమైతేనేం జట్టు విజయం సాధించిందని, కిర్స్టెన్ తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరులో రెండో స్థానం దక్కినందుకు సంతోషంగా ఉందన్నాడు డుప్లెసిస్. 20 ఏళ్లు ముగిసినా సఫారీ మాజీ ఆటగాడు కిర్స్టెన్ రికార్డు మాత్రం చెక్కుచెదరకపోవడం గమనార్హం. గత 10 మ్యాచ్ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసిన డుప్లెసిస్.. 71 సగటుతో 640 పరుగులు చేశాడు. -
కెప్టెన్ సెంచరీ చేసినా లంకకు పరాభవం
కెప్ టౌన్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో చివరి వరకు పోరాడిన లంక ఓటమి పాలైంది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన లంక ఓ దశలో 29 ఓవర్లకు 216/2 తో పటిష్టస్థితిలో కనిపించినా.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 40 పరుగులతో ఓటమి తప్పలేదు. దీంతో సిరీస్ లో 4-0తో సఫారీల జోరు కొనసాగుతోంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా డుప్లెసిస్ భారీ సెంచరీ (185, 141 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు)తో చెలరేగడంతో 5 వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. డికాక్ (55, 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ డివిలియర్స్ (64, 62 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. మొదట చేతులెత్తేసిన సఫారీ బౌలర్లు చివర్లో చెలరేగడంతో ఉత్కంఠపోరులో విజయాన్ని సాధించారు. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు ఓపెనర్లు శుభారంభాన్ని (139 పరుగులు) ఇచ్చారు. డిక్ వెల్లా(58)తో పాటు మరో ఓపెనర్, లంక కెప్టెన్ తరంగ సూపర్ సెంచరీ (119, 90 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు)తో చెలరేగడంతో ఓ దశలో నెగ్గేలా కనిపించారు. అయితే పార్నెల్.. తరంగ, కుశాల్ మెండిస్(29)ను ఔట్ చేసి లంకను దెబ్బతీశాడు. ఆ తర్వాత కేవలం వీరక్కోడై(58, 51 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్), గుణరత్నే(38) మాత్రమే రెండంకేల స్కోరు చేశారు. 45వ ఓవర్లో తొలి బంతికి కులశేకర(1)ను, చివరి బంతికి వీరక్కోడై(58)ని ఇమ్రాన్ ఔట్ చేసి లంక కష్టాలను పెంచేశాడు. 49వ ఓవర్ తొలి బంతికి సందకన్ ను పార్నెల్ బౌల్డ్ చేయడంతో లంక 327 పరుగులకు ఆలౌటై సిరీస్ లో మరో ఓటమిని మాటకట్టుకుంది. సఫారీ బౌలర్లలో పార్నెల్ 4 వికెట్లు పడగొట్టగా, తాహిర్, రబడ, ప్రీటోరియస్ తలో రెండు వికెట్లు తీశారు. -
డుప్లెసిన్ భీకర ఇన్నింగ్స్.. లంకకు భారీ లక్ష్యం
కెప్ టౌన్: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో దక్షిణాఫ్రికా జోరు కోనసాగుతోంది. ఇదివరకే సిరీస్ను శ్రీలంకపై 3-0తో నెగ్గిన సఫారీ జట్టు నాలుగో వన్డేలో డుప్లేసిస్ భారీ శతకంతో చెలరేగండతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. చివరి ఓవర్లో డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ భావించినా 185(141 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగుల వద్ద ఔటయి ఐదో వికెట్ రూపంలో నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు డుప్లెసిస్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు రెండో ఓవర్లోనే ఆమ్లా(1)ను లంక బౌలర్ కుమార్ ఔట్ చేశాడు. డికాక్ హాఫ్ సెంచరీ(55, 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు )తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కెప్టెన్ డివిలియర్స్ హాఫ్ సెంచరీ(64, 62 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. డుప్లెసిస్ తన కెరీర్లో ఎనిమిదో వన్డే సెంచరీ చేయడంతో పాటు తన వ్యక్తిగత అత్యధిక స్కోరు(133 నాటౌట్)ను సవరించాడు. అయితే సఫారీ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు గ్యారీ కిర్స్టెన్ (188 నాటౌట్) రికార్డుకు మూడు పరుగుల దూరంలోనే ఆగిపోయాడు. చివర్లో డుప్లెసిస్ డబుల్ సెంచరీకి చేరువయ్యాక మెరుపు ఇన్నింగ్స్ ఆడిన బెహర్డిన్(36, 20 బంతుల్లో ) స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకున్నాడు. దీంతో డుప్లెసిస్ కు చివరి ఓవర్లో రెండో బంతికి బ్యాటింగ్ వచ్చింది. మధుశంక బౌలింగ్లో షాట్కు ప్రయత్నించి గునరత్నే చేతికి చిక్కి, నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసిన సఫారీలు లంక ముందు కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని నిలిపారు. -
శతక్కొట్టిన మిల్లర్, డు ప్లెసిస్
దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక చిత్తు డర్బన్: డు ప్లెసిస్, మిల్లర్ సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికా 121 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 307 పరుగులు చేసింది. మిల్లర్ (98 బంతుల్లో 117 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), డు ప్లెసిస్ (120 బంతుల్లో 105; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. ఇద్దరు ఐదో వికెట్కు 117 పరుగులు జోడించారు. అనంతరం మిల్లర్... మోరిస్ (26)తో కలిసి ఆరో వికెట్కు 65 పరుగులు జతచేశాడు. లక్మాల్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత శ్రీలంక 37.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాట్స్మెన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేకపోయారు. చండిమాల్ 36 పరుగులతో టాప్స్కోరర్గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో పార్నెల్, ఇమ్రాన్ తాహిర్, డుమిని తలా 2 వికెట్లు తీశారు. ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 2–0తో ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే శనివారం జొహన్నెస్బర్గ్లో జరగనుంది. సెంచరీతో చెలరేగిన మిల్లర్ గాయం కారణంగా తదుపరి మూడు వన్డేలకు దూరమయ్యాడు. -
కుమ్మేసి.. కూల్చేశారు!
డర్బన్: ఇటీవల శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన దక్షిణాఫ్రికా.. వన్డే సిరీస్ లో మాత్రం చెలరేగిపోతోంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో సైతం సఫారీలు ఏకపక్ష విజయం సాధించారు. లంకేయుల్ని 37.5 ఓవర్లలో186 పరుగులకే కూల్చిసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ సఫారీలు సత్తాచాటుకుని 121 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఇరు జట్ల మధ్య జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్(105), మిల్లర్(117) శతకాలతో మెరిశారు. ఈ జోడి ఐదో వికెట్ కు 117 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. తొలుత లంకేయుల్ని కుమ్మేసిన సఫారీలు.. ఆ తరువాత పేకమేడలా కూల్చేశారు. దక్షిణాఫ్రికా విసిరిన 308 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ ఒక్కరూ లంక క్రికెటర్ కనీసం హాఫ్ సెంచరీ మార్కును చేరకపోవడంతో వారికి ఘోర ఓటమి ఎదురైంది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 2-0 తో ఆధిక్యంలో నిలిచింది. -
డు ప్లెసిస్ అప్పీలు తిరస్కరణ
బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై జరిమానా విధించినందుకు అప్పీలుకు వెళ్లిన దక్షిణాఫ్రికా క్రికెటర్ డు ప్లెసిస్కు నిరాశే ఎదురైంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి కమిషన్ చైర్మన్ మైకేల్ బిలాఫ్ అతని అప్పీలును తోసిపుచ్చారు. హోబర్ట్లో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా బంతి ఆకారాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చినట్లు (ట్యాంపరింగ్) వీడియోల్లో తేలడంతో అప్పటి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. దీనిని ఐసీసీ కమిషన్కు డు ప్లెసిస్ అప్పీలు చేసుకోగా...దానిని తిరస్కరించారు. -
టెస్టు కెప్టెన్సీకి డివిలియర్స్ గుడ్బై
ప్రిటోరియా: మోచేతి గాయానికి శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ జట్టు ప్రయోజనాల కోసం కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తాను టెస్టు కెప్టెన్సీ నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన గైర్హాజరులో చక్కటి నాయకత్వ పటిమ చూపిస్తున్న డు ప్లెసిస్నే కొనసాగిం చాలని అతను దక్షిణాఫ్రికా బోర్డుకు సిఫారసు కూడా చేశాడు. ‘వ్యక్తులకంటే ఎప్పుడైనా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. అది నేనైనా సరే. టెస్టు కెప్టెన్గా వ్యవహరించే గొప్ప గౌరవం నాకు లభించింది. అయితే నేను ఇప్పటికే రెండు సిరీస్లకు దూరమయ్యాను. త్వరలో శ్రీలంకతో జరిగే సిరీస్లో కూడా ఆడటం ఇంకా సందేహంగానే ఉంది. ఆస్ట్రేలియాలో జట్టు అద్భుత ఆటతీరు కనబర్చిన తర్వాత జట్టు కోసం డు ప్లెసిస్ను పూర్తి స్థాయి కెప్టెన్గా ఎంపిక చేయడం మంచిది’ అని ఏబీ అన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్తో సిరీస్ జరుగుతున్న సమయంలో ఆమ్లా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు చేపట్టిన ఏబీ, రెండు టెస్టులకు సారథ్యం వహించాడు. -
ఏబీ డివిలియర్స్ తప్పుకున్నాడు!
కేప్టౌన్:దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక తాను దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించలేనంటూ తేల్చిచెప్పాడు. గత కొంతకాలంగా మోచేతి గాయంతో సతమవుతున్న ఏబీ.. టెస్టు కెప్టెన్సీకి తాజాగా గుడ్ బై చెప్పాడు. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. దాంతో త్వరలో శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికా సారథ్య బాధ్యతలను డు ప్లెసిస్ నిర్వర్తించనున్నాడు. ఈ మేరకు డు ప్లెసిస్ను శాశ్వత కెప్టెన్గా చేయాలంటూ ఏబీ చేసిన సిఫారుసును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అంగీకరించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టెస్టు సిరీస్ల నుంచి ఏబీ గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దాంతో జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్.. దక్షిణాఫ్రికా ఘన విజయంలో పాలు పంచుకున్నాడు. స్వదేశంలో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను డు ప్లెసిస్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా క్లీన్స్వీప్ చేయగా, ఆ తరువాత ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను సఫారీలు 2-1 తేడాతో గెలుచుకున్నారు. అంతకుముందు న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ను కూడా డు ప్లెసిస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా 1-0 తో గెలుచుకుంది. దాంతో డు ప్లెసిస్ శాశ్వత పగ్గాలు చేపడితే బాగుంటుందనే వాదన వినిపించింది. ఈ తరుణంలో ఏబీ కూడా టెస్టు కెప్టెన్గా చేయడానికి విముఖత చూపడంతో డు ప్లెసిస్ కు ఆ బాధ్యతలను అప్పజెప్పనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా టెస్టు సారథి బాధ్యతల నుంచి హషీమ్ ఆమ్లా తప్పుకోవడంతో డివిలియర్స్ కు పూర్తి స్థాయి పగ్గాలు అప్పజెప్పారు. ఇంగ్లండ్ తో సిరీస్ జరుగుతున్న సమయంలో ఆమ్లా తన పదవికి వీడ్కోలు చెప్పాడు. దాంతో డివిలియర్స్ను శాశ్వత టెస్టు కెప్టెన్గా చేస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా, కొంతకాలంగా డివిలియర్స్ను గాయాల బెడద వేధిస్తుండటంతో జట్టుకు దూరమవుతూ వచ్చాడు. ఇదే క్రమంలో తన టెస్టు కెప్టెన్సీ నుంచి వైదులుగుతున్నట్లు డివీ ప్రకటించాడు. డివిలియర్స్ టెస్టు పగ్గాలు చేపట్టిన తరువాత దక్షిణాఫ్రికా ఒక టెస్టు మ్యాచ్ గెలవగా, ఒక మ్యాచ్లో ఓడింది. -
19న డు ప్లెసిస్ విచారణ
దుబాయ్: బాల్ టాంపరింగ్ ఆరోపణలపై దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్మన్ డు ప్లెసిస్ చేసుకున్న అప్పీల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈనెల 19న విచారించనుంది. జ్యుడీషియల్ కమిషనర్ మైకేల్ బెలాఫ్ అతడి వాదనలు వింటారని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరుగుతుంది. ఐసీసీతో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్కు చెందిన లీగల్ కౌన్సిల్లు కూడా ఇందులో పాల్గొంటారు. డు ప్లెసిస్ స్వయంగా హాజరుకాకుండా టెలిఫోన్ లింక్ ద్వారా అందుబాటులో ఉంటాడని ఐసీసీ తెలిపింది. -
డుప్లెసిస్ ‘తీపి’ సెంచరీ!
దక్షిణాఫ్రికా 259/9 డిక్లేర్డ్ ఆస్ట్రేలియాతో చివరి టెస్టు అడిలైడ్: వారం రోజులుగా వెంటాడుతున్న వివా దం... బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో జరిమా నా... తాను తప్పు చేయలేదని మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సి రావడం... ఇలాంటి స్థితిలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మూడో టెస్టులో బరిలోకి దిగాడు. బ్యాటింగ్కు వస్తుంటే మైదానం అన్ని వైపులనుంచి ఎగతాళి చేస్తున్న ప్రేక్షకులు... ఇవేవీ డు ప్లెసిస్ స్థైర్యాన్ని, ఏకాగ్రతను దెబ్బ తీయలేకపోయారుు. సహచరులంతా విఫలమైన చోట ఒక్కడే నిలబడి ముందుండి నడిపించాడు. చివరకు అద్భుత శతకం సాధించి అంతకు ముందు వెక్కిరించిన ప్రేక్షకులే నిలబడి చప్పట్లతో అభినందించేలా చేశాడు. ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన మూడో టెస్టు (డే అండ్ నైట్)లో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 259 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. డు ప్లెసిస్ (164 బంతుల్లో 118 నాటౌట్; 17 ఫోర్లు) కెరీర్లో ఆరో సెంచరీ సాధించగా, స్టీఫెన్ కుక్ (40) పర్వాలేదనిపించాడు. 44/3 స్కోరు వద్ద క్రీజ్లోకి వచ్చిన ప్లెసిస్ కీలక భాగస్వామ్యాలతో జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఆసీస్ బౌలర్లలో హాజల్వుడ్ 4 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, బర్డ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 12 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ‘ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్స్ . ఈ రోజు ఆట పట్ల గర్వంగా ఉన్నాను. ఇలాంటి సమయంలో కెప్టెన్గా ముందుండి నడిపించడం గొప్పగా అనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇంతగా ఒక ఘటన నాలో స్ఫూర్తిని పెంచలేదు. ప్రేక్షకులు నన్ను ఆటపట్టిస్తారని ముందే ఊహిం చాను’ - డు ప్లెసిస్ -
డు ప్లెసిస్ అజేయ శతకం
అడిలైడ్:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్(118 నాటౌట్) అజేయ శతకం సాధించాడు. పింక్ బాల్ తో ఇరు జట్ల మధ్య తొలిసారి నిర్వహిస్తున్న డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లో డు ప్లెసిస్ ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా కష్టాల్లో ఉన్న సమయంలో డు ప్లెసిస్ రాణించాడు. 95 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో డు ప్లెసిస్ సెంచరీతో రాణించాడు. గురువార ఆరంభమైన టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఆదిలోనే ఎల్గర్(5) వికెట్ను కోల్పోయింది.ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఆమ్లా(5), డుమినీ(5)లు కూడా పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా తడబడినట్లు కనిపించింది. అయితే మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లతో కలిసి డు ప్లెసిస్ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఈ క్రమంలోనే పలు భాగస్వామ్యాలు నమోదు చేస్తూ చివరి క్రీజ్లో నిలబడి సెంచరీ పూర్తి చేశాడు.అయితే దక్షిణాఫ్రికా ఇంకా ఒక వికెట్ మిగిలి ఉండగానే 76.0 ఓవర్లో 259 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. -
డుప్లెసిస్ ‘తప్పు’ చేశాడు!
ధ్రువీకరించిన ఐసీసీ నిషేధం లేదు, జరిమానాతో సరి అడిలైడ్: దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ధారించింది. ఇందుకు అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానాగా విధించింది. అరుుతే మ్యాచ్ నిషేధం నుంచి మాత్రం డు ప్లెసిస్ తప్పించుకున్నాడు. ఫలితంగా గురువారం నుంచి జరిగే మూడో టెస్టులో అతను ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో హోబర్డ్లో జరిగిన రెండో టెస్టులో ట్యాంపరింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు డు ప్లెసిస్ సుదీర్ఘ విచారణకు హాజరయ్యాడు. తాను తప్పు చేయలేదని అతను వాదించాడు. అనంతరం ఐసీసీ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘తన నోటిలో ఉన్న చాక్లెట్ లేదా మింట్లాంటి పదార్థంతో డు ప్లెసిస్ బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించినట్లు టీవీ ఫుటేజీలో కనిపించింది. అంపైర్లతో చర్చించిన తర్వాతే ఈ చర్య తీసుకుంటున్నాం. వారు కూడా తగిన సాక్ష్యాలు అందించారు. ఐసీసీ నిబంధన 2.2.9 ప్రకారం కృత్రిమ వస్తువులు వాడి బంతి ఆకారాన్ని దెబ్బ తీయడం నిబంధనలను ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నాం’ అని ఐసీసీ ప్రకటించింది. దీనిని మొదటి తప్పుగా భావించి వంద శాతం జరిమానా విధించిన ఐసీసీ, దాంతో పాటు ప్లెసిస్ క్రమశిక్షణా రికార్డులో మూడు పారుుంట్లు తగ్గించింది. అరుుతే ఐసీసీ శిక్షపై డు ప్లెసిస్ మరోసారి అప్పీల్కు వెళ్లాలని భావిస్తున్నాడు. 2013లోనూ పాకిస్తాన్తో జరిగిన టెస్టులో డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడి 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా చెల్లించాడు. -
డు ప్లెసిస్కు ఊరట
అడిలైడ్:బాల్ టాంపరింగ్ వివాదంలో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డు ప్లెసిస్కు ఊరట లభించింది. బాల్ టాంపరింగ్ కు డుప్లెసిస్ పాల్పడినట్లు వీడియో ఫుటేజ్లో తేలినా, అతనికి మొత్తం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. అదే క్రమంలో అడిలైడ్లో జరిగే తదుపరి టెస్టులో డు ప్లెసిస్ యథావిధిగా ఆడేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. డు ప్లెసిస్ తన లాలాజలంతో బంతిని రుద్దుడమే కాకుండా, నోటిలో ఉన్న మింట్ను కూడా ఉపయోగించినట్లు ఐసీసీ పేర్కొంది. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లో 2.2.9 నియమావళి ఉల్లంఘన కిందకు వచ్చినా, అతనికి హెచ్చరికతో కూడిన జరిమానాతో సరిపెట్టినట్లు రిచర్డ్సన్ పేర్కొన్నారు. ఈ రకమైన చర్యలతో బంతి యొక్క స్థితి మారుతుందన్నారు. డు ప్లెసిస్పై చర్యలు తీసుకునే క్రమంలో ఫీల్డ్ అంపైర్ల సాక్ష్యం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఫీల్డ్ అంపైర్లు వెంటనే అప్రమత్తమై డు ప్లెసిస్ చర్యను నివారించినట్లు తమకు తెలియజేశారని రిచర్డ్సన్ తెలిపారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా డు ప్లెసిస్ నోటితో బంతి కొరకడంతో వివాదం ఏర్పడింది. అయితే తాను కావాలని ఏ తప్పు చేయలేదని డు ప్లెసిస్ తన వాదనను వినిపించాడు. కాగా, అది కావాలని చేసిన లేక వేరే విధంగా చేసినా ఐసీసీ కోడ్ నియమావళిని డు ప్లెసిస్ ఉల్లఘించాడు. దాంతో అతనిపై మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉందని తొలుత భావించినా, చివరకు ఐసీసీ అతనికి భారీ జరిమానాతో సరిపెట్టింది. -
బాల్ టాంపరింగ్కు పాల్పడిన డు ప్లెసిస్!
దుబాయ్: దక్షిణాఫ్రికా ప్రస్తుత టెస్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బాల్ టాంపరింగ్కు పాల్పడినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆరోపించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో మంగళవారం నాలుగో రోజు ఆటలో తన లాలాజలం, బబుల్గమ్తో బంతిని మరింత మెరిసేలా చేస్తున్నట్టు వీడియో ఫుటేజిలో కనిపించింది. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2.9ను అతిక్రమించినట్టేనని ఐసీసీ స్పష్టం చేసింది. డు ప్లెసిస్ దోషిగా తేలితే అతనిపై ఒక టెస్టు మ్యాచ్ నిషేధం పడే అవకాశముంటుంది. -
'ఆ స్ట్రోక్ ఆసీస్కు గుర్తుండిపోతుంది'
కేప్ టౌన్:ఇటీవల తమతో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసి ఆ జట్టుకు మరచిపోలేని స్ట్రోక్ ఇచ్చామంటున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్. ఆసీస్ కు ఆ సిరీస్ చాలాకాలం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకమని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన సిరీస్లో ఆసీస్ అలా ఓడిపోవడం ఆ జట్టును మానసికంగా బలహీనపరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. 'మాతో టెస్టు సిరీస్కు వారు డిఫరెంట్ జట్టుతో వస్తారు. వన్డేల్లో కంటే మంచి జట్టుతోనే ఆసీస్ టెస్టు సిరీస్ కు సిద్ధమవుతుంది. టెస్టు సిరీస్ లో మంచి ఆరంభాన్ని దక్కించుకోవాలంటే నాణ్యమైన జట్టు అనేది ముఖ్యం. మాతో జరిగిన వన్డే సిరీస్ వారికి మరచిపోలేని అనుభవం. అది ఆసీస్ కు ఎదురైన చిన్న దెబ్బ కాదు.. ఆ జట్టును మానసికంగా బలహీనపరిచే స్ట్రోక్' అని డు ప్లెసిస్ తెలిపాడు. -
మిచెల్ మార్ష్ కూడా...
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే కెవిన్ పీటర్సన్, డు ప్లెసిస్ గాయాల కారణంగా ఐపీఎల్-9 నుంచి వైదొలగగా... వీరిద్దరి సరసన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా చేరాడు. పక్కటెముకల గాయంతో మార్ష్ ఈ సీజన్లో మిగతా మ్యాచ్లకు దూరమయ్యాడు. -
ఐపీఎల్ నుంచి డు ప్లెసిస్ అవుట్
ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. చేతి వేలు విరగడంతో జట్టు ప్రధాన బ్యాట్స్మన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్-9 సీజన్ నుంచి తప్పుకున్నాడు.డు ప్లెసిస్ స్థానంలో ఆస్ట్రేలియా ఎడంచేతి బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖాజాను పుణే జట్టు తీసుకుంది. -
భలా.... బెంగళూరు
► సమష్టి ప్రదర్శనతో పుణేపై విజయం ► మళ్లీ చెలరేగిన డివిలియర్స్, కోహ్లి ► బంతితో మెరిసిన రిచర్డ్సన్, వాట్సన్ ► లక్ష్య ఛేదనలో ధోని సేన విఫలం ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. గత రెండు మ్యాచ్ల్లో భారీ స్కోర్లు చేసినా దక్కని విజయాలు. ఈ మ్యాచ్కు ముందు బెంగళూరు పరిస్థితి ఇది. కానీ కోహ్లి, డివిలియర్స్ల బ్యాటింగ్కుతోడు బౌలర్లూ రాణించడంతో బెంగళూరు గాడిలో పడింది. లక్ష్య ఛేదనలో పుణే విజృంభించినా... చివర్లో సూపర్ బౌలింగ్తో బెంగళూరు గట్టెక్కింది. పుణే: ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పైచేయి సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పుణే బ్యాట్స్మెన్ మెరుపులు మెరిపించినా... స్లాగ్ ఓవర్లలో తిరుగులేని బౌలింగ్తో ధోనిసేనను కోహ్లి బృందం కట్టడి చేసింది. దీంతో ఐపీఎల్-9లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ 13 పరుగుల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్పై నెగ్గింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో.... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. డివిలియర్స్ (46 బంతుల్లో 83; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), కోహ్లి (63 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. తర్వాత పుణే 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులకు పరిమితమై ఓటమి పాలైంది. రహానే (46 బంతుల్లో 60; 8 ఫోర్లు), ధోని (38 బంతుల్లో 41; 3 ఫోర్లు), తిసారా పెరీరా (13 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. అద్భుత భాగస్వామ్యం... ఆర్సీబీ ఓపెనర్లలో లోకేశ్ రాహుల్ (7) నిరాశపర్చినా... కెప్టెన్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడో ఓవర్లోనే సిక్స్, ఫోర్తో జోరు పెంచినా... తొలి 22 బంతుల్లో 27 పరుగులు చేశాక రాహుల్ అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన డివిలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్కు ప్రాణం పోశాడు. పుణే బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ బౌండరీల మోత మోగించాడు. దీంతో పవర్ ప్లేలో 48/1తో ఉన్న స్కోరు తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 79/1కి చేరుకుంది. ఆ తర్వాత మురుగన్ అశ్విన్ను లక్ష్యంగా చేసుకున్న ఏబీ మరింత రెచ్చిపోయాడు. అతను వేసిన తొలి రెండు ఓవర్లలో రెండు సిక్స్లు, రెండు ఫోర్లతో 29 పరుగులు రాబట్టాడు. రెండో ఎండ్లో కోహ్లి సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలో ఏబీ 25; కోహ్లి 47 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ఈ ఇద్దరి దెబ్బకు పుణే బౌలర్లు పరుగులు భారీగానే సమర్పించుకున్నారు. 18వ ఓవర్లో తొలి సిక్స్ కొట్టిన విరాట్... తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అదే ఓవర్లో డివియర్స్ మరో సిక్సర్ కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో ఈ ఇద్దరు అవుట్ కావడంతో రెండో వికెట్కు 95 బంతుల్లో 155 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పెరీరా 3 వికెట్లు తీశాడు. పెరీరా దూకుడు... ఓపెనర్లలో రహానే కుదురుగా ఆడినా... డు ప్లెసిస్ (2) నిరాశపరిచాడు. పీటర్సన్ ఒక్క బంతి ఆడాక రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్మిత్ (4) పెవిలియన్కు చేరడంతో పుణేకు సరైన శుభారంభం లభించలేదు. రహానేతో కలిసి ధోని ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యత తీసుకున్నా రన్రేట్ మందగించింది. దీంతో పవర్ప్లేలో పుణే స్కోరు 36/2కు చేరుకుంది. ఈ దశలో వీరిద్దరు బ్యాట్లు ఝుళిపించి మూడు ఓవర్లలో 32 పరుగులు రాబట్టడంతో ధోని సేన కాస్త కోలుకుంది. ఇక ఇక్కడి నుంచి వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్తో పాటు వీలైనప్పుడు బౌండరీలు సాధించడంతో స్కోరు చకచకా కదిలింది. ఈ క్రమంలో రహానే 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే 15వ ఓవర్లో అతను స్టంపౌట్ కావడంతో మూడో వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత పెరీరా సిక్స్తో కుదురుకున్నా... 16వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి ధోని వెనుదిరిగాడు. ఇక 24 బంతుల్లో 64 పరుగులు చేయాల్సిన దశలో పెరీరా చెలరేగిపోయాడు. మూడు సిక్స్లు, నాలుగు ఫోర్లు బాదడంతో ఉత్కంఠ మొదలైంది. కానీ 19వ ఓవర్లో వాట్సన్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. విజయానికి 25 పరుగులు అవసరమైన స్థితిలో... మూడు బంతుల తేడాలో పెరీరా, అశ్విన్ (0)లను అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో రిచర్డ్సన్ మరో రెండు వికెట్లు తీయడంతో పుణే పరుగుల వేటలో వెనుకబడిపోయింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రహానే (బి) పెరీరా 80; రాహుల్ (సి) ఇషాంత్ (బి) పెరీరా 7; డివిలియర్స్ (సి) అంకిత్ (బి) పెరీరా 83; వాట్సన్ నాటౌట్ 1; సర్ఫరాజ్ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1-27; 2-182; 3-182. బౌలింగ్: ఇషాంత్ 4-0-47-0; పెరీరా 4-0-34-3; అంకిత్ శర్మ 4-0-31-0; రజత్ భాటియా 3-0-22-0; ఆర్.అశ్విన్ 3-0-22-0; ఎం.అశ్విన్ 2-0-29-0. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (స్టం) రాహుల్ (బి) షమ్సీ 60; డు ప్లెసిస్ (సి) హర్షల్ (బి) రిచర్డ్సన్ 2; పీటర్సన్ రిటైర్డ్హర్ట్ 0; స్మిత్ రనౌట్ 4; ధోని (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 41; పెరీరా (సి) మన్దీప్ (బి) వాట్సన్ 34; భాటియా (సి) వాట్సన్ (బి) రిచర్డ్సన్ 21; ఆర్.అశ్విన్ (సి) హర్షల్ (బి) వాట్సన్ 0; అంకిత్ నాటౌట్ 3; ఎం.అశ్విన్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 0; ఇషాంత్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1-12; 2-18; 3-109; 4-120; 5-164; 6-165; 7-169; 8-169. బౌలింగ్: బిన్నీ 2-0-23-0; రిచర్డ్సన్ 3-0-13-3.; హర్షల్ పటేల్ 4-0-46-1; వాట్సన్ 4-0-31-2; షమ్సీ 4-0-36-1; ఇక్బాల్ అబ్దుల్లా 3-0-22-0. -
డు ప్లెసిస్కు జరిమానా
న్యూఢిల్లీ:వరల్డ్ టీ 20లో శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్కు మ్యాచ్ ఫీజులు యాభై శాతం జరిమానా పడింది. శ్రీలంక విసిరిన 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13.0 ఓవర్ లో డు ప్లెసిస్ ఎల్బీగా అవుటయ్యాడు. అయితే డు ప్లెసిస్ క్రీజ్ ను వదిలి వెళుతున్న సమయంలో తలను అడ్డంగా ఊపుతూ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల్లో ఆర్టికల్ 2.1.5 కిందకు రావడంతో డు ప్లెసిస్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా పడింది. ఇటీవల భారత్ తో చెన్నైలో జరిగిన నాల్గో వన్డే సందర్భంలో కూడా డు ప్లెసిస్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఏడాది కాలంలో ఒకే తరహా తప్పును చేయడం లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించడం కావడంతో డు ప్లెసిస్ కు భారీ జరిమానా పడింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. -
టీమిండియానే ఫేవరెట్.. కానీ
ముంబై: వరల్డ్ టీ 20లో భారత క్రికెట్ జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ స్సష్టం చేశాడు. ఇటీవల కాలంలో ఈ పొట్టి ఫార్మాట్ గేమ్లో టీమిండియా నిలకడగా రాణిస్తూ అనేక విజయాలను సొంతం చేసుకుందన్నాడు. అయితే ఇది ఓపెన్ టోర్నమెంట్ అయినందున మిగతా జట్ల అవకాశాలను కూడా తీసిపారేయలేమని పేర్కొన్నాడు. 'స్వదేశీ పరిస్థితుల నేపథ్యంలో ధోని అండ్ గ్యాంగే వరల్డ్ టీ 20లో ఫేవరెట్. కానీ ఓపెన్ టోర్నమెంట్లో ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదు. తనదైన రోజున ఏ జట్టైనా అద్భుతాలను సృష్టించవచ్చు. నా దృష్టిలో ఈ వరల్డ్ కప్లో అంచనాలు కూడా తారుమారు కావొచ్చు. మేము వరల్డ్ కప్ ను గెలిస్తే మా జట్టుపై ఉన్న విఫల ముద్ర తొలిగిపోతుంది. 'అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. శనివారం ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనున్ననేపథ్యంలో డు ప్లెసిస్ మీడియాతో ముచ్చటిస్తూ పై విధంగా స్పందించాడు. -
అశ్విన్తోనే ప్రమాదం: డు ప్లెసిస్
మొహాలీ: భారత్తో టెస్టు సిరీస్లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్తోనే తమకు ఎక్కువ ప్రమాదమని దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డు ప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ‘టెస్టు మ్యాచ్లలో తొలి రోజు నుంచే స్పిన్కు అనుకూలించే పిచ్లు ఎదురవుతాయని భావిస్తున్నాం. కాబట్టి అన్ని మ్యాచ్లలో ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పిచ్లపై అశ్విన్ ప్రమాదకారి. అతడిని నిలువరిస్తే మా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’ అని డు ప్లెసిస్ అన్నాడు. భారత్లో టెస్టు క్రికెట్ ఆడటం ఏ ప్రత్యర్థికైనా గొప్ప సవాల్ అని చెప్పాడు. ‘మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్లో టెస్టు క్రికెట్ ఆడటం కఠినం. అయితే సిరీస్లో ఇప్పటి వరకూ మేం బాగా ఆడాం. అదే ఆత్మవిశ్వాసంతో ఈ ఫార్మాట్లోనూ బరిలోకి దిగుతాం’ అని డు ప్లెసిస్ చెప్పాడు. -
'ఐపీఎల్ నుంచి చాలా నేర్చుకున్నాం'
న్యూఢిల్లీ: త్వరలో టీమిండియాతో జరుగనున్న ట్వంటీ 20 సిరీస్ పై దక్షిణాఫ్రికా ట్వంటీ 20 కెప్టెన్ డు ప్లెసిస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అక్టోబర్ రెండు నుంచి ఆరంభం కానున్న ట్వంటీ 20 సిరీస్ లో దక్షిణాఫ్రికా జట్టు సహజసిద్ధంగా ఆడుతుందన్నాడు. తమ జట్టులోని ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో ఆడిన అనుభవం ఎక్కువని.. దాన్ని కచ్చితంగా ఉపయోగించుకుంటామన్నాడు. 'మా ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి చాలా నేర్చుకున్నారు. ట్వంటీ 20 సిరీస్ సందర్భంగా ఐపీఎల్ మాకు లాభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు'అని డు ప్లెసిస్ తెలిపాడు. మూడు ఫార్మాట్లలో 72 రోజుల సుదీర్ఘ పర్యటన కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్తో 3 టి20లు, 5 వన్డేలు, 4 టెస్టు మ్యాచ్లలో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ నెల 29న సఫారీలు ఢిల్లీలో టి20 వార్మప్ మ్యాచ్ ఆడనుండగా... అక్టోబర్ 2న ధర్మశాలలో తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. దక్షిణాఫ్రికా వన్డే జట్టుకు డివిలియర్స్, టి20 జట్టుకు డు ప్లెసిస్, టెస్టు జట్టుకు ఆమ్లా సారథ్యం వహించనున్నారు. -
ఫైనల్లో దక్షిణాఫ్రికా
డు ప్లెసిస్ మరో సెంచరీ హరారే: ముక్కోణపు వన్డే టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 63 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ (140 బంతుల్లో 121; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించడం విశేషం. ఓవరాల్గా ఒకే వన్డే టోర్నీలో మూడు శతకాలు సాధించిన ఏడో ఆటగాడిగా డు ప్లెసిస్ నిలిచాడు. జేపీ డుమిని (62 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం జింబాబ్వే 47.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. ఫైనల్కు చేరాలంటే 25.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సిన జింబాబ్వే ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. బ్రెండన్ టేలర్ (96 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. శనివారం ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి. -
డు ప్లెసిస్, చండీమాల్లపై మ్యాచ్ నిషేధం
చిట్టగాంగ్: టి20 ప్రపంచకప్లో చాంపియన్గా నిలవాలని పట్టుదలగా ఉన్న దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లకు కీలక దశలో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్, శ్రీలంక సారథి దినేశ్ చండీమాల్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక టి20 మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుంది. దీంతో ఈ రెండు జట్ల తదుపరి మ్యాచ్లకు డుప్లెసిస్, చండీమాల్లు డగౌట్కే పరిమితం కానున్నారు. ఈ నెల 27న చిట్టగాంగ్లో జరిగిన గ్రూప్-1 లీగ్ మ్యాచ్ల్లో నెదర్లాండ్స్పై దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్పై శ్రీలంక స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో ఐసీసీ రిఫరీ డేవిడ్ బూన్ ఇద్దరు కెప్టెన్లపై ఒక టి20 నిషేధం, మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు తమ మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా జట్టు 12 నెలల కాలంలో రెండు సార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే ఆర్టికల్ 2.5.1 ఐసీసీ క్రమశిక్షణ నియమావళి కింద ఆ టీమ్ కెప్టెన్పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. డు ప్లెసిస్, చండీమాల్లపై సస్పెన్షన్ కారణంగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఆడే తదుపరి మ్యాచ్లకు డివిలియర్స్(29న ఇంగ్లండ్తో మ్యాచ్కు), మలింగ(31న న్యూజిలాండ్తో మ్యాచ్కు) కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. -
హై‘డ్రా’మా...
-
హై‘డ్రా’మా...
మహాద్భుతం... వాండరర్స్లో తొలి టెస్టు ఫలితాన్ని వర్ణించేందుకు ఈ మాట సరిపోదు. ఎవరన్నారు టెస్టు క్రికెట్ చచ్చిపోతోందని... టెస్టులపై ఆసక్తి తగ్గిపోయిందని... జొహన్నెస్బర్గ్లో చివరి రోజు ఆటను చూసినవారు ఈ మ్యాచ్లో ‘డ్రా’మాను ఎప్పటికీ మరచిపోలేరు. ఎన్నెన్నో మలుపులు... మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు... ఒకరివైపు మొగ్గిన విజయం అంతలోనే మరొకరి పక్షాన నిలుస్తూ వచ్చింది. మ్యాచ్ చివరి రోజు ఆఖరి బంతి వరకు టెస్టు క్రికెట్లో ఫలితం కోసం ఎదురు చూడాల్సి రావడం అంటే ఆ మ్యాచ్ గొప్పతనం ఏమిటో అర్థ్ధమవుతోంది. చివరి రోజు విజయానికి దక్షిణాఫ్రికా చేయాల్సిన పరుగులు 320... భారత్కు 8 వికెట్లు... మ్యాచ్ మన వైపే ఉంది. 197 వద్ద నాలుగో వికెట్ పడింది.... ఫర్వాలేదు, భారత్ ఇంకా విజయానికి చేరువైనట్లే... కనీసం ‘డ్రా’ కోసమైనా దక్షిణాఫ్రికా ప్రయత్నించగలదా అనే సందేహం. అనూహ్యంగా భారత బౌలర్ల వెనుకంజ... డు ప్లెసిస్, డివిలియర్స్ 205 పరుగుల భాగస్వామ్యం... సఫారీలు విజయంపై గురి పెట్టారు. విజయం కోసం దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 56 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లు. ఇక మ్యాచ్ చేజారినట్లే అనిపించింది. డివిలియర్స్ను అవుట్ చేసి ఇషాంత్ ఆనందం నింపాడు. ఆ వెంటనే డుమిని కూడా వెనుదిరిగాడు. జట్టులో మళ్లీ ఆశలు... అయినా సరే డు ప్లెసిస్ ఉన్నాడు. అతను, ఫిలాండర్ అప్పటికే షాట్లు మొదలు పెట్టారు. 20 బంతుల్లో 16 పరుగులు చాలు. ఊహించని విధంగా డు ప్లెసిస్ రనౌట్. అంతే... ప్రొటీస్ వెనక్కి తగ్గారు. వికెట్లు కోల్పోకూడదని నిలబడ్డారు. విజయానికి కేవలం 8 పరుగుల దూరంలో జట్టు ఆగిపోయింది. ఓటమి తప్పిందనే ఆనందం టీమిండియాలో... నెగ్గకున్నా పరాజయాన్ని తప్పించుకోగలిగామన్న సంతృప్తి ప్రత్యర్థిలో... ఫలితం ఏదైనా ఇరు జట్లు ఒక గొప్ప మ్యాచ్లో భాగమయ్యాయి. జొహన్నెస్బర్గ్: హమ్మయ్య... ఓటమికి చేరువగా వచ్చిన మ్యాచ్లో భారత్ గట్టెక్కింది. మలుపులు తిరుగుతూ చివరి వరకు ఆసక్తికరంగా సాగిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు చివరకు ‘డ్రా’గా ముగిసింది. 458 పరుగుల విజయలక్ష్యం ఛేదించే క్రమంలో 138/2 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ (309 బంతుల్లో 134; 15 ఫోర్లు), ఏబీ డివిలియర్స్ (168 బంతుల్లో 103; 12 ఫోర్లు) అద్భుత శతకాలతో ఒక దశలో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు విజయానికి చేరువైనట్లు కనిపించింది. అయితే వీరిద్దరు అవుటయ్యాక సఫారీలు తమ పోరాటాన్ని ఆపేశారు. స్టేడియంలోని తమ అభిమానుల ఆగ్రహానికి గురైనా... చివర్లో వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి ‘డ్రా’గా ముగించారు. ఆఖరి రోజు ఆట ఆరంభానికి ఎలాంటి ఆశలు లేని దక్షిణాఫ్రికా ఇక్కడి వరకు మ్యాచ్ తీసుకు రాగా... నాలుగు రోజుల పాటు ఆధిక్యం ప్రదర్శించినా ఒక్క రోజు వైఫల్యంతో టెస్టులో భారత్కు విజయం దక్కకుండా పోయింది. విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్లో చివరిదైన రెండో టెస్టు 26 నుంచి డర్బన్లో జరుగుతుంది. కట్టడి చేసిన బౌలర్లు.... 138/2 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మొదట్లో తడబడింది. 14 బంతులు ఆడినా తన ఓవర్నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే పీటర్సన్ (162 బంతుల్లో 76; 9 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. అయితే డు ప్లెసిస్, కలిస్ (37 బంతుల్లో 34; 6 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడారు. ఈ భాగస్వామ్యం 54 పరుగులకు చేరిన అనంతరం దురదృష్టవశాత్తూ కలిస్ అవుటయ్యాడు. జహీర్ బౌలింగ్లో బంతి బ్యాట్కు తగిలినా అంపైర్ నిర్ణయంతో కలిస్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఇది జహీర్ కెరీర్లో 300వ వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత డు ప్లెసిస్, డివిలియర్స్ క్రీజ్లో నిలదొక్కుకొని మరో వికెట్ పడకుండా సెషన్ ముగించారు. కీలక భాగస్వామ్యం... రెండో సెషన్లో పూర్తిగా దక్షిణాఫ్రికా ద్వయం ఆధిపత్యం ప్రదర్శించింది. ఇద్దరూ చక్కటి షాట్లతో దూసుకుపోయారు. భారత బౌలర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోవడంతో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆశించిన విధంగా చివరి రోజు పిచ్ బౌలర్లకు పెద్దగా సహకరించకపోవడం, బ్యాటింగ్కు ఇంకా అనుకూలంగానే ఉండటంతో డు ప్లెసిస్, డివిలియర్స్ స్వేచ్ఛగా ఆడారు. ఈ సెషన్లో భారత్కు ఒక్క వికెట్టూ దక్కలేదు. అనూహ్య మలుపులు... టీ విరామం తర్వాత దక్షిణాఫ్రికా విజయంపై కన్నేసింది. ఈ క్రమంలో డు ప్లెసిస్ 252 బంతుల్లో, డివిలియర్స్ 162 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఎట్టకేలకు ఇషాంత్ బౌలింగ్లో డివిలియర్స్ వెనుదిరగడంతో మ్యాచ్ పరిస్థితి మారిపోయింది. డివిలియర్స్ వికెట్లపైకి ఆడుకోగా, తర్వాతి ఓవర్లోనే డుమిని (5) కూడా షమీ బౌలింగ్లో అదే తరహాలో అవుటయ్యాడు. డు ప్లెసిస్ రనౌట్తో సఫారీలు ఆత్మ రక్షణలో పడిపోయారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 280 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 244 భారత్ రెండో ఇన్నింగ్స్: 421 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: పీటర్సన్ (బి) షమీ 76; స్మిత్ రనౌట్ 44; ఆమ్లా (బి) షమీ 4; డు ప్లెసిస్ రనౌట్ 134; కలిస్ ఎల్బీడబ్ల్యూ (బి) జహీర్ 34; డివిలియర్స్ (బి) ఇషాంత్ 103, డుమిని (బి) షమీ 5; ఫిలాండర్ నాటౌట్ 25; స్టెయిన్ నాటౌట్ 6; ఎక్స్ట్రాలు 19; మొత్తం (136 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 450 వికెట్ల పతనం: 1-108, 2-118, 3-143, 4-197, 5-402, 6-407, 7-442 బౌలింగ్: జహీర్ 34-1-135-1, ఇషాంత్ 29-4-91-1, షమీ 28-5-107-3, అశ్విన్ 36-5-83-0, మురళీ విజయ్ 1-0-3-0, ధోని 2-0-4-0, కోహ్లి 6-0-18-0. ‘నాలుగు రోజుల పాటు భారత్ ఆధిక్యం ప్రదర్శించింది. అయినా మానసికంగా మేం బలంగా ఉండటం వల్ల ఇక్కడి వరకు మ్యాచ్ను తీసుకు రాగలిగాం. గెలిస్తే ఇంకా బాగుండేది కానీ డు ప్లెసిస్ రనౌట్ దురదృష్టకరం. వారిద్దరి ఇన్నింగ్స్లు చరిత్రలో నిలిచిపోతాయి. మోర్కెల్ వంద శాతం ఫిట్గా లేడు. అతను ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేడనే డ్రా కోసం సిద్ధమైపోయాం’ -గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా కెప్టెన్ మలుపు తిప్పిన రనౌట్ దక్షిణాఫ్రికా విజయానికి 20 బంతుల్లో 16 పరుగులు అవసరం... డుప్లెసిస్ అదే ఓవర్లో భారీ షాట్తో తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. అతను క్రీజ్లో ఉంటే సఫారీ విజయం లాంఛనమే అనిపించింది. అయితే నాలుగు గంటల పాటు బ్యాటింగ్ చేసిన డు ప్లెసిస్ కూడా ఒత్తిడిని తట్టుకోలేకపోయాడేమో... లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. జహీర్ బౌలింగ్లో మిడాఫ్ దిశగా నెట్టి సింగిల్ కోసం దూసుకొచ్చాడు. అయితే చురుగ్గా ఉన్న అజింక్యా రహానే విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకింది. థర్డ్ అంపైర్ అవుట్ ఖరారు చేయడంలో డు ప్లెసిస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ పరిణామంతోనే దక్షిణాఫ్రికా విజయాన్ని పక్కన పెట్టింది. ఫిలాండర్, స్టెయిన్ చివరి 19 బంతులు ‘డ్రా’ కోసమే ఆడారు. అన్నట్లు నాలుగో రోజు ఇదే రహానే మిడాన్ నుంచి డెరైక్ట్ త్రోతో గ్రేమ్ స్మిత్ను పెవిలియన్ పంపించి ప్రత్యర్థి పతనాన్ని ప్రారంభించాడు. డు ప్లెసిస్ మరోసారి! జట్టును డుప్లెసిస్ పరాజయం బారి నుంచి తప్పించడం ఇది మొదటి సారి కాదు. ఏడాది క్రితం అడిలైడ్లో ఆస్ట్రేలియాతో టెస్టును అతను ఇదే తరహాలో రక్షించాడు. 430 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు దక్షిణాఫ్రికా 45/4 స్కోరుతో ఉన్న దశలో బరిలోకి దిగాడు. కెరీర్లో అది తొలి టెస్టు మ్యాచ్ అయినా దాదాపు ఎనిమిది గంటలు ఆడి 110 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని పోరాటంతో జట్టు ఈ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించగలిగింది. జహీర్ ఖాన్ @ 300 భారత ప్రధాన పేస్ బౌలర్ జహీర్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో జహీర్ 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో జాక్ కలిస్ను ఎల్బీగా అవుట్ చేసి అతను ఈ రికార్డును చేరుకున్నాడు. జహీర్ భారత్ తరఫున 300 వికెట్లను సాధించిన నాలుగో బౌలర్. అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (413) అంతకంటే ముందున్నారు. 13 ఏళ్ల కెరీర్లో 89 టెస్టులు ఆడిన జహీర్ 32.35 సగటుతో ఈ వికెట్లు పడగొట్టాడు. గత దశాబ్ద కాలంలో విదేశీ గడ్డపై భారత జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఖాన్... తన కెరీర్లో ఇన్నింగ్స్లో 5 వికెట్లు 10 సార్లు, టెస్టులో 10 వికెట్లు ఒకసారి తీసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్లో అతని అత్యుత్తమ ప్రదర్శన 7/87 కాగా, టెస్టులో 10/149గా ఉంది. తొలి సెషన్ ఓవర్లు: 29, పరుగులు: 98, వికెట్లు: 2 రెండో సెషన్ ఓవర్లు: 31, పరుగులు: 95, వికెట్లు: 0 మూడో సెషన్ ఓవర్లు: 31, పరుగులు: 119, వికెట్లు: 3 -
దుమ్మ రేపుతున్న దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా దుమ్ము రేపింది. ఇద్దరే ఇద్దరు బ్యాట్స్మన్ భారత్ చేతిదాకా వచ్చిన విజయాన్ని లాగేసుకున్నారు. చిట్ట చివరి రోజు వీరవిహారం చేసి భారత బౌలర్లను చీల్చి చెండాడి మరీ దూసుకెళ్తున్నారు. డుప్లెసిస్, డివీలియర్స్ ఇద్దరూ రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు విజయం దిశగా జోరుగా పరుగులు పెడుతోంది. చివరి రోజు మ్యాచ్ ప్రారంభం అయిన తర్వాత కేవలం మూడు వికెట్లను మాత్రమే భారత బౌలర్లు పడగొట్టగలిగారు. స్పిన్నర్లు వచ్చినా, పేసర్లు నిప్పులు చెరిగే బంతులు విసిరినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదు. ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండా.. కేవలం ఫోర్లు, సింగిల్స్, రెండేసి పరుగులతోనే దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ విజృంభించారు. డుప్లెసిస్ ఎక్కువగా సింగిల్స్, రెండేసి పరుగులు తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. వెటరన్ బ్యాట్స్మన్ కలిస్ను భారత వెటరన్ బౌలర్ జహీర్ ఖాన్ ఎల్బీడబ్ల్యు రూపంలో వెనక్కి పంపించి 300 వికెట్ల క్లబ్బులో చేరాడన్న ఆనందం కాస్తా డుప్లెసిస్, డివీలియర్స్ వీర విజృంభణతో ఆవిరైపోయింది. ఇద్దరూ సెంచరీలతో విజృంభించడంతో భారత బౌలర్లు నీరసపడ్డారు. కడపటి వార్తలు అందేసరికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. చివర్లో డివీలియర్స్ ను ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత అభిమానుల్లో కాస్త ఊరట కనిపించింది. వెంటనే షమీ బౌలింగ్ లో డుమిని అవుట్ కావడంతో ఆసక్తి పెరిగింది. డుప్లెసిస్ 123 పరుగులతో క్రీజ్ లో ఉండగా, డివీలియర్స్ 12 ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. -
దక్షిణాఫ్రికా బాల్ ట్యాంపరింగ్
దుబాయ్ : పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడు. శుక్రవారం మూడో రోజు ఆట సందర్భంగా అతను బంతిని ట్రౌజర్కున్న జిప్ మీద పలుమార్లు బలంగా రుద్దినట్లు టీవీ రీప్లేలో స్పష్టమైంది. దీంతో అంపైర్లు రాడ్ ఠక్కర్, ఇయాన్ గౌల్డ్లు కెప్టెన్ స్మిత్ను పిలిచి హెచ్చరించారు. దాంతో పాటు సఫారీ జట్టుకు జరిమానా విధిస్తూ పాక్ స్కోరుకు ఎక్స్ట్రాల రూపంలో ఐదు పరుగులు కలిపారు. రెండో ఇన్నింగ్స్లో 31వ ఓవర్కు ముందు ఈ సంఘటన జరిగింది. అప్పటికి పాక్ స్కోరు 67/3. అయితే సవరించిన ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ సంఘటనకు బాధ్యుడైన డుప్లెసిస్పై చర్య తీసుకునే అవకాశముంది. ఇదే జరిగితే డుప్లెసిస్పై 50 నుంచి వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత, ఒక టెస్టు మ్యాచ్, రెండు వన్డేలు లేదా రెండు టి20ల్లో నిషేధం విధించే అవకాశముంది. ఇందులో ఏది ముందు వస్తే ఆ మ్యాచ్లకు ఈ నిషేధం వర్తిస్తుంది. 2006 ఓవల్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ ట్యాంపరింగ్కు పాల్పడిందని అంపైర్లు ఐదు పరుగుల జరిమానా విధించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన అప్పటి కెప్టెన్ ఇంజమామ్ జట్టును తీసుకుని మైదానం బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఇంగ్లండ్ గెలిచినట్లు ప్రకటించారు. మళ్లీ అప్పటి మ్యాచ్ తర్వాత ట్యాంపరింగ్ జరగడం ఇప్పుడే. పాక్పై విజయం దిశగా స్మిత్సేన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్లో 55 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. మిస్బా (42 బ్యాటింగ్), అసద్ షఫీక్ (28 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పాక్ 286 పరుగులు వెనుకబడి ఉంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టం. అంతకుముందు 460/4 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 163.1 ఓవర్లలో 517 పరుగులకు ఆలౌటైంది. దీంతో 418 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.