Eating
-
ఆరోగ్యానికి మంచిదని తినేయ్యొద్దు..! కొంచెం చూసి తిందామా..
చాలా మంది తెలిసో తెలియక కొన్ని ఫుడ్స్ను ఆరోగ్యానికి మంచిదని గుడ్డిగా నమ్మి తినేస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యంగా ఉండటానికి బదులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో తెలుసా?ఫ్లేవర్డ్ ఓట్ మీల్...ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు. కానీ ఇది స్వచ్ఛమైన, సాదా ఓట్ మీల్కి మాత్రమే వర్తిస్తుంది. అయితే రకరకాల ఫ్లేవర్స్తో రకరకాల ఓట్ మీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రుచిని పెంచడానికి కృత్రిమ రంగులు, చక్కెర సిరప్ వంటి అనేక ఆరోగ్యానికి హాని చేసే వస్తువుల్ని కలుపుతారు. ఇవి తినడం మంచిది కాదు. బ్రౌన్ బ్రెడ్...ఈ రోజుల్లో మార్కెట్లో లభించే బ్రౌన్ బ్రెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి పేరుకు మాత్రమే బ్రౌన్ బ్రెడ్స్. చాలా మంది వీటిని చౌకగా అమ్ముతున్నారు. అంటే ఇలాంటి బ్రౌన్ బ్రెడ్లో శుద్ధి చేసిన పిండి, కృత్రిమ రుచి, రంగు, చక్కెరను ఉపయోగిస్తున్నారని అర్థం. అందుకే బ్రౌన్ బ్రెడ్ కొనేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే మంచి బ్రాండ్ కొనడం మేలు.ప్యాక్ చేసిన పండ్ల రసాలు లేదా స్మూతీలు...మార్కెట్లో వివిధ రకాల పండ్ల రసాలు, స్మూతీలు ప్యాకెట్లలో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యానికి మంచిదని వీటిని తెగ కొనేస్తున్నారు. నిజానికి, ఈ ప్యాక్ చేసిన జ్యూస్లలో కృత్రిమ రంగులు, చక్కెర, కృత్రిమ రుచులు మొదలైన అనారోగ్యకరమైన వస్తువులు కూడా ఉంటాయి. అందుకే వీటిని కొనే ముందు వాటి ΄్యాక్ చెక్ చేస్తే పండ్ల రసాలు, స్మూతీల్లో ఏం వాడారో తెలుస్తుంది.ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్...ఈ రోజుల్లో స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగే అలవాటు చాలా మందికి ఉంది. అయితే, ఈ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని తాగడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుందేమో కానీ.. రాను రాను అనారోగ్యం కూడా వస్తుంది. పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రింక్స్ తాగనివ్వకండి. వీటి బదులు ఇంట్లో చేసుకున్న పండ్ల జ్యూస్లు బెస్ట్.బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్...ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మార్కెట్లో బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ అమ్ముతున్నారు. చాలా మంది ఈ ప్యాకేజ్డ్ మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిదని భావించి కొని తింటున్నారు. నిజానికి వీటిని తయారు చేయడానికి అదనపు చక్కెర, కత్రిమ రుచి కలుపుతారు. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా ఉండదు. వీటి బదులు సహజంగా దొరికే తృణధాన్యాలతో ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. -
వైట్ స్కర్ట్లో పిజ్జా ఆరగిస్తోన్న నభా నటేశ్.. ఈ ఫోటోలు చూశారా?
-
పుల్ల పుల్లగా.. తియ్యతియ్యగా.. మామిడి భలే రుచి అంటున్న నిహారిక (ఫోటోలు)
-
అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు!
‘రుచికరంగా హాయిగా తినేసి పెందళాడే కన్నుమూస్తే మటుకు దేశానికి వచ్చిన నష్టమేంటి? భూమికి భారం తగ్గుతుంది కదా’ అంటూ కొందరు వితండవాదం చేస్తుంటారు. ఇక్కడ సమస్య త్వరగా కన్నుమూయడమా లేక చాలాకాలం పాటు జీవించడమా అని కాదు. ఉన్నన్నాళ్లూ ఎవరికీ భారం కాకుండా హాయిగా ఉండటం. ఆరోగ్యం బాగాలేక సుదీర్ఘకాలం మంచం పట్టి ఉండటమూ కోరుకునే అంశం కాదు, అలాగే పూర్తి ఫిట్నెస్తో ఉన్నవాళ్లు త్వరగా పోవడమూ అభిలాషణీయం కాదు. అందుకే ఉన్నన్నాళ్లూ ఆరోగ్యంగా, ఎవరికీ భారం కాకుండా, చురుగ్గా హాయిగా ఉండటం అన్నదే ఎవరికైనా కావాల్సింది. అందుకు మంచి ఆహారపు అలవాట్లు బాగా ఉపయోగపడతాయి. అదే చెడు ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం దెబ్బతిని మరణం రాకపోయినా మంచాన పడి నిరర్థకంగా ఉండాల్సి రావచ్చు. అందుకే మంచి ఆహారపు అలవాట్లు ఎల్లవేళలా మంచివే. చెడు ఈటింగ్ హ్యాబిట్స్ ఎప్పుడూ దూరంగా ఉండాల్సినవే. ఈ నేపథ్యంలో మంచి, చెడు ఆహారపు అలవాట్లపై కాస్తంత అవగాహన కోసం ఈ కథనం...మంచి ఆరోగ్యానికి మంచి ఆహారపు అలవాట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటివల్ల మంచి వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది. దాంతో అద్భుతమైన వ్యాధి నిరోధకత సమకూరుతుంది. దీని వల్ల కలిగే ఉపయోగాలు తక్షణం బయటకు కనిపించక΄ోవచ్చుగానీ... మంచి ఇమ్యూనిటీ వల్ల తప్పక మంచి జరుగుతుంది. గతంలో కోవిడ్ సమయంలో వైరస్ తీవ్రంగా ప్రభావం చూపినప్పటికీ వ్యాధి నిరోధక శక్తి పటిష్టంగా ఉన్నవారే బతికి బయటపడ్డారు. బ్రేక్ఫాస్ట్ మిస్ చేసుకోకపోవడంఒకవేళ ఆహారపు అలవాట్లు బాగా లేకపోతే ఆ ప్రతికూల ప్రభావాలు వెంటనే కనిపిస్తాయి. ఇటీవల చాలామందిలో పొట్ట ఉబ్బరంగా ఉందనో, రాయిలా మారిందనో, తినగానే కడుపు ఉబ్బి΄ోయి, తేన్పులు వస్తూ, ఛాతీ మీద చాలా బరువుందనో అంటూ ఉండటం తరచూ చాలామందిలో కనిపించేదే. ఇవి ఆహారపు అలవాట్లలో తేడా వల్ల కనిపించే తొలి లక్షణాలు. మంచి ఆహారపు అలవాట్లతో కలిగే మేళ్లతో పాటు చెడు ఆహారపు అలవాట్లతో కలిగే దుష్ప్రభావాలను తెలుసుకుంటే చాలాకాలం పాటు పూర్తి ఆరోగ్యంతో, మంచి ఫిట్నెస్తో జీవించవచ్చు. ఈ సందర్భంగా ఆరోగ్యకరంగా జీవించడానికి మంచి ఆలవాట్లు ఏమిటో, అనారోగ్యం తెచ్చుకోవడానికి చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం...చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడంతినే ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం మంచిది. అంటే ఉదయపు టిఫిన్ (బ్రేక్ ఫాస్ట్), మధ్యాహ్న భోజనం (లంచ్),సాయంత్రపు పలహారం (ఈవినింగ్ శ్నాక్స్), రాత్రి భోజనం (సప్పర్/డిన్నర్) అంటూ ఇలా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార.్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అంతగా భారం పడదు. పైగా ఇలా తినడం వల్ల దేహానికి అవసరమైన శక్తి (ఎనర్జీ) ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. కొందరు చాలా తక్కువసార్లు... ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటుంటారు. చాలా బిజీగా ఉండేవారు సమయం లేదనో లేదా తినే సమయంలో మరో పని పూర్తవుతుందనే భావన వల్లనో రెండు పూటలే తింటుంటారు. ఇలా తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల పొట్ట ఉబ్బరంగా మారడం, పొట్ట రాయిలా గట్టిగా అనిపించడం, తినగానే పొట్ట ఉబ్బి΄ోయి ఎంతగానో అసౌకర్యంగా అనిపించడం (దీన్నే భుక్తాయాసం అని కూడా చెబుతుంటారు), తిన్నవెంటనే భోజనం ఛాతీకి అంటుకునే ఉన్నట్లు అనిపించడం లాంటి ఫీలింగ్, ఛాతీలో మంట, కడుపులో ఒకలాంటి నొప్పి, పుల్లటి తేన్పులు వంటి లక్షణాలు కనిపించడం మామూలే. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు ఇంటికి ఒక్కరైన ఉండటం ఈ రోజుల్లో చాలా సాధారణం. ఇక ఏయే వేళకు తినాల్సిన భోజనాన్ని ఆయా వేళల్లో తినడం, అలాగే రాత్రి భోజనాన్ని చాలా త్వరగా తినేయడంతోపాటు ఒకసారి రాత్రి భోజనం అయ్యాక మెలకువగా ఉన్న సమయంలో మళ్లీ మరేమీ తినకుండా జాగ్రత్త పడటం అవసరం. అలా కాకుండా రాత్రి భోజనం తర్వాత మెలకువగా ఉన్నప్పుడు తినడం వల్ల పొట్ట పెరిగి, అది రోగాల పుట్టగా పరిణమించడంతోపాటు కాస్మెటిక్గానూ బాగా కనిపించక΄ోవచ్చు. అన్ని పోషకాలూ లభ్యమయ్యే సమతుల ఆహారంతీసుకునే ఆహారంలో అన్ని రకాల ΄ోషకాలు ఉండాలన్నది ప్రధానం. అవేమీ లేని భోజనం చాలా పరిమాణంలో తిన్నా అది వృథాయే. అందుకే తక్షణ శక్తినిచ్చే పిండిపదార్థాలూ (కార్బోహైడ్రేట్లు), కణాలూ, కణజాలాలలను రిపేర్ చేసి, వాటిని పునర్నిర్మించే ్ర΄ోటీన్లు, దేహానికి అవసరమైన కొవ్వులతో΄ాటు, ఖనిజలవణాలూ, విటమిన్లు, మళ్లీ ఈ ΄ోషకాల్లోనూ ఎక్కువ మోతాదుల్లో అవసరమయ్యే మ్యాక్రో న్యూట్రియెంట్లు, తక్కువ మోతాదుల్లోనైనా తప్పనిసరిగా కావాల్సిన మైక్రో న్యూట్రియెంట్లు... ఇవన్నీ సమృద్ధిగా ఉండేలా మన భోజనం ఉండాలి. ఇలా అన్నీ సమ΄ాళ్లలో కలిగి ఉండే భోజనాన్ని ‘సమతులాహారం’ (బాలెన్స్డ్) అంటారు. ఇవన్నీ ఉండాలంటే భోజనంలో పిండిపదార్థాలనిచ్చే బియ్యం, గోధుమలు, ్ర΄ోటీన్లకోసం పప్పులు, మాంసాహారం, కొవ్వుల కోసం నూనెలతోపాటు ఆకుకూర.లు, కూర.గాయలు; విటమిన్లను సమకూరుస్తాయి తాజాపండ్లు తీసుకోవాలి. అయితే ఇక్కడ కొవ్వుల కోసం నూనెలు తీసుకునేప్పుడు వాటిని రుచి కోసం కాక దేహ అవసరాల కోసం మాత్రమే... అంటే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ల కోసం మాంసాహారం మీద ఆధారపడేవారు అంతగా ఆరోగ్యకరం కాని రెడ్ మీట్ (వేట మాసం) కంటే ఆరోగ్యకరమైన వైట్ మీట్ (చికెన్, చేపల వంటివి) తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడంమానవ శరీరరంలో 75 శాతం నీళ్లే ఉంటాయి. శరీరం ద్రవాలను కోల్పోవడాన్ని ‘డీ–హైడ్రేషన్’గా చెబుతారు. వేసవికాలంలో వడదెబ్బ వల్ల ఇలా దేహం ద్రవాలను కోల్పవడం జరిగి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఇలాంటి అనర్థం జరగకుండా ఉండాలంటే ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగడం అవసరం. ఇక మెదడు నుంచి నరాల ద్వారా ఆయా దేహభాగాలకు అందాల్సిన ఆదేశాలన్నీ లవణాల వల్లనే జరుగుతుంది. ఆ లవణాలు అలా చేరవేయడానికి వీలుగా మారడానికి నీళ్లలో కరగడం వల్లనే జరుగుతుంది. అందుకే నీళ్లూ, లవణాలను కోల్పోకుండా ఉంటేనే మెదడునుంచి ఆయా అవయవాలకు అందాల్సిన ఆదేశాలు అందుతూ దేహం సక్రమంగా పనిచేస్తుంటుంది. అందుకే దేహం తాలూకు జీవక్రియలన్నింటికీ అవసరమైనన్ని నీళ్లు తాగుతుండటం అవసరం. మానవులు ఎన్ని నీళ్లు తాగాలనేదానికి ఓ కొండగుర్తు ఏమిటంటే... మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు మూత్రం పచ్చగా, బాగా గాఢంగా లేకుండా వీలైనంతగా నీళ్లలా ఉండాలి. మూత్రం అలా పచ్చగా, గాఢంగా ఉందంటే దేహంలో నీళ్లు తగ్గాయనడానికి నిదర్శనం. మూత్రం అలా ఉందంటే అలాంటప్పుడు తక్షణం శరీరానికి అవసరమైన నీళ్లు తాగాలని, అలా తాగడం ద్వారా దేహానికి అవసరమైనన్ని నీళ్లు (హైడ్రేషన్) సమకూర్చాలని అర్థం. బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోవడంచాలామందిలో ఒక దురలవాటు ఉంటుంది. ఆహారం తీసుకునే సమయాన్ని ఆదా చేయడం కోసం ఉదయం తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ మిస్ చేసి నేరుగా మధ్యాహ్న భోజనం తీసుకుంటుంటారు. రోజువారీ వ్యవహారాలకు అవసర.మైన శక్తి అందడానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ మంచి అలవాటు అన్నది తెలిసిందే. అందుకే బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకూడదు. ఎక్కువ పరిమాణాన్ని తక్కువ సార్లు తినడంఎక్కువ పరిమాణంలో తక్కువసార్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలా ఎక్కువ మోతాదుల్లో తక్కువ సార్లు తినడం వల్ల... కడుపులో ఆహారం లేని సమయంలోనూ ఆహారాన్ని అరిగించే ఆమ్లాలు జీర్ణవ్యవస్థ గోడలపైనా, పేగులపైన పనిచేయడంతో ఒక్కోసారి అది అల్సర్స్కు కారణం కావచ్చు. అటు తర్వాత ఆ అల్సర్స్ కారణంగా పేగులకు రంధ్రం పడటం వల్ల జీర్ణవ్యవస్థ / కడుపు / పేగుల్లోనే ఉండాల్సిన ఆహారం, జీర్ణ స్రావాలూ దేహ కుహరంలోకి ప్రవేశించడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. తగినన్ని మంచినీళ్లు తాగకపోవడంచాలామంది పనుల్లో పడిపోయి తాగాల్సినన్ని మంచినీళ్లు తాగరు. మరికొందరు ఆఫీసుల్లోని ఏసీ కారణంగా ఆ చల్లటి వాతావరణంలో ఉండటం వల్ల దాహం వేయక తగినన్ని నీళ్లు తాగరు. ఈ రెండు పరిణామాల్లోనూ ఆరోగ్యానికి చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు దేహానికి అవసరమైన నీళ్లు, లవణాలు అందక పిక్కలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్)తో పాటు కిడ్నీలో రాళ్లు రావడం వంటి అనర్థాలు చోటు చేసుకునే అవకాశముంది. అందుకే ప్రతిరోజూ ప్రతిఒక్కరూ దేహానికి అవసరమైనన్ని నీళ్లు తాగాలి. ఫాస్ట్ ఫుడ్ / జంక్ఫుడ్ తినడంఆధునిక జీవనశైలిలో పనివేళలూ, పనిగంటలూ పెరగడం, కొత్త తరహా పనులు, వృత్తుల వల్ల జీవితం ఉరుకులు పరుగులతో సాగడం వల్ల సమయం దొరకడం కష్టంగా మారింది. దాంతో మార్కెట్లో తేలికగా దొరకడంతో ΄ాటు అప్పటికప్పుడు తినగలిగే జంక్ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం ఓ ట్రెండ్గా మారింది. నిజానికి చెడు అలవాట్లలో ఈ ఫాస్ట్ఫుడ్ / జంక్ఫుడ్ ముఖ్యమైనది. ఈ తరహా ఆహారంలో ఉండే రిఫైన్డ్∙పిండిపదార్థాల వల్ల డయాబెటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు... వీటికి తోడు చాలాకాలం నిల్వ ఉండటానికి వీలుగా (షెల్ఫ్లైఫ్ను పెంచడానికి) వీటిలో వాడే ప్రిజర్వేటివ్స్, అనారోగ్యకరమైన నూనెలు, అలాగే ఆహారపదార్థాల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడం కోసం వాడే రంగుల వల్ల ఇలాంటి జంక్ఫుడ్స్ అనేక రకాల క్యాన్సర్లకు కారణంగా మారుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. అందుకే వీలైనంతవరకు జంక్ఫుడ్ను తీసుకోక΄ోవడమే మంచిది. మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి అదికూడా చాలా పరిమితంగా వాటిని తీసుకోవాలి. మితిమీరి తీపిపదార్థాలు తినడంచాలామంది తీపిపదార్థాలనూ, మిఠాయిలను ఇష్టపడతారు. అయితే వీటిని మరీ మితిమీరి తినడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయి. తీపితో వచ్చే నష్టాలు తొలుత నోటిలో నుంచే మొదలవుతాయి. నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సూక్ష్మజీవులు పెర.గడం, వాటితో పళ్లు దెబ్బతినేలా లేదా పుచ్చి΄ోలాయే దంతక్షయం వంటి నష్టాలు సంభవిస్తాయి. మితిమీరి తీపిపదార్థాలు తినడం క్యాన్సర్కు ఒక కారణమంటూ చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది. ఇక కొంతమంది తమ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా టీ, కాఫీలు చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. రెండు లేదా మూడు కప్పుల పరిమితికి మించి కాఫీ, టీలు తాగడం తాగడం ఒకరకమైన నష్టాన్ని తెస్తే... అందులోని తీపి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చేటుగా పరిణమిస్తుంది. తినడానికి కనీసం అరగంట ముందు గానీ లేదా తిన్న అరగంట తర్వాత గానీ టీ తాగకూడదు. అలా టీ / కాఫీలు తాగితే తిన్న ఆహారంలోని ఐరన్ ఒంటికి పట్టదు. కూల్ బీవరేజెస్చాలామందికి కూల్డ్రింకులు, కోలా డ్రింకులు, శీతల ΄ానియాల వంటివి తాగుతుండటం అలవాటు. వీటిని తీసుకోవాల్సి వచ్చినా చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయక΄ోగా, కొన్ని అనర్థాలు కూడా తెచ్చిపెట్టే అవకాశముంది. పైగా వీటిలోని కెఫిన్ రాత్రి నిద్రపట్టకుండా చేసే అవకాశమున్నందున వీటిని రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు అస్సలు తీసుకోకూడదు. వీటివల్ల అసిడిటీ వంటి సమస్యలూ వచ్చే అవకాశముంది. వీటిలోని మితిమీరిన చక్కెరల వల్ల... డయాబెటిస్ మొదలుకొని అనేక సమస్యలు రావచ్చు. ఆల్కహాల్ అలవాటుతో అనర్థంఆల్కహాల్ ఆరోగ్యానికి చేటు తెచ్చే ప్రమాదకరమైన అలవాటు. దీనికి తోడు కొంతమంది ఆల్కహాల్తో పాటు కోలా డ్రింకులు కలుపుకుంటారు. దీంతో రెట్టింపు దుష్ఫలితాలు కలుగుతాయి. ఆల్కహాల్ వల్ల కడుపులోని లైనింగ్స్ దెబ్బతినడంతో పాటు అసిడిటీ, అల్సర్లు వస్తాయి. మద్యం అలవాటు లివర్ను దెబ్బతీసి, మొత్తం జీర్ణవ్యవస్థ పనితీరునే దెబ్బతీస్తుంది. ఇక ఆల్కహాల్ తాగే సమయంలో చాలామంది వేపుడు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. వాస్తవానికి వేపుళ్లు అంత మంచి ఆహారపు అలవాటు కానే కాదు. ఇలా ఎన్నో ఆరోగ్య అనర్థాలకు దారితీసే ఆల్కహాల్ అలవాటును పూర్తిగా వదిలేయాలి. చెడు ఆహారపు అలవాట్లివి... అంటే మంచి ఆహారపు అలవాట్లను అనుసరించక΄ోవడాన్ని చెడు ఆహారపు అలవాట్లుగా చెప్పవచ్చు. అంటే సమతులాహారం తీసుకోకపోవడం, వేళకు తినక΄ోవడం, తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినడం, తాజాపండ్లు తీసుకోక΄ోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం ఇవన్నీ ఆహారపరమైన చెడు అలవాట్లు. అయితే ఇవ్వాళ్టి మానవ జీవనశైలిలో ఇలాంటి చెడు ఆహారపు అలవాట్లు కాస్తంత ఎక్కువే. పైగా అవన్నీ ఇవ్వాళ్టి ఆహారపు ఫ్యాషన్లుగా కూడా కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కొన్ని చెడు ఆహారపు అలవాట్లేమిటో చూద్దాం. -
అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..!
చాలా మంది సరిగా భోజనం చేయరు. ఏమీ తినాలనిపించడం లేదనీ, తమకు అన్నం సయించడం లేదనీ చెబుతుంటారు. సాధారణంగా కాస్త పెద్దవయసు వచ్చాక ఇలాంటి మార్పు చాలామందిలో కనిపిస్తుంది. ఇలాంటివారు ఎలా తినాలో, ఎలా తినడం వల్ల తమకు అందాల్సిన పోషకాలు అందుతాయో తెలుసుకుందాం.అన్న సయించనివారు ఏదో తినడం కోసమంటూ చాలా తక్కువగానే తింటున్నప్పటికీ ఆ భోజనం అన్ని పోకాలూ అందేలాంటి బ్యాలెన్స్డ్ డైట్తో కూడిన మీల్ గా ఉండాలి. అంటే అందులో దేహానికి అవసరమైన పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు వంటివి పుష్కలంగా అందేలా కాయధాన్యాలూ, పప్పుధాన్యాలు, తినేవారైతే మాంసాహారంలోని వేటమాంసం, కోడిమాంసం, చేపలు, ఇక మిగతా అందరూ ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు, తాజా పండ్లు ఇవన్నీ.ఎంత ఆహారం అవసరమంటే... ఓ వ్యక్తికి ఇంత ఆహారం అవసరమని నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే... ఓ వ్యక్తికి ఎన్ని క్యాలరీల ఆహారం అవసరం అన్నది... వారి వయస్సు, వారు పురుషుడా/వుహిళా, వాళ్ల బరువు, వాళ్లు రోజువారీ చేపే పనులు, అవి శ్రమతో కూడినవా, లేక ఒకేచోట కూర్చుని చేసేవా... ఇలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.అన్నం సయించని వారు తినే వాటిల్లోనే రుచిగా... అన్నం సయించడం లేదంటూ పెద్దగా ఆహారం తీసుకోనివారు... తాము తినే ఆ కొద్దిపాటి ఆహారంలోనే వీలైనన్ని రకరకాల పదార్థాలు రకరకాల పద్ధతుల్లో కాస్తంత నాలుకకు రుచిగా వండినవి, తినేందుకు ప్రయత్నించాలి. ఆహారంలోనూ అనేక రకాలు (వెరైటీస్) వండి తీసుకోవడం వల్ల ... అవి కొన్నీ, ఇవి కొన్నీ తీసుకుంటూ చాలా రకాలు ఉండటం వల్ల తీసుకోవాల్సిన పరిమాణం అంతో ఇంతో భర్తీ అయ్యే అవకాశం ఉంది. దాంతో వారు తీసుకోవాల్సిన రోజువారీ ఆహారపు పరిమాణం చాలావరకు అందే అవకాశముంది.ఇదీ సాధారణ డైట్ ప్లాన్... అన్నం సయించనివారు ఈ కింది సాధారణ డైట్ ప్లాన్ అవలంబిస్తే మంచిది. ఇలాంటివాళ్లంతా రోజూ తమ రోజువారీ ఆహారంలో చపాతీ లేదా అన్నంతోపాటు పప్పులు (దాల్) లేదా శెనగలు, రాజ్మా వంటివి తీసుకోవడం మంచిది. వీటి కారణంగా వారికి అవసరమైన కార్బోహైడ్రేల్లు,ప్రోటీన్లు సమకూరుతాయి. భోజనం చివర్లో ఓ కప్పు పెరుగుతో పెరుగన్నం తినాలి. భోజనానికి ముందు క్యారట్, కీర, దోస వంటి కూరగాయలను సలాడ్స్గా తీసుకోవాలి. ప్రతిరోజూ పడుకోబోయే వుుందు ఓ కప్పు పాలు తాగితే కొద్దిమేర ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాల్షియమ్ సమకూరుతాయి. తినే పరివూణం తక్కువైనా, అందులోనే ఆ సీజన్లో దొరికేవైన తాజా పండ్లను సాధ్యమైనన్ని తీసుకోవాలి. చాలా తరచుగా అప్పుడప్పుడూ తృణధాన్యాలతో ఏవైనా వంటకాలను చిరుతిండ్లలా చేయించుకుని తినాలి. చిరుతిండి కాబట్టి ఈ శ్నాక్స్ రుచిగా ఉండి, బాగా తినాలని అనిపిస్తాయి.ఇలా ఇన్ని వెరైటీలుగా రకరకాల ఆహారాల్ని తీసుకోవడం వల్ల ఒంటికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాలూ, మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లు... అన్నీ అందేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకుంటే తక్కువగానే తింటున్నప్పటికీ అవసరమైన పోషకాలన్నీ చాలావరకు దొరుకుతాయి. (చదవండి: గుండెకు మేలు చేసే పండ్లు..!) -
Health: మీకు తెలుసా.. అతి తిండీ అడిక్షనే!
నా వయసు 25 సం‘‘లు. కొన్ని నెలలుగా నేను విపరీతంగా తింటున్నాను. ఈ మధ్య 15 కేజీలు బరువు పెరిగాను. ‘స్ట్రెస్’కు లోనైనప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడు తినడం మరీ ఎక్కువ. ఎలాగైనా ఈ అతి తిండి అలవాటు నుండి బయటపడాలని ఉంది. మీరే ఏదైనా సలహా చెబుతారనే ఆశతో ఉన్నాను. – రజని, విశాఖపట్నంపండుగల్లాంటి ప్రత్యేక సందర్భాలలో కొంచెం ఎక్కువగా తినడం మనందరికీ మామూలే! మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, బహుశా మీరు ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనైనట్లు తెలుస్తుంది. 25–30 సం‘‘ల మహిళల్లోను, 40–45 సం‘‘ల పురుషుల్లోనూ ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నా. మెదడులోని రసాయనాలలో వచ్చే మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.అతి తక్కువ సమయంలో, ఫాస్ట్గా తినడం, కడుపు నిండినా ఆపుకోలేకపోవడం, బరువు పెరిగి గిల్టీగా ఫీలవడం, ఇన్ఫీరియారిటీకి, డిప్రెషన్కు లోనవడం జరుగుతుంది. ఒక విధంగా దీనిని ‘ఫుడ్ అడిక్షన్’ అనవచ్చు. మీలాంటి వారిలో మిగతా అడిక్షన్స్ లాగానే ఈ సమస్యను కూడా కొన్ని మందులతోను, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపి, జీవనశైలిలో మార్పులు, డైట్ కౌన్సెలింగ్తో మంచి మార్పులు తీసుకురావచ్చు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్’ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నా. సైకియాట్రిస్ట్ను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్! -
హాట్టాపిక్గా సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ హెల్తీ డైట్..!
బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆయనకు ఫ్యాన్సే. ప్రస్తుతం ఆయన 'సికందర్'మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత అంగ రక్షకుడు షేరా డైట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. సల్మాన్ ప్రతి షోకి వెంట ఉంటే షేరా గురించి పాటించే ఆహార నియమాలపై సల్మాన్ అభిమాను కుతుహలం ఎక్కువ. ఎందుకంటే భాయిజాన్ను రక్షించే అతడు కూడా మంచి ఫిట్గా కనిపించడమే అందుకు కారణం. అనునిత్యం సల్మాన్ని రక్షిస్తుండే అతడు ఏం తింటాడు దాని గురించి అభిమానులు ఆసక్తిగా ఉంటారు. అయితే షేరా ఒక ఇంటర్వ్యూలో తన డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ప్రతిదీ హ్యాపీగా తింటానని, కానీ బ్రెడ్, రోటీ లేదా శుద్దీ చేసిన ఆహారాల జోలికి మాత్రం పోనని అన్నారు. అంతేగా రోజంతా యాక్టివిగ్ ఉండేందుకు కచ్చితంగా భోజనానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తప్పనిసరిగా వ్యాయామం చేస్తానని చెప్పారు. ఆరోగ్యంగా ఉండేలా సరైన వంటకాలను ఎంచుకోవాలని చెబుతున్నాడు. అలాగే సల్మాన్తో తనకు గల విడదీయరాని బంధం గురించి చెప్పారు. అలాగే తన కొడుకు హీరోగా లాంచ్ చేసే విషయంలో సల్మాన్ తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. అలాగే తమ మధ్య ఎలాంటి సాంస్కృతిక విభేదాలు తలెత్త లేదని చెప్పారు. కాగా, సల్మాన్కి అంగరక్షకుడిగా 1990ల నుంచి పనిచేశాడు. ఆ తర్వాత 2019లో రాజకీయల్లోకి ప్రవేశించారు. అయితే ఆయన సల్మాన్ని రక్షించడంలో చాలా అంకితభావంతో పనిచేస్తాడని పేరు ఉండటం విశేషం.(చదవండి: ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం! పరిశోధకుల స్ట్రాంగ్ వార్నింగ్) -
నటుడు ఆశిష్ విద్యార్థి ఇష్టపడే బెస్ట్ ఫుడ్ ప్లేస్లు ఇవే..!
నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్గా, సహానటుడిగా నటనలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన ఇటీవల యూట్యూబర్గా, పబ్లిక్ స్పీకర్గా ప్రజలకు మరింత చేరువయ్యాడు. అంతేగాదు ఫుడ్ వ్లాగింగ్ పేరుతో దేశంలోని ప్రసిద్ద రుచికరమైన వంటకాల గురించి అన్వేషించడం, వాటిని తన అభిమానులకు తెలియజేయడం వంటివి చేస్తాడు. చెప్పాలంటే చాలామందికి తెలియని కొంగొత్త తినుబండారాల గురించి పరిచయం చేస్తాడు. అంతేగాదు ఒక ఇంటర్యూలో వివిధ ప్రాంతాల్లో తనకు ఇష్టమైన ఫుడ్ ప్లేస్లు గురించి షేర్ చేసుకున్నారు కూడా. అవేంటంటే..ఫుడ్ వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్తో భారతదేశంలో ట్రై చేయగల బెస్ట్ ఫుడ్ ప్లేస్లు గురించి చెప్పుకొచ్చారు. కోల్కతా ఆహారం అద్భుతమైనదని, అక్కడ కచోరిలతో రోజుని ప్రారంభించమని చెప్పాడు. అందుకోసం మహారాజా(చంగని పప్పి మహారాజ్, బారా బజార్, నింబుతల్లాలో ఉంది), శర్మ టీ స్టాల్ (భవానీపూర్లో).రెండు కూడా ప్రసిద్ధ తినుబండారాలే. అలాగే ఆల్ టైం ఫేవరెట్ తినుబండారం అయిన బిర్యానీ కోసం అర్సలాన్ రెస్టారెంట్, హంగ్లాథెరియం (లేక్ గార్డెన్స్లో) రెండింటిని ప్రయ్నత్నించొచ్చని చెప్పాడు. బెంగళూరులో 1943లో స్థాపించిన శాఖాహర రెస్టారెంట్లో తినొచ్చని అన్నారు. అక్కడ ప్రసిద్ద కన్నడ ఫుడ్ మంచి రుచిగా అందిస్తారని అన్నారు. నిజానికి దీన్ని సమీపంలోని పాఠశాలల్లోని విద్యార్థుల కోసం శ్రీ వెంకటరమణ ఉరల్చే చిన్న క్యాంటీన్గా ప్రారంభించారు. ఆ తర్వత బెంగళూరుని సందర్శించే వాళ్లకు బెస్ట్ ఫుడ్ ప్లేస్గా పేరుగాంచింది. అలాగే కేరళలోని పాలక్కాడలో తనకు నచ్చిన బిర్యానీ స్పాట్ గురించి చెప్పారు. హసిన్ కిచెన్లో చేసే తలస్సేరి దమ్ బిరియానీ, రుచికరమైన చేపల కూర, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇక హిమచల్ప్రదేశానికి వస్తే.. బరోగ్లోని చాచు డా ధాబాలో పరాథే ప్రయత్నించమని, అలాగే చండీగఢ్లోని పష్తున్ రెస్టారెంట్ రాన్ ప్లేట్ను ఆస్వాదించమని సూచించారు.(చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తినే ఛాలెంజ్ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయింది. చైనాలో 24 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాన్ జియోటింగ్ లైవ్ టెలికాస్ట్లో ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ చనిపోయారు. ఈ సంఘటన జూలై 14న జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇన్ఫ్లుయెన్సర్ పాన్ జియోటింగ్ ఈటింగ్ ఛాలెంజ్లు చేయడంలో ప్రసిద్ధి. ఆమె నిర్విరామంగా 10 గంటల కంటే ఎక్కువసేపు తినడం వల్ల మరణించినట్లు సమాచారం. స్థానిక చైనా మీడియా వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో ప్రతి ఈటింగ్ ఛాలెంజ్లో 10కిలోల కంటే ఎక్కువ ఆహారాన్ని తినేదని తెలుస్తోంది. ఇలా అతిగా తినడం మంచిది కాదని.. ఆమె కుటుంబసభ్యులు వారించినా పట్టించుకోలేదు.ఇలా చివరికి అదే ఈటింగ్ ఛాలెంజ్లో పాల్గొని ప్రాణాలో పోవడంతో విషాదం నెలకొంది. జియోటింగ్ మరణం అనంతరం పోస్ట్మార్టం రిపోర్ట్లో జీర్ణించుకోలేని విధంగా ఆహారం తినడం వల్లే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. -
భారత్లో బ్రెయిన్-ఈటింగ్ డిసీజ్ కలకలం
భారత్లో బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ కలకలం రేగింది. మెదడును తినే అమీబా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి సోకిన కేరళలోని కోజికోడ్కు చెందిన 14 ఏళ్ల మృదుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం అతనికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం)అని పిలుస్తారు.ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోకి చేరినప్పుడు, నాలుగు రోజుల్లోనే అది మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలో ఇది మెదడులో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ నలుగురు మరణించారు. అయితే.. దీనికి ముందు కూడా మన దేశంలోని వివిధ ఆసుపత్రులలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి బారినపడి కేరళ, హర్యానా, చండీగఢ్లలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. వీటిలో ఆరు మరణాలు 2021 తర్వాత నమోదయ్యాయి. కేరళలో మొదటి కేసు 2016లో వెలుగులోకి వచ్చింది.అప్రమత్తమైన కేరళ ప్రభుత్వంఅమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ నివారణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ కూడా మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్స్లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని, చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున వారు నీటి వనరులలోకి ప్రవేశించినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్విమ్మింగ్ చేసే సమయంలో నోస్ క్లిప్లను ఉపయోగించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ వేణు, ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజన్ ఖోబ్రగాడే తదితరులు పాల్గొన్నారు. -
బయట తినేటప్పుడు జర భద్రం..!
వీధి వీధికి ఒక రెస్టారెంట్, చిన్న చిన్న ఫుడ్ సెంటర్లు తెగ ఆకర్షణీయంగా దర్శనమిస్తుంటాయి. అందులోకి ఇప్పుడూ స్విగ్గీ, జోమాటో వంటి ఆన్లెన్ ఫుడ్ డెలివరీల పుణ్యమా అని బయట భోజనంపై ఆధారపడిపోతున్నారు చాలామంది ప్రజలు. కానీ ఇటీవల కాలంలో ప్రముఖ రెస్టారెంట్లలోనే నాసిరకం భోజనం, ఎక్స్పైరీ తేదీ దాటిని వాడుతున్నట్లు ఆహార భ్రద్రత అధికారులు జరిపిన దాడుల్లో తేలింది. ఇవి మరువక మునుపమే రీసెంట్గా హైదరాబాద్లో ఓ వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే..అందులో ఏకంగా చికెన్ పీస్లో పురుగులు బయటపడ్డాయి. వాటికి మించి..అన్నట్లుగా బయట ఆహారానికి సంబంధించి వెలుగులోకి రాని భయానక ఘటనలు కొన్ని ఇక్కడ జరిగాయి. ఇవి చూస్తే బయట భోజనం సురక్షితమేనా..? అనే సందేహం వచ్చేస్తుంది. అవేంటో చూద్దామా..మనం ఎప్పుడూ ఒకరు తిని వదిలేసిన ఆహారాన్ని లేదా కుళ్ళిన ఆహారాన్ని తినము. కానీ భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితే దాపురించింది!. ఎలా అనే కదా..? ఇటీవల రియల్గా జరిగిన ఘటన ఇది. కాస్త పేర్లు మార్చాం. కొద్ది రోజుల క్రితం రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన స్నేహితుడుతో కలిసి ఒక ప్రసిద్ధ రెస్టారెంట్కు వెళ్లారు. సాధారణంగా రవికి బయటన భోజనం తినే అలవాటు లేదు. వాళ్లు తమ దర్పానికి తగ్గట్టు పనీర్ వంటకాలు ఆర్డర్ చేశారు. అయితే సర్వర్ తెచ్చిన పనీర్ ముక్కలు విభిన్న పరిమాణాలు, వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. వాటిని చూడగానే రవికి ఏదో తేడా కొడుతుందని అనిపించింది రవికి. అవి చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగా కట్ చేసి వండినట్లు తెలుస్తోంది. దీంతో రవి వెయిటర్ని పిలిచి వంట చేసే వ్యక్తి తీసుకు రావాల్సిందిగా కోరాడు. అతడు వచ్చిన వెంటనే రవి నేరుగా పనీర్ ముక్కలు ఎందుకు విభిన్న పరిమాణాలు, రంగుల్లో ఉన్నాయని ప్రశ్నించాడు. రవికి ఇది మా ప్రత్యేకం వంటకం అని గర్వంగా చెప్పాడు ఆ వంటవాడు. అయితే తాను మరో ప్లేట్ ప్యాక్ చేసి తీసుకువెళ్తాను..దాన్ని మా ముందే తయారు చేయండని కాస్త పెద్ద స్వరంతో అడిగాడు రవి. దెబ్బకు రెస్టారెంట్ మొత్తం వణికిపోయింది. అక్కడున్న చాలామంది భోజనం ఆపేసి మరీ ప్రేక్షకుల్లా చూస్తున్నారు. దీంతో హోటల్ సిబ్బంది వివిధ కారణాలు చెప్పడం ప్రారంభించారు. చివరకు పోలీసుల భయంతో, వెయిటర్ అసలు కారణాన్ని తెలియజేసి తప్పును అంగీకరించాడు. ఇది అందరూ చేసే తప్పు..కస్టమర్లు చాలా సార్లు తమ ప్లేట్లలో అన్నం, కూరగాయలు, సలాడ్లు, చపాతీలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హోటల్ సిబ్బంది వాటిని అన్నీ పడేయడం లేదు. పెద్ద పనీర్ ముక్కలను, కూరగాయలను తిరిగి మరొక వంటకంలో కలిపి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్లలో మిగిలిన సలాడ్ కొత్త ఆర్డర్ కోసం ఉపయోగిస్తున్నారు నిర్వాహకులు. ఇలా పెద్ద పెద్ద హోటల్స్లోనే జరగడం బాధకరం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి..ఇక మీదట, ఎప్పుడు హోటల్లో భోజనం చేయడానికి వెళ్తే, మిగిలిన భోజనం ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, బయటకు వెళ్లి జంతువులకు ఆహారంగా ఇవ్వండి లేదా ఆ సంచి చెత్తబుట్టలో మీరే స్వయంగా వేయండి. లేదంటే, మీ ప్లేట్లోని భోజనం మరొకరి ప్లేట్లోకి వచ్చిన ఎంగిలి ఆహారమై ఉండొచ్చు లేదా మీరు తినగా మిగిలిన భోజనం మరొకరికి ఆహారం కావచ్చు. జాగ్రత్త!! మరో సంఘటన.. శ్రీకృష్ణుని జన్మస్థానం అయిన బృందావనంలో జరిగింది. బృందావనాన్ని ఎంతో పవిత్రమైన భూమిగా చూస్తారు. కౌశల్ అతడి బృందం బృందావనానికి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి సుదూర ప్రయాణం చేసిన తర్వాత వారంతా ఎంతో ఆకలితో ఉన్నారు. అందుకే ఒక శుభ్రంగా కనిపించే భోజనశాలలో ప్రవేశించాము. ఆర్డర్కు ఆలస్యం కాకుండా ఉండటానికి డిష్ల కంటే రెడీమేడ్ భోజన థాళిలను ఆర్డర్ చేసాము. ఒక శుభ్రమైన ట్రే ద్వారా దాల్, కూరగాయలఅన్నం, రైతా మరియు ఒక బుట్టలో చపాతీలు తీసుకువచ్చారు. మొదటి కొద్దిముక్కల తిన్నప్పుడు గుర్తించలేదు, కానీ తర్వాత ఏదో తేడాగా అనిపించింది. చపాతీ పుల్లగా ఉండగా, కూరగాయల రంగు విభిన్నంగా ఉంది. అన్నం రుచి కూడా అసహజంగా ఉంది. అందరం భోజనం అలాగే వదిలేసి, కౌంటర్ వద్దకి బిల్లు ఎంత అని అడిగాము, 650 రూపాయల బిల్లు ఇచ్చారు. ఆ తర్వాత బాబు.. తాము చెల్లిస్తాం కానీ ఒక్కసారి కిచెన్ చూపించండి అని అడిగారు వారంతా. అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ..ఏమయ్యింది అని అడిగాడు. ఒక కస్టమర్గా..! భోజనం ఎలా తయారయ్యిందో చెక్ చేయడం తన బాధ్యత అని చెబుతూ..వాళ్లంతా కిచెన్లోకి వెళ్లి చూసి కంగుతింటారు. కొన్ని చపాతీలు బుట్టలో ఉండగా, ఫ్రిజ్లో వేరే వేరే రకాలుగా వండిన కూరగాయలు, మూతలు లేని వంట పాత్రలు దర్శనమిచ్చాయి. కొన్ని మరీ దుర్వాసన కొడుతున్నాయి. అదంతా చూసి కోపంతో వంటవాడికి నాలుగు చివాట్లు పెట్టగా..అసలు విషయం బయటపెట్టాడు. ఈ కూరగాయలు వారం రోజులుగా ఉన్నాయి. అతను మరొక విషయం కూడా చెప్పాడు, వండేటప్పుడు పాత కూరగాయలను, కుళ్ళిన కూరగాయలను మళ్లీ నూనెతో వేడి చేసి కొత్తిమీర టమాటాలతో అలంకరించి కొత్త వంటకం లాగ వేరే కస్టమర్లకు వడ్డిస్తాం. చపాతి పిండిని కూడా రెండు రోజులకు ఒకసారి తయారు చేస్తాము. కరెంటు కోత కారణంగా ఫ్రిజ్లోని ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆ చెడిన వాసనను తెలియనివ్వకుండా మరిన్ని మసాలాలు, కారము కలిపి వంట చేసి సర్వ్ చేస్తాము. పులిసిపోయిన చపాతి పిండిని నాన్ తయారీకి ఉపయోగిస్తామంటూ వరుసగా తాము చేసే పాపాలను వరుసగా బయటప్టెటాడు. ఎప్పుడైనా మీరు కూడా యాత్రలు చేసినప్పుడూ..మీకు కూడా ఓ హోటల్ సర్వర్ ఇలాంటి భోజనమే పెట్టాలి అప్పుడు అర్థమవుతుంది తమ బాధ అంటూ ఉద్వేగంగా చెప్పారు. ఈ రోజు మనకు జరిగే ఇటువంటి ప్రమాదాలు, మోసాల నుంచి కేవలం మన అప్రమత్తత మాత్రమే రక్షిస్తుంది. భారతదేశంలో సత్యం అసత్యం మధ్య తేడా దారుణంగా క్షీణిస్తోంది. ప్రతి దుకాణం లేదా సంస్థల వద్ద ఒక మూలలో దేవాలయం ఉంటుంది. వ్యాపారి ఉదయం వచ్చినప్పుడు దేవుని విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగించి, కౌంటర్కి నమస్కరించి, ఆ తర్వాత యథావిధిగా మంచి మనిషి ముసుగు తీసి రాక్షసుడి మాదిరి మోసాలకు పాల్పడతాడు. పైగా దేవుడిని ఈ కోరిక తీర్చమంటూ సాగిలపడుతుంటాడు. అస్సలు ఇన్ని మోసాలు చేస్తూ ఎలా కోరికలు లిస్ట్ దేవుడికి చెప్పగలడనేది అర్థం కానీ మిస్టరీ..!. కనీసం ఇసుమంత మేలు చేసి అడిగినా ఓ అందం..కానీ ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే. కేవలం స్వలాభమే ముఖ్యం అందుకు ఏమైనా చేస్తారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు బయట భోజనం తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి. (చదవండి: మల్టీవిటమిన్లు మరణ ప్రమాదాన్ని తగ్గించగలవా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..??
నవపాకాలతో అన్నం వడ్డించినా, చివరలో పెరుగన్నం తినకుండా ఆ భోజనం పరిపూర్ణం అనిపించుకోదు. ఎందుకంటే పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా పెరుగు ΄÷ట్టకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రోటీన్, కాల్షియం,ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల పెరుగు వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు చాలా పదార్థాలను పెరుగుతో కలిపి తింటూ ఉంటారు. అయితే, పెరుగుతో కలిపి తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవి తినడం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెరుగుతో ఎలాంటి ఆహారపదార్థాలు తినకూడదో... ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.పెరుగు, చేపల మిశ్రమం ఆరోగ్యానికి హానికరం. ఆయుర్వేదం ప్రకారం, చేప, పెరుగు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటి కలయికతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం శరీరంలో అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది అలెర్జీలు, దద్దుర్లు, ఇతర సమస్యల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది.సిట్రస్ పండ్లు... పెరుగు: ఇప్పటికే కాస్త పుల్లగా ఉండి, నారింజ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతో కలిపి పెరుగు తింటే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు, అసిడిటీ, కడుపు నొప్పిని కలిగిస్తుంది. పెరుగు, ఉడికించిన గుడ్డు కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండూ ప్రోటీన్ కు మంచి మూలాధారాలు. అయితే వీటిని కలిపి తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ΄÷త్తికడుపులో భారాన్ని, గ్యాస్ను కలిగిస్తుంది.ఉల్లిపాయ, పెరుగు: వీటి కలయిక జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కడుపులో చికాకు, గ్యాస్, ఇతర సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు దారితీస్తుంది.పెరుగు, మామిడికాయల కలయిక రుచికరంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మామిడి, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు ఏర్పడతాయి. ఇది జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు దారితీస్తుంది.ఇవి చదవండి: ఆరోగ్యమే ఆనందం.. -
కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?
చక్కగా కూర్చొని ఆహారం తింటుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడూ ఈ ఉరుకులు పరుగులు జీవన విధానంలో చాలామంది నిలబడి గబగబ తినేసి భోజనం కానిచ్చాం అన్నట్లుగా తింటున్నారు. అంతెందుకు పెళ్లిళ్లలో కూడా బఫే పేరుతో నిలబడి తినడమే. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లలోనూ ఇదే తీరు. ఇంతకీ ఇలా తినడం మంచిదేనా? అంటే..ముమ్మాటికి కాదనే చెబుతున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయమై పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.నిలబడి తింటే..నిలబడి తినడం వల్ల వేగంగా జీర్ణమయ్యి, కొవ్వు తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఇది ఒక్కోసారి పొట్ట ఉబ్బరాన్ని కలిగించి ఆకలిని పెంచుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఇటీవల చాలామంది టైం ఆదా అవుతుందనే ఉద్దేశ్యంతో నిలబడి ఏదో కానిచ్చాం అన్నట్లు భోజనం చేస్తుంటారు. ఇది జీర్ణక్రియకు హానికరం అని, అతిగా తినేందుకు దారితీస్తుందని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. గురత్వాకర్షణ కారణం కడుపులోని ఆహరం వేగంగా ప్రేగుల్లో కదులి, త్వరగా జీర్ణమయ్యిపోతుంది. ఫలితంగా అతి ఆకలికి దారితీస్తుందని తెలిపారు.చాలామంది నిలబడి తినడం వల్ల బరువు తగొచ్చని భావిస్తుంటారు. కానీ దీని వల్ల బరువు తగ్గడం అటుంచి శరీరానికి అవసరమయ్యే కొవ్వుల, నష్టం, పోషకాల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ఇలా నిలబడి తింటే ఆహారం టేస్టీగా అనిపించదట. అదీగాక వాళ్లు కూడా ఆటోమేటిగ్గా రచి తక్కువ ఉన్న ఆహారపదార్థాలను ఇష్టపడతారని చెబుతున్నారు. ఎందుకంటే నిలబడి తింటున్నప్పుడూ నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ముడుచుకుపోతాయని తెలిపారు. ఇందుకోసం సుమారు 30 మంది వ్యక్తులను తీసుకుని అధ్యయనం చేయగా నిలబడి తిన్న వాళ్లలో బరువు కోల్పోడమే గాక టేస్టీగా ఉన్న ఆహారాన్ని తినకపోవడాన్ని గుర్తించామని చెప్పారు. కూర్చొని తినడం..మీరు తినేటప్పుడు అనుసరించే భంగిమ మీ ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఒక వ్యక్తి కూర్చొన్నప్పుడు కడుపులోని ఆహారం నెమ్మదిగా ఖాళీ అవుతుందని అన్నారు. నిలబడి భోజనం చేసిన దానికంటే నెమ్మదిగా జీర్ణం అవుతుందని అన్నారు. అలాగే శరీరం ప్రోటీన్లు గ్రహించేలా మంచిగా జీర్ణం అవుతుంది. అంతేగాక రక్తానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాల లభ్యత కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఇక కూర్చొని తినడం వల్ల టేస్టీగా ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. పైగా నిలబడి తిన్నప్పటి కంటే కూర్చొని భోజనం చేసినప్పుడూ ఆహారం టేస్టీగా అనిపిస్తుందట కూడా. తక్కువ ఆకలి ఉంటుంది. నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు పరిశోధుకులు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందిలో.. కూర్చొన తిన్న వారిలో జీర్ణ సంబధ సమస్యలు లేకపోవడమే గాక బరువు అదుపులో ఉన్నట్లు తెలిపారు. పైగా నిలబడిన వారితో పోలిస్తే టేస్టీగా ఉండే భోజనాన్నే ఇష్టపడినట్లు గుర్తించామని అన్నారు. ఏదీ బెటర్ అంటే..కూర్చొని తినే భంగిమే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. కూర్చొవడం అంటే..డైనింగ్ టేబుల్స్ మీద కాదు. నేల మీద నిటారుగా కూర్చొని భోజనం చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే గూని లేకుండా నిటారుగా కూర్చొని తినడం వల్ల కడుపులోంచి ఆహరం ప్రేగుల్లోకి నెట్టడానికి అనుమతిస్తుంది. అలాగే ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం తగ్గుతుందని చెప్పారు. నిజానికి ఇది భారతీయ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న భోజన సాంప్రదాయం కూడా ఇదే.ఇక నిలబడినప్పుడు త్వరితగతిన ఆహారం విచ్ఛిన్న అయ్యి కాలక్రమేణ కొవ్వులు నష్టానికి దారితీస్తుందని పరిశోధనలో తేలిందన్నారు పరిశోధకులు. అలాగే టేస్టీగా తినాలనుకుంటే కూర్చొని హాయిగా భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడం మంచిదని వెల్లడించారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల బృందం. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ కంజ్యూమర్ రీసెర్చ్లో ప్రచురితమయ్యింది.(చదవండి: నటి విద్యాబాలన్ ఫాలో అయ్యే "నో రా డైట్" అంటే..!) -
అతిగా తినడం.. వాంతి చేసుకోవడమా? అయితే ఇలా చేయండి!
రాధ డిగ్రీ చదువుతోంది. చూడ్డానికి చక్కగా ఉంటుంది. బాగా చదువుతుంది. అందరితో కలివిడిగా మాట్లాడుతుంది. కానీ కొన్ని నెలలుగా ఆమె అతిగా తింటోంది. అక్కడితో ఆగడంలేదు. అతిగా తినడంవల్ల లావయిపోతాననే భయంతో భోజనం కాగానే వాష్ రూమ్లోకి వెళ్లి బలవంతంగా వాంతి చేసుకుంటోంది. అలా చేయడం నేరంగా, అవమానకరంగా భావిస్తోంది. క్లాసులో కూర్చున్నా ఆలోచన మాత్రం బరువుపైనే ఉంటోంది. తన శరీరాకృతి సరిగా ఉందో లేదోనని తరచూ అద్దంలో చూసుకుంటోంది. బరువు తగ్గించుకునేందుకు విపరీతంగా వ్యాయామం చేస్తోంది.రాధ ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గీతాదేవి ఏం జరుగుతోందని ఆరా తీసింది. అలా తిని, బలవంతంగా వాంతి చేసుకోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చూసింది. రాధ వయసుకు తగ్గ బరువే ఉందని వెయింగ్ మెషిన్లో చూపించింది. కానీ రాధ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన సలహా మేరకు రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ చేయించారు. న్యూట్రిషనిస్ట్ను కలసి ఆహారపు అలవాట్లు, బరువు తగ్గే మార్గాలపై కౌన్సెలింగ్ తీసుకున్నారు.ఫ్యామిలీ డాక్డర్ సలహా మేరకు సైకోడయాగ్నసిస్కి తీసుకొచ్చారు. రాధతో మాట్లాడాక ఆమె బులీమియా నెర్వోసా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతోందని అర్థమైంది. అతిగా తినడం, వెంటనే బలవంతంగా వాంతి చేసుకోవడం దీని ప్రధాన లక్షణం. వారానికి ఒకసారి అతిగా తిని, వాంతి చేసుకుంటే బులీమియా ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు.పలురకాల చికిత్సలు అవసరం..బులీమియాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల చికిత్సలు అవసరం కావచ్చు. అంటే సైకాలజిస్ట్, ఫ్యామిలీ డాక్టర్, డైటీషియన్లతో కూడిన బృందం అవసరం ఉండవచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంతోపాటు లైఫ్ స్టయిల్లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.– బులీమియా గురించి తెలుసుకోవాలి. థెరపీ సెషన్లను దాటవేయవద్దు.– ఆహారం, వ్యాయామం ప్రొఫెషనల్స్ సలహాతోనే తీసుకోవాలి.. చేయాలి.– అదే పనిగా బరువు చెక్ చేసుకోవద్దు, అద్దంలో చూసుకోవద్దు. ఈ తరహా ధోరణి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రేరేపించే ప్రమాదం ఉంది.– ఆకలిని తగ్గించే లేదా బరువును తగ్గించే సప్లిమెంట్లు లేదా మూలికల వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.– Enhanced cognitive behavior therapy ద్వారా తిండి గురించిన అనారోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తన స్థానంలో ఆరోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తనను పెంపొందించవచ్చు.– బులీమియాతో బాధపడుతున్న పిల్లలు, టీనేజర్ల పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకోవడానికి, పిల్లలు తినే వాటిపై నియంత్రణ తీసుకురావడానికి Family based therapy సహాయపడుతుంది.– ఒత్తిడిని తట్టుకోవడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్సకి, ఇతరులతో సర్దుకుపోవడానికి డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుంది.– యాంటీడిప్రెసెంట్స్తో బులీమియా లక్షణాలను తగ్గించవచ్చు. టాక్ థెరపీతో పాటు దీన్ని ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి.– బులీమియాకు చికిత్స చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డైటీషియన్లు సహాయపడతారు.– బులీమియా తీవ్రంగా ఉండి.. ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.బులీమియా లక్షణాలు...– ఒకే సిట్టింగ్లో అసాధారణ రీతిలో ఆహారాన్ని అతిగా తినడం– అతిగా తినడాన్ని నియంత్రించలేకపోతున్నామని అనిపించడం– బరువు పెరగకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా వాంతులు చేసుకోవడం లేదా అతిగా తిన్న తర్వాత విపరీతంగా వ్యాయామం చేయడం– బరువు పెరుగుతుందనే భయంతో, అనారోగ్యకరమైన మార్గాల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించడం– విరేచనాల కోసం మందులు ఉపయోగించడం– శరీర ఆకృతి, బరువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉండటం– విపరీతమైన మూడ్ స్వింగ్స్ని కలిగి ఉండటం.బులీమియా నెర్వోసాకు బింజ్ ఈటింగ్ డిజార్డర్కు మధ్య తేడా.. బులీమియా నెర్వోసా ఉన్న వ్యక్తులు అతిగా తిని, ఆ తర్వాత బలవంతంగా వాంతి చేసుకుని ఆహారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు కూడా అతిగా తింటారు, కానీ వాంతి చేసుకోరు. అలాగే, బులీమియాతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక బరువు/ఊబకాయం కలిగి ఉంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా?
నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే అంతమంచిదని అంటారు. అలా అని ఎప్పుడుపడితే అలా తాగడం మంచిది కాదని కూడా చెబతున్నారు నిపుణులు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగాలని..ఇలా చేస్తే మలబద్దక సమస్య ఉండదని అంటారు. ఆ తర్వాత వీలు కుదిరినప్పుడైన నీళ్లు తాగే యత్నం చేయండని అంటారు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బోజనం అయ్యిన వెంటనే లేదా భోజనం మధ్యమధ్యలో అదేపనిగా తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదంట. ఇలా చేయడం వల్ల తలెత్తే సమస్యలు గురించి సవివరంగా చెప్పుకొచ్చారు నిపుణులు. అవేంటంటే..నీళ్లు ఆరోగ్యానికి చాలా అవసరం. దాహార్తిని తీర్చడమే కాకుండా ఆహారాన్ని చక్కగా విచ్ఛిన్నం చేసి సులభంగా జీర్ణమవ్వడంలో సహాయపడుతాయి. తద్వారా శరీరం త్వరిగతగతిన పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం..భోజనం అయ్యిన వెంటనే నీళ్లు తాగకూడదు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటంటే..జీర్ణ సమస్యలు..తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్టిక్ రసాలు, జీర్ణ ఎంజైమ్లను పలుచన చేసి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని చెబతున్నారు. దీని వల్ల పోషకాల సహజ శోషణపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కడుపులో ఉన్న ఆహారం నీళ్లు తాగిన వెంటనే శీతలీకరణం అయిపోతుంది. దీంతో సాధారణంగా జీర్ణం అయ్యే వ్యవధిలో మార్పులు వచ్చి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. బరువు పెరగడం..తిన్న వెంటనే నీళ్లు తాగడంతో తొందరగా ఆహారం విచ్చిన్నమయ్యి వేగంగా జీర్ణ మయ్యిపోతుంది. దీంతో వెంటనే ఆకలిగా అనిపించి..అతిగా తినడానికి దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరగడం, ఓబెసిటీ వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గుండెల్లో మంట..భోజనం చేసిన వెంటనే తాగిన నీరు జీర్ణ ఎంజైమ్లను పలుచన చేసి ఆమ్లత్వానికి దారితీసి గుండెల్లో మంటకు కారణమవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ రసాయనాలు, డైజిస్టివ్ ఎంజైమ్లు అదనపు నీటితో కరిగించబడి ఆమ్లత్వానికి దారితీస్తుంది. దీంతో గుండెల్లో మంట వంటివి కలుగుతాయి. ఇన్సులిన్ పెరుగుదలకు..ఇలా నీళ్లు తాగడం వల్ల కొంత ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోయే అవకాశం ఉంది. ఇది కాస్త కొవ్వుగా మారి శరీరంలో నిల్వ చేయడబడి ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో మధుమేహానికి దారితీసి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడానికి కారణమవుతుంది. ఎలా తాగడం మంచిదంటే..భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత నీరు తాగడానికి సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ భోజనం చేస్తున్నప్పుడూ ఎక్కిళ్లు వచ్చి నీళ్లు తాగక తప్పడం లేదు అనుకుంటే..తింటున్నప్పుడూ మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీటిని సిప్ చేయండి. ఇలా చేస్తే కాస్త గొంతులో ఆహారం సాఫీగా దిగడమే కాకుండా ఆహారం మృదువుగా అయ్యి సులభంగా జీర్ణమవుతుంది. అలాగే బాగా చల్లగా ఉన్న నీటిని అస్సలు తాగొద్దు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసి జీర్ణమయ్యే వ్యవధిని మందగించేలా చేస్తుంది. పైగా యాసిడ్ రిఫ్లక్స్కి దారితీసి, టాక్సిన్ సేకరణకు దారితీస్తుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ తినేటప్పుడూ ఎరేటెడ్ డ్రింక్స్, కెఫిన్ వంటి పానీయాలను తీసుకోకండి అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?) -
సన్రైజర్స్ ఫ్యాన్స్తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
-
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
మామిడి పండ్లు తినడం వల్ల ముఖంపై మొటిమలు, గడ్డలు వస్తాయని చాలామంది చెబుతుంటారు. పాపం ఆ ఉద్దేశ్యంతోనే మామిపండు తినేందుకు భయపడుతుంటారు. నిజానికి మామిడి పండ్లకు మొటిమలకు సంబంధం ఉందా? వాటిని తినడం వల్ల వస్తాయా ? అంటే..వేసవిలో అందరూ మామిడి పండ్లంటే ఇష్టంగా తింటారు. పోషకాల రీత్యా మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. నిజానికి ఈ మామిడి ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే సాధారణ పండుగా మారింది. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.ఈ బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. అంతేగాక దీనిలో ఉండే పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మంటను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాంటి మామిడి పండ్లను తింటే కొందరిలో మొటిములు ఎందుక వస్తాయంటే..? అధిక చక్కెర స్థాయి, గ్లైసెమిక్ సూచిక అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను సూచించే స్కేల్. ఇక్కడ పండ్లు, బియ్యం, ఇతర కార్బ్ రిచ్ ఉత్పత్తులు, ముఖ్యంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అత్యధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసీయేషన్ ప్రకారం..తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం బరువు తగ్గడానికి మెటిమలు తగ్గించడానికి 91% సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొటిమలు రక్తంలోని చక్కెర స్థాయిలతో ముడిపడి ఉందని తెలిపారు. అందులోనూ ఈ మామిడిపండ్లను చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు తెగ ఇష్టంగా తింటారు. ఇది వారు యుక్త వయసుకు చేరుకునే సమయం..సరిగ్గా ఈ టైంలోనే వారిలో సెబమ్ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో వారిలో జిడ్డు చర్మం, మొటిమలు మొదలయ్యే దశ స్లోగా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ మామిడి పండ్లు కూడా వాళ్లుగా ఇష్టంగా తినడంతో పెద్దవాళ్లు మొటిమలకి, మామిడి పండ్లకి లింక్ చేసి..అవి తినడం వల్లనే వస్తున్నాయని అనేస్తారు. వాస్తవానికి అది అపోహ అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. సముతల్యమైన ఆహారం తీసుకున్నవాళ్లు హాయిగా మామిడి పండ్లను తినవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మొటిమలు చర్మ పరిస్థితికి ఒక లక్షణం అనేది గ్రహించాలి. ఇక్కడ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుని, మంచి పరిశుభ్రతను పాటిస్తూ.. మొటిమలను నిరోధించే క్రీమ్లను ఉపయోగిస్తే..ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పైగా చర్మం కూడా ప్రకాశవంతంగా అందంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ ..?) -
ఆరేళ్లుగా పిజ్జా లాగించేస్తున్నాడు..కానీ అతను..!
పిజ్జా, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు పదేపదే యువతను హెచ్చరిస్తుంటారు. అదీగాక పిజ్జా, బర్గర్లాంటివి ఎక్కువగా తింటే ఒబెసిటీ వచ్చే సమస్య ఎక్కువ కూడా. కానీ ఈ వ్యక్తికి పిజ్జాలంటే విపరీతమైన పిచ్చి. అతనికి అవంటే అలాంటి ఇలాంటి ఇష్టం కాదు. రోజంతా పిజ్జా ఉంటే చాలు వాటితోనే లంచ్, డిన్నర్లు కానిచ్చేస్తాడు మనోడు. ఇలా ఆరేళ్లుగా లాగించేస్తున్నాడట పిజ్జాలని. మరీ ఇంతలా తింటున్నాడు కదా అతడి ఫిట్నెస్ ఎలా ఉంటుందా..? అనే కదా సందేహం. అతడెలా ఉంటాడంటే..?అమెరికాకు చెందిన కెన్నీ వైల్డ్స్కి పిజ్జా అంటే మహా ఇష్టం. ఈ ఇటాలియన్ వంటకం అంటే కెన్నీకి ఎంతగా ఇష్టమంటే కనీసం రోజులో ఒక్కస్లేసు పిజ్జా లేకుండా గడవదు. అంతేగాదు అతడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో పిజ్జా ఉంటే చాలు హాయిగా దానితోనే గడిపేస్తాడు. అతనికి అది అస్సలు బోరుగా అనిపించందట. ఈ విషయంలో అతడి భార్య కూడా సపోర్ట్ చేయడం విషయం. ఆమె కూడా అతడికి ఇష్టమైన పిజ్జాలు అతడి భోజనంలో ఉండేలా చూస్తుందట. ఆఖరికి ఆఫీస్లో కూడా పిజ్జాలు ఉండాల్సిందేట. చాలామంది తనలా పిజ్జాలు ఇంతలా తినలేరని ఛాలెంజ్ విసురుతున్నాడు కూడా. అంతేగాదు ఇన్కేస్ ఏదైనా కారణం చేత కేఫ్లు క్లోజ్ అయితే తన ఇంటికి చాలా దూరంలో ఉండే కేఫ్లు వద్దకు వెళ్లి మరీ పిజ్జాలు తింటాడట. ఇంతలా పిజ్జాలు లాగించేస్తున్న కెన్నీ చూడటానికి మాత్రం అ స్సలు లావుగా ఉంటాడు. మంచి స్మార్ట్గా ఫిట్నెస్గా కనిపిస్తాడు. ఇలా అతడు ఆరేళ్ల నుంచి పిజ్జాలను పిచ్చి పిచ్చిగా తినేస్తున్నా.. తాను ఫిట్గా హెల్తీగా ఉన్నానని ధీమాగా చెబుతున్నాడు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవట. వినడానికి చాలా ఆశ్చర్యం ఉంది కదూ!. "అతి సర్వత్ర వర్జయేత్" అన్న నానుడి ఇతడి విషయంలో పనికిరానిదిగా ఉంది కదా..!. నచ్చిందని అతిగా తింటే శరీరం అంగీకరించక పలు సమస్యలు రావడం జరగుతుంది. ఇతడి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం అనేది నమ్మలేని నిజంలా ఉంది. కొన్ని సర్వేల్లో కూడా మనిషి ఇష్టమైన ఆహారం ఆరోగ్య రీత్యా సరిపడనిది అయినా ఏం చేయదని విన్నాం. బహుశా ఇదే కెన్నీ విషయంలో జరుగుతుందేమో..!.(చదవండి: వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!) -
గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
గుడ్లు ఎక్కువుగా తింటే అస్సలు భయపడాల్సిన పనిలేదు. పైగా మీ ఆరోగ్యం పదిలం అని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. అస్సలు ఆ సమస్యలు బారినపడరని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు సైతం రావని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఆ అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలేంటంటే.. గుడ్డు ఎముకలు బలంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందట. రోజుకి ఒక గుడ్డు తినడం అనేది ఎంతో మంచిదని, దీని వల్ల ఫోలేట్, బీ విటమిన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని అన్నారు. అలాగే ఎముకల వ్యాధి రాకుండా నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గుండెతో ఎముకల ఆరోగ్యం ముడిపడి ఉందనే ఆసక్తికర విషయం తమ పరిశోధనలో బయట పడిందని హువాజోంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త తెలిపారు. అందుకోసం నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ దాదాపు 1900 మందిపై అధ్యయనం నిర్వహించింది. పరిశోధకులు గుడ్డు వినియోగం తోపాటు, వారి ఎముకల బలాన్ని కూడా అంచనా వేశారు. ఈ పరిశోధనలో పాల్గొనేవారికి గుడ్డులోని 3.53 ఔన్సుల పోషకాలు వారి తొడలు, వెన్నుముకలోని ఎముకలను దృఢంగా ఉంచాయిని తెలిపారు. వారిలో అధిక బీఎండీ స్థాయిలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో అయితే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గిందని చెప్పారు. వయసు పెరిగే కొద్ది ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఆ సమస్య రాకూడదంటే గుడ్డుకి మించిన తగిన పోషకాహారం లేదని ఈ పరిశోధనలో తేలిందని చెప్పారు. అలాగే ఇదే సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అధిక మొత్తంలో మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు దీర్థకాలికంగా వాడడం వంటి ఇతక కారణాల వల్ల కూడా ఈ బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఎముకలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే.. గుడ్లు ప్రోటీన్తో నిండి ఉంటాయి. ఇవి ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అని పిలువబడే శారీరక ఎంజైమ్ల సమూహాన్ని సక్రియం చేసి, ఎముకలను బలోపేతం చేస్తుంది. ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అనేది ప్రధానంగా కాలేయం, ఎముకలు, మూత్రపిండాలు మొదలైన వాటిలో ఉండే ఎంజైమ్ల సమూహం. ఇది ఎముక జీవక్రియ బయోమార్కర్ గుడ్లు తీసుకోవడం వల్ల ఏఎల్పీ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో తొడ, కటి వెన్నెముక వంటి భాగాల్లోని ఎముకలను బలంగా ఉంచుతుంది. అంటే ఇక్కడ గుడ్లలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందని తేలింది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: చెఫ్గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
అమెరికాలో నరమాంస భక్షకుడు!
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి తెగిపోయిన మనిషి కాలు చేతబట్టుకుని రోడ్డుపై తిరుగుతూ కలకలం రేపాడు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరలైంది. అందులో కాలిని అటూ ఇటూ ఊపుతూ, వీడియో తీస్తున్న వ్యక్తివైపు చూస్తూ ఉన్మాదిలా విరగబడి నవ్వుతూ కని్పంచాడతను. అప్పుడప్పుడు దాన్ని వాసన చూస్తూ, నోట్లో పెట్టుకుంటూ అందరినీ భయభ్రాంతులను చేశాడు. ‘దేవుడా! అతడా కాలిని తినేస్తున్నాడు’ అంటూ నేపథ్యంలో కొందరు హాహాకారాలు చేయడం కూడా వీడియోలో విన్పించింది. పట్టాలు దాటబోతూ రైలు ఢీకొని మరణించిన మహిళ తాలూకు తెగిపడిన కాలిని అలా చేతపట్టుకుని తిరిగినట్టు స్థానిక మీడియా వివరించింది. విషయం తెలిసి పోలీసులొచి్చనా అతను ఏమాత్రమూ బెదరకుండా కులాసాగా కని్పంచాడు. అతన్ని 27 ఏళ్ల రెసెండో టెలెజ్గా గుర్తించారు. మృతదేహపు కాలిని ఎత్తుకెళ్లి రైలు ప్రమాదం తాలూకు సాక్ష్యాధారాలను మాయం చేశాడన్న అభియోగాలపై అరెస్టు చేశారు. పోలీసులు తరలిస్తుండగా కూడా కెమెరాల వైపు చూస్తూ ఉత్సాహంగా చేతులూపుతూ కన్పించాడు! -
కొండచిలువలు తినడం మంచిదంటున్న శాస్త్రవేత్తలు!
ఇంతవరకు మాంసాన్ని ల్యాబ్లో తయారు చేయడం వంటి వాటి గురించి కథనాలు విన్నాం. దీని వల్ల శాకాహారులకు కూడా మేలు జరుగుతుంది. వారికి కావాల్సిన పోట్రీన్లు ఇలా కృత్రిమంగా తయారు చేసిన మాంసం ద్వారా అందుతుందని భావించారు కూడా. అవన్నీ పరిశోధన దశల్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఇది కాదంటూ ఏకంగా కొండచిలువలనే ఆహారంగా తినమని చెబుతున్నారు. పైగా ఆరోగ్యానికి మంచిదంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎందుకిలా అన్నారంటే.. ఇంతవరకు మనుషులు మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి ఇతరత్ర మాంసాలను తినేవారు. అయితే వీటి వల్ల కేవలం వంద గ్రాములు ప్రోటీన్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే వీటి కారణంగా గాలిలో 49.89 కిలోగ్రాముల కార్బన్డయాక్స్డ్ విడుదలవుతుందని పరిశోధనల్లో తేలిందన్నారు. అందువల్ల మాంసాహారం ఎక్కువుగా తినడమనేది పర్యావరణాని హానికరమని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. వీటికి బదులు కొండచిలువలు తినడం చాలా మంచిదని, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. ఈ మేరకు తాము ఒక పొలంలో దాదాపు 12 నెలలపాటు పెంచిన రెండు కొండచిలువలపై జరిపిన అధ్యయనంలో తేలిందని సరీసృపాల నిపుణుడు డాక్టర్ డేనియల్ నాటుష్ చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇవి నీరు లేకుండా దాదాపు నెలరోజులు జీవిస్తాయట. వీటి పొలుసుల మీద ఉండే నీటితోనే అన్ని రోజుల పాటు నీరు తీసుకోకుండా బతకగలవని అన్నారు. అలాగే దాదాపు ఒక సంవత్సరం పాటు ఏం తినకుండానే బతికేస్తాయట. అలాగే పంట బాగా పండటంలో వీటి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అన్నారు. అలాగే ఇవి తక్కువ గ్రీన్హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయని అన్నారు. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండగలవు, పైగా బ్లర్డ్ ఫ్లూ లేదా కోవిడ్ -19 వంటి వ్యాధులను వ్యాప్తి చేయవని అధ్యయనంలో వెల్లడయ్యిందని తెలిపారు. ఈ ఆసక్తికర పరిశోధన సైంటిఫిక్ రిసెర్చ్ ప్రచురితమయ్యింది. అలాగే వీటిని ఆహారంగా తీసుకుంటే మంచి ప్రోటీన్ పుష్కలంగా అందుతుందని అన్నారు. ఒక ఏడాదిపాటు సాగిన ఈ పరిశోధనలో తాము ఈ కొండచిలువలకు ఎలుకలు, చేపలు వంటి వాటిని ఆహరంగా అందించి ఎప్పటికప్పుడూ వాటి బరువుని కొలిచే వాళ్లమని చెప్పారు. అయితే ఈ రెండు పైథాన్లలో ఆడ కొండచిలువ వేగంగా బరువు పెరిగినట్లు పేర్కొన్నారు. వివి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరువు ఏర్పడి పశువులు పెద్ద సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మాంసాహారంగా ఈ కొండచిలువలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తుల. వామ్మో కొండ చిలువ తినడమమా ఏందీ వింత పరిశోధన అని భావిస్తున్నారా?. టెన్షన్ పడొద్దు ఎందుకంటే..దీనిపై ఇంకా కూలంకషంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు పూర్తి అయ్యేతే గానీ కార్య రూపం దాల్చదు. అదీగాక కొండచిలువల పెంపకం అనే విషయంలో సాధ్యా సాధ్యాలు కూడ అంచాన వేయాల్సి ఉంటుంది. (చదవండి: 'కుమారీ ఆంటీ' లాంటీ ఇన్సిడెంట్..మరీ ఇదేమవుతుందో..!) -
తాబేలు మాసం తిని తొమ్మిదిమంది మృతి.. 78 మందికి అనారోగ్యం!
ఆఫ్రికన్ దేశం టాంజానియాకు సమీపంలోని జాంజిబార్ దీవులలో తాబేలు మాంసం తిన్న తొమ్మదిమంది మృతి చెందారు. వీరిలో ఎనిమిదిమంది పిల్లలతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనలో 78 మంది అనారోగ్యం పాలయ్యారు. వీరందరినీ స్థానిక అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. హానికరమని తెలిసినా సముద్ర తాబేలు మాంసాన్ని జాంజిబార్వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కోసారి ఈ మాంసం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా జరిగిన ఘటన గురించి మకోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హాజీ బక్రీ మాట్లాడుతూ విషపూరితమైన ఆహారం తిన్నకారణంగా ఒక మహిళతో పాటు ఎనిమిదిమంది చిన్నారులు మృతి చెందారని తెలిపారు. మరో 78 మంది అనారోగ్యంపాలై చికిత్స పొందుతున్నారన్నారు. వీరంతా సముద్ర తాబేలు మాసం తిన్నారని లేబొరేటరీ పరీక్షల్లో నిర్ధారితమయ్యిందని తెలిపారు. ఈ ఘటన దదిమిలా ఉన్నతాధికారులు విపత్తు నిర్వహణ బృందాన్ని ఘటన జరిగిన ప్రాంతానికి పంపారు. ప్రభుత్వం సముద్ర తాబేలు మాంసాన్ని తినవద్దని అక్కడి ప్రజలను కోరింది. కాగా 2021 నవంబర్లో పెంబాలో తాబేలు మాంసం తిని మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు. ఆ సమయంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. -
ఇవి తింటే! బీపీ, కొలెస్ట్రాల్, షుగర్కు చెక్! అందానికి అందం!
మనలో చాలా మందికి కూరలు ఎక్కువగా తినే అలవాటు ఉండదు. అలాగే కూరగాయలు తినడం ఆరోగ్యకరమైన అలవాటు అని తెలిసినా, పెద్దగా పట్టించుకోరు. కార్బోహైడ్రేట్లు లేకుండా, పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కూరగాయలు-ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కూరగాయల్లో జీర్ణశక్తికి ఉపయోగపడే పీచులు అధికంగా ఉంటాయి. కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి చాలా జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి. విటమిన్-ఎ, ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలిక్ యాసిడ్ కూరల్లో ఎక్కువగా దొరుకు తాయి. ఇది బరువు తగ్గేందుకు, కొలెస్ట్రాల్ నియంత్రకు దోహదపడుతుంది. బీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు, దుంపకూరల్లాంటివన్నంటిని మన ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరల్ని వారానికి మూడు సార్లయినా తినడం ఉత్తమం. ఈమధ్య కాలంలో మైక్రో గ్రీన్స్ వాడకం బాగా పెరిగింది. బీర,సొర, దొండ, బెండ, లేత చిక్కుళ్లు, గుమ్మడి కాయ కూరను కూడా తినాలి. క్యాలీఫ్లవర్, బ్రకోలీ లాంటివి మైక్రోవేవ్ ఓవెన్లో బేక్ చేసి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని, కాస్త ఎక్కువ పరిమాణంలోనైనా తినొచ్చు. ఇష్టమైన వాళ్లు కూరల్లో ఉల్లి, వెల్లుల్లి కలిపితే గుండెకు మంచిది. కడుపు నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్ : ఇన్ఫ్లమేషన్ను తగ్గించుకోవాలంటే కూరగాయలు ఉత్తమమైన ఆహారం. వీటిల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటు అధిక బీపీతో బాధపడేవారు పోషకాలులభించే కూరగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ పొటాషియం-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల అధిక సోడియం బాడీలోకి చేరుతుంది. ఈ నష్టాన్ని తగ్గించుకోవాలంటే బచ్చలికూర వంటి కూరగాయలు పొటాషియం, ఇతర పోషకాలు లభించే కూరగాలు తీసుకోవాలి. వీటిల్లోని ఫైబర్ కూడా గుండెకుచాలామంది. ఫైబర్: 2020-2025 ఆహార మార్గదర్శకాల ప్రకారం, 2,000 క్యాలరీల ఆహారంలో రోజుకు 28 గ్రాముల ఫైబర్ కూడ అందదు. అందుకే తృణధాన్యాలు, పండ్లు, చిక్కుళ్ళు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి. చిలగడదుంపలు , బఠానీల్లో ఆపిల్ కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కళ్ళు: రోజంతా కంప్యూటర్స్ ఫోన్ వైపు చూస్తూ ఉంటే కంటి ఆరోగ్యంమీదప్రభావం పడు తుంది. కళ్ళను రక్షించు కోవాలనుకుంటే, ఎక్కువ కూరగాయలు తినడంతోపాటు మధ్య మధ్యలో స్క్రీన్ బ్రేక్లు తీసుకోవడం మంచింది. తులసి, క్యారెట్లు, మొక్కజొన్న, ఎర్ర మిరియాలు, బచ్చలికూర ,బ్రోకలీలో కంటినిరక్షించే కెరోటినాయిడ్లు దొరుకుతాయి. అలాగే లుటీన్ , జియాక్సంతిన్ అనేవి రెండు కెరోటినాయిడ్లు, వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత (AMD) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం: చర్మ తేమగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తినాలి. టొమాటోల్లోని లైకోపీన్ చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది అవకాడోలు ,నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే దోసకాయలు ఆకుకూరలు లాంటివి చర్మంలోని తేమను, మృదుత్వాన్ని కాపాడతాయి. బ్లడ్ షుగర్ కూరగాయలలో కేలరీలు తక్కువ, ఫైబర్ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థం ఎక్కువ గా ఉండే దుంప కూరలుమినహా మిగిలినవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అందుకే సహజసిద్ధంగా పండించిన కూరగాలు కేన్సర్ నివారణలో పనికొస్తాయి. బ్రస్సెల్స్ మొలకలు , కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్టు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి , ఫైటోకెమికల్స్, అలాగే సల్ఫోరాఫేన్ (బ్రోకలీలో అత్యధికం)లో ఎక్కువగా ఉంటాయి. మెదడు మెదడును పదునుగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంలో కూరగాయలను చేర్చుకోవడం సరైన మార్గం. కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, మైండ్ డైట్లో కీలకం, అల్జీమర్స్ వ్యాధి, మతిభ్రమణం ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సాయపడతాయని పరిశోధకులు తేల్చారు. యాంటీఆక్సిడెంట్లు,ఫోలేట్ మీ మెదడుకు కీలకమైన పోషకాలు. -
తిండి లేక అలమటిస్తున్న పాలస్తీనియన్లు!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలు గాజా సరిహద్దులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాజాలో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తిండి గింజలు కరువై, ప్రాణాలు నిలుపుకునేందుకు కలుపుమొక్కలు, ఆకులు, చివరికి గడ్డి కూడా తింటూ కాలం గడుపుతున్నారని మీడియా సంస్థ అల్ జజీరా పేర్కొంది గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తెలియజేసింది. దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి చివరికి కడుపును కూడా నింపుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్నందున గాజాలోని పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారని అల్ జజీరా కరస్పాండెంట్ తారెక్ అబూ అజౌమ్ తెలిపారు. దక్షిణ గాజాలోని తలదాచుకున్న ప్రజలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అందుతున్న నిత్యావసర సామాగ్రిపై ఆధారపడి కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. గాజాలో 1949 నుండి సేవలు అందిస్తున్న నోబెల్ శాంతి బహుమతి పొందిన క్వేకర్ సంస్థకు చెందిన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీస్ కమిటీ జనరల్ సెక్రటరీ జాయిస్ అజ్లౌనీ మాట్లాడుతూ గాజాలో ఆకలి చావులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. గాజాలోని ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారని, ఇలాంటి విపత్తు ఎన్నడూ చూడలేదని తమ సిబ్బంది చెబుతున్నారని జాయిస్ అజ్లౌనీ పేర్కొన్నారు. -
మీకు తెలుసా..? 'మిస్టర్ ఈట్ ఆల్' తను ఒక అద్భుతం!
ఈ సృష్టి ఓ అద్భుతం అనుకుంటే మనిషి అంతకుమించి అద్భుతాలు చేసి ఔరా! అనిపించుకుంటున్నాడు. ఇంతవరకు ఎన్నో వింతలు విశేషాలు చేసి ఉంటాం. అంతకు మించిన వింతలు, విడ్డూరాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే..? ► మిస్టర్ ఈట్ ఆల్.. ఫ్రాన్స్కు చెంది మైఖేల్ లోటిటోకు ‘మిస్టర్ ఈట్ ఆల్’ అని పేరు. ఇతడు ఐరన్, రబ్బరు, గాజులాంటివి కూడా తినేవాడు. ఈ వింత అలవాటుతో గిన్నిస్ వరల్డ్ బుక్లో చోటు సంపాదించాడు. ఇనుమును ఎలక్ట్రిక్ పసర్ సా తో చిన్న చిన్న ముక్కలు చేసి తినేవాడు. పదహారు సంవత్సరాల వయసులో తొలిసారిగా గాజు గ్లాస్ను పగలగొట్టి తిన్నాడు. తన యూనిక్ టాలెంట్తో ప్రపవచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. 2007లో చనిపోయాడు. ► బ్రెజిల్ కారాగారాలలో ఖైదీలకు ఎక్సర్ సైజ్ బైక్లను తొక్కే అవకాశం ఇస్తారు. ఈ బైక్లు కరెంట్ను ఉత్పత్తి చేస్తాయి. ► ‘ఫేస్ బుక్’ వచ్చాక ‘అన్ఫ్రెండ్’ అనే మాట ప్రాచుర్యం పొందింది. అయితే 1659లో వచ్చిన ‘ది అపీల్ ఆఫ్ ఇన్జ్యుర్డ్ ఇనోసెన్స్’ పుస్తకంలో ఈ పదాfన్ని కాయిన్ చేశారు. -
పాక్పై ప్రాణాంతక అమీబా దాడి.. ఏడాదిలో 11 మంది మృతి!
పాకిస్తాన్ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. పలు రాష్ట్రాల్లో ‘మెదడును తినే అమీబా’ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ‘నేగ్లేరియా ఫౌలెరి’ అని పిలిచే ఈ ఏక కణ జీవి ఇప్పటి వరకు 11 మందిని బలిగొంది. కరాచీలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్లో గత రెండు వారాల్లో ఈ అమీబా కారణంగా ముగ్గురు మరణించారు. తాజాగా అద్నాన్ అనే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు సమాచారం. మెదడును తినే అమీబా ‘నేగ్లేరియా ఫౌలెరి’ కరాచీలో మరొకరిని బలిగొందని సింధ్ ఆరోగ్య శాఖ తెలియజేసింది. హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మెట్రోపాలిస్లోని కరాచీ బఫర్ జోన్లో నివసిస్తున్న ఒక వ్యక్తి నైగ్లేరియా కారణంగా మృతి చెందాడు. దీనిగురించి సింధ్ ఆరోగ్య శాఖ ప్రతినిధి మాట్లాడుతూ బాధితుడు గత మూడు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడ్డాడు. పాకిస్తాన్లో ఇప్పటివరకు 11 మంది ‘నేగ్లేరియా ఫౌలెరి’ ఇన్ఫెక్షన్ (ఎన్ఎఫ్ఐ) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సింధ్ తాత్కాలిక ఆరోగ్య మంత్రి డాక్టర్ సాద్ ఖలీద్ మాట్లాడుతూ ఈ వ్యాధి విషయంలో ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇది అరుదైన ప్రాణాంతక అమీబా అని, ఇది మంచినీటి వనరులలో వృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. క్లోరినేషన్ చేయని కొలనులలో ఈతకు దూరంగా ఉండాలని ఖలీద్ నియాజ్ కోరారు. ముక్కులోకి నీరు ప్రవేశించేందుకు అవకాశమిచ్చే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఎలా సోకుతుంది? బ్రెయిన్ ఈటింగ్ అమీబా 1937లో అమెరికాలో తొలిసారిగా వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మనిషి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: ‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు? -
అత్యంత క్రూరమైన ‘ఉగాండా కసాయి’ ఎవరు? మృతదేహాలతో ఏం చేసేవాడు?
కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా క్రూరమైన పాలకులు చాలామంది ఉండేవారు. ఆ క్రూరమైన నియంతలలో అతనిపేరు తప్పుక వినిపిస్తుంది. హిట్లర్ నియంతృత్వ పోకడల గురించి మనం చాలానే విన్నాం. అయితే ఇప్పుడు మనం ‘ఉగాండా కసాయి’గా పేరొందిన ఒక నియంత గురించి తెలుసుకోబోతున్నాం. ఆ నియంతకు మృతదేహాలతో జీవించడమన్నా, మనిషి మాంసం తినడమన్నా ఎంతో ఇష్టమట. ఈ ‘ఉంగాండా కసాయి’ పాలనలో లక్షలాది మంది హత్యకు గురయ్యారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మనం ఉగాండా నియంత ఈదీ అమీన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈదీ అమీన్ 1972లో ఉగాండాలో నివసిస్తున్న వేలాది మంది ఆసియావాసులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించించాడు. ఇదీ అమీన్ 130 కిలోలకు మించిన బరువు కలిగివుండేవాడు. ఎత్తు 6 అడుగుల నాలుగు అంగుళాలు. ఈ ‘ఉగాండా కసాయి’కి ఎవరైనా ఎదురైతే ఇక వారి పని అయిపోయినట్టే. ఈదీ అమీన్ అత్యంత క్రూరమైనవాడు. అతని పేరు చెప్పగానే జనం వణికిపోయేవారు. ఈదీ అమీన్ సహచరులు రాసిన కొన్ని పుస్తకాల్లో వెల్లడైన వివరాలు తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఈ పుస్తకాల ద్వారానే ఈ నియంత ఎంత క్రూరుడో ప్రపంచానికి తెలిసింది. ఈ ఉగాండా కసాయి తన శత్రువులను హత్య చేసిన తరువాత, వారి మృతదేహాలను మరింత క్రూరంగా హింసించేవాడు. అంతే కాదు మృతదేహాలతో ఒంటరిగా గడపడమంటే ఆయనకు ఇష్టమని కొందరు తమ రచనలలో తెలిపారు. ఇది అతనికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందట. ఇంతేకాదు ఆ నియంత మానవ మృతదేహాలను తినేవాడట. అలాగే వారి రక్తాన్ని తాగడాన్ని ఇష్టపడేవాడట. చిరుతపులి మాంసం కంటే మానవ మాంసమే బాగుంటుదని అమీన్ ఓ వైద్యునితో చెప్పాడట. ఇది కూడా చదవండి: ‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి? -
అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!
మధ్యయుగం, ప్రాచీన శిలాయుగలలో మానవుడు ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు అనేదాని గురించి నేటికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఆ కాలంలో వారిలో ఎవరైన చనిపోతే ఎలా వీడ్కోలు చెప్పేవారు, ఆ మృతదేహాలను ఏం చేశారనే విషయాన్ని చేధించారు శాస్త్రవేత్తలు. నాటి మానవులు చనిపోయిన వాళ్లకి జరిపే అంత్యక్రియ విధానం గురించి చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఐరోపా అంతటా ప్రాచీన శిలాయుగంలో మానవ అవశేషాలపై శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో నరమాంస భక్షణ గురించి వెల్లడైంది. దాదాపు 15 వేల ఏళ్ల క్రితం ఐరోపాలో ఉన్న ప్రజలను మాగ్డలీనియన్లుగా పిలిచేవారు. వారు నరమాంస భక్షణ చేసేవారని తేలింది. అయితే ఎవ్వరైన చనిపోతే ప్రజలు వారికి వీడ్కోలు లేదా అంత్యక్రియలు నిర్వహించడానికి ఇలా చేసేవారని తెలిపారు. ఖననం చేయడానికి బదులుగా ప్రజలే ఆ మృతదేహాన్ని తినేసేవారని చెప్పుకొచ్చారు. అది అక్కడ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియగా ఉండేదని అన్నారు. అందుకు సంబంధించన ఎముకలు, పుర్రెలు వంటి ఆధారాలతో సహా వెల్లడించారు. మాగ్డలీనియన్ ప్రజల సంస్కృతి, కళ, వారి సాంకేతికత నిలువెత్తు నిదర్శనం అని, వారు ఉపయోగించిన రాయి, ఎముకలపై చెక్కిన కళఖండాలే అందుకు సాక్ష్యం అని అన్నారు. ఐరోపాలో పురాతన శిలయుగంలో రెండు విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్నట్లు గుర్తించారు. కేవలం మాగ్డలేనియన్లు మాత్రమే కాక వేరే జాతి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మాగ్డలేనియన్లు ఐరోపాకి వాయువ్యంలో సంచరించగా, ఆగ్నేయంలో ఎపిగ్రావెటియన్ల అనే మరో జాతి ప్రజలు ఉండేవారని. వీరు కూడా తమలో ఎవరైన చనిపోతే నరమాంస భక్షణ చేసేవారని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ ఇరు జాతులు అంత్యక్రియల నిర్వహించడానికి బదులు మృతదేహాలను భక్షించేవారని, అదొక ఆచారంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఐరోపాలోని గోఫ్స్ గుహలో ఉన్న కపాల పాత్రలు, ఎముకలతో చేసిన గిన్నేలు, గ్లాసులు సాక్ష్యం అని చెప్పారు. తొలుత ఎపిగ్రావెటియన్లు చనిపోయిన వారిని పాతిపెట్టేవారని, ఆ తర్వాత మాగ్డలేనియన్లు ఉన్న ప్రాంతానికి వలస వచ్చిన తర్వాత వారి ఆచార పరంపరను ఈ జాతి వారు కొనసాగించనట్లు గుర్తించారు. నాటి మానవులు ఇంత భయానక రీతిలో అంత్యక్రియలను నిర్వహించడానికి గల కారణాలపై పరిశోధన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. (చదవండి: వాట్! సబ్బు తినడం ఇష్టమా? చివర్లో ట్విస్ట్ అదిరిపోలా..!) -
వాట్! సబ్బు తినడం ఇష్టమా? చివర్లో ట్విస్ట్ అదిరిపోలా..!
ఎన్నో వైరల్ వీడియోలు చూసుంటాం. చాలా విభిన్నంగా ఓ రేంజ్లో నెటిజన్లు కట్టేపడేసి వీడియోలు ఉంటాయి. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. పైగా దానికి ఇచ్చిన క్యాప్షన్ చూస్తేనే షాకింగ్గా ఉంది. ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూస్తే చివర్లో ఉన్న ట్విస్ట్ దిమ్మతిరిగేలా ఉంది. ఇంతకీ ఈ వీడియోలో ఏ ముందుంటే..ఓ చిన్నది తనకు సబ్బులు తినడం ఇష్టం అంటూ ఓ ఫేమస్ బ్రాండ్ సబ్బును చేతిలోకి తీసుకుంది. మరో చేత్తో లిక్విడ్ హ్యండ్ వాష్ పట్టుకుంది. ఈ రెండింట్లో ఏది టేస్ట్ బావుంటుంది అంటూ..ఆమె ఆ సబ్బుని ఏదో చాక్లెట్ని తింటున్నంతగా ఇష్టంగా లాగించేస్తుంది. నిజంగా సబ్బేనా అలా ఎలా తినేస్తుందరా బాబోయ్! అన్నట్లుగా టెన్షన్గా చూస్తుంటే..చివరల్లో ఓ చిన్న ట్విస్ట్.. ఓస్ ఇదేనా అనిపిస్తుంది. ఆ వీడియో చివర్లో ఆ సబ్బుని కట్ చేసి చూపిస్తున్నప్పుడూ అసలు విషయం అర్థమవుతుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోని చూసిన నెటిజన్లు సబ్బుని తినడం ఏంట్రాబాబు అని అనుకున్నాం. ఊహించుకుంటేనే ఏదోలా అనిసించింది. థ్యాంక్ గాడ్ హమ్మయా! అది కేక్ అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Suchi Dutta (@21b_kolkata) (చదవండి: ఈ మోడల్ ధరించిన కాస్ట్యూమ్ చూస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!) -
వండటానికి ముందే చికెన్ని కడగొద్దు! శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా చికెన్ని వండటానికి ముందే శుభ్రంగా కడుతాం. ఇది సర్వసాధారణం. అలా అస్సలు చేయొద్దంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ అలవాటును తక్షణమే మానుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్టితుల్లోను కడగొద్దని తేల్చి చెప్పారు. పైగా కడగకుండానే వండేయాలంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఏంటిది కడగకుండా నేరుగా వండేయడమా? ఇది నిజమా..! అని నోరెళ్లబెట్టకండి. ఔను! మీరు వింటుంది నిజమే! చికెన్ని కడగకుండా వండేయడమే మంచిదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. వారి జరిపిన తాజా అధ్యయనంలో దీని గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ పరిశోధనల్లో చాలామంది చికెన్ని వండటానికి ముందే కడుతున్నట్లు తేలిందట. దాదాపు 25% మంది చికెన్ని ముందే కడిగేస్తున్నారని గుర్తించామని అన్నారు. అధ్యయంనంలో ఇలా చేస్తే కలిగే నష్టాలు గురించి.. విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ఆహారం వల్ల కలిగే అనారోగ్యానికి సంబంధించి.. క్యాంపిలో బాక్టర్, సాల్మోనెల్లా అనే రెండు ప్రధాన బ్యాక్టీరియాలు కారణమని తెలిపారు. ఔ అవి సాధారణంగా పౌల్ట్రీ మాంసంలో కనిపిస్తాయని అన్నారు. అందువల్ల మాంసాన్ని పచ్చిగా ఉన్నప్పుడే కడగడం వల్ల ప్రతిచోట ఆ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని, దీని కారణంగా వ్యాధుల ప్రబలే ప్రమాదం ఎక్కువవుతుందని పరిశోధనల్లో తెలిపారు. ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన కేసులు ఆస్ట్రేలియాలో గత రెండు దశాబ్దాల్లో రెట్టింపు అయ్యినట్లు వెల్లడించారు. ఏడాదికి ఈ బ్యాక్టీరియాకు సంబంధించి సుమారు 2 లక్షల కేసుల్లో.. దాదాపు 50 వేల కేసుల దాక కోడి మాంసంకి సంబంధించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తున్నాయని చెప్పారు. కడిగిన చికెన్ కారణంగా ఉపరితల నీటి బిందువుల నుంచి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని తెలిపారు. అలాగే కుళాయిల నీటితో ఫాస్ట్ ఫోర్స్తో చికెన్ని కడగడంతో ఆ బ్యాక్టీరియా ఆ చెందిన నీటి బిందువల నుంచి మరింతగా వ్యాపిస్తాయని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అధ్యయనంలో నీటి ప్రవాహ రేటు తోపాటు బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే శాతం కూడా పెరగడం గుర్తించినట్లు వెల్లడించారు. అందువల్ల చికెన్ని పూర్తిగా ఉడికించి కడగడం లేదా వేడినీళ్లతో కడిగి వండటం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. (చదవండి: మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..షాక్లో కూతురు) -
చీతాతో ఫుడ్ షేర్ చేసుకున్న తాబేలు.. తెగ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోలు అందరినీ తెగ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ వీడియోలలో కొందరి విచిత్ర విన్యాసాలే కాదు.. వినూత్న ఆవిష్కరణలు కూడా కనిపిస్తుంటాయి. వీటికితోడు ఇక జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవేలేదు. వాటికి వచ్చే వ్యూస్కు అంతేలేదు. తాజాగా ఒక వీడియో ట్విట్టర్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో చీతా, తాబేలు ఎంతో స్నేహపూర్వకంగా ఆహారం తింటుండటాన్ని చూడవచ్చు. ఎక్స్(ట్విట్టర్)లో షేర్ అయిన ఈ వీడియోలో రెండు విభిన్నజాతులకు చెందిన జంతువులు కలివిడిగా ఉండటాన్ని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. చిరుతలు వేగానికి, చురుకుదనానికి పెట్టిందిపేరు. అలాగే అది మాంసాహారి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక తాబేళ్ల విషయానికొస్తే ఇవి సాధారణంగా శాకాహార జంతువులు. నిదానంగా సాగే కార్యకలాపాలకు ప్రతీక. అయితే ఈ వీడియోలో విభిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు జంతువులు ఒకే పాత్రలోని ఆహారాన్ని ప్రశాంతంగా తింటుడటాన్ని గమనించవచ్చు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 60 వేల వీక్షణలు దక్కాయి. లెక్కలేనన్ని కామెంట్లు వస్తున్నాయి. ఈ విచిత్ర స్నేహం చూసి కొందరు నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతుండగా, మరికొందరు దీనివెనుకగల కారణం తెలుసుకోవాలనుకుంటున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Cheetah & tortoise share food. Those who give their food give their heart. 📽️Carson Springs Wildlife pic.twitter.com/kf4agZCXOZ — Hakan Kapucu (@1hakankapucu) August 31, 2023 -
ఏంటి బాబాయ్..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..?
ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నా కొందరు తంబాకు అలవాటును మానుకోరు. దాన్ని నోట్లో పెట్టుకుంటే గానీ కొందరికి బుర్ర పనిచేయదు. ఇంట్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇలా.. ఎక్కడ ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇక గోడ కనిపిస్తే చాలు ఉమ్మివేస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ అది ఏ ట్రైనో, బస్సో కాదండీ.. ఏకంగా విమానంలోనే.. వీడియోలో చూసిన విధంగా ఓ వృద్ధుడు విమానంలో ప్రయాణిస్తున్నాడు. నాలుక లాగేసిందో.. ఏమో..! గానీ విమానంలో ప్రయాణిస్తుండగానే తంబాకును జేబులో నుంచి తీశాడు. దాన్ని చేతిలో వేసుకునే నలిపి.. అమాంతం పెదవి కింది భాగంలో పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కరోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. फ्लाइट में हो या ट्रेन में एक खिली खैनी बहुत जरूरी हैं 😂😅 pic.twitter.com/GknxrYtJwY — छपरा जिला 🇮🇳 (@ChapraZila) August 26, 2023 వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'విమానంలోనే తంబాకు వేశావ్.. సరేగానీ ఎక్కడ ఉమ్మివేస్తావ్ బాబాయ్..!' అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు. వీరు మారరురా బాబు.. అంటూ మరో నెటిజన్ స్పందించాడు. నాలుక లాగేస్తుందా..? తాత అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.''నాకూ కొంచం పెట్టవా..' అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ఇదీ చదవండి: గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..? -
అలా చేయడం డైటింగ్ కాదు..ఈటింగ్ డిజార్డర్!
దియా హైదరాబాద్లో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్. 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల ముగ్ధలా కనిపించాలని తాపత్రయపడుతుంటుంది. ప్రతిరోజూ ఉదయమే బరువు చెక్ చేసుకుంటుంది. తన వయసుకు, ఎత్తుకు తగ్గ బరువే ఉన్నా ఆమెకు సంతృప్తిగా ఉండదు. తానింకా బరువు తగ్గాలని విపరీతంగా డైటింగ్ చేస్తుంది. ఎక్సర్సైజుల సంగతి సరేసరి. వీటన్నింటివల్ల ఆమె ఆరోగ్యంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. రెండు నెలల కిందట రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయిస్తే గుండె క్రమరాహిత్యంగా కొట్టుకుంటోందని (అరిథ్మియా), రక్తపోటు కూడా తక్కువగా (హైపోటెన్షన్) ఉందని తేలింది. అయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి వర్పు రాలేదు. చివరకు మొన్న కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కూడా డైటింగ్ గొడవే. దాంతో అది ఆరోగ్య సమస్య కాదని, మానసిక సమస్యని గుర్తింన డాక్టర్ సైకో డయాగ్నసిస్కి పంపించారు. దియా అనోరెక్సియా నెర్వోసా అనే ఈటింగ్ డిజార్డర్తో బాధపడుతోంది. ఇది తిండికి సంబంధింన ఒక మానసిక సమస్య. బరువు పెరుగుతామనే భయం దీని ప్రధాన లక్షణం. దాంతో విపరీతంగా డైటింగ్ చేస్తుంటారు. దానివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు రావడంతోపాటు, మరణానికి కూడా దారి తీస్తుంది. సాధారణంగా టీనేజ్, తదుపరి వయసు మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. పిల్లలు, పురుషులు, వృద్ధుల్లో కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఒకటి నుంచి రెండు శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. రూపాన్ని బట్టి చెప్పలేం.. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి అనోరెక్సియా ఉందో లేదో చెప్పలేం. మామూలు బరువు ఉన్న వ్యక్తుల్లో కూడా ఈ రుగ్మత ఉండవచ్చు. అలాగే ఈ రుగ్మత లేకున్నా తక్కువ బరువుతో ఉండవచ్చు. కాబట్టి అనోరెక్సియాను గుర్తించడానికి శారీరక, వనసిక, భావోద్వేగ, ప్రవర్తనా సంకేతాలను గుర్తించాల్సి ఉంటుంది. భావోద్వేగ, మానసిక సంకేతాలు: బరువు పెరుగుతుందనే తీవ్రమైన భయం, తక్కువ బరువు ఉన్నప్పటికీ కొవ్వు ఉన్న ఫీలింగ్, విపరీతమైన డైటింగ్, స్వీయహాని, ఆత్మహత్య ఆలోచనలు. ప్రవర్తనా సంకేతాలు: ఆహారపు అలవాట్లు లేదా దినచర్యలలో మార్పులు, కొన్ని ఆహారాలను మానేయడం, ఆకలిని అణచివేసే మందులను ఉపయోగించడం, మితిమీరిన వ్యాయామం. శారీరక సంకేతాలు: కొన్ని వారాలు లేదా నెలల్లో గణనీయమైన బరువు తగ్గడం, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) లో వివరించలేని మార్పు, తరుచుగా అలసిపోయినట్లు అనిపించడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం (బ్రాడీకార్డియా), ఋతు క్రమం సక్రమంగా లేకపోవడం, ఆబ్సెంట్ పీరియడ్స్ (అమెనోరియా) ‘జీరో సైజ్’ కూడా కారణమే.. అనోరెక్సియాకు కచ్చితమైన కారణం తెలియదు. అయితే కొన్ని జన్యుపరమైన అంశాలు, వనసిక లక్షణాలు, పర్యావరణ కారకాలు, ముఖ్యంగా సామాజిక సాంస్కృతిక కారకాల కలయిక దీనికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈటింగ్ డిజార్డర్స్ దాదాపు 50% నుంచి 80% జన్యుపరమైనవని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ డిజార్డర్తో బాధపడే తోబుట్టువులు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈ రుగ్మత అభివృద్ధి చెందడానికి 10 రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. మెదడు రివార్డ్ సిస్టమ్, సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లలో మార్పులు. శారీరక వేధింపులు లేదా లైంగిక వేధింపులు కూడా ఈటింగ్ డిజార్డర్ రావడానికి కారణమవుతాయి. జీరోసైజ్ ఉన్నవారే అందమైనవారనే అవాస్తవ శరీర ప్రమాణాలు. తోటివారి టీజింగ్, అపహాస్యం, బెదిరింపులు.. · మానవ సంబంధాలు సరిగా లేకపోవడం, ఆత్మగౌరవం తగ్గడం! దీర్ఘకాల చికిత్స అవసరం.. మీరు అనోరెక్సియాతో బాధపడుతుంటే ముందుగా మీ కుటుంబ సభ్యులకు తెలపండి. దాని గురించి అవగాహన పెంచుకోండి. తగినంత నిద్ర పొందండి. మద్యం లేదా డ్రగ్స్కి దరంగా ఉండండి. దీనికి చికిత్స సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి ఓపిగ్గా ఉండాలి. · అయితే ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా తమకు సమస్య ఉందని గుర్తించరు, అంగీకరించరు. పరిస్థితి తీవ్రమై ప్రాణాంతకమైనప్పుడు మాత్రమే వారు కిత్సను కోరుకుంటారు. అందువల్ల కుటుంబ సభ్యులే దీన్ని ప్రారంభదశలోనే గుర్తిం చికిత్స చేయించడం చాలా ముఖ్యం. అనోరెక్సియా చికిత్సలో న్యూట్రిషన్ కౌన్సెలింగ్, సైకోథెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్, మందులు ఉంటాయి. అవసరమైతే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ రుగ్మతతో బాధపడే వ్యక్తులు ఇతర మానసిక సమస్యలను కూడా కలిగి ఉంటారు. వాటిని కూడా గుర్తిం సైకోథెరపీ అందించాల్సి ఉంటుంది. · ఆహారం, బరువు పట్ల ఆరోగ్యకరమైన వైఖరిని పెంపొందించడానికి అందించే మానసిక చికిత్సలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (cognitive behavior therapy), డైలెక్టిక్ బిహేవియర్ థెరపీ (pydialectic behavior therapy) , ఇంటర్పర్సనల్ సైకో థెరపీ ( interpersonal psychotherapy ), సైకోడైనమిక్ సైకోథెరపీ (psychodynamic psychotherapy), ఫ్యామిలీ బేస్డ్ థెరపీ (family based therapy) ముఖ్యమైనవి. -సైకాలజిస్ట్ విశేష్ -
యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్
ఒక్కోసారి చిన్నచిన్న సరదాలే ప్రాణాలమీదకు తీసుకొస్తుంటాయి. బీహార్లోని గోపాల్గంజ్లో స్నేహితులు చేసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్లో పాల్గొన్న ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. స్నేహితులు పెట్టిన షరతులకు మించి మూమూస్ తినడంతో ఆ యువకుడు అనారోగ్యం పాలయ్యాడని, అనంతరం ఊపిరి తీసుకోలేక ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుని తండ్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తన కుమారునికి విషం ఇచ్చి చంపేశారని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోపాల్గంజ్లో కొందరు స్నేహితులు ఎంజాయ్ చేస్తూ, వారిలోవారు మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. దీనిలో పాల్గొన్న బిపిన్ కుమార్(25) ఛాలెంజ్కు మించి అధికంగా మూమూస్ తిన్నాడు. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. బిపిన్ పరిస్థితిని గమనించిన అతని స్నేహితులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బిపిన్ ఒక మొబైల్ రిపేరింగ్ దుకాణంలో పనిచేస్తుంటాడు. కుమారుని మృతి నేపధ్యంలో అతని తండ్రి మాట్లాడుతూ తన కుమారుని చేత విషం తినిపించారని, తన కుమారుడిని అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపించారు. వారంతా ఉద్దేశపూర్వకంగానే ఈ ఛాలెంజ్ చేసి, తన కుమారుడని హత్యచేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే -
ముక్కులోంచి వెళ్లి మెదడు తినేసింది.. 15 ఏళ్ల కుర్రాడు మృతి!
కేరళలోని అలప్పుజా జిల్లాలో జరిగిన ఒక ఘటన అందరిలో కలవరాన్ని పెంచింది. కలుషిత నీటిలో ఉండే అమీబా ఒక యువకుని ప్రాణాలను బలిగొంది. ఈ అమీబా ఆ కుర్రాడి మెదడులో నిన్ఫెక్షన్ను వ్యాపింపజేసింది. అది మెదడును తిసేసింది. కేరళ ఆరోగ్యశాఖమంత్రి వీణా జార్జ్ తెలిపిన వివరాల ప్రకారం అలప్పుజా జిల్లాకు సమీపంలోని పనావల్లికి చెందిన కుర్రాడు ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి బారినపడ్డాడు. గతంలోనూ ఇటువంటి కేసులు.. గతంలోనూ ఇటువంటి ఐదు కేసులు వెలుగు చూశాయి. దీనిలో మొదటి కేసు 2016లో తిరమాల వార్డులో వెలుగు చూడగా, 2019, 2020లలో మలప్పురంలో రెండేసే కేసులు చొప్పున వెలుగు చూశాయని మంత్రి తెలిపారు. 2020, 2022లలో కోజికోడ్, త్రిశూర్లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యింది. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ సోకినవారంతా మృత్యువాత పడ్డారు. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి.. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాగా వ్యాధి తీవ్రతను గమనించిన అలప్పుజా జిల్లా వైద్యశాఖ అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. కలుషిత నీటితో స్నానం చేయవద్దని సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుడు జ్వరం, తలనొప్పి, వాంతులు మొదలైన సమస్యలను ఎదుర్కొంటాడని వారు తెలిపారు. సూక్ష్మదర్శినితో మాత్రమే.. ఈ అమీబా ఎంత ప్రమాదకరమంటే ఇది మెదడులోని కణాలను తినేస్తుంది. ఇన్ఫెక్షన్ను వ్యాపింపజేస్తుంది. ఇది బాధితుడికి ప్రాణహాని కలిగిస్తుంది. Naegleria Fowleri అనే ఈ అమీబా చాలా చిన్నగా ఉంటుంది. దీనిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతారు. ఇది కూడా చదవండి: అది రావణుని మూత్రంతో నిండిన చెరువు.. ఎక్కడుందంటే.. -
తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? ఈ లక్షణాలు ఉంటే మాత్రం..
కొందరికి ఎంత తిన్నా మళ్లీమళ్లీ ఆకలి వేస్తుంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే ఆరోగ్యపరంగా ఏవో సమస్యలు ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఇలా అతిగా తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే మనం తినే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేయండం ద్వారా ఆకలి సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు వైద్యులు. ► ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే మీ జీర్ణాశయంలో ఏదో సమస్య ఉన్నట్లే... దీనికి మరో కాఱనం.. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తినడం వల్ల ఆకలి పెరగుతుంది. ► మన శరీరంలో 70శాతం వరకూ నీరు నిండి ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత కూడా తిరిగి ఆకలేస్తుందంటే అందుకు శరీరంలో నీరు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి తగినన్ని నీళ్లు తీసుకోవడం చాలా ఉత్తమం. ► బ్రేక్ఫాస్ట్ మానేసి ఒకేసారి భోజనం చేయడం మరికొందరికి అలవాటు. దీనివల్ల ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్న ఫీలింగ్ ఏర్పడి ఎక్కువ తినేస్తారు. ► కొందరికి భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంది. దీనికి మెడిసిన్స్ కారణం ఉండొచ్చు. మెడిసిన్స్లో రాయిడ్స్, ప్రిడ్నోసోన్స్, కార్టికాస్టెరాయిడ్ వంటివి ఆకలిని మరింత పెంచేస్తాయి. ► అతిగా వర్కవుట్స్ చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గిపోయి ఎక్కువగా ఆకలేస్తుంటుంది. కాబట్టి శరీరానికి ఎంత అవసరమో అంతవరకే వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ►ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనది ఒత్తిడి. ఈరోజుల్లో చాలావరకు ఒత్తిడితో బాధపడుతున్నవాళ్లు ఉన్నారు. అదే సమయంలో ఎక్కువ ఆహరం తీసుకోవాలనిపిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. ►మనం తినే ఆహారంలో శరీరానికి సరైన పోషకాలు, ప్రోటీన్స్ అందకపోయినా వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. కాబట్టి సరైన డైట్ను పాటిస్తూ వేళకు భోజనం, 8గంటల నిద్ర పాటిస్తే మంచిందటున్నారు డైటీషియన్స్ -
భయం వద్దు మిత్రమా... కూల్గా తినుమా! సీనియర్ నటి సలహాలు
డైనింగ్ ఎటికేట్లో భాగంగా కొన్ని రెస్టారెంట్లలో, ఫంక్షన్లలో ఫోర్క్, నైఫ్లతో తినడం తప్పనిసరి అవుతుంది. అయితే అది అందరికీ సులభం కాకపోవచ్చు. పొరపాట్లు దొర్లవచ్చు. ఎవరైనా గమనిస్తున్నారేమో... అనే ఆలోచనతో కూడా భోజనాన్ని సరిగ్గా తినలేకపోవచ్చు. ‘ఇదంతా ఎందుకు... ఫోర్క్, నైఫ్లతో సరిౖయెన పద్ధతిలో ఎలా తినాలో నేర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ట్యుటోరియల్ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఫోర్క్, నైఫ్లతో ఎలా తినాలో చూపించింది నీనా గుప్తా. ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లితే... ఒకప్పుడు నీనా కూడా ఫోర్క్, నైఫ్లతో తినడం రాక చాలా ఇబ్బంది పడేది. దీంతో పట్టుదలగా తినే పద్ధతిని నేర్చుకుంది. ‘నాకైతే చేతులతో తినడమే ఇష్టం’ అని నీనా గుప్తా చెప్పడం కొసమెరుపు. -
మ్యాంగో ఈటింగ్ పోటీలు
-
కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా?
కుక్క కరిస్తే ఎంత ప్రమాదమో అని అందరికీ తెలుసు. అందుకే అది కరిచిన వెంటనే ర్యాబిస్ వ్యాధి రాకుండా ఇంజెక్షన్లు తీసుకుంటాం. కొద్ది రోజులు ఆహార నియమాలు పాటిస్తాం. అయితే కుక్క కాటు కంటే మనిషి కరిస్తేనే అత్యంత ప్రమాదకరమట. ఆ వ్యక్తి కోలుకోవడానికే ఆరు నెలల పడుతుందట. ఔను! ఈ విచిత్ర ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే..డోని ఆడమ్స్ ఫిబ్రవరిలో టంపా బేలో ఒక కుటుంబ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ చిన్న గొడవ జరిగింది. దీంతో ఇద్దరు బంధువులు కలబడ్డారు. వారిని విడదీసేందకు మధ్యలో కలగజేసుకున్న ఆడమ్స్ని ఒక వ్యక్తి కోపంతో మోకాలిపై కరిచాడు. దీంతో అతను నైక్రోటైజింగ్ షాసిటిస్ వ్యాధి బారినపడ్డాడు. దీనిని సాధారణంగా మాంసం తినే భ్యాక్టీరియా అని పిలుస్తారు. దీని కారణంగా శరీరీం కుళ్లిపోతూ ఇన్ఫెక్షన్కు గురై చనిపోతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా చర్శంలోకి ప్రవేశించి కండరాల తొడుకు ఉండే ఆరోగ్యకరమైన కణజాలాన్ని నాశనం చేస్తుంది. పాపం ఆ ఘటన కారణంగా ఆడమ్స్ ఆస్పత్రికి సందర్శించాల్సి వచ్చింది. అక్కడ వైద్యలు ఈ విషయాన్నే ఆడమ్స్ తెలిపారు. వెంటనే శస్త్ర చికిత్స చేయలని లేదంటే ప్రాణాంతకమని చెప్పారు. కుక్క కాటు కంటే మనిషి కాటు ఎంత ప్రమాదమో వైద్యులు అతనికి వివరించి చెప్పారు. శస్త్ర చికిత్సలో ఆడమ్స్కి 70 శాతం కణజాలాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ శస్త్ర చికిత్స త్వరిత గతిన చేయకపోతే గనుక ఆడమ్స్ కాలుని కోల్పోవలసి ఉండేది. అతను కోలుకోవడానికి మూడు వారాలు పడితే..పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. దీంతో ఆడమ్స్ ఈ భయానక ఘటన నుంచి కోలుకునేలా చేసిన వైద్యులకు రుణపడి ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆడమ్స్. కుక్క కాటు కన్న మనిషిక కాటు ఇంతా భయానకంగా ఉంటుందని తాను అస్సలు అనుకోలేదని వాపోయాడు. అందుక సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్) -
రేబిస్తో ఉన్మాదిగా మారి చంపి తిన్నాడు!
జైపూర్: రాజస్తాన్లో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వృద్ధురాలిని చంపి, ఆమె మాంసం తిన్నాడు. ముంబైలో ఉండే సురేంద్ర ఠాకూర్(24) ఇటీవలే తన సొంత పాలి జిల్లా సెండ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరధనా గ్రామానికి వచ్చాడు. పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న అతడు శుక్రవారం పొలంలో పశువులు మేపుకుంటూ ఉన్న శాంతిదేవి(65)ని బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఆమె మాంసం తిన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని అతికష్టమ్మీద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్య, నరమాంసభక్షణ నేరం కింద పోలీసులు కేసు పెట్టారు. ఠాకూర్ను ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి(హైడ్రోఫోబియా) బాధితుల్లో వ్యాధి ముదిరితే చివరి దశలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. -
ఇలాంటి ఫుడ్ తింటే క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే
-
కిచిడి తిని 21 మంది అస్వస్థత
కిచిడి తిని పిల్లలు, పెద్దలతో సహా 21 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో బాగ్పత్లోని నానానా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ దేవాలయం వసంత నవరాత్రి సందర్భంగా జరిగిన విందులో కిచిడి తిని 20 మంది పిల్లల తోసహ కొందరు పెద్దలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసుల, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని బాదితులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, మిగతా పిల్లలు, పెద్దల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఎస్కే చౌదరి మాట్లాడుతూ..ఆలయంలోని కిచిడి తిని రెండు డజన్ల మందికి పైగా ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. అలాగే పిల్లల బాగుగాలు చూసేందుకు ఇద్దరు శిశు వైద్యులను నియమించినట్లు తెలిపారు. (చదవండి: పానీపూరీలు అమ్ముకుంటున్న వైద్యురాలు.. ఎందుకంటే..) -
వాట్ ఏ మాస్క్..ఎంచక్కా తీయకుండానే అలానే ఆహారం తినేయొచ్చు
చైనాలో అత్యంత ఘోరంగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. జీరో కోవిడ్ పాలసీ ఆంక్షలను సడలించాకే అత్యంత దారుణంగా కేసులు పెరగడం అందర్నీ విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఒక పక్క ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతుంటే మరోవైపు వైద్యులు వారికి చికిత్స అందించలేక సొమ్మసిల్లి కుప్పకూలిపోతున్నారు. చైనాలో విస్తృతంగా పెరుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి కూడా. చైనా ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల ప్రకారం... ప్రస్తుతం సుమారు 37 మిలియన్ల మంది కరోన బారిన పడి ఉండవచ్చునని అంచనా వేసింది. టీకాలు సత్వరమే వేయడంలో వైఫల్యం తోపాటు ప్రజలకు వాటిపై సరైన అవగాహన కల్పించకపోవడం తదితర కారణాల రీత్యా ఈ దుస్థితిని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఒక వ్యక్తి ఒక వెరైటీ ఆకృతిలోని మాస్కోని ధరించి అందర్నీ ఆకర్షించాడు. సదరు వ్యక్తి పెద్ద ముక్కు ఆకృతిలోని పేపర్ మాస్క్ని ధరించాడు. పైగా దానికి ఓపెనింగ్ కూడా ఉంది. ఎంచక్కా మాస్క్ తీయకుండానే అలానే తినేయవచ్చు. అతను ఒక రెస్టారెంట్లో ఆ మాస్క్ ధరించి చక్కగా పదార్థాలను లాగించేస్తున్నాడు. చూస్తుంటే అచ్చం పక్షుల మాదిరిగి తింటున్నట్లు చూడముచ్చటగా ఉంది. అందుకు సంబంధించిన వీడియోను సఫీర్ అనే వినియోగదారుడు ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Bulls like me feeding on stocks today despite the covid fears after wearing mask. pic.twitter.com/W9LB2QRjSc — Safir (@safiranand) December 23, 2022 (చదవండి: తలకిందులుగా ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్) -
ఎంచక్కా పానీపూరీలు లాగించేస్తున్న గజేంద్రుడు
పానీపూరీ గురించి తెలియనివారు ఎవరు ఉండారు. సగాని పైగా ఆ స్నాక్స్ అంటే పడి చచ్చేవాళ్లే. అలాంటి పానీపూరిని ఒక ఏనుగు ఎంతో ఇష్టంగా లాగించేస్తోంది. సదరు బండివాడు చక్కగా సర్వ్ చేస్తుంటే ...చక్కగా ఒక్కొక్కటి నోట్లో వేసుకుని ఎంజాయ్ చేస్తూ...లాగించేస్తోంది. ఈ ఘటన అస్సాంలోని తేజ్పూర్లో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఏనుగు మార్కెట్లో ఉన్న పానీ పూరీ బండి వద్దకు వచ్చి మరీ పానీపూరీలను తింటోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Elephant enjoying pani puri in Guwahati.#guwahati #elephant #panipuri pic.twitter.com/AJz3RVwlBa — Trolls Officials (@trollsofficials) October 12, 2022 (చదవండి: పులితో పరాచకాలు వద్దు! దాడి చేస్తే ఖతమే!) -
Photo Feature: పుడమితల్లి ఒడిలో.. అంతులేని ఆనందం
డైనింగ్ టేబుల్ లేదు.. వడ్డించే వారూ ఉండరు.. కూర్చొనేందుకు సరైన సౌకర్యమూ ఉండదు. అయితేనేం.. తినే ప్రతీ మెతుకులోను అంతులేని ఆనందం వారి సొంతం. పుడమితల్లి ఒడిలో.. చేలగట్లపై సమయానికి తినే పట్టెడు అన్నమే వారికి బలం. ఆ శక్తితోనే ఎంతో మందికి అన్నం పెట్టేందుకు పొలంలో శ్రమిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి మించినది లేదని చాటిచెబుతారు. విజయనగరం జిల్లా కుమిలి రోడ్డులో పొలం గట్లపై సామూహికంగా భోజనాలు చేస్తూ సోమవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన మహిళా రైతుల చిత్రమే దీనికి సజీవ సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం చకచకా ఈ–క్రాప్ జిల్లాలో ఈ–క్రాప్ నమోదు చకచకా సాగుతోంది. సచివాలయ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు, నష్ట పరిహారం, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి ప్రయోజనాలు రైతులకు చేరాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి. రైతులు కూడా బాధ్యతగా ఈ నెల 31లోగా ఈ క్రాప్ నమోదు చేయించుకునేందుకు చొరవచూపాలని అధికారులు సూచిస్తున్నారు. – నెల్లిమర్ల రూరల్ ముందస్తు వైద్యం వర్షాలు కురిసే వేళ.. కలుషిత మేత, నీరు తాగడంతో జీవాలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. జీవాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ముందస్తుగా ఉచిత వైద్యసేలందిస్తోంది. ఊరూరా పశువైద్య శిబిరాలు నిర్వహించి నట్టల నివారణ మందు వేయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6,04,665 జీవాలు ఉండగా వీటిలో గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. జీవికి రూ.2.50 పైసల చొప్పున సుమారు రూ.18 లక్షల విలువైన డోసులను సరఫరా చేసింది. ఈ నెల 16న ప్రారంభమైన నట్టనివారణ మందు వేసే ప్రక్రియ ఈ నెల 31 వరకు సాగనుందని పశుసంవర్థకశాఖ జేడీ వైవీ రమణ తెలిపారు. – రామభద్రపురం ఐదు అడుగుల అరటిగెల.. చీపురుపల్లిరూరల్(గరివిడి): అరటిగెల సాధారణంగా 3 నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. అయితే, గరివిడి పట్టణంలోని బద్రీప్రసాద్ కాలనీలో ఓ విశ్రాంత ఫేకర్ ఉద్యోగి ఇంటి పెరటిలోని అరటిచెట్టు ఐదు అడుగుల గెల వేసింది. 300కు పైబడిన పండ్లతో చూపరులను ఆకర్షిస్తోంది. (క్లిక్: మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!) -
తినుబండారాలనుకుని కొంగల కోసం దాచిన గుళికలను తిని..
ఏర్పేడు(చిత్తూరు జిల్లా): కొంగల కోసం ఇంట్లో దాచిన గుళికలను తినుబండారమనుకుని తినడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన ఏర్పేడు మండలం, ముసలిపేడు పంచాయతీ, బత్తెనయ్య ఎస్టీ కాలనీలో సోమవారం విషాదాన్ని నింపింది. గ్రామస్తుల కథనం.. ముసలిపేడు బత్తెనయ్య ఎస్టీ కాలనీకి చెందిన బాబు, గోవిందమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: ఆలస్యంగా వెలుగులోకి.. పెళ్లి భోజనం వికటించి.. బాబు తరచూ కొంగలకు గుళికలు పెట్టి, మృతి చెందిన తర్వాత వాటిని తెచ్చుకుని తింటుండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో గుళికల ప్యాకెట్ ఉంచి సోమవారం బాబు తన భార్య గోవిందమ్మతో కలిసి వ్యవసాయ కూలి పనులకు వెళ్లాడు. బాబు రెండో కుమారుడు నాని(3) ఇంట్లోని గుళికలను తినుబండారం అనుకుని వాటిని తినడంతో అపస్మారక స్థితికి చేరుకుని కొంత సేపటికే మృతిచెందాడు. విగత జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది!
Cold grave for nearly 24,000 years without eating or drinking: చాలా షాకింగ్ ఘటనలు చూస్తే అసలు అదేలా సాధ్యం అని కూడా అనుకుంటాం. నిజానికి ఈ విశాలా విశ్వంలో మన ఊహకు అందని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కాకపోతే అసాధ్యం అనుకునేవి జరిగేంత వరకు కూడా మనం అంత తేలిగ్గా నమ్మం. అచ్చం అలాంటి సంఘటనే ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఆర్కిటిక్లో మైనస్ డిగ్రీల ఉష్టోగ్రత ఉంటుంది. పైగా చాలా దారుణమైన గడ్డకట్టుకుపోయేంత చలి. అలాంటి ప్రాంతంలో మంచు తుపానులో చిక్కుకున్న లేదా కూరుకుపోయిన బతికే ఛాన్స్ లేనే లేదు. కానీ శాస్త్రవేత్తలు ఆర్కిటిక్లోని గడ్డకటట్టే చలిలో పరిశోధనలు చేయడానికి వెళ్లినప్పుడూ వారికి ఒక ఊహించని షాకింగ్ ఘటన ఎదురైంది. అక్కడ మంచులో కూరుకుపోయి పడి ఉన్న ఒక వింత జీవిని చూశారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది నిక్షేపంగా బతికే ఉంది. అయితే ఆ జీవి దాదాపు 24 వేల ఏళ్లుగా ఏమి తినకుండా, తాగకుండా మంచులోనే పడి ఉంది. ఇలాంటి వాటిని మైక్రో-జోంబీ జీవులు అంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి జంతువులు 50 మిలియన్ల ఏళ్ల క్రితం వివిధ నీటి ప్రాంతాల్లో కనుగొన్నారని చెప్పారు. అయితే ఈ జీవి చర్మం మంచు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని చెప్పారు. ఇది మాత్రమే కాదు, వీటిని లేడ్ రోటిఫర్స్ లేదా వీల్ యానిమల్స్ అని కూడా పిలుస్తారని అన్నారు. అయితే వీటి చర్మంపై చాలా కణాలతో కూడిన సూక్ష్మ జీవుల ఉంటాయని, పైగా నోటి చుట్టూ దట్టంగా వెంట్రుకలు ఉంటాయని అన్నారు. ఇంతకుముందు రష్యన్ శాస్త్రవేత్తలు -20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పది సంవత్సరాల వరకు జీవించగల అటువంటి రోటిఫర్లను కనుగొన్నారని కూడా చెప్పారు. అయితే ఇవి జన్మనివ్వవని, అలైంగికమైనవని తెలిపారు. అయితే శరీరం పొడవుగా ఉంటుందన్నారు. వాటి పొడవు 0.04 నుంచి 2 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని, కానీ చాలా వరకు 0.5 మిల్లీమీటర్లకు మించి పెరగవు అని వెల్లడించారు. పరిమాణంలో చిన్నది అయినప్పటికీ వారి శరీరంలో చాలా క్లిష్టమైన అవయవాలు ఉన్నాయని వాటిని మైక్రోస్కోప్ లేకుండా చూడలేమని చెబుతున్నారు. ఈ రోటిఫర్లను చూస్తే ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు ఉన్నాయని అనిపిస్తుంది కదా (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్లో ఏముందో తెలుసా!) -
ఇక్రిశాట్లో ఆసక్తికర ఘటన.. శనగకాయలు తిన్న ప్రధాని మోదీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి, రామచంద్రాపురం: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఇక్రిశాట్ పరిశోధనల పురోగతిని వారు ప్రధానికి వివరించారు. సజ్జ, కంది, శనగ, వేరుశనగ, ఇతర చిరుధాన్యాలు, విత్తన రకాలు, నాణ్యతపై ప్రధాని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంట క్షేత్రాలను పరిశీలించారు. అక్కడ సాగవుతున్న శనగ పంటను చూసి కాయలను కోసుకొని రుచి చూశారు. స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధానిని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానించారు. చదవండి: 20 రకాల కూరలతో సుష్టుగా తినొచ్చు.. ధర రూ.100 మాత్రమే! -
భయానకం: పామును మరో పాము తినడం చూశారా?
సాధారణంగా పాముకు ఆకలేస్తే.. ఏ కప్పనో, ఎలుకనో తినడం మనం చూస్తూనే ఉంటాం. . కానీ ఓ పాము మరో పాముని తినడం ఎప్పుడైనా చూశారా? వినడానికి కొంచెం విచిత్రంగానే ఉన్న.. నిజంగానే ఓ పాము మరో పాముని గబుక్కున తినేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. పర్వీన్ పోస్టు చేసిన ఈ ఫోటోలో అడవుల్లోని ఓ కోబ్రా ఇంకో కోబ్రాను అమాంతం నోటిలో కరుచుకొని మింగుతోంది. ఇది చూడటానికి తీవ్ర భయంకరంగా కనిపిస్తోంది. ‘ అద్భుతమైన కోబ్రా ఓఫియోఫాగస్ హన్నా.. మరో కింగ్ కోబ్రాను తింటోంది’. అంటూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా మరో పోస్టులో పర్వీన్ కశ్వాన్ ఒఫియోఫాగస్ హన్నా అర్థాన్ని వివరించారు. ఈ కింగ్ కోబ్రా యొక్క శాస్త్రీయ నామం; ఓఫియోఫాగస్ హన్నా. ఓఫియోఫాగస్ గ్రీకు భాషా పదం ఉద్భవించింది, దీని అర్థం ‘పాము తినడం’. అలాగే గ్రీకు పురాణాలలో చెట్టు, నివాస వనదేవతల పేరు నుంచి హన్నా ఉద్భవించింది. కాబట్టి కింగ్ దాని పేరుకు తగట్టు ఉంటుంది. ఇది గూళ్ళు నిర్మించే ఏకైక పాము.’ అని పేర్కొన్నారు. పాము ఇంకో పామును మింగటాన్ని చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. The scientific name of this king cobra is; Ophiophagus hannah. “Ophiophagus” is derived from Greek, meaning “snake-eating” and hannah is derived from the name of tree-dwelling nymphs in Greek mythology. So king living true to its name. The only snake which build nests. — Parveen Kaswan (@ParveenKaswan) July 19, 2021 Ophiophagus hannah. A king cobra eating a spectacled cobra. They feed on lesser mortals. pic.twitter.com/LL8xzQoIww — Parveen Kaswan (@ParveenKaswan) July 19, 2021 -
పొట్టలో పెరుగుతున్న ప్లాస్టిక్
సింగపూర్: ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి సగటున వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ను పొట్టలోకి పంపించేస్తున్నాడు. అంటే క్రెడిట్ కార్డుతో సమానమైన ప్లాస్టిక్ను వారంవారం మనిషి పలు రూపాల్లో తినేస్తున్నాడు. అంటే మనిషి తినే, తాగే పదార్థాల ద్వారా ప్లాస్టిక్ భూతం పొట్టలో పేరుకుపోతోంది. ఇదే విషయమై ఎంత పరిమాణంలో ప్లాస్టిక్ను తింటున్నామో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాలోని న్యూకాసిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. దీనిలో భాగంగా తాగునీరు, షెల్ ఫిష్, తేనే వంటి ఆహార పదార్థాల్లో ఎంతమేర సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్ కణాలు ఉన్నాయో పరిశీలించారు. దీని ప్రకారం మనిషి వారంలో 5 గ్రాముల మేర ప్లాస్టిక్ను మింగేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇదే ఫైనల్ అయ్యే అవకాశం లేదని, ఇంతకంటే ఎక్కువే ప్లాస్టిక్నే మనిషి తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఎందుకంటే కేవలం కొన్ని పదార్థాల్లోని ప్లాస్టిక్ను మాత్రమే తాము పరిశీలించామని, ప్యాకేజి ఆహారం, ఇతర మార్గాల్లో తీసుకునే పదార్థాలను తాము అధ్యయనం చేయలేదని తెలిపారు. కేవలం వారంలోనే 5 గ్రాములు తింటుంటే.. నెల, సంవత్సరం, దశాబ్దం.. ఇక జీవిత కాలంలో ఎంత మేర ప్లాస్టిక్ను తినాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. -
భోజన ప్రియుల టిక్టాక్ వీడియో
-
కలుషిత ఆహార కలకలం
పార్వతీపురం టౌన్: పాడైన ఆహారం తిన్న 45మంది విద్యారి్థనులు రాత్రికి రాత్రి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలయ్యారు. పార్వతీపురం మండలం కవిటిభద్ర కేజీబీవీ వసతిగృహంలో మంగళవారం మధ్యాహ్నం వండి వడ్డించగా మిగిలిన కూరలు, పెరుగు రాత్రి వేళ కూడా విద్యారి్థనులకు బలవంతంగా వడ్డించడంతో గత్యంతరం లేక వాటిని తిన్న వారంతా అనారోగ్యం పాలయ్యారు. మొత్తం 165మంది విద్యారి్థనుల్లో 45మందికి విరేచనాలు, వాంతులు ఒక్కసారిగా ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న ఏఎన్ఎం ప్రాథమిక చికిత్స అందించి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పూర్తి చికిత్సకోసం తరలించారు. అనారోగ్యం పాలైనవారిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులున్నారు. వెంటనే పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పి.వరలక్ష్మి, సిబ్బంది హుటాహుటిన వారిని రాత్రికి రాత్రి ఆస్పత్రిలో చేర్పించి అత్యవసర చికిత్సను ఇప్పించారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్–2 ఆర్.కూర్మనాథ్, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి బుధవారం ఉదయం ఏరియా ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై దర్యాప్తు చేశారు. విద్యారి్థనుల ఆరోగ్యంపరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రూరల్ ఎస్ఐ వీరబాబు, తహసీల్దార్ శివన్నారాయణ, ఎంఈఓ కృష్ణమూర్తి, ఎంపీడీఓ కె. కృష్ణారావు తదితర అధికారులు ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వద్దన్నా వడ్డించడం వల్లే... మధ్యాహ్నం వడ్డించగా మిగిలి పోయిన పెరుగు వేసుకునేందుకు పిల్లలు అంగీకరించలేదు. కానీ ఊరికే వృథా అవుతుందన్న కారణంతో సిబ్బంది బలవంతంగా వారిచే తినిపించారు. అదే వారి కొంప ముంచింది. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వాగ్దేవి ఆధ్వర్యంలో వైద్యబృందం తక్షణ వైద్యసేవలు అందించడంతో ప్రమాదం తప్పింది. కోలుకున్న 30మంది విద్యారి్థనులకు అల్పాహారం ఇచ్చి హాస్టల్కు తిరిగి పంపించారు. మిగిలిన వారికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించి మెరుగుపడేంతవరకు ఆస్పత్రిలో ఉంచారు. వారిలో ముగ్గురు కోలుకొనేందుకు రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. అధికారుల ఆరా... విద్యారి్థనుల అస్వస్థత విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి, జాయింట్ కలెక్టర్–2 ఆర్. కూర్మనాథ్ బుధవారమే పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఫుడ్పాయిజినింగ్ కారణాలపై సిబ్బందిని నిలదీశారు. ఇకపై ఇలాంటి పరిణామాలు ఎదురైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. రాష్ట్ర బాలబాలికల హక్కుల కమిషన్ మెంబర్ పి.వి.వి.ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యారి్థనులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీకి వెళ్లి పరిసరాల శుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపట్ల పాఠశాల సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను ఆరా తీశారు. ఏమైపోతుందోనని భయపడ్డాం.. రాత్రి భోజనం చేసిన తరువాత కొంత సేపటికి వసతిగృహంలో చాలా మంది అమ్మాయిలకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయని ఏఎన్ఎంకు చెప్పాం. ఆమె మాత్రలు ఇచ్చినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో భయపడ్డాం. ఎస్ఓ మేడమ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను ఇప్పించారు. భోజనంలో నాణ్యత లేకపోవడంవల్లే ఇలా అయింది. – ఎస్.శరణ్య, విద్యార్థిని పాడైన ఆహారం వల్లే... రాత్రి భోజనంలో మధ్యాహ్నం మిగిలిన కూరలు, పెరుగు ఇచ్చారు. వాటిని తిన్న తరువాతనే వాంతలు, విరేచనాలు మొదలయ్యాయి. దాదాపు అందరిదీ అదే పరిస్థితి కావడంతో విషయం తెలుసుకుని ఎస్ఓ మేడమ్, ఏఎన్ఎం మమ్మల్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ఇప్పించారు. – ఎస్.శకుంతల, విద్యార్థిని పుల్లని పదార్ధాలు ఇవ్వవద్దు.. పులిసిన, చెడిపోయిన పదార్ధాలు విద్యార్థులకు ఇచ్చి వారి ఆరోగ్యంతో ఆటలాడుకోవదు. అదృష్ట వశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డాం. పూర్తిస్థాయి విచారణ చేపట్టి... పరిస్థితులు పునరావృతం కాకుండా చూస్తాం. ప్రస్తుతానికి విద్యారి్థనుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. – జి.నాగమణి, డీఈఓ -
పండ్లు ఎలా తింటే మంచిది?
సాక్షి, న్యూఢిల్లీ : ఆకు కూరలను మాత్రమే తినడాన్ని ‘విజిటేరియనిజం’ అన్నట్లుగా పండ్లను మాత్రమే తినడాన్ని ‘ఫ్రూటరియనిజం లేదా ఫ్రూజివోరిజం’ అని అంటారు. అయితే పండ్లను ఎలా తినాలి? ఆహారానికి ముందు తినాలా? తర్వాత తినాలా? ఏ రకమైన పండ్లను తినాలి? పండ్లను నమిలి తినాలా? జూస్గా చేసుకొని తాగాలా? ఇటీవల చాలా మందిని వేధిస్తున్న అనుమానాలు ఇవి. పరగడుపున పండ్లు తింటే మంచిదని, అప్పుడు అవి మంచిగా జీర్ణం అవుతాయని, అన్నంతోపాటు తింటే టాక్సిక్ ఆసిడ్లు రిలీజై కడుపు పాడవుతుందని ఇటీవల కొందరు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇది పూర్తిగా తప్పని, కడుపులో ఒకోరకమైన పదార్థాలకు ఒకో రకమైన జీర్ణ వ్యవస్థ ఉండదని, మోతాదులో తింటే పరగడుపున తిన్నా, అన్నంతోపాటు తిన్నా పండ్లు ఒకే రకమైన ఫలితాలను ఇస్తాయని స్పెయిన్లోని ‘పాలిటెక్నిక్ యూనివర్శిటీ ఆఫ్ వాలెన్సియా’లో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న జోస్ మైగుల్ ములెట్ తెలియజేశారు. ఆయన కథనం ప్రకారం స్పెయిన్లో ఓ సామెత ప్రచారంలో ఉంది. ‘మిలన్ ఇన్ ది మార్నింగ్ ఈజ్ గోల్డ్, ఆఫ్టర్నూన్ ఇట్ ఈజ్ సిల్వర్, ఎట్ నైట్ ఇట్ కిల్స్ యూ’ (పుచ్చకాయ లేదా కర్భూజా ఉదయం బంగారం, మధ్యాహ్నం వెండిలాంటిది. రాత్రి తింటే నిన్ను చంపేస్తుంది). ఆస్ట్రియా చక్రవర్తి ఆల్బర్ట్–2 1358లో, పోప్ పాల్–2 1471లో, పోప్ క్లెమెంట్–8 1605లో పుచ్చకాయల విందులో వాటికి ఎక్కువగా తినడం వల్ల వారు ముగ్గురు ప్రముఖులు మరణించారనే ప్రచారం ఉంది. ఈ కారణంగా పుచ్చకాయలు తినడంపై సామెత పుట్టుకొచ్చి ఉండవచ్చని ప్రొఫెసర్ ములెట్ వివరించారు. ఒకప్పుడు ఈ పండ్లు ఖరీదు ఎక్కువ అవడం వల్లన ధనవంతులకే అందుబాటులో ఉండేవి కనుక, రాత్రి పూట అవి తినడం మంచిది కాదన్న వాదను పుట్టుకొచ్చి ఉండవచ్చన్నది ప్రొఫెసర్ వాదన. కేవలం పండ్ల వలనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు రావని, వంటకాలను కూడా తినాలని, వండేటప్పుడు కూడా కొన్ని కూరగాయల నుంచి ఆ వేడికి కొన్ని పోషకాలు ఉత్పత్తి అవుతాయని ఆయన చెప్పారు. పండ్లు తినే జంతువులకన్నా మానవులు ఎక్కువ తెలివి తేటలు కలిగి ఉండడానికి, తక్కువ ఆహారం తిన్నా ఎక్కువ శక్తి రావడానికి కారణం అవుతున్నది వంటేనన్నది కూడా ఆయన వాదన. అందుకే కోతులు, చింపాజీలీ లాంటి జంతువులు శక్తి సరిపోక ఎప్పుడూ పళ్లను తింటూనే ఉంటాయని ఆయన చెప్పారు. పండ్లలో డీ విటమిన్ అస్సలు ఉండదని దాని కోసం పాలు, గుడ్లు, మాంసం, చేపలు తీసుకోవడం లేదా ఎండలో కూర్చోవడం లాంటివి చేయాల్సిందేనని ఆయన చెప్పారు. పండ్లను ఎప్పుడైనా తినవచ్చని, అయితే జూస్ బదులు పండ్లను నేరుగా తినడమే మంచిదని ఆయన తెలిపారు. ఉదాహరణకు బత్తాయి తీసుకుంటే మహా అంటే ఒకటి, రెండు తీసుకుంటామని, అదే జూస్ తాగితే నాలుగైదు పండ్ల రసం తాగుతామని, దానివల్ల శరీరంలోని రక్తంలో సుగర్ స్థాయి హఠాత్తుగా పెరుగుతుందని ఆయన అన్నారు. అదే బత్తాయి పండును నమిలి తిన్నట్లయితే అందులోని ఫైబర్ (పీచు) పదార్థం కడుపులోకి వెళ్లి జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తీసుకుంటే మంచిదని, ఆకు కూరలు, పండ్లు, మాంసాహారం అన్న తేడా లేకుండా ఎవరి అలవాట్లనుబట్టి వారు తమ శరీర శ్రమకు తగ్గట్లుగా పరిమితంగా ఆహారాన్ని తీసుకోవడం మంచిదని ‘వాట్ ఈజ్ ఈటింగ్ హెల్తీ’ అనే పుస్తకాన్ని రాసిన ప్రొఫెసర్ ములెట్ సూచిస్తున్నారు. -
మురళీ సార్.. దోశను చంపుతున్నారు
ఒకప్పుడు దూస్రాలతో బ్యాట్స్మన్ను బెంబేలెత్తించిన శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ దోస తింటున్న ఫొటో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న మురళీధరన్, తన టీం సభ్యులతో కలసి బ్రేక్ఫాస్ట్లో దోశ తింటున్నప్పుడు కీపర్ శ్రీ వాత్సవ గోస్వామి ఫొటో తీశాడు. ‘మురళీ సార్ దోశను చంపుతున్నారు’ అనే అర్థంతో సన్ రైజర్స్ జట్టు ఆటగాడు గోస్వామి చేసిన ట్వీట్పై చాలామంది నెటిజన్లు జోకులు వేస్తూ, షేర్ చేస్తున్నారు. మురళీధరన్ దోశ తింటున్న ఫొటో షేర్ చేసిన శ్రీవాత్సవ గోస్వామికి పంజాబ్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఆడే అవకాశం రాలేదు. సారథి కేన్ విలియమ్స్ గైర్హాజరీలో ఆడిన ఆ మ్యాచ్లో రైజర్స్ జట్టు ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ 53 బంతుల్లో 85 పరుగులతో అదరగొట్టడంతో రైజర్స్ 181 పరుగులు చేయగలిగింది. కానీ ఛేదనలో భీకర ఆటగాడు ఆండ్రూ రస్సెల్ 19 బంతుల్లోనే 49 పరుగులు చేసి కోల్కత్తా జట్టును సులభంగా విజయ తీరాలకు చేర్చాడు. -
మెదడు... మెథడు
బరువు తగ్గడానికి డైట్ ప్లాన్స్ చూశారు. ఆ ప్లాన్స్తో పాటు ఇంకో కొత్త ప్లాన్ కూడా ఉంది. అదే లైఫ్స్టైల్ ప్లాన్. మీ రోజువారీ లైఫ్ని కాస్తంత మార్చుకుంటే కంట్రోల్ చేసుకుంటే, హద్దులు విధించుకుంటే బరువు తగ్గచ్చు. బరువు తగ్గాలంటే శరీరం కంటే ముందు మెదడు అదుపులోకి రావాలి. ఆ మెథడ్ ఏంటో తెలుసుకొని ఆచరించండి. స్లిమ్ అవ్వాలి. ఎలా? రేపట్నించి వ్యాయామం మొదలుపెడదాం!’ అని ఓ నిర్ణయానికి వచ్చేసి రేపటికి వాయిదా వేస్తూనే ఉండి ఉంటారు. తినే ఆహారం ద్వారా ఒంట్లో అదనంగా క్యాలరీలు చేరుతూనే ఉంటాయి. టీవీలో వచ్చే షోస్ని గంటల తరబడి చూస్తూ కూర్చునే ఉంటారు. కంప్యూటర్ల ముందు కీ బోర్డ్ నొక్కుతూ పని చేశామనుకుంటారు. కానీ, కాలు కదపక, ఒళ్లు కదలక శరీరంలో చేరిన క్యాలరీలు ఖర్చు కావు. ఫలితం మరింత బరువు. ‘ఈ మధ్య ఒళ్లు చేసినట్టున్నారు..’ అనే సన్నిహితుల మాటలు నిరాశ కల్గిస్తుంటాయి. ‘ఎలాగైనా సరే బరువు తగ్గాల్సిందే అనే లక్ష్యం మీదైతే ఇది మీకోసమే! వ్యాయామం చేయకుండానే అదనపు బరువును తగ్గించుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా.. మీ రోజువారీ జీవనశైలి ఏవిధంగా ఉందో పరిశీలించాలి. ఓ రకంగా మీకు మీరే పరిశోధకులు. మీ జీవనప్రయాణం ఎలా ఉందో చిన్న చిన్న గమనింపులు చేసుకుంటూ, కొద్దికొద్దిగా మార్పులు చేసుకుంటూ కొనసాగించండి. మీబరువు మీ అధీనంలో ఉంటుంది. మీ ప్రయత్నాలు ఇప్పుడే మొదలుపెట్టండి. అందుకు ఇది ఒక చిన్న అడుగే కావచ్చు. కానీ, రేపు పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా వేసే అడుగులకు దారులను సుగమం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడేవి నిర్ధారించి, ఫలితం పొందిన సులువైన మార్గాలు 15 ఉన్నాయి. అవి, ఎక్కువగా అటూ ఇటూ తిరుగుతూ ఉండటం, తక్కువ తినడం, మిమ్మల్ని మీరు చూసుకున్న ప్రతీసారి మెరుగైన ఫలితం పొందామన్న అనుభూతిని పొందడం. ఈ రోజువారీ జీవనశైలి మార్పులను కేవలం ఒకటి – రెండు వారాలు పాటించండి. దాదాపు 3 అంగుళాల మేరకు మీ నడుము వెడల్పు తగ్గుతుంది. కొన్నినెలల్లోనే 5 కిలోల బరువు తగ్గుతారు.అంతేకాదు ఈ విధానం మెరుగైన, ఆరోగ్యకరమైన అలవాట్లు మీ జీవితకాలం ప్రయోజనాన్ని పొందేలా చేస్తుంది. వాణిజ్య ప్రకటనల సమయం టీవీలో మీకిష్టమైన షో చూస్తున్న సందర్భంలోనూ ఒకేచోట కూర్చోకుండా అటూ ఇటూ నడుస్తూ చూడండి. వాణిజ్య ప్రకటనలు వచ్చే సమయంలో బయటవరకు వెళ్లడం, కొన్ని మెట్లు ఎక్కి దిగి రావడం, ఉన్న చోట నుంచి ఒక చిన్న పరుగులాంటి నడకతో మరో చోటుకి వెళ్లడం... వంటివి చేస్తూ ఉండండి. వీటివల్ల మీ గుండె వేగం, శ్వాస వేగం పెరగాలి. రోజూ రాత్రి సమయంలో రెండు గంటలపాటు టీవీ చూస్తూ ఉన్నారనుకోండి ప్రతి 2 నిమిషాలకోసారి విరామం తీసుకోండి. దీనివల్ల అదనంగా 270 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇలా రోజూ చేస్తూ ఉంటే ఏడాదిలో 8 కిలోల బరువు తగ్గవచ్చు. కొవ్వు పదార్థాలు– పరిమితులు అధికం మీకు బాగా నచ్చే ఆహారపదార్థాలలో కొవ్వు అధికంగా ఉండే .. కుకీస్, చాక్లెట్స్, ఐస్క్రీమ్, చిప్స్, వేపుళ్లు..వంటివి ఉన్నాయనుకోండి. వీటిని క్రమంగా తగ్గిస్తూ పోండి. అంటే, కొవ్వు పదార్థాలలో వారానికి ఆరు రకాలవి తీసుకుంటున్నట్లయితే ఆ సంఖ్య 5కు పరిమితం చేయండి. ఆ తర్వాత 4. ఇలా వారానికి ఒకటి చొప్పున తగ్గిస్తూ పోతే మీరే ఆ మరుసటి వారానికి రెండు కొవ్వుపదార్థాలను తీసుకోవడం మానేస్తారు.వీటికి బదులుగా క్యారెట్స్, ఆరెంజ్లు.. వంటి ఇతర తాజాపండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. బరువు తగ్గడానికి వార్తలు ఫిట్నెస్, ఆహారనియమాలకు సంబంధించిన ఆర్టికల్స్ను 16 వారాల పాటు చదువుతూ ఉంటే శారీరక చురుకుదనానికి కావల్సిన మార్పులను తమకు తామే చేసుకోవడానికి సిద్ధం అవుతారని ఒక నివేదికలో తేలింది. ఇలా బరువుకు సంబంధించి హెల్త్ ఆర్టికల్స్ చదివే వారు కొవ్వు పదార్థాలు తగ్గించి తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవడం పెరిగింది. ఇవే అలవాట్లు ఎవరైనా 16 వారాల పాటు కొనసాగిస్తే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడినట్టే. అధిక బరువుకు చెక్పెట్టినట్టే! బేసిక్గా బాడీ వెయిట్ ఎక్సర్సైజులు జిమ్లో చేసేవి స్క్వాట్స్, పుషు–అప్స్ వంటి ప్రా«థమిక వ్యాయామాలు ఉన్నాయి. ఇవి ఇంట్లోనూ చేయవచ్చు. నీళ్లు నింపిన బాటిళ్లు, కూరగాయల సంచులు పైకి లేపడం, నెమ్మదిగా వాటిని కిందకుదించడం.. వంటివి చేయవచ్చు. పరిశీలిస్తే ఇంటి వాతావరణంలోనే ప్రాథమిక వ్యాయామాలు చేయడానికి అనువైనవి ఎన్నో ఉన్నాయి. వీటివల్ల నిమిషాల్లో మెటబాలిజం–రివైవింగ్ అయ్యి కండరాల బలం పెరుగుతుంది. దీంతోపాటే ఇవి బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. మెట్లు ఎక్కడం రోజులో 2 – 3 నిమిషాలైనా మెట్లు ఎక్కాలి. కనీసం 3 నుంచి 5 అంతస్తులు ఎక్కాలి. దీనివల్ల ఏడాదిలో పెరిగిన బరువులో 2 కేజీల బరువును తగ్గించుకోవచ్చు. ఇది తగ్గిన మీ నడుము చుట్టుకొలతనే చెబుతుంది. మహిళలకన్నా మగవారు వారంలో 70కి పైగా మెట్లు ఎక్కి వారానికి 20 చొప్పున పెంచుతూ పోవాలి. మెట్లెక్కడం వల్ల 18 శాతం మరణాల రేటు తగ్గినట్టు హార్వర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది.అందుకని ఈ రోజే మెట్లను అధిరోహించడం ప్రారంభించండి. రోజూ 3 మెట్లు అదనంగా ఎక్కుతూ మీ ట్రెక్కింగ్ను ఇప్పుడే మొదలుపెట్టండి. ఇలా చేస్తే బరువు తగ్గింపులో మీరు ఎన్నోమెట్లు ఎక్కినట్టే. మరింత అదనం మీరు ఒక ఏడాది కాలంలో వేలాది క్యాలరీలు డబ్బును పొదుపు చేస్తున్నట్టుగా ఒంట్లో సేవ్ చేస్తూ ఉంటారు. అదెలాగో చూద్దాం.. వారాంతంలో రెస్టారెంట్కి వెళ్లారు. అక్కడ 610 క్యాలరీలు గల ఒక చికెన్ బర్గర్ను తిన్నారు. దీంట్లో 40 శాతం కొవ్వు, 1,440 మిల్లీ గ్రాముల సోడియం ఉంటాయి. అదే, మీరు సొంతంగా ఇంట్లోనే చికెన్ బర్గర్ని తయారుచేసుకుంటే 230 క్యాలరీలకు మించదు. అంటే, కనీసం దీనివల్ల 400 క్యాలరీలు, 520 మిల్లీగ్రాములు సోడియం కటాఫ్ చేస్తున్నారన్నమాటే. అందుకని మీరు తినే భోజనాన్ని హోటల్స్ వారికి ఆర్డర్ ఇవ్వకుండా మీరే సిద్ధం చేసుకోవడం ఉత్తమం. అలాగే, తినే ఆహారంలో పంచదార, ఉప్పు, కొవ్వులను తగ్గిస్తూ ఉండడం చాలా అవసరం. ఇప్పుడు చెప్పినవన్నీ రెస్టారెంట్ ఫుడ్లో ఎక్కువ శాతం ఉంటాయి. కిలోమీటర్ అనే విధానం కచ్చితం చేయాలి మూడు కిలోమీటర్ల కంటే తక్కువ దూరాలుండే అన్ని ప్రయాణాలకు 89 శాతం వాహనాల మీదే వెళుతుంటారు చాలామంది. డ్రైవింగ్కి ఖర్చుకు చేసే ప్రతి అదనపు గంటకు బరువు 6 శాతం పెరుగుతుంది.క్యాలరీలను ఖర్చు చేయాలంటే తప్పనిసరి రూల్ పాటించాలి. మీరు వెళ్లాల్సిన చోటు కిలోమీటర్ కన్నా తక్కువ దూరం ఉంటే డ్రైవింగ్కి బదులు చురుకుగా నడవాలని ప్రతిజ్ఞ చేసుకోండి. తక్కువ దూరానికి కూడా మీ కారులో ప్రతీసారి వెళ్తూ పార్కింగ్ కోసం టైమ్ వృ«థా చేయకుండా నడక ద్వారా అనేక పనులు సులువుగా చేసుకోవచ్చు అని మీకు మీరే చెప్పుకోండి. ఈ రూల్ని మీరు ఇప్పుడు మెదలుపెడితే వచ్చే ఏడాది వరకు కనీసం 6 నుంచి 7 కిలోలు బరువు తేలికగా తగ్గిపోతారు. రోజులో 10 సార్లు కాళ్లు, చేతులే కాదు నోటి కదలికలకు కూడా పని చెబుతూ ఉండాలి. అంటే, ఒకే మొత్తాన్ని ఒకేసారి భుజించడం కాకుండా రోజులో ఎక్కువసార్లు తినాలనే రూల్ పెట్టుకోండి. దీంట్లో మీరు తినబోయే పదార్థాన్ని నిమిషం సేపు గమనించడం, వాసన చూడటం, దాని వల్ల కలిగే ప్రయోజనాన్ని ఆలోచించడం వంటివి చేయండి. ఆ తర్వాత చాలా కొద్దిగా మాత్రం నోట్లో పెట్టుకోండి. దాన్ని నెమ్మదిగా, బాగా నమలాలి. ఎంతగా అంటే ఆ పదార్థం నోరంతా తిరగాలి. రుచిని ఆస్వాదించాలి. లాలాజలం ఊరాలి. ఆ తర్వాత మరొక ముద్ద తినాలి. దీనివల్ల ఆహారం తీసుకోవడంలో ఒక సంతృప్తి భావన కలుగుతుంది. మీకు ఇంకా తిన్న అనుభూతి కలగాలంటే మరో 20 సార్లు నమలడం పెంచండి. దీనిని ఈటింగ్ ఎక్సర్సైజ్ అనవచ్చు. 10 నిమిషాల్లో తినడం ముగించండి. నెమ్మదిగా తినడం వల్ల మైండ్ కూడా ఫుల్ అయ్యిన భావన కలుగుతుంది. పండ్లు తినండి తాగద్దు పండ్లను తినడం వల్ల శరీరానికి తగినంత పీచు అందుతుంది. రోజూ ఒక యాపిల్ తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. అదే ఒక యాపిల్తో చేసిన జ్యూస్ తాగితే పీచు కాకుండా క్యాలరీలే శరీరానికి అందుతాయి(ఒక యాపిల్లో 3.5 గ్రాముల పీచు ఉంటే, అదే జ్యూస్లో 0.5 గ్రాములు ఉంటుంది). కార్బోహైడ్రేట్స్ ఉండే జ్యూస్ల కన్నా ఫైబర్ ఉన్న పండ్ల వల్ల ఎక్కువ సంతృప్తి, ఆరోగ్యం లభిస్తుందని సుదీర్ఘపరిశోధనల ద్వారా స్పష్టమైంది. ఆహారం అంటేనే నమిలి తినాలి. అది మీ లాలాజలంతో కలవాలి. అప్పుడే మైండ్ సంతృప్తి చెందుతుంది. అదే పండును జ్యూస్ చేసి తాగితే ఆ భావన మైండ్కు చేరదు. పైగా తీపి కోసం వేసే పంచదార వంటివి యాపిల్ పండు కన్నా 48 శాతం క్యాలరీలను జ్యూస్ చేర్చుతుంది. సహాయం పొందండి వ్యాయామం చేయడానికి ఫ్రెండ్ను మించిన ఉత్సాహభరితమైన సపోర్ట్ మరోటి ఉండదు. మీ వీధి చివరన ఉండే ఫ్రెండ్ను కలవడానికి కాలినడకన వెళ్లచ్చు. చేసే వర్కవుట్స్ గురించి ముఖాముఖిగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మధ్య భేషజాలు ఉండవు. మహిళలు నలుగురిలో కలిసి ఉండి, చర్చించుకునే గ్రూప్స్ మన సమాజంలో ఎక్కువ. ఇలా ఒకరికి ఒకరు వ్యాయామం, ఆహారపు అలవాట్ల విషయంలో చర్చించుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ రోజూ 300 క్యాలరీలు ఆహారంలో తగ్గిస్తూ, నడకను మైలు దూరం కన్నా పెంచుకుంటూ ఉంటే 9 నెలల్లో 6 కిలోల అదనపు బరువు తగ్గుతారు. కప్పు కాఫీ పెంచే బరువు రోజూ 3,000 కప్పులు అమ్మే 115 కాఫీషాప్లను సందర్శించి నిపుణులు ఓ నివేదికను అందించారు. ఎలాగంటే రోజూ ఒక కప్పు కాఫీ లేదా టీ ద్వారా (పాలు + పంచదారతో కలిపి) సగటున 239 క్యాలరీలు సగటున సేవిస్తున్నారు. 2–3 నుంచి కప్పుల కాఫీ లేదా టీ సేవించినా రోజులో ఒక్కొక్కరు సగటున 630 క్యాలరీలు అదనంగా తీసుకుంటున్నారు. ఈ అలవాటును మానుకుంటే ఏడాదిలో 6 కేజీల అదనపు బరువును తగ్గించవచ్చు. పెన్ను తీసుకోండి దాంతో పాటే ఒక చిన్న నోట్ బుక్ తీసుకోండి. దీని మీద ఫుడ్ డెయిరీ లేదా ఫుడ్ లాగ్స్ అని పేరు రాయండి. ఈ రోజు నుంచి కాదు ఇప్పటి నుంచే రోజులో ఏమేం తింటున్నారో ప్రతి అరగంటకోసారి రాస్తూ ఉండండి. అంతేకాదు, ఆ ఆహారంలో ఉండే క్యాలరీలు కూడా ఇంచుమించుగా నోట్ చేస్తూ ఉండండి. ఈ ఫుడ్ డెయిరీ మీరు తీసుకునే అదనపు క్యాలరీలను తీసుకోకుండా మీ నోటికి అడ్డుపడుతూ ఉంటుంది. ఇటీవల పరిశోధనలో తేలిందేమంటే.. ఫుడ్ డెయిరీలో ఆహారం తీసుకునే సమయాలు, క్యాలరీలు నోట్ చేసుకున్నవారు త్వరగా బరువు తగ్గడం గమనించారు. ఫుడ్ డెయిరీని రోజూ రాయడం అలవాటు చేసుకున్నవాళ్లు మితంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడానికి ప్లాన్ చేసుకోవడం..వంటివి ప్రారంభించారు. ఈ విధానాన్ని పాటించినవాళ్లు దాదాపు 6 నెలల సమయంలో 7 కిలోల బరువు తగ్గారు. ఫుడ్ డెయిరీ వల్ల ఆహారపు అలవాట్లు మీలోని అంతర్దృష్టిని మేల్కొలిపి, అవగాహన ³రిచేలా చేస్తుంది. అంటే పెన్ మీ అధిక క్యాలరీలను కాల్చేసే గన్లా ఉపయోగపడుతుందన్నమాట. అదనంగా 5 నిమిషాలు శారీరక శ్రమలో భాగంగా నడకకు రోజూ ఓ 5 నిమిషాల సమయం పెంచుకుంటూ పోవాలి. ఇలా చేస్తుంటే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి నాలుగు నెలల్లో మీ నడుము చుట్టుకొలత 2 1/2 ఇంచులు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు మీ లక్ష్యం 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వాకింగ్ చేయడం అనుకోండి. రోజూ మరో 5 నిమిషాలు అదనంగా వాకింగ్ చేస్తూ ఉండండి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేస్తుంటే 120 క్యాలరీలు ఖర్చు అవుతాయి. నిద్రతో తగ్గే బరువు బరువు తగ్గడానికి ఒక అతిముఖ్యమైన పాయింట్ హాయిగొలిపే నిద్ర. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు నిద్రలేమి తక్షణ బరువుకు దారి తీస్తుందని తేల్చారు. 5 రాత్రుల్లో కనీసం 4 రాత్రుళ్లు హాయిగా నిద్రపోయినవారు కిలో బరువు తగ్గినట్టు గుర్తించారు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
తినేది మొత్తం పది గంటల్లోనే...
ఉదయాన్నే ఓ కాఫీ.. ఆ తరువాత ఉపాహారం.. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి మళ్లీ భోజనం! ఇదీ మనలో చాలామంది ఆహారపు అలవాట్లు. ఇంకోలా చెప్పాలంటే 14 నుంచి 15 గంటల పాటు అప్పుడప్పుడూ తింటూనే ఉంటాం అన్నమాట. ఇలాకాకుండా ఒక రోజులో తినేది ఏదో మొత్తం పది గంటల్లోపు తినేస్తే అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చునని అంటున్నారు సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. మానవుల్లో జీర్ణక్రియకు సంబంధించిన జన్యువులు ఉదయం వేళల్లో ఎక్కువ చురుకుగా ఉంటాయని, కణ మరమ్మతులకు సంబంధించినవి రాత్రిపూట చైతన్యంగా ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సచ్చిదానంద పాండ తెలిపారు. ఎలుకలపై తాము కొన్ని పరిశోధనలు చేశామని, కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని రోజంతా తీసుకున్న ఎలుకలు కొంతకాలానికే ఊబకాయం, ఇతర జీర్ణసంబంధిత ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టగా ఎనిమిది నుంచి పదిగంటల గడువులో మాత్రమే ఆ రకమైన ఆహారమే తీసుకున్న ఎలుకలు నాజూకుగా, ఆరోగ్యంగా ఉన్నాయని ఆయన వివరించారు. శరీర గడియారానికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం వల్లనే ఈ ఆరోగ్య లాభాలు చేకూరాయని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. -
రాయి ఇనుముని తినేస్తుంది
-
ఇనుమును తినేస్తున్న రాయి.. వైరల్ వీడియో
మయన్మార్ : ప్రపంచంలో కొన్ని ఘటనలు వినడానికి వింతగా ఉంటాయి. కొన్ని సార్లు వాటిని కళ్లారా చూస్తే తప్ప నమ్మడం కష్టం. అవి ఎలాంటివి అంటే దేవుడి విగ్రహం ముందు పాలు పెడితే తగ్గడం, చెట్ల మొదళ్ల నుంచి పాలు కారడం, విగ్రహాల చుట్టూ జంతువులు చేరి పూజ చేయడం, మరికొన్ని చోట్ల వాటి కళ్ల నుండి నీరు, ఏదైనా ద్రవం రావడం వంటివి. అవి చిత్రంగా ఉంటూ అందరినీ ఆకర్శిస్తాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి మయన్మార్లో జరిగింది. సాధారణంగా ఇనుమును కరగ తీయడం కోసం నిప్పుల్లో ఉంచుతారు. కానీ మయన్మార్లో మాత్రం ఓ రాయి చిత్రంగా ఇనుముని తినేస్తోంది. రాయి ఇనుమును తినడం ఏంటి అనుకోకండి.. కానీ ఇది నిజం. గోడకు కొట్టే మేకుని దానిపై ఉంచితే నిమిశాల్లో కరిగిపోతోంది. ఈ విషయాన్ని ఆదేశ సైనికుడు కనిపెట్టాడు. ఇనుమును రాయి తినేస్తుందంటే ఎవరూ నమ్మలేదు. పైగా పిచ్చివాడిగా చూశారు. దీంతో మేకును రాయిపై ఉంచి వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటి వరకూ ఈ వీడియోని 9 మిలియన్ల మంది చూశారు. ఈ రాయిని పరిశీలించిన శాష్త్రవేత్తలు, ఈ రాయి ఓ విలక్షణమైన లక్షణాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇనుమును కరిగించడానికి గల కారణాలపై పరిశోధనలు చేస్తున్నారు. -
తింటేనే.. కొవ్వులు కరుగుతాయి!
కొవ్వు పదార్థాలు తింటే ఆరోగ్యానికి హాని. ఇదీ మనం తరచూ వినే మాట. అయితే నిన్నమొన్నటివరకూ నెయ్యి, కొబ్బరినూనెల వాడకంపై ఎన్నో అపోహలు ఉండగా.. మితంగానైనా వాటిని తీసుకోవడం మేలని కొందరు వైద్యులు స్వయంగా సూచిస్తున్నారు. తాజాగా తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే.. కొవ్వు పదార్థాలు మన చిన్నపేవుల్లో బ్యాక్టీరియా పెరుగుదలకు సాయపడతాయని.. అంతేకాదు.. ఈ మార్పు వల్ల కొవ్వు జీర్ణమవడమూ వేగవంతమవుతుందని షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఎగ్యూన్ బి.చాంగ్ అంటున్నారు. అమెరికా వంటి పాశ్చాత్యదేశాల్లో ఎక్కువగా తీసుకునే ఆహారంపై వీరు పరిశోధనలు చేశారు. బ్యాక్టీరియా దాదాపుగా లేని.. బ్యాక్టీరియా లేని అనే రెండు రకాల ఎలుకలకు అధిక కొవ్వులు ఉన్న ఆహారం అందించి పరిశీలించారు. తొలి రకం ఎలుకలు కొవ్వులను జీర్ణం చేసుకోలేక ఇబ్బంది పడితే.. రెండో రకం ఎలుకల పేవుల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందింది. మొదటి రకం ఎలుకలకు ఈ బ్యాక్టీరియాను ఎక్కించినప్పుడు అవి కూడా వేగంగా లావెక్కడం మొదలుపెట్టాయి. ఇంకోలా చెప్పాలంటే వాటికి కొవ్వులు వంటబట్టడం మొదలైందన్నమాట. అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్న 24 నుంచి 48 గంటల్లోనే చిన్నపేవుల్లో బ్యాక్టీరియా గణనీయంగా పెరుగుతుందని.. వీటి స్రావాలు కొవ్వును విడగొడతాయని.. చాంగ్ చెబుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించేందుకు మరింత మెరుగైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. -
ఎప్పుడు తినాలో తెలిస్తేనే.. బరువు తగ్గుతారు!
వేళాపాళా లేని ఆహారంతో ఒళ్లు పెరిగిపోవడమే కాకుండా అనేకానేక చిక్కులు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఒళ్లు తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో ఏ సమయంలో ఆహారం తీసుకుంటామన్నది ముఖ్యమవుతుందని అంటున్నారు కాలిఫోర్నియాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. మన పూర్వీకులతో పోలిస్తే ఇప్పుడు చాలామంది అర్ధరాత్రి వరకూ మేలుకుని ఉండటం, అదే సమయంలో చిరుతిళ్లను ఎక్కువగా తీసుకోవడం చేస్తూంటారని.. ఈ అలవాట్లు రెండూ ఒళ్లు తగ్గించుకునే విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతాయని వీరు హెచ్చరిస్తున్నారు. రెండు గుంపుల ఎలుకలకు వేర్వేరు సమయాల్లో ఆహారం అందించడం ద్వారా వాటిలో వచ్చిన మార్పులను తాము పరిశీలించామని, కొంత కాలం తరువాత పరిశీలించగా.. రోజుకు ఎనిమిది గంటలపాటు మాత్రమే ఆహారం అందుబాటులో ఉన్న ఎలుకలు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. రోజంతా ఆహారం అందుబాటులో ఉన్న ఎలుకలు ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోవడం ద్వారా లావెక్కిపోయాయని వివరించారు. దీన్నిబట్టి రోజులో వీలైనంత తక్కువ సమయంలో ఆహారం తీసుకోవాలని తమ అధ్యయనం చెబుతోందంటున్నారు. -
మన బ్రేక్ఫాస్ట్
కేలండర్ను ముప్ఫయ్ ఏళ్ల వెనక్కు తిప్పితే... అప్పటి ఆహారపు అలవాట్లు ప్రకృతికి అనుకూలంగా ఉండేవి. సన్స్ట్రోక్ తగిలిన తర్వాత కొబ్బరిబొండాంతో సేద దీరడం అన్నది ఏ ఒక్కరికీ అనుభవంలోకి వచ్చి ఉండదు. ఎండాకాలం వచ్చిందంటే ఇడ్లీ పాత్రలు, దోశెపెనాలు అటకెక్కేవి. పొద్దున్నే ఉల్లిపాయతో చద్దన్నం, ఆవకాయతో పెరుగన్నం తింటే ఎంత ఎండలో ఆడుకున్నా పిల్లలకు వడదెబ్బ ఉండేది కాదు. కడుపులో చల్ల కదలకుండా అలిసిపోయే దాకా ఆడుకోవచ్చు, ఆవకాయ రుచిని గుర్తు చేసుకోవచ్చు. ఈ తరం మర్చిపోయిన మన బ్రేక్ఫాస్ట్... ఆవకాయ – పెరుగన్నం రాత్రి మిగిలిన అన్నంలో ఒక స్పూన్ పెరుగు కలిపి గోరువెచ్చని పాలు పోస్తే ఉదయానికి గట్టిగా పెరుగున్నం తయారవుతుంది. దీంట్లో ఉప్పు వేసి ఉల్లి పాయ, ఆవకాయ పెచ్చు నంజుకు తింటే... నోరూరడం మాట అలా ఉంచితే మైగ్రేన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. చద్ది బువ్వ అన్నం వండినప్పుడు వార్చిన గంజిని ఒక కుండలో పోయాలి. మిగిలిన అన్నాన్ని అందులో వేస్తే... అదే చద్ది అన్నం. ఆ అన్నంలో కాçస్తంత ఉప్పు, నిమ్మ రసం వేసి దానికి తోడుగా ఉల్లిపాయ కాని, మిరపకాయ కాని తింటే డీ హైడ్రేషన్ అనే పదానికి అడ్రస్సే ఉండదు. గడ్డపెరుగు – మామిడిపండు అన్నాన్ని చల్లార్చి అందులో మీగడ పెరుగు వేసి కలిపి, పక్కన మామిడిపండు ముక్కలు కోసి పెడితే పిల్లలకు చక్కటి లంచ్. నవకాయ పిండివంటలు ఉన్నా వాటి వంక కూడా చూడరు. అన్నం, పాలు, పండుతో పూర్తి స్థాయిలో భోజనం చేసినట్లే పోషకాలు అందుతాయి. ఎండ వేడి బాధించదు. -
అచ్చం మనుషుల్లానే రెస్టారెంట్లో కోతుల జంట
-
చలికాలం అమ్మోకీళ్లు
కంట్లో నీళ్లు ఆరంభం నుంచీ వ్యాయామం లేకపోవడం, సరైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి అధికమవ్వడం, అధిక బరువు / స్థూలకాయం, మహిళల్లో అయితే హార్మోన్ల ప్రభావం... ఈ అంశాలన్నీ కీళ్ల ఆరోగ్యానికి ప్రతికూలంగా పనిచేసేవేనని చెప్పుకోవచ్చు. కీళ్ల సమస్యలు... వందలాది రకాలు! నొప్పితో బయటపడే కీళ్ల వ్యాధులలో ప్రధానంగా కొన్ని వందల రకాల సమస్యలు ఉంటాయి. అయితే కీళ్లకు సంబంధించి ప్రధానంగా... కీళ్ల అరుగుదల, కీళ్ల వాతం వంటివి మనం తరచూ చూసే సమస్యలు. ఇవి నిత్యం మన సమాజంలో కనిపిస్తుంటాయి. కీళ్ల అరుగుదల (ఆస్టియో ఆర్థరైటిస్) అనే సమస్య సాధారణంగా వయసు పైబడినవారిలో కనిపిస్తుంది. కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఎవరిలోనైనా కనిపించే సమస్య. అయితే ముఖ్యంగా స్త్రీలలో ఇటీవల చిన్న వయసులోనే ఇది బయటపడుతుంది. ఇక వయసు పైబడుతున్న కొద్దీ, ఆహారపుటలవాట్లు మారుతున్న కొద్దీ, సొరియాసిస్ వంటి చర్మ సంబంధమైన వ్యాధులు సోకినప్పుడు, మహిళల్లో హార్మోన్లకు సంబంధించిన తేడాలు వచ్చినప్పుడు... అవన్నీ కీళ్ల మీద ప్రభావం చూపుతాయి. రకరకాల కీళ్ల సమస్యలకూ, కీళ్లనొప్పులకు కారణమవుతాయి. ఉదాహరణకు గౌటీ ఆర్థరైటిస్ అన్నది మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారిలో, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉండేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలా జరిగితే అనుమానించాల్సిందే..! శరీరంలోని ఏ కీలు అయినా కొన్ని నెలలుగా తీవ్రమైన నొప్పితో బాధపెడుతూ, అక్కడి కదలికలు కష్టంగా మారినప్పుడు... కాలం గడుస్తున్న కొద్దీ సమస్య తీవ్రతరమవుతున్నప్పుడు కీళ్లకు సంబంధించిన సమస్య ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. కీళ్ల అరుగుదల వల్ల మన శరీర బరువును మోసే పెద్ద జాయింట్స్పై ప్రభావం చూపుతుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇక సమస్య వల్ల చిన్న కీళ్లు ప్రభావితమైతే క్రమంగా ఆ దుష్ప్రభావం పెద్దకీళ్లకు విస్తరిస్తుంది. ఈ సమస్యను ‘రుమాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. దీన్నే ‘కీళ్ల వాతం’గా పేర్కొనవచ్చు. సమస్య నిర్ధారణ ఇలా... రోగి వయసు, వారిలో కనిపిస్తున్న లక్షణాలను పరిగణనలోకి తీసుకొని అది ఏ రకమైన కీళ్ల సమస్య కావచ్చు అన్న అంశాన్ని నిపుణులు నిర్ధారిస్తారు. కొన్ని కండిషన్స్ను అనుమానిస్తారు. వాటి నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. కీళ్ల అరుగుదల సమస్య నిర్ధారణ కోసం ఎక్స్–రే తీయించడం, అలాగే కీళ్ల వాతం లేదా ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో తలెత్తే జాయింట్ పెయిన్స్ను నిర్ధారణ చేయడానికి ఆర్.ఏ ఫ్యాక్టర్, యాంటీ సీసీపీ, ఈఎస్ఆర్, సీఆర్పీ (సీ–రియాక్టివ్ ప్రోటీన్), ఏఎన్ఏ, హెచ్ఎల్యే–బి27 వంటి రక్త పరీక్షలు అవసరమవుతాయి. నివారణలు – జాగ్రత్తలు కీళ్లనొప్పులు తొలి దశలో ఉండి... అవి మరింత ముదరకుండా చూసుకోవాలన్నా లేదా కీళ్లనొప్పులను సాధ్యమైనంత ఆలస్యం చేయాలనుకున్నా... మోకాళ్లు మడిచి బాసింపట్టు వేయకుండా ఉండటం, చక్లంముక్లం వేసుకోకుండా ఉండటం, కింద కూర్చోకుండా కుర్చీ మీదనే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోవడం, వెస్ట్రన్ టాయ్లెట్ను వాడటం, కుదిరినంతవరకు టైబుల్పైనే భోజనం చేయడం, చిన్న చిన్న నొప్పులను తగ్గించుకునే విధంగా ఫిజియోథెరపీ చేయడం, కొన్ని మందులు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఎన్నో నొప్పులను తేలిగ్గానే నివారించుకోవచ్చు. నయం చేసుకోవచ్చు. పెరగకుండా చూసుకోవచ్చు. అవసరాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు క్యాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లు, రోజ్హిప్ టాబ్లెట్లు వాడితే మరికొన్ని కీళ్ల సంబంధమైన సమస్యలకు మంచి ఉపశమనం దొరుకుతుంది. నొప్పి తీవ్రతను బట్టి పెయిన్ కిల్లర్స్, జాయింట్లలో సైనో వియల్ ఫ్లూయిడ్ సప్లిమెంట్స్ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం అవసరం పడవచ్చు. కీళ్లనొప్పులు, కీళ్లు బిగుసుకుపోయినట్లుగా ఉండటం (జాయింట్ స్టిఫ్నెస్) వంటి సమస్య ఎక్కువవుతూ చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తే... వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రతించాలి. అప్పుడు వారు తగిన పరీక్షలు చేసి, ఇక చివర ప్రత్యామ్నాయంగా... కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు (జాయింట్ రీ–ప్లేస్మెంట్ సర్జరీ)లను సూచిస్తారు. ఇది మరీ ఆలస్యం కూడా చేయకూడదు. ఎందుకంటే ఇలా సర్జరీని ఆలస్యం చేయడం వల్ల ఒక్కోసారి ఆ కీళ్లు మరింతగా అరిగిపోయి రీ–ప్లేస్మెంట్ ప్రక్రియ క్లిష్టతరంగా మారే అవకాశం ఉంది. చలికాలంలో కీళ్లనొప్పులను తగ్గించుకునేదెలా? చలికాలంలో మన కండరాలు బిగుసుకుపోవడం వల్ల మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి రక్తసరఫరా ఎక్కువవుతుంది. ఫలితంగా కీళ్ల ఇంకా ఎక్కువగా నొప్పి కలుగుతుంది. ఈ తీవ్రతను తగ్గించడం కోసం ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించాలి. దాని వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ► కీళ్లను వెచ్చగా ఉంచేందుకు వార్మ్ క్లోతింగ్తో పాటు చేతులకు గ్లోవ్స్, మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి ‘నీ క్యాప్’ వేసుకోవడం మంచిది. ► వింటర్లో నీళ్లు తాగడం తగ్గిపోతుంది. దాంతో డీ హైడ్రేషన్ కారణంగా నొప్పులు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ సీజన్లో ద్రవాహారం ఎక్కువగా తీసుకోవడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ► కాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లతో పాటు, వాపుని తగ్గించే ఒమెగా–3, ఒమెగా–6, ఒమెగా–9 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ను ఆహారంలో తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. ► తరచూ ఒంటిని సాగదీస్తున్నట్లుగా ఒళ్లు విరుచుకోవడం (స్ట్రెచింగ్) చేస్తుండటం వల్ల నొప్పులు తగ్గుతాయి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, అవసరమైతే నొప్పిగా ఉన్న కీళ్లను ఉప్పు (కళ్ళుప్పు) వేసిన గోరు వెచ్చటి నీళ్లలో కాసేపు మునిగి ఉండేలా చూడటం మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ► చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి క్రాస్ ట్రైనర్, స్టేషనరీ సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ► జాయింట్స్ దగ్గర వాపు ఉంటే ఐస్ ప్యాక్ పెట్టడం మంచి ఉపశమనాన్నిస్తుంది. ► కండరాలు రిలాక్స్ కావాలంటే గోరువెచ్చటి నువ్వుల నూనెతో తేలిగ్గా మసాజ్ చేసుకోవడం కూడా మంచి ఉపశమనాన్నిస్తుంది. ► బరువు పెరగకుండా ఉండేందుకు ఒంటికి అవసరమైన అన్ని పోషకాలూ అందేలా సమతుల ఆహారం తీసుకోవడం అన్నది కీళ్లకూ మేలు చేస్తుంది. ► అవసరమైతే డాక్టర్ సలహా మేరకు మాత్రమే పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఏఐడీ ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా కీళ్లనొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యంగా ఉండేవారికి చలికాలం ఆహ్లాదకరంగానే ఉంటుంది. కానీ కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ భయాలు అధికమవుతాయి.æవారి సమస్యలు చలిపెరిగే కొద్ది తీవ్రమవుతుంటాయి కాబట్టే వారికి ఆ ఆందోళన. కీళ్లనొప్పులతో బాధపడేవారు చలికాలంలో లేదా చల్లటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు శారీరక, కీళ్ల కదలికలతో వచ్చే నొప్పుల వల్ల తాము అనుకున్నవిధంగా ప్రకృతిని ఆస్వాదించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఒకప్పుడు 70 ఏళ్లకు పైబడిన వారికి జాయింట్ పెయిన్స్ కారణంగా బాధలకు గురయ్యేవారు. అయితే ఇటీవల కేవలం నలభై ఏళ్ళ వయసులోనే నాలుగు అడుగులు వేయలేక బాధపడేవారినీ చాలా మందినే చూస్తుంటాం. అలాంటి వారంతా ఈ సీజన్లో వచ్చే తమ కీళ్ల నొప్పులకు కారణాలనూ, తగ్గించుకునేందుకు మార్గాలనూ తెలుసుకోవడం కోసమే ఈ కథనం. డాక్టర్ దశరథ రామారెడ్డి తేతలి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
తినండి... తగ్గండి తింటూనే... తగ్గండి!
బాగా లావున్న వారు తమ బరువును తగ్గించుకోడానికి చాలా ఆసక్తి చూపుతారు. కానీ నోరు కట్టేసుకోవడం వారికి సాధ్యం కాదు. అయితే ఒక పక్క రోజూ తినేంత తింటూనే... ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి అవసరమైన మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. ఇలాంటి తాపత్రయంతో ఉన్నవారి కోసం అనేక రకాల పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇటీవలే కొంతకాలం క్రితం యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు కూడా ఈ దిశలో తమ పరిశోధనలు కొనసాగించారు. ఇష్టమైనవి తింటూనే బరువు తగ్గడం లేదా మరింత బరువు పెరగకుండా ఉండటం ఎలాగో తెలుసుకున్నారు. నీటి పాళ్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల సత్వరం బరువు పెరగడం జరగదని గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన నిపుణులు చెబుతున్న దాని ప్రకారం... కూరగాయలు, ఆకుకూరల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్, దబ్బపండు, లెట్యూస్, ముల్లంగి, పాలకూర... వీటిలో నీటి పాళ్లు ఎక్కువ. ఇవి తీసుకుంటే ఒక పట్టాన బరువు పెరగడం సాధ్యం కాదు. వీటిలో నీటిపాళ్లు ఎక్కువ అయినందున వీటిని తినగానే కడుపులో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. అందుకే బరువు పెరగకుండా ఉండాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు విధిగా పై కూరలను తమ ఆహారంలో ఉండేలా చూసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు ఆ నిపుణులు. -
వారానికి రెండుసార్లు చేపలు తింటే షుగర్ దూరం
లండన్: మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యలతోపాటు కంటిచూపు తగ్గుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యకు పరిష్కారం వారానికి రెండుసార్లు చేపలను తినడమేనని సూచిస్తున్నారు వైద్యులు. వారానికి రెండుసార్లు చేపలు తినడం.. 500 మిల్లీ గ్రాముల ఒమేగా–3తో సమానమని చెబుతున్నారు. మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు. 55 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసున్న 3,614 మంది టైప్–2 డయాబెటిస్ రోగులకు వారానికి 500 మిల్లీగ్రాముల ఒమేగా–3 ఆమ్లాలను ఆహారంలోభాగంగా ఇచ్చారు. దీంతో వారిలో డయాబెటిస్ దుష్ఫలితాలు 48 శాతం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. -
తెలివైన పిల్లలు కావాలంటే పండ్లు తినాల్సిందే
టొరంటో: తల్లి కాబోయే వనితలారా వినండి! గర్భిణిగా ఉన్నప్పుడు పళ్లు ఎంత ఎక్కువగా తింటే, పిల్లలు అంత తెలివైన వాళ్లుగా పుడతారట. రోజుకు సగటును ఆరేడు పళ్లు తింటే జన్మించబోయే శిశువు ఐక్యూ (ఇంటెలిజెన్స్ కోషెన్సీ) స్థాయులు ఐదారు పాయింట్లు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. కెనడాకు చెందిన 688 మంది చిన్నారుల సమాచారాన్ని విశ్లేషించి యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇలాంటి పిల్లల్లో జ్ఞాపకశక్తి కూడా అధికంగా ఉంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన పీయుష్ మదానే చెప్పారు. గర్భిణి పళ్లు తిన్నప్పుడు శిశువు మెదడులో ఐక్యూ స్థాయులను పెంచే జన్యువులు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నట్టు గుర్తించామని మదానే వివరించారు. -
ఇసుక తిని బతికేస్తున్న సాండ్ మ్యాన్!
వర్షం వస్తున్నపుడు వచ్చే మట్టి వాసనను ఇష్టపడని మనుషులుండరేమో.. అలాగే చిన్నతనంలో మట్టి తినని వారు కూడా ఉండరేమో.. కానీ ఓ వ్యక్తి చిరుతిండిలా... తినుబండారాలను తిన్నట్లుగా ఇసుక, మట్టిని తినెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శరీరంలో విటమిన్ల లోపం కారణంగానే అతడు మట్టి తినడానికి అలవాటు పడ్డాడని డాక్టర్లు చెప్తుండగా.. తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని చెప్తున్న సదరు వ్యక్తి ఏకంగా 'సాండ్ మాన్' గా పేరు తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన హంస్ రాజ్ ఏదో టిఫిన్ తిన్నట్లుగా రోజుకో ప్లేటు ఇసుకను తినేస్తున్నాడు. ఇరవై ఏళ్ళ వయసులో ఇసుక తినడానికి అలవాటు పడ్డ అతడు చివరికి అదే అలవాటుకు బానిసయ్యాడు. ఇసుకతోపాటు ఇటుక, రాళ్ళ ముక్కలను కూడ నంజుకుని కరాకరా నములుతూ తినేస్తున్నాడు. శరీరంలో విటమిన్లు లోపంవల్ల ఏర్పడే పికా డిజార్డర్ అతనికి ఉండొచ్చని, అందుకే అలా చేస్తున్నాడని డాక్టర్లు చెప్తున్నారు. అటువంటి అలవాటు కొన్నాళ్ళకు తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయని అంటున్నారు. ఇటువంటి రోగానికి చికిత్స లేదని చెప్తున్నారు. ఇలా ఇసుక తినడం వల్ల కొన్నాళ్ళకు అది విషంగా మారి ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అయితే హంస్ రాజ్ మాత్రం తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని, ఇసుక తినడం వల్ల ఎటువంటి సమస్యా లేదని చెప్తున్నాడు. ఇసుక తినడంతో తనకు విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా చేరుతున్నాయని, తాను ధృఢంగా ఉండేందుకు అవి తోడ్పడుతున్నాయని అంటున్నాడు. సుమారు 25 ఏళ్ళనుంచి ఇలా.. ఇసుక, రాళ్ళు, ఇటుక ముక్కలు తింటున్నానని, ఇలా తినడం ఇప్పటికీ తనకు ఎంతో ఇష్టమని ఆనందంగా చెప్తున్నాడు. ప్రతిరోజూ ఓ ప్లేటు ఇసుక తిననిదే 45 ఏళ్ళ హంస్ రాజ్ కు నిద్ర పట్టదు. అందుకే తన గ్రామంనుంచీ పక్క గ్రామానికి వెళ్ళి మరీ బస్తాలతో ఇసుకను తెచ్చి ఇంట్లో భద్రపరచుకుంటున్నాడు. ఈ అలవాటు వల్ల అతను ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లోనే ఫేమస్ అయిపోయాడు. 'సాండ్ మ్యాన్' గా పేరు తెచ్చుకున్నాడు. ఇసుక తినడంవల్ల తన కడుపులోనూ, పళ్ళకు కూడ ఎటువంటి ఇబ్బందీ కలగడం లేదని, గట్టిగా ఉన్న రాయిని కూడ తాను సునాయాసంగా కొరకగల్గుతానని చెప్తున్నాడు. -
ఈ 'మంటల కిళ్లీ' చాలా కూల్ గురూ!
భోజన ప్రియులకు.. తాంబూల సేవనం గురించి చెప్పనక్కరలేదు. అందులోనూ రకరకాల కిళ్లీలను ఆరగించడానికి ప్రయత్నించే పాన్ ప్రియులకు అస్సలు వివరించనక్కలేదు. కానీ ఈ మంటల తాంబూలం అదే... ఫైర్ పాన్ గురించి మాత్రం కచ్చితంగా చెప్పాల్సిందే.. అవును వినడానికి వింతగా ఉన్నా.. భగ్గున మండుతున్న ఈ కిళ్లీ చాలా కూల్ గురూ అంటున్నారు తయారీదారులు. అటు మండుతున్న కిళ్లీని లొట్టలేసుకుంటూ.. సారీ, పొగల సెగలు కక్కుతూ నములుతున్నారు వినియోగదారులు. గత 30 ఏళ్లుగా ఈ పాన్ బిజినెస్ చేస్తున్న రాజ్ కోట్ కు చెందిన చున్నీ లాల్ ఈ ఫ్లేమింగ్ కిళ్లీని వినియోగదారులకు పరిచయం చేశారు. మండుతున్న ఈ పాన్ రెసిపీని కనుక్కోవడానికి తమకు ఎనిమిది సంవత్సరాలు పట్టిందంటున్నాడు. తమలపాకుల్లో లవంగాలు, వక్కలు, ఇతర పదార్థాలు మధ్య యాలకలు లాంటి స్థానిక మూలికలతో దీన్ని తయారు చేస్తున్నామన్నారు. మండుతూ ప్రమాదకరమైందిగా కనిపించే ఈ పాన్ చల్లని అనుభూతిని ఇస్తుందంటున్నారు. అంతేకాదు ఇంతవరకు ఈ పాన్ తిని ఎవరూ అనారోగ్యం కానీ, గాయపడింది లేదని ధీమాగా చెపుతున్నారు. -
సెక్స్ కు ఆకర్షితులౌతున్న ఐరిష్ టీనేజర్లు..
ఐర్లాండ్ టీనేజర్లు ఇప్పుడు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఎనిమిది నుంచి 18 ఏళ్ళ వయసులోని పిల్లలపై చేసిన సర్వేలు ఆశ్చర్యకర విషయాలను వెల్లడిస్తున్నాయి. అక్కడ ధూమపానంతోపాటు తాగుడుకు అలవాటు పడిన పిల్లలకంటే చిన్న వయసులోనే సెక్స్ పట్ల ఆకర్షితులవుతున్న వారు ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ఐర్లాండ్ లో తాజాగా 230 స్కూళ్ళలో 13,500 మంది విద్యార్థులపై హెల్గ్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బయటపడ్డ విషయాలను చూసి అంతా ఆశ్చర్యపోయారు. సర్వేలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థుల్లో చాలామంది ఇప్పటికే తమకు సెక్స్ అనుభవాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులోనూ పేద, మధ్య తరగతి పిల్లలే సెక్స్ పట్ల అధిక ఆసక్తి చూపుతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాదు సెక్స్ లో పాల్గొనేప్పుడు దాదాపు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం. వీరంతా సెక్స్ సమయంలో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నట్లుగా సర్వేలో తేలింది. సర్వేలో భాగంగా 15 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసు పిల్లలను సెక్స్ గురించి ప్రశ్నించినపుడు మాత్రం 27 శాతంమంది శృంగార అనుభవం పొందుతున్నట్లు తెలిసిందని, అంతకు ముందున్నకంటే రెండు మూడు శాతం ఈ సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. అయితే 2010 లో స్కూలు పిల్లలపై చేసిన సర్వేల్లోని నిష్పత్తికంటే... తాజా లెక్కల్లో స్మోకింగ్, డ్రింకింగ్ బానిసల సంఖ్య తగ్గిందని హెల్త్ ప్రమోషన్ రీసెర్స్ సెంటర్ పరిశోధకులు అంటున్నారు. అయితే సెక్స్ అనుభవాలను పొందుతున్న వారి సంఖ్య మాత్రం క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు వారు చెప్తున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 12 నుంచి 8 శాతానికి సిగరెట్లు, మద్యం సేవించే వారి సంఖ్య తగ్గిందని చెప్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన వల్లే ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాక 2011 తో పోలిస్తే వారంతా డైటింగ్ పై కూడ శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే నేపథ్యంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని... స్వీట్లు, కూల్ డ్రిక్ ల వాడకం తగ్గిస్తున్నారని తాజా సర్వేల్లో వెల్లడైంది. -
'అయితే త్వరలోనే మీరు లావెక్కడం ఖాయం'
లండన్: మీ డైనింగ్ టేబుల్పై పెద్దపెద్ద భోజన పాత్రలు ఉన్నాయా? పెద్ద కప్పులు గ్లాసుల్లో కాఫీలు, కూల్డ్రింకులు తాగుతున్నారా? అయితే త్వరలోనే మీరు లావెక్కడం ఖాయమంటున్నారు కేంబ్రిడ్జి పరిశోధకులు. పెద్ద పాత్రల వినియోగం వల్ల అధిక బరువు ముప్పు పొంచి ఉందని ఇటీవల వారు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఈ తరహా పాత్రల్లో భోజనం చేయడం, చక్కెరతో కూడిన పానీయాలు తాగడం ద్వారా కావాల్సిన దానికంటే రెట్టింపు పరిమాణంలో క్యాలరీలు శరీరంలోకి చేరుతున్నాయని గుర్తించారు. ఇలాంటి పాత్రలను వెంటనే మార్చడం ద్వారా బ్రిటన్లో 16 శాతం, అమెరికాలో 29 శాతం ఊబకాయం ముప్పును తగ్గించవచ్చంటున్నారు. ఇందుకోసం పరిశోధకులు 6,711 మందిపై పరిశోధనలు జరిపారు. వీరంతా కేవలం పాత్రల పరిమాణం కారణంగా సరిపడినదానికంటే అధిక ఆహారాన్ని తీసుకున్నట్లు వివరించారు. ఊబకాయం వల్ల మధుమేహం, గుండెపోటు ఇతర వ్యాధులు వస్తున్న సంగతి తెలిసిందే! -
ఎమోషనల్ ఈటింగ్కు దూరంగా ఉండండి!
మెన్స్ హెల్త్ బొజ్జ రావడం, రాకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బొజ్జ మీ వైపు కన్నెత్తి కూడా చూడదు... ప్లేట్ పరిమాణం మీద దృష్టి పెట్టండి. ఒక అధ్యయనం ప్రకారం ప్లేట్ పరిమాణాన్ని బట్టి కూడా మనం తినే తిండి ఆధారపడి ఉంటుంది. పెద్ద ప్లేటులో తిన్నప్పుడు కాస్త గట్టిగానే లాగిస్తాం. అలాకాక తక్కువ, ఎక్కువ కాని ప్లేట్ను ఎంచుకోవడం మంచిది. బాగా పొద్దుపోయాక భోజనం చేయవద్దు. మరీ ఆకలిగా ఉంటే పండ్లుగానీ, స్నాక్స్ గానీ తినడం మంచిది. భోజనం చేసిన సమయానికి, బెడ్ మీద చేరే సమయానికి కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ‘ఎమోషనల్ ఈటింగ్’కు దూరంగా ఉండండి. కొందరు విచారంలో ఉన్నప్పుడుగానీ, సంతోషంగా ఉన్నప్పుడుగానీ, కోపంగా ఉన్నప్పుడుగానీ సాధారణం కంటే చాలా ఎక్కువగా తింటారు. దీన్నే ‘ఎమోషనల్ ఈటింగ్’ అంటారు. దీనికి దూరంగా ఉండడం మంచిది. భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే గ్లాస్ నీళ్లు తాగండి. కొద్దిసేపు నడవండి. ఫ్యాట్ ఫుడ్స్ ఏమిటి, లో-ఫ్యాట్ ఫుడ్స్ ఏమిటి? అనే దాని మీద అవగాహన ఉండాలి. నిద్రలేమి, తక్కువ నిద్రపోవడం లాంటి సమస్య వల్ల కూడా పొట్ట పెరుగుతుంది. -
బల్బులు,ట్యూబ్లైట్లు తింటున్న సాహసవీరుడు
-
రోగాలు నిల్వ
ఈ దుస్థితి మారేనా... =ఉసురు తీస్తున్న ఆహారపుటలవాట్లు =నిల్వ ఆహారంతో రోగాలు కొనితెచ్చుకుంటున్న మన్యజనం హుకుంపేట, న్యూస్లై న్ : తిండి కలిగితె కండ కలదోయ్...కండ కలవాడేను మనిషోయ్..అన్నాడో మహాకవి. అయితే కొందరు ప్రజలు తిండి అలవాట్లతోనే రోగాల బారిన పడుతున్నారు...మృత్యువాత పడుతున్నారు. సంప్రదాయక ఆహారపదార్ధాలు, వంటకాలతో పాటు వారు తీసుకునే కల్లు వంటివి కూడా విషపూరితం కావడం వారికి శాపంగా పరిణమిస్తోంది. అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లలో మార్పు తీసుకురావడంలో ఇటు ప్రభుత్వం కాని, అటు స్వచ్ఛంద సంస్థలు కానీ చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా నిల్వ ఉన్న మాంసం, విషపూరితమైన పుట్టుగొడుగులు, ఆరోగ్యానికి మేలు చేసేవైనా మితిమీరి తీసుకోవడం, కొన్నిరకాల కొండఆకు కూరలు, దుంపలు నిల్వ చేయడంలో సరైన పద్ధతులు పాటించకపోవడం, కల్లు తయారీలో విషపూరితమైన వేర్లు వినియోగించడం వంటి కారణాలతో ఇక్కడి గిరిజనులు అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. అనారోగ్యానికి ‘గొడుగు’: మన్యంలో గిరిజనులు అధికంగా పుట్టుగొడుగులు, వెడురుగొడుగులు, మామిడి గొడుగులు, జిల్లేడు గొడుగులు, పేడగొడుగులు, గడ్డిగొడుగులు వంటకాలుగా అధికంగా వినియోగిస్తూ ఇబ్బం దులు పడుతున్నారు. వీటి వల్ల మృతి చెందిన వారు మండలంలో అనేక మంది ఉన్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి కోలుకోలేని వారు ఉన్నారు. అడ్డుమండ, మఠం, దిగరూడి గ్రామాల్లో పలుమార్లు విషపు కొక్కులు తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడిన వారి సంఖ్య నమోదు అయ్యింది. ‘కల్లు’కూట విషం: కల్లు జీవితానికి ముల్లు...అనే సామెత మన్యంలో అక్షరాల నిజమవుతోంది. జీలుగుకల్లులో అధికంగా నేలసిర్లి, పాతాలగరడి, సీమతీగ, కటికి, రెల్ల, పలుదొండ వంటి వేర్లు అధికంగా మురగదీస్తూ వినియోగిస్తుండడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా సన్నగిల్లుతోంది. లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు ముసురుకొంటున్నాయి. అయినా గిరిజనులకు ఎంతో ప్రీతిపాత్రమైన జీలుగుకల్లు వినియోగంలో వెనకడుగు వేయడం లేదు. మడ్డికల్లులో కూడా అనేక రకాల వనమూలికలు, రసాయనాల తో తయారు చేసే పిండి ఉండలు కలపడంతో అది కాలకూట విషంలా తయారవుతోంది. దీనిని సేవించేవారు మృత్యుకోరలకు చిక్కుతున్నారు. ‘దుంప’తెంచుతున్న నిల్వ... నాగడ దుంప, సీమదుంప, పిండిదుంప, చారుదుంప, గుమ్మడి కాయ వంటివి సీజన్లో సేకరించి వాటిని ఎండ బెట్టి నిలువ చేసి అధికంగా గిరిజనులు వినియోగిస్తుంటారు. అయితే వీటిని ఉడకబెట్టడంలోగాని, ఎండ పెట్టడంలోను సరైన జాగ్రత్తలు చేపట్టకపోవడంతో అవి త్వరి త గతిన బూజుపడతాయి. అయినా ఏ మాత్రం లెక్కచేయక తిరిగి వాటినే వినియోగిస్తుండడం వల్ల డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ‘మాంసా’హరణం : నాణ్యత లోపించిన, వ్యాధుల బారిన పడిన పశుమాంసం వారపు సంతల్లో విచ్చలవిడిగా విక్రయిస్తుంటారు. మృతి చెందిన పుశువులు, మేకలను నిల్వచేసుకుంటూ తింటుండడం వల్ల పలువురు మృత్యువాత పడుతున్నారు...లేదా ఆంత్రాక్స్ వంటి వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు.