Face pack
-
ప్రసవానంతర చర్మ సంరక్షణ కోసం..!
డిజైనర్, నటి మసాబా గుప్తా ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. అలానే తాజాగా ప్రసవానంతర చర్మ సంరక్షణకు సంబంధించి.. కొన్ని ఆసక్తికర చిట్కాలను షేర్ చేశారు. నిజానికి ప్రసవానతరం చర్మం వదులుగా అయిపోయి..అందవిహీనంగా ఉంటుంది. మెడ వంటి బాగాల్లో ట్యాన్ పేరుకుపోయి ఒకవిధమైన గరుకుదనంతో ఉంటుంది. అలాంటప్పుడు నటి మసాబా చెప్పే ఈ చిట్కాలను పాటిస్తే సులభంగా కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.ప్రసవానంతరం జీవితం అందంగా సాగిపోవాలంటే ఈ బ్యూటీఫుట్ చిట్కాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు మసాబా. అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదని చెబుతోంది. ముఖ్యంగా ఈ అవిసె గింజలు, పెరుగు, తేనెతో కూడిన ఫేస్ ప్యాక్తో కాంతివంతమైన చర్మాన్ని ఈజీగా పొందొచ్చని అంటోంది. ఈ మూడే ఎందుకు..?అవిసె గింజల పొడి: దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే ఎరుపు ర్యాష్లను తగ్గించడం తోపాటు ఫ్రీ రాడికల్స్తో కూడా పోరాడుతోంది. ఇందులో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేటెడ్గా చేసి, బొద్దుగా ఉండేలా చేస్తుంది. అలాగే మలినాలను తొలగించి చర్మా ఆకృతిని మెరుగుపరుస్తుంది. అందువల్లే దీన్ని ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. తేనె: ఇది తేమను లాక్ చేస్తుంది. చర్మం మృదువుగా చేసి, మొటిమలను నివారిస్తుంది. ముఖంపై ఉండే ఒక విధమైన చికాకుని తగ్గించేలా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా నిస్తేజమైన చర్మానికి పోషణనిచ్చి పునురుజ్జీవంప చేసి సహజమైన కాంతిని అందిస్తుంది. పెరుగు: ఇది లాక్టిక్ యాసిడ్తో నిండి ఉంటుంది. ముఖంపై ఉండే సున్నితమైన ఎక్స్ఫోలియంట్, మృతకణాలను తొలగించి చర్మానికి అద్భుతమైన మెరుపుని అందిస్తుంది. దీని ప్రోబయోటిక్స్ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పోడి లేదా సున్నితమైన చర్మానికి ఇది బెస్ట్. ఈ ఫేస్ ప్యాక్ తయారీ..అవిసె గింజల పొడి: 1 టేబుల్ స్పూన్పెరుగు: 1 టేబుల్ స్పూన్ తేనె : 1 టేబుల్ స్పూన్ఈ మూడింటిని ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా కలిపి ముఖం, మెడ భాగాల్లో సమానంగా అప్లై చేయాలి. ఇలా సుమారు 15 నుంచి 20 నిమషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇక్కడ అవిసెగింజల పొడిని తాజాదనం కోల్పోకుండా మంచి డబ్బాలో నిల్వ చేసుకోవడం మంచిది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta)(చదవండి: శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!) -
క్యారెట్తో ఇలా చేస్తే 24 క్యారెట్ల బంగారంలా!
క్యారెట్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు రంగు , ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ మన బాడీలో విటమిన్ ‘ఏ’గా మారి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. క్యారెట్లోని విటమిన్ సి కొల్లాజెన్ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే క్యారెట్లు జుట్టు కణాలను పునరుద్ధరించేందుకు ,జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మరి ముఖ సౌందర్య పోషణలో క్యారెట్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం!క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. అయితే ఇది అందానికీ ఎంతగా మెరుగులు దిద్దుతుందో తెలుసా? ‘24 క్యారెట్ల’ బంగారం లాంటి ముఖ సౌందర్యానికి ఏం చేయాలంటే...∙రెండు క్యారెట్లను మెత్తని పేస్టులా చేసుకుని, అందులో ఐదారు చెంచాల పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత ప్యాక్ను తీసేసి ముఖానికి ఆవిరి పట్టాలి. కొన్నాళ్లిలా చేస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి.క్యారెట్ గుజ్జులో కాసింత ముల్తానీ మట్టి, తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే... ముఖం కాంతిమంతమవుతుంది.క్యారెట్, కీరా, బంగాళ దుంపల్ని మెత్తని పేస్ట్లా చేయాలి. ఇందులో కాసింత టొమాటో రసం, చిటికెడు గంధం కలిపి ముఖానికి పూసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం మిలమిలా మెరుస్తుంది. -
బీట్రూట్- మిల్క్ ప్యాక్: మచ్చలు మాయం, గ్లోయింగ్ స్కిన్
ఎండాకాలంలో ముఖం, చర్మం సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలా సమస్యలొస్తాయి.మొటిమలు ఎక్కువగా వస్తాయి. చర్మం నల్లబడుతుంది. సూర్యరశ్మికి ఎక్కువగా తిరగడం వల్ల చర్మ రంగు మారుతుంది. ఈ సమస్యని దూరం చేయాలంటే బీట్రూట్ క్రీమ్, ప్యాక్ హెల్ప్ చాలా సహాయ పడుతుంది. బీట్ రూట్ క్రీమ్ తొక్కతీసిన అరకప్పు బీట్రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. పది నిమిషాల తరువాత బీట్రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈ నీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది. బీట్రూట్ ఫేస్ ప్యాక్ స్కిన్ ప్రాబ్లమ్స్ని దూరం చేసి చర్మ రంగుని మెరుగ్గా చేస్తుంది. బీట్రూట్ తొక్క తీసేసి ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలకు పాలు కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని ముఖానికి ప్యాక్లా అప్లయ్ చేయాలి. అలా మెడమీద కూడా రాసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ దూరమవుతాయి. మురికిని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. పాలు కలుపుతాం కాబట్టి, చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది. చర్మ సమస్యల్ని దూరం చేసి టోన్ చేయడంలో బీట్రూట్ హెల్ప్ చేస్తుంది. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే బీట్రూట్లో నేచురల్ కలర్ ఉంటుంది. ఇందులోని బీటా లైన్ ఫెయిర్ స్కిన్టోన్ని అందిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి చర్మంలోని సమస్యల్ని దూరం చేసి ముడతలు పడకుండా చేస్తుంది. -
ఫ్రూట్ ఫేషియల్: పార్లర్ అవసరం లేకుండా ఇంట్లోనే..
బ్యూటీ టిప్స్ రెండు స్పూన్ల క్యారెట్ జ్యూస్లో బొప్పాయి జ్యూస్, శనగపిండి, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. యాపిల్ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్మాష్ చేసుకోండి. ఇందులో తేనె, రోజ్ వాటర్ కలుపుకొని ఫేస్ప్యాక్ వేసుకోండి. ఇలా తరచూ చేస్తుంటే నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. ఆరెంజ్ పండ్ల తొక్కలను పొడి చేసుకొని అందులో గంధం, చిటికెడు పసుపు కలిసి ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే జిడ్డుతనం పోయి యవ్వనంగా తయారవుతారు. చర్మ సౌందర్యానికి బొప్పాయి బెస్ట్ ఛాయిస్. మొటిమలు, మచ్చలు వంటి చర్మ వ్యాధులను తగ్గించేందుకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి పండులో కాసిన్ని పాలు, తేనె కలపుకొని ఫేస్ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా, బ్రైట్గా కనిపిస్తుంది. మామిడి, ఓట్స్ను కలిపిన ఈ స్క్రబ్ ముఖం మీద మృతకణాలు, దుమ్మూధూళిని తొలగించి చర్మానికి నిగారింపునిస్తుంది. పుచ్చకాయ రసాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఇది చర్మానికి టోనర్గా పనిచేసి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ∙అరటి, యాపిల్, బొప్పాయి, నారింజ పళ్ల గుజ్జును సమపాళ్లల్లో తీసుకుని పేస్టు చేయాలి. ఈపేస్టుని ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలు, ట్యాన్ను తొలగించి కాంతిమంతంగా మారుస్తుంది. -
బ్యూటీ టిప్స్: వేపాకుల పేస్ట్తో ఆ సమస్య తగ్గిపోతుంది
బ్యూటీ టిప్స్ ► టీ స్పూన్ పచ్చిపాలలో అయిదారు చుక్కల తులసి రసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ ముంచి ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు తగ్గి ముఖం పొడిబారకుండా ఉండి చర్మం నిగనిగలాడుతుంది. ► ఒక టేబుల్ స్పూన్ కోకో బటర్కి రెండు టేబుల్ స్పూన్ల రోజ్వాటర్ని కలిపి పేస్ట్లా చేయాలి. ఆ పేస్ట్ని ఫేస్కి ప్యాక్లా వేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ఫేస్వాష్ చేసుకోవాలి. ► ముఖంపై మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటే వేపాకులు బెస్ట్ సొల్యూషన్. వేపాకుల పొడిలో పసుపు, రోజ్వాటర్ కలుపుకొని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. ► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది. -
టీనేజర్స్ని ఇబ్బంది పెట్టే మొటిమల సమస్యకు ఇలా చెక్ పెట్టొచ్చు
మొటిమలు.. చాలామంది టీనేజర్స్ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.కాలుష్యం, హార్మోన్లలో మార్పులు,పోషకాహార లోపాలు వంటి కారణాల వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అయితే సమస్యకు నివారించేందుకు ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అవి మరింత ఎక్కువై ఇబ్బంది పెడుతుంటాయి. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టే కంటే మన ఇంట్లోనే దొరికే నేచురల్ ఫేస్ప్యాక్తో మొటిమలకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో చూద్దామా. ►బీట్రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. ► జాజికాయ, మిరియాలు, మంచి గంధం..ఈ మూడింటిని తీసుకుని ఒక్కొక్కటి విడివిడిగా ఒక రాయి మీద కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ అరగదీయాలి. అలా అరగదీయగా వచ్చిన మూడు రకాల పేస్టులను ఒక చిన్న కప్పులోకి తీసుకుని ఒకదానితో ఒకటి బాగా కలపాలి. ► ఆ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసుకుని నిద్రపోవాలి. మరునాడు పొద్దున్నే లేచి ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా మూడు నుండి ఏడు రోజుల వరకు చేసినట్లయితే ఎలాంటి మొటిమలు అయినా, మొండి మచ్చలయినా సులభంగా తొలగిపోతాయి. ► రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి -
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్ప్యాక్గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్ప్యాక్లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
అరటిపండుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా? దానిలోని బి12 చర్మానికి..
ఈరోజుల్లో ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు అంటే ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా మేం ఎందుకు తగ్గాలి అని సెలూన్ షాప్లకు క్యూ కడుతున్నారు. వేలకు వేలు తగలేసి మరీ కాస్ట్లీ ప్రోడక్ట్లను కొంటున్నారు. అయితే ఖర్చు లేకుండానే మన ఇంట్లో దొరికే వస్తువులతో క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూసేద్దాం. బ్యూటీ టిప్స్: అరటి తొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి. ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసుకుని, ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. అరటి పండులో ఉన్న విటమిన్ బి 6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ప్యాక్ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖ చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
బంగాళదుంపతో ముఖం మిలమిల.. మచ్చలు పోయి నిగారింపు
బ్యూటీ టిప్స్ ఒక బంగాళదుంపను తీసుకుని తొక్క తీసి,పేస్టులా చేసుకోవాలి. దీన్ని పలుచని వస్త్రంలో వడగట్టి నీటిని తీసేయాలి. ఆ గుజ్జులో 6 టేబుల్ స్పూన్లు పాలు కలపాలి. ఈ మిశ్రమంలో 6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి, ఐస్ట్రేలో వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి.. ఫ్రీజ్ అయిన బంగాళదుంపతో ముఖమంతా రుద్దాక, చేతులతో సున్నితంగా మర్దన చేసి, ఆరిన తరువాత కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఇలా చేయడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన దుమ్మూధూళి, మొటిమల తాలూకు మచ్చలు పోయి ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
అరటిపండుతో అదిరిపోయే అందం.. ఈ ప్యాక్తో ఇన్ని ఉపయోగాలా?
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? వాటికోసం వేలకువేలకు తగలేసి కాస్మొటిక్స్ వస్తువులు కొంటుంటారు. కానీ ఈజీగా ఇంట్లోనే దొరికే అరటిపండుతో నిగనిగలాగే స్కిన్టోన్ను సొంతం చేసుకోవచ్చు. అరటిపండు తింటే ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ముడతలు లేకుండా చేయడంలో సహాయపడుతుంది. అందమైన చర్మం కోసం అరటింపడుతో ఇలా ప్యాక్ వేసుకోండి.. ♦ బాగా పండిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ♦ అరటిపండు గుజ్జులో తేనే, పసుపు కలుపుకొని రాసుకుంటే ఇన్స్టంట్ గ్లో వస్తుంది. ♦ అరటిపండును మెత్తగా చేసుకోని దానిలో వేపాకు పౌడర్ను కలుపుకొని ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ను తరచుగా వేసుకోవడం వల్ల మొటిమలను నివారిస్తుంది. ♦ మెటిమలు, వాటి తాలూకూ మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అరటిపండు మీ సమస్యకు చక్కని పరిష్కారం.ఒక అరటిపండును తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పేస్ట్లా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం, శనగపిండి కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ♦ అరటిపండు గుజ్జులో రెండు రెండు స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 20 నిమిషాలయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మృదువుగా మారుతుంది. -
సహజ సిద్ధమైన యూత్ప్యాక్స్
పార్టీలు, వేడుకలకు వెళ్లాలనుకొన్నప్పడు ముఖానికి తక్షణ నిగారింపు రావడం కోసం రకరకాల ఫేస్ప్యాక్లు ఉపయోగిస్తుంటారు. అయితే ఒక్కోసారి అవి అందుబాటులో ఉండవు. ఉన్నా, చర్మానికి పడవు. అలాంటప్పుడు... సహజసిద్ధమైన ఈ ఫేస్ప్యాక్స్ ప్రయత్నించండి. ఇవి మీ చర్మానికి తగిన పోషణను ఇవ్వడంతో పాటు యవ్వన కాంతినిస్తాయి. చందనం, రోజ్ వాటర్ చందనం ముఖం పై ఉన్న మృతకణాలను తొలగించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. రోజ్వాటర్ చర్మానికి మెరుపునందిస్తుంది. వేసవిలో ఈప్యాక్ వేసుకోవడం ద్వారా సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి ఉపశమనం దొరుకుతుంది. ఇందుకోసం... ♦ గంధపు చెక్కను రోజ్ వాటర్తో అరగదీసి.. ముఖానికి ఫేస్ప్యాక్లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. మీ దగ్గర గంధపు చెక్క లేకపోతే.. దానికి బదులుగా గంధపు పొడిని ఉపయోగించవచ్చు. గంధం పొడిలో సరిపడినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి మాస్క్లా వేసుకొంటే సరిపోతుంది. ఓట్ మీల్తో... ఓట్మీల్ సహజసిద్ధమైన స్క్రబ్లా పనిచేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఇతర పోషకాలు చర్మానికి మెరుపునిస్తాయి. ఓట్ మీల్ సహజసిద్ధమైన క్లెన్సర్గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. రెండు టేబుల్స్పూన్ల ఓట్ మీల్లో టీస్పూన్ చందనం పొడి వేసి సరిపడినంత రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు చల్లుకుంటూ మసాజ్ చేసుకొంటున్నట్టుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. -
బ్యూటీపార్లర్ నిర్వాకం.. విద్యార్థిని ముఖంపై నీటిపొక్కులు
సాక్షి, గుంటూరు: తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్పేటలో ఓ బ్యూటీ పార్లర్ నిర్వాహకుల వల్ల ఓ విద్యార్థిని ముఖంపై నీటిపొక్కులు వచ్చాయి. ఫలితంగా ఆమె తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. బ్యూటీపార్లర్కు సోమవారం సాయంత్రం ఉండవల్లికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని వచ్చింది. ఫేస్ వ్యాక్స్ చేయించుకుంది. ఆ రాత్రి ఆమె ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు వచ్చాయి. కంగారు పడిన ఆమె ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు ఫేస్ వ్యాక్స్ వల్లే ఇలా జరిగిందని చెప్పారు. దీంతో విద్యార్థిని బంధువులు మంగళవారం బ్యూటీపార్లర్కు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా, ఘరానాగా సమాధానమిచ్చారు. ఇవన్నీ సహజమేనని చెప్పారు. చేతనైనది చేసుకోండి అంటూ దౌర్జన్యంగా మాట్లాడారు. దీంతో విద్యార్థిని పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని ముఖంపై వచ్చిన నీటిపొక్కులు తగ్గడానికి నాలుగు నెలల నుంచి 5 నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. చదవండి: Viral: స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తున్న డ్రాగన్స్.. నమ్మడం లేదా? -
Beauty Tips: వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది: నటి
'మేరీ ఆషీకి తుమ్ సే హై' అనే టీవీ షోతో కెరీర్ ఆరంభించింది ఢిల్లీ బ్యూటీ రాధికా మదన్. 2018లో పటాకా సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఇక ఆంగ్రేజీ మీడియం సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూతురిగా నటించి మెప్పించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనితో పాటు రే వెబ్సిరీస్లోనూ తన నటనకు గానూ రాధిక విమర్శల ప్రశంసలు అందుకుంది. త్వరలోనే కుట్టీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధికా.. తన బ్యూటీ సీక్రెట్ ఏమిటో అభిమానులతో పంచుకుంది. అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా.. ‘నా చర్మ సౌందర్య రహస్యం.. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాకే. ఇది మా అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా అందిన చిట్కా అని చెప్పొచ్చు. చాలా సింపుల్. ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి, ఒక టీ స్పూస్ పసుపు, రెండు టీ స్పూన్ల బాదం పప్పు పొడి, ఒక టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు పాలు.. అన్నిటినీ కలిపి ప్యాక్లా తయారు చేసుకోవాలి. దీనిని మొహానికి, మెడకు అప్లయ్ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసు కోవాలి. మెత్తటి టవల్తో తడిపొడిగా తుడుచుకుని మాయిశ్చరైజన్ రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా.. మొహం డ్రై అవకుండా తేమతో నిగనిగలాడుతూ ఉంటుంది’’ అని రాధికా మదన్ చెప్పుకొచ్చింది. చదవండి: Anushka Sharma Beauty Secret: టీనేజ్లో ఉన్నపుడు అమ్మ చెప్పింది.. నా బ్యూటీ సీక్రెట్ అదే! Beauty Tips: నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? ఈ సులభమైన చిట్కాలతో చెక్ పెట్టేయండి! -
Beauty Tips: మొటిమలు, జిడ్డుకు చెక్ పెట్టేయండిలా!
ముఖంపై మొటిమలు, జిడ్డు సమస్య వేధిస్తోందా? అయితే, పుదీనా ఆకులతో సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి! ►పుదీనా ఆకులను ఎండబెట్టి పొడిచేయాలి. ►ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్వాటర్ వేసి పేస్టులా కలపాలి. ►ఈ పేస్టుని ముఖంపై అసహ్యంగా కనిపిస్తోన్న మొటిమలపై రాయాలి. ►పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి. ►ఈ పేస్టుని రోజూ అప్లై చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. ►క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. అదే విధంగా.... ►గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్వాటర్ జోడించి పేస్టులా నూరాలి. ►ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డులేకుండా ఫ్రెష్గా కనిపిస్తుంది. చదవండి: Detoxification: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన.. శరీరంలోని విషాలు తొలగించుకోండిలా! ఇవి తింటే మాత్రం.. -
Beauty Tips: చింతాకు, బొప్పాయి గుజ్జు.. మచ్చలు, ముడతలు మాయం!
Tamarind Leaf And Papaya Pack : కప్పు చింత ఆకుల్లో పావు కప్పు బొప్పాయి పండు గుజ్జు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ పుల్లటి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి మాయిశ్చర్ అందుతుంది. ఇందులోని యాంటీసెఫ్టిక్ గుణాలు చర్మాన్ని సూక్ష్మజీవుల నుంచి కాపాడతాయి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ను వేసుకుంటే ముఖం మీద మచ్చలు, ముడతలు, చర్మసంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ►ఇక బియ్యప్పిండి, బొప్పాయి గుజ్జుని మఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి. ►అదే విధంగా బొప్పాయిగుజ్జులో పసుపు, పచ్చిపాలు, తేనె, తులసి ఆకుల పొడి కలిపిముఖానికి పట్టిస్తే, మొటిమలు, తెల్లమచ్చలు మాయమవతాయి. ►బొప్పాయి పండు గుజ్జు, అర స్పూన్ అలోవెరా జ్యూస్, కొంచెం తేనె కలిపి రాసుకుంటే చర్మానికి కావలసిన తేమ, పోషక పదార్థాలు అందుతాయి. మీరు యవ్వనంగా కనిపిస్తారు. ►నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయ వస్తుంది. ►బొప్పాయి పండుకి ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది. చదవండి: టీనేజ్లో కాకుండా... యుక్తవయసు దాటాకా మొటిమలు వస్తున్నాయా? అయితే -
Beetroot: ముఖం మీది మొటిమలు, మృత కణాలు ఇట్టే మాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న బీట్రూట్ అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మొటిమలను వదిలించడంలో ఇవి రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక వీటికి జింక్, యాంటీబయోటిక్స్ తోడైతే మొటిమలు త్వరగా తగ్గుతాయి. అందువల్ల మొటిమలతో బాధపడుతున్నవారు బీట్రూట్ ప్యాక్ను ప్రయత్నిస్తే మంచి ఫలితం వస్తుంది. బీట్రూట్ ప్యాక్ తయారీ: ►రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి. ►తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల ముఖం మీది మొటిమలు, వాటి తాలుకూ మచ్చలు పోయి ముఖం కాంతిమంతమవుతుంది. ►వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది. ►అదే విధంగా రోజూ ముఖానికి బీట్రూట్ రసం రాసి పది నిమిషాలపాటు మర్దన చేస్తే ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగి పోతాయి. చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... -
Beauty Tips: ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తొలగించేందుకు.. ఆనప ఫేస్ ప్యాక్!
Winter Skin Care Tips In Telugu: వాతావరణం మారినప్పుడల్లా ఆ ప్రభావం సున్నితమైన చర్మంపై పడుతుంది. ఫలితంగా ముఖం మీద ట్యాన్ పేరుకు పోవడం, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడటం.. వెరసి ముఖం పొడిబారి గ్లో తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, పోషణ అందించే ప్యాక్లు వాడటం ద్వారా పోయిన గ్లోను తిరిగి తెస్తాయి. ►సొరకాయ (ఆనప కాయ) గుజ్జులో పావు టీస్పూను తేనె, టీస్పూను అలోవెరా జెల్, టీస్పూను రోజ్ వాటర్, విటమిన్ ఈ క్యాప్సూల్ వేసి పేస్టులా కలుపుకోవాలి. ►ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. తరువాత పదినిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ప్యాక్ను వారానికి రెండు సార్లు వేసుకోవడం వల్ల నల్లని మచ్చలు, ట్యాన్ తొలిగి ముఖం నిగారింపును సంతరించుకుంటుంది. చదవండి: Weight Loss Diet: ఆ హార్మోన్ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ.. -
Beauty Tips: ముఖారవిందానికి పప్పుల ఫేస్ ప్యాక్స్!
ముఖం అందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే రసాయన క్రీములన్నీ వాడేస్తుంటారు. ఇవి కొన్నిసార్లు దుష్ప్రభావాలు చూపించి ఉన్న అందాన్ని కోల్పోయేలా చేస్తాయి. అయితే ఎటువంటి రసాయనాలు వాడకుండా మనింట్లో ఉండే పప్పులతో ఫేస్ ప్యాక్లు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.. శనగపప్పు మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. మసూర్దాల్ కప్పు ఎర్రకందిపప్పు (మసూర్దాల్) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. పెసరపప్పు అరకప్పు పెసరపప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్టులా రుబ్బుకోవాలి. దీనికి టేబుల్ స్పూను పెరుగు, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాల తరువాత నీటితో మర్దన చేసి, కడిగేయాలి. ఈ ప్యాక్తో విటమిన్ ఏ, సీలు ముఖారవిందాన్ని మరింత మెరిపిస్తాయి. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
తొక్కే కదా అని తీసిపారేయకండి...
అన్ని పండ్ల తొక్కల్లో విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందుకని వాటిని ఆహారంగా తీసుకోలేం కదా. అయితే తొక్కే కదా అని తీసిపారేయకండి. వాటిని మరోలా ఉపయోగించుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలు అందానికి బాగా ఉపయోగపడతాయని ఇంతకు ముందు చాలా సార్లు తెలుసుకున్నాం. బకెట్ నీళ్ళలో కొన్ని నిమ్మ తొక్కలు వేసి మరిగించి, ఆ నీళ్లతో స్నానం చేయాలి. నిమ్మతొక్కల్లోని సిట్రిక్ యాసిడ్ వల్ల చర్మం మృదువుగా అవుతుంది. బయట ఎక్కువగా తీరుతున్న వారికి చర్మంపై దుమ్ముచేరి, కమిలిపోతుంది. అలసటకు కూడా గురవుతారు. అలాంటప్పుడు అరటిపండు తొక్కతో ముఖమంతా మర్దనా చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. బొప్పాయి గుజ్జుతో ఫేసియల్ చేయడం అందరికీ తెలుసు. వీటి తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి దీన్ని కూడా ప్యాక్ గా వేసుకుని పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. యాపిల్ తొక్కను కూడా మిక్సీ చేసి ముఖానికి పట్టించాలి.నెమ్మదిగా మర్దన చేస్తే, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది. నారింజ తొక్కలు కూడా సున్నిపిండిలో వేసి మర పట్టిస్తే చర్మం మృదువుగా అవుతుంది. దీన్ని కూడా నీళ్ళలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. అలాగే తొక్కల గుజ్జుతో ప్యాక్ చేసుకుంటే నల్లని మచ్చలు, కంటికింద వలయాలు తగ్గుతాయి. నిద్రనుంచి లేచినప్పుడు కొందరి ముఖం ఉబ్బి పోతుంది. ఇది తగ్గాలంటే బంగాళా దుంప తొక్కలు ఉడికించిన నీటితో ముఖం కడుక్కుంటే ఉబ్బిన చర్మం మామూలుగా అయిపోతుంది. అలాగే ఉడికిన తొక్కల్ని ప్యాక్ గా చేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది. -
సాగనివ్వకండి బ్యూటిప్
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై చర్మం సాగుతుంటుంది. దాంతో మనసు ఎంత ఉత్సాహంగా ఉరకలేస్తున్నా, ఎదుటి వారికి మాత్రం ముడతలను చూడగానే మీ వయసు ఇట్టే తెలిసి పోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. స్ట్రాబెర్రీ: ఈ పండ్లలో చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఉంటుంది. ఇది 100 శాతం నేచురల్ ట్రీట్మెంట్. 5–6 స్ట్రాబెర్రీలను తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి వేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు తగ్గుతాయి. గుడ్డు తెల్లసొన, పెరుగు: ముడతలు మటుమాయం చేయడానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్ఫూన్ పెరుగులో రెండు గుడ్ల తెల్ల సొనను వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న మడతల వద్ద, మెడకు అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతూ ముడతలు తగ్గుతాయి. బియ్యం పిండి: చర్మంపై ముడతలను తొలగించేందుకు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ లేదా గ్రీన్ టీ పోసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20–30 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. -
మృదువైన మెరుపు
మార్కెట్లో కొన్న క్రీమ్స్ కంటే.. సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే చర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా కాపాడతాయి. మచ్చలు, మొటిమలు, ముడతలు... ఇలా ఒక్కటేమిటి వయసుతో వచ్చిన సమస్యలను, కాలుష్యం తెచ్చిపెట్టిన ఇబ్బందులను సహజసిద్ధమైన చిట్కాలు పరిష్కరిస్తాయి. అందుకే చాలా మంది ఈ చిట్కాలను తు.చ. తప్పకుండా పాటిస్తారు. నిపుణుల సలహాలు కూడా ఇవే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : కమలా రసం – 2 టీ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – అర టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్ మాస్క్: కీరదోస గుజ్జు – 3 టీ స్పూన్లు, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా కమలా రసం, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కొబ్బరి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కీరదోసగుజ్జు, ముల్తానీ మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మృదువైన జుట్టు కోసం...
అరటిపండుని మెత్తగా చేసి అందులో ఒక గుడ్డు, 3 టీ స్పూన్ల మజ్జిగ, 3 టీ స్పూన్ల ఆలివ్ నూనె, 2 టీ స్పూన్ల తేనె కలిపి, జుట్టుకి, మాడుకీ బాగా అంటేలా రాయాలి. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేసుకోవాలి. నెలకి రెండుసార్లు ఈ ప్యాక్ను వేసుకుంటే మంచిది. ఒక టీ స్పూన్ తాజా నిమ్మరసం, టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ కలబంద రసం కలిపి తలకి రాసుకోవాలి. అరగంటయ్యాక చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలలో రెండుసార్లు చేస్తే సరి! -
పట్టులాంటి మృదుత్వం
సౌందర్యవంతమైన ముఖ కాంతికి సహజమైన చిట్కాలే సరైనవంటున్నారు నిపుణులు. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యంతో ముఖం జిడ్డుగా, కాంతిహీనంగా మారిపోతుంది. అలాంటప్పుడు కొంత సమయం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కేటాయిస్తే చాలు. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్ప్యాక్ వేసుకుంటే ముఖం మృదువుగా పట్టులా మెరుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు మీగడ – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – పావు టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 2 టీ స్పూన్లు మాస్క్: చిక్కటి పాలు–1 టీ స్పూన్, శనగపిండి – అర టీ స్పూన్, తులసి ఆకుల గుజ్జు – 3 టీ స్పూన్లు, పచ్చి పసుపు – చిటికెడు తయారీ : ముందుగా పెరుగు మీగడ, నిమ్మరసం ఒక చిన్న బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, టమాటా గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, శనగపిండి, పసుపు, చిక్కటి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. -
తళుక్కుమనే మెరుపు!
ముఖ సౌందర్యానికి కాసింత సమయాన్ని వెచ్చిస్తే చాలు... తళుక్కుమనే మెరుపు మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. ముఖంపైన ఉండే మృతకణాలు, మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోవాలంటే... శ్రద్ధ చూపించడం చాలా అవసరం. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతం మారుతుంది. మచ్చ లేని మృదువైన అందం మీ సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, కలబంద గుజ్జు – 1 టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు, కొబ్బరి నూనె – పావు టీ స్పూన్ మాస్క్ : గడ్డ పెరుగు –1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 2 టీ స్పూన్లు, దానిమ్మ రసం – 1 టీ స్పూన్ తయారీ : ముందుగా కొబ్బరి పాలు, కలబంద గుజ్జు ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కీరదోస గుజ్జు, కొబ్బరి నూనె ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, ముల్తానీ మట్టి, అరటిపండు గుజ్జు, దానిమ్మ రసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. -
ఫేస్క్రీమ్స్తో పనిలేదు!
మేకప్తో వచ్చే అందం కంటే.. మేకప్ వేయకుండా మెరిసే అందానికే ఓటేస్తుంటారు చాలా మంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఖర్చులేని ఈ చిట్కాలను పాటించడానికి మాత్రం కాసింత సమయం వెచ్చించాల్సిందే. అప్పుడే ఫలితం కనిపిస్తుంది. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు మచ్చలు, మొటిమలు పూర్తిగా మాయమవుతాయి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : ఆలీవ్ నూనె – పావు టీ స్పూన్, దానిమ్మ జ్యూస్ – 2 టీ స్పూన్లు(చెత్త తొలగించి), బాదం పాలు – 1 టీ స్పూన్ (బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి.. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని, జ్యూస్లా మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని బాదం పాలు తయారు చేసుకోవాలి. వాటిని ఫ్రిజ్లో నిలువ చేసుకోవచ్చు.) స్క్రబ్ : దానిమ్మ గుజ్జు – 2 టీ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్, పచ్చిపసుపు – పావు టీ స్పూన్ మాస్క్ : గడ్డ పెరుగు – 2 టీ స్పూన్లు, యాపిల్ గుజ్జు – 3 టీ స్పూన్లు, పెసరు పిండి – 1 టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్ తయారీ : ముందుగా దానిమ్మ జ్యూస్, బాదం పాలు, ఆలీవ్ నూనె ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గుజ్జు, బియ్యప్పిండి, ఆరెంజ్ జ్యూస్, పచ్చి పసుపు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, యాపిల్ గుజ్జు, పెసరు పిండి, నిమ్మరసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. వెంటనే సబ్బు ముఖానికి రాసుకోకపోవడమే మంచిది. -
సౌందర్యపు బొమ్మ
మగువలు సినీతారల్లా మెరిసేందుకు ఈ మధ్యకాలంలో ఎన్నో క్రీమ్స్ పోటెత్తుతున్నాయి. కానీ ఆ మెరుపు కొన్ని గంటలు మాత్రమే నిలుస్తుంది. మేకప్ ఉన్నా లేకపోయినా ముఖం కాంతివంతంగా మెరవాలంటే... ఈ చిట్కాలను పాటించాల్సిందే. ఈ పద్ధతులు ఆచరించాల్సిందే. అప్పుడే సౌందర్యపు బొమ్మలా మెరిసిపోతారు. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. సహజ సౌందర్యాన్ని సొంతం చేసుకోండి. సౌందర్యపు బొమ్మ కావల్సినవి : క్లీనప్ : క్యారెట్ జ్యూస్ – 2 టీ స్పూన్స్, మీగడ – 1 టీ స్పూన్ స్క్రబ్ : ముల్తానీ మట్టి – అర టీ స్పూన్, ఓట్స్ – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్ మాస్క్ : ద్రాక్ష గుజ్జు – 3 టేబుల్ స్పూన్స్, పచ్చి పసుపు – 1 టీ స్పూన్ స్పూన్, చిక్కటి పాలు – అర టీ స్పూన్ తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని క్యారెట్ జ్యూస్, పెరుగు మీగడ యాడ్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ముల్తానీ మట్టి, ఓట్స్, తేనె, గడ్డ పెరుగు ఒక బౌల్లోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ద్రాక్ష గుజ్జు, పచ్చి పసుపు, చిక్కటి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, 15 లేదా 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
తళుక్కున మెరిసేందుకు
క్రీమ్స్, లోషన్స్ రాసుకోవడం వల్ల వచ్చే అందంకంటే సహజసిద్ధమైన ఫేస్ప్యాక్ల వల్ల నిలిచే అందానికే ఓటేస్తుంటారు చాలామంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఇంటిపట్టున దొరికే... వాటితోనే ఫేస్ప్యాక్లు సిద్ధం చేసుకోవచ్చు. అయితే ఫేస్ప్యాక్కు ముందు క్లీనప్, స్క్రబ్ వంటివి తప్పని సరిగా చేసుకుంటే చర్మంపైన పేరుకుపోయిన మృతకణాలు పూర్తిగా తొలిగిపోయి మృదువుగా, మచ్చలు, మొటిమలు వంటివి లేకుండా అందంగా తయారవుతుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు – పావు టీ స్పూన్, ఆరెంజ్ జ్యూస్ – 1 టీ స్పూన్ స్క్రబ్ : ఆరెంజ్ తొక్కల పొడి – 2 టీ స్పూన్లు, అరటి పండు గుజ్జు – 2 టీ స్పూన్లు, చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు మాస్క్ : కిస్మిస్ గుజ్జు – అర టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు, కొబ్బరిపాలు – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా పెరుగు, ఆరెంజ్ జ్యూస్ ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ తొక్కల పొడి, అరటి పండు గుజ్జు, చిక్కటిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు శనగపిండి, కొబ్బరిపాలు, కిస్మిస్ గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
జుట్టు చిట్లుతుంటే...
కేశాలకు తగినంత పోషణ, నూనె లేనప్పుడు వీటికి తోడుగా ఎక్కువ వేడి తగులుతున్నట్లయితే చివర్లు చిట్లుతాయి. ఇలాంటప్పుడు హెయిర్ డ్రయర్లు వాడకపోవడమే మంచిది. కనీసం వారానికి ఒక రోజు చిట్లిన చివర్లను కత్తిరించుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూను ఆముదాన్ని గోరువెచ్చగా చేసి తలకు, జుట్టు చివర్ల వరకు పట్టించి, ఉదయం తలస్నానం చేయాలి. ఒక టీ స్పూను ఆముదం, అంతే మోతాదులో ఆవనూనె, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి మర్దన చేసి జుట్టుకంతటికీ చివరి వరకు పట్టించాలి. తరువాత వేడి నీటిలో ముంచిన టవల్ను తలకు చుట్టి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. బ్లెమిషెస్ పోవాలంటే.. ముఖం మీద ఉన్న మచ్చలు పోవాలంటే నిమ్మకాయ బాగా పని చేస్తుంది. ప్యాక్ల కోసం టైం కేటాయించలేని వాళ్లు వంటలోకి పిండిన నిమ్మచెక్కను తిరగేసి ముఖానికి రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే చాలు. క్రమంగా మచ్చలు చర్మంలో కలిసిపోతాయి.నిమ్మచెక్కను రసం పిండేసిన తర్వాత వెనక్కి తిప్పి చక్కెరలో అద్ది ముఖానికి మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే నల్లమచ్చలు, యాక్నె, పింపుల్స్ అన్నీ పోయి ముఖం క్లియర్గా మారుతుంది.రెండు టీ స్పూన్ల పెసరపిండిలో చిటికెడు పసుపు కలిపి అందులో రెండు చుక్కల నిమ్మరసం, ఒక స్పూను పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ప్రతిరోజూ ఈ ప్యాక్ వేస్తుంటే నెల రోజులకు ముఖంలో ఊహించని మార్పు చోటుచేసుకుంటుంది. -
చర్మకాంతికి చక్కటి చిట్కా
ఎంత ఖరీదైన కాస్మొటిక్స్ వాడినా ముఖం నిగారింపును కోల్పోతుందా? ఎన్ని లోషన్స్ మార్చినా కళతప్పుతుందా? అయితే చక్కటి సహజసిద్ధమైన ఫేస్ప్యాక్లను నమ్ముకోండి. ఇలా ప్రయత్నించండి. ఫేస్ప్యాక్ వేసుకునే ముందు క్లీనప్ చేసుకుని, స్క్రబ్ చేసుకుని, ఆవిరి పట్టించుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కావల్సినవి : క్లీనప్ : పాలు – 1 టేబుల్ స్పూన్బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్ స్క్రబ్ : కొబ్బరి నూనె – 3 టీ స్పూన్లు, పంచదార – ఒకటిన్నర టీ స్పూన్లు, పచ్చిపసుపు – పావు టీ స్పూన్ (పసుపు కొమ్ము), పెరుగు – అర టీ స్పూన్ మాస్క్ : టమాటా జ్యూస్ – అర టేబుల్ స్పూన్పుదీనా గుజ్జు – 4 టీ స్పూన్లు, ముల్తాని మట్టి – 2 టీ స్పూన్లు తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని పాలు, బియ్యప్పిండి, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనె, పంచదార, పచ్చిపసుపు, పెరుగు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు టమాటా జ్యూస్, పుదీనా గుజ్జు, ముల్తాని మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
భేషైన చిట్కా
కోమలమైన చర్మాన్ని పొందేటందుకు, చర్మకాంతిని రెట్టింపు చేసుకునేటందుకు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే భేషైనవంటున్నారు నిపుణులు. ఖరీదైన కాస్మొటిక్స్ కంటే ఇంటి పట్టున దొరికే పసుపు, పెరుగు వంటి పదార్థాలతో తయారుచేసుకునే లేపనాలే చర్మానికి అన్నివిధాలుగా మంచివంటున్నారు. ముఖంలో మెరుపు రావాలంటే ఓన్లీ ఫేస్ప్యాక్లే కాదు స్క్రబ్ చేసుకోవడం, క్లీనప్ చేసుకోవడం వంటివి తప్పనిసరి. ఇక ఆవిరి పట్టించుకోవడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : టమాటా జ్యూస్ – 2 టీ స్పూన్స్, క్యారెట్ జ్యూస్ – 2 టీ స్పూన్స్, పాలు – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు స్క్రబ్ : ఓట్స్ లేదా బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్, గడ్డ పెరుగు – అర టేబుల్ స్పూన్నిమ్మరసం – 1 టీ స్పూన్ మాస్క్ : మొక్కజొన్న పిండి – 3 టీ స్పూన్స్, తులసి ఆకుల గుజ్జు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, చిక్కటి పచ్చి పాలు – 3 టీ స్పూన్స్ తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని టమాటా జ్యూస్, క్యారెట్ జ్యూస్, పాలు, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ లేదా బియ్యప్పిండి ఒక బౌల్లోకి తీసుకుని అందులో గడ్డ పెరుగు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకుని, మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి, తులసి ఆకుల గుజ్జు, తేనె, పచ్చిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మోమంత మెరుపు
అందం చెక్కు చెదరకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే మచ్చలు, మొటిమలు దరిచేరకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖానికి ఖరీదైన ఫేస్క్రీమ్స్ రాసుకునే కంటే సహజసిద్ధమైన ఫేస్ప్యాక్స్ పూసుకుంటేనే అన్ని విధాలా మంచిదంటున్నారు నిపుణులు. మరింకెందుకు ఆలస్యం? ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని, ఆవిరి పట్టించుకుని, ఫేస్ప్యాక్ వేసుకుని సౌందర్యరాశిలా మెరిసిపోండి. కావల్సినవి : క్లీనప్ : టమాటా జ్యూస్ – 2 టీ స్పూన్స్, పాలు – 2 టీ స్పూన్స్, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : కాఫీ పౌడర్ – 4 టీ స్పూన్స్, పంచదార – 4 టీ స్పూన్స్, కొబ్బరి నూనె – 2 టీ స్పూన్స్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 4 లేదా 5 డ్రాప్స్ మాస్క్ : జీడి పప్పులు – 6 లేదా 8, కిస్మిస్ – 1 టీ స్పూన్, తేనె – పావు టీ స్పూన్, పాలు – 2 టీ స్పూన్స్ తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని టమాటా జ్యూస్, పాలు, తేనె వేసుకుని, బాగా కలిపిన తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కాఫీ పౌడర్, పంచదార, కొబ్బరినూనె, వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఒక బౌల్లోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని, ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్లను మెత్తగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో తేనె, పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత, గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
బ్యూటిప్స్
ముడతల నివారణకు...అరటిపండు – 1క్యాబేజీ ఆకులు – రెండు కోడిగుడ్డు – 1 (తెల్లసొన మాత్రమే) తయారి: అరటిపండు ముక్కలుగా కట్ చేయాలి. దీనితో పాటు క్యాబేజీ ఆకుల ను సన్నగా తరగాలి. ఈ రెంటినీ మిక్సర్ లో వేసి పేస్ట్ చేయాలి. దీంట్లో కోడిగుడ్డు తెల్లసొన వేసి కలపాలి. తర్వాత ముఖ మంతా అప్లై చేయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖం మీద ముడతలు తగ్గుతాయి. క్లెన్సింగ్ ఫేస్ ప్యాక్ కావలసినవి: క్యారెట్లు – రెండు (ముక్కలుగా కట్చేసుకోవాలి), క్యాబేజీ తురు ము – టేబుల్ స్పూన్, టొమాటో – 1 తయారి: క్యాబేజీ తురుము, టొమాటో, క్యారెట్ ముక్కలు మిక్సర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి, మూడు చుక్కల తేనెతో కలపాలి. శుభ్రం చేసుకున్న ముఖానికి మెడకి ఈ పేస్ట్ అప్లై చేయాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది. వారానికి ఒకసారి ఈ ఫేస్ప్యాక్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. -
పొటాటో ఫేస్ ప్యాక్
కిచెన్లో అందుబాటులో ఉండే బంగాళదుంపతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు ఇలా... బంగాళదుంపను శుభ్రంగా కడిగి, చెక్కు తీయకుండా మెత్తగా ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత నీటిని వంపేసి స్పూన్తో మెదుపుకోవాలి. దీంట్లో ఒక టీ స్పూన్ పాల పొడి, తగినంత కొబ్బరి నూనె గాని, బాదం నూనె గాని వేసి కలిపి పేస్ట్ చేయాలి. ముఖం శుభ్రపరిచిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ మెడ మొదలుకొని ముఖానికంతటికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. పదిహేను రోజులకు ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతమవుతుంది. -
సౌందర్యపు మెరుపులు
సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే ముఖానికి సరికొత్త మెరుపునందిస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ కాస్మొటిక్స్ కంటే ఇంటిపట్టునే సిద్ధం చేసుకోగల చిన్న చిన్న చిట్కాలే అసలైన అందాన్ని సొంతం చేస్తాయి. అయితే కాస్త సమయం ముఖసౌందర్యానికి కేటాయించాల్సి ఉంటుంది. కేవలం ఫేస్ ప్యాక్సే కాకుండా క్లీనప్, ఆవిరి పట్టడం, స్క్రబ్ చేసుకోవడం మంచిది. ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలిగిపోయి, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. జిడ్డు, నల్లటి మచ్చలు తగ్గి గ్లోయింగ్ వస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : ఆలీవ్ నూనె – టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్, రోజ్ వాటర్ – అర టీ స్పూన్కొబ్బరి పాలు – పావు టీ స్పూన్ స్క్రబ్ : దానిమ్మ గుజ్జు – 3 టీ స్పూన్, కొబ్బరి నూనె – అర టీ స్పూన్, తేనె – పావు టీ స్పూన్ చిక్కటి పచ్చిపాలు – 1 టీ స్పూన్ మాస్క్ : స్ట్రాబెరీ గుజ్జు – 2 టీ స్పూన్స్, ఖర్జూరం గుజ్జు – 2 టీ స్పూన్స్, టమాటా జ్యూస్ – 3 టీ స్పూన్స్, పెరుగు – పావు టీ స్పూన్ తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో ఆలీవ్ నూనె, నిమ్మరసం, రోజ్ వాటర్, కొబ్బరి పాలు వేసుకుని, బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గుజ్జు, పాలు, కొబ్బరి నూనె, తేనె ఒక బౌల్లోకి తీసుకుని, బాగా మిక్స్ చేసుకుని మూడు నుంచి ఐడు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని వాటర్తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెరీ గుజ్జు, ఖర్జూరం గుజ్జు ఒక బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో టమాటా జ్యూస్, పెరుగు కూడా యాడ్ చేసుకుని, బాగా మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఏది రాంగ్? ఏది రైట్?
చర్మసౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు చాలా మంది. అయితే కొన్ని సార్లు చర్మాన్ని మెరుగు పెట్టే సౌందర్య ఉత్పాదనలు, ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాల వల్ల కూడా హాని జరుగుతుంటుంది. అవగాహన లేమి దీనికి ప్రధాన కారణం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఏమేం చేయకూడదంటే...చర్మం తెల్లగా అవ్వాలని, మృదువుగా అవ్వాలని స్క్రబ్(మార్కెట్లో రకరకాల స్క్రబ్లు అందుబాటులో ఉన్నాయి) తో అతిగా రుద్దుతుంటారు. దీని వల్ల చర్మం ఎర్రబడటమే కాకుండా పొడిబారుతుంది.మొటిమలు ఉంటే సమస్య మరింతగా పెరుగుతుంది. రెండు వారాలకు ఒకసారి చర్మతత్వానికి సరిపడే స్క్రబ్ (మార్కెట్లో లభిస్తుంది) తో 2–3 నిమిషాలు మృదువుగా రుద్ది, శుభ్రపరుచుకోవాలి. మెటిమలు ఎక్కువగా ఉంటే స్క్రబ్ వాడకూడదు. వేపాకులను రుబ్బి, ముఖానికి రాసుకొని, ఆరాక శుభ్రపరచాలి. చాలామంది తమ చర్మతత్వానికి సరిపడిన మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ లోషన్లు ఎంచుకోరు. దీని వల్ల సేదగ్రంథులు మూసుకుపోవడం, చర్మంపై దద్దుర్లు, పొక్కులు రావడం జరుగుతుంటాయి. ఏదైనా కొత్త సౌందర్య ఉత్పత్తిని చర్మానికి ఉపయోగించే ముందు మోచేతిపై లేదా చెవి వెనకాల కొద్దిగా రాసి, 2–3 గంటల సేపు అలాగే ఉంచాలి. ఎరుపు దనం, దద్దుర్లు లేవని నిర్ధారించుకున్నాకే ఆ ఉత్పత్తిని వాడుకోవాలి. అలాగే, మాయిశ్చరైజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ వాడకూడదు. మాయిశ్చరైజర్ చర్మానికి రాసిన 60 సెకండ్లలో ఇంకిపోతుంది. ఆ తర్వాత ఫౌండేషన్ను వాడవచ్చు. మొటిమలను గిల్లడం, లోపలి పస్(చీము) తీయడం వంటివి చేస్తే ఆ ప్రాంతంలో మచ్చలు పడే అవకాశం ఉంది. జిడ్డు చర్మం గలవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు రోజులో 2–3 సార్లు ఫేస్వాష్తో శుభ్రపరుచుకోవడం, నిమ్మ గుణాలున్న పేస్ప్యాక్లు వేసుకోవడం వల్ల ముఖం శుభ్రంగా ఉండి మొటిమల సమస్య తగ్గుతుంది.చాలామంది దుస్తులు ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటారు. దుస్తుల మీద స్ప్రే చేయడం వల్ల అందులోని ఫైబర్ లక్షణాలతో కలిసి పెర్ఫ్యూమ్ సువాసన మారే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ తరహా ప్రయోగాలు చర్మానికి హాని కలిగించవచ్చు. -
కోకోనట్ సౌందర్యం
మెరిసే చర్మ సౌందర్యం కోసం నెలనెలా వందల రూపాయలు ఖర్చు చేస్తుంటారు మగువలు. కానీ కెమికల్స్ ఎక్కువగా ఉండే ఫేస్ క్రీమ్స్ కంటే.. ఇంటి పట్టున సహజసిద్ధంగా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్సే సరైనవని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. మరైతే ఎన్నో గొప్పలక్షణాలున్న కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లతో చక్కటి క్లీనప్, స్క్రబ్, మాస్క్ వంటివి ప్రయత్నించండి. చర్మం పటుత్వాన్ని కోల్పోకుండా చూసుకోండి. కావలసినవి: క్లీనప్ : పెరుగు – 3 టీ స్పూన్స్, కొబ్బరి నూనె – 1 టీ స్పూన్స్క్రబ్ : కొబ్బరి నీళ్లు – 3 టీ స్పూన్స్, ఓట్స్ – 2 టీ స్పూన్స్ మాస్క్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్స్, తేనె – 1 టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని పెరుగు, కొబ్బరి నూనె యాడ్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకుని, ఓట్స్, కొబ్బరి నీళ్లు కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ముఖాన్ని చల్లని వాటర్తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. తర్వాత తేనె, నిమ్మరసం, కొబ్బరి పాలు మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని బాగా ఆరనివ్వాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ముడతలకు ప్యాక్
చిన్న వయసులోనే కొందరికి ముఖంపై చర్మం ముడతలు పడుతుంది. అవి పోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. మామిడి ఆకులను పొడి చేయాలి. అందులో మినప పొడి, ముల్తాన్ మిట్టీలను సమాన పాళ్లలో కలిపి, ఓ డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, పాలతో కలిపి పేస్ట్లా చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముడతలు మాయమవుతాయి. అది మాత్రమే కాదు. బంగాళదుంప గుజ్జు, టొమాటో రసం, అరటిపండు గుజ్జు కూడా ముడతలు పోయేలా చేస్తాయి. క్యారెట్ రసంలో పాలు, బాదం పప్పు పేస్ట్ కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. కొన్నాళ్లపాటు వారానికి రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. బాదం నూనెతో మర్దనా చేసినా కూడా ముడతలు పోతాయి. -
బ్యూటిప్స్
నునుపైన మెడకోసం... ఒక బంగాళదుంపని పొట్టు తీయకుండా ఉడకబెట్టి, మెత్తగా మెదుపుకోవాలి. దీనికి కాసిని పాలు, కొద్దిగా కొబ్బరినూనె జతచేసి పేస్ట్లా కలపాలి. మెడపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ నలుపు తగ్గి చర్మం కాంతిమంతం అవుతుంది. మృదువైన చేతుల కోసం పాత్రలో కొద్దిగా తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ బార్లీ పొడి.. అన్నీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకి అప్లై చేసి 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తుంటే చేతులు మృదువుగా అవుతాయి. -
కూల్ ప్యాక్స్
వేడిమి, దుమ్ము ఈ కాలం చర్మపు రంగును, తాజాదనాన్ని తగ్గిస్తాయి. వేసవి కాలంలో చర్మనిగారింపు కోల్పోకుండా, వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లోనే వేసుకోదగిన కూల్ ప్యాక్స్ ఉన్నాయి. 50 గ్రాముల ఎర్రకందిపప్పులో తగినన్ని నీళ్లు పోసి రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బాలి. దీంట్లో పచ్చిపాలు, బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మేనికంతా పట్టించి, మృదువగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. తర్వాత టీ స్పూన్ పుదీనా ఆకుల పేస్ట్లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాíసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. బాదం నూనెలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, కళ్లకింద, మెడ, గొంతు, చేతులపై మృదువుగా రాయండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.దోసకాయ గుజ్జులో టేబుల్ స్పూన్ పంచదార కలిపి, ఫ్రిజ్లో చల్లబడేవరకు ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. శనగపిండిలో తేనె కలిపి ముఖానికి, చే తులకు రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. -
నయనమనోహరం
కనురెప్పల వెంట్రుకలు నల్లగా, పొడవుగా పెరగాలంటే మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి అప్లయ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చాలా కొద్దిగా తీసుకుని కళ్లలోకి జారకుండా రెప్పల వెంట్రుకలకు మాత్రమే సరిపోయేటట్లు రాయాలి. రాత్రి పడుకునే ముందు అప్లయ్ చేస్తే మంచిది. కనుబొమలు పలుచగా ఉన్నా కూడా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు. కనుబొమల వద్ద చర్మం పొడిబారి డాండ్రఫ్ వంటి సమస్యలు వచ్చినా కూడా ఈ కొబ్బరినూనె, టీట్రీఆయిల్ సమర్థంగా తగ్గిస్తాయి. ∙రోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన ఆముదాన్ని రాసుకుంటే కనురెప్పలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ∙కొందరికి కనురెప్పల వెంట్రుకలు చిక్కగా ఉంటాయి కాని స్కిన్ కలర్లో కలిసిపోయినట్లుంటాయి. ఫంక్షన్ల వంటి ప్రత్యేక సందర్భాలలో మస్కారాతో నల్లగా కనిపించేటట్లు చేయవచ్చు. మస్కారా వాడినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే బేబీ ఆయిల్ కాని ఆముదం కాని రాసి మస్కారాను పూర్తిగా తుడిచేయాలి. ఈ ఒక్కసారికే కదా అని తలకు వేసే హెయిర్ డైను ప్రత్యామ్నాయంగా ఎంచుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెయిర్డైని కళ్ల దగ్గరకు రానీయకూడదు. -
సువాసనల నూనెలోని సుగుణాలవి
అరోమా ఎసెన్షియల్ ఆయిల్స్లోని సౌందర్యగుణాలను దేహం వెంటనే స్వీకరిస్తుంది. సాధారణంగా బాడీ మసాజ్కు ఉపయోగించే ఏదైనా ఆయిల్లో ఐదు చుక్కల రోజ్, లావెండర్... వంటి మీకు నచ్చిన అరోమా ఆయిల్ కలిపి వాడాలి. ఈ ఆయిల్ను పాదాలకు రాసి మర్దన చేస్తే ఆ సుగుణాలు ఇరవైనిమిషాలకు ఒంట్లోని ప్రతికణానికీ చేరతాయి. అరోమా బాత్ శరీరంలోని మలినాలను తొలగించి, ఆహ్లాదాన్నిస్తుంది. స్నానం చేసే వేడినీటిలో నాలుగు చుక్కల అరోమా ఆయిల్ వేయాలి. ముందుగా ఒక కప్పు నీటిలో ఆయిల్ వేసి సమంగా కలిశాక మొత్తం నీటిలో కలపాలి. అరోమా బాత్ సాధ్యం కానప్పుడు వెడల్పుగా ఉన్న టబ్ తీసుకుని రెండు లీటర్ల వేడి నీటిని పోసి అందులో రెండు చుక్కల నూనె వేసి పాదాలను, చేతులను ముంచి పది నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల సువాసన నూనెలోని సుగుణాలు శరీరానికి అందుతాయి. -
అందాల రాశిలా
రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు చర్మం రఫ్గా మారి, మొటిమలు, మచ్చలతో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ ఫేస్ ప్యాక్. కెమికల్స్ నింపిన ఫేస్ క్రీమ్స్, లోషన్స్ కంటే ఇంటిపట్టున సిద్ధం చేసుకునే ఫేస్ ప్యాక్సే అన్నివిధాలా మంచిదంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా ఆ సలహాలను పాటించి మృదువైన చర్మకాంతిని సొంతం చేసుకోండి. కావలసినవి: బొప్పాయి గుజ్జు – 2 టీ స్పూన్స్, అరటిపండు గుజ్జు – 1 టీ స్పూన్ టమాటో జ్యూస్ – 2 టీ స్పూన్, ముల్తానీ మిట్టి – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మెత్తగా గుజ్జులా తయారు చేసుకున్న బొప్పాయి, అరటి గుజ్జులను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో తేనె, టమాటో జ్యూస్, ముల్తానీ మిట్టి యాడ్ చేసుకుని బాగా కలిపి, పక్కన పెట్టుకోవాలి. తరువాత ముఖానికి ఆవిరి పట్టుకుని.. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు లేదా మూడుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
టమాటా ప్యాక్
టమాటాను చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే ముఖం మీద ఉన్న జిడ్డు పోయి రోజంతా తాజాగా ఉంటుంది. వంట కోసం వాడేటప్పుడు చిన్న ముక్కను తీసుకుని ముఖానికి రుద్దుకోవచ్చు. పాడయిన వాటిని వంటల్లో వేయకుండా పారేస్తుంటాం, కాని చాలా వాటిలో కాయ మొత్తం పాడవకుండా ఒకవైపు బాగుంటాయి. అలాంటి వాటిని కూడా వాడుకోవచ్చు. కొంతమందికి టమాటా సరిపడదు, స్కిన్కు ఇరిటేషన్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఒకటి – రెండు ద్రాక్ష పండ్లను చిదిమి ముఖానికి రాసుకోవచ్చు. క్యారట్ ఫేస్ మాస్క్ ఎర్రని క్యారట్ను గ్రైండ్ చేసి రసం తీసుకుని అందులో నాలుగైదు చుక్కల బాదం నూనె కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి నెలరోజుల పాటు ప్యాక్ వేస్తే ముఖం మీద ఉన్న ట్యాన్తో పాటు ఇతర మచ్చలు పోయి ముఖవర్ఛస్సు పెరుగుతుంది. -
బ్యూటిఫుల్ ఫేస్కి... బ్యూటీ ప్యాక్!!
ఫేస్ప్యాక్లను ఇంట్లోనే చేసుకో వచ్చు. చర్మతత్వాన్ని బట్టి ప్యాక్ తయారు చేసుకోవాలి. పొడి చర్మానికి జిడ్డును తొలగించే పదార్థాలు వాడకూడదు. ఆమ్లగుణాలున్న పదార్థాలు చర్మం మీద ఉండే నూనెలను తొలగిస్తాయి. కాబట్టి వాటిని ఆయిలీ స్కిన్కు మాత్రమే ఉపయోగించాలి. పొడిచర్మానికి పాలు, మీగడ వాడాలి. ఓట్మీల్ ప్యాక్... ఓట్మీల్ను మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో తగినంత నీటిని కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చటినీటిలో ముంచిన క్లాత్తో తుడవాలి లేదా గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది పొడిబారి పగుళ్లు బారుతున్న చర్మానికి మంచి పోషణ. చర్మం నెర్రలు బారి మంటపెడుతున్నప్పుడు ఈ ప్యాక్ వేస్తే చర్మం మృదువుగా మారుతుంది.ఈ ప్యాక్ పురుగుకాట్లు వంటి గాయాలకు కూడా రాయవచ్చు. ఓట్మీల్ను ఒకటి– రెండు కప్పులు పొడి చేసుకుని రోజూ కావలసిన మేరకు నీటితో కలుపుకుని వాడుకోవచ్చు. -
బ్యూటిప్
నిస్తేజంగా కనిపించే పెదవులకు గ్లిజరిన్, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్లా వేయాలి. ఆరిన తర్వాత శుభ్రపరిచి, పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. పొడిబారి మృదుత్వాన్ని కోల్పోయిన పెదవులకు కొద్దిగాఅలొవెరా జెల్ రాసి, మృదువుగా రాయాలి. లేదా రోజ్వాటర్లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్ను ముంచి, పిండి, ఆ బ్యాగ్ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మం పై తేమ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి. -
మేని కాంతి కోసం...
టీ స్పూన్ శనగపిండిలో చిటికెడు పసుపు, అర టీ స్పూన్ పాలు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి.కొన్ని చుక్కల నిమ్మరసంలో అదే మోతాదులో పచ్చిపాలు కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. సగం క్యారట్, ఒక ముక్క నారింజ, అర టేబుల్ స్పూన్ పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్ వారంలో ఒకసారి చేయడం వల్ల చర్మకాంతి మెరుగుపడుతుంది. -
మీ ఇంట్లోనే బ్యూటీషియన్
అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే ‘వేప’ను కాదని చర్మసంరక్షణకు బ్యూటీ ప్రొడక్టులు వాడుతూ, పైసలు వసూలు చేసే పార్లర్ల వెంట తిరుగుతూ ఉంటారు. సౌందర్య ఉత్పత్తులలో వేప ఆకులను, వేళ్లను ఉపయోగించడం వెనుక ఉన్న చరిత్ర ఈ నాటిది కాదు 4,000 ఏళ్ళ క్రితం నాటిది. గుప్పెడు వేపాకులు గుప్పెడు వేపాకులు శుభ్రంగా కడిగి, రెండు లీటర్ల నీటిలో వేసి మరిగించాలి. ఎంతవరకు అంటే ఆకులు మెత్తగా అయ్యి నీళ్ల రంగు మారాలి. ఈ నీటిని చల్లార్చి గాజు బాటిల్లో పోసి ఉంచాలి. బకెట్ నీళ్లలో ఒక కప్పు వేపనీళ్లు కలిపి రోజూ స్నానం చేస్తే చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు, యాక్నె వంటివి మెల్ల మెల్లగా తగ్గిపోతాయి. మృదువైన స్కిన్ టోనర్ స్కిన్ టోనర్కి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్ని తెచ్చి వాడేస్తుంటారు. కానీ, వేప నీళ్లలో ఒక దూది ఉండను ముంచి, రోజూ రాత్రి పడుకునేముందు ముఖమంతా తుడిచేయండి. స్వేదరంధ్రాలలోని మలినాలు తొలగిపోయి చర్మకాంతి పెరుగుతుంది. చర్మం శుభ్రపడటం వల్ల యాక్నె, స్కార్స్, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ .. మెల్లగా తగ్గిపోతుంటాయి. మిలమిలలు పెంచే ఫేస్ప్యాక్ పది వేపాకులను మెత్తగా నూరి కప్పు నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నీళ్లలో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని వారానికి మూడుసార్లు ముఖానికి పట్టించి, చల్లటి నీళ్లతో కడిగేస్తే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, యాక్నె నుంచి విముక్తి లభిస్తుంది. పోర్స్లో మలినాలు శుభ్రపడతాయి. కేశాలకు కండిషనర్ వేపాకులను మరిగించిన నీళ్లతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు కడుక్కోండి. ఇలా తరచూ చేస్తే చుండ్రు తగ్గడమే కాదు వెంట్రుకలూ మృదువుగా అవుతాయి. అంటే కేశాలకు వేపాకులు సహజసిద్ధమైన కండిషనర్ అన్నమాట. -
భలే చిట్కా
మచ్చలు, మొటిమలతో చర్మం కాస్త రఫ్గా మారితే చాలు మగువలు నానా హైరానా పడుతుంటారు. అవి పూర్తిగా తగ్గేంతవరకూ ఫేస్క్రీమ్స్ వేటలో పడిపోతారు. ఒకటి కాదంటే మరొకటంటూ రకరకాల క్రీమ్స్ వాడి మరింత రఫ్గా మార్చుకుంటారు. ఇకపై అలాంటి ప్రయత్నాలను పక్కన పెట్టి.. చక్కగా ఇంటిపట్టునే ఫేస్ ప్యాక్కి ప్రయత్నించండి. కెమికల్స్ నింపిన ఫేస్ క్రీమ్స్ కంటే చక్కటి ఫేస్ ప్యాక్ అన్ని విధాలా మంచిదంటున్నారు నిపుణులు. మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చెయ్యండి. కావలసినవి: దానిమ్మ గింజల గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్, గ్రీన్ టీ – అర టేబుల్ స్పూన్ (తాజాగా కాచినది)పెరుగు – పావు టేబుల్ స్పూన్, తేనె – పావు టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మెత్తగా తయారు చేసుకున్న దానిమ్మ గుజ్జు, గ్రీన్ టీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో తేనె, పెరుగు యాడ్ చేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ముఖానికి ఆవిరి పట్టుకుని.. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు పాటు బాగా ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు లేదా మూడుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
కుందనపు మెరుపు
రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యంతో ముఖం రఫ్గా మారిపోతోంది. మొటిమలు, ముడతలతో మృదుత్వాన్ని కోల్పోతోంది. తాత్కాలిక పరిష్కారం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ ఎన్ని పోటెత్తుతున్నా... శాశ్వత పరిష్కారం కావాలంటే ఇంటిపట్టున దొరికే సహజసిద్ధమైన ఫేస్ప్యాక్లని ప్రయత్నించాల్సిందే అంటున్నారు నిపుణులు. నిజానికి సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్లతో చర్మం సరికొత్త మెరుపుని సంతరించుకుంటుంది. మృతకణాలను తొలగించుకుని ఆకర్షణీయంగా మారుతుంది. మరింకెందుకు ఆలస్యం..? ఇలా ప్రయత్నించండి! కావలసినవి: నానబెట్టిన బాదం – 4 , కొబ్బరిపాలు, నిమ్మరసం – 2 టీస్పూన్ల చొప్పున, పాల పొడి – 1 టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో బాదం పప్పును మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత పాలపొడి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లని వాటర్తో ముఖం క్లీన్ చేసుకుని.. ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మెరిసే చర్మం
ఎంత కలర్గా ఉన్నా... ఎంత అందంగా ఉన్నా.. శీతాకాలం వస్తే చాలు చర్మం మెరుపును కోల్పోయి.. పొట్లుపోతుంది. తెల్లతెల్లని మచ్చలతో చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. అలాంటి సమస్యలు దూరం కావాలంటే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకోవాల్సిందే. వాటివల్లే అందం మరింత రెట్టింపు కావడంతో పాటూ చర్మ సంరక్షణ సాధ్యమవుతుంది. మరైతే ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావలసినవి: బాదం – 5 లేదా 6 (వాటర్లో నానబెట్టినవి) ఓట్స్ – 1 టేబుల్ స్పూన్, పెరుగు – 2 టీ స్పూన్స్ తేనె – అర టీ స్పూన్ తయారీ : ముందుగా బాదం ఒక బౌల్లోకి వేసుకుని మెత్తగా చేసుకోవాలి. తరువాత అందులో ఓట్స్, పెరుగు, తేనె యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లని నీళ్లతో ముఖం క్లీన్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. తరువాత 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. -
చిన్నవయసులోనే వార్ధక్య లక్షణాలా!
♦ రాత్రి పడుకునే ముందు నెయ్యి, బాదం నూనె, కొబ్బరి నూనె(ఏదో ఒకటి చాలు)తో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ♦ కీర దోసకాయ పేస్ట్ని ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖంపై ముడతలు పోతాయి. ♦ తాజా అలోవెరా ఆకుల పేస్ట్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత కడిగేస్తే ముఖంపై ముడతలు మాయమవుతాయి. ♦ పడుకునే ముందు ముఖం శుభ్రంగా కడుక్కొని ఒక టీ స్పూన్ కొత్తిమీర రసంలో చిటికెడు స్వచ్ఛమైన పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే ముడతలు పోయి చర్మం నునుపుదేలుతుంది. -
బ్యూటిప్స్
సడెన్గా ఏదైనా పార్టీకి వెళ్లాల్సి రావచ్చు. బ్యూటీ పార్లర్కి వెళ్లే టైమ్ ఉండవచ్చు ఉండకపోవచ్చు. అందుకే ఇంట్లో తయారు చేసుకునే కొన్ని ఫేస్ ప్యాక్లను ఇక్కడ చూడండి. ఈ ఫేస్ప్యాక్లలో వాడేవన్నీ ఇంట్లో ఉంటాయి. ఎగ్ –హనీ మాస్క్ కావాల్సినవి... 1. ఒక ఎగ్, 2. ఒక టీ స్పూన్ తేనె, 3. అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, 4. కొన్ని చుక్కల రోజ్ వాటర్ పైవన్నీ బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చన్నీరు లేదా గోరువెచ్చటి నీటిని చల్లుతూ సున్నితంగా వలయాకారంగా రుద్దుతూ శుభ్రం చేయాలి. ఎగ్ – బాదం మాస్క్ కావాల్సినవి... 1. ఒక టేబుల్ స్పూన్ తేనె, 2. ఒక గుడ్డు సొన, 3. అర టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, 4. ఒక టేబుల్ స్పూన్ పెరుగు వీటన్నింటిని బాగా కలిపి మాస్క్ వేసుకోవాలి. ఈ ప్యాక్ డ్రైస్కిన్కి బాగా పనిచేస్తుంది. ఇది ముఖానికి కావాల్సిన ప్రాథమిక అవసరాలన్నీ తీరుస్తుంది. తేనె చర్మాన్ని శుభ్రపరిచి సున్నితంగా తయారు చేస్తుంది. ఆయిల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. పెరుగు చర్మాన్ని బిగుతుగా చేసి నవయవ్వనాన్ని తెచ్చిపెడుతుంది. ఎగ్ చర్మానికి అవసరమైన పోషకాలను, పటుత్వాన్ని ఇస్తుంది. -
పూలు పండ్ల ఫేస్ ప్యాక్
ఆయా సీజన్లలో దొరికే అన్ని రకాల పండ్లు, పూలతో సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవచ్చు. ఉదాహరణకు పుచ్చకాయ రసం, కమలా పండు రసం, మామిడి పండు, దోసకాయ గుజ్జు... దేనితోనైనా ముఖానికి మసాజ్ చేసుకోవచ్చు. జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు వాడితే మంచిది. సాధారణ చర్మం, పొడి చర్మానికి దోస, అరటి వంటి పండ్లు వాడాలి. బంతి, చామంతి, గులాబీ వంటి పూల రెక్కలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది. గులాబీలు అన్ని వయసుల వారూ వాడవచ్చు. చామంతి పూలను టీనేజ్ దాటిన తర్వాత వాడాలి. తాజా పూలు అన్ని కాలాల్లో దొరకవు కాబట్టి రెక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని నిలవ చేసుకోవచ్చు. పాలు, నీళ్లు, పెరుగులో కలుపుకుని ప్యాక్ వేసుకోవచ్చు. -
అందం మీ సొంతం!
కాంతిహీనంగా మారిన చర్మం మదువుగా మారాలంటే... ఎన్నో జాగ్రత్తలు అవసరం! మొటిమలు, మచ్చలు, కళ్ల కింద వలయాలు ఇలా అన్నింటినీ పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే క్రీమ్స్ కంటే... ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే మంచివంటున్నారు నిపుణులు. పండ్లు, కూరగాయలు, డ్రై ప్రూట్స్ ఇలా వంటింటిలో దొరికే పదార్థాలతోనే చక్కని ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. తళతళా మెరిసిపోవచ్చు. నల్లని మచ్చలనే కాదు జిడ్డు, మొటిమలు శాశ్వతంగా పోగొట్టుకోవచ్చు. ట్రై చేయండి. కావలసినవి: ఓట్స్ – పావు టేబుల్ స్పూన్ తేనె – ముప్పావు టేబుల్ స్పూన్ శనగ పిండి – 1 టేబుల్ స్పూన్ ఆలీవ్ ఆయిల్ – పావు టేబుల్ స్పూన్ పాలు – 2 టేబుల్ స్పూన్స్ తయారీ: ముందుగా ఓట్స్, తేనె కలిపి పేస్ట్లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో శనగ పిండి, పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఆలీవ్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెరుపు మీ సొంతమవుతుంది. -
ఫ్రూట్స్ ఫేస్ ప్యాక్
బ్యూటిప్స్ పియర్ – సగం; ఆపిల్ – సగం ద్రాక్ష – 3 నిమ్మరసం – టీ స్పూన్ కోడిగుడ్డు – 1 పియర్ని, ఆపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ద్రాక్షలో గింజలు తీసేసి, అన్నింటినీ కలిపి మిక్సీలో తిప్పాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటుంచి చన్నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్ ప్యాక్ని పది రోజులకి ఒకసారి వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి కాంతివంతం అవుతుంది. -
బ్లాక్ హెడ్స్ నివారణ కోసం...
బ్యూటిప్స్ అయిదారు కప్పుల నీటిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మరగబెట్టాలి. మరిగిన తరవాత ఆ పాత్రని టేబుల్ మీద ఉంచి ముఖానికి ఆవిరి పట్టించాలి. టవల్తో బ్లాక్ హెడ్స్ ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. ఇలా రెండు, మూడుసార్లు చేయాలి. అయిదు నిమిషాల తరవాత చన్నీటితో ముఖాన్ని కడగాలి. ఆ తరవాత చర్మానికి సరిపోయే ఫేస్ప్యాక్ వేసి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. టేబుల్ స్పూన్ పెరుగులో టీ స్పూన్ బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. ముఖానికి ఆవిరి çపట్టించిన తరవాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట అప్లై చేసి, వేళ్లతో వలయాకారంలో నెమ్మదిగా రుద్దాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై ఏర్పడ్డ బ్లాక్హెడ్స్ తగ్గుతాయి. -
రోజ్ రోజ్ రోజ్ వాటర్...
బ్యూటిప్స్ రోజ్వాటర్ను అచ్చ తెలుగులో చెప్పాలంటే గులాబీ నీరు. దీనిని ముఖానికి పట్టిస్తే చాలా మంచిది. అయితే దానికొక పద్ధతి ఉంది. అదేమిటో చూద్దాం. కాటన్ బాల్ను రోజ్ వాటర్లో ముంచి ముఖం మీద అద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖచర్మం మీద ఉండే స్వేద గ్రంథులు తెరచుకొంటాయి. దానివల్ల ముఖ చర్మం తాజాగా ఉంటుంది. దీనికి మరికొన్ని పొడులు కలిపితే చర్మసౌందర్యం చెప్పనలవి కాదు. వాటిలో ముల్తానీ మట్టి బెస్ట్. ఇది అన్ని ఫేస్ ప్యాక్స్లో కంటే చాలామంచి ఫేస్ ప్యాక్. ఇది వేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశిస్తుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ చుక్కలను కలిపి ఈ పేస్ట్ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసినట్లైతే ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది.ఆరెంజ్ ఫేస్ప్యాక్ చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేస్తుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది. -
టాటా ట్యాన్!
ఎండకు పోతే చర్మం నల్లబారుతుంది. కాలేజ్, ఉద్యోగం, వ్యాపారం వంటి యాక్టివిటీలన్నీ పక్కన పెట్టి నీడపట్టున ఉండడం కుదిరే పని అసలే కాదు. అందుకే ఎండకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ప్యాక్ వేసి ట్యాన్ను తొలగించుకోవడమే మంచి ప్రత్యామ్నాయం. క్యారట్ ఫేస్ ప్యాక్... ఎర్రని క్యారట్ను గ్రైండ్ చేసి రసం తీసుకుని అందులో నాలుగైదు చుక్కల బాదం నూనె కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి నెలరోజుల పాటు ప్యాక్ వేస్తే ముఖం మీద ఉన్న ట్యాన్తో పాటు ఇతర మచ్చలు పోయి ముఖవర్చస్సు పెరుగుతుంది. హనీ– ఎగ్ ప్యాక్... అర టీ స్పూను తేనెలో కోడిగుడ్డు సొన, ఒక టేబుల్స్పూను పాలపొడి లేదా పాలు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడగాలి. -
ఒక తేనె చుక్క... ఓ టొమాటో ముక్క
ఎండాకాలం తెచ్చే కష్టాల్లో చర్మం జిడ్డుబారడం ఒకటి. ఈ కష్టాన్ని పేస్ప్యాక్లతో గట్టెక్కవచ్చు. ఆమ్లగుణాలున్న పదార్థాలు చర్మం మీద నూనెలను తొలగిస్తాయి. కాబట్టి ఆయిలీ స్కిన్కు వాటిని ఉపయోగించాలి. టొమాటో ప్యాక్: టొమాటో రసాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే ముఖం మీద ఉన్న జిడ్డు పోయి రోజంతా తాజాగా ఉంటుంది. కొంతమందికి టొమాటోతో స్కిన్కు ఇరిటేషన్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఒకటి – రెండు ద్రాక్ష పండ్లను చిదిమి ముఖానికి రాసుకోవచ్చు. హనీ–కార్న్ మాస్క్: ఒక పచ్చిబంగాళా దుంప, ఒక టేబుల్స్పూను కార్న్ఫ్లోర్, ఒక టేబుల్ స్పూను తేనె తీసుకోవాలి. బంగాళాదుంపను తురిమి రసం తీసుకోవాలి. ఆ రసానికి తేనె, కార్న్ఫ్లోర్ కలిపి ముఖానికి, మెడకు, చేతులకు ప్యాక్ వేయాలి. ఇది ఆరే కొద్దీ స్కిన్ను టైట్ చేస్తుంది. పదిహేను నిమిషాల తర్వాత ప్యాక్ను కడిగేయాలి. జిడ్డు చర్మానికి కార్న్ఫ్లోర్ మాస్క్ వాడితే ఫలితం కడిగిన వెంటనే స్పష్టంగా కనిపిస్తుంది. గమనిక: సెన్సిటివ్ చర్మానికి, పొడి చర్మానికి ఈ ప్యాక్ వేస్తే మరీ పొడిబారే అవకాశముంది. కాబట్టి ఈ రెండు రకాల చర్మానికి కార్న్ఫ్లోర్ను మినహాయించి ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. -
బ్యూటిప్స్
►ఎండకు కమిలిన ముఖం తిరిగి తాజాగా రావాలంటే... ఫేస్ప్యాక్లతోనే సాధ్యం. ఈ ప్యాక్లతో చర్మానికి సాంత్వన కలుగుతుంది, మచ్చలు పోతాయి, మేనిఛాయ మెరుగవుతుంది. ►ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పచ్చి బంగాళదుంపను తురిమి ముఖమంతా పరిచినట్లు ప్యాక్ వేయాలి. అరగంటకు చన్నీటితో కడగాలి. ► తాజా బత్తాయిరసాన్ని ముఖానికి రాసి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది స్కిన్ టోనర్గా పనిచేస్తుంది. ►రెండు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా పేస్టు చేయాలి. అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్చేసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ►ఎండకు కమిలిన ముఖం తిరిగి తాజాగా రావాలంటే... ఫేస్ప్యాక్లతోనే సాధ్యం. ఈ ప్యాక్లతో చర్మానికి సాంత్వన కలుగుతుంది, మచ్చలు పోతాయి, మేనిఛాయ మెరుగవుతుంది. ►ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పచ్చి బంగాళదుంపను తురిమి ముఖమంతా పరిచినట్లు ప్యాక్ వేయాలి. అరగంటకు చన్నీటితో కడగాలి. ►తాజా బత్తాయిరసాన్ని ముఖానికి రాసి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది స్కిన్ టోనర్గా పనిచేస్తుంది. ► రెండు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా పేస్టు చేయాలి. అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్చేసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. -
అయ్యో.. ఈ టాప్ హీరోయిన్కి ఏమైంది
కాలిఫోర్నియా : ఫోటోలో ఉన్న హాలీవుడ్ టాప్ హీరోయిన్ను గుర్తుపట్టారా. అయితే మీకో క్లూ చార్లెస్ ఏంజిల్స్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు హీరోయిన్లలో ఫోటోలోని హీరోయిన్ ఒకరు. ఆవిడే హాలీవుడ్ స్టార్ హీరోయిన్ డ్రూ బెర్రీమోర్. తన అందంతో అభిమానుల మతులు పోగొట్టిన డ్రూ బెర్రీ ఎందికిలా అయ్యిందనుకుంటున్నారా?. ఏమీలేదండి ఇప్పటికే 41 ఏళ్లున్న ఆమె ఓ పదేళ్లు తక్కువ కనపడడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా కొన్ని బ్యూటీ ప్రొడక్టులను వాడుతోంది. అయితే సరదాగా తాను క్రీము రాసుకుని ఉన్న ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అంతేనా ఆ బ్యూటీ ప్రాడక్టులు వాడితే పదేళ్ల కింద ఏలా ఉన్నారో అలా అయిపోతారంటూ సలహాలు కూడా ఇచ్చింది. -
మీకు మీరే బ్యూటీషియన్...
బ్యూటిప్స్ ఇప్పుడిప్పుడే ఎండలు మొదలవుతున్నాయి. బోలెడంత ఖరీదు పెట్టి సన్స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ఇష్టం లేకపోతే ఈ పని చేయండి. బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకోవడం మరచిపోకండి. అందుకు దోస లేదా కీరదోస గుజ్జులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమంతో ఫేస్ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి... ఎండకు కమిలిపోయినట్లున్న మీ ముఖం నిగనిగలాడుతూ మీకే ముద్దొచ్చేస్తుంది. కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. -
ఫ్రూటీ బ్యూటీ
బ్యూటిప్స్ ఆయిలీ స్కిన్... నిమ్మరసం సహజమైన క్లెన్సర్. చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మంలో అదనపు జిడ్డను తొలగిస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానివ్వదు. పదిద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది ఆయిలీ స్కిన్కు చక్కటి ఫేస్ ప్యాక్. దీనిని పొడిచర్మానికి కాని నార్మల్ స్కిన్కు కాని వాడితే మరింత పొడిబారుతుంది. రకరకాల పండ్లను, సౌందర్యసాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది పొడిచర్మానికి పనికి రాదు. డ్రైస్కిన్ అయితే... ఒక టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ వెజిటబుల్ ఆయిల్ బాగా కలిపి ముఖానికి, మెడకు ప్యాక్ వేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్ఫ్లవర్, సోయా... ఇలా ఏదైనా సరే... అందుబాటులో ఉన్న ఆయిల్ వాడవచ్చు. ఒక టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ పాలు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. నార్మల్ స్కిన్కి... ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జు ఒక కప్పులో కోడిగుడ్డు వేసి(పచ్చసొనతో సహా) బ్లెండ్ చేసి సగం మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. మసాజ్ తర్వాత మిగిలిన సగం మిశ్రమాన్ని ప్యాక్ వేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఫలితం వెంటనే కనిపిస్తుంది. దీనిని నార్మల్ స్కిన్తోపాటు అన్నిరకాల చర్మానికీ వేయవచ్చు. ముఖం మీద నల్లటి మచ్చలుంటే ప్రతిరోజూ క్యారట్ రసం రాస్తుండాలి. వారం రోజులకే మంచి ఫలితం ఉంటుంది. మచ్చలు మాసిపోవడంతోపాటు చర్మం కాంతిమంతమవుతుంది. -
అప్లై చెయ్యండి ఆరాక కడగండి
బ్యూటిప్స్ ఒక టీ స్పూను చక్కెరలో అంతే మోతాదులో నిమ్మరసం, కొద్దిగా నీటిని వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ప్యాక్లు వేసుకునే బ్రష్తో ముఖానికి (అవాంఛిత రోమాలు ఉన్న చోట) అప్లయ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది.ఒక టేబుల్ స్పూను నిమ్మ రసంలో నాలుగు టీ స్పూన్ల తేనె కలిపి బ్రష్తో ముఖానికి అప్లయ్ చేసి ఆరిన తర్వాత కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. పాలలో పసుపు వేసుకుని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిగా ఆరనివ్వాలి. ఇప్పుడు ముఖానికి వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ మర్దన చేయాలి. ఇది అవాంఛిత రోమాలను తొలగించడంతోపాటు స్క్రబ్గా పని చేసి మృతకణాలను కూడా పోగొడుతుంది. మర్దన చేయడం పూర్తయిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఒక టేబుల్ స్పూను శనగపిండిలో ఒక టీ స్పూను పసుపు వేసి తగినంత నీటితో పేస్టులా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత సున్నితంగా రుద్దుతూ కడగాలి. -
కమిలిన ముఖకమలానికి...
బ్యూటిప్స్ ఎండలో తిరిగితే చర్మం కమిలిపోవడం, పొడిబారి పోవడం లాంటివి జరుగుతుంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే జొన్నపిండి ఫేస్ప్యాక్ వేసుకుంటే సరి. ఒక టేబుల్ స్పూన్ జొన్నపిండిలో తగినంత పెరుగు, నిమ్మరసం కలిపి పేస్ట్లా చేసుకొని ఫేస్కు ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత పచ్చి పాలతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కళ్లు అలసిపోతుంటాయి. అందుకు రోజు రాత్రి పడుకునే ముందు ఉసిరిపొడిని నీళ్లలో నానబెట్టండి. ఉదయాన్నే లేచాక ఆ నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా వారంపాటు ప్రతిరోజు చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది. మొటిమలతో బాధపడేవారు గోధుమ, వరి, శనగ, పెసర మొదలైన రకరకాల పిండిని ఒక్కో టీస్పూన్ చొప్పున తీసుకొని అందులో కొన్ని పాలు పోసి పేస్ట్లా చేసుకోవాలి. ఆ మిశ్రమంతో రోజూ రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇలా ఒక వారంపాటు క్రమం తప్పకుండా చేసి చూడండి. -
ఈడు మగాడ్రా బుజ్జీ !
మగాడంటే మన లెక్కలో మగాడు. అది కానివాడు మగాడెలా అవుతాడు? అసలు మగాడంటే ఎవరు? పది మంది గురించి పట్టించుకునేవాడు, తన గురించి పట్టించుకోనివాడు మగాడు. మరి వాట్ అబౌట్ అవర్ మాడర్న్ మగాడు? మొన్నెప్పుడో ఫేస్ప్యాక్తో మొదలుపెట్టాడు. ఆ తర్వాత రీసెంట్గా క్రీములు అలుకుతున్నాడు. వద్దంటే అలుగుతున్నాడు. ఇప్పుడేదో బొటాక్స్ అంట... ఒక్క సూది గుచ్చితే టెన్ ఇయర్స్ యంగరంట. ఇవాళ చిత్రంగా మాట్లాడుకుంటున్నాం. రేపు ఇదే మన చిత్రం కావచ్చు. ‘‘ఆడు మగాడ్రా బుజ్జీ’’ అంటాడు ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి.. బ్రహ్మాజీతో. భరణి ‘మగాడు’ అన్నది మహేశ్బాబు గురించి. అంతకు ముందే భరణి దగ్గర్నుంచి పొలం కాగితాల్ని విడిపించుకుని ఉంటాడు మహేశ్బాబు. ఆ తర్వాత భరణి మనుషుల్ని ఒక్కొక్కడినీ తుక్కురేగ్గొడతాడు. దీన్ని బట్టి ప్రాథమికంగా అర్థమయేదేమిటంటే.. మగాడు రఫ్గా ఉండాలని. పరిస్థితుల్ని ఫేస్ చెయ్యాలని. అయితే ఇప్పుడు కొత్త మగాళ్లు బయల్దేరారు. పరిస్థితుల్ని ఫేస్ చేస్తూనే, తన ఫేస్ని ఫెయిర్గా ఉంచుకునేందుకు వయసు తెచ్చే ముడుతలతో వాళ్లు ఫైట్ చేస్తున్నారు. లంచ్టైమ్లో వెళ్లి ఫేస్కి ‘బొటాక్స్’ ఇంజక్షన్ చేయించుకుని వస్తున్నారు. ఇది బ్రిటన్ సంగతి. మన ఆఫీసుల్లో కూడా కొందరు మగాళ్లు పని మధ్యలో తరచు వాష్రూమ్కి వెళ్లి, ముఖం కడుక్కునో, తలదువ్వుకునో వస్తుంటారు. అయితే బ్రిటన్ ఉద్యోగులు ఫ్రెష్ లుక్ కోసం ఇక్కడితో ఆగిపోవడం లేదు. బొటాక్స్ ఇంజెక్షన్ చేయించుకుంటున్నారు. బ్రిటన్లో ఇలాంటి మగాళ్లు పది శాతం వరకూ ఉన్నారని తాజాగా అక్కడ జరిగిన సర్వే వెల్లడించింది. ఈ పదిమందిలో సగం మంది, మిగతా ఐదుగురికి తెలియకుండా భోజనవిరామ సమయంలో గుట్టుగా వెళ్లి ముఖానికి బొటాక్స్ ఇంజెక్షన్ చేయించుకుని వచ్చి, ఏమీ ఎరుగని అమాయకుల్లా కొత్త గ్లోతో తమ సీట్లలోకి వచ్చి కూర్చుంటున్నారట. ఇంటికి కూడా అదే గ్లోతో వెళ్లినప్పటికీ అసలు రహస్యాన్ని వీళ్లు తమ భార్యలకు కూడా చెప్పడం లేదని సర్వేలో బయటపడింది. బొటాక్స్ ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల ముఖంపై ముడతలు దాదాపుగా వెంటనే మాయమైపోతాయి. బ్రిటన్లో ప్రధానంగా 35-45 ఏళ్ల మధ్య వయసు గలిగిన మగవాళ్లు, కొత్తగా విడాకుల తీసుకున్న మగాళ్లు (బహుశా ఇంకో పెళ్లి కోసం కావచ్చు) రహస్యంగా బొటాక్స్ను ఆశ్రయించి ఇన్స్టంట్గా మన్మథావతారం ఎత్తుతున్నారు. ఈ రహస్యం అక్కడితో ఆగడం లేదు! బ్యాంకు, క్రెడిట్ కార్టు అకౌంట్లలో కనిపించకుండా ఉండడం కోసం వీరు తమ కార్డులను వాడకుండా, క్యాష్ రూపంలో మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు. ఇంత కష్టం ఎందుకబ్బా? ఫేస్ప్యాక్ చేయించుకుని ఫ్రెష్గా లుక్ ఇవ్వచ్చు కదా. ఇవ్వొచ్చు కానీ, ఏదో చేయించుకుని వచ్చినట్లు కనిపించడం వారికి ఇష్టం లేదని ఈ సర్వేను చేసిన ‘రైట్ క్లినిక్’ చెబుతోంది. ఇంతకీ ఈ క్లినిక్ ఫౌండర్ ఎవరో తెలుసా? డాక్టర్ గణేశ్ రావ్. మన తెలుగాయనలానే ఉన్నాడు. బొటాక్స్ సూది అప్పటికప్పుడు ముఖంపై ముడతల్ని అదృశ్యం చెయ్యడంతోపాటు, ఆత్మవిశ్వాసాన్నీ ఇంజెక్ట్ చేస్తుందట! ఆయన అలా అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అందమే ఆనందం, ఆత్మవిశ్వాసం కదా. చూస్తుంటే డాక్టర్ గ ణేశ్ రావ్ పురుష పక్షపాతిలా ఉన్నారు. అందుకే వెయ్యిమంది పురుషుల రహస్య సౌందర్యకాంక్షపై వివరాలను రాబట్టి వారిని సమర్థిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ‘‘ఏం? మగువలు మాత్రమే సౌందర్య సాధనాలు వాడాలా? మగవాళ్లకు మాత్రం ఎవర్గ్రీన్గా ఉండాలనిపించదా? ’’ అని అడుగుతున్నారు. ఈ ధోరణి ఇండియాకు ఇంకా రాలేదు. వస్తే బొటాక్స్కు కొరత ఏర్పడుతుందేమో! చెప్పలేం. వయసును దాచేసుకోవాలని ఏ మగాడికి మాత్రం ఉండదు? సో... అమ్మాయిలూ జాగ్రత్త. బొటాక్స్ బాబులు అందంలో మిమ్మల్ని మించిపోతారేమో! మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారేమో?! బొటాక్స్ ఎలా పుట్టింది? బొటాక్స్ అనేది ఒక విష పదార్థం. క్లాస్ట్రీడియమ్ బోట్యులినమ్ అనే ఒక బ్యాక్టీరియా క్రిమి నుంచి ఈ విషం పుడుతుంది. ఇదొక ప్రోటీన్. దీన్ని ప్యూరిఫైడ్ డిరైవ్డ్ ప్రోటీన్ అంటారు. ఎందుకంటే విషాన్ని ఎంతగానో శుద్ధి చేసి అందులోంచి దీన్ని రాబడతారు. బోట్యులినమ్ క్రిమి నుంచి వస్తుంది. ఇది ఒక టాక్సిన్ (విషపదార్థం) కాబట్టి ఆ రెండు పేర్లనూ కలుపుకుని దీనికి ‘బొటాక్స్’ అనే పేరు పెట్టారు. ఏమిటి చరిత్ర చరిత్రలో మొట్టమొదటిసారి 1970లలో డాక్టర్ అలాన్ స్కాట్ అనే వైద్యుడు మెల్లకన్ను (స్ట్రాబి స్మస్)తో బాధపడుతున్న ఒక కోతికి బొటాక్స్తో చికిత్స చేసి చూశారు. అలా తన క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టిన ఆయన... కొద్దికాలంలోనే (అంటే ఏడేళ్ల వ్యవధిలో) దాన్ని మనుషుల మీద కూడా ప్రయోగించారు. ఇక వైద్యచికిత్స కోసమే గాక... అందాన్ని ఇనుమడింపజేసేందుకూ ఇది ఉపయోగ పడుతుందని డాక్టర్ రిచర్డ్ క్లాక్ అనే శాక్రిమెంటో (కాలిఫోర్నియా)కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ తెలుసుకున్నాడు. దీన్ని ప్రయోగించి ముఖంపై ఉన్న ముడుతలను తొలగించాడాయన. ఎలా పని చేస్తుంది? అనేక రకాల చికిత్సలతో పాటు... అందాన్ని ఇనుమడింపజేసే ప్రక్రియలకూ బొటాక్స్ ఉపయోగపడుతుందని తేలింది.అందుకే ముఖం మీద ముడుతలను తొలగించి వయసు తగ్గినట్లుగా కనిపించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇంజెక్షన్ ద్వారా ముఖం మీద అనేక పొరల్లోకి దీన్ని క్రమక్రమంగా 4-6 నెలల పాటు ప్రవేశపెడుతూ చేసే చికిత్స ద్వారా ముఖం ముడుతలను తొలగించవచ్చు. ముడుతలు తొలగిపోయాక ముఖ చర్మం మునుపటికంటే బిగుతుగా ఉన్నట్లు కనిపించడంతో వయసు తగ్గినట్లుగా అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి బొటాక్స్ చికిత్సను చాలా అనుభవజ్ఞులైన, నిపుణులైన డాక్టర్లతో మాత్రమే చేయించాలి. ఆ ఇంజెక్షన్ మోతాదు మీరితే వచ్చే దుష్ర్పభావాల గురించి నిపుణులైన వారికి మాత్రమే బాగా తెలుసు. అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల కూడా వారికి అవగాహన ఉంటుంది. ఉదాహరణకు మోతాదు మించినప్పుడు కనురెప్పలు, కనుబొమలు, కింది పెదవులు కిందికి మరింతగా జారినట్లుగా అనిపించవచ్చు. అందుకే ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి నిపుణులైన డాక్టర్ల చేతనే బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. -
శీతాకాలంలో...
శీతాకాలంలో పెదవులు, ముఖంపై చలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పొడారిపోవడం, గరుకుగా తయారుకావడం, చర్మం బిగుతుగా మారిపోవడం వంటి సమస్యలు తలెత్తుంటాయి. వీటి నివారణకు కొన్ని చిట్కాలు... ⇒ రోజూ పడుకునే ముందు ముఖానికి బాదం నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ రాయాలి. ఆయిల్ పెట్టేముందు మురికి లేకుండా చర్మం శుభ్రంగా ఉండాలనే సంగతి మర్చిపోకూడదు. ⇒ రోజూ పదినిమిషాల సేపు చర్మాన్ని హాట్ థెరపీతో స్వాంతన పరచాలి. అదెలాగంటే... గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఉదయం స్నానం చేయడానికి ముందుకానీ రాత్రి పడుకునే ముందుకానీ చేయవచ్చు. ⇒ ఒక కోడిగుడ్డు సొనలో, 1 టీ స్పూన్ కమలారసం, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. పొడిచర్మానికి ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. ⇒ బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్గా పని చేస్తుంది. మెడనల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును కూడా వదిలిస్తుంది. ⇒ పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్ను యథాతథంగా ఒంటికి రాసి మర్దన చేస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు అన్ని సూపర్మార్కెట్లలోనూ దొరుకుతోంది. ⇒ ఫేస్ప్యాక్లకు బదులుగా స్వచ్ఛమైన ఆముదం కానీ అవొకాడో ఆయిల్ కానీ చర్మానికి రాసి మర్దన చేయాలి. -
మేని బంగారానికి మేలిమి గింజలు
అందానికి ఫేస్ప్యాక్లు, ఆరోగ్యానికి పండ్లరసాలపైనే దృష్టిపెడతారు చాలామంది. వీటితో పాటు పండ్లు, కూరగాయల నుంచి లభించే గింజలను కూడా రోజూ కొంత మోతాదులో తీసుకోవడం అవసరం. నల్ల నువ్వులు నిద్రలేమి, మద్యం సేవించడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు నల్లనువ్వులు చక్కని పరిష్కారం. నువ్వులలో ఉండే కొవ్వు, అమినోయాసిడ్స్, పొటాషియం, పీచుపదార్థాలు చర్మానికి మేలు చేస్తాయి. చర్మం సాగే గుణాన్ని నివారిస్తాయి. ఇలా చేయండి: నువ్వులను పచ్చిగా లేదా వేయించి పండ్లు, కూరగాయల సలాడ్స్లో కలిపి తీసుకోవచ్చు. గుమ్మడి గింజలు జింక్, విటమిన్ ఇ, సల్ఫర్, ఒమెగా 3 నూనెలలో ఉండే సహజగుణాల వల్ల చర్మం నిస్తేజంగా మారదు. పైగా తనను తాను రిపేర్ చేసుకుంటుంది. గుమ్మడి గింజల్లో వేడి చేసే గుణం ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. ఇలా చేయండి: గుమ్మడి గింజలను పచ్చిగానే తీసుకోవచ్చు లేదా గింజలను గ్రైండ్చేసి, సలాడ్స్లో కలిపి తీసుకోవచ్చు. దోస గింజలు: చాతిలో మంట తగ్గించడం, కిడ్నీల పనితీరును, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే గుణాలు వీటిలో ఉన్నాయి. ఎ, బి, సి విటమిన్లు ఉండటం వల్ల శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే పోషకాలు శిరోజాలకు, గోర్లకు బలాన్ని ఇస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా చర్మం నిగారింపు పెరుగుతుంది. ఇలా చేయండి: రోజూ సలాడ్లో టీ స్పూన్ వేయించిన దోస గింజలను కలిపి తీసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అందానికి అందం.