Gujarat Assembly Election 2022
-
కాంగ్రెస్ కోమాలో ఉంది: రాహుల్ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం చురకలు
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ ఘోర పరాజయానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కోమాలో ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటే మార్పు(చేంజ్) కాదు, మార్పిడికి(ఎక్స్ఛెంజ్) సంబంధించినదని పంజాబ్ సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీలకు అడ్డంగా మారారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారిందని.. ప్రత్యర్థి పార్టీలకు సంఖ్యాబలం లేనప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారి ఎమ్మెల్యేలను అమ్మేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ .. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉందని అన్నారు. ‘గుజరాత్లో రాహుల్ గాంధీ ఎన్నిసార్లు పర్యటించారు. కేవలం ఒకేసారి. మరి ఒక్కసారే రాష్ట్రాన్ని సందర్శించి ఎన్నికల్లో గెలవాలనుకున్నాడు. సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడో (గుజరాత్) అక్కడ ఎన్నికలు జరిగాయి. రాహుల్ గాంధీ తన పాదయాత్రను సూర్యుడు మొదట ఉదయించే ప్రదేశం (కన్యాకుమారి) నుంచి ప్రారంభించాడు. ముందు తన టైమింగ్ను సరిచేసుకోనివ్వండి” అని భగవంత్ మాన్ చురకలంటించారు. చదవండి: బార్పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు.. పోలీసులు షాక్.. కాగా శుక్రవారం రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతీసిందని మండిపడ్డారు. ఆప్ లేకుండా అధికార బీజేపీని ఓడించేవాళ్లమన్నారు. కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ ఆప్ను ఉపయోగించిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. 182 స్థానాల్లో 156 సీట్లు గెలుచుకొని రికార్డ్ సృష్టించింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో ఏ రాజకీయ పార్టీకీ ఇన్ని సీట్లు దక్కలేదు. 1985 ఎన్నికలలో కాంగ్రెస్ 149 స్థానాలు గెలుచుకోగా.. 37 ఏళ్ల ఈ రికార్డును బీజేపీను అధిగమించింది. అయితే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించింది. -
ఆ పార్టీ లేకుంటే గుజరాత్లో గెలిచేవాళ్లం: రాహుల్ గాంధీ
జైపూర్: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై ఆపార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ కీలకపాత్ర పోషించిందని రాహుల్ పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ లేకుంటే అధికార బీజేపీని కాంగ్రెస్ ఓడించేదని తెలిపారు. గుజరాత్లో కాంగ్రెస్ ఓటమికి ఆప్ కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఆప్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్కు నష్టం చేకూర్చిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ బీజేపీకి బీటీమ్గా వ్యవహరించిందనిమండిపడ్డారు. కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ఆప్ బీజేపీతో కుమ్మకైందని దుయ్యబట్టారు. దేశాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు రాహుల్. ప్రజల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు బీజేపీని ఓడించాలన్న దృక్పథమే లేదని విమర్శించారు. అయితే రాహుల్ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చింది. గుజరాత్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనున్న ఉన్న ఆప్ను బీజేపీ, కాంగ్రెస్ అడ్డుకున్నాయని పేర్కొంది. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులో మొదలైన యాత్ర ఫిబ్రవరి నెలలో కశ్మీర్లో ముగియనుంది. 150 రోజులపాటు మొత్తం 3,500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ నడక యాత్ర సాగనుంది. జోడోయాత్ర ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతోంది. తమిళనాడు,కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర 2,800 కిమీలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 24న ఢిల్లీలో ప్రవేశించనుంది. అనంతరం ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రల్లో పర్యటిస్తూ చివరకు జమ్ము కశ్మీర్లో ముగుస్తుంది. చదవండి: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కేంద్రం ఈ నిజాన్ని దాస్తోంది: రాహుల్ ఫైర్ -
Gujarat Election 2022: గుజరాత్ ఓటేసిందిలా...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దుమ్ము రేపి వరుసగా ఏడోసారి అధికారంలోకి రావడంపై పలు రాజకీయ వర్గాల్లో పలు కోణాల్లో విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రజల్లో చాలా విషయాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అంతటి అసంతృప్తిని, అధికార వ్యతిరేకతను అధిగమిస్తూ ఏకంగా నాలుగింట మూడొంతులకు పైగా మెజారిటీ సాధించిన వైనం రాష్ట్ర బీజేపీ ముఖ్యులను కూడా ఆశ్చర్యపరిచింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి కనీసం గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్ చివరికి ఘోర పరాజయం పాలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీని అడ్డుకోలేకపోగా, కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా దాని జైత్రయాత్రకు పరోక్షంగా సహకరించినట్టయింది! దాంతో రాష్ట్రంలో ఎటు చూసినా కాషాయ రెపరెపలే కనిపించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ విహంగ వీక్షణం... – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక భారతీయ అస్మిత!
గుజరాతీ ‘అస్మిత’ (ఆత్మగౌరవం) పులకించిపోయింది. ఆ పులకింత వెల్లువలో ఏడో వరస విజయం బీజేపీ ఒడిలోకి వచ్చి పడింది. గుజరాత్లో కనిపించే ఎత్తయిన విగ్రహం సర్దార్ పటేల్దే కావచ్చు. కనిపించని ఎత్తయిన విగ్రహం ఇప్పుడు గుజరాతీ అస్మిత. అది పులకించకుండా ఎలా ఉంటుంది? గుజరాతీ బిడ్డ నరేంద్ర మోదీ దేశంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు. నెంబర్ టూగా మరో గుజరాతీ సేఠ్ అమిత్షా చక్రం తిప్పుతున్నారు. వారిద్దరి ప్రభావం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థను గుజరాతీ వ్యాపారులు నడిపిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులు అనేకం దేశంలోని ఇతర ప్రాంతా లకు జెల్లకొట్టి గుజరాత్ బాట పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ‘కెమ్ చో’ (ఎలా ఉన్నావ్) వంటి కొన్ని గుజరాతీ మాటలు నేర్చు కుంటున్నారు. మాట్లాడుతున్నారు. గుజరాతీ అస్మితకు ఇంతకంటే ఏంకావాలి? మధ్యతరగతి మందహాసం చేస్తున్నది. ఉన్నత వర్గాలు మీసం మెలేస్తున్నాయి. దరిద్రనారాయణుల ‘న్యూసెన్స్’ గురించి ఆలోచించే ఓపిక ఇప్పుడు అస్మితకు లేదు. మోర్బీ వంతెన కూలిపోయింది. అయితే ఏమిటి? వందమందికి పైగా చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం, అధికారుల అవినీతి ఈ విషాదానికి కారణం. అఫ్కోర్స్! ప్రపంచ రాజ్య కూటముల్లో ఎలైట్ క్లబ్గా పరిగణించే జీ–20కి ఇప్పుడు గుజరాతీ బిడ్డ నరేంద్రభాయ్ నేతృత్వం వహిస్తున్నారు. ఏది ముఖ్యం? ఇంతకంటే ఎక్కువ దేశాలు సభ్యులుగా ఉన్న అలీనోద్యమానికి పండిత నెహ్రూ, ఇందిరాగాంధీ నాయకులుగా ఉన్నారు. ఇది రొటేషన్ పదవే కనుక వారు పెద్దగా పటాటోపాన్ని ప్రదర్శించలేదు. కానీ గుజరాతీలు వ్యాపార ప్రవీణులు. దీన్ని కూడా బ్రాండింగ్ చేసుకున్నారు. ఈ బిల్డప్ను ‘అస్మిత’ ఆమోదించింది. గుజరాతీ అస్మిత వేసిన తెరలకు ఆవల కూడా కొంత గుజరాతీ సమాజం ఉన్నది. అక్కడా ఓట్లుంటాయి. వాటికి ఏకైక హక్కుదారుగా ఉండవలసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీనస్థితికి దిగజారింది. అహ్మద్ పటేల్ మరణం తర్వాత అది అనాధగా మారిపోయింది. కాంగ్రెస్ నిస్తేజమవడంతో దాని ఓట్లను కొల్ల గొట్టడానికి చీపురుకట్ట తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగింది. పదమూడు శాతం కాంగ్రెస్ ఓట్లను చీల్చగలిగింది. ‘ఆప్’ చీల్చిన ఓట్ల కారణంగా సౌరాష్ట్ర ప్రాంతంలో 18 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుజరాత్ చరిత్రలో ఎన్నడూ ఎరగనంత ఘనవిజయం బీజేపీకి సాధ్యమైంది. వరసగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించడం అసాధారణమైన విషయమే. సీపీఎం నాయకత్వంలో లెఫ్ట్ కూటమి ఒక్కటే ఇప్పటివరకూ బెంగాల్లో ఆ ఘనతను సాధించింది. ఇప్పుడు బీజేపీ ఆ రికార్డును సమం చేసింది. ఏడవసారి గెలవడం, 52.5 శాతం ఓట్లను కొల్లగొట్టడం, 156 (182లో) సీట్లు సాధించడం స్వప్నతుల్యమైన విజయమే. బెంగాల్లో సీపీఎం కూటమి ఏడోసారి గెలిచినప్పుడు కూడా 50.5 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు గుజరాత్లో 10 పార్టీలు రంగంలో ఉంటే, అప్పుడు బెంగాల్లో 30 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఈ అంశాన్ని గమనంలోకి తీసుకుంటే రెండు విజయాలూ సమాన మైనవే. కానీ, నేటి గుజరాత్ విజయాన్ని కనీవినీ ఎరుగని సునామీగా మేళతాళాలు మోగిస్తూ మీడియా ప్రకటించింది. ఇందులో పావలా వంతు ప్రాధాన్యం కూడా నాటి లెఫ్ట్ విజయానికి దక్కలేదు. దటీజ్ బీజేపీ! జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీతో పోల్చదగిన మరో నాయకుడు ప్రచారంలో లేడన్నమాట నిజం. ఆయన రాజకీయ కెరీర్లోనే ఇప్పుడు ఉచ్చదశలో ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన మేజిక్ ఎంతోకొంత పనిచేసే అవకాశం కూడా ఉన్నది. అయితే రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో అది పనిచేయాలన్న నియమం లేదు. హిమాచల్ప్రదేశ్ ఫలి తాలు ఈ అంశాన్ని నిర్ధారించాయి. ఈ రాష్ట్రం బీజేపీకి అనుకూల మైనదే. అసెంబ్లీ ఎన్నికల్లో చెరో అవకాశం ఇస్తున్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉంటున్నది. 2019 ఎన్నికల్లో కమలం పార్టీకి రికార్డు స్థాయిలో ఓట్లను కురిపించింది. సైనిక దళాల్లో ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పనిచేస్తుంటారు. కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ కార్యక్రమాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు. యాపిల్స్ పండించే రైతాంగం సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతాంగ సమస్యను బీజేపీ పట్టించుకోకపోవడం మైనస్గా మారింది. జై జవాన్ – జై కిసాన్లిద్దరూ బీజేపీ ఓటమికి కారకులయ్యారు. మోదీ నాయకత్వం, హిందుత్వ, జాతీయవాదం వంటి అంశా లపై మెజారిటీ హిమాచలీయులకు ఎటువంటి పేచీ లేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి స్థానిక అంశాల ఆధారంగానే వారు స్పందించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ను ఏకధాటిగా పదిహేనేళ్ల పాటు కమలం పార్టీ ఏలింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ‘ఆప్’కి తలవంచక తప్పలేదు. ‘ఆప్’ ప్రస్తావించిన స్థానిక అంశాలపైనే ఓటర్లు స్పందించారు తప్ప మోదీ బొమ్మను పట్టించుకోలేదు. మునిసిపల్ అధికార యంత్రాంగంలో పేరుకొనిపోయిన అవినీతిని పెకిలిస్తామని ‘ఆప్’ ప్రచారం చేసుకున్నది. వీధి కుక్కల బెడద మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది. వీధి వ్యాపారులను లంచాల నుంచి కాపాడతామని చెప్పింది. రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని చెప్పింది. మునిసిపల్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పింది. ఈ సాదాసీదా హామీల వైపే ఓటర్లు మొగ్గుచూపారు. ఈ ఎన్నికలతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలే వచ్చాయి. ఒక్క గుజరాత్లో అఖండ విజయం సిద్ధించినా, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరంలోగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవలసి ఉన్నది. డబుల్ ఇంజిన్ వ్యూహం హిమాచల్లో పనికిరాలేదు. గుజరాతీలు తమ ముఖ్యమంత్రిగా కూడా మోదీయే ఉన్నట్టు భావిస్తున్నారు. కనుక వారి దృష్టిలో అక్కడున్నది సింగిల్ ఇంజనే! విఫలమైన ఈ వ్యూహాన్ని వచ్చే ఐదు రాష్ట్రాల్లో మళ్లీ అనుసరిస్తారా? పైగా సాధారణ ఎన్నికలకు ఏడాది వ్యవధి లోపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని డ్రెస్ రిహార్సల్గా పరిగణిస్తారు. సాధారణ ఎన్నికల ఆహార్యాన్ని ఎంతోకొంత ఈ ఎన్నికల్లో ప్రదర్శించవలసి ఉంటుంది. ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలపై విస్తృత చర్చ జరగ కుండా ఒక జాతీయ ఎజెండా, వీలైతే భావోద్వేగపూరితమైన అంశం చుట్టూ ప్రచారం కేంద్రీకృతమయ్యేలా బీజేపీ ప్రయత్నిస్తుంది. రాష్ట్రాల స్థానిక అంశాలపై చర్చలో బీజేపీ ఇరుక్కోవడమంటే మొసళ్ల మడుగులో గజేంద్రుడు పాదం మోపినట్టే! అప్పుడు ‘సిరికింజెప్పి, శంఖ చక్రములు’ సంధిస్తూ మోదీ వచ్చి వాలినా చేయగలిగిందేమీ ఉండదు. కనుక ఈ వేసంగిలో జరిగే కర్ణాటక ఎన్నికల నాటికే బీజేపీ సరికొత్త ఎజెండా శాంపుల్ బయటకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ బీజేపీకి ఊరట కలిగించే విషయం ఒకటున్నది. వచ్చేయేడు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ జాతీయ పార్టీలతోనే తలపడనున్నది. నాలుగు రాష్ట్రాల్లో వృద్ధ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. తెలంగాణలో నిన్ననే జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి. కనుక తన కొత్త ఎజెండాపై డ్రెస్ రిహార్సల్ చేయడం సులభం. ఈసారి బీజేపీ ఏ నినాదంతో ముందుకు రావచ్చు? హిందూత్వ? జాతీయవాదం? ఆర్థికాభివృద్ధి? అన్నీ గుదిగుచ్చిన భారతీయ అస్మిత హారం? భారతీయ ఆత్మగౌరవ విజయాన్ని ఎలుగెత్తి చాటేందుకు సాధించిన విజయాలేమున్నాయి? హిందూత్వ అంశం తప్పకుండా ఉంటుంది. దండలో దారం మాదిరిగా ఇప్పుడూ ఉన్నది. ఇకముందు కూడా ఉంటుంది. బీజేపీ భౌతిక రూపాన్ని నడిపించే నాడీ మండలం ఆర్ఎస్ఎస్ అనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాల్లేవు. భారత రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన మరుసటిరోజే ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ఆర్గనైజర్’ దానిపై స్పందించింది. ఈ రాజ్యాంగంలో భారతీయతే లేదని అభిశంసించింది. మనుధర్మ శాస్త్రంలోని అంశాలను రాజ్యాం గంలో జొప్పించకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికీ మూల సూత్రాలని డాక్టర్ అంబేడ్కర్ నొక్కి చెప్పారు. సమానత్వం అనేది భారతీయ భావన కాదంటారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్. భిన్నవర్గాల మధ్య సామరస్యతే భారతీయత అనేది ఆయన వాదన. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రవేశం ఫలితంగా అంబేడ్కర్ ప్రవచిం చిన రాజ్యాంగ మౌలిక ఆశయానికి దెబ్బతగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు. అంటే ఆట మొదలైనట్టే కదా! భారతదేశం ఫెడరల్ వ్యవస్థగా ఉండటాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నది. గురు గోల్వాల్కర్ తన రచనల్లో ఫెడరల్ వ్యవస్థను గట్టిగా వ్యతిరేకించారు. దేశమంతా ఏకచ్ఛత్ర పాలన కింద, ఏకభాష (హిందీ), ఏకైక మతం (హిందూ)తో వర్ధిల్లాలనేది వారి ఆశయం. కొత్త పన్నుల విధానం (జీఎస్టీ), కొత్త విద్యావిధానాలను (ఎన్ఇపి) కూడా రాష్ట్రాల అధికారా లను కత్తిరించడానికి, వాటిని బలహీనపరచడానికి ఉపయోగి స్తున్న వైనం కనబడుతూనే ఉన్నది. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, ఎన్ఆర్సీ, హిజాబ్ నిషేధం వంటి పరిణామాల వెనుక హిందూత్వ ఎజెండా కనిపిస్తూనే ఉన్నది. గోహత్యా పాతకులుగా ముద్రవేయడం ద్వారా ఒక మతా వలంబుల్ని సమాజానికి దూరంగా నెట్టే ప్రయత్నమూ కట్టెదుటే ఉన్నది. కనుక హిందూత్వ ఎజెండా ఇప్పటికీ ఉన్నది. ఇంకా బలంగా ఉండబోతున్నది. మనదేశంలో తొంబయ్యవ దశకం ప్రారంభంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు కేవలం ఆర్థిక వ్యవస్థనే మార్చలేదు. సామాజిక, రాజకీయ వ్యవస్థలను కూడా ఆసాంతం మార్చి వేశాయి. ఎనభయ్యో దశకం తర్వాత పుట్టిన వాళ్లను ‘మిలీనియల్స్’ అంటున్నారు. ఈ మిలీనియల్స్, పోస్ట్ మిలీనియల్స్ తరాల్లో చరిత్ర, సమాజ పరిణామ శాస్త్రాల అధ్యయనం మృగ్యమైంది. అందువల్ల భావోద్వేగపూరితమైన, మతపరమైన, కులపరమైన అంశాలకు సులభంగా ప్రభావిత మవుతున్నారు. ఈ పరిణామం కూడా బీజేపీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడింది. సోషల్ మీడియాపై ఆ పార్టీకి ఉన్న పట్టు కారణంగా ఇకముందు కూడా ఉపయోగపడుతుంది. కనుక హిందూత్వ ఎజెండా ఇకముందు కూడా బలంగా ఉండబోతున్నది. కేవలం హిందూత్వ కార్డుతోనే ఎన్నికలకు వెళ్లడం కుదరదు కాబట్టి అందులో జాతీయవాదాన్ని మిక్స్ చేసి, ఆర్థికాభివృద్ధితో గార్నిష్ చేసుకుని ఎజెండాను వడ్డించవచ్చు. సరిహద్దుల్లో బలవంతుడైన చైనావాడితో ఢీ అంటే ఢీ అనడం, ఆక్రమిత కశ్మీర్ను హస్తగతం చేసుకుంటామని ప్రకటనలు చేయడం జాతీయ భావాలను ప్రేరేపితం చేసే కార్యక్రమాలే! అంతర్జా తీయ యవనికపై ప్రముఖపాత్రను పోషించడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఆర్థికాభివృద్ధిని గురించి ఉటం కించడానికైతే గణాంకాలు అందుబాటులోనే ఉన్నాయి. 2014లో రెండు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ 2022 నాటికి మూడున్నర ట్రిలియన్ డాలర్లకు చేరింది. తలసరి ఆదాయం లక్ష రూపాయల నుంచి రెండు లక్షలకు పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ను దాటేసి ఐదో స్థానంలోకి చేరింది. అయితే మానవ అభివృద్ధి సూచికలో మాత్రం దేశం 130వ స్థానం నుంచి 132కు దిగజారింది. మరి బలపడిన ఆర్థిక వ్యవస్థ మానవ అభివృద్ధికి ఎందుకు ఉపకరించలేదు? సృష్టించిన సంపద అంతా ఎక్కడికి వెళ్లింది? ఆక్స్ఫామ్ ఇండియా రిపోర్టులో సమాధానం దొరుకుతుంది. సంపద అంతా పిడికెడు మంది చేతిలో కేంద్రీకృతమై ఉన్నది. 80 శాతం సంపద 10 శాతం శ్రీమంతుల చేతిలో ఉన్నది. అందులోనూ ఒక్కశాతం కుబేరుల చేతుల్లో 55 శాతం సంపద కేంద్రీకృతమై ఉన్నది. అయినప్పటికీ జీడీపీలోనూ, తలసరి ఆదాయంలోనూ పెరుగు దల కనిపిస్తున్నది కదా? అంబానీ ఆదాయం లక్షకోట్లు, అప్పారావు ఆదాయం లక్ష రూపాయలు అనుకుందాం. ఇద్దరి తలసరి ఆదాయం యాభైవేల కోట్ల యాభైవేల రూపాయలు అవుతుంది కదా! ఈ సంగతి తెలిస్తే అప్పారావు మూర్ఛపోతే పోవచ్చు గాక! లెక్క లెక్కే కదా! ఈ లెక్క ప్రకారం ఇండియా ఈజ్ షైనింగ్. ఈ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వాజపేయి ప్రభుత్వం గతంలో దెబ్బతిన్నది. కనుక ఈ షైనింగ్లో ఈసారి హిందూత్వ మెరుపులు, జాతీయ తళుకులూ ఉండవచ్చు. ఇదొక సంభావ్యత మాత్రమే! కొత్త జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ రైతు రాజ్యాన్ని ఎజెండాగా ప్రకటించుకున్నది. కొత్తగా జాతీయ పార్టీ హోదా సాధించిన ‘ఆప్’కు ‘అవినీతి’ బాణం ఉండనే ఉన్నది. కాంగ్రెస్ సంగతేమిటో ఆ పార్టీలోనే ఇంకా ఎవరికీ తెలియదు. మూడు నాలుగు పాయలుగా చీలిన ప్రతి పక్షం మురిపిస్తుండగా బీజేపీ మెరిపించబోయే ఎజెండా కోసం దేశం ఎదురుచూస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
గన్ షాట్: గుజరాత్ మోడల్ పేపర్
-
గుజరాత్కు బీజేపీ కేంద్ర పరిశీలకులు.. సీఎం ఎంపికపై దృష్టి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇక నూతన ముఖ్యమంత్రి ఎంపికపై దృష్టి సారించింది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం గాంధీనగర్లో సమావేశమై, తమ పార్టీ శాసనసభా పక్ష(సీఎల్పీ) నేతను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండాను బీజేపీ అధిష్టానం నియమించింది. సీఎల్పీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని బీజేపీ అధిష్టానం గతంలోనే ప్రకటించింది. భూపేంద్ర పటేల్ రాజీనామా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్భవన్లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయన మంత్రివర్గం సైతం రాజీనామా సమర్పించింది. బీజేపీ నిర్ణయం ప్రకారం.. భూపేంద్ర పటేల్ ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి? -
ఇంతకీ.. గెలిచింది ఎవరు!
మూడు రాష్ట్రాలు. మూడు ఎన్నికలు. మూడు పార్టీలు. మూడు విభిన్న తీర్పులు. మూడు ముక్కల్లో తాజాగా ముగిసిన గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సారాంశమిదే. దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకునే సమ్మోహన శక్తి ఏ పార్టీకీ లేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి గానీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు గానీ, బీజేపీకి పోటీగా ఎదగాలని కలలుగంటున్న ఆప్కు గానీ అవి ఊహించుకుంటున్నంత బలం లేదని తేలిపోయింది. ఈ మూడు పార్టీలు ఎక్కడ గెలవాలన్నా ఇంకేదో వాటికి అసంకల్పితంగా సహాయపడుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓ పార్టీగా నెగ్గలేదు. మోదీ ప్రధానిగా ఉండటం వల్ల మాత్రమే రికార్డు విజయాన్ని సాధించగలిగింది. ప్రధాని గుజరాతీ కావడం వల్లే ఆ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను ఆసాంతం పక్కకు నెట్టేసి బీజేపీని అక్కున చేర్చుకున్నారు. ఇక హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా అది సొంత చరిష్మాతో అసలే కాదు. పాలక పక్షమైన బీజేపీపై గూడుకట్టుకుని ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్కు ఓటేయడం ద్వారా జనం బహిర్గతం చేశారు. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓటర్లు ఇలాగే స్పందించడంతో ఎంసీడీపై 15 ఏళ్ల బీజేపీ పెత్తనానికి తెర పడింది. అక్కడ కాంగ్రెస్ కన్నా ఆప్ మెరుగని ఓటర్లు భావించడంతో ఎంసీడీ కేజ్రీవాల్ పార్టీ వశమైంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ గెలిచిన పార్టీలకు సొంత బలానికి మించి అదనపు బలం వ్యతిరేక ఓటు ద్వారానో, ప్రాంతీయాభిమానం రూపేణో సమకూరింది. ఆ లెక్కన వాటివి అసంపూర్ణ విజయాలు మాత్రమే! గెలవలేదు, గెలిచామనిపించాయి!! మోదీ మ్యాజిక్ను నమ్ముకుని 2024లో ఏకంగా 400 ఎంపీ స్థానాలు కొల్లగొడతామని కలలుగంటున్న బీజేపీ పైకి ఏం చెబుతున్నా ఈ మూడు ఎన్నికల్లో సదరు మ్యాజిక్ ఒకే రాష్ట్రానికి, అదీ ఆయన స్వరాష్ట్రానికి మాత్రమే పరిమితమైందన్న వాస్తవం మింగుడుపడటం లేదు. తన మ్యాజిక్కూ పరిమితులున్నాయని మోదీకి కూడా ఈసరికే అర్థమై ఉంటుంది. కలెగూరగంప లాంటి తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరి పరిమితులేమిటో చూద్దాం... మోదీ.. తగ్గుతున్న మేజిక్ గుజరాత్ను సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రి. ప్రస్తుతం దేశాన్నేలుతున్న ప్రధాని. ప్రపంచం దృష్టిలో విశ్వగురు. అత్యధిక ప్రజాదరణ ఉన్న నేత. బీజేపీకి పెద్ద దిక్కు. ఒకరకంగా పారీ్టకి ప్రస్తుతతం అన్నీ ఆయనే! ఎంతగా అంటే... బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ అనేంతగా!! వరుసగా రెండోసారి ప్రధాని పదవి చేపట్టాక మోదీ ద్విగుణీకృత ఆకర్షణ శక్తితో వెలిగిపోయినా ఆ శక్తి రాను రానూ సన్నగిల్లుతున్నట్టు కన్పిస్తోంది. తాజా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అది కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. ఒకవిధంగా మోదీ గ్రాఫ్ తగ్గడం నోట్ల రద్దు నిర్ణయంతోనే మొదలైంది. తర్వాత బడా కార్పొరేట్ దిగ్గజాల భారీ రుణాలను గుండుగుత్తగా మాఫీ చేయడం మొదలుకుని ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దాకా ఆయన గ్రాఫ్ పడిపోతూనే ఉంది. మెజారిటీ లేని రాష్ట్రాల్లో బేరసారాలతో రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ వశం చేయడం సాధారణ పౌరులకు కూడా మింగుడుపడని అంశం. ఎంసీడీలోనూ, హిమాచల్ప్రదేశ్లోనూ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని ఉంటే మోదీ గాలికి తిరుగులేదని బహుశా నిరూపితమయ్యేదేమో. కానీ జరిగింది మరొకటి. గుజరాత్లోనూ ఎన్నడూ లేనంతటి మెజారిటీ సాధించడం కచి్చతంగా మోదీకి ప్లస్ పాయింటే. అయితే అది మోదీ స్వరాష్ట్రం కావడం వల్లే ఆ ఘనత సాధ్యమైంది. ఆయన్ను తమ రాష్ట్ర ముద్దుబిడ్డగా గుజరాత్ ఓటర్లు భావించబట్టే ఆ స్థాయిలో అందలమెక్కించారు. మోదీ కాక మరో రాష్ట్ర నేత ఎవరైనా ప్రధానిగా ఉన్నట్టయితే గుజరాత్ ఫలితం మరోలా ఉండేదేమో! ఊహాజనితమే అయినా ఇది చర్చనీయాంశమే! గుజరాత్లో గెలిచింది నిస్సందేహంగా మోదీ మాత్రమే. బీజేపీ కేవలం ఆయన వెంట నడిచింది. అంతే! అదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు మోదీ కూడా ఓడారన్నది కాదనలేని వాస్తవం! బీజేపీ.. మోదీపైనే భారం కేంద్రంలో అధికారంలో ఉన్న పారీ్టగా అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగరేయాలని ఉవి్వళ్లూరుతున్న బీజేపీకి హిమాచల్ ఓటమి మింగుడుపడనిదే. ఈ ఫలితంతో బీజేపీ అధికారం 16 రాష్ట్రాలకే పరిమితమైంది. వీటిలో సొంతంగా 10 రాష్ట్రాల్లో, సంకీర్ణంతో మిగతా ఆరుచోట్ల అధికారంలో ఉంది. డబుల్ ఇంజన్ (కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం) నినాదంతో దేశాన్ని హోరెత్తిస్తున్న బీజేపీకి హిమాచల్లో ఒక ఇంజన్ పట్టాలు తప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అక్కడ కేవలం ఒక శాతం ఓటు తేడాతోనే ఓడామని మోదీ సరిపుచ్చుకునే ప్రయత్నం చేసినా ఓటమి ఓటమే కదా! పైగా హిమాచల్లో కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం కూడా చేయకపోయినా విజయం ఆ పార్టీనే వరించడం బీజేపీపై అక్కడి ప్రజలకున్న వ్యతిరేకతకు అద్దం పడుతుంది. స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన అగి్నపథ్, వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకం వంటివాటిపై బీజేపీ దృష్టి పెట్టకపోవడం, కేవలం మోదీ మ్యాజిక్ మీదే మితిమీరిన నమ్మకం పెట్టుకోవడం ఓటమికి దారితీశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరిగిన ఒక లోక్సభ, ఆరు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు అసెంబ్లీ సీట్లలో మాత్రమే నెగ్గింది. ఆ పార్టీ ప్రాభవం తగ్గుతోందంనేందుకు ఇదీ సూచికే. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభ, కతౌలీ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడటం గమనార్హం. మెయిన్పురితో సమాజ్వాదీ అభ్యరి్థ, పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఏకంగా 2.88 లక్షల ఓట్ల మెజారిటీ సాధించడం మరో విశేషం. 2024 లోక్సభ ఎన్నికల్లోగా బీజేపీ సంస్థాగతంగా మరింత పట్టు సాధించకుంటే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా తయారవడం ఖాయం. లేదంటే మోదీనే నమ్ముకుని గుజరాత్ వంటి విజయాల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. కాంగ్రెస్... అదే అయోమయం ఈ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హిమాచల్లో గట్టెక్కినా అది సొంతం బలంతో కాదని కాంగ్రెస్కూ తెలుసు. గుజరాత్లో, ఢిల్లీ కార్పొరేషన్లో పార్టీ కనీస స్థాయి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆప్ దెబ్బకు గుజరాత్లో ముక్కోణపు పోరులో పూర్తిగా మునిగింది. కోలుకునే పరిస్థితి సుదూరంలోనూ కని్పంచడం లేదు. రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒరిగిందేమీ లేదు. గుజరాత్పైనే దృష్టి పెట్టిన కాంగ్రెస్, హిమాచల్లో సరైన ప్రచారం కూడా చేయలేదు. ప్రియాంకా గాంధీ అదపాదడపా పర్యటనలతో మమ అనిపించారు. రాహుల్ ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయినా బీజేపీ వైఫల్యానికి తోడు, ఆప్ ప్రభావం చూపలేకపోవడంతో కాంగ్రెస్ను విజయం తనంతతానుగా వరించింది. కష్టించి సాధించినది కాదు. ఆప్... అప్పుడే కాదు! బీజేపీకి కంచుకోట అయిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను బద్దలు కొట్టి 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెర దించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. భారీ పథకాలు, తాయిలాలతో అట్టహాసంగా రాష్ట్ర ఎన్నికల బరిలో దిగిన ఆప్.. ‘పహలే ఆప్’ అంటూ ఏమాత్రం పోటీనివ్వకుండా బీజేపీకి దారిచి్చంది! పైగా కాంగ్రెస్ ఓట్లను భారీగా చీల్చి బీజేపీకి రికార్డు సంఖ్యలో స్థానాలు కట్టబెట్టింది. గుజరాత్లో సాధించిన ఓట్ల శాతం సాయంతో జాతీయ పార్టీ గుర్తింపు దక్కనుండటమే ఆప్కు ఏకైక ఊరట. బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనంటూ పదేపదే చీపురు ఝళిపిస్తున్న ఆప్ నిజంగా ఆ స్థాయికి చేరాలంటే మరింత సమయం తప్పదని ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి. ఇక హిమాచల్ ఎన్నికల్లోనైతే ఆప్ సోదీలో కూడా లేకుండానే పోయింది. ఓడినా అనుభవం దక్కిందని తృప్తి పడటమే ఆ పారీ్టకి చివరికి మిగిలింది! - ఎస్.రాజమహేంద్రారెడ్డి -
గుజరాత్ ఎన్నికలు.. గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే!
నరేంద్ర రికార్డులను భూపేంద్ర బ్రేక్ చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కమళనాథులకు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 127 సీట్లు రావడమే బీజేపీ ఖాతాలోకి అత్యధిక రికార్డు. ఇప్పుడు బీజేపీ దాన్ని తిరగరాసింది. ఏకంగా 156 సీట్లను చేజిక్కించుకుంది. మాధవ్సిన్హ్ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ నెగ్గిన 149 సీట్ల రికార్డునూ బీజేపీ ప్రస్తుతం తిరగరాయడం విశేషం. విపక్షాల మధ్య ఓట్ల చీలిక వచ్చినా... బీజేపీ ఏకంగా 53 (ఎన్నికల కమిషన్ తాజా సమాచారం ప్రకారం) శాతం ఓట్లు సాధించడం కూడా రికార్డే. కమలనాథులకు ఈ స్థాయిలో ఓట్లు గతంలో ఎప్పుడూ రాలేదు. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు 1977 నుంచి 2011 వరుసగా ఏడు పర్యాయాలు అధికారాన్ని చేపట్టాయి (34 ఏళ్ల పాటు బెంగాల్ను పాలించాయి). గుజరాత్లో 1998 నుంచి నిరంతరాయంగా అధికార పీఠంపై ఉన్న బీజేపీ వరుసగా ఏడోసారి నెగ్గి ఈ రికార్డును సమయం చేసింది. ►గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజారిటీతో గెలిచారు. ► క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జామ్నగర్ నార్త్లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెల్చారు. ► పటీదార్ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ అర్బన్ వీరమ్గ్రామ్ స్థానంనుంచి ఆప్ అభ్యర్థిపై గెలిచారు. ► వదగామ్ (ఎస్సీ) స్థానంలో గతంలో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దళిత నేత జిగ్నేశ్ మేవానీ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ► హార్దిక్ మాజీ సన్నిహితుడు, పటీదార్ నేత అల్పేశ్ కథిరియా వరఛా రోడ్ (సూరత్) స్థానంలో విజయఢంకా మోగించారు. ► కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన గాంధీనగర్ (సౌత్) నియోజకవర్గ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ సైతం గెలిచారు. ఓడిన ప్రముఖులు ► గుజరాత్ ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కటర్గామ్లో ఓడారు. ► ఆప్ సీఎం అభ్యర్థి ఎసుదాన్ గాఢ్వీ ఖంభలియా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ► ప్రాథమిక, యువజన విద్యాశాఖ సహాయ మంత్రి కీర్తిసిన్హా వాఘేలా, ఏడుగురు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. ► ఇక హిమాచల్లో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగిన ఆశాకుమారి, రామ్లాల్ ఠాకూర్, కౌల్సింగ్ ముగ్గురూ ఓటమి చవిచూశారు. -
Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికి
అహ్మదాబాద్: పార్టీ పట్ల అంకితభావం, కష్టించే తత్వం భూపేంద్ర పటేల్ను మున్సిపాలిటీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేర్చాయి. గుజరాత్ శానససభ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భూపేంద్ర పటేల్ ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ప్రకటించారు. గుజరాత్లో ఎన్నికలకు సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రిని మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. విజయ్ రూపానీ స్థానంలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర వైపు మొగ్గుచూపింది. అధిష్టానం అంచనాలకు తగ్గట్టే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించారు. 2017లో రికార్డు స్థాయి మెజార్టీ భూపేంద్రబాయ్ పటేల్ అలియాస్ భూపేంద్ర పటేల్ 1962 జూలై 15న గుజరాత్లోని అహ్మదాబాద్లో జlచారు. 1982 ఏప్రిల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. తొలుత అహ్మదాబాద్ జిల్లాలోని మేమ్నగర్ మున్సిపాలిటీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. రెండు సార్లు అదే మున్సిపాలిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2010 నుంచి 2015 దాకా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2015 నుంచి 2017 వరకు అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(ఏయూడీఏ) చైర్మన్గా సేవలందించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీదీనగర్ లోక్సభ స్థానం పరిధిలోని ఘట్లోడియా శాసనసభ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. చదవండి: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం ఏకంగా 1.17 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్పై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. 2021 సెప్టెంబర్ 13న గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన(2022) అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజార్టీతో నెగ్గడం గమనార్హం. -
ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయహోదాతో వచ్చే మార్పులేంటి ?
హిమాచల్ప్రదేశ్లో ఖాతా తెరవలేకపోయింది. గుజరాత్లో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆప్ కలలు కంది. కానీ ఆ కలలన్నీ కల్లలైపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఊడవలేకపోయిన చీపురు మూలకూర్చుండిపోయింది. గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావడంతో ఆ పార్టీకి కాస్త బలం వచ్చినట్టయింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన పంజాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎరగవేయడంతో గుజరాత్లో కూడా ఆ పార్టీ ప్రబల శక్తిగా ఎదుగుతుందని అందరూ భావించారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా తన ఉనికిని చాటుతుందని అనుకున్నారు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఆప్కి జాతీయ పార్టీ హోదా దక్కడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రెండేళ్ల ముందు నుంచి రాష్ట్రంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ గుజరాత్పై దృష్టి పెట్టడం, సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటడంతో తొలిసారిగా రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. అయితే మొదట్నుంచి ఆప్ కాంగ్రెస్నే విమర్శిస్తూ ఆ పార్టీ ఓటు బ్యాంకునే లక్ష్యంగా చేసుకోవడంతో నామమాత్రంగానే మిగిలిపోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఆమ్ మొదట్లో విస్తృతంగా తిరిగినప్పటికీ అవినీతి ఆరోపణల కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్తో ఆప్ ఆశలు వదిలేసుకుంది. గుజరాత్లో వివిధ మీడియా సంస్థల పోల్స్ కూడా ఆప్కి 20 శాతం వరకు ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీకి సొంత గడ్డ మీదనున్న క్రేజ్ ముందు కేజ్రివాల్ నిలబడలేకపోయారు. చదవండి: (ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం) జాతీయ పార్టీ హోదా ‘‘గుజరాత్ ప్రజలు మాకు జాతీయ పార్టీ హోదా కట్టబెట్టారు. ఇప్పటివరకు దేశంలో కొన్ని పార్టీలకు మాత్రమే ఆ హోదా ఉంది. నిజంగా ఇది మాకో అద్భుతమైన విజయం’’.. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అరవింద్ కేజ్రివాల్ పంపిన సందేశమిది. జాతీయ పార్టీకి హోదా రావడానికున్న షరతుల్లో ఒకటైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలో 6శాతం ఓట్లు, కనీసం రెండు సీట్లలో గెలిచి ఉండాలి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలో ఉన్న ఆప్ గోవాలో 6శాతం ఓట్లు, 2 సీట్లను సాధించింది. ఇప్పుడు గుజరాత్లో అయిదు సీట్లను గెలుచుకొని, 13శాతం ఓట్లతో జాతీయ పార్టీ హోదాని దక్కించుకుంది. దేశంలో ఉన్న జాతీయ పార్టీలివే.. మన దేశంలో ఇప్పటివరకు ఎనిమిది మాత్రమే జాతీయ పార్టీలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీకి మాత్రమే ఈ గుర్తింపు ఉంది. ఆప్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తిస్తే తొమ్మిదో జాతీయ పారీ్టగా అవతరిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ జాతీయ హోదాతో వచ్చే మార్పులేంటి ? ►పార్టీకి జాతీయ హోదా వస్తే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ఎన్నికల గుర్తు లభిస్తుంది ►సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్లో బ్రాడ్కాస్ట్, టెలికాస్ట్ బాండ్స్ లభిస్తాయి ►40 మంది స్టార్ క్యాంపైనర్లు ప్రచారంలో పాల్గొనచ్చు. వారికయ్యే ఖర్చులు అభ్యర్థులకుండే ఖర్చుల పరిమితి నుంచి మినహాయిస్తారు. ►పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి రాష్ట్రాల్లో ప్రభుత్వ జాగాలు లభిస్తాయి. ►అభ్యర్థులు నామినేషన్ వేసినప్పుడు ఒకరే ప్రొపోజర్ ఉంటే సరిపోతుంది. -
ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం
పోయిన చోటే వెతుక్కోవాలంటారు. గత ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన స్థానాలపై బాగా దృష్టి పెట్టడంలో, దూరమైన వర్గాలను కలుపుకొని పోవడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీ గుజరాత్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు సీఎంతో పాటు కేబినెట్ మొత్తాన్నీ మార్చేసి ప్రభుత్వ వ్యతిరేకత బారి నుంచి తప్పించుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా దశా దిశా లేకుండా సాగిన కాంగ్రెస్ చివరికి చతికిలపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత గడ్డ అయిన గుజరాత్లో 27 ఏళ్ల అధికార వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ ఏడాది ముందు నుంచి సన్నాహాలు చేసుకుంది. పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయడంతోపాటు ప్రభుత్వానికి కొత్త రూపు రేఖ కల్పించింది. సీఎంగా విజయ్ రూపానిని సీఎం పీఠం నుంచి తొలగించి రాష్ట్రంలో అత్యంత కీలకమైన పటేల్ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్కు సీఎం పగ్గాలు అప్పగించింది. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి పార్టీని గాడిన పెట్టడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా షాకిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలకు కాస్త ముందు 2020 జులైలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ సామాజిక వర్గానికి చెందిన జితు విఘానిని తొలగించి ఆయన స్థానంలో సీ.ఆర్.పాటిల్కు అవకాశం కల్పించారు. టిక్కెట్ల పంపిణీలో కూడా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినంగానే వ్యవహరించారు. ఏకంగా 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించి కొత్త ముఖాలను ప్రోత్సహించారు. చివరికి ఎన్నికలకి ముందు 140 మంది ప్రాణాలు కోల్పోయిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయిన మోర్బీలో కూడా బీజేపీ రికార్డు స్థాయి విజయం సాధించిందంటే ఆ పార్టీ రచించిన పకడ్బందీ వ్యూహాలే కారణం. మోదీకి దేశ విదేశాల్లో ఉన్న జనాదరణ కూడా ఈ ఎన్నికల ఫలితాలను బాగా ప్రభావితం చేసింది. ఆయన 34 ర్యాలీలు, రెండు భారీ రోడ్ షోలతో దాదాపుగా కోటి మంది ఓటర్లను నేరుగా కలిశారు. ‘గుజరాత్ను నేనే నిర్మించాను, నన్ను చూసి ఓటు వెయ్యండ’న్న మోదీ విజ్ఞప్తికి ఓటర్లు సానుకూలంగా స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా సెల్ఫ్ గోల్ వేసుకోవడం బీజేపీ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నేతలందరూ బిజీగా ఉండి గుజరాత్ను పూర్తిగా వదిలేశారు. గతంలో కాంగ్రెస్కు బాగా కలిసొచి్చన క్షత్రియులు, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీల వ్యూహాన్ని తెరపైకి తెచ్చి దళిత ఉద్యమకారుడు జిగ్నేశ్ మేవానీ, ముస్లిం వర్గంలో పట్టున్న ఖాదిర్ ఫిర్జాదాలకు అక్కున చేర్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకునే కొల్లగొట్టి కొన్ని సీట్లు సొంతం చేసుకోవడం బీజేపీకి లాభించింది. సామాజిక సమీకరణలు సామాజికంగా అన్ని వర్గాలను కలుపుకుని పోయే వ్యూహాలనే బీజేపీ రచించింది. గత ఎన్నికల్లో పటేళ్ల ఉద్యమంతో బీజేపీకి దూరమైన వారిని అక్కున చేర్చుకోవడానికి ఉద్యమ సారథి హార్దిక్ పటేల్ను పార్టీలో చేర్చుకుంది. 37శాతం ఉన్న ఓబీసీ ఓటర్లపై దృష్టి పెట్టి కాంగ్రెస్ నుంచి అల్వేష్ ఠాకూర్ని చేర్చుకుంది. ఫలితంగా 90 నియోజకవర్గాల్లో పై చేయి సాధించింది. చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు) -
బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు
దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే గుజరాత్లో కూడా సామాన్యుల్లో చాలా అంశాలపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ధరల పెరుగుదల మొదలుకుని నానా రకాల సమస్యలతో వాళ్లు కూడా సతమతమవుతూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా భావించే పాడి పరిశ్రమపై ఆధారపడ్డ అసంఖ్యాకులు ద్రవ్యోల్బణం దెబ్బకు లాభాలు సన్నగిల్లి అల్లాడుతున్నారు. వారంతా దీన్ని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యంగానే చూశారు. సంపన్న సూరత్ వస్త్ర వ్యాపారుల నుంచి మధ్య గుజరాత్లోని నిరుపేద పొగాకు రైతుల దాకా అందరిదీ ఇదే వ్యథ, ఇదే అభిప్రాయం. అయినా సరే, బీజేపీకి ఓటేయడం మినహా మరో మార్గం లేదన్న భావన వారిలో ప్రబలంగా వ్యక్తమవడం విశేషం! 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించకపోవడం మరో విశేషం. ఇందుకు మూడు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. హిందూత్వ నినాదం, ప్రధాని మోదీ మేజిక్, విపక్ష ఓటులో చీలిక. ఈ మూడూ కలగలిసి బీజేపీకి కళ్లుచెదిరే విజయం కట్టబెట్టాయి. హిందూత్వ నినాదం హిందూత్వ రాజకీయాలు గుజరాత్లో చిరకాలంగా లోలోతులకు పాతుకుపోయాయి. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలో కూడా రాష్ట్రంలో సన్నకారు పాడి రైతు మొదలుకుని పాటిదార్ పత్తి రైతు దాకా ఎవరిని కదిలించినా ద్రవ్యోల్బణం దెబ్బకు రెండు మూడేళ్లలో ఆర్థికంగా అక్షరాలా చితికిపోయామంటూ వాపోయినవాళ్లే. కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నది వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట! ముస్లింల ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే మరో మార్గం లేదన్నది వారు వెలిబుచ్చిన అభిప్రాయం. ‘‘గతంలో అహ్మదాబాద్ వెళ్లాలంటే ‘గొడవ’లేమన్నా అవుతున్నాయా అని ముందుగా వాకబు చేయాల్సొచ్చేది. కానీ సాహెబ్ (మోదీ) వచ్చాక అల్లర్లూ లేవు, సమస్యలూ లేవు’’ అని సగటు హిందూ ఓటర్లంతా చెప్పుకొచ్చారు. ఈ ముస్లిం వ్యతిరేక భావజాలం వారిలో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. మతపరమైన విభజన ఆర్థిక కష్టాలను కూడా వెనక్కు నెట్టేసేంది. ఇదే బీజేపీకి శ్రీరామరక్షగా మారింది. మోదీ మేనియా సీఎంగా 13 ఏళ్లు గుజరాత్లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా తటస్థ, ఎటూ నిర్ణయించుకోలేని ఓటర్లు మోదీ కరిష్మా కారణంగా బీజేపీవైపే మొగ్గినట్టు ఫలితాల సరళి స్పష్టంగా చెబుతోంది. నిజానికి అధికార బీజేపీ ఎమ్మెల్యేల అసమర్థత, అధికారుల్లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని రాష్ట్రంలో జనం అసహ్యించుకునే పరిస్థితి ఉంది! కానీ మోదీ మేనియా వీటన్నింటినీ చాలావరకు అధిగమించేసింది. విపక్ష ఓటులో చీలిక గుజరాత్లో ఎప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగుతూ వచ్చిన పోరు కాస్తా ఆప్ అన్ని అస్త్రశ్రస్తాలతో రంగంలోకి దిగడంతో ముక్కోణ పోరుగా మారిపోయింది. కేజ్రీవాల్ పార్టీ ప్రధానంగా చీల్చింది బీజేపీ వ్యతిరేక ఓటునే! అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకునే!! అంతిమంగా ఇది ప్రధాన ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బగా, బీజేపీకి అనుకోని వరంగా పరిణమించింది. ఈ కారణంగానే కమలం పార్టీ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 150 సీట్ల మార్కును దాటగలిగింది. ఏకంగా 53 శాతం ఓట్లు కొల్లగొట్టింది. మరోవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకు 41 శాతం నుంచి 27 శాతానికి పడిపోయింది. ఆప్ సాధించిన 13 శాతం ఓట్లు చాలావరకు కాంగ్రెస్నని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. 2017లో కాంగ్రెస్ దుమ్ము రేపిన సౌరాష్ట్ర ప్రాంతాన్ని కూడా బీజేపీ ఈసారి పూర్తిగా తనవైపు తిప్పుకుంది. కానీ ఇక్కడ ఏకంగా 18 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, ఆప్ రెండింటి ఓట్ల శాతం కలిపితే బీజేపీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం! పైగా 2017లో బీజేపీకి చెమటలు పట్టించి కాంగ్రెస్కు చాలావరకు ఉపయోగపడ్డ పాటిదార్ ఉద్యమం వంటివేవీ ఈసారి లేకపోవడం కమలనాథులకు మరింతగా కలిసొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్లో ‘నరేంద్ర’జాలం
ఢిల్లీ స్థానిక ఎన్నికల ఫలితాలతో నిర్ఘాంతపోయిన బీజేపీకి గుజరాత్ ఓటర్లు గురువారం ఊహాతీతమైన విజయాన్ని అందించి సాంత్వనపరిచారు. అక్కడ వరసగా ఏడోసారి అధికారం అప్ప గించటం మాత్రమే కాదు... ఆ పార్టీకి ఎన్నడూలేని స్థాయిలో సీట్లు కట్టబెట్టారు. 182 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి ఏకంగా 156, కాంగ్రెస్కు కేవలం 17, ఆప్కు 5 స్థానాలు లభించటం గమనించ దగ్గది. ప్రధాని నరేంద్ర మోదీ సమ్మోహనశక్తి పనిచేయటంతోపాటు అధికార పక్షానికి గట్టి ప్రత్యామ్నాయం అందించగల శక్తి సామర్థ్యాలు విపక్షానికి కొరవడటం బీజేపీ అసాధారణ విజయానికి ఊతమిచ్చింది. మోదీ సీఎంగా ఉన్నప్పుడు సైతం అత్యధికంగా 127 స్థానాలు మాత్రమే గెలుచు కున్న చరిత్రగల బీజేపీ ఇప్పుడు భారీ మెజారిటీ సాధించటం మాటలు కాదు. హిమాచల్ ప్రదేశ్లో మాత్రం బీజేపీ బోర్లాపడక తప్పలేదు. ప్రతి అయిదేళ్లకూ అధికార పక్షాన్ని సాగనంపే సంప్రదా యాన్ని ఓటర్లు ఈసారి కూడా కొనసాగించటంతోపాటు అక్కడి సమస్యలపై పోరాడిన తీరు కాంగ్రెస్కు లాభించింది. అయితే రెండు పార్టీల ఓట్ల శాతం వ్యత్యాసం ఒక్క శాతంకన్నా తక్కువే. అక్కడి 68 స్థానాల్లో కాంగ్రెస్కు 40, అధికారం మెట్లు దిగుతున్న బీజేపీకి 25 రాబోతున్నాయి. ఢిల్లీలో దక్కిన విజయంతో సంతోషసంరంభాల్లో మునిగితేలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలూ షాక్ అనే చెప్పాలి. ఆ పార్టీకి కొత్తగా జాతీయ పార్టీ హోదా రావటం మినహా సీట్లపరంగా పెద్దగా దక్కిందేమీ లేదు. హిమాచల్లో గట్టి సవాల్ ఇస్తుందనుకుంటే కనీసం ఖాతా కూడా ప్రారం భించలేకపోయింది. గుజరాత్ గురించి సాక్షాత్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గొప్పలకు పోయినా ఎవరూ దాన్ని విశ్వసించలేదు. కానీ పొరుగునున్న పంజాబ్ మాదిరే హిమాచల్లో సైతం ఏదో ఇంద్రజాలం చేస్తుందని నమ్మినవారికి నిరాశే ఎదురైంది. ఆ పార్టీ చేసిన హడావుడికీ, వచ్చిన సీట్లకూ ఎక్కడా పొంతన లేకపోవటం గమనించదగ్గది. అధికార పక్షం పనితీరుకన్నా ఇతరేతర అంశాలు ప్రాధాన్యం సంతరించుకోవటం ఈమధ్య కాలంలో దేశంలో అక్కడక్కడ కనబడుతోంది. ఇప్పుడు గుజరాత్లోనూ జరిగింది అదే. ఇది విప క్షాల వైఫల్యం తప్ప మరొకటి కాదు. కరోనా మహమ్మారి కాటేయడంతో ఆ రాష్ట్రంలో దాదాపు అన్నివర్గాల జనం ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమవుతున్నారు. సంపన్నవంతులైన సూరత్లోని జౌళి మిల్లుల యజమానులు మొదలుకొని అంతంతమాత్రంగా నెట్టుకొచ్చే పొగాకు రైతుల వరకూ అందరికీ సమస్యలున్నాయి. రాష్ట్రంలో వృద్ధి రేటు అరకొరగా ఉండగా ద్రవ్యోల్బణం పట్టిపీడిస్తోంది. నిరుద్యోగ సమస్య సరేసరి. సాధారణ పరిస్థితుల్లో ఇవన్నీ అధికార పక్షానికి చుక్కలు చూపాలి. కానీ రాష్ట్ర ఓటర్లలో 52 శాతంమంది మళ్లీ బీజేపీనే కొనసాగించాలనుకున్నారంటే విపక్షమైన కాంగ్రెస్పై వారికున్న అవిశ్వాసం ఎంతటిదో అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 41 శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ఈసారి 27 శాతానికి పడిపోయిందంటే అది ఆ పార్టీ పతనావస్థను పట్టి చూపుతుంది. క్రితంసారి ఎన్నికల్లో సౌరాష్ట్ర ప్రాంతాన్ని బీజేపీనుంచి చేజిక్కించుకున్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఆప్ ఆగమనం వల్ల కావొచ్చు... ఓట్లు చీలి దాన్ని తిరిగి బీజేపీకే అప్పగించింది. ఆప్ కేవలం కాంగ్రెస్ ఓట్లను మాత్రమే కాదు... అంతో ఇంతో బీజేపీ ఓట్లను కూడా రాబట్టుకోగలిగింది. 2017 ఎన్నికల నాటికి పటీదార్ల ఉద్యమం గుజరాత్ను హోరెత్తించింది. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. తమకు రాయితీలు దక్కటం లేదని రైతాంగం ఆగ్రహంతో ఉంది. అలాంటి సమయంలోనే లాగలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు ఏదో చేస్తుందని ఎవరూ అనుకోలేదు. జనం ఎదుర్కొంటున్న సమస్యలపై తానే ఉద్యమించి అందరినీ కూడగట్టి ఉంటే ఆ పార్టీకి అంతో ఇంతో లాభించేది. అలాంటి చొరవ తీసుకున్న నేతలే లేకపోవటం కాంగ్రెస్కు పెద్ద శాపం. అటు ప్రధాని నరేంద్ర మోదీ 31 ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటే కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మినహా మిగిలిన బడానేతల జాడ అంతంతమాత్రం. గడప దాటకుండా, సమస్యలపై ఉద్యమించకుండా విజయం తనంతతాను దరి చేరాలని ఏ విపక్షం భావించినా తెలివితక్కువతనం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు చూసినా, హిమా చల్లో కాంగ్రెస్ విజయం గమనించినా ఇదే రుజువవుతుంది. హిమాచల్లో బీజేపీ ప్రచారహోరు తక్కువేమీ లేదు. అది ప్రధాని మోదీ ఆకర్షణనూ, ప్రతిసారీ ఏకరువుపెట్టే ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వ వాదాన్నీ, ఉమ్మడి సివిల్ కోడ్నూ, జాతీయ భద్రతనూ ఎజెండాలోకి తెచ్చింది. అటు చూస్తే నిరుడు వీరభద్రసింగ్ మరణం తర్వాత కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండాపోయారు. అయినా రాష్ట్రంలో నిరుద్యోగంపై, యాపిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ఎన్నో ఉద్యమాలు చేసింది. జనం సతమతమవుతున్న సమస్యల్ని తీసుకుని ఉద్యమాలు నిర్మిస్తే విజయం పెద్ద కష్టం కాదని నిరూపించింది. ఆ రకంగా చూస్తే హిమాచల్ ఎన్నికల ఫలితాలు విపక్షాలకు మాత్రమే కాదు, బీజేపీకి సైతం హెచ్చరిక లాంటివే. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. కానీ గెలిచిన పక్షం జనం ఎందుకు గెలిపించారో, వాగ్దానాల అమలుకు తాను చేయాల్సిందేమిటో గుర్తెరగాలి. ఓటమి పాలైన వారు తమవైపు ఎలాంటి లోపాలున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓటమిని హుందాగా స్వీకరిం చటం నేర్చుకోవాలి. జనం అధికారం కట్టబెట్టనిచోట దాన్ని నయానో భయానో కొల్లగొట్టి పబ్బం గడుపుకుందామనే ఆలోచనలకు దూరంగా ఉండాలి. లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. -
కాంగ్రెస్లో అంతర్మథనం.. పక్కలో బల్లెంలా మారుతున్న ఆప్
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు భరించలేని చేదును, కాస్త తీపిని రుచి చూపాయి. గుజరాత్లో బీజేపీ దెబ్బకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతటి ఘోర పరాజయాన్ని చవిచూడ్సాలి వచ్చింది. హిమాచల్ప్రదేశ్లో గెలిచినా దాన్ని కాంగ్రెస్ ఘనత అనేకంటే బీజేపీ స్వయంకృతమనే చెప్పాలి. ఆ లెక్కన తాజా ఫలితాలు రెండూ కాంగ్రెస్కు ప్రమాద ఘంటికలే. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా ఒక్కో రాష్ట్రానికీ విస్తరిస్తూ పక్కలో బల్లెంలా మారుతున్న వైనం హస్తం పార్టీని మరింతగా కలవరపెట్టేదే. కాంగ్రెస్ ఇంతకాలం ప్రధానంగా బీజేపీతోనే తలపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పలు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాపాడుకోవడానికి ముందుగా ఆప్తోనే కాంగ్రెస్ తలపడాల్సిన పరిస్థితి తలెత్తే సూచనలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. ఇది మూలిగే నక్కపై తాటిపండు చందమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. గుజరాత్లోనూ అదే జరిగింది. ఆప్ గెలిచింది ఐదు స్థానాలే అయినా ప్రధానంగా కాంగ్రెస్నే దెబ్బ తీసింది. ఆప్ సాధించిన 13 శాతం ఓట్లు కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు గండి పెడుతూ సాధించినవే. ‘‘రానున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆప్ ముప్పు కాంగ్రెస్ను వెంటాడటం ఖాయం. 2024 లోక్సభ ఎన్నికల నాటికి అది మరింత పెరుగుతుంది’’ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు) -
ఆప్ ఘోర పరాజయం.. సీఎం అభ్యర్థికీ తప్పని ఓటమి
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. బీజేపీ, కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్న ఆప్ ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లు మొండిచేయి చూపారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా గుజరాత్ ఎన్నికల బరిలో దిగిన ఆప్ అత్యంత దారుణంగా చతికిల పడింది. అన్ని స్థానాల్లో బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేక పోయింది. ఖాతా తెరవని ఆప్ 182 స్థానాల్లో కేవలం 4 చోట్లా మాత్రమే గెలుపొందింది. 12 శాతం ఓట్లను సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఇక హిమాచల్ ప్రదేశ్లో ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గుజరాత్లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పార్టీ కీలక నేతలంతా భారీగా ప్రచారం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. బీజేపీ దూకుడు ముందు ఆప్ వ్యూహాలేవీ ఫలించలేదు. సీఎం అభ్యర్థి ఓటమి దీనికి తోడు గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గడ్వీకి కూడా ఓటమి తప్పలేదు. ఖంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి అయర్ ములుభాయ్ హర్దాస్భాయ్ బేరాపై 19,000 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ఇసుదాన్ గాధ్వి 53,583 ఓట్లు రాగా, బేరాకు 71,345 ఓట్లు వచ్చాయి. అంతేగాక గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా కూడా ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి వినోద్ మోరాదియా విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఆప్ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కాంగ్రెస్ ఓట్లకు గండి అయితే గుజరాత్లో ఓట్లను చీల్చడంలో మాత్రం గట్టి పాత్ర పోషించింది. కాంగ్రెస్ ఓట్లకు ఆప్ గండి కొట్టింది. గత ఎన్నికల్లో 41 శాతం ఓటింగ్ సాధించిన కాంగ్రెస్ ఈ సారి 27 శాతానికి పడిపోయింది. ఒకవేళ ఆప్ పోటీలో లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా బీజేపీకి గట్టిపోటి ఇచ్చి ఇంకొన్ని స్థానాలను గెలుచుకునేదేమో! మొత్తానికి ఈ ఏడాది పంజాబ్ అసెంబ్లీ గెలుపుతో ఊపు మీదున్న ఆప్కు గుజరాత్ ఎన్నికలు భారీ షాక్నిచ్చాయి. అసలు హిమాచల్ ప్రదేశ్లో ఆప్ పోటీలో ఉందా అనే స్థితికి చేరింది. -
వారి ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ కూడా అక్కడికి చేరుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించడంతో బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. మోదీ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. పార్టీ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచామన్నారు. గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని నిరూపించారన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తుందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు భవిష్యత్తు విజయాలకు సంకేతమన్నారు. హిమాచల్లో ఒక శాతం ఓట్లే గెలుపోటములను డిసైడ్ చేశాయని తెలిపారు. హిమాచల్ అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. చదవండి: హిమాచల్ ఫలితాలు: కాంగ్రెస్ విజయంపై స్పందించిన ఖర్గే -
గుజరాత్లో మోదీ మేనియానా? లేక కమలం హవానా? ఫలితాలు ఏం చెబుతున్నాయి?
గుజరాత్లో బీజేపీ దుమ్మురేపింది. రికార్డు స్థాయిలో సీట్లను కొల్లగొట్టి ప్రభంజనాన్ని సృష్టించింది. మోదీ- షా సొంత రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకుంది కమల దళం. మోదీ మ్యాజిక్తో 156 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. 54శాతం ఓట్లను దక్కించుకుంది. బీజేపీ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది. 20 సీట్లు కూడా గెలవలేక చతికిలపడింది. గుజరాత్లో ఎన్నికల ఆరంగేట్రం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 12శాతం ఓట్లను కొల్లగొట్టింది. డిసెంబర్ 12న భూపేంద్ర పటేల్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్లో బీజేపీ గెలుపుకు దోహం చేసిన అంశాలేవీ?. గుజరాత్లో గెలిచింది బీజేపీనా? మోదీనా?. బలమైన నేతలను ఆకట్టుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందా?. రాబోయే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతోంది? రాహుల్ జోడో యాత్ర, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఖర్గే ప్రభావం ఎక్కడ? వంటి అనేక అంశాలపై సాక్షి విశ్లేషణ.. -
చరిత్ర సృష్టించిన ఆప్.. దేశంలో తొమ్మిదో పార్టీగా రికార్డ్
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఊరట లభించింది. గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. జాతీయ పార్టీ హోదాను సంపాదించేందుకు కృషి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు, దేశప్రజలకు అభినందనలు తెలిపారు. కాగా గుజరాత్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న ఆప్ మరో స్థానంలో ముందంజలో ఉంది. గుజరాత్ ఎన్నికల్లో 13 శాతం ఓట్లను సాధించింది. ప్రస్తుతం దేశంలో ఎనిమిది పార్టీలు జాతీయ హోదా పొందాయి. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఎన్నికల సంఘం జాతీయ పార్టీలుగా గుర్తించింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన తొమ్మిదో పార్టీగా నిలిచింది. राष्ट्रीय पार्टी बनने पर आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं और सभी देशवासियों को बधाई। pic.twitter.com/sba9Q1sz1f — Arvind Kejriwal (@ArvindKejriwal) December 8, 2022 ఒక రాజకీయ పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 2 సీట్లు, 6శాతం ఓట్లు సాధిస్తే కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తిస్తుంది.. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉండగా.. గోవాలో రెండు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో ఆప్ జాతీయ హోదా ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఆప్ నాలుగు రాష్ట్రాల్లో తమ ప్రజాప్రతినిధులను కలిగి ఉంది. చదవండి: Himachal Election Results: కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా -
గుజరాత్: బీజేపీ ఖాతాలో ఆ రికార్డు కూడా?!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత ప్రభంజనంతో బీజేపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్(92)ను దాటేసి ఏకంగా 150కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది కాషాయం పార్టీ. ఈ ఫలితంలో గుజరాత్ తమ కంచు కోట అని బీజేపీ చాటిచెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ చరిష్మా గుజరాత్ ఎన్నికలకు బాగా కలిసొచ్చింది. మోదీతో పాటు అమిత్ షా సొంత రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునే ప్రయత్నాలు భారీగా సక్సెస్ అయ్యాయి. గుజరాత్లో అన్ని అసెంబ్లీ ఎన్నికల రికార్డులను బీజేపీ బద్ధలు కొట్టింది. వరుసగా ఏడోసారి అధికారం జేక్కిచ్చుకుని.. పశ్చిమ బెంగాల్ వామపక్ష పార్టీ అధికార కైవసం రికార్డు సరసన నిలవబోతోంది. అలాగే గుజరాత్ గడ్డ నుంచే మరో రికార్డును సైతం నెలకొల్పే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుజరాత్ చరిత్రలో ఇంత మెజార్టీతో ప్రభుత్వాన్ని మునుపెన్నడూ ఏర్పాటు చేసింది లేదు. 1985లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 149 సీట్లు గెల్చుకుంది. ఆ టైంలో మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వం వహించారు. ఆపై 2002లో 127 సీట్లు సాధించింది ఆ లిస్ట్లో వెనుక నిల్చుకుంది బీజేపీ. ఇక ఇప్పుడు ఏకంగా 150 సీట్లకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్న కమలం.. కాంగ్రెస్ నెలకొల్పిన ప్రభుత్వ ఏర్పాటు రికార్డును బద్ధలు కొడుతుందా? అనే తుది ఫలితం వచ్చాకే తేలేది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అప్డేట్ కోసం.. -
గుజరాత్ లో బీజేపీకి బంపర్ మెజార్టీ
-
మోదీ అడ్డాగా గుజరాత్.. రికార్డులు బద్దలుకొట్టిన బీజేపీ!
గుజరాత్.. బీజేపీ అడ్డా అని మరోసారి రుజువైంది. గుజరాత్లో తమకు తిరుగులేదని కమలం పార్టీ ఏకఛత్రాధిపత్యం చూపించుకుంది. ఎన్నికలేవైనా సరే.. కాషాయ జెండా ఎగురవేయాల్సిందేనని బీజేపీ నేతలు నిరూపించుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుజరాత్లో అధికార బీజేపీ భారీ విజయాం దిశగా దూసుకుపోతోంది. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలో ఫుల్ ఫోకస్ పెట్టారు. గుజరాత్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందునుంచే అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మాస్టర్ ప్లాన్స్ రచిస్తూ గుజరాతీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ, బీజేపీ ఎలక్షన్ స్టంట్స్ ఎదుట ఆ పాచికలేవీ పారలేదు. ఇక, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికే పరమితమైనట్టు సమీకరణాలే చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ముందు కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడటం కూడా హస్తం పార్టీకి కలిసిరాలేదు. ముఖ్యంగా పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడం కాషాయ పార్టీకి కొంత లాభం చేకూర్చిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక, ముందు నుంచి గుజరాత్లో మోదీ మంత్రం పనిచేస్తున్నట్టుగానే ఈ ఎన్నికల్లో కూడా అది మరోసారి నిరూపితమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ప్రచారం ప్రారంభమయ్యాక.. మోదీ రోడ్ షోలతో బిజీగా అయ్యారు. గుజరాత్ అంటే బీజేపీ బ్రాండ్ అంటూ తమ గళం వినిపించారు. దీంతో, అప్పటి వరకు డైలామాలో ఉన్న గుజరాతీలు బీజేపీ వైపునకు మోగ్గారు. ఇదిలా ఉండగా.. 1995 నుంచి గుజరాత్లో బీజేపీ.. వరుసగా విజయం సాధిస్తూనే ఉంది. 1995-2017 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచి బీజేపీ దేశ రాజకీయ చరిత్రలో రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే బీజేపీ తమ ఖాతాలో ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. ఇక, ఈ ఎన్నికల్లో బీజేపీ 127 స్థానాలకు పైగా సీట్లో గెలిస్తే కమలం పార్టీ మరో రికార్డు బద్దలుకొట్టినట్టు అవుతుంది. గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లు.. 1. 1995లో 121 2. 1998లో 117 3. 2002లో 127 4. 2007లో 117 5. 2012 లో 115 6. 2017లో 99 7. 2022లో కూడా 100కు పైగా సీట్లలో విజయం సాధించే అవకాశం ఉంది. -
విక్టరీ ఏమోగానీ.. ఆప్లో దానిపైనే ఉత్కంఠ
ఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపీ, ఆప్ కొత్త రికార్డుల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. గుజరాత్లో వరుసగా 7వ సారి గెలిచి దేశంలో కమ్యూనిస్టు పార్టీ విజయం(పశ్చిమ బెంగాల్) రికార్డును సమం చేయనున్న బీజేపీ. అలాగే.. ఈ ఎన్నికలతో జాతీయ పార్టీగా అవతరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఏదైనా పార్టీ కనీసం 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తే జాతీయ పార్టీగా అర్హత పొందుతుంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఆప్. ఇక ఆ మధ్య గోవాలో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు తోడు గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో ఏదో ఒక చోట 6 శాతం దాటితే జాతీయ పార్టీగా అర్హత పొందినట్లు అవుతుంది. అంటే గుజరాత్లో కనీసం రెండు సీట్లు గెలిచినా సరిపోతుంది ఆప్. ఒకవేళ జాతీయ పార్టీగా మారితే.. దేశంలో జాతీయ పార్టీ హోదా సాధించిన ఎనిమిదవ పార్టీగా ఆప్ నిలవడంతో పాటు ఈవీఎం మెషీన్లలో మొట్టమొదటి పేరు ఆమ్ ఆద్మీ పార్టీ, సింబల్ ఉండనుంది. 2021లో సూరత్ మున్సిపల్ ఎన్నికలలో 28% ఓట్ల వాటాను సాధించడం ద్వారా కాంగ్రెస్ స్థానంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆప్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శనను కనబరుస్తామని ఆశిస్తోంది. 2024 ఎన్నికలకు జాతీయ పార్టీ హోదాతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఆప్కి ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. -
ప్రారంభమైన గుజరాత్ ఓట్ల లెక్కింపు
-
నేడు గుజరాత్ ఓట్ల లెక్కింపు
-
గుజరాత్ ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 64.33 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2017 నాటి ఎన్నికలతో పోలిస్తే 4.08 శాతం తగ్గింది. రాష్ట్రంలో 2017 ఎన్నికల్లో 68.41 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ నెల 1న 89 స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 63.31 శాతం, 4న 93 స్థానాలకు జరిగిన రెండో దశ ఎన్నికల్లో 65.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో 4.91 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ ఎన్నికల్లో 3.16 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా నర్మదా జిల్లాలో 78.42 శాతం, అతి తక్కువగా బోతాడ్ జిల్లాలో 57.59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. తాపీ జిల్లాలో 77.04 శాతం, బనస్కాంతా జిల్లాలో 72.49 శాతం, సబర్కాంతా జిల్లాలో 71.43 శాతం, నవసారి జిల్లాలో 71.06 శాతం, మోర్బీ జిల్లాలో 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు తేలింది. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదీ చదవండి: ఎగ్జిట్ పోల్స్: గుజరాత్ బీజేపీదే -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆప్కు ఎదురుదెబ్బ.. స్పందించిన కేజ్రీవాల్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పోరాడిన కేజ్రీవాల్ పార్టీ బోల్తా కొట్టింది. రెండు రాష్ట్రాల్లోనూ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. సోమవారం సాయంత్రం విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆప్కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. గుజరాత్ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరిగిందని అంతా భావించారు. అధికార బీజేపీ పార్టీకి గట్టి పోటి ఇస్తుందని అనుకున్నారు. అందుకు తగ్గట్లే మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పార్టీ భారీ ప్రచారం నిర్వహించింది. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. అంచనాలను తలకిందులు చేస్తూ ఆప్ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. కేవలం అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్యే పోటీ జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అంతేగాక హిమాచల్లోనూ ఆప్ కనీసం ఖాతా తెరవడం కష్టమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 182 సీట్లు ఉన్న గుజరాత్లో ఆప్ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కనీసం రెండో స్థానంలో కూడా నిలువలేకపోయింది. గుజరాత్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలిచింది. అయితే ఎగ్జిట్ పోల్స్ను ఆప్ నేతలు ఖండిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువవుతుందని.. వాస్తవానికి దాదాపు 100 సీట్లకు దగ్గరగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే హిమాచల్లో కాంగ్రెస్కు మద్దతిస్తారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు కేజ్రీవాల్. తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గుజరాత్ ఎన్నికల రిజల్ట్స్ తమకు సానుకూలంగా రానున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్లో ఓ కొత్త పార్టీ 15 నుంచి 20 శాతం ఓట్లు రావడం, అది కూడా బీజేపీ కంచుకోటగా ఉన్న గుజరాత్లో చాలా పెద్ద విషయమని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి ఉంటామని తెలిపారు. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆప్ విజయ కేతనం ఎగురవేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్లో తేలింది. 250 సీట్లున్న ఢిల్లీ కార్పొరేషన్లో ఆప్ 150 సీట్లకు పైగానే గెల్చుకునే అవకాశం ఉన్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో 15 ఏళ్ల తర్వాత ఎంసీడీ పీఠాన్ని బీజేపీ ఆప్కు అప్పగించబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 100 లోపు సీట్లకే పరిమితమవుతున్నట్లు తేలిపోయింది. చదవండి: ‘పని’కొచ్చే విద్య కావాలి! ఒక సబ్జెక్ట్లో బీటెక్.. సాఫ్ట్వేర్ జాబ్లో చేరిపోవడం! -
బీజేపీకి ఫేవర్గా ఎగ్జిట్ పోల్స్.. ఊహించిందే: ఆప్
అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు ఉప ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్పై రాజకీయ చర్చ నడుస్తోంది. ప్రధానంగా గుజరాత్ ఎన్నికలే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో తమకు ప్రతికూలంగా ఫలితాలు రావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయని పేర్కొన్నారాయన. ఓ జాతీయ మీడియా ఛానెల్తో ఆయన మాట్లాడుతూ.. ఆప్ ఓటర్లు మౌనంగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లు ఎగ్జిట్ పోల్ అంచనాకి చిక్కరు అంటూ కామెంట్ చేశారు. మరి.. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్కి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ కంటే ఉత్తమ ప్రదర్శనే ఆప్ చూపించబోతోంద’’ని చద్దా తెలిపారు. గుజరాత్లో ఆప్ కో-ఇన్ఛార్జిగా ఒక మాట చెప్పదల్చుకున్నా.. ఒక పార్టీ కొత్తగా ఒక రాష్ట్రంలో పోటీ చేస్తున్నప్పుడు ఇలా తక్కువ అంచనా వేయడం సహజమే. ఇలాగే ఢిల్లీలో 2013లో ఆప్ పోటీ చేసినప్పుడు.. మూడు, నాలుగు కంటే ఎక్కువ సీట్లు గెల్చుకోకపోవచ్చనే అంచనా వేశారు. కానీ, 28 సీట్లు గెల్చుకుంది కదా!. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయమైన ఓట్లను సాధించి గుజరాత్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు రాఘవ్ చద్దా. ఇదిలా ఉంటే.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో ఆప్ 90 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమంటూ ప్రకటించారు. ఇదీ చదవండి: మంచు కొండల్లో పోటాపోటీ! -
గుజరాత్, హిమాచల్లో సంచలన సర్వే ఫలితాలు
-
Gujarat Exit Poll Results: ప్రధాని రాష్ట్రంలో విరబూసిన కమలం, ఆప్ పరిస్థితేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్కంఠ రేపిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 182 శాసనసభ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 1న, డిసెంబర్ 5న రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయాయి. 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాషాయ పార్టీ తిరిగి ‘పవర్’పంచ్ విసరాలని తీవ్రంగా శ్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో మరింత శ్రద్ధ పెట్టారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఈసారి పరిస్థితులు ఎవరికి అనుకూలంగా మారుతాయో చెప్పలేని పరిస్థితి! ఈనేపథ్యంలో సోమవారం సాయత్రం విడుదలైన పలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు గుజరాత్లో బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఇక ప్రధాని సొంత రాష్ట్రంలో కీలక రాజకీయ మార్పులకు శ్రీకారం చుడతామని చెప్పుకున్న ఆప్ చతికిల పడింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గుజరాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2022 సంస్థ: రిపబ్లిక్ సంస్థ: జన్కీ బాత్ సర్వే సంస్థ: పీపుల్స్ పల్స్ -
సామాన్యుడిలా క్యూలో వెళ్లి ఓటేసిన మోదీ.. కాంగ్రెస్ విమర్శలు!
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయమే గాంధీనగర్ రాజ్భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రాణిప్ ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఒక సామాన్యుడిలా క్యూ లైన్లో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు వేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రోడ్ షో అంటూ.. కాంగ్రెస్ విమర్శలు అహ్మదాబాద్లో ఓటు వేసేందుకు వెళ్లిన ప్రధాని మోదీ.. పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలోనే కాన్వాయ్ని నిలిపేసి నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ప్రధానిని చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. వారికి అభివాదం చేసుకుంటూ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు మోదీ. ఓటు వేసి తిరిగి వెళ్లేప్పుడు సైతం అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రానికి ప్రధాని నడుచుకుంటూ వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మోదీ రోడ్ షో నిర్వహించారని ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం విచారకరమని విమర్శించింది. మరోవైపు.. ప్రధాని మోదీ, బీజేపీపై విమర్శలు గుప్పించారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఓటింగ్ సమయంలో రోడ్ షో లాంటి కార్యక్రమం చేపట్టడమేంటని ప్రశ్నించారు. వారు ప్రత్యేకమైన వ్యక్తులు అంటూ విమర్శించారు. ఎన్నికల రోజున రోడ్ షోలపై నిషేధం ఉంటుందని, కానీ వారు అందుకు మినహాయింపు అంటూ దుయ్యబట్టారు. PM #NarendraModi ji casted his vote,it's time for people of #Gujarat to caste thier vote for our bright future and coming generations!#GujaratElections2022 pic.twitter.com/pKyXMF2cc1 — Weisel🇮🇳 (@weiselaqua) December 5, 2022 ఇదీ చదవండి: Gujarat Assembly Elections 2022: మధ్యాహ్నం 3 గంటల వరకు 50శాతం ఓటింగ్ -
అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
-
గుజరాత్ ఎన్నికలు: తల్లి ఆశీస్సులు అందుకున్న మోదీ
అహ్మదాబాద్: గుజరాత్ రెండో(తుది) విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రమే ఆయన అహ్మదాబాద్కు వెళ్లారు. అయితే నేరుగా గాంధీనగర్ రైసన్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు. తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. సుమారు 45 నిమిషాలు అక్కడే గడిపారు. ఆపై గాంధీనగర్లోని బీజేపీ ఆఫీస్కు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్, ఇతర సీనియర్ నేతలు మోదీకి స్వాగతం పలికారు. అహ్మదాబాద్ రనిప్లోని ఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నారన్పూర్ ప్రాంతంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలోని కేంద్రంలో ఓటేయనున్నారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్ 1న 89 సీట్లకు తొలి విడతలో పోలింగ్ జరగ్గా 63.31శాతం పోలింగ్ నమోదైంది. ఇవాళ మిగిలిన 93స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON — ANI (@ANI) December 4, 2022 -
వడ్డీ రేట్లవైపు మార్కెట్ చూపు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లను ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ తీసుకోనున్న పరపతి నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయి. గత కొన్ని నెలలుగా ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపును బలపరుస్తోంది. ధరల అదుపునకే తొలి ప్రాధాన్యమిస్తూ కీలక రేటు రెపోను పెంచుతూ వస్తోంది. గత పాలసీ సమీక్షలో చేపట్టిన 0.5 శాతం పెంపుతో ప్రస్తుతం వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 5.9 శాతానికి చేరింది. తిరిగి ఈ నెల 5–7 మధ్య ఎంపీసీ పరపతి సమీక్షను నిర్వహించనుంది. ద్రవ్యోల్బణ కట్టడికి మరోసారి 0.25–0.35 శాతం స్థాయిలో రెపోను పెంచే వీలున్నట్లు అత్యధిక శాతం మంది బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఫలితాలపై కన్ను కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటి(5)తో పూర్తికానుంది. వీటితోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు 8న వెలువడనున్నాయి. 7న ఆర్బీఐ నిర్ణయాలు, 8న ఎన్నికల ఫలితాలు మార్కెట్ల దిశను నిర్ధారించవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు దీపక్ జసానీ పేర్కొంటున్నారు. ఇవికాకుండా విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం సెంటిమెంటుపై ప్రభావం చూపగలవని భావిస్తున్నారు. పెట్టుబడులు కీలకం రష్యా– ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో కొద్ది రోజులుగా ప్రపంచస్థాయిలో ధరలు అదుపు తప్పుతున్న సంగతి తెలిసిందే. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు తదితర కఠిన పరపతి విధానాలను అమలు చేస్తున్నాయి. దీంతో డాలరు బలపడుతుంటే దేశీ కరెన్సీ నేలచూపులు చూస్తోంది. అయితే ఇకపై ఫెడ్ వడ్డీ పెంపు వేగం మందగించవచ్చన్న అంచనాలతో ట్రెజరీ ఈల్డ్స్, డాలరు కొంతమేర వెనకడుగు వేస్తున్నాయి. మరోవైపు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్లకు కీలకంకానున్నాయి. ఇటీవల ఎఫ్పీఐలు అమ్మకాలను వీడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో దేశీ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను సాధిస్తున్న విషయం విదితమే. రికార్డుల వారం గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్లో పరుగు తీశాయి. సెన్సెక్స్ నికరంగా 575 పాయింట్లు బలపడి 62,869 వద్ద, నిఫ్టీ 183 పాయింట్లు పుంజుకుని 18,696 వద్ద స్థిరపడ్డాయి. గురువారం(1న) సెన్సెక్స్ 63,583, నిఫ్టీ 18,888 పాయింట్లను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాలను సాధించాయి. కాగా.. సమీప కాలంలో దేశీ మార్కెట్లకు ఆర్బీఐ, ఫెడ్ నిర్ణయాలు మార్గనిర్దేశం చేయనున్నట్లు శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు అపూర్వ షేత్, కొటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు అమోల్ అథవాలే, జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. -
Gujarat Assembly Elections 2022: ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్
అప్డేట్స్ ముగిసిన రెండో దశ పోలింగ్.. 60శాతానికిపైగా ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తుది విడతలో 60 శాతానికిపైగా ఓటింగ్ నమోదైనట్లు అంచనా. రెండు దశల్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. 04:00PM మధ్యాహ్నం 3 గంటల వరకు 50.51 శాతం ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.51 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సబర్కాంతా జిల్లాలో అత్యధికంగా 57.24 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. ఓటేసిన ప్రధాని మోదీ తల్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 100 ఏళ్ల హీరాబెన్ గాంధీనగర్లోని రాయ్సన్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. Prime Minister Narendra Modi's mother Heeraben Modi casts her vote for the second phase of #GujaratAssemblyPolls in Raysan Primary School, Gandhinagar pic.twitter.com/ZfWcBXWCfI — ANI (@ANI) December 5, 2022 01: 55PM మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం ఓటింగ్ గుజరాత్ శాసనసభ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మాజీ టీమిండియా క్రికెటర్ నయన్ మోంగియా.. వడోదరలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Former Indian Cricketer Nayan Mongia casts his vote for the second phase of #GujaratAssemblyPolls at a polling booth in Vadodara pic.twitter.com/S1zsIvaoMX — ANI (@ANI) December 5, 2022 12: 15PM ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. అహ్మదాబాద్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 10: 30AM ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. గాంధీనగర్లో అత్యధికంగా 7 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్, అహ్మదాబాద్లోని శిలాజ్ అనుపమ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 95లో ఓటు వేశారు. Ahmedabad | Uttar Pradesh Governor Anandiben Patel cast her vote for the second phase of #GujaratAssemblyPolls at Polling Booth 95, Shilaj Anupam School#GujaratAssemblyPolls pic.twitter.com/dC7Jk8UKBH — ANI (@ANI) December 5, 2022 09: 23AM ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ Cast my vote in Ahmedabad. Urging all those voting today to turnout in record numbers and vote. pic.twitter.com/m0X16uCtjA — Narendra Modi (@narendramodi) December 5, 2022 Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N — ANI (@ANI) December 5, 2022 08:56AM Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi leaves from Gandhinagar Raj Bhawan to cast his vote for the Gujarat Assembly elections at Nishan Public School, Ranip.#GujaratElections2022 pic.twitter.com/gt9Rmg2tes — ANI (@ANI) December 5, 2022 ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఓటేయడానికి పోలింగ్ స్టేషన్కు బయల్దేరారు. రానిప్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్ బూత్లో మోదీకి ఓటు.. గాంధీనగర్ నుంచి రానిప్కు బయల్దేరిన మోదీ 08:50AM కొనసాగుతున్న పోలింగ్ 08:00AM గుజరాత్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్య గుజరాత్లో బీజేపీ పట్టు కొనసాగుతున్నప్పటికీ ఆప్ నుంచి సవాళ్లు ఉత్తర గుజరాత్లో ఆప్ ఉనికి లేకపోయినప్పటికీ అధికార పార్టీకి ఎదురుగాలి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోదీ Urging all those who are voting in Phase 2 of the Gujarat elections, particularly the young voters and women voters to vote in large numbers. I will be casting my vote in Ahmedabad at around 9 AM. — Narendra Modi (@narendramodi) December 5, 2022 గుజరాత్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని. 14 జిల్లాల్లో 93 స్థానాలకు మధ్య, ఉత్తర గుజరాత్ల్లోని 14 జిల్లాల్లో 93 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 833 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, ఆప్ మొత్తం 93 స్థానాల్లో, కాంగ్రెస్ 90 చోట్ల, దాని మిత్రపక్షం ఎన్సీపీ మూడు స్థానాల్లో పోటీ పడుతున్నాయి. 255 మంది స్వతంత్రులూ బరిలో ఉన్నారు. 2.54 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 14,975 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. బరిలో ఉద్యమకారులు ఈ దఫా ఎన్నికల్లో కొన్ని హాట్ సీట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, ఠాకూర్ల ఆందోళనల నేత అల్పేశ్ ఠాకూర్ బీజేపీ తరఫున, దళిత సమస్యలపై గళమెత్తిన జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘాట్లోడియా స్థానం నుంచి పోటీ పడుతూ ఉంటే, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన హార్దిక్ పటేల్ వీరమ్గామ్ అల్పేష్ కుమార్ గాంధీనగర్–సౌత్ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక జిగ్నేష్ మేవానీ వద్గమ్ నుంచి మరోసారి పోటీకి దిగారు. బీజేపీకి కనీసం నాలుగైదు స్థానాల్లో రెబెల్ అభ్యర్థులు సవాల్ విసురుతున్నారు. వఘోడియా, పాద్రా, బయాద్, నాందోడ్లలో రెబెల్స్ పార్టీకి తలనొప్పిగా మారారు. 16 ముస్లిం ప్రాబల్యం స్థానాలు కీలకం అహ్మదాబాద్లోని ముస్లింల ప్రాబల్యం ఉన్న 16 స్థానాలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. వీటిలో నాలుగు స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల్ని నిలబెట్టడంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. గుజరాత్ మతఘర్షణలో అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో దోషుల్ని శిక్షాకాలం కాక ముందే విడుదల చేయడం కూడా అధికార పార్టీకి మైనస్గా మారింది. దీంతో ఓట్లు చీలిపోయి ఎవరికి లబ్ధి చేకూరుతుందా అన్న ఆందోళన కమలనాథుల్లో ఉంది. గుజరాత్ మోడల్ పాలనతో అత్యధిక ప్రయోజనం పొందిన అహ్మదాబాద్ దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్ జిల్లాలో అయిదు స్థానాలు దక్కించుకోవడం, పట్టణ ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడడం బీజేపీకి సవాల్గా మారాయి. అందుకే ప్రచారంలో ప్రధాని మోదీ అహ్మదాబాద్లో వరసగా రెండు రోడ్ షోలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఓటుపై ఉదాసీనత డిసెంబర్ 1న జరిగిన తొలి దశ పోలింగ్లో ఓటు వెయ్యడానికి ప్రజల్లో ఒక రకమైన ఉదాసీనత కనిపించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన సూరత్, రాజ్కోట్, జామ్నగర్లలో ఓటింగ్ అత్యంత స్వల్పంగా జరిగింది. మొత్తమ్మీద 63.3% పోలింగ్ నమోదైంది. పట్టణాలకు, గ్రామాలకి మధ్య పోలింగ్లో 35% వరకు తేడా ఉంది. అహ్మాదాబాద్, ఆనంద్, వడోదరా, గాంధీనగర్, గోధ్రా వంటి నగరాల్లో రెండో దశ పోలింగ్ ఉండడంతో ఓటర్లు ఉదాసీనంగా వ్యవహరించవద్దని, తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఓటర్లందరూ ముందుకు రావాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం అహ్మాదాబాద్లో ఓటు వేయనున్నారు. -
Gujarat Assembly Election 2022: గుజరాత్లో ప్రచారానికి తెర
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో, తుది దశ ప్రచారానికి శనివారం తెరపడింది. రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు 5న పోలింగ్ జరగనుంది. 833 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అయితే ప్రచారంలో బీజేపీ, ఆప్తో కాంగ్రెస్ పోటీ పడలేకపోయింది. అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఒక్కరే ప్రచార భారం మోశారు. మోదీ.. అన్నీ తానై రాష్ట్రంలో బీజేపీ 27 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించే బాధ్యతను ప్రధాని మోదీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 31 ర్యాలీలు, 3 నగరాల్లో అతి పెద్ద రోడ్ షోలతో సుడిగాలి ప్రచారం చేశారు. అహ్మదాబాద్లో గురువారం ఆయన రోడ్ షో దేశంలోనే అతి పెద్దదిగా చరిత్ర సృష్టించింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాలను మీదుగా 50 కి.మీ. వరకు ఈ రోడ్ షో సాగింది. నాలుగు గంటల సేపు సాగిన ఈ రోడ్ షోకి జనం పోటెత్తారు. రోడ్డుకిరువైపులా కిలో మీటర్ల మేర 10 లక్షల మంది వరకు నిల్చొని మోదీకి జన నీరాజనం సమర్పించారని బీజేపీ చెప్పుకుంటోంది. ప్రధాని ఏ సభకు వెళ్లినా మోదీ, మోదీ, మోదీ అంటూ యువత ఉత్సాహంగా కేకలు వేయడం కనిపించింది. ప్రచారంలో మోదీ ప్రధానంగా గుజరాత్ ఆత్మగౌరవ నినాదాన్ని, తమ పార్టీ చేస్తున్న అభివృద్ధినే ప్రస్తావించారు. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎక్కడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. ఆప్ పేరు తీసుకురాకుండా ఆ పార్టీ ఇచ్చే ఉచిత పథకాలను మోదీ ఎక్కడికక్కడ ఎండగట్టారు. ఉచితానికి, సంక్షేమానికి మధ్య తేడా తెలుసుకోవాలంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చురకలంటించారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ప్రచారం నిర్వహించారు. ఇక ఆప్ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. 30కిపైగా ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొని ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ప్రతీ చోటా ఉచిత విద్యుత్ పథకాన్నే ఎక్కువగా ప్రస్తావించారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎదుగుతామని ఆప్ ధీమాగా ఉంది. కాగా గుజరాత్ ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి. అది కాంగ్రెస్ ఢూండో యాత్ర: స్మృతీ భారత్ జోడో యాత్ర నిజానికి కాంగ్రెస్ ఢూండో (అన్వేషణ) యాత్ర అంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. గుజరాత్లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. 8న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలొచ్చాక కాంగ్రెస్ ఢూండో యాత్ర మొదలవుతుందని జోస్యం చెప్పారు. -
ఛాయ్ అమ్మిన... గుజరాత్ గట్టిన...
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రెండంత్రాల బంగ్లల బేతా లుడు ఉంటున్నడు. విక్రమార్కుడు మోటరాపిండు. హారన్ గొట్టిండు. బేతాలుడు ఇంట్లకెల్లి ఇవుతలి కొచ్చిండు. మోటరెక్కి ఎన్క సీట్ల ఆరాంగ గూసుండు. విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. గప్పుడు బేతాలుడు – ‘ఎండలు మండుతున్నా. వానలు దంచిగొడ్తున్నా, సలి ఒక్క తీర్గ వొన్కిస్తున్నా తాతీల్ దీస్కోకుంట దినాం మోటర్ దీస్కోని వొస్తవు. ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పు తవు. ఏ బర్రెన్న నీ మోటర్కు అడ్డం రావొచ్చు. ఎంటిక మందంల టక్కర్ దప్పొచ్చు. నువ్వు ఎంత హారన్ గొట్టినా ఎవడన్న సైడియ్యక పోవచ్చు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు యాస్ట రావొచ్చు. యాస్ట మర్సెతందుకు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను’’ ‘‘చెప్పెతందుకు నువ్వుంటె ఇనెతందుకే నేనున్నా’’ అని విక్రమార్కుడు అన్నడు. ‘‘గుజరాత్ అసెంబ్లి ఎలచ్చన్లు అయితున్నయి. గా రాస్ట్రంల ఇర్వై ఏడేండ్ల సంది బీజేపీ సర్కారే ఉన్నది. ఇంతకుముందు గుజరాత్ల కాంగ్రెస్, బీజేపీ నడ్మనే పోటీ ఉండేది’’ అన్కుంట బేతాలుడు ఇంకేమో జెప్పబోతుంటె – ‘‘గిప్పుడు కొట్లాడ్త లెవ్వా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘నన్ను చిడాయించెతంద్కు నువ్వు గిసువంటి సవాల్లు అడ్గుతుంటవని నాకెర్క లేదనుకుంటున్నవా? గిప్పుడు సుత కొట్లాడ్తున్నయి. గుజరాత్లనే గాకుంట దేసంలున్న అన్ని రాస్ట్రా లల్ల ఎప్పటి సందో బీజేపీ, కాంగ్రెస్లు ఎలచ్చన్ల కొట్లాడ్తనే ఉన్నయి. గీపారి గుజరాత్ అసెంబ్లి ఎలచ్చన్ల దంగలకు చీపిరి కట్ట బట్కోని ఆప్ దిగింది.’’ ‘‘రొండు పెద్ద పార్టిల నడ్మల చిన్న పార్టి ఆప్ నెగులుకొస్తదా?’’ ‘‘ఎంత చెత్త ఉన్నా ఊకేది చీపిరితోనే. గా రొండు పార్టీలను మా చీపిరితోని ఊకి పారేస్తం. ఢిల్లిల గా రొండు పార్టీల మా చీపిరి తోని ఊకినం. పంజాబ్ల సుత ఊకి పారేసినం. గుజరాత్లో గుడ్క ఊకి పారేస్తం. ఆప్ సర్కార్ దెస్తం అని కేజ్రీవాల్ అన్నడు. అనుడే గాకుంట ఒక కాయితం మీద రాసిచ్చిండు.’’ ‘‘గుజరాత్ల ఆప్కు గెల్సేంత బలమున్నదా?’’ ‘‘బలం లేదు గని మా సర్కార్ గినొస్తె సర్కార్ జీతగాల్ల జీతాలు బెంచుతం. ఫిరీగ కరెంటు ఇస్తం. పాత పింఛను విదానం దెస్తం. రోగాలు గినొస్తె దవకాన్ల ఫిరీగ ఇలాజ్ జేపిస్తం అసువంటి వాగ్దానాలు ఆప్ జేసింది. గంతేగాకుంట చీపిరికట్ట బట్టుకోని కేజ్రీవాల్ గుజరాత్ అంత ఒక్క తీర్గ తిర్గిండు. ఊర్లల్ల కాంగ్రెస్కు బలముంటె పట్నాలల్ల బీజేపీకి బలమున్నది. వైసు పోరగాల్లు, పోరిలు ఆప్ అంటె ఇస్టంతోని ఉన్నరని అంటున్నరు.’’ ‘‘కాంగ్రెస్ సంగతేంది?’’ ‘‘ఒకప్పుడు గుజరాత్ల కాంగ్రెస్ సర్కారే ఉండేది. శాన ఏండ్ల సంది మల్ల గా రాస్ట్రంల గెల్సెతంద్కు కాంగ్రెస్ ఒక్క తీర్గ కోషిస్ జేస్తున్నది. మెల్లమెల్లగ సీట్లు పెంచుకొంటున్నది. గుజరాత్ల మొత్తం 182 సీట్లు ఉన్నయి. 2002ల బీజేపీకి 127 సీట్లు వొచ్చినయి. గని 2007ల 117కు, 2012ల 115కు, 2017ల 99 సీట్లకు పడిపోయినయి. బీజేపీకి సీట్లు తక్వ అయితుంటె కాంగ్రెస్కు సీట్లు పెర్గినయి. ఎలచ్చన్లు రాంగనే ప్రతాని మోది సెంటిమెంట్ రాజేస్తుండు. గిప్పుడు గాయినకు గా మోక ఇయ్యొద్దని కాంగ్రెస్ అనుకున్నది. భారత్ జోడో యాత్రల రాహుల్ గాంది ఉన్నడు. గాయిన గుజరాత్ల ఊకూకె ప్రచారం జేస్తలేదు. ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ సి.ఎం. అశోక్ గెహ్లత్ కాంగ్రెస్ దిక్కు కెల్లి ప్రచారం జేస్తున్నరు. ‘మున్సిపల్ కార్పొరేషన్ ఎలచ్చన్లు వొచ్చినా మోది ప్రచారం జేస్తడు. అసెంబ్లి ఎలచ్చన్లు వొచ్చినా ప్రచారం జేస్తడు. రావనాసురుని లెక్క ప్రతానికి పది తల్కా యలున్నయి. గుజరాత్ల చిన్నప్పుడు ఒక రేల్టేషన్ల ఛాయ్ అమ్మిన అని మోది జెప్పిండు. గని గాయిన ఛాయ్ అమ్మిన అని జెప్తున్న జమాన్ల గాడ రేల్టేషనే లేదు. లేని రేల్టేషన్ల మోది ఛాయ్ ఎట్ల అమ్మిండు’ అని ఖర్గే అడిగిండు.’’ ‘‘బీజేపీ ప్రచారం ఎట్ల జేసింది?’’ ‘‘అమిత్ షా మాట్లాడుకుంట గోద్రా అల్లర్లు గుర్తు జేసిండు. మల్ల బీజేపీ వస్తెనే గుజరాత్ల ఎసు వంటి కొట్లాటలు ఉండయని జెప్పిండు. ఉత్తరప్రదేశ్ ముక్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు దెస్తనని జెప్పిండు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఖిలాప్ కొట్లాడిన నర్మదా బచావో లీడర్ మేథాపాట్కర్ రాహుల్ గాందితోని గల్సి భారత్ జోడో యాత్రల నడ్సింది. గుజరాత్ రాస్ట్రం రాకముందు గుజరాతీలు, మహారాష్ట్రుల నడ్మ కాంగ్రెస్ కొట్లాటలు బెట్టింది. మేము గసుంటోల్లం గాదు. జై శ్రీరాం అంటం. కార్పరేట్ సంస్థలకు పెద్ద పీట ఏస్తం. నేను తినను. ఎవ్వర్ని తిననియ్యను. శాన పెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మ బెట్టి పిచ్చిన. ‘గుజరాత్నంత మీరే గడ్తె కూలిన మోర్బీ ఫూల్ గుడ్క మీరే గట్టిండ్రా?’ అని అడిగితె మోదీ ఏమన్నడు? గీ సవాల్కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్కు టక్కరైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘మోర్బీ ఫూల్ నేను గట్టలేదు. కూలోల్లు గట్టిండ్రు అని మోదీ అన్నడు’’ అని విక్రమార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంట్లకు బోయిండు. (క్లిక్ చేయండి: కలిసి ఏడుద్దాం – నా కల నిజం చేద్దాం) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: ‘‘ఆటంక్, లట్కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు. గతంలో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతికి ఆస్కారమున్న పనులు తప్ప ప్రజలకు మంచి చేసే పనులు చేయలేదని ఆరోపించారు. మోదీ శుక్రవారం గుజరాత్లో బనస్కంతా జిల్లా కాంక్రేజ్ గ్రామంలో ఎన్నికల సభలో ప్రసంగించారు. కరువు పీడిత ప్రాంతాలకు నర్మదా జలాలను తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. పేదలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవు కాంగ్రెస్ పాలనలో దేశంలో మధ్యలో వదిలేసిన 99 తాగునీటి సరఫరా పథకాలను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 4 లక్షల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేశామన్నారు. అవినీతి అడ్డుకోవడం కొందరికి నచ్చడం లేదని, అందుకే తనను దూషిస్తున్నారని వ్యాఖ్యానించారు. పేద ప్రజలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసి దొరికిపోయినవారు తనను తిడుతున్నారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోబీజేపీ మరోసారి విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. కాంక్రేజ్లోని ఔగర్నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నేతల బానిస మనస్తత్వం స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలకులతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ నేతలు బానిస మనస్తత్వాన్ని అలవర్చుకున్నారని మోదీ చెప్పారు. బ్రిటిషర్ల చెడు అలవాట్లను కాంగ్రెస్ నాయకులు నేర్చుకున్నారని తెలిపారు. ఆనంద్ జిల్లాలోని సోజిత్రా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ సమస్య కేవలం సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ మాత్రమే కాదని, దేశ ఐక్యత కూడా అని చెప్పారు. విభజించు, పాలించు అనే విధానంపైనే కాంగ్రెస్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయన్నారు. ప్రజలందరినీ ఏకం చేయాలని సర్దార్ పటేల్ భావించారని, అందుకే ఆయనంటే కాంగ్రెస్కు గిట్టదని పేర్కొన్నారు. బీజేపీ విజయాన్ని ఒప్పుకున్న కాంగ్రెస్ గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ట్యాంపరింగ్ చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. ‘‘ఓటమి తప్పదని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. అందుకే ఈవీఎంలపై నిందలు మోపుతోంది. తద్వారా బీజేపీ విజయాన్ని పరోక్షంగా అంగీకరించింది’’ అని అన్నారు. ఆయన ఉత్తర గుజరాత్లోని పఠాన్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు మోదీని తిట్టడం, ఎన్నికలయ్యాక ఈవీఎంలను నిందించడం.. కాంగ్రెస్కు తెలిసింది ఈ రెండు విషయాలేనని ఎద్దేవా చేశారు. దేశంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు దక్కాల్సిన సొమ్మును దోచుకున్నాయని దుయ్యబట్టారు. ధనికుల, పేదల మధ్య అంతరాలు పెంచిన ఘనత కాంగ్రెస్దేనని ధ్వజమెత్తారు. -
Gujarat Assembly Election 2022: ఎవరి దశ తిరుగుతుంది?
గుజరాత్ మొదటి దశ పోలింగ్ ముగిసింది. రెండో దశలో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. గుజరాత్ మోడల్ పాలనతో సెంట్రల్ గుజరాత్ అభివృద్ధిలో దూసుకుపోయింది. అధికార పార్టీకి అడ్డాగా మారింది. ఉత్తర గుజరాత్ పలు రకాల సమస్యలతో బీజేపీకి సవాళ్లు విసురుతోంది. మధ్య గుజరాత్లో కాంగ్రెస్ హవా తగ్గిపోతే, ఉత్తరాన ఆప్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ రెండు పార్టీల మధ్యే పోరు నెలకొంది. ఈ దశలో ఏ పార్టీ పట్టు బిగిస్తుంది ? గుజరాత్ రెండో దశ పోలింగ్ ఈ నెల 5న మొత్తం 93 స్థానాలకు జరగనుంది. మధ్య గుజరాత్లో 61 అసెంబ్లీ స్థానాలకు, ఉత్తర గుజరాత్లో 32 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. మధ్య గుజరాత్లో ఆదివాసీలు, నగరీకరణ జరిగిన ప్రాంతాలతో నిండి ఉంది. మొత్తం ఎనిమిది జిల్లాల్లో అహ్మదాబాద్, వడోదరా, ఖేదాలో కొన్ని ప్రాంతాలు, ఎస్టీల ప్రాబల్యం కగిలిన పంచ్మహల్ జిల్లాల్లో బీజేపికి పట్టు ఉంటే, మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఎస్టీ ప్రాంతాల్లో ఎదురొడ్డుతున్న కాంగ్రెస్ గిరిజన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది.ఈ సారి ఎన్నికలకి కాస్త ముందు కాంగ్రెస్లో ప్రముఖ ఎస్టీ నాయకుడు, ఛోటా ఉదేపూర్ నియోజకవర్గం నుంచి 10సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్సిన్హ్ రథ్వా బీజేపీలో చేరడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా మారింది. మోహన్ సిన్హాకున్న మంచిపేరు వల్ల మహిసాగర్, దాహోద్ జిల్లాల్లో ఓటర్లు బీజేపీకి మద్దతుగా ఉండే అవకాశాలున్నాయని బరోడా యూనివర్సిటీ ప్రొఫెసర్ అమిత్ ధోలకియా అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న క్షత్రియ, హరిజన, ఆదివాసీ, ముస్లిం (ఖామ్) సామాజిక వర్గం ఓట్లు కూడా ఈ సారి గంపగుత్తగా ఆ పార్టీకి వచ్చే అవకాశాల్లేవని, ఆ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర త్రివేది వ్యాఖ్యానించారు.ఈ ప్రాంతంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ వైపే ఓటర్లు చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్ మోడల్ పాలనతో బాగా లబ్ధి పొందిన పట్టణాలు, నగరాల్లో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలి బీజేపీ లాభపడే అవకాశాలైతే ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో కాంగ్రెస్ కంటే ఆప్ పట్టు పెంచుకుంది. మొత్తమ్మీద మధ్య గుజరాత్ మరోసారి బీజేపీకే జై కొట్టే అవకాశాలున్నాయి. ఉత్తరాన బీజేపీకి సవాళ్లు ఈ ప్రాంతంలో చిన్ని చిన్న పట్టణాలు ఎక్కువగా ఉన్నాయి. చిరు వ్యాపారులు కరోనాతో భారీగా నష్టపోవడంతో పాటు నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. అధిక ధరలతో సామాన్యులకు బతుకు భారంగా మారింది. ఇవన్నీ బీజేపీకి సవాళ్లుగా మారాయి. ఈ ప్రాంతంలో సామాజిక సమీకరణలు కూడా బీజేపీకి అంతగా అనుకూలంగా లేవు. ఠాకూర్ల ప్రాబల్యం అధికం. వీరంతా మొదట్నుంచి కాంగ్రెస్కే మద్దతుగా ఉన్నారు. పటేళ్లు, ఠాకూర్లు చెరో పార్టీకి మద్దతునివ్వడం ఆనవాయితీగా మారిపోయింది. దళితులు, ముస్లింలు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారు మొదట్నుంచి బీజేపీ వెంట లేకపోవడం పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. ఈ ప్రాంతం ఉద్యమాల ఖిల్లాగా కూడా పేరు పడింది. హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటీదార్ ఆందోళన, అల్పేశ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఠాకూర్ల ఆందోళన, జిగ్నేష్ మేవానీ నేతృత్వంలో దళితుల ఆందోళనలు ఇక్కడ ఉధృతంగా జరిగాయి. అధికార పార్టీపై ఆ ఉద్యమాల ప్రభావం ఇంకా ఉండడం కమలనాథుల్ని కలవరపెడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్లో మళ్లీ కమల వికాసం?
రెండు విడతలుగా జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ముగిసింది. భారతీయ జనతా పార్టీ 27 ఏళ్లుగా ఓటమి అన్నది లేకుండా ఈ రాష్ట్రాన్ని పాలిస్తోంది. అయితే మోర్బీ వంతెన దుర్ఘటన ఆ పార్టీని దెబ్బకొట్టింది. అయినా కాంగ్రెస్ దీన్నుంచి లాభపడే సూచనలు లేవు. త్రిముఖ పోటీకి కారణమైన ఆమ్ ఆద్మీ పార్టీకి పడే ఓట్లు కాంగ్రెస్కు పడాల్సిన ఓట్ల నుంచే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో బీజేపీకి జరిగే నష్టం పూడుతుందని అంచనా. పైగా గుజరాత్ అస్తిత్వాన్ని బీజేపీ లేవనెత్తుతోంది. వీటన్నింటినీ కలిపి చూస్తే ఈసారి కూడా గుజరాత్లో బీజేపీకి ఢోకా లేదనే చెప్పాలి. రెండో స్థానంలో ఏ పార్టీ నిలుస్తుందన్నది మాత్రం అప్పుడే చెప్పలేం. గుజరాత్ ఎన్నికలంటే సహజంగానే సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఒకప్పటి ముఖ్య మంత్రిగా నరేంద్ర మోదీ అభివృద్ధి మోడల్కు కేంద్రబిందువు కావడం దీనికి ఒక కారణం. అయితే మోర్బీలో ఇటీవలే ఓ తీగల వంతెన కూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోవడం మాత్రం ఆ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బే వేసింది. కాషాయ పార్టీ విజయపరంపరకు అడ్డుకట్ట వేయగలిగిన స్థాయి ప్రమాదం ఇది. అయినప్పటికీ మోర్బీ ఘటన సహాయక చర్యల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోవడం, పార్టీ అధినాయకత్వం రాహుల్గాంధీ తాలూకూ ‘భారత్ జోడో యాత్ర’పైనే ఎక్కువగా దృష్టి పెట్టడం... ఆ పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ల మధ్యే జరుగు తున్నాయి. ప్రధాన పార్టీలు వీడి కొందరు కొత్త పార్టీలను ఏర్పాటు చేసినప్పటికీ వారు తమ సత్తాను నిరూపించుకోలేక మళ్లీ మాతృ పార్టీల్లో విలీనమైపోయారు. అయితే ఈసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృ త్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాత్రం కొంత భిన్నంగా కనిపి స్తోంది. 2021 నాటి గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో తమదైన ముద్ర వేసిన ఆప్ ఇప్పుడు అసెంబ్లీకి పోటీ పడుతోంది. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యమవుతోంది. అందుకే ఈసారి ఎన్నికలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్ 2017లో సాధించిన ఓట్లు, ఆప్కు ప్రజల నుంచి వస్తున్న మద్దతులను కూడా పరిగణన లోకి తీసుకుని ఈ ఎన్నికలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణ... 2017లో గుజరాత్ అసెంబ్లీకి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరే జరిగింది. పాటీదార్ల రిజర్వేషన్లపై భారతీయ జనతా పార్టీ తీవ్ర వ్యతి రేకతను ఎదుర్కోవడం, చిన్న వ్యాపారులకు జీఎస్టీ అంతగా రుచిం చకపోవడం కూడా బీజేపీకి ఏమాత్రం అనుకూలించని పరిణామ మైంది. దాంతో మెజారిటీకి కేవలం ఏడు సీట్లు మాత్రమే ఎక్కువ సాధించి బీజేపీ గట్టెక్కింది. 2012 నాటి ఎన్నికలతో పోలిస్తే 16 సీట్లు తక్కువ కావడం గమనార్హం. అయినప్పటికీ ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఒక శాతం పెరిగాయి. బీజేపీ గెలిచిన సీట్లలో దాదాపు ముప్పై వేల మెజారిటీ సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ గెలిచిన సీట్లలో మార్జిన్ 13 వేలు మాత్రమే. అయితే బీజేపీకి లాభించిన అంశం ఒకటుంది. అన్ని స్థాయులు, వర్గాలు, ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించ గలి గింది. నగర ప్రాంతాల్లోని మొత్తం 56 స్థానాల్లో బీజేపీకి 58 శాతం ఓట్లతో 46 స్థానాలు దక్కాయి. మొత్తం 182 స్థానాల్లో కాంగ్రెస్ 2012 నాటి ఎన్నికల కంటే 12 సీట్లు అదనంగా 77 స్థానాలు సాధించగలిగింది. భౌగోళిక ప్రాంతాల ఆధారంగా విశ్లేషిస్తే బీజేపీ ఉత్తర, దక్షిణ గుజరాత్, కచ్ ప్రాంతాల్లో ఒక్కో స్థానాన్ని కోల్పోగా... మధ్య గుజ రాత్లో రెండుస్థానాలు కోల్పోయింది. కానీ తనకు బాగా పట్టున్న సౌరాష్ట్రలో ఏకంగా 11 స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. సౌరాష్ట్ర లోనే కాంగ్రెస్ గత ఎన్నికల కంటే 13 స్థానాలు ఎక్కువ సాధించడం గమనార్హం. అలాగే పాటీదార్ల ఓట్లు 20 శాతం కంటే ఎక్కువున్న నియోజకవర్గాలు యాభై రెండింటిలో కాంగ్రెస్ 23 స్థానాలు గెలుచు కుంది. తద్వారా గిరిజన వర్గాలకు ప్రధాన పార్టీగా మారింది. గిరిజను లకు కేటాయించిన 27 స్థానాల్లో 17 కాంగ్రెస్ పార్టీనే దక్కించుకోవడం ఇందుకు నిదర్శనం. బీజేపీ విషయానికి వస్తే... 2017 ఎన్నికల్లో ఈ పార్టీ కాంగ్రెస్ కంటే ఎనిమిది శాతం ఎక్కువ ఓట్లు సాధించడం ద్వారా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 2019 నాటి లోక్సభ ఎన్నికల్లో ఉన్న 26 పార్లమెంట్ స్థానాలన్నింటినీ గెలుచుకోవడం ఇంకో విశేషం. ఈసారి కూడా ఇదే రకంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించ వచ్చు. కాకపోతే నాలుగు నుంచి ఆరు శాతం ఓట్లు కోల్పోయే అవ కాశం మాత్రం సుస్పష్టం. పాతికేళ్లకుపైగా అధికారంలో ఉండటం, రాజకీయ స్తబ్ధత తదితరాలు ఇందుకు కారణాలవుతాయి. అయితే ఓట్ల శాతం తగ్గినా సీట్లు మాత్రం పెద్దగా నష్టపోయే అవకాశం లేదు. ఆప్ సాధించే ఓట్ల కారణంగా బీజేపీకి జరిగిన నష్టం పూడుతుందని అంచనా. ఎన్నికల ముందు నాటి అంచనాల ప్రకారం ఆప్ పార్టీకి సుమారు పది శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. ఈ పార్టీకి పడే ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడాల్సిన ఓట్ల నుంచే ఎక్కువగా ఉంటాయని అంచనా. అంతిమంగా ఇది బీజేపీకి లాభిస్తుంది. బీజేపీని ఇబ్బంది పెట్టే అంశాలు... గుజరాత్లో పార్టీల మధ్య పోటీ ఈసారి వినూత్నంగా ఉంది. ఎన్నికల ప్రచార వ్యూహాలు, ఓటర్లను భారీ ఎత్తున తరలించడాల్లోనూ మార్పు స్పష్టం. ఆప్ రాక ఓటర్లకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. పార్టీలకు పడే ఓట్ల తీరులో మార్పులకు ఇది కారణమవుతోంది. ఫలి తంగా ఓట్లు సీట్లుగా మార్చుకోవడమెలా అన్న లెక్కలు సంక్లిష్టమవు తాయి. మెగా ర్యాలీలు, మోదీ తదితర అగ్రనేతల రోడ్ షోలతో బీజేపీ సంప్రదాయ శైలిలో ప్రచారం చేస్తూంటే... స్థానిక నేతలు ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆర్థిక వనరుల లేమి కారణంగా కాంగ్రెస్, ఆప్ ఎక్కడికక్కడ చిన్న స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ఓట్లు అడుగుతున్నాయి. కాంగ్రెస్ కూడా ఆర్భాటమైన ప్రచారానికి బదులుగా నిశ్శబ్దంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, ఆప్ లేవనెత్తిన అంశాల్లో మోర్బీ తీగల వంతెన ప్రమాదం ఒకటి. దీంతోపాటు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కావడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామ కాలు వాయిదా పడుతూండటం, బిల్కిస్ బానో కేసులో దోషుల శిక్ష తగ్గింపు వంటివి ఉన్నాయి. రైతుల సమస్యలు, భూసేకరణ అంశాలు, విద్యుత్తు ధరల మోత, విద్య, ఆరోగ్య సౌకర్యాల లేమి, అధ్వాన్నమైన రోడ్లు వంటివి కూడా ప్రతి పక్షాల అస్త్రాలుగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ అమలును ఆప్ తన ఎన్నికల వాగ్దా నాల్లో చేర్చింది. విద్యుత్తు బిల్లుల్లో రాయితీ, ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను మెరుగు పరచడం వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటి ప్రభావం ఓటర్లపై ఎంత ఉంటుందన్నది చూడాల్సిన అంశం. ‘ఈ గుజరాత్ను మేము సాధించాం’ అన్న స్లోగన్తో నరేంద్ర మోదీ ప్రచారం చేస్తూం డటం, గుజరాత్ అస్తిత్వాన్ని ప్రస్తావించడం బీజేపీకి అనుకూలంగా మారనున్నాయి. గత 30 ఏళ్లలో కాషాయ పార్టీ గుజరాత్లో చేపట్టిన కార్యక్రమాలను మోదీ ఏకరవు పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ విస్తరించిన తీరును, తద్వారా పౌరులకు జరుగుతున్న లాభాలను ప్రస్తావిస్తున్నారు. నర్మద రిజర్వాయర్ ప్రాజెక్టును ఆలస్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్న ఆరోపణనూ ఆయన గుర్తు చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రతిపక్షాల పాలనలో ఉగ్రవాద దాడులు పెరగడం వంటివీ ప్రస్తావిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే... గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల కంటే బీజేపీ ఎన్నో మైళ్ల ముందంజలో ఉందని చెప్పాలి. మోదీ కరిష్మా, ఆయన సొంత రాష్ట్రం కావడం, దేశ రాజకీయ నేతల్లో అత్యంత ప్రభావశీలి కావడం బీజేపీకి సానుకూలంగా మారను న్నాయి. రాజకీయ కప్పదాట్ల పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీపై ఓటర్లకు నమ్మకం పోయింది. గత ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన స్టార్ ప్రచారకర్త రాహుల్గాంధీ ఈసారి పరిమిత స్థాయి ప్రచారం మాత్రమే నిర్వహించడం స్థానిక కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తిని మిగిల్చింది. త్రిముఖ పోటీతో బీజేపీయేతర పార్టీల ఓట్లు నిలువుగా చీలను న్నాయి. కేజ్రీవాల్ వ్యూహాత్మక ప్రచారం కాంగ్రెస్ ఓట్లకు గండికొట్ట నుంది. వీటన్నింటినీ కలిపి చూస్తే ఈసారి కూడా గుజరాత్లో భార తీయ జనతా పార్టీకి ఢోకా లేదనే చెప్పాలి. రెండో స్థానంలో ఏ పార్టీ నిలుస్తుందన్న అంశాన్ని మాత్రం ప్రస్తుతానికి లెక్క వేయలేము. ప్రవీణ్ రాయ్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు,సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
గుజరాత్లో టెంపుల్ రన్..మోదీ.. టాప్ రన్నర్!
ఓటర్ల కంటే ముందు దేవుడికి పూజలు గుజరాత్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా అసలు దేవుడి కరుణా కటాక్షాలూ ఉండాలి. అదేంటీ ఓట్లేసేది ప్రజలు కదా అనుకుంటున్నారా? ఆ ప్రజలతో పాటు దేవుడు కూడా ఆశీస్సులు అందించాలి. అందుకే ఎన్నికల వేళ ఆలయాల సందర్శన పెరిగిపోయింది. మోదీ.. టాప్ రన్నర్ ఈ రేసులో ముందంజలో ఉన్నారు ప్రధాని నరేంద్రమోదీ. గుజరాత్ వీడి ఎనిమిదేళ్లు కావస్తోన్నా ఇప్పటికీ గుజరాత్ లో నరేంద్ర మోదీయే స్టార్ క్యాంపెయినర్. గుజరాత్ ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలిచిందంటే అది మనం తయారు చేసుకున్నదే.. యావద్దేశాన్నీ ఇపుడు గుజరాత్ లా మార్చేద్దాం అన్న నినాదంతో నరేంద్ర మోదీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుళ్లూ గోపురాలు చుట్టుముట్టేస్తూ మనం తయారు చేసుకున్న గుజరాత్ ను మనమే కాపాడుకోవాలని నినదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా దూసుకుపోతున్నారు. ప్రజలకు ఓ దండం పెడుతూనే మరో వైపు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ దేవుళ్లకీ దండాలు పెట్టేస్తున్నారు ప్రధాని మోదీ. మొన్నటికి మొన్ననే సోమనాథ్ దేవాలయంలో మడికట్టేసుకుని చాలా ఓపిగ్గా పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండున్నరేళ్లపాటు వ్యవహరించిన నరేంద్ర మోదీ అక్కడి నుండి నేరుగా ప్రధాని పీఠం అధిరోహించడానికి ఢిల్లీ వచ్చేశారు. అందుకే సోమనాథ్ ఆలయమంటే మోదీకి చాలా ఇష్టం. ప్రతిపక్షాలది అదే దారి బీజేపీ ఆధ్యాత్మికతను ఎన్నికల ప్రచారంతో మిక్స్ చేస్తుంది కాబట్టి తాను కూడా అదే చేయాలని కేజ్రీవాల్ ఫిక్స్ అయిపోయారు. అందుకే ఆ మధ్య కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు చిత్రీకరించి చెలామణీలోకి తీసుకురావాలని విచిత్ర డిమాండ్ చేశారు కేజ్రీవాల్. దీనర్ధం ఏంటంటే దేవుళ్లు బీజేపీకే కాదు మాకూ చుట్టాలేనని కేజ్రీవాల్ చెప్పదలుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ తరపున పాదయాత్ర చేస్తోన్న రాహుల్ గాంధీ కూడా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్న రాహుల్ అక్కడే పూజలు చేసి గుజరాత్ ఓటర్లకు సంకేతాలిస్తున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Gujarat Assembly Elections: ఏ మ్యానిఫెస్టోలో ఏముంది?
ఇవ్వాళ (డిసెంబర్ 1) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తొలి దశ జరిగింది. ఈ నెల 5వ తేదీ (సోమవారం) రెండో దశ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న (గురువారం) ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది? మ్యానిఫెస్టోలో ఏం పెట్టింది? బీజేపీ ఏం హామీలిస్తోంది? కంచుకోట గుజరాత్లో వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న కమలం పార్టీ.. ఓటర్లపై వరాల జల్లు కురిపించింది. బీజేపీ అధికారంలోకి రాగానే.. యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామంటున్నారు పార్టీ అధ్యక్షుడు నడ్డా. ఈ విషయంపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గుజరాతీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు జేపీ నడ్డా. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉగ్రవాదం, తీవ్రవాద భావజాలాన్ని నిర్మూలించేందుకు.. యాంటీ ర్యాడికల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు జేపీ నడ్డా. హస్తం పార్టీ ఏం హామీ ఇస్తోంది? గుజరాత్లో అధికారంలోకి వస్తే మోదీ స్టేడియం పేరు మారుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్టేడియానికి సర్దాల్ పటేల్ పేరు పెడతామని ప్రకటించింది. 3 లక్షలవరకు రైతు రుణ మాఫీ.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీలు ఇచ్చింది హస్తం పార్టీ. 10లక్షల ఉద్యోగాలు.. యువతకు 3వేల నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్టు మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, గుజరాత్ వ్యాప్తంగా మూడువేల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రీఓపెన్ హామీలు గుప్పించింది. గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే.. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు అశోక్ గెహ్లాట్. ఆమ్ అద్మీ మాటేంటీ? బీజేపీ కంచుకోటలో పాగా వేయాలని తహతహలాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. రైతు బిడ్డకు కీలక బాధ్యతలు అప్పగించింది. సామాన్యుడిగా వచ్చి.. పాపులర్ టీవీ యాంకర్గా ఎదిగిన ఈశుదాన్ గఢ్వీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. పంజాబ్ విజయంతో ఊపుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్లోనూ సత్తా చాటాలని తీవ్రస్థాయిలో శ్రమిస్తోంది. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ఆమ్ అద్మీ చెబుతోంది. అలాగే ఉచిత విద్య అందరికీ అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. విద్యతో పాటు వైద్యం వంటి ఆకర్షణీయ హామీలతో ప్రజల్లోకి వెళ్లింది. -
Gujarat Polls: ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూత్.. 8 మంది సిబ్బంది
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ పోలింగ్లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం.. కేవలం ఒక్క ఓటర్ కోసం ఏకంగా పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసింది. అందుకోసం సుమారు 8 మంది వరకు పోలింగ్, భద్రతా సిబ్బందిని పంపించింది. ఈ పోలింగ్ బూత్ దట్టమైన గిర్ అడవుల్లో ఉంటుంది. బనేజ్ ప్రాంతంలోని ఉనా నియోజకవర్గానికి తొలి విడతలో పోలింగ్ జరిగింది. అటవీ ప్రాంతంలో నివసించే మహంత్ హరిదాస్జీ ఉదాసిన్ అనే వ్యక్తి కోసం ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. తొలి విడతలో భాగంగా మహంత్ హరిదాస్జీ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది ఎన్నికల కమిషన్. ఉనా అసెంబ్లీలోని బనేజ్ పోలింగ్ కేంద్రానికి 2002 నుంచి శివుని మందిరం వద్ద నివాసమున్న మహంత్ భరత్దాస్ అనే వ్యక్తి ఒక్కరే ఓటు వేసేందుకు వచ్చేవారు. అప్పట్లో ఆయన కోసమే ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన తర్వాత పోలింగ్ బూత్ను మూసివేయాలనుకున్నారు. కానీ, ఆయన వారసుడిగా మహంత్ హరిదాస్జీ రావడం వల్ల తిరిగి పోలింగ్ బూత్ను ప్రారంభించారు. #ECI has set up a polling booth for only one voter, Mahant Haridasji Udasin in Banej (93-Una AC) in the dense jungles of Gir. Glimpses of Haridas Ji casting his vote during 1st phase of #GujaratElections2022.#novotertobeleftbehind #GujaratAssemblyPolls #ECI #EveryVoteMatters pic.twitter.com/FhDDELyRXU — Election Commission of India #SVEEP (@ECISVEEP) December 1, 2022 ఇదీ చదవండి: ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలి విడత పోలింగ్ -
గుజరాత్ లో తొలిదశ పోలింగ్ ప్రారంభం
-
కాసేపట్లో గుజరాత్ లో తొలిదశ పోలింగ్
-
ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలి విడత పోలింగ్
05.30 PM ముగిసిన పోలింగ్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ చిన్ని చిన్న ఘటనలు, విపక్షాల ఆరోపణల మధ్య ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత ఎన్నికల్లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 04:10 PM 13,065 పోలింగ్ కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.48 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా తపి నియోజకవర్గంలో 63.98శాతం ఓటింగ్ నమోదైంది. 13,065 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. 02:20 PM గుజరాత్ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంత జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుతీరారు. 11:50 AM నెమ్మదిగా పోలింగ్.. గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదైంది. పలు చోట్ల ఓటింగ్ నత్త నడకన సాగుతోంది. 10:35 AM ఓటేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. భారత క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి రివబ జడేజా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జామ్నగర్లోని ఓ పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటు వేశారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలింగ్లో పాల్గొనాలని రవీంద్ర జడేజా పిలుపునిచ్చాడు. ఈ ఎన్నికల్లో అతని భార్య రివబ బీజేపీ తరఫున జామ్నగర్ నుంచే పోటీ చేస్తోంది. #GujaratElections2022 | Cricketer Ravindra Jadeja cast his vote at a polling station in Jamnagar. His wife and BJP candidate Rivaba Jadeja voted in Rajkot earlier today. Ravindra Jadeja says, "I appeal to the people to vote in large numbers." pic.twitter.com/TXyu2W8JoD — ANI (@ANI) December 1, 2022 తండ్రి కాంగ్రెస్.. రవీంద్ర జడేజా భార్య బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే.. ఆయన తండ్రి అనిరుధ్ సిన్హ్ జడేజా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. కుమార్తె నైనా జడేజాతో కలిసి వచ్చి జామ్నగర్లోని ఓ పోలింగ్ స్టేషన్లో ఓటేశారు. ఇద్దరూ కాంగ్రెస్కే మద్దతు తెలిపారు. రాజకీయ పార్టీల విషయంలో అభిప్రాయాలు వేరైనప్పటికీ కుటంబపరంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జడేజా తండ్రి స్పష్టం చేశారు. తాను ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. #GujaratAssemblyPolls | Anirudhsinh Jadeja & Naina Jadeja - father & sister of cricketer Ravindra Jadeja - vote at a polling station in Jamnagar Ravindra Jadeja's wife Rivaba Jadeja is BJP candidate from Jamnagar North while Anirudhsinh & Naina campaigned for Congress candidate pic.twitter.com/RxCJGlDUGT — ANI (@ANI) December 1, 2022 9:30 AM ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. తొలి విడత పోలింగ్లో కాముబెన్ లాలాభాయ్ పటేల్ అనే 100 ఏళ్ల బామ్మ తన ఓటు హక్కు వినియోగుంచుకుంది. ఉమర్గాంలోని ఓ పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటేసింది. 9:10 AM గ్యాస్ సిలిండర్తో పోలింగ్ స్టేషన్కు.. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని సైకిల్పై గ్యాస్ సిలిండర్తో పోలింగ్ స్టేషన్కు పెళ్లారు. బీజేపీలో పాలనలో ధరల పెరుగుదలకు నిరసనగా ఇలా చేశారు. #WATCH | Amreli: Congress MLA Paresh Dhanani leaves his residence, to cast his vote, with a gas cylinder on a bicycle underscoring the issue of high fuel prices.#GujaratAssemblyPolls pic.twitter.com/QxfYf1QgQR — ANI (@ANI) December 1, 2022 8:30 AM ఓటేసిన మంత్రి.. గుజరాత్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. మంత్రి పూర్ణేష్ మోదీ.. సూరత్లోని ఓ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8:00 AM పోలింగ్ ప్రారంభం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 89 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది. సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ధ ప్రచారం అంటూ క్షేత్ర స్థాయిలో నాయకులు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 2017 ఫలితాలు ఇలా.. తొలి దశ పోలింగ్ జరుగుతున్న ఈ 89 స్థానాల్లో 2017 ఎన్నికల్లో బీజేపీ 48 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ 40 సీట్లలో గెలుపొందింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలం పుంజుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో పాటుగా, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) కూడా పోటీ చేస్తున్నాయి. బరిలో 788 మంది తొలి దశలో 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 89 స్థానాల్లో పోటీ పడుతూ ఉంటే, ఆప్ 88 స్థానాల్లో పోటీ చేస్తోంది.. తూర్పు సూరత్ నియోజకవర్గం అభ్యర్థి ఆఖరి నిమిషంలో తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆప్ 88 స్థానాలకే పరిమితమవాల్సి వచ్చింది. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ద్వారక జిల్లాలోకి కంభాలియా నుంచి పోటీ పడుతూ ఉంటే ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా సూరత్లోని కటాగ్రామ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశ పోటీలో ఉన్న ముఖ్యుల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా జామ్నగర్ (ఉత్తరం) నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు- 89 పోటీ పడుతున్న అభ్యర్థులు- 788 మహిళా అభ్యర్థులు- 70 స్వతంత్ర అభ్యర్థులు- 339 ఓటర్ల సంఖ్య- 2.39 కోట్లు పోలింగ్ కేంద్రాలు - 1,432 -
మూడు ముక్కలాట.. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరగనున్న పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సౌరాష్ట్ర,, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ధ ప్రచారం అంటూ క్షేత్ర స్థాయిలో నాయకులు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఎవరి వ్యూహాలు వారివే 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించే బాధ్యతను తానే స్వయంగా తీసుకున్నారు. మోదీ ఇమేజ్, అభివృద్ధి, గుజరాత్ ఆత్మగౌరవం అంశాలనే బీజేపీ నమ్ముకుంది. ఎన్నికలకు ముందు మోదీ రూ.29 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. మొత్తం 43 మంది సిట్టింగ్లకు టిక్కెట్లు నిరాకరించడంతో పాటు ఎన్నికలకు ముందు సీఎం సహా మొత్తం కేబినెట్ను మార్చేసి కొత్త రూపుతో అధికార వ్యతిరేకతను ఎదుర్కోవడానికి బీజేపీ వ్యూహాలు పన్నింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్లో ప్రచారాన్ని నడిపించారు. గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్లలో పట్టు సాధించిన స్థానాలపై దృష్టి పెట్టారు. క్షత్రియులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టడానికి రూపొందించిన ఖామ్ వ్యూహంపైనే ఆశలు పెట్టుకుంది. ఇక చాప కింద నీరులా విస్తరిస్తున్న ఆప్ పట్టణాల్లో బీజేపీ, పల్లెల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి గురిపెట్టింది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికే వ్యూహాలు పన్నుతూ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారాన్ని అంతా తానై నడిపించారు. ఉచిత కరెంట్, ఢిల్లీ మోడల్ పాలన ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా ఉంది. ఏ ప్రాంతంలో ఎవరి హవా ! 2017 ఎన్నికల్లో 89 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ 40 సీట్లలో గెలుపొందింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలం పుంజుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో పాటుగా, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) కూడా పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్లలో బీజేపీ వెనుకబడి పోయింది. పటీదార్ల ఉద్యమంతో ఈ ప్రాంతంలోని ప్రాబల్యమున్న లెవా పటేళ్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు. ఈ ఐదేళ్లలో మళ్లీ బీజేపీ వైపు మళ్లిపోయారు. ఈ ప్రాంతానికి చెందిన మల్దారీలు అందరూ ఈ సారి ఆప్కి అండగా ఉన్నారు.అధికార బీజేపీ ప్రతిపాదించిన పశువుల నియంత్రణ బిల్లును మల్దారీలు తీవ్రగా వ్యతిరేకించారు. ఆప్ పశు సంరక్షణ కోసం రోజుకి రూ.40 ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ వర్గం ఆప్ వైపే చూస్తోంది. సౌరాష్ట్రలో బీజేపీకి పట్టున్న రాజ్కోట్, భావ్నగర్ పట్టణ కేంద్రాలపై ఆప్ దృష్టి సారించింది. దక్షిణ గుజరాత్లో పటీదార్లతో పాటు మరాఠీలు, ఆదివాసీల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఆరెస్సెస్, క్రిస్టియన్ మిషనరీ సంస్థలు క్రియాశీలకంగా ఉండడం బీజేపీకి, కాంగ్రెస్ కలిసొచ్చే అంశం. బరిలో 788 మంది తొలి దశ ఎన్నికల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 89 స్థానాల్లో పోటీ పడుతూ ఉంటే, ఆప్ 88 స్థానాల్లో పోటీ చేస్తోంది.. తూర్పు సూరత్ నియోజకవర్గం అభ్యర్థి ఆఖరి నిమిషంలో తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆప్ 88 స్థానాలకే పరిమితమవాల్సి వచ్చింది. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ద్వారక జిల్లాలోకి కంభాలియా నుంచి పోటీ పడుతూ ఉంటే ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా సూరత్లోని కటాగ్రామ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశ పోటీలో ఉన్న ముఖ్యుల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా జామ్నగర్ (ఉత్తరం) నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు 89 పోటీ పడుతున్న అభ్యర్థులు 788 మహిళా అభ్యర్థులు 70 స్వతంత్ర అభ్యర్థులు 339 ఓటర్ల సంఖ్య 2 కోట్లు పోలింగ్ కేంద్రాలు 14,32 – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్లో ఆప్ గెలుస్తుందా? బీజేపీ చీఫ్ ఏమన్నారంటే..
ఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని బీజేపీ ధీమాతో ఉంది. ఈ మేరకు విజయం వన్సైడ్ అంటూ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చెప్తున్నారు. తాజాగా బుధవారం ఓ జాతీయ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని మరోసారి ఉద్ఘాటించారు. అయితే ఫేజ్-1 ఎన్నికల్లో భాగంగా.. సౌరాష్ట్ర రీజియన్ ఆప్ ప్రభావం చూపెడుతుందా? సీట్లు కైవసం చేసుకుంటుందా? అనే ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిని చవిచూసింది. ఢిల్లీ, పంజాబ్లో ఆప్ గెలిచిన మాట వాస్తవమే. అయితే, అక్కడ జరిగిన పోటీలో బీజేపీతో తలపడలేదు. కానీ, గుజరాత్లో అలా కాదు. అక్కడ వాతావరణం అంతా పూర్తిగా బీజేపీకి అనుకూలంగానే ఉంది. కాబట్టి, ఆప్కు ఎలాంటి అవకాశాలు లేవు అని సమాధానం ఇచ్చారు. స్థానిక సంస్థ ఎన్నికలతో సహా ఏ ఎన్నికలనూ బీజేపీ వదిలిపెట్టబోదని జేపీ నడ్డా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన ‘రావణ’ వ్యాఖ్యలపైనా జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఓ దిశానిర్దేశం లేకుండా పోయింది. అలాంటి పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు. బీజేపీకి భయపడుతుంది కాబట్టే.. ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది వాళ్ల మైండ్సెట్ను ప్రతిబింబిస్తోంది అంటూ నడ్డా వ్యాఖ్యానించారు. ఇక రాహుల్ గాంధీని ఉద్దేశించి అసోం సీఎం హిమంత.. సద్దాం హుస్సేన్లా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. బహుశా ఆయన(అసోం సీఎం) కోణంలో చూడడానికి అతను(రాహుల్) అలా కనిపించి ఉంటారేమో అంటూ బదులిచ్చారు. గుజరాత్లో రెండు దఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన(రేపు) తొలి దఫా, రెండ దఫా డిసెంబర్ 5వ తేదీన జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు. మంగళవారమే తొలి దఫా ప్రచార గడువు ముగియగా.. మొత్తం 182 సీట్లలో 89 సీట్లకు తొలి దశ ఎన్నిక జరగనుంది. ఇదీ చదవండి: అసెంబ్లీ బరిలో ఎమ్మెల్సీ కవిత! -
Gujarat Assembly Election 2022: కాంగ్రెస్ను ఊడ్చేస్తుందా?
గుజరాత్లో అధికార పీఠం కోసం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎడాపెడా హామీలతో ప్రచార పర్వాన్ని ఇప్పటికే రక్తి కట్టించాయి. రేపు తొలి దశకు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 5న రెండో, తుది దశ పోలింగ్తో అన్ని పార్టీల భవితవ్యమూ ఈవీఎంల్లోకి చేరనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వేటికవే గెలుపుపై ధీమా వెలిబుచ్చుతున్నా అంతర్గతంగా మాత్రం ఇప్పటికే లోతుగా విశ్లేషణల్లో మునిగిపోయాయి. మూడో పక్షంగా బరిలోకి దిగిన ఆప్ ఈసారి గట్టిగా ఉనికి చాటుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఆప్ గట్టిగా గండి కొట్టొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు...! గుజరాత్లో ఈసారి ఆప్ ఏకంగా 22 శాతం ఓట్లు సాధిస్తుందని సీఎస్డీఎస్ లోక్నీతి ఇటీవల చేసిన సర్వేలో తేలడం విశేషం! పరిస్థితులు కలిసొస్తే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేస్తుందని కూడా సర్వేను పర్యవేక్షించిన భాను పర్మార్ అభిప్రాయపడ్డారు. ఇది కాంగ్రెస్కు కచ్చితంగా ఆందోళనకర పరిణామమేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీకి గట్టి ఓటు బ్యాంకుంది. కనుక ఆప్ దెబ్బ గట్టిగా పడేది బహుశా కాంగ్రెస్ మీదే. అందుకే ఈసారి ఆ పార్టీకి నష్టం భారీగానే ఉండొచ్చు’’ అని విశ్లేషించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ ప్రదర్శన ఈ అభిప్రాయాలను బలపరిచేదిగానే ఉంది. వాటిలో పార్టీకి 13.28 శాతం ఓట్లు దక్కాయి. సూరత్లో అదే జరిగింది... రాష్ట్రంలో సూరత్ ప్రాంతంలో ఆప్కు ఆదరణ బాగానే ఉంది. సూరత్ కార్పొరేషన్ ఎన్నికల్లో 120 సీట్లకు ఆప్ 27 స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ క్రమంలో కాంగ్రెస్ను మూడో స్థానానికి నెట్టింది కూడా! ఈ ప్రాంతంలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి 7 నుంచి 8 గెలుస్తామని ఆప్ నేత కేజ్రీవాల్ ధీమా చెబుతున్నారు. సూరత్తో పాటు సౌరాష్ట్ర ప్రాంతంపైనా ఆప్ గట్టిగానే దృష్టి సారించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసి ఈసారి ఎటూ నిర్ణయించుకోలేని ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. వీరితో పాటు దశాబ్దాలుగా ఓడుతున్న కాంగ్రెస్ తీరుతో విసిగిపోయిన ఆ పార్టీ లాయలిస్టులు, బీజేపీపై ఆగ్రహంగా ఉన్న వర్గాల ఓట్లు కూడా రాబట్టగలిగితే ఆప్ అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు సాధించవచ్చని రాజకీయ విశ్లేషకుడు ధవల్ వాస్వాడా అభిప్రాయపడ్డారు. ‘‘దీనికి తోడు గ్రామీణ గుజరాత్ ఓటర్లు బీజేపీ కంటే కాంగ్రెస్కే మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఆప్ వారిని కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది! పట్టణ ప్రాంతాల్లో యువత, విద్యాధికుల్లో పార్టీకి ఎటూ ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. అది అదనపు లాభంగా కలిసొస్తుంది’’ అని ఆయన విశ్లేషించారు. తొలి దశ ప్రచారానికి తెర 89 అసెంబ్లీ స్థానాలకు రేపే పోలింగ్ అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభకు సంబంధించిన తొలి దశ ఎన్నికల ప్రచారపర్వం మంగళవారం ముగిసింది. తొలి దశలో దక్షిణ గుజరాత్, కచ్–సౌరాష్ట్ర పరిధిలోని 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ల మధ్యే పోటీ ఉండగా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలో దూకి త్రిముఖపోరుగా మార్చేసింది. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఏసుదాన్ గడవీ పోటీ చేస్తున్న దేవభూమి ద్వారాక జిల్లాలోని ఖంభాలియా నియోజకవర్గంలో సైతం తొలి దఫాలోనే పోలింగ్ జరగనుంది. డిసెంబర్ ఒకటో తేదీన పోలింగ్ ఉంటుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పురుషోత్తం సోలంకీ, ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన కున్వర్జీ బవలియా, మోర్బీ ‘హీరో’ కాంతీలాల్ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా, గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా తదతరులూ తొలి దఫాలోనే అదృష్టం పరీక్షించుకోనున్నారు. 89 మంది బీజేపీ, 89 మంది కాంగ్రెస్, 88 మంది ఆప్ అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ తొమ్మిది మంది, కాంగ్రెస్ ఆరుగురు, ఆప్ ఐదుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. మొత్తం అభ్యర్థుల్లో 718 మంది పురుషులు, 70 మంది మహిళలున్నారు. 2,39,76,670 మంది ఓటేయనున్నారు. 9 వేలకుపైగా పట్టణ ప్రాంతాల్లో, 16వేలకుపైగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Polls: ముగిసిన ప్రచారం.. తొలిదశకు అంతా సిద్ధం
గాంధీనగర్: గుజరాత్ శాసనసభ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా ముమ్మర ప్రచారంతో దూసుకెళ్లిన రాజకీయ పార్టీలు.. తొలిదశ ప్రచారానికి ముగింపు చెప్పాయి. మొదటి విడతలో భాగంగా 89 స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. మరో 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా.. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 27 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగుతున్న తమ అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే, 2017లో ఒక్కసీటు కూడా సాధించని ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ గెలుపు ఉత్సాహంతో గుజరాత్లోనూ పాగా వేయాలని భావిస్తోంది. 90 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి పి భారతి.. ఓటింగ్పై పలు వివరాలను వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి దశ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ‘డిసెంబర్ 1న ఓటింగ్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 19 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 50 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్క్యాస్టింగ్ ఉంటుంది. తొలి దశలో 2,39,76,760 మంది ఓటర్లు తమ ఓట హక్కును వినియోగించుకోనున్నారు. ’ అని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. బీజేపీ తరఫున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు భావ్నగర్, కచ్ జిల్లాలోని గాంధీధామ్లలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. తొలిదశలో ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ బరిలో ఉన్నారు. ద్వారకా జిల్లాలోని ఖాంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గుజరాత్ మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన కున్వార్జీ బవాలియా, మోర్బీ హీరో కాంతీలాల్ అమృతీయ, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా, ఆమ్ఆద్మీ పార్టీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా వంటి ముఖ్య వ్యక్తులు తొలిదశ పోటీలో ఉన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు -
ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే
-
Arvind Kejriwal: కేజ్రీవాల్పై రాయితో దాడి.. నేనేం తప్పు చేశా?
సూరత్: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పైకి ఓ వ్యక్తి రాయి విసిరాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సూరత్లో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి చేశాడు. అయితే కేజ్రీవాల్కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ విషయంపై కేజ్రీవాల్ స్పందించారు. ప్రత్యర్థులు తన కన్ను పోగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను ఏం తప్పు చేశానని దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. 27 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మిస్తామని తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మహిళలు, యువతలో విశేష స్పందన లభిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మొత్త 182 సీట్లకు 92 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్పై చేసిన దాడిలో ఓ చిన్నారి గాయపడినట్లు ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా తెలిపారు. బీజేపీ గూండాలే ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపించారు. મારી માતા, બહેન, દિકરીઓને પ્રતિ માસ રૂ 1000 સન્માન રાશિ તરીકે આપવામાં આવશે. - @ArvindKejriwal pic.twitter.com/j9vq5vvOAY — AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 28, 2022 మరోవైపు కేజ్రీవాల్పై దాడి జరగలేదని గుజరాత్ పోలీస్ అధికారులు చెప్పారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతతో రోడ్షో జరిగిందని పేర్కొన్నారు. అయితే సూరత్లో కేజ్రీవాల్ ర్యాలీ సమయంలో ఆప్, బీజేపీ కార్యకరక్తల మధ్య తోపులాట జరిగిందని పోలీసులు వెల్లడించారు. తామ వెంటనే పరిస్థితిని అదుపు చేశామన్నారు. చదవండి: ఆకాశంలో సగం.. అవకాశాలే గగనం! -
Gujarat Assembly Election 2022: ఆకాశంలో సగం.. అవకాశాలే గగనం!
ఆకాశంలో సగం అంటూ గొప్పగా కీర్తించడమే తప్ప రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడంలో మాత్రం పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. జనాభాలో దాదాపు సగం ఉన్న అతివలకు ఆ మేరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. గుజరాత్లో శాసనసభ ఎన్నికల ముఖచిత్రం పరిశీలిస్తే నిరాశే మిగలడం ఖాయం. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, మొత్తం 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో మహిళల సంఖ్య కేవలం 139 అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీరిలో ఏకంగా 56 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండడం విశేషం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 మంది మహిళలు పోటీకి దిగారు, 13 మంది విజయం సాధించారు. అప్పట్లో 104 మంది మహిళలు డిపాజిట్ సైతం కోల్పోయారు. ‘ఆప్’ నుంచి ఆరుగురు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్తోపాటు ఈసారి అదృష్టం పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా మహిళలకు పరిమిత సంఖ్యలోనే టిక్కెట్లిచ్చాయి. ఈ మూడు పార్టీల నుంచి కేవలం 38 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2017 ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి సంఖ్య పెరగడం కొంత ఊరటనిచ్చే విషయం. 2017లో బీజేపీ 12 మంది మహిళామణులకు టిక్కెట్లు ఇవ్వగా, ఈ ఎన్నికల్లో 18 మందికి అవకాశం కల్పించింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. 2017లో 10 మందికి, ఇప్పుడు 14 మంది ఆ పార్టీ టిక్కెట్లు లభించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దళిత, గిరిజన మహిళలకు టిక్కెట్లు ఇచ్చాయి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం 182 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో మహిళలు కేవలం ఆరుగురు. ఈ ఆరుగురిలో ముగ్గురు ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. 13 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆలిండియా మజ్లిస్ ఇత్తెహదూల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ చేస్తున్న ఇద్దరు మహిళలకు టిక్కెట్లు కేటాయించింది. వీరిలో ఒకరు ముస్లిం కాగా, మరో మహిళ దళిత వర్గానికి చెందినవారు. బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. 13 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. జాతీయ పార్టీ అయిన సీపీఎం ఒక మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపింది. ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని టిక్కెట్లు బీజేపీకి 9 మంది మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి ఐదుగురికి మొండిచెయ్యి చూపింది. నలుగురికి మరోసారి టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్కు నలుగురు మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉన్నారు. వీరిలో ఇద్దరికి మళ్లీ అవకాశం కల్పించింది. 2017 ఎన్నికల కంటే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగడం సానుకూల అంశం. 2017లో బీజేపీ ఎస్సీ స్థానాల్లో ఇద్దరికి, ఎస్టీ స్థానాల్లో ఒక మహిళకు టిక్కెట్లు ఇవ్వగా, ఇప్పుడు ఎస్సీ స్థానాల్లో నలుగురికి, ఎస్టీ స్థానాల్లో ఇద్దరికి పోటీ చేసే అవకాశం కల్పించింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎస్టీ మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఎస్సీలకు చోటు దక్కలేదు. ఈసారి నలుగురు ఎస్టీ, ఒక ఎస్సీ మహిళా అభ్యర్థి కాంగ్రెస్ టిక్కెట్లు దక్కించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు ఎస్టీ మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. బిల్లు ఆమోదం పొందితే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితేనే ఎన్నికల్లో వారి సంఖ్య పెరుగుతుందని శాయాజీగంజ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమీ రావత్ చెప్పారు. ఉన్నత పదవుల్లో మహిళలను నియమించడంలో తమ పార్టీ ముందంజలో ఉందని గుజరాత్ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు దీపికాబెన్ సర్వాదా వెల్లడించారు. ఒక గిరిజన మహిళను తమ పార్టీ దేశ రాష్ట్రపతిగా ఎన్నుకుందని గుర్తుచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat assembly elections 2022: గుజరాత్ ఎన్నికల్లో గెలుపు మాదే: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని, తమకు ఓటేసి గెలిపించాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆయన కోరారు. సూరత్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాదిరిగానే గుజరాత్ విషయంలోనూ అంచనాలు నిజమవుతాయని, ఆప్ అధికారంలోకి వస్తుందంటూ ఆయన కాగితంపై రాసి చూపారు. 27 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రజలు బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి కాబోతున్నారని అన్నారు. పాత పింఛను విధానం సహా ఇతర డిమాండ్లను తీరుస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. -
Gujarat assembly elections 2022: కాంగ్రెస్కు గిరిజనులంటే గౌరవం లేదు: మోదీ
నెత్రంగోడా: కాంగ్రెస్ పార్టీకి గిరిజనులంటే ఏమాత్రం గౌరవం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సైతం ఆ పార్టీ బలపరచలేదని పేర్కొన్నారు. ‘బిర్సా ముండా, గోవింద్ గురు వంటి గిరిజన నేతలను కాంగ్రెస్ పట్టించుకోలేదు. ముర్ముకు మద్దతివ్వాలని రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆ పార్టీని చేతులు జోడించి వేడుకున్నా కాదన్నారు. గిరిజన పుత్రికను రాష్ట్రపతిని చేసేందుకు సర్వశక్తులూ ధారపోయాల్సి వచ్చింది’ అన్నారు. గుజరాత్లోని ఖేడా, భరుచ్ జిల్లాల్లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్లు నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉండేదన్నారు. దేశంలో భారీ ఉగ్రదాడుల సమయంలో మౌనంగా ఉండటం ద్వారా కాంగ్రెస్, సారూప్య పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నాయని ఆరోపించారు. ‘కాంగ్రెస్ మారలేదు. దేశాన్ని కాపాడుకోవాలంటే అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలి’అని ప్రధాని పేర్కొన్నారు. -
గుజరాత్లో సోషల్ శరణం గచ్ఛామి! ఏ పార్టీ ప్రచారంలో ముందుంది అంటే?
గుజరాత్ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రధాని మోదీ, ఆప్ నేత కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకుపోతూంటే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ మాత్రం ఒక్క రోజు ప్రచారంతో సరిపెట్టారు. మరోవైపు మూడు పార్టీలు డిజిటల్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రచారానికి తొలుత శ్రీకారం చుట్టిన బీజేపీ ఈ ప్రచారంలోనూ తానే ముందుంది. కాంగ్రెస్ పార్టీ కాలేజీ విద్యార్థులనే సోషల్ మీడియా ప్రచారంలో భాగస్వామ్యుల్ని చేసింది. కాంగ్రెస్లో గాంధీ కుటుంబానికి చెందిన వారెవరూ ప్రచారానికి రాకపోవడంతో ఆ లోటు పూరించేలా క్షేత్ర స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయ త్నం చేస్తోంది. ఇక ఆప్ సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం దగ్గర్నుంచి ప్రచారం దాకా సోషల్ మీడియా మీదే ఆధారపడింది. కాంగ్రెస్ ► వాట్సాప్ ద్వారా బాగా ప్రచారం చేస్తోంది. 27 ఏళ్లుగా బీజేపీ ఏమేం చెయ్యలేదో , తమ హయాంలో ఏం చేశామో చెబుతోంది. ► అసెంబ్లీ స్థానాల వారీగా ఫేస్బుక్ పేజీలు ఏర్పాటు చేసి సమస్యలపై, తాము చేయబోయే పరిష్కారంపై ప్రచారం చేస్తోంది. ► 50 వేల వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసింది. ► ఠాకూర్లు, పటీదార్లు, ఆదివాసీలు ఇలా.. కులాలు, వర్గాల వారీగా కూడా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ► కాంగ్రెస్ పార్టీకి ఫేస్బుక్లో 7 లక్షల మందికి పైగా ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్లో 64 లక్షలు, ట్విటర్లో 2 లక్షలు, యూ ట్యూబ్లో 9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ► కొన్ని టెక్కీ సంస్థల్ని అద్దెకు తీసుకొని ప్రచారానికి అవసరమైన కంటెంట్ తయారు చేస్తోంది. ► పార్టీలో అధికారులు కాకుండా, క్షేత్ర స్థాయిలో 10 వేల నుంచి 12 వేల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. ఆప్ ► ఢిల్లీ మోడల్, మేనిఫెస్టో హామీలు ఓటర్లకు చేరేలా వాట్సాప్ను అధికంగా వినియోగిస్తోంది. ► ఆప్కు ఫేస్బుక్లో 6 లక్షలు, ఇన్స్టాగ్రామ్లో లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. నేషనల్ యూ ట్యూబ్లోనూ ప్రచారం చేస్తోంది. దీనికి 43 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ► ఆప్ సోషల్ మీడియా ప్రచార బాధ్యతల్ని 25 మంది యువ ఇంజనీర్లు తమ భజస్కంధాల మీద మోస్తున్నారు. 20 వేలమంది సోషల్ మీడియా వారియర్లను కూడా నియమించింది. ► ఆప్ మద్దతుదారుల ద్వారా కూడా అన్ని యాప్లలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ► ప్రతీ గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ప్రచారం నిర్వహిస్తోంది. ► సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ఎంపిక కూడా సోషల్ మీడియా ఓటింగ్ ద్వారా నిర్వహించి కొత్త ట్రెండ్ సృష్టించింది. బీజేపీ ► గుజరాత్ ఆత్మ గౌరవ ప్రచారానికి ప్రాధాన్యమిస్తోంది. 15 యాప్లు వినియోగిస్తోంది. ► సోషల్ మీడియాలో ఆర్నెల్లుగా వారానికో హ్యాష్ ట్యాగ్తో ప్రచారం చేస్తోంది. ► మోదీ 20 ఏళ్ల పాలన, వందే భారత్, ఈ గుజరాత్ నేనే నిర్మించాను వంటి ట్యాగ్ లైన్లతో విస్తృతంగా ప్రచారం. ► సోషల్ మీడియా ప్రచారానికి ఎక్కువగా ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వినియోగిస్తోంది. ► బీజేపీకి ఫేస్బుక్లో 35 లక్షల పైగా, ఇన్స్టాగ్రామ్లో 58 లక్షలు, ట్విటర్లో 15 లక్షలు, యూ ట్యూబ్లో 50 వేల ఫాలోవర్లున్నారు. ► 20 వేల మంది వర్కర్లు, 60 వేల మంది వాలంటీర్లు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ► బీజేపీ డిజిటిల్ వార్ రూమ్లో కంటెంట్ ఇస్తున్న వారంతా 20 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న యువ టెక్కీలే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్ ఎన్నికల ప్రచారం లో ప్రధాని మోదీ
-
గుజరాత్ ఎన్నికల చిత్రం.. పటేళ్ల రూటు ఎటు?
గుజరాత్లో ఎన్నికలంటే చాలు అందరి దృష్టినీ ఆకర్షించే వర్గం పాటీదార్లు. పటేళ్ల ఆగ్రహం, అనుగ్రహాలపైనే రాష్ట్రంలో అధికారం ఆధారపడి ఉంటుంది. అందుకే అన్ని పార్టీలు వీరి మద్దతు కోసం కష్టపడతాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులను భయపెట్టింది ఈ పటేళ్లే. మరి ఈసారి పటేళ్ల దారెటు..? పాటిదార్లే పవర్ ఫుల్ గుజరాత్ జనాభాలో పాటీదార్ల సంఖ్య సుమారు 15 శాతం. వ్యవసాయం నుంచి వ్యాపారవాణిజ్యాల వరకూ అన్ని రంగాల్లో బలంగా పాతుకుపోయారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్కోట్, అమ్రేలి, మోర్బీ జిల్లాలతోపాటు ఆనంద్, ఖేడా, మెహ్సనా, పటాన్, అహ్మదాబాదుల్లో పటేళ్ల ప్రాబల్యం ఎక్కువ. 182 సీట్ల అసెంబ్లీలో 50 చోట్ల వీరి ఓట్లు అత్యంత కీలకం. ఈ 50 నియోజకవర్గాల్లో పాటీదార్ ఓట్లు 20 శాతం పైగా ఉన్నాయి. మరో 40 సీట్లను ప్రభావితం చేస్తారనేది పార్టీల అంచనా.! మద్ధతు నుంచి ఉద్యమం దాకా 1990 నుంచి పాటీదార్లు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే పటేళ్ల ఉద్యమం ఈ పరిస్థితిని మార్చింది. ఓబీసీల తరహాలో తమకూ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనకు దిగారు పాటిదార్లు. 2007లోనే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ సర్దార్ పటేల్ ఉత్కర్ష్ సమితిని ఏర్పాటుచేశారు. 2015లో హార్దిక్ పటేల్ సారథ్యంలో పటేళ్ల ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడింది. ఈ ఉద్యమాన్ని బీజేపీ ప్రభుత్వం అణచివేసింది. పోలీసు కాల్పుల్లో అనేకమంది పాటీదార్ యువకులు చనిపోయారు. దీంతో పటేళ్లు, బీజేపీ మధ్య దూరం పెరిగింది. 2017 ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ మూడంకెల సీట్లు దాటే బీజేపీ.. 99కే పరిమితమైంది. కమలం గూట్లో ఉద్యమనేత 2017లో జరిగిన తప్పులకు.. ఇప్పుడు బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల రూపంలో పటేళ్లకు సాయం అందుతుందని బీజేపీ ప్రచారం చేస్తోంది. పటేల్ వర్గానికి చెందిన 45మందిని పోటీలో నిలబెట్టింది. మరీ ముఖ్యంగా.. 2015లో ఆందోళన చేసిన హార్దిక్ పటేల్ను పార్టీలో చేర్చుకుని సీటిచ్చింది. పటేళ్ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు.. ఎన్నికలకు ఏడాది ముందు విజయ్ రూపానీను తప్పించి.. భూపేంద్ర పటేల్కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. ఈ చర్యలన్నీ పాటీదార్లను తిరిగి తమవైపు మొగ్గు చూపేలా చేస్తాయనేది కమలనాథుల ఆశ. గుజరాత్లో బీజేపీ 150 సీట్ల టార్గెట్ చేరుకోవాలంటే పటేళ్ల మద్దతు తప్పనిసరి. చేయి కలుపుతారా? చేయిస్తారా? గుజరాత్లో క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లిం ఓట్లపై ఆధారపడిన కాంగ్రెస్కు.. 2017 ఎన్నికల్లో పాటిదార్ల అండ దొరికింది. అందుకే ఏకంగా 77 సీట్లు సాధించగలిగింది. ఈసారి అదే కొనసాగుతుందని ఆశిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పటేల్ బీజేపీలోకి వెళ్లిపోవడం కాంగ్రెస్ పెద్ద దెబ్బ. కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీపై హార్దిక్ చేసిన విమర్శలు.. హస్తం పార్టీని డిఫెన్స్లో పడేశాయి. అయినా పాటిదార్ ఓట్ల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. 42మంది పటేళ్లకు సీట్లు ఇచ్చింది. తొలిసారి గుజరాత్ను ఊడ్చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాటీదార్లను బుట్టలో వేసుకోవటానికి గట్టిగానే యత్నిస్తోంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువగా పటేళ్లకు సీట్లిచ్చింది. 46 మంది పాటీదార్లను అసెంబ్లీ బరిలోకి దించింది ఆప్. వీరిలో 2015 నాటి ఉద్యమ నాయకులు ఎక్కువగా ఉన్నారు. మరి పటేళ్ల మొగ్గు ఎటువైపో తెలియాలంటే, డిసెంబర్ 8 వరకూ ఆగాల్సిందే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Gujarat Assembly Elections 2022: బ్రాండ్ మోదీకే పరీక్ష!
గుజరాత్ అంటే మోదీ. మోదీ అంటే గుజరాత్. రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా ఇదే మాట వినిపిస్తోంది. ఆయన పేరే ఓ బ్రాండ్గా మారి బీజేపీకి అప్రతిహతంగా అధికారాన్ని అందిస్తోంది. కేజ్రీవాల్ తదితరుల సభల్లోనూ జనం మోదీ నామజపం చేయడం రాష్ట్రంలో ఆయన కరిష్మాకు నిదర్శనం. మరి ఈసారేం జరగనుంది? త్రిముఖ పోరులో మోదీ ఇమేజీ బీజేపీని మరోసారి గట్టెక్కించగలదా? సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న గుజరాతీయులు మళ్లీ మోదీ మంత్రమే జపిస్తారా? గుజరాత్లో 27 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీ ఉచిత హామీలు కమలనాథుల్ని కలవరపెడుతున్నాయి. కరోనా తాలూకు ఆర్థిక, సామాజిక సమస్యల నుంచి రాష్ట్రం ఇంకా బయట పడలేదు. రాష్ట్రంలో బీజేపీకి బలమైన నాయకులెవరూ లేకపోవడంతో ఈసారి కూడా గెలిపించే బాధ్యత మోదీ భుజస్కంధాలపైనే పడింది. ‘ఈ గుజరాత్ నేనే నిర్మించాను’ నినాదంతో ఎన్నికల్ని ఆయన తన చుట్టూ తిప్పుకుంటున్నారు. డిసెంబర్ 1, 5 రెండు దశల్లో జరిగే పోలింగ్కు ఓటర్ స్లిప్పులను స్వయంగా ఇవ్వడానికి మోదీ సన్నాహాలు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 28, 29ల్లో, డిసెంబర్ 2–3ల్లో ఆయన ఇంటింటికి వెళ్లి వాటిని పంచుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బ్రహ్మాస్త్రంగా కమలనాథులు భావిస్తున్నారు. ఇమేజ్ లేని సీఎంలు మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్ సీఎంలుగా చేసిన ఎవరికీ ప్రజల్లో పేరు లేదు. ఆనందీ బెన్ పటేల్ హయాంలో పటీదార్ల ఉద్యమం ఎగిసిపడడం, పటీదార్ అయ్యుండీ ఆమె ఉద్యమాన్ని అణిచే చర్యలకు దిగి సొంత వర్గానికే దూరమయ్యారు. దాంతో విజయ్ రూపానీని సీఎంను చేశారు. కరోనాను ఎదుర్కోలేక ఆయనా దిగిపోయారు. ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ను రాష్టంలోనే చాలామంది గుర్తు పట్టరంటే అతిశయోక్తి కాదు. సన్నాఫ్ గుజరాత్ మోదీ ఈసారి ప్రచారంలో ప్రజలతో వ్యక్తిగత భావోద్వేగ బంధానికి ప్రాధాన్యమిస్తున్నారు. ‘నేను మీ కొడుకును. ఆశీర్వదించండి’ అంటూ ఓట్లడుగుతున్నారు. గత ఎన్నికల్లో అధికార వ్యతిరేకత, పటీదార్ల ఉద్యమ ప్రభావం, జీఎస్టీ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బీజేపీ 99 స్థానాలతో అధికారం నిలుపుకుందంటే కేవలం మోదీ కార్డుతోనే. అందుకే ఈసారీ హిందూత్వ, డబుల్ ఇంజన్ నినాదాలతో పాటు ‘ఇది నేను నిర్మించిన గుజరాత్’, ‘ఇవి గతిని మార్చే ఎన్నికలు’ అంటూ మోదీ ప్రచారం చేస్తున్నారు. సామూహిక వివాహాల్లో పాల్గొంటూ, ఆదివాసీల్లో కలిసిపోతూ ప్రచారం చేస్తున్నారు. కీలక సవాళ్లు మోదీకి ఈసారి సొంత పార్టీ నుంచే అసలు పరీక్ష ఎదురవుతోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన 17 మందికి టికెట్లివ్వడంతో పార్టీలో అసమ్మతి మొదలైంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ ఇప్పుడు ఆ పార్టీ వారినే ఇలా అక్కున చేర్చుకోవడమేంటని రెబెల్ నేతలంటున్నారు. కరోనా, చమురు ధరలు, ద్రవ్యోల్బణం తదితరాలతో మోదీ ఇమేజ్ తగ్గుతూ వస్తోంది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తదుపరి ప్రధానిగా మోదీకి 53% మందే ఓటేశారు. ఒకప్పుడిది 70 శాతానికి పైగా ఉండేది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 2002లో 127 నెగ్గిన బీజేపీ 2007లో 117, 2012లో 116 సీట్లకుకు పరిమితమైంది. 2017లో 99తో సరిపెట్టుకుంది! ఈ పరిస్థితుల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ కొట్టాలంటే గుజరాత్ ఎన్నికల్లో నెగ్గితీరాలి. అందుకే ఈ ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్షగా మారాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్ అల్లర్లపై అమిత్ షా కామెంట్స్.. ఒవైసీ షాకింగ్ కౌంటర్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా.. 2002 గుజరాత్లో అల్లర్లు సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంసం సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పి 22 ఏళ్లుగా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచామని అన్నారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ క్రమంలో బీజేపీపై కౌంటర్ అటాక్ చేశారు. కాగా, ఒవైసీ మాట్లాడుతూ.. అమిత్ షా మీరు చెప్పిన ఎన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. గుజరాత్ అల్లర్లు సృష్టించిన వారికి బుద్ధి చెప్పాం అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామనీ చెప్పుకుంటున్నారు. కానీ, బిల్కిస్ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. ఆ బాధితురాలి మూడేళ్ల కూతురుని హత్య చేసిన నేరస్థులను బయట స్వేచ్ఛగా తిరిగేలా చేయాలనీ మాకు నేర్పించారు. నేరస్థులకు శిక్ష పడినప్పుడే సమాజంలో అసలైన శాంతి నెలకొంటుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అధికార బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదు. ఏదో ఒకరోజు అధికారం మారుతుంది. అధికారంలో ఉన్నారనే భావనతోనే అమిత్ షా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. తొలిసారిగా గుజరాత్ ఎన్నికల బరిలోకి ఎంఐఎం పార్టీ దిగుతోంది. తమ పార్టీ 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా స్పష్టం చేశారు. .@AmitShah aapne kaunsa sabaq sikhaya? - Barrister @asadowaisi pic.twitter.com/aAuEIhukTm — AIMIM (@aimim_national) November 26, 2022 -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో..
గాంధీనగర్: డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం గాంధీనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మేనిఫెస్టోలోని పథకాలను ప్రకటించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సహా ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు మరోసారి అధికారం ఇస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు నడ్డా. మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉమ్మడి పౌర స్మృతి అమలుకు చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. బీజేపీ ఇస్తున్న ఇతర ముఖ్య హామీలు.. ► ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆర్థిక సాయం ► బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ► ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం ► ఉగ్రకార్యకపాలు నివారించేందుకు యాంటి రాడికల్ సెల్ ఏర్పాటు.. ►గుజరాత్ వాసులందరికీ పక్కా ఇళ్లు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 100 శాతం అమలు ► మహిళా సీనియర్ సిటిజెన్లకు ఉచిత బస్సు ప్రయాణం ► 20వేల ప్రభుత్వ స్కూళ్లను ఎక్సలెన్స్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.10వేల కోట్ల కేటాయింపు ► బాగా చదివే కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు చదవండి: అది జైలు కాదు దర్బార్.. ఢిల్లీ మంత్రి మరో వీడియో లీక్.. -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్
-
గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు..
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ ఒకటిన మొదటి విడత జరిగే ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో అత్యధికంగా ఆప్, ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై ఉన్నాయి. 89 స్థానాలకు గాను బరిలో ఉన్న 788 మందికి గాను 167 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 100 మంది హత్య, రేప్ వంటి తీవ్ర నేరారోపణలను సైతం ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం తెలిపింది. అదేవిధంగా, బరిలో ఉన్న 788 మందిలో 211 మంది కోట్లకు పడగలెత్తిన వారు కాగా వీరిలో అత్యధికంగా బీజేపీకి చెందిన 79 మంది ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. రాజ్కోట్ సౌత్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేశ్ తిలాలా రూ.175 కోట్ల ప్రకటిత ఆస్తులతో అత్యంత ధనికుడు కాగా రాజ్కోట్ వెస్ట్ నుంచి స్వతంత్ర అభ్యర్థి భూపేంద్ర పటోలియా ఎటువంటి ఆస్తులు లేవంటూ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారని పేర్కొంది. చదవండి: యువతరం.. ఎవరి పక్షం...! -
గుజరాత్ కాంగ్రెస్ లో కనిపించని ఎన్నికల జోష్
-
Gujarat Assembly Elections 2022: యువతరం.. ఎవరి పక్షం...!
ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా అందరి దృష్టి యువతపైనే. ప్రధాని మోదీకి యువతలో క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పులో కాస్త మార్పు కనిపించింది. ఈ సారి యువ ఓటర్ల మదిలో ఏముందో తెలుసుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. గుజరాత్లో యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. యువతలో ప్రధాని మోదీకున్న క్రేజ్ను ఓట్లరూపంలో మలుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తూ ఉంటే కాంగ్రెస్, ఆప్ నిరుద్యోగ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. మోదీ ఏ సభకి వెళ్లినా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లను ఆకట్టుకునే రీతిలో ప్రసంగాలు చేస్తున్నారు. గుజరాత్ మనమే నిర్మించామన్న నినాదంతో మిలీనియల్స్ని ఆకర్షించే వ్యూహాలు బీజేపీ రచించింది. డిజిటల్ మీడియా ప్రచారంలో బీజేపీ ముందుంది. యూత్ కోసమే ప్రత్యేకంగా 15 యాప్లు రూపొందించింది. 20 వేల మందికిపైగా వర్కర్లు, 60 వేల మందికి పైగా వాలంటీర్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కేంద్ర పథకాలపై యువతలో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, ఆప్ పోటాపోటీ హామీలు యువతపై ప్రభావం చూపించే కీలక అంశాలైన ఉద్యోగాలు, విద్య అంశాల్లో కాంగ్రెస్, ఆప్ పోటాపోటీ హామీలు గుప్పించాయి. కోవిడ్–19 ప్రభావంతో లక్షలాది మంది యువత రోడ్డునపడిన కొత్తగా ఉపాధి దొరక్క అసహనంతో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి రూ. 3వేలు ఇస్తామని హామీ ఇస్తే, కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని , అందులో 50% మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకి నెలకి రూ.3 వేలు భృతి ఇస్తామంటూ ఆప్ బాటలోనే కాంగ్రెస్ నడిచింది. రాష్ట్రంలో విద్య నిరుపేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల భారం మోయడం కష్టంగా ఉంటోంది. ఆప్ ఢిల్లీలో మాదిరిగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తామని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని హామీ ఇస్తే, కాంగ్రెస్ కూడా యధాతథంగా అవే హామీలు ఇచ్చింది. ఎన్నికలకి ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండగా బీజేపీ ఇంకా మేనిఫెస్టో కసరత్తులో నిమగ్నమైంది. పార్టీలు కాదు పాలసీలు ముఖ్యం ఈ సారి యువ ఓటర్లు పార్టీలు తమకు ముఖ్యం కాదంటున్నారు. ఎవరు మంచి పాలసీలు తీసుకువస్తారో వారికే ఓటు వేస్తామని నినదిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం దాదాపుగా 3 శాతం వరకు ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల పేపర్లు లీకేజీ నిరుద్యోగ యువతలో తీవ్ర అసహనాన్ని నింపుతోంది. గత ఏడేళ్లలో ఎనిమిది సార్లు పేపర్లు లీకేజీ కావడం, బాధ్యులపై ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడం పట్ల యువత ఆగ్రహంతో ఉంది. నిరుద్యోగం కంటే విద్యారంగంలో సమస్యలపైనే యువత ఎక్కువ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘మాకు పార్టీలతో సంబంధం లేదు. ఆయా పార్టీల విధానాలే ముఖ్యం. ఈ సారి ఎన్నికల్లో విద్యా రంగం గురించి ఎవరైతే ఆలోచిస్తారో వారికే మా ఓటు. బీజేపీ ప్రభుత్వం నాణ్యమైన విద్యపై అసలు దృష్టి పెట్టడం లేదు. ఫీజుల భారం కూడా ఎక్కువే’’ అని షేట్ దామోదర్ దాస్ స్కూలు ఆఫ్ కామర్స్కు చెందిన విద్యార్థులు చెప్పారు. ఇన్నాళ్లూ రాష్ట్ర యువత ప్రధాని మోదీ వెంట ఉన్నారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఎన్నికల విశ్లేషకుడు శిరీష్ కాశీకర్ అభిప్రాయపడ్డారు. యువ ఓటర్లు ఇలా..! రాష్ట్రంలో మొత్తం 4.9 కోట్ల మంది ఓటర్లు ఉంటే వారిలో 40 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్నవారు 2.35 కోట్ల మంది ఉన్నారు. అంటే దాదాపుగా సగం ఓట్లు వీరివే. అందుకే ఈ ఓటర్లు గేమ్ ఛేంజర్గా మారుతారన్న అభిప్రాయం ఉంది. ఆ ఓటర్లలో 30–39 ఏళ్ల మధ్య వయసున్న వారు 1.21 కోట్ల మంది ఉంటే, 20–29 వయసు మధ్య ఉన్నవారు 1.03 కోట్లు ఉన్నారు. ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి నమోదు చేసుకున్న వారి సంఖ్య 11.74 లక్షలని కేంద్ర ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly elections 2022: గుజరాత్ గతిని నిర్ణయించే ఎన్నికలివీ..
పాలన్పూర్/దేహ్గాం: గుజరాత్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. రాబోయే 25 ఏళ్లపాటు రాష్ట్ర భవిష్యత్తును తేల్చే ఎన్నికలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన గురువారం బనస్కాంతా జిల్లా పాలన్పూర్లో, గాంధీనగర్ జిల్లా దేహ్గాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గుజరాత్లో బలమైన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం పర్యావరణం, పర్యాటకం, పరిశుభ్రమైన తాగునీరు, సాగునీరు, పశువుల పెంపకం, ప్రజలకు పౌష్టికాహారం వంటివాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఉద్ఘాటించారు. తాగునీటి కొరత, విద్యుత్ కొరత వంటి సమస్యలను అతి తక్కువ సమయంలోనే పరిష్కరించిందన్నారు. గుజరాత్లో బీజేపీ సర్కారు విద్యారంగాన్ని సమూలంగా మార్చివేసిందని చెప్పారు. మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యారంగం బడ్జెట్ ఏకంగా రూ.33,000 కోట్లకు చేరిందని, పలు రాష్ట్రాల మొత్తం విద్యారంగం బడ్జెట్ కంటే ఇది అధికమని చెప్పారు. డ్రోన్ కలకలం అహ్మదాబాద్ జిల్లా బావ్లా గ్రామంలో మోదీ సభకు ముందు వేదిక వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడం అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. డ్రోన్ ద్వారా జనసందోహాన్ని చిత్రీకరించే ప్రయత్నించడంతో స్థానికులు ముగ్గురి అరెస్టు చేíశారు. విద్యుత్తో ఆదాయం పొందాలి విద్యుత్ ద్వారా ఆదాయాన్ని పొందే రోజులు వచ్చాయని, ఉచితంగా తీసుకునే రోజులివి కావని ప్రధాని వ్యాఖ్యానించారు. అరావళి జిల్లా మోదాసాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని ఆప్, కాంగ్రెస్ ఇచ్చాయి. ఈ హామీ విపరీతంగా ఆకర్షించడంతో దానిని కౌంటర్ చేయడానికి ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నారు. -
Times Now Sumit 2022: ఉమ్మడి పౌరస్మృతికి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) తీసుకొచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. అయితే, అన్ని రకాల ప్రజాస్వామిర ప్రక్రియలను అనురించడంతోపాటు సంప్రదింపుల తర్వాతే తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కులతత్వం, వారసత్వం, బుజ్జగింపు వంటి జాడ్యాల నుంచి దేశ రాజకీయాలకు విముక్తి కలిగించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం పుట్టుక, కులం, ఇతరులను బుజ్జగించే తత్వం ఆధారంగా ఎన్నికల్లో నెగ్గే రోజులు పోయాయని స్పష్టం చేశారు. మతం ఆధారంగా చట్టాలా? బీజేపీ భారతీయ జనసంఘ్గా ఉన్నప్పటి నుంచే ఉమ్మడి పౌరస్మృతిపై దేశ ప్రజలకు హామీ ఇచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు. బీజేపీ మాత్రమే కాదు రాజ్యాంగ సభ కూడా సరైన సమయంలో యూసీసీని తీసుకురావాలని పార్లమెంట్కు, రాష్ట్రాలకు సూచించిందని వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు అనేవి మతం ఆధారంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లేదా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించిన ఒకే ఒక ఉమ్మడి చట్టం ఉండాలని చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ తప్ప ఇతర పార్టీలేవీ ఉమ్మడి పౌరస్మృతి పట్ల అనుకూలంగా లేవని అమిత్ షా పేర్కొన్నారు. దానిపై కనీసం మాట్లాడడం లేదన్నారు. మాట్లాడే ధైర్యం లేకపోతే వ్యతిరేకించవద్దని హితవు పలికారు. ‘మీరు అమలు చేస్తే మేము మీ వెంటనే ఉంటాం’ అని కూడా ప్రతిపక్షాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఆరోగ్యకరమైన, బహిరంగ చర్చ జరగాలని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అంటే.. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) గురించి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించారు. ఈ పౌరస్మృతిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాల శాసన సభలకు కూడా ఉంది. ప్రస్తుతం గోవాలో యూసీసీ అమలవుతోంది. యూసీసీకి మరో అర్థం.. ఒకే దేశం, ఒకే చట్టం. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమానంగా వర్తించే ఒకే చట్టమే ఉమ్మడి పౌరస్మృతి. భారత్లో వేర్వేరు మతస్తులకు, జాతులకు వారి మతగ్రంథాలు, అందులోని బోధనల ఆధారంగా వేర్వేరు వ్యక్తిగత(పర్సనల్) చట్టాలు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఓ వర్గం పురుషులు ఒక్కరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. అందుకు వారి ‘పర్సనల్ లా’ అనుమతిస్తుంది. మరో మతంలో అలాంటి వివాహాలకు అనుమతి లేదు. ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా వామపక్షాలు, ఇస్లామిక్ సంస్థలు, కొన్ని జాతులు, తెగలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
కేజ్రీవాల్కు దిమ్మతిరిగే షాకులిస్తున్న బీజేపీ.. ఎన్నికలపై ఎఫెక్ట్ ఎంత?
ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయాలతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. పలు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు వినూత్న ప్లాన్స్తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గుజరాతీలకు కీలక హామీలు సైతం ఇస్తున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలపై కూడా ఆప్ సర్కార్ ఫోకస్ పెంచింది. కానీ.. కేజ్రీవాల్కు అనుకోని రీతిలో కొన్ని షాక్లు తగులుతున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్.. ఆప్ నేతలను టార్గెట్ చేయడంతో కేజ్రీవాల్ ఢిల్లీ డిఫెన్స్లో పడినట్టు తెలుస్తోంది. కాగా, లిక్కర్ స్కామ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎంను సీబీఐ అరెస్ట్ చేయడం, తీహార్ జైలులో మంత్రి సత్యేంద్ర జైన్కు అధికారులు సపర్యలు చేయడం వంటి వీడియోలు బయటకు రావడంతో అనుకోని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఆప్పై బీజేపీ ముప్పెట దాడి చేస్తోంది. #WATCH | Latest CCTV footage sourced from Tihar jail sources show Delhi Minister Satyendar Jain getting proper food in the jail. Tihar Jail sources said that Satyendar Jain has gained 8 kg of weight while being in jail, contrary to his lawyer's claims of him having lost 28 kgs. pic.twitter.com/cGEioHh5NM — ANI (@ANI) November 23, 2022 కాగా, ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఆప్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ప్రజల దృష్టికి ఇటీవల జరిగిన ఘటనలపై ప్రచారం మొదలుపెట్టింది. ఇక, మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్.. నవంబర్ 25వ తేదీ నుంచి ప్రచారంలోకి దిగనున్నారు. రోడ్ షోలు, ఢిల్లీలో పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. తాము ఢిల్లీలో చేసిన అభివృద్ధే తమకు విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆప్ గెలుపే టార్గెట్గా పౌర సమస్యలపై దృష్టిపెట్టింది. Delhi minister & AAP leader Satyendar Jain getting a massage inside Tihar jail. Tihar Jail is run by the Department of Delhi Prisons under the Government of Delhi. pic.twitter.com/xKjTay434L — Anshul Saxena (@AskAnshul) November 19, 2022 ఇదిలా ఉండగా.. గుజరాత్ ఎన్నికల్లో కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. ఇక, గుజరాత్లో ఎన్నికలపై పలు సర్వేలు సైతం ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆప్కు గుజరాత్లో మంచి ఆదరణ ఉందని సర్వేలు చెప్పుకొచ్చాయి. మరోవైపు.. గుజరాత్లో బీజేపీలో చేరిన పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్కు షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పటేల్.. 2015లో పాటిదార్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఈ పోరాటం బీజేపీకి వ్యతిరేకంగానే కొనసాగింది. కానీ, ఇటీవల హార్దిక్.. కాషాయతీర్థం పుచ్చుకోవడంతో ఆయనపై పాటిదార్లు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇక, గుజరాత్లోని విర్మగం అసెంబ్లీ స్థానం నుంచి హార్దిక్ పటేల్ పోటీలో నిలిచారు. Good Days ahead for @HardikPatel_ 'Will slap him': Patidars upset with Hardik Patel for fighting on BJP tickethttps://t.co/EE4r2nuXdS — Sanjay Karan (@SanjayK53544321) November 23, 2022 -
జడ్డూ గాయం నిజమేనా.. లేక భార్య ఎలెక్షన్ కోసం బంగ్లా టూర్కు డుమ్మా కొట్టాడా..?
India Tour Of Bangladesh 2022: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. జడేజా మోకాలి గాయం పూర్తిగా నయం కాలేదన్న కారణంగా బీసీసీఐ అతన్ని త్వరలో జరుగనున్న బంగ్లాదేశ్ టూర్ (వన్డే సిరీస్) నుంచి అర్ధంతరంగా తప్పించింది. ఇదే అంశం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. జడేజా తొలుత ఫిట్గా ఉన్నాడని వన్డే, టెస్ట్ సిరీస్లకు ఎంపిక చేసిన సెలెక్టర్లు.. తీరా పర్యటనకు సమయం దగ్గర పడిన సమయంలో గాయం తీవ్రత తగ్గలేదని వన్డే జట్టును నుంచి తప్పించడం పలు అనుమానాలకు తావిస్తుంది. వివరాల్లోకి వెళితే.. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన డిసెంబర్ 4న మొదలవుతుంది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా అదే రోజు తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 7, 10 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్, 22 నుంచి 26 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, సరిగ్గా టీమిండియా.. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ఆడాల్సిన సమయంలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 1, 5 తేదీల్లో అక్కడ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా పోటీ చేస్తుంది. బీజేపీ నుంచి ఆమె నార్త్ జామ్నగర్ నుంచి బరిలో దిగనుంది. కాగా, భార్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నందునే జడేజా బంగ్లాతో వన్డే సిరీస్కు డుమ్మా కొట్టాడని కొందరు నెట్టింట ఆధారాల్లేని దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. బీసీసీఐ కార్యదర్శి జై షా బీజేపీ నంబర్ టూ అమిత్ షా తనయుడే కాబట్టి.. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు జడేజాకు దగ్గరుండి మరీ పర్మిషన్ ఇప్పించి ఉంటాడని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. దేశం కోసం ఆడే అవకాశం ఉన్నా జడేజా ఇలా చేయడం ఘోర తప్పిదమని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి జడేజా మోకాలి గాయం తీవ్రత తగ్గలేదని ఎన్సీఏ మెడికల్ టీమే సర్టిఫికెట్ ఇచ్చింది. పూర్తిగా కోలుకోకుండా బరిలోకి దిగితే గాయం తీవ్ర మరింత పెరగవచ్చని బీసీసీఐకి నివేదిక అందించింది. ఇది తెలుసుకోని కొందరు ఆకతాయిలు జడేజాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. -
Gujarat Assembly Election 2022: గిరిజనులంటే కాంగ్రెస్కు అలుసు
దాహోడ్/మెహసానా: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని ప్రధాని మోదీ నిలదీశారు. ఆయన బుధవారం గుజరాత్లోని దాహోడ్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా, ఆమెను ఓడించేందుకు ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆశీస్సులతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని తెలిపారు. దాహోడ్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఇదే.. అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, మత విద్వేషం, సమాజంలో విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ మోడల్ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్నే కాదు, మొత్తం దేశాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం మెహసానాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమన్నారు. దురభిమానం, వివక్షను బీజేపీ ఏనాడూ నమ్ముకోలేదని, అందుకే యువత తమ పట్ల విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వడోదరలోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
‘రాహుల్ గాంధీ.. ఇరాక్ సద్దాం హుస్సేన్లా ఉన్నారు’
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేల పొలిటికల్ లీడర్ల మధ్య మాటల యుద్ధం పెరిగింది. అధికార బీజేపీ మరోసారి అధికారం కోసం సరికొత్త ప్రచారంతో ముందుకు సాగుతోంది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు ప్లాన్స్ రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్తో పోల్చారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం సద్దాం హుస్సేన్లా కనిపిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుల పద్ధతులు భారతీయ సంస్కృతికి దూరంగా ఉంటాయి. వారు ఎల్లప్పుడూ ఇతరుల సంస్కృతులను స్వీకరించడానికి ప్రయత్నిస్తారు అని వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేరడానికి బాలీవుడ్ తారలకు కాంగ్రెస్ డబ్బు చెల్లించిందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక, అంతుకుముందు కూడా హిమంత.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్కు ఓటు వేసిన వ్యక్తులు త్వరలో బీజేపీలో చేరుతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా గడ్డం పెంచుకున్నప్పుడు ఆయనపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే, మేము నిజమైన సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతాము. అసలు విషయాలను పక్కదారి పట్టించడం బీజేపీ నేతలకు మాములే అంటూ ఎద్దేవా చేశారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణ చూసి బీజేపీ ఉలిక్కిపడుతోందని అన్నారు. Rahul Gandhi looks like Saddam Hussein, says Assam CM Himanta Sarma#RahulGandhi #SaddamHussein #HimantaBiswaSarma #Congress #BJP #Gujarat #BharatJodoYatra https://t.co/u0Of4sOXXn — NewsDrum (@thenewsdrum) November 23, 2022 -
దక్షిణం గాలి ఎటువైపు? ఆప్ దెబ్బకు బీజేపీ ఆశలు గల్లంతేనా?
దక్షిణ గుజరాత్. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. ఒకవైపు వ్యాపారులు, మరోవైపు ఆదివాసీల సమ్మేళనమైన ఈ ప్రాంతవాసులు ఎటు వైపున్నారు? అధికార బీజేపీ ఆశల్ని ఆప్ గల్లంతు చేస్తుందా? జీఎస్టీపై గుర్రుగా ఉన్న వ్యాపారులు బీజేపీని కాదని ప్రత్యామ్నాయం వైపు చూస్తారా ? ఆదివాసీ ప్రాంతాల్లో పట్టున్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది ...? దక్షిణ గుజరాత్ భరూచ్, నర్మద, తాపి, దాంగ్, సూరత్, వల్సద్, నవ్సారి జిల్లాలతో కూడుకొని ఉంది. డిసెంబర్ 1న తొలి దశ పోలింగ్ జరిగే 89 స్థానాల్లో 35 దక్షిణ గుజరాత్లో ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు ఈ ప్రాంతంపై బాగా దృష్టి పెట్టాయి. ఈ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలు వ్యాపారవేత్తలతో నిండిపోయి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువ. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 35 స్థానాలకు గాను 25 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 8, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) 2 నెగ్గింది. ఈసారి ఆప్ రాకతో దక్షిణ గుజరాత్లో చతుర్ముఖ పోరు నెలకొంది. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివాస ప్రాబల్య ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పట్టణ విద్యావంతులు కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ పాలనకు ఆకర్షితులవుతున్నారు. సూరత్ వ్యాపారులూ కీలకమే సూరత్లో వస్త్ర వ్యాపారులు జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నారు. కరోనా, జీఎస్టీ, పెరిగిన ధరలతో ఈసారి దీపావళి సీజన్లో వస్త్ర వ్యాపారం 60% తగ్గిపోవడంతో వారిలో భవిష్యత్పై బెంగ మొదలైంది. గత ఎన్నికల్లో పటేళ్ల ఉద్యమం, అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఏకంగా 15 నెగ్గింది. ఆదివాసీ ప్రాబల్యమున్న మాండ్విలో మాత్రమే ఓడింది. ఈసారి ఆప్ ప్రభావం బాగా ఉండేలా ఉంది. గతేడాది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఏకంగా 27 సీట్లు నెగ్గింది. హార్దిక్ పటేల్ బీజేపీలో చేరడం కలిసొచ్చే అంశమే అయినా ఆయన అనుచరులు తదితరులంతా ఆప్లో చేరారు. చిన్న పరిశ్రమల హబ్ దక్షిణ గుజరాత్లో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగానున్న పరిశ్రమల్లో 50శాతానికి పైగా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని పెట్టుబడుల్లో 33%, ఈ ప్రాంతంలోనే పెడుతున్నారు. ఉపాధి అవకాశాల్లో 43% ఇక్కడి పరిశ్రమలే కల్పిస్తున్నాయి. టెక్స్టైల్, డైమండ్ కటింగ్, పాలిజింగ్, కెమికల్, పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ, ప్లాస్టిక్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. నాలుగు రేవు పట్టణాలతో కనెక్ట్ అయి ఉంది. రాష్ట్ర జనాభాలో 20% (1.2 కోట్లు) మంది దక్షిణ గుజరాత్లోనే నివసిస్తారు. ఈ ప్రాంతంలో వ్యాపారులందరూ జీఎస్టీపైనా, పెరిగిపోయిన విద్యుత్ బిల్లులపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఆదివాసీల ఆందోళనలు దక్షిణ గుజరాత్లో 14 ఎస్టీ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో వీటిలో బీజేపీ 5 మాత్రమే నెగ్గింది. ఈసారి అన్ని కూడా రావంటున్నారు. సర్–తాపి–నర్మద నది లింకింగ్ ప్రాజెక్టు, వేదాంత జింగ్ స్మెల్టర్ ప్లాంట్ ద్వారా గుజరాత్ ప్రభుత్వం తమ భూముల్ని కొల్లగొడుతోందన్న ఆగ్రహంతో గిరిపుత్రులు చేసిన ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. వన్సాదా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ పటేల్ ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రభుత్వానికి కంటీ మిద కునుకు లేకుండా చేస్తోంది. అభివృద్ధి గురించి ఆదివాసీలకు వివరించి వారి ఆదరణ పొందడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్ వదిలేసిన ఆదివాసీలకు స్వయంపాలన అధికారాన్ని కట్టబెట్టే పంచాయతీ విస్తరణ చట్టాన్ని అమలు చేస్తామన్న ఆప్ హామీ వారిని అధికంగా ఆకర్షిస్తోంది. ‘‘దక్షిణ గుజరాత్లో ఆదివాసీలు, వ్యాపారులు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. వేదాంత రసాయన ఫ్యాక్టరీ వారి భూముల్ని, నీటిని విషతుల్యం చేస్తుందన్న ఆందోళన నెలకొంది. వారికి ఆప్ ఆశాదీపంలా కనిపిస్తోంది’’ అని ఎన్నికల విశ్లేషకుడు అమిత్ ధోల్కాయి అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly Election 2022: అధికారం కోసమే జోడో యాత్ర
సురేంద్రనగర్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అధికారం కోల్పోయినవారు మళ్లీ గద్దెనెక్కడానికి పాదయాత్ర సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారిని చాలా ఏళ్ల క్రితమే ప్రజలు గద్దెదింపారని చెప్పారు. మోదీ సోమవారం గుజరాత్లోని సురేంద్రనగర్, నవసారి, జంబూసార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడకుండా, తన(మోదీ) ఔకత్(స్థాయి) ఏథమిటో బయటపెడతామని సవాళ్లు విసురుతున్నారని ఆక్షేపించారు. వారి ఆహంకారాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వారు(కాంగ్రెస్ పెద్దలు) రాజకుటుంబం నుంచి వచ్చారని, తాను కేవలం ఒక సేవకుడినని, తనకు పెద్ద స్థాయి లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు గతంలో తనను దిగజారుడు భాషలో దూషించారని గుర్తుచేశారు. స్థాయిల సంగతి పక్కనపెట్టి అభివృద్ధి గురించి మాట్లాడుకుందామని ప్రతిపక్షానికి హితవు పలికారు. తన దృష్టి మొత్తం దేశ ప్రగతి పైనే ఉందని.. అవమానాలు, దూషణలను జీర్ణించుకుంటానని చెప్పారు. గుజరాత్ ఉప్పు తింటూ అవమానిస్తున్నారు నర్మదా ప్రాజెక్టును అడ్డుకొని, గుజరాత్ గొంతెండిపోయేలా చేసినవారిని పక్కన పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. నర్మదా ప్రాజెక్టును వ్యతిరేకించిన వారికి గుజరాత్ ప్రజలు బుద్ధిచెప్తారని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అప్పట్లోనే తాను గట్టిగా వాదించానని, ఇప్పుడు ఈ లాభాలు కళ్లముందే కనిపిస్తున్నాయని వివరించారు. పాదయాత్ర చేస్తున్న వారికి వేరుశనగ పంటకు, పత్తి పంటకు మధ్య తేడా తెలియదని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొందరు వ్యక్తులు గుజరాత్లో తయారవుతున్న ఉప్పు తింటూ గుజరాత్నే అవమానిస్తున్నారని తప్పుపట్టారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ఉప్పులో గుజరాత్ వాటా 80 శాతం ఉందని గుర్తుచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను కొన్ని స్థానాల్లో గెలిపించడం ద్వారా సురేంద్రనగర్ జిల్లా ప్రజలు పొరపాటు చేశారని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. -
Gujarat Assembly Election 2022: తల్లీబిడ్డలను వేరుచేస్తున్నారు
మహువా: కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో అడుగుపెట్టారు. రాష్ట్ర అధికార బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం ఆయన సూరత్ జిల్లాలోని మహువాలో జరిగిన భారీ బహిరంగ సభలో గిరిజనులద్దేశిస్తూ ప్రసంగించారు. ‘బీజేపీ మిమ్మల్ని తాత్కాలిక వనవాసులు అంటోంది. కానీ, గిరిపుత్రులే అడవికి అసలైన యజమానులు. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు అటవీభూములను ధారాదత్తంచేస్తూ గిరిజనులను తమ అడవి తల్లికి దూరంచేస్తోంది. ఇక్కడ మీ బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీంతో ఆధునిక విద్య, వైద్యానికి మీ పిల్లలు దూరమవుతున్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడుతూ వైద్యులు, ఇంజనీర్లు, పైలట్లు కావడం బీజేపీ సర్కార్కు ఇష్టంలేదు’ అని రాహుల్ దుయ్యబట్టారు. రాజ్కోట్లో జరిగిన మరో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బీజేపీతోనే రైతులకు కష్టాలు మహారాష్ట్రలో కర్షకులు, యువత, గిరిజనులను పట్టిపీడిస్తున్న కష్టాలకు అసలు కారణం బీజేపీయేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో 380 కిలోమీటర్ల పొడవునా కొనసాగిన భారత్ జోడో యాత్రనుద్దేశిస్తూ రాహుల్ సోమవారం ఒక ప్రకటన విడుదలచేశారు. పంటల బీమా పథకాల వైఫల్యం కారణంగా రైతులు కష్టాలు పడుతున్నారని వాపోయారు. -
Gujarat Assembly Election 2022: వారసులపైనే ఆశలు!
వారసత్వ రాజకీయాలు.. దేశాన్ని పట్టిపీడిస్తున్న జాడ్యమని కేవలం ప్రజాస్వామ్యవాదులే కాదు, సాక్షాత్తూ రాజకీయ పార్టీలు సైతం నిందిస్తుంటాయి. ఆచరణలో మాత్రం అన్ని పార్టీలదీ అదే వరుస. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని చెప్పే పార్టీలు చివరకు గెలుపు గుర్రాల పేరుతో వారసులకే పట్టం కడుతున్నాయి. రాజకీయాల్లో వారసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అధికార బీజేపీ గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో అదే బాటలో సాగుతోంది. గుజరాత్ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పుత్రరత్నాలే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలుండగా, దాదాపు 20 స్థానాల్లో వారసులకే పార్టీలు టికెట్లిచ్చాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 13 మందికి, బీజేపీ ఏడుగురికి టికెట్లు ఇవ్వడం గమనార్హం. ప్రోత్సాహం ఇందుకే.. ఆర్థికంగా బలవంతులు కావడం, ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీకొట్టే సామర్థ్యం ఉండడం, కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థి లేకపోవడం వంటి కారణాలతో పార్టీలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పదిసార్లు విజయం సాధించిన గిరిజన నేత మోహన్ సిన్హ్ రాథ్వా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. బీజేపీ అధిష్టానం ఆయన కుమారుడు రాజేంద్ర సిన్హ్ రాథ్వాకు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన చోటా ఉదయ్పూర్ టిక్కెట్ కేటాయించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి నరాన్బాయి రాథ్వా కుమారుడు సంగ్రామ్ సిన్హ్ రాథ్వా పోటీ చేస్తుండడం గమనార్హం. సనంద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కరణ్ సిన్హ్ పటేల్ కుమారుడు కానూ పటేల్ పోటీకి దిగుతున్నారు. థాస్రా నియోజకవర్గంలో బీజేపీ టిక్కెట్ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామ్ సిన్హ్ పర్మార్ కుమారుడు యోగేంద్ర పర్మార్ దక్కించుకున్నారు. వారసత్వం.. మా హక్కు అన్ని పార్టీల్లో కొన్ని కుటుంబాలు రాజకీయాలను తమకు దక్కిన వారసత్వంగా భావిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర త్రివేది చెప్పారు. తమ నియోజకవర్గాలపై పట్టు నిలుపుకుంటున్నాయని పేర్కొన్నారు. చాలాచోట్ల ప్రత్యామ్నాయం లేకపోవడంతో పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వారసత్వాన్ని అంగీకరించాల్సి వస్తోందని వెల్లడించారు. బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మరొకరు సాహసించడం లేదని చెప్పారు. ఫలితంగా అక్కడ వారసులే పాగా వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఒకవేళ నేతలను పక్కనపెట్టాల్సి వస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి వారి కుమారులు, కుమార్తెలు, భార్యలే పార్టీలకు దిక్కవుతున్నారని తెలియజేశారు. మాజీ సీఎం కుమారుడికి మళ్లీ చాన్స్ దనిలీమ్దా స్థానంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనూబాయి పర్మార్ కుమారుడు శైలేశ్ పర్మార్కు ఆ పార్టీ నుంచి టికెట్ లభించింది. బయాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి శంకర్సిన్హ్ వాఘేలా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మహేంద్రసిన్హ్ వాఘేలా మరోసారి పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీలో చేరిన మహేంద్రసిన్హ్ వాఘేలా గత నెలలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గుజరాత్ మాజీ సీఎం అమర్సిన్హ్ చౌదరీ కుమారుడైన తుషార్ చౌదరీ బార్దోలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly Elections 2022: ప్రతి బూత్ బీజేపీదే కావాలి
వెరవాల్/ధొరాజి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీకే విజయం అందించాలని గుజరాత్ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. ఎన్నికల రోజు ఓటర్లంతా భారీగా పోలింగ్ బూత్లకు తరలివచ్చి, గత రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. ‘బీజేపీకే ఓటేయాలని మిమ్మల్ని అడగడం లేదు. ప్రతి పౌరుడూ ఈ ప్రజాస్వామ్య వేడుకలో భాగస్వామిగా మారాలి’అని కోరారు. ‘తరచూ వచ్చే కరువు పరిస్థితులు వంటి కారణాలతో గతంలో రాష్ట్రాన్ని అందరూ చిన్నచూపు చూసేవారు. కానీ, అభివృద్ధిమార్గంలో పయనిస్తోంది. యావత్తు ఉత్తరభారతం నుంచి ఉత్పత్తులు రాష్ట్రంలోని రేవుల నుంచే ప్రపంచదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశ సౌభాగ్యానికి ఈ ఓడరేవులే ద్వారాలుగా మారాయి’అని ప్రధాని చెప్పారు. నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్ శనివారం మహారాష్ట్రలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్తో కలిసి నడవడంపై ఆయన స్పందించారు. సౌరాష్ట్రకు జలాలను అందించే నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 3 దశాబ్దాలపాటు అడ్డుకున్న వారితో అంటకాగుతున్న కాంగ్రెస్కు ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని మోదీ ప్రజలను కోరారు. కాంగ్రెస్కు వేసిన ఓటు వృధాయే అన్నారు. గిర్ సోమ్నాథ్, రాజ్కోట్ జిల్లాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు ప్రఖ్యాత సోమ్నాథ్ ఆలయంలో పూజలు చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 1, 5వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
Guajarat Elections: ఏడుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బీజేపీ
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన వీరంతా టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. సస్పెండ్ అయిన ఏడుగురు ఎమ్మెల్యేలు.. హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్డా, ఉదయ్ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా. వీరంతా డిసెంబర్ 1న జరిగే తొలి విడత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపింది బీజేపీ. మొత్తం 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్కు కూటా టికెట్ ఇవ్వలేదు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, పూర్వవైభవం సాధించి మరోసారి గుజరాత్ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి. చదవండి: ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత.. -
Gujarat Assembly Election 2022: సౌరాష్ట్ర ఎవరికి సై?
సౌరాష్ట్ర.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. పటీదార్ల ఉద్యమానికి కేంద్ర బిందువు. ఈ ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై పట్టు కోల్పోయిన బీజేపీ తిరిగి పూర్వవైభవం సాధించడానికి ప్రయత్నిస్తోంది. మరి సౌరాష్ట్ర ఓటర్లు ఎవరకి జై కొడతారు...? సౌరాష్ట్ర కేంద్రంగా 2015లో మొదలైన పటీదార్ (పటేళ్లు) ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రంలో అగ్రకులమైన పటేళ్లను ఒబిసిలో చేర్చాలని, వారికి కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో యువ నాయకుడు హార్థిక్ పటేల్ నేతృత్వంలో సాగిన ఉద్యమం 2017 ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బ తీసింది. సౌరాష్ట్రలో పటీదార్లు, ఒబీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పటీదార్లు చేసిన ఉద్యమంతో 2017 ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గాను 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్కు వెలుపల నుంచి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ఏకంగా 28 స్థానాలను గెలుచుకొని తన పట్టు పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని 99 స్థానాలకే పరిమితం చేయగలిగింది. ఇప్పుడపా మాదిరి భావోద్వేగ పరిస్థితుల్లేవు. పటీదార్ల ఉద్యమం చల్లారింది. హార్దిక్ పటేల్ కాంగ్రెస్లో చేరినా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. హార్దిక్ ఇప్పుడు బీజేపీలో చేరారు. విరమ్గమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్కు ఎదురుదెబ్బగా మారేలా ఉన్నాయి. సౌరాష్ట్రలో పటీదార్లు, కొలి జనాభా 40% దాకా ఉంది. 18 అసెంబ్లీ స్థానాల్లో పటీదార్ల ఓట్లు, 10 అసెంబ్లీ స్థానాల్లో కొలి వర్గం ఓట్లు నిర్ణయాత్మకం. ఓబీసీ, క్షత్రియులు, మత్స్యకారులు కూడా ప్రభావం చూపించగలరు. ‘‘సౌరాష్ట్ర యువ ఓటర్లు ఈసారి ఆప్వైపు మొగ్గుతున్నారు. పటీదార్లు వ్యాపారాలంతా ఆప్కు అవకాశమిద్దామని అనుకుంటున్నారు. కొలి, ఇతర ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్కి ఓటేయొచ్చు’’ అని రాజకీయ విశ్లేషకుడు దిలీప్ గొహ్లి అభిప్రాయపడ్డారు. బీజేపీ ఓబీసీ మంత్రం సౌరాష్ట్రలో 48 సీట్లలో సగానికిపైగా స్థానాల్లో పటేళ్ల ఆధిక్యం ఉంది. హార్దిక్ వంటి నాయకుల్ని బీజేపీ తమ వైపు తిప్పుకున్నా పటేళ్లలో ఉపకులాల కారణంగా అందరూ బీజేపీ వైపుండే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు టిక్కెట్లు ఎక్కువ ఇచ్చింది. 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంపయ్యారు. పటీదార్, కొలి, అహిర్ సామాజిక వర్గాలకు చెందిన కున్వర్జీ బవాలియా, బ్రిజేశ్ మెర్జా, చవడ వంటి అగ్రనాయకులూ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. సంపన్న సౌరాష్ట్ర సౌరాష్ట్ర ప్రాంతం మొదట్నుంచి సంపన్న ప్రాంతమే. అరేబియా తీరంలో ఉండే ఈ ప్రాంతంలో సహజవనరులు చాలా ఎక్కువ. నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.2019లో సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నర్మద నది నుంచి నీళ్ల ట్యాంకర్లతో సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ ప్రాంతంలో 11 జిల్లాలున్నాయి. సురేంద్రనగర్, మోర్బీ, రాజ్కోట్, జామ్నగర్, దేవ్భూమి ద్వారక, పోర్బందర్, జునాగఢ్, గిర్ సోమ్నాథ్, అమ్రేలి, భావనగర్, బోతాడ్.. ఈ 11 జిల్లాలకు గాను బీజేపీ 2017 ఎన్నికల్లో మోర్బీ, గిర్ సోమ్నాథ్, అమ్రేలి జిల్లాల్లో ఒక్క సీటు సాధించలేకపోయింది. ఈ సారి ఎన్నికల్లో అధిక ధరలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, నీటి సమస్య కీలకం కానున్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దినసరి కూలీ.. రూపాయి నాణేలతో..
గాంధీనగర్: డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దినసరి కూలీగా పనిచేసే ఒక యువకుడు బరిలోకి దిగుతున్నాడు. గాంధీ నగర్లోని ఓ మురికివాడలో నివసించే మహేంద్ర పాట్నీకి స్థానికులు మద్దతుగా నిలుస్తున్నారు. వీరి నుంచి ఇతడు రూ.10వేలు సేకరించాడు. ఈ డబ్బంతా రూపాయి నాణేల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి అతడు ఎన్నికల సంఘం వద్ద సెక్యూరిటీ డిపాజిట్ చేశాడు. దీంతో డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు. మహేంద్ర పాట్నీ గాంధీనగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఈ యువకుడు స్వతహాగా ఎన్నికల బరిలో దిగడానికి బలమైన కారణమే ఉంది. 2019లో ఓ హోటల్కు దారికోసం ఇతడు నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. 521 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో వారు గత్యంతరంలేక వేరేప్రాంతానికి తరలివెళ్లారు. కానీ అక్కడ విద్యుత్, నీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు లేవు. వీరిని పట్టించుకునే నాథుడు కూడా లేడు. దీంతో ఈ ప్రాంతంలో నివసించే వారంసా తమ ప్రతినిధిగా మహేంద్ర పాట్నీని నిలబెట్టారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకున్నా స్వతంత్రంగా బరిలోకి దింపుతున్నారు. 2010లోనూ మహెంద్ర పాట్నీ నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. మహాత్మా గాంధీకి అంకితం చేస్తూ ప్రభుత్వం నిర్మించిన దండీ కుటీర్ మ్యూజియం కోసం వీరి గుడిసెలను తొలగించారు. ఇప్పుడు మళ్లీ మరోమారు ఓ హోటల్కు దారికోసం వీరి కాలనీని కాళీ చేయించారు. దీంతో తమ సమస్యను పరిష్కరించునేందుకు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకుని మహేంద్ర పాట్నీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వద్దకు వస్తాయని, కానీ ఎన్నికల తర్వాత తమ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదని వీరు వాపోతున్నారు. అందుకే తామే స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. అయితే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటానని మహేంద్ర పాట్నీ చెబుతున్నాడు. తాము నివసించేందుకు శాశ్వతంగా ఒక స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నాడు. అంతేకాదు తమ దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తరచూ సీజ్ చేస్తున్నారని, తిరిగి వాటిని విడిచిపెట్టేందుకు రూ.2500-3000 తీసుకుంటున్నారని తెలిపాడు. ఇలా జరగకుండా ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 2, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న ప్రకటిస్తారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
Gujarat Assembly Election 2022: మోదీ నుంచి మోర్బీ వరకు...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. తొలిసారిగా ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతూ ఉండడంతో ప్రతీ అంశమూ ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా అధికార బీజేపీ ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధిక ధరలు, నిరుద్యోగం దగ్గర్నుంచి ఇటీవల జరిగిన మోర్బీ కేబుల్ వంతెన దుర్ఘటన వరకు ఎన్నో అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించనున్నాయి. అవేంటో చూద్దాం.. అధికార వ్యతిరేకత రాష్ట్రంలో 1998 నుంచి అంటే 24 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వంపై వివిధ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం, తడిసిమోపెడైన జీవన వ్యయం, నాసిరకమైన రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడం వంటివన్నీ ఈ సారి ఎన్నికల్లో ఓటర్లపై పడనున్నాయి. రాష్ట్ర ప్రజలు మార్పుని కోరుకుంటున్నారనే విశ్లేషణలు వినబడుతున్నాయి. మోదీ ఇమేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ ఈ ఎన్నికల్లో అత్యంత కీలక అంశం కానుంది. మోదీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఎనిమిదేళ్లవుతున్నప్పటికీ ప్రజల్లో ఆయనకున్న ఛరిష్మా తగ్గలేదు. 2001 నుంచి 2014 వరకు ఆయన రాష్ట్రాన్ని నడిపించిన తీరు, అంతర్జాతీయంగా మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు గుజరాత్ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గుజరాత్ మనం తయారు చేసుకున్నదే అంటూ మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గుజరాత్ మోడల్నే అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెబుతూ ఉండడం గమనార్హం. బిల్కిస్ బానో దోషుల విడుదల గుజరాత్ మత ఘర్షణల సమయంలో జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను శిక్షా కాలం కంటే ముందుగానే విడిచిపెట్టడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ముస్లిం వర్గంపై దీని ప్రభావం అత్యధికంగా ఉంది. 6.5 కోట్లున్న గుజరాత్ జనాభాలో ముస్లింలు 11% ఉన్నారు. 25 అసెంబ్లీ స్థానాల్లో వీరు ప్రభావం చూపించగలరు. బిల్కిస్ బానోకి న్యాయం జరగాలని వీరు చేస్తున్న ఆందోళనలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న చర్చ జరుగుతోంది. కరెంట్ కష్టాలు దేశంలో కరెంట్ చార్జీలు అత్యంత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ నెల తిరిగేసరికల్లా వచ్చే బిల్లుని చూసి సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. ఇక కమర్షియల్ విద్యుత్ టారిఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పరిశ్రమలకిచ్చే కరెంట్ చార్జీలు ఇతర రాష్ట్రాల్లో యూనిట్కి రూ.4 ఉంటే గుజరాత్లో ఏకంగా రూ.7.50గా ఉండడంతో వాణిజ్యవేత్తల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఆప్, కాంగ్రెస్ గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీలు ఇచ్చారు. రైతు సమస్యలు గుజరాత్ రాష్ట్రాన్ని గత రెండేళ్లుగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పంట నీటిపాలై రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి. అయినప్పటికీ వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. ఇక అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో రైతుల దగ్గర్నుంచి ప్రభుత్వం భారీగా భూముల్ని సేకరించింది. అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు, వడోదర, ముంబై ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టు కోసం చేసిన భూ సేకరణ వివాదాస్పదమైంది. పేపర్ లీక్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్ష పేపర్ల లీకేజీ యువతలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. తరచుగా పేపర్స్ లీక్ కావడం పరీక్షలు వాయిదా పడడం నిరుద్యోగుల ఆశల్ని అడియాసలు చేస్తోంది. గత ఏడేళ్ల కాలంలో ఎనిమిది సార్లు వివిధ పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీకయ్యాయి. మోర్బీ వంతెన దుర్ఘటన సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ 30న కుప్పకూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఈ సారి ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాంట్రాక్టులు, స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి బదులుగా ప్రమాద సమయంలో నదిలోకి దూకి ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే కాంతి అమృతియకు టికెట్ ఇవ్వడం చూస్తేనే దీని ప్రభావం ఎంత ఉందనేది అర్థమవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్లో ఆప్ సత్తా ఎంత?.. కేజ్రీవాల్ కింగ్మేకర్ అవుతారా?
2014 లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్ మోడల్ గురించి నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు అదే తరహాలో నడుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో ఢిల్లీ మోడల్ అనే ప్రచారంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ముక్కోణపు పోటీకి తెరతీశారు. ఇంతకీ ఆమ్ ఆద్మీ పార్టీ కింగా? కింగ్మేకరా? రానున్న ఎన్నికల్లో ఏం జరగబోతోంది? ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికల్ని స్వయంగా తన భుజస్కంధాలపై మోస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దిగాలని నిర్ణయించిన దగ్గర్నుంచి వారానికి ఒకసారి రాష్ట్రానికి వస్తూ రోడ్డు షోలు సమావేశాలు నిర్వహిన్నారు. ఆప్లో మరో నేత సందీప్ పాఠక్ బూత్ మేనేజ్మెంట్, సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటే నిరంతరం సీట్ల వారీగా అంతర్గత సర్వేలు చేయిస్తూ వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళుతున్నారు. సంక్షేమ మంత్రం కొత్తగా గుజరాత్ గోదాలోకి దిగిన పార్టీ కావడంతో ప్రజల్ని తమవైపు ఆకర్షించడానికి ఆప్ సంక్షేమ మంత్రాన్ని జపిస్తోంది. ఢిల్లీ మోడల్ పరిపాలనను చూపిస్తూ విద్య, ఆరోగ్య రంగ రూపురేఖల్ని మార్చేస్తామని చెబుతోంది. గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,, నిరుద్యోగ భృతి నెలకి రూ.3 వేలు, 18 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం, కొత్తగా ప్రాక్టీసు మొదలు పెట్టే లాయర్లకి స్టైఫండ్ , ప్రతీ సర్పంచ్కి నెలకి రూ.10 వేల వేతనం ఇలా ఒక్కోసారి ఒక్కో హామీని ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాకుండా ఆప్ అవతరించినా అది పార్టీ సాధించే అతి పెద్ద విజయమని భావిస్తోంది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఆప్ రాకతో కాంగ్రెస్ భారీగా నష్టపోవడం చూశాం. గుజరాత్లో కూడా అదే జరుగుతుందన్న అంచనాలున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత హామీలు ఇచ్చే వలలో పడవద్దంటూ ప్రచారం చేస్తున్నారు. అ వలలో పడితే స్వయంసృమద్ధి సాధించి గుజరాత్ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోలేమంటూ కేజ్రీవాల్కి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ఓట్లను చీలుస్తుంది ? ఇప్పటివరకు నిర్వహించిన వివిధ సర్వేలు ఆప్ 22% వరకు ఓటు షేరు సాధిస్తుందని చెబుతున్నాయి. కాంగ్రెస్కి అండదండగా ఉండే ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు ఆప్ ఉచిత హామీలతో ఆప్ వైపు మొగ్గు చూపించవచ్చు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు 22% ఉంటే, ఒబీసీలు 40% వరకు ఉన్నారు. ఈ ఓటు బ్యాంకులో అత్యధికం ఆప్కు మళ్లిపోయే అవకాశాలున్నాయి. ఢిల్లీ మోడల్ పాలనపై ఆసక్తి ఉండే అర్బన్ ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవడానికి ఆప్ ప్రయత్నిస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్య రంగాల్లో ఢిల్లీలో వచ్చిన మార్పుల్ని ఆప్ వివరిస్తోంది. గత 20 ఏళ్లుగా వరసపెట్టి బీజేపీ విజయాలు సాధిస్తున్న 66 పట్టణ స్థానాలపై ఆప్ ఎక్కువగా దృష్టి సారించింది. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏడు కార్పొరేషన్లలో కలిపి ఆప్ 14% ఓటు షేరు సాధించింది. రాజ్కోట్లో 19%, అహ్మదాబాద్లో 20%, సూరత్లో 28% ఓటు షేరు సాధించిన ఆత్మవిశ్వాసంతో కనీసం కింగ్ మేకర్గా నిలుస్తామని ఆప్ ధీమాగా ఉంది. అనుకూలం.. - ఆప్ పరిపాలన కొత్తగా ఉండబోతోందని దిగువ మధ్యతరగతి ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడడం - ఆప్ ఇచ్చే ఉచిత పథకాల పట్ల వివిధ వర్గాల ప్రజల్లో ఆకర్షణ - ఢిల్లీ మోడల్ పాలన చూపించి ఓటర్లను తమ వైపు తిప్పుకునే నేర్పరితనం - రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి విస్తృతంగా ప్రచారం చేయడం ప్రతికూలం.. - క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేదు, ప్రజాదరణ కలిగిన నాయకులెవరూ ఆప్లో చేరలేదు - గుజరాత్ రాజకీయాలపై సీనియర్ నాయకులకు అవగాహన లేమి - ఎన్నికల బరిలో మొదటిసారి దిగడంతో నిర్ధారంగా ఓటు బ్యాంకు లేదు. - బీజేపీకి బీ టీమ్ ఆప్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న విస్తృత ప్రచారం – సాక్షి, నేషనల్ డెస్క్