Heavy
-
భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తం
బెంగళూరు: భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన కర్నాటకలోని బెంగళూరు నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది.నీటి ప్రవాహం కారణంగా పలు రహదారులును అధికారులు మూసివేశారు. బాధితులను రక్షించేందుకు అధికారులు పడవలను వినియోగిస్తున్నారు. మరోవైపు పలువురు బెంగళూరువాసులు సోషల్ మీడియాలో అధికారులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు మేరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Karnataka | Residents of an Apartment in Yelahanka are being rescued through boats.Due to incessant heavy rain, waterlogging can be seen at several places in Bengaluru causing problems for the residents in Allalasandra, Yelahanka pic.twitter.com/AekmTVOAlW— ANI (@ANI) October 22, 2024మీడియాకు అందిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం వరకు బెంగళూరు రూరల్ పరిధిలో 176 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బెంగళూరు అర్బన్ ప్రాంతంలో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి 20కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి మళ్లించారు. నగరంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు -
10 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్లో భారీ వర్షాలకు అక్కడి జనం అతలాకుతలమవుతున్నారు. తూర్పు యూపీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాబోయే ఐదారు రోజుల్లో ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర తదితర 10 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, సిక్కిం, అండమాన్- నికోబార్ దీవులలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, కోస్టల్ కర్నాటక, లక్షద్వీప్ తదితర దక్షిణాది ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అందించిన డేటా ప్రకారం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 106గా నమోదైంది. ఈ ఏడాది రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా వచ్చాయి. రాజస్థాన్, గుజరాత్లలో రుతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమైంది. ఢిల్లీలో రుతుపవనాల ఉపసంహరణ సాధారణంగా సెప్టెంబర్ 25న జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం గణనీయంగా ఆలస్యమవుతోంది.ఇది కూడా చదవండి: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే? -
భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పూణె పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు నగరాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాని మోదీ ఈరోజు (గురువారం) పుణె మెట్రో రైలు ప్రారంభోత్సవంతో పాటు రూ.22,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల దృష్ట్యా ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.భారీ వర్షాల కారణంగా పూణె, పింప్రీ చించ్వాడ్లలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కుండపోత వర్షాల కారణంగా గోవండి-మాన్ఖుర్ద్ మధ్య నడిచే ముంబై లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుణె జిల్లాకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పౌరులు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద సుమారు రూ. 130 కోట్లతో అభివృద్ధి చేసిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో నేడు ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూపొందించిన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ)సిస్టమ్ను కూడా ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్కు రూ. 850 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాలన్నీ నేడు రద్దయ్యాయి.ఇది కూడా చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు -
దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.కోస్తా ఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు(సోమవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్లోని దక్షిణ ప్రాంతంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు సెప్టెంబర్ 11 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.ఇది చదవండి: Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్ -
ఫిలిప్పీన్స్ను ముంచెత్తిన వరదలు
మనీలా: ఉత్తర ఫిలిప్పీన్స్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. ఉష్ణమండల తుఫాను యాగీ మనీలాకు ఆగ్నేయంగా ఉన్న కామరైన్స్ నోర్టే ప్రావిన్స్లోని విన్జోన్స్ పట్టణ తీరాన్ని తాకింది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు కామరైన్స్ సుర్ ప్రావిన్స్లోని నాగా పట్టణంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన లుజోన్లో టైఫూన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను వాతావరణం కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. రాజధానికి సమీపంలో ఉన్న మరికినా నదిలో నీటిమట్టం పెరిగిన దృష్ట్యా స్థానికులను హెచ్చరిస్తూ అధికారులు సైరన్ మోగించారు.ఉత్తర సమర్ ప్రావిన్స్లోని కోస్ట్ గార్డు సిబ్బంది రెండు గ్రామాలకు చెందిన 40 మందిని రక్షించారు. తుఫాను కారణంగా పలు ఓడరేవుల్లో షిప్పింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. తుఫాను వాతావరణం కారణంగా పలు దేశీయ విమానాల రాకపోకలను రద్దుచేశారు. -
Pakistan: భారీ వర్షాలతో అతలాకుతలం.. పెరిగిన వరద ముప్పు
పాకిస్తాన్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. జనం నానా అవస్థలు పడుతున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగర పరిధిలోని కోట్-ముర్తాజా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక ఇంటి పైకప్పు కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.పాక్లోని బలూచిస్తాన్, దక్షిణ పంజాబ్లోని పలు జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. ట్యాంక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ట్యాంక్-సౌత్ వజీరిస్తాన్ రహదారిని మూసివేయడంతో పాటు వరద హెచ్చరికలు కూడా జారీ చేశారు.ఆగస్టు 4 నుంచి 7 వరకు కరాచీలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్తాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబూల్ నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని పేర్కొంది. కోహ్-ఎ-సులైమాన్లోని రోజాన్లోని 100కు పైగా ఇళ్లలోకి వరదనీరు చేరింది. 200 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాజన్పూర్ డిప్యూటీ కమిషనర్ మీడియాకు తెలిపారు. -
ఢిల్లీలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం
దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఫలితంగా వాహనదారులు, పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. భారత వాతావరణశాఖ జూలై 22 నుంచి 24 వరకు ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 నుండి 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 28 డిగ్రీల మధ్య ఉండవచ్చు. జూలై 25, 26 తేదీల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 34, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 27 డిగ్రీల మధ్య ఉండవచ్చు.గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్సీఆర్లో విపరీతమైన వేడి వాతావరణానికి తోడు కాలుష్య తీవ్రత కూడా అధికంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం కురిసిన వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ చెరువులుగా మారుతుంటాయి. -
అఫ్గానిస్తాన్లో వర్ష బీభత్సం.. 35 మంది మృతి
అఫ్గానిస్తాన్లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో కురిసిన భారీ వర్షాలకు వివిధ దుర్ఘటనలు చోటుచేసుకోవడంతో 35 మంది మృతి చెందారని తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు.వర్షాల కారణంగా నంగర్హార్ ప్రావిన్స్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ సెడిఖుల్లా ఖురేషి మీడియాకు తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని, సుర్ఖ్ రోడ్ జిల్లాలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారని ఖురేషీ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారన్నారు.భారీవర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. భారీ ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. నంగర్హార్లోని ప్రాంతీయ ఆసుపత్రి అధిపతి అమీనుల్లా షరీఫ్ మాట్లాడుతూ ఇప్పటివరకు 207 మంది బాధితులు వివిధ ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చారన్నారు. కాగా గత మే 10, 11 తేదీల్లో దేశంలో కురిసిన భారీ వర్షాలకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. -
ప్రపంచంలోనే బరువైన వ్యక్తి!.. తగ్గాడు కానీ..!
ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి వాకింగ్ కూడా చేయలేడు. ఎవరో ఒకరు సాయం లేనిదే వాకింగ్ చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ కిలోలు కొద్ది బరువు తగ్గాడు. పైగా 40 ఏళ్లకు మించి బతకడని తేల్చి చెప్పిన వైద్యుల మాటే తప్పు అని ప్రూవ్ చేసి చూపించాడు. ఇంతకీ అతను ఎలా అన్ని కిలోల బరువు తగ్గాడు? అది సరైనదేనా అంటే..ఒకప్పడూ ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి, పాల్ మాసన్. అతను ఏకంగా 444.5 కిలోల బరువు ఉండేవాడు. అయితే ప్రస్తుతం అతను బరువు కోల్పోయాడు కానీ నడవలేడు. చెప్పాలంటే వాకింగ్ వంటివి చేయకుండానే బరువు తగ్గాడు. డాక్టర్లు సైతం అతడి భారీ కాయాన్ని చూసి మహా అయితే 40 ఏళ్లు బతుకుతాడని తేల్చి చెప్పేశారు. అయితే మాసన్ వైద్యుల అంచనాలను తారుమారు చేస్తూ..ఈ ఏడాది 64వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు మాసన్. ప్రస్తుతం ఆయన 288 కిలోల బరువు ఉన్నారు. అయితే ఆయన నడవలేరు మంచానికే పరిమితమయ్యారు. నిజానికి మాసన్ అత్యంత స్థూలకాయుడిగా మారడానికి కరోనా మహమ్మారి టైంలో లాక్డౌన్ కారణంగా డిప్రెషన్కి సంబంధించిన మందులు ఓవర్ డోస్ తీసుకున్నాడు. అదీగాక ఆ టైంలోనే బ్రిటన్లో అత్యంత బరువైన వ్యక్తిగా ఉన్న జాసన్ హోల్టన్ మరణం అతడి మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. దీంతో అతడు విపరీతంగా బరువు పెరిగిపోయాడు. అయితే అను గ్యాస్ట్రిక్ బైపాస్ వంటి సర్జరీలతో 120 కిలోల వరకు బరువు తగ్గించుకోగలిగాడు. ఆ తర్వాత అదనపు స్కిన్ని తొలగించుకునేందుకు యూఎస్లో మరికొన్ని ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఆ సమయంలోనే తన జీవిత భాగస్వామిని కూడా కలుసుకున్నాడు. అయితే ప్రస్తుతం తాను ఇంకా చాలా శారీరక, మానసిక సమస్యలు ఫేస్ చేస్తున్నాని, తినే ఆహారం క్వాండిటీ పెరుగుతుందే గానీ తగ్గదని చెబుతున్నాడు మాసన్. అంతేగాదు తన అధిక బరువుకు ప్రధాన కారణం మానసిక సమస్యలని కూడా తెలిపాడు. చిన్నతనంలో తన తండ్రి చేతిలో శారీరక వేధింపులకు గురయ్యానని, ఎలాపడితే అలా కొట్టేవాడని చెప్పుకొచ్చాడు. ఆరేళ్ల వయస్సు నుంచే తనని కుటుంబ సభ్యులు దారుణంగా వేధించేవారని చెప్పుకొచ్చాడు. ఇక్కడ మాసన్ వ్యక్తిగత మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడం సాధ్యపడలేదు. దీని కారణంగా మాసన్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగ్గా అవ్వలేదు. ఇంకా పలు సమస్యలు ఫేస్ చేస్తున్నట్లు కూడా వివరించాడు. ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే.. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏ అనారోగ్య సమస్య అయినా నయం అవుతుంది. అందువల్ల మానసికంగా స్ట్రాంగ్గా ఉండి ఆరోగ్యకరమైన రీతిలో బరవు తగ్గేందుకు యత్నించాలి. ఆరోగ్యకరమైన రీతిలో బరవు తగ్గాలంటే..బరువు తగ్గడం చాలా కష్టమైన పని అయినప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారం, వ్యాయామం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక నియమానుసారంగా చేస్తే..ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గడం సులభమని అంటున్నారు. అందుకోసం పాటించాల్సినవి ఏంటంటే..చక్కెరను తగ్గించండితాజా, కాలానుగుణ పండ్లు తినడంపై దృష్టి పెట్టండిఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంమెడిటరేనియన్ డైట్ ఫాలో అవ్వడంక్రమం తప్పకుండా వ్యాయామంఎక్కవు నీరు త్రాగడంటైంకి మంచిగా నిద్రపోవడం. (చదవండి: నవ్వడం' కోసం ఏకంగా చట్టం..! ప్రతిరోజూ..) -
17 రాష్ట్రాల్లో దంచికొట్టుడు వానలు
దేశం అంతటా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా గోవాలోని రైల్వే సొరంగ మార్గంలోకి నీరు చేరడంతో కొంకణ్ రైల్వే రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని పాతాళగంగ లాంగ్సీ టన్నెల్ సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.బీహార్, హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీచేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, గోవాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా జూలై 12-14 మధ్య మహారాష్ట్ర, కోస్టల్ కర్ణాటకలో భారీ వర్ష సూచనను అందిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో జులై 11-13 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్, తూర్పు రాజస్థాన్ సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, మండీ, కాంగ్రా, కిన్నౌర్, కులు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా 28 రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. 32 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 16 నీటి సరఫరా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అసోంలోని 26 జిల్లాల్లో 17 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు 84 మంది మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కజిరంగా నేషనల్ పార్క్లో వరదల కారణంగా తొమ్మిది ఖడ్గమృగాలు సహా మొత్తం 159 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. -
పొంచివున్న వర్ష బీభత్సం.. పలు రాష్ట్రాలు అప్రమత్తం
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాలకు వాతావరణశాఖ భారీ వర్ష సూచనలు జారీ చేసింది. వర్షాల కోసం వేచిచూస్తున్న జనానికి ఉపశమనం కలగడంతోపాటు ప్రతీరోజు వర్షాలు కురిసే అంచనాలున్నాయి. ఇప్పటికే వర్షాలు కురుస్తున్న రాష్ట్రాల్లో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. बिहार में 10-12 जुलाई, 2024 के दौरान अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) वर्षा से बहुत भारी (115.5-204.4 मिलीमीटर) वर्षा होने की संभावना है। Bihar is likely to get isolated heavy (64.5-115.5 mm) to very heavy rainfall (115.5-204.4 mm) during 10th-12th July, 2024. pic.twitter.com/Q3lsEOWQLK— India Meteorological Department (@Indiametdept) July 8, 2024భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై 8 నుంచి 12 వరకూ హిమాలయప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, అరుణాచల్ప్రదేశ్, అసోం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. అదేవిధంగా జూలై 12 వరకూ జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర తదితర రాష్టాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి.మరోవైపు భారీ వర్షాల కారణంగా బీహార్లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పూర్వ్ చంపారణ్, గోపాల్గంజ్, పశ్చిమ చంపారణ్ తదితర ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. భారీ వర్ష సూచనల నేపధ్యంలో ముంబై, ఠాణె, నవీ ముంబైతో పాటు రత్నగిరి, సింధుదుర్గ్ తదితర గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.तटीय कर्नाटक में 08 जुलाई, 2024 को अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) से बहुत भारी वर्षा (115.5-204.4 मिलीमीटर) के साथ अत्यंत भारी वर्षा (>204.4 मिलीमीटर) होने की प्रबल संभावना है। pic.twitter.com/7iaS8uRXCl— India Meteorological Department (@Indiametdept) July 8, 2024 -
రాజస్థాన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
రుతు పవనాల రాకతో గత మూడు నాలుగు రోజులుగా రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోటా జిల్లా నుంచి మధ్యప్రదేశ్కు వెళ్లే రహదారి తెగిపోయింది. ఇక్కడి పార్వతి నది ఉప్పొంగుతుండటంతో రోడ్డుపై నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా షియోపూర్, గ్వాలియర్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఇక్కడికి సమీప గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మోకాళ్లలోతు నీటి మధ్య వివిధ గ్రామాల ప్రజలు కాలం వెళ్తదీస్తున్నారు. టోంక్ జిల్లాలో భారీ వర్షం కారణంగా బిసల్పూర్ డ్యామ్ నీటిమట్టం 310.09 ఆర్ఎల్ మీటర్లకు చేరుకుంది. వరద ముప్పు పొంచివున్న నేపధ్యంలో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.జైపూర్లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మేవార్ ప్రాంతంలో జూలై 8 నుండి 10 వరకు భారీ వర్షాలు కురియనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురియనున్నాయి. జులై 10 నాటికి రుతుపవనాలు మరింత బలపడతాయని, అప్పడు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
ఏడాది వర్షం ఒకే రోజు.. దుబాయ్ అతలాకుతలం.. 18 మంది మృతి!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ భారీ వర్షాలకు తల్లడిల్లిపోయింది. ఎడతెగని వర్షాలు వీధులు, ఇళ్లు, మాల్స్ను జలమయం చేశాయి. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. సోమవారం అర్థరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒమన్లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు. ఏడాది మొత్తం మీద కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం అతలాకుతలమైపోయింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. Everything Problem has a Solution, But...#Dubai #dubairain #DubaiStorm #dubairains #meme #Dubaifloods pic.twitter.com/IqoiuElg3J — Ashique Hussain / عاشق حسين (@47aq_) April 17, 2024 ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ వాతావరణ కేంద్రం దుబాయ్, అబుదాబి, షార్జా ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోయే 48 గంటల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని తెలిపింది. బుధవారం వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Easy guys @LarryMadowo @kipmurkomen #DubaiMetro pic.twitter.com/sPyy97EMBK — EVOLUTION EXPRESS LOGISTICS (@LetsGoEvolution) April 16, 2024 జాతీయ వాతావరణ కేంద్రం నిపుణుడు అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. ప్రజలు తమ వాహనాలను వరద ప్రాంతాలకు దూరంగా. సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలలో పార్క్ చేయాలని సూచించారు. This is the Dubai airport after the biggest flood of history. pic.twitter.com/Kv2Hgam9jM — Baba Banaras™ (@RealBababanaras) April 17, 2024 దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ప్రతినిధి మాట్లాడుతూ తుఫాను కారణంగా మంగళవారం మధ్యాహ్నం 25 నిమిషాల పాటు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశామని, ఆ తరువాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మరోవైపు మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 🚨🇦🇪 Severe weather today in Dubai#برشلونه_باريس #TSTTPD #bbtvi #Dubai #dubairain #dubairains pic.twitter.com/n426GYnZX7 — Imranzeemi (@imranzeemi) April 17, 2024 వీటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక వందలాది మంది జనం దుబాయ్ మాల్లో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ అంతటా పాఠశాలలను మూసివేశారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 80 మిల్లీమీటర్ల (3.2 అంగుళాలు) కంటే అధిక వర్షపాతం నమోదయ్యింది. దుబాయ్లో కురిసిన భారీ వర్షానికి విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 24 గంటల్లో దాదాపు 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక రోజులో దాదాపు 1.5 సంవత్సరాల సగటు వర్షపాతం. Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO — Pagan 🚩 (@paganhindu) April 17, 2024 తుఫాను కారణంగా పలు పాఠశాలలను మూసివేయగా, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ భారీ వర్షాలు దాదాపు అన్ని అరబ్ దేశాలలో విపత్తుకు కారణంగా నిలిచాయి. వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వర్షపాతం సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ శాస్త్రవేత్త అహ్మద్ హబీబ్ తెలిపిన వివరాల ప్రకారం క్లౌడ్ ఫార్మేషన్ల నుంచి ప్రయోజనాన్ని పొందడానికి గల్ఫ్ స్టేట్లోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ అల్ ఐన్ విమానాశ్రయం నుండి సీడింగ్ విమానాలను పంపింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనూ భారీ వర్షాలు పడ్డాయి. 🚨 UAE🇦🇪 View of Dubai Airport after heavy Rain pic.twitter.com/wY2ALp35A8 — Izlamic Terrorist (@raviagrawal3) April 16, 2024 -
Afghan: ఆకస్మిక వరదలు.. 33 మంది మృతి!
అఫ్గానిస్తాన్లో కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. రాజధాని కాబూల్తో పాటు పలు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనాన్ సాక్ దేశంలో సంభవించిన వరదలకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. వరదల కారణంగా దేశంలో 600కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని అబ్దుల్లా జనాన్ తెలిపారు. వర్షాల కారణంగా 200 పశువులు మృతిచెందాయని, 800 హెక్టార్లలోని పంటలు దెబ్బతిన్నాయన్నారు. 85 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని ,పశ్చిమ ఫరా, హెరాత్, సదరన్ జాబుల్, కాందహార్లకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అఫ్గానిస్తాన్లోని 34 రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత ఫిబ్రవరిలో తూర్పు అఫ్గానిస్తాన్లో భారీ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. మార్చిలో కురిసిన వర్షాలకు 60 మంది మృత్యువాత పడ్డారు. అఫ్గానిస్తాన్లోని వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి గత ఏడాది హెచ్చరించింది. దీనికి గ్లోబల్ వార్మింగ్ కారణమని పేర్కొంది. -
తెలంగాణ:నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. కాగా, సోమవారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 40.0 డిగ్రీల సెల్సియస్, అలాగే ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు.. 39 మంది మృతి!
ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలతో పాటు హిమపాతం కారణంగా 39 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా జనం గాయపడ్డారు. ఈ వివరాలను ఖామా ప్రెస్ వెల్లడించింది. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయెక్ మాట్లాడుతూ హిమపాతం కారణంగా వేలాది పశువులు కూడా మృతి చెందాయన్నారు. హిమపాతం, వర్షం కారణంగా 637 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. 14 వేల పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా నాలుగు రోజులుగా కురుస్తున్న హిమపాతం, మంచు తుఫాను తర్వాత సోమవారం సలాంగ్ హైవేను తెరిచారు. సార్ ఎ పుల్ నివాసి అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ భారీవర్షాలు, కురుస్తున్న హిమపాతం తమను ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. మంచు కారణంగా భారీ సంఖ్యలో పశువులు మృతి చెందుతున్నాయన్నారు. పలు రోడ్లు బ్లాక్ అయ్యాయని, ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కాగా పశువుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాల్ఖ్, జాజ్జాన్, బద్గీస్, ఫర్యాబ్,హెరాత్ ప్రావిన్సులలో పశువుల యజమానులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. -
ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను అటు దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పొగమంచులో కప్పుకుని పోయేలా చేస్తే... ఇటు దక్షిణాదిలో భారీ వర్షాలకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుపాను ప్రభావం కారణంగా ఇప్పటికే రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో విజిబిలిటీ బాగా తగ్గిపోయిందని, కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి అని భారత వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 28.2 డిగ్రీ సెల్సియస్గా నమోదు కావడం గమనార్హం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘మిధిలీ’ తుఫాను ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరం దాటింది. కానీ దీని ప్రభావం ఈశాన్యం నుంచి అండమాన్ నికోబార్ వరకు కనిపిస్తోంది. ఫలితంగా భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు యూపీలోనూ చలిగాలులు వీస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, మిజోరాం, త్రిపురసహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల సమీపంలో గంటకు 50-60 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు. తమిళనాడులో.. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో జనం పలు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కడలూరు, మైలదుతురై, నాగపట్నం, తిరువారూర్, పుదుచ్చేరిలోని కారైకల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. #COMK Daily #Weather Update. 17th Nov. '23 #NEM2023 The deep depression over Bay of Bengal is expected to become a Cyclone in the next few hours while it continues to move towards Bangladesh coast. In the meanwhile the Cyclonic circulation near Sri Lanka continues to persist and… pic.twitter.com/rmUN5qDHNt — Chennai Rains (COMK) (@ChennaiRains) November 17, 2023 చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, తంజావూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ఐదు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపధ్యంలో తమిళనాడులోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. అలాగే పుదుచ్చేరి, కారైకల్లలో పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఇది కూడా చదవండి: 15 ఏళ్లకే అమ్మ.. 33కు అమ్మమ్మ.. కొత్త ట్విస్ట్ ఇదే! I look forward to the music and rain that I enjoyed listening to back in the day.i love western Ghats Manjolai. #kmtr#LatinGRAMMY @ambai_dd @AnandaVikatan @BBC_Travel @ChennaiRains @supriyasahuias @Collectortnv @venki_ranger @Vish_speaks @praddy06 @ParveenKaswan @SudhaRamenIFS pic.twitter.com/4kMT9erZ6v — manjolai selvakumar 0+ (@Mselvak44272998) November 17, 2023 -
హైవే పెట్రోలింగ్పై అవగాహన లేక ప్రాణాలు పోతున్నాయ్!
గత శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు రాజధాని ఏసీ బస్సు బయలు దేరింది. రాత్రి 2.20కి నార్కెట్ పల్లి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఫ్లైఓవర్ పైకి చేరింది. అంతకు 40 నిమిషాల ముందు ఆ వంతెన దిగే సమయంలో ఓ లారీ ఇంజిన్ ఫెయిల్ అయి సెంట్రల్ మీడియన్ పక్కన నిలిచిపోయింది. ఎలక్ట్రికల్ సిస్టం పనిచేయకపోవటంతో లారీ వెనక రెడ్, బ్లింకర్ లైట్లు వెలగలేదు.. డ్రైవర్ దిగిపోయి విషయాన్ని యాజమానికి చెప్పి పక్కన కూర్చుండిపోయాడు.. ఆ సమయంలో వంతెనపై లైట్లు కూడా వెలగటం లేదు. 80 కి.మీ.వేగంతో వచ్చిన రాజధాని బస్సు ఆ లారీని బలంగా ఢీకొంది. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై వాహనదారులకు అవగాహన లేకపోవటంతో భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దానికి ఈ బస్సు ప్రమాదమే తాజా ఉదాహరణ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను విస్తరిస్తుండటంతో రోడ్లు విశాలంగా మారుతున్నాయి. ఊళ్లుండే చోట ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా వంతెనలు నిర్మిస్తున్నారు.. పట్టణాలుంటే బైపాస్ రూట్లు ఏర్పాటు చేస్తున్నారు.. దీంతో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఏదైనా పెద్ద వాహనం హైవే మీద చెడిపోయి నిలిచిపోయిన సందర్భాల్లో మాత్రం పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళ, మలుపుల వద్ద వాహనాలు నిలిచిపోయి ఉంటే, వెనక వచ్చే వాహనాలు వాటిని ఢీకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినా, దానిపై అవగాహన లేకపోవటమే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. జాతీయ రహదారి హెల్ప్లైన్ నెంబరుకు ఫోన్ చేసి ఉంటే, సిబ్బంది వచ్చి లారీని తొలగించి ఉండేవారు. కనీసం, అక్కడ లారీ నిలిచిపోయి ఉందని తెలిసే ఏర్పాటయినా చేసి ఉండేవారు. అదే జరిగితే ఈ ప్రమాదం తప్పి ఉండేది. ఏంటా హెల్ప్లైన్ వ్యవస్థ? 1033.. ఇది జాతీయ రహదారులపై కేంద్రం కేటాయించిన హెల్ప్లైన్ నెంబర్. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా భారీ వాహనం నిలిచిపోయినా.. ఈ నెంబరుకు ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు. కానీ, దీనిపై ప్రజల్లో అవగాహనే లేకుండా పోయింది. ఏం సాయం అందుతుందంటే.. ప్రతి 50–60 కి.మీ.కు ఓ సహాయక బృందం అందుబాటులో ఉంటుంది. స్థానిక టోల్ బూత్ కు అనుబంధంగా ఇది వ్యవహరిస్తుంది. ఈ బృందంలో మూడు వాహనాలుంటాయి. అంబులె న్సు, పెట్రోలింగ్ వాహనం, క్రేన్ ఉండే టోయింగ్ వెహికిల్. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్ప్లైన్కు ఫోన్ చేయగానే ఘటనా స్థలికి హైవే అంబులెన్సు, పెట్రోలింగ్ వాహనాలు చేరుకుంటాయి. గ్రాయపడ్డవారికి ప్రాథమిక చికిత్స అందించి, అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి వెంటనే తరలిస్తారు. ఆసుపత్రికి వెళ్లేలోపు కావాల్సిన సాధారణ వైద్యాన్ని అందించే ఏర్పాటు అంబులెన్సులో ఉంటుంది. ప్రమాద స్థలిలో వాహనాల చుట్టూ బారికేడింగ్ చేస్తారు. ఏదైనా భారీ వాహనం ఫెయిలై రోడ్డుమీద ఆగిపోతే టోయింగ్ వాహనాన్ని తెచ్చి వెంటనే ఆ వాహనాన్ని రోడ్డు పక్కకు తరలిస్తారు. దీనివల్ల వేరే వాహనాలు ఆ చెడిపోయిన వాహనాన్ని ఢీకొనే ప్రమాదం తప్పుతుంది. హెల్ప్లైన్ ఎలా పనిచేస్తుంది..: అవసరమైన వారు 1033 హెల్ప్లైన్కు (ఉచితం) ఫోన్ చేయాలి. ఢిల్లీలో ఉండే సెంటర్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. అవసరమైన భాషల్లో మాట్లాడే సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ వెంటనే ఫిర్యాదు దారు మొబైల్ ఫోన్కు ఓ లింక్ అందుతుంది. దానిపై క్లిక్ చేయగానే, అక్షాంశరేఖాంశాలతో సహా లొకేషన్ వివరాలు ఢిల్లీ కేంద్రానికి అందుతాయి. వాటి ఆధారంగా ఆ ప్రాంతానికి చెందిన సిబ్బందిని వారు వెంటనే అప్రమత్తం చేస్తారు. ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరుగుతాయి. సమాచారం అందిన వెంటనే అవసరమైన సిబ్బంది ఘటనా స్థలికి బయలుదేరి సహాయ చర్యల్లో పాల్గొంటారు. అవగాహనే లేదు.. జాతీయ రహదారులపై నిర్ధారిత ప్రాంతాల్లో ఈ హెల్ప్లైన్ నెంబరును జనం గుర్తించేలా పెద్ద అంకెలను రాసిన బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతావారోత్సవాలప్పుడు రవాణాశాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఎక్కువ మందిలో దానిపై అవగాహనే లేకుండా పోయింది. జాతీయ రహదారులపై ఏదైనా అవసరం ఏర్పడితే 1033కి ఫోన్ చేయాలన్న సమాచారం ప్రజల్లో ఉండటం లేదు. ఎక్కు వ మంది పోలీసు ఎమర్జెన్సీ (100)కే ఫోన్ చేస్తు న్నారు. 1033కి ఫోన్ చేస్తే, సమాచారం స్థానిక హైవే పెట్రోలింగ్ సిబ్బందితోపాటు లోకల్ పోలీసు స్టేషన్కు కూడా చేరుతుంది. మొక్కుబడి అవగాహన కార్యక్రమాలు కాకుండా, జనానికి బోధపడేలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. -
రూ.5.79 కోట్ల నగదు 16.6 కేజీల పసిడి
మియాపూర్/బన్సీలాల్ పేట్/కరీంనగర్ క్రైం/మహబూబ్నగర్ క్రైం: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరుపుతున్న వాహనాల తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సోదాల్లో సుమారు రూ.5.79 కోట్ల నగదు, 16.646 కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజీరా రోడ్డులో ఉన్న మై హోమ్ జ్యువెల్ ఎదురుగా అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీచేశారు. ఆ వాహనంలో బషీర్బాగ్కు చెందిన కిలుముళ్ల అనిరుధ్ (23), బాలిరాం అక్కే మారుతి, మూసాపేట్కు చెందిన శంకర్దుబే ఆరు బాక్సుల్లో బంగారం, వెండి ఆభరణాలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద సంబంధిత పత్రాలు లేకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వాహనంలో ఉన్న 16.64 కేజీల బంగారు ఆభరణాలు, 23.58 కేజీల వెండి ఆభరణాలను స్వా«దీనం చేసుకున్నట్లు మియాపూర్ సీఐ ప్రేమ్కుమార్ తెలిపారు. మరో ఘటనలో మియాపూర్లోని ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద బాచుపల్లికి చెందిన రాజుకుమార్ ద్విచక్రవాహనాన్ని తనిఖీచేయగా అతని వద్ద రూ.14,93,100 నగదు ఉన్నట్లు గుర్తించారు. సరైన పత్రాలు అతని వద్ద లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కవాడిగూడ, కరీంనగర్లో.. కవాడిగూడలో గాం«దీనగర్, టాస్్కఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో 2.09 కోట్ల నగదు పట్టుబడింది. గాంధీనగర్ పోలీ సు స్టేషన్ పరిధిలోని కవాడిగూడ ఎన్టీపీసీ వద్ద కియా సెల్టోస్ కారు, సుజుకీ యాక్సెస్ ద్విచక్రవాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఈ నగదును సీజ్ చేసినట్లు టాస్్కఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదులు, గాంధీనగర్ ఇన్స్పెక్టర్ ఎన్.రవి చెప్పారు. కరీంనగర్ టూ టౌన్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా రైటర్ సేఫ్ గార్డ్ కంపెనీకి చెందిన వాహనంలో రూ.2,36, 48,494 అక్రమ నగదును జప్తు చేసినట్లు కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బారాయుడు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిపిన తనిఖీల్లో పోలీ సులు రూ.1.19 కోట్ల నగదును సీజ్ చేశారు. వారంలో రూ.109 కోట్లు స్వాదీనం: సీఈఓ వికాస్రాజ్ సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి న నాటి నుంచి వారం రోజుల్లో జప్తు చేసుకున్న మొత్తం నగదు, ఇతర వస్తువుల విలువ రూ.100 కోట్లకు మించిపోయింది. ఇప్పటివరకు జప్తు చేసి న నగదు రూ.58.96 కోట్లకు చేరింది. సోమ వారం రూ.17.16 కోట్లు విలువ చేసే బంగారం, ఇతర ఖరీదైన ఆభరణాలను సీజ్ చేయగా, ఇప్పటివరకు జప్తు చేసిన ఇతర ఖరీదైన లోహాల విలువ రూ.33.62 కోట్లకు చేరింది. సోమవారం రూ.29.67 లక్షలు విలువ చేసే ల్యాప్టాప్లు, కు క్కర్లు, వాహనాలను జప్తు చేయగా, ఇప్పటివరకు సీజ్ చేసిన ఇలాంటి వస్తువుల మొత్తం విలువ రూ.6.89 కోట్లకు చేరింది. దీంతో జప్తు చేసిన మొత్తం నగదు, ఆభరణాలు, ఇతర వస్తువుల విలువ రూ.109.11 కోట్లకు చేరినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రూ.77 లక్షలు విలువ చేసే 6,974 లీటర్ల మద్యం, 625 కేజీల బెల్లం పట్టుకున్నారు. దీంతో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం మద్యం విలువ రూ.6.64 కోట్లకు చేరింది. సోమవారం రూ.29.51 లక్షలు విలువ చేసే 110 కేజీల గంజాయిని పట్టుకోగా, ఇప్పటి వరకు సీజ్ చేసిన మొత్తం గంజాయి విలువ రూ.2.97 కోట్లకు చేరింది. -
108 సేవలకు రూ.725 కోట్లు
సాక్షి, అమరావతి: అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి 108 అంబులెన్స్లు సంజీవనిలా మారాయి. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను నిలబెడుతున్నాయి. ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థకు ఊపిరి పోసింది. 768 అంబులెన్స్ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు ఇప్పటి వరకూ రూ.589 కోట్లను ఖర్చు చేయగా కొత్త వాహనాల కొనుగోలుకు మరో రూ.136 కోట్లకుపైగా వ్యయం చేయడం గమనార్హం. గర్భిణులే అత్యధికం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేల మందికి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్లు సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి 36 లక్షల మంది సేవలు పొందారు. వీరిలో అత్యధికంగా 23 శాతం మంది గర్భిణులుండగా 14 శాతం కిడ్నీ బాధితులు, 11 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులున్నారు. నిర్వహణకు ఏటా రూ.188 కోట్లకు పైగా రోడ్డు ప్రమాదాల బాధితులు, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఎంత త్వరగా ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అంత ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్ల నిర్వహణ, ఉచితంగా అత్యవసర రవాణా సేవలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. క్షేత్ర స్థాయిలో అంబులెన్స్ కార్యకలాపాల కోసం 3700 మందికి పైగా విధులు నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో మరో 311 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి వేతనాలతో పాటు అంబులెన్స్ల నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. ఏడాదికి రూ.172.68 కోట్లను నిర్వహణ కోసం కేటాయిస్తోంది. దీనికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి మొత్తం రూ.188 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా వాహనాలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉండగా మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి తెర దించుతూ సీఎం జగన్ 2020 జూలై 1న ఏకంగా 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా 20 కొత్త అంబులెన్స్లను రూ.4.76 కోట్లతో 2022 అక్టోబర్లో అదనంగా కొనుగోలు చేశారు. దీంతో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీకిపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం మరో రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ఇలా రూ.136.02 కోట్లు అంబులెన్స్ కొనుగోలుకు వెచ్చించారు. తద్వారా నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు కోసం రూ.725.02 కోట్లు ఖర్చు చేశారు. -
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: దేశంలోనూ, రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో సెప్టెంబర్ నెల విద్యుత్ వినియోగం నమోదైంది. జాతీయ స్థాయిలో డిమాండ్తో పోటీ పడుతున్నది మన రాష్ట్రం. 2019 సెప్టెంబర్ నెల మొత్తం వినియోగం 4,855.8 మిలియన్ యూనిట్లు కాగా రోజువారీ సగటు డిమాండ్ 161.86 మిలియన్ యూనిట్లుగా ఉంది. అదే ఈ ఏడాది అదే నెల మొత్తం డిమాండ్ 6,550.2 మిలియన్ యూనిట్లుకాగా, రోజువారీ సగటు వినియోగం 218.34 మిలియన్ యూనిట్లకు చేరింది.అంటే మొత్తం వినియోగం ఐదేళ్లలో 1,694.4 మిలియన్ యూనిట్లు, సగటు వినియోగం 56.48 మిలియన్ యూనిట్లు పెరిగింది. విద్యుత్ వినియోగం పెరుగుతున్నదంటే ఆ మేరకు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందుతున్నాయని అర్థం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పేదలకు ఉచిత, సబ్సిడీ విద్యుత్ను ఇవ్వడంతో పాటు వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల కూడా విద్యుత్ వాడకం పెరిగింది. దీనివల్ల వ్యవసాయం సక్రమంగా జరిగి పంటలు సంవృద్ధి గా పండుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు తమ వృత్తులను నిర్వర్తిస్తూ, విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఆర్థి కంగా స్థిరపడుతున్నారు. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. విదేశీ బొగ్గుకు అనుమతి పొడిగింపు.. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 142 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో ఇదే గరిష్టం. ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ 238 గిగావాట్లు జరిగితే సెప్టెంబరులో అది 240 గిగావాట్లకు చేరుకుంది. పెరుగుతున్న ఈ డిమాండ్ను తీర్చడానికి విద్యుత్ సంస్థలు స్వల్పకాలిక విద్యుత్ మార్కెట్లో తరచుగా విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే ఆగస్టులో బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.9.60 ఉండగా సెప్టెంబర్లో యూనిట్ రూ.9.37గా ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ వారం రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో బొగ్గు కొరతను తీర్చేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు (విదేశీ బొగ్గు)ను సమకూర్చుకోవడానికి వచ్చే ఏడాది మార్చి 2024 వరకు కేంద్రం గడువు పొడిగించింది. -
భారీ జరిమానాలు విధించిన ‘రెరా’
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘన..షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడం.. హియరింగ్కు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ‘రియల్’ సంస్థలపై ‘రెరా’ చర్యలు చేపట్టింది. సాహితీ గ్రూప్నకు చెందిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘రెరా’ రిజిస్ట్రేషన్ లేకుండా ‘సాహితీ సితార్ కమర్షియల్’ పేరుతో రంగారెడ్డిజిల్లా గచ్చిబౌలిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కోసం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు ఇచ్చి విక్రయాలు చేపట్టగా, సాహితీతో పాటు కేశినేని డెవలపర్స్కు అపరాధ రుసుం విధించింది. ఇదే సంస్థ ‘సిసా ఆబోడ్‘ పేరుతో మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకుండా రెరా’ రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసింది. డాక్యుమెంట్లు సమర్పించాలని పలుసార్లు మెయిల్స్ పంపినా స్పందించలేదు. ప్రకటనల ద్వారా మార్కెటింగ్ చేస్తున్న కారణంగా ’రెరా’ నోటీసులు జారీ చేసింది. ఇదే సంస్థ సాహితీ సార్వానీ ఎలైట్ పేరుతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టి సరైన డాక్యుమెంట్లు లేకుండా రెరా రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసింది. పైగా మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా ప్లాట్స్ విక్రయించింది.ఈ ప్రాజెక్టులన్నింటికి కలిపి రూ.10.74 కోట్లు 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో షేక్పేటలో ప్రాజెక్ట్ చేపట్టి ఫారం– ’బి’లో తప్పుడు సమాచారం పొందుపరిచి, వార్షిక, త్రైమాసిక నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ సంస్థకు రూ.6.50 కోట్ల అపరాధ రుసుము విధించింది. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ నేచర్కౌంటీ పేరుతో శేరిలింగంపల్లి మండల మనసానపల్లి గ్రామంలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. దీనిపై ఫిర్యాదు రాగా, షోకాజ్ నోటీసు జారీ చేసి రూ.25లక్షలు అపరాధ రుసుం విధించింది. -
అనధికారిక లాక్ డౌన్లోకి సెంట్రల్ ఢిల్లీ!
ఢిల్లీ: జీ-20 సదస్సుకు రంగం సిద్ధమైంది. అధికారులు భారీ ఏర్పాటు చేశారు. దేశ రాజధానికి రానున్న ప్రతినిధులకు ప్రధాని మోదీ ఫొటోలతో స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. ఆంక్షలతో సెంట్రల్ ఢిల్లీలో అనధికార లాక్డౌన్ కొనసాగుతోంది. లక్షమంది భద్రతా సిబ్భందితో సెంట్రల్ ఢిల్లీ పరిసరాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. నేటి సాయంత్రం నుంచి సెప్టెంబర్ 10 వరకు సెంట్రల్ ఢిల్లీలోకి ఇతర వాహనాలు రాకుండా అనుమతిని నిషేధించారు అధికారులు. ఆంక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. అనుమతి ఉన్న వాహనాలు మినహా మిగిలిన వాటికి ఎంట్రీ ఉండదని అధికారులు తెలిపారు. जी-20 समिट ( दिनांक 9 व 10 सितंबर ) के दौरान, सुगम आवाजाही के लिए यातायात निर्देशिका। Traffic advisory in view of #G20Summit on Sept 9 & 10, 2023, to facilitate hassle free movement of vehicles. यातायात निर्देशिका/Traffic Advisory: https://t.co/fFgh2gcsAK pic.twitter.com/nEO09PFpf9 — Delhi Traffic Police (@dtptraffic) August 31, 2023 సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉండేవారు మినహా మిగిలిన వారికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లపై వారం రోజుల నుంచి ఢిల్లీ పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా భద్రత సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. భారత్ వేదికగా జీ-20 సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు దేశ రాజధానికి హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా పలు ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇదీ చదవండి: మరో వివాదం: ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
కోర్టు కాంప్లెక్స్లోనే లాయర్ దారుణ హత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో దారుణం జరిగింది. కోర్టు కాంప్లెక్స్లో తన ఛాంబర్లో ఉన్న మోను చౌదరి అనే లాయర్ని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. న్యాయవాది తన సన్నిహితులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. కోర్టులో సెక్యూరిటీ కళ్లుగప్పి దుండగులు ఎలా ప్రవేశించారనేది మిస్టరీగా మారింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లాయర్లు తమ ఛాంబర్లలోకి వెళ్లి భోజనాలు చేస్తున్నారు. లాయర్ మోను చౌదరి కూడా తన సన్నిహితులతో కలిసి భోజనం చేస్తుండగా.. దుండగులు అకస్మాత్తుగా తన ఛాంబర్లోకి ప్రవేశించి గన్లతో కిరాతకంగా కాల్చి చంపారు. న్యాయవాది రక్తపు మడుగులు పడి ఉండగా.. దుండగులు తప్పించుకుని పారిపోయారు. ఆయితే.. పోలీసులకు న్యాయవాదులకు మధ్య జరుగుతున్న హాపూర్ లాయర్ల ఆందోళన తర్వాత ఈ ఘటన జరగడం పోలీసులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులో సెక్యూరిటీని దాటుకుని దుండగులు పిస్టళ్లతో ఎలా ప్రవేశించగలిగారనేది మిస్టరీగా మిగిలింది. సెక్యూరిటీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం వివాదాస్పదంగా మారింది. లాయర్ మోను చౌదరి హత్యపై లాయర్ల సంఘాలు భగ్గుమన్నాయి. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హాపూర్ లాయర్ల ఆందోళన.. ఓ లాయర్, అతని తండ్రిపై తప్పుడు కేసు పెట్టినందుకు న్యాయవాదుల సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఈ ఆందోళనలను అదుపుచేయడానికి పోలీసులు.. లాయర్లపై లాఠీఛార్జీ చేశారు. దీంతో న్యాయవాదులపై పోలీసుల చర్యలు హక్కులను భంగపరచడమేనని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. శాంతియుత నిరసనలు చేపట్టిన లాయర్లపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని తప్పబట్టింది. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణేలకు భారీ డిమాండ్
లక్డీకాపూల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్మారక రూ.100 నాణేలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన చిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని ముద్రించింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటి విడతగా 1,2000 నాణేలను ప్రభుత్వం విడుదల చేయగా, వీటి కోసం ఎన్టీఆర్ అభిమానులు పోటీపడుతున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి హైదరాబాద్కు భారీగా తరలివస్తున్నారు. మంగళవారం సైఫాబాద్లోని మింట్ కాంపౌండ్ వద్ద నాణేల అమ్మకాలు ప్రారంభం కాగా, గంటల తరబడి క్యూలో ఉండి ఎన్టీఆర్ నాణేలను చేజిక్కించుకుంటున్నారు. రూ.4,850, రూ.4,380, రూ.4,050గా ధరలు నిర్ణయించిన అధికారులు గిఫ్ట్ బాక్స్తోపాటు వంద నాణేన్ని అమ్ముతున్నారు. -
ఇది యానిమేటెడ్ 3డీ షో కాదు.. ప్రకృతి ఆవిష్కరించిన మెరుపు!
సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలోని కొన్ని వీడియోలను చూస్తే అవి నిజమనే నమ్మకం కలగదు. తాజాగా సోషల్ మీడియాలో వర్షానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వీడియో ఇటీవల ట్విట్టర్లో షేర్ అయ్యింది. మెరుపునకు సంబంధించిన అద్భుతమైన దృశ్యం కెమెరాకు చిక్కింది. దీనిని చూస్తే నమ్మాలని అనిపించదు. ఎందుకంటే ఇది యానిమేటెడ్ 3డీ షో మాదిరిగా కనిపిస్తుంది. ఈ 9-సెకన్ల వీడియో ట్విట్టర్లో మాసిమో అనే పేజీలో షేర్ అయ్యింది. ఈ వీడియోలో రాత్రి వేళ పర్వతంపై మెరుపులు కనిపిస్తాయి. కొన్ని సెకన్ల పాటు ఈ పర్వతంపై మెరుపులతో కూడిన కాంతి కనిపిస్తుంది. ఈ పర్వతంపై ఒక మేఘం కనిపిస్తుంది. ఆ మేఘాల మధ్యలో నుంచి మెరుపులు మెరుస్తుంటాయి. ఈ వీడియోలో ఆ మెరుపు అద్భుతమైన లైటింగ్ షోలా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారి కళ్లు కూడా మిరిమిట్లు గొలుపుతాయి. ఇప్పటివరకు ఈ వీడియోను 54 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వేలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. కొంతమంది వినియోగదారులు ఇది ప్రకృతి అందించిన ప్రత్యేకమైన దృశ్యమని అంటుండగా, మరికొందరు ఈ వీడియో అద్భుతంగా ఉందంటున్నారు. కాగా కొండ ప్రాంతాలలో రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. మెరుపులు, పిడుగులు వంటి సంఘటనలు సాధారణం. కానీ ఈ మెరుపు మెరుస్తున్న విధానం ఎంతో అద్భుతమని అనిపిస్తుంది. ఇది కూడా చదవండి: 2012లో ఇంజినీరింగ్ పూర్తి.. 2023లో ఎంబీబీఎస్లో అడ్మిషన్.. తీరని కల నెరవేరుతోందిలా.. Have you ever seen such stunning upward lightning? Probably one of the most impressive lightning show ever This is Volcan de Agua, Guatemala [📹 bienesinmueblestv: https://t.co/mAnnM9Hcsi]pic.twitter.com/5DAtCEtuRW — Massimo (@Rainmaker1973) August 3, 2023 -
రోడ్లు.. వానపాలు
సాక్షి నెట్వర్క్: భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ నగర్, రామ్నగర్ కాలనీలు నీట మునగడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నిర్మల్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని అంచనా వేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 24,035 మంది రైతులకు చెందిన 33,429 ఎకరాల్లో వరి, సోయా, మొక్కజొన్న, పసుపు పంటలు దెబ్బతిన్నాయి.7 మండలాల్లోని 16 చెరువుల కట్టలు తెగిపోయాయి. బోధన్ మండలం సాలూర శివారులోని మంజీర నది పాత వంతెన పైనుంచి ప్రవహించడంతో తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఖమ్మం జిల్లా కేంద్రాన్ని గురువారం అతలాకుతలం చేసిన మున్నేరు వరద శుక్రవారం ఉదయం నుంచి తగ్గుతూ వస్తోంది. గురువారం రాత్రి 10గంటలకు 30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం రాత్రి ఏడు గంటలకు 18.30 అడుగులకు పడిపోయింది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మున్నేరును పరిశీలించి సహాయక చర్యలపై అధికారులకు సూచ నలు చేశారు. ఖమ్మంలో మున్నేటి వరద, ముంపు ప్రాంతాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించి బాధితులతో మాట్లాడారు. -
పది లక్షల ఎకరాలు మునక
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వానాకాలం పంటలు వరద ముంపునకు గురయ్యాయి. మొలక దశలో ఉన్న వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 10.76లక్షల ఎకరాల్లో నేరుగా నీటి ముంపునకు గురికాగా, మరో 4 లక్షల ఎకరాలు అధిక వర్షాల తాకిడితో మొలక స్థాయిలో ఉన్న పంటలు, వరి నార్లకు నష్టం జరిగింది. ఇలా 16 లక్షలకు పైగా ఎకరాలపై వర్షాల ప్రభావం పడిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరి పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీప ప్రాంతాల్లో గత 20 రోజుల క్రితం వేసిన వరి నాట్లు నీటమునిగాయి. సూర్యాపేట జిల్లా కిష్టాపురం, మౌగిలాయకోట, శాంతినగర్, లక్కవరం, గోండ్రియాల, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కూడా వరి నాట్లు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం జిల్లాలోని జక్కపల్లి, సిద్దెపల్లి, రామచంద్రపురం, పైనంపల్లి, బుద్దారం తదితర గ్రామాల్లో పంటలపై కూడా వరద ప్రభావం పడింది. ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరి నది రెండు వైపులా ఉప్పొంగి కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తుకుంటూ పారింది. అనేక ప్రాంతాల్లో ఒక్క పంట కూడా పనికి వచ్చే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి అధికారులు అంటున్నారు. పత్తిపై అధిక ప్రభావం ఈ సీజన్లో ఇప్పటివరకు 40.73లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. కాగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఈ పంటపైనే పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యా ల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా వేసి న పత్తి విత్తనాలు వర్షాలకు మొలకెత్త కుండానే భూమిలోనే మురిగిపోయాయి. ఇక మొలక స్థాయి లో ఉన్న పత్తి నీటిలో మునిగి దెబ్బతింది. వరినాట్లు కూడా నీట మునిగాయి. ఇప్పటివరకు 15.63లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా.. వీటిలో 5లక్షలకు పైగా ఎకరాల్లో నీరు చేరిందని అధికా రులు చెబుతున్నారు. వరి నార్లు మొత్తం దెబ్బతిన్నాయని, మళ్లీ నార్లు పోసుకోవాల్సిందేనని రైతు లు అంటున్నారు. ఇక సోయాబీన్ సాగు ఇప్పటివరకు 4.14లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఆదిలా బాద్ జిల్లాలో ఈ పంటపై ఎక్కువ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పొలాలను ముంచేసిన గుర్రపుడెక్క భూదాన్పోచంపల్లి: భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి చెరువు నిండి అలుగుపోస్తోంది. ఈ చెరువులోని గుర్రపు డెక్క కూడా కొట్టుకువచ్చి వరి పొలాలను కమ్మేసింది. దీనితో పోచంపల్లిలో 30ఎకరాలు, పిలాయిపల్లిలో 2ఎకరాల వరికి నష్టం జరిగింది. -
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వాన (ఫొటోలు)
-
Hyderabad Rains Latest Photos: తడిసి ముద్దయిన హైదరాబాద్ (ఫొటోలు)
-
డ్రైవరన్నా.. చలో సిరిసిల్ల..!
ఖమ్మం: హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్లు రెన్యూవల్ చేసుకోవడం భారమవుతోంది. గతంలో ఎక్కడికక్కడ రవాణా శాఖ కార్యాలయంలో లైసెన్స్ రెన్యూవల్ చేసేవారు. కానీ గత మే నెల నుంచి రెన్యూవల్ స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్(టీఐడీఈఎస్)ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ సర్టిఫికెట్ జారీకి శిక్షణ కేంద్రం రాష్ట్రం మొత్తం మీద రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాత్రమే ఉంది. దీంతో కనీసం రెండు రోజులు కేటాయిస్తే తప్ప అక్కడకు వెళ్లి వచ్చే పరిస్థితి లేకపోవడంతో డ్రైవర్లు వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. రాష్ట్రమంతటా ఒకటే ట్రాక్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్(టీఐడీఈఎస్)ను ఏర్పాటుచేశారు. ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ట్రాక్ నిర్మించటంతో డ్రైవర్కు ఒకరోజు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై డ్రైవింగ్లో మెళకువలు, సిగ్నలింగ్ సిస్టమ్పై శిక్షణ ఇస్తారు. ఆన్లైన్ తరగతుల ద్వారా జాతీయ రహదారిపై ఎంత వేగంగా వాహనం నడపాలో వివరించి టీఐడీఈఎస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటేనే హెవీ డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. గతంలో దీనిని పెద్దగా పరిగణనలోకి తీసుకోకున్నా ఈ ఏడాది మే నెల నుంచి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో రాష్ట్రమంతటా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు తప్పనిరిగా సిరిసిల్ల వెళ్లాల్సి వస్తోంది. వాస్తవానికి ఇది మంచి కార్యక్రమనే ప్రశంసలు వస్తున్నా.. దూరం కావటం వల్లే డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాగా, కొత్త హెవీ లైసెన్సులు మాత్రం ఎక్కడికక్కడ ఎంవీఐ కార్యాలయాల్లోనే జారీ చేస్తున్నారు. సిరిసిల్ల వెళ్లాలంటే.. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు టీఐడీఈఎస్ సర్టిఫికెట్ కోసం సిరిసిల్ల వెళ్లాల్సి రావడం దూరాభారమేనని చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా డ్రైవర్లను తీసుకుంటే సరైన రవాణా సౌకర్యం లేక ఒక రైలు, ఒక బస్సు లేదంటే రెండు బస్సులు మారాల్సి ఉంటుంది. దీనికి తోడు ఆ ప్రాంతం కొత్తది కావటంతో డ్రైవర్లు ఇబ్బంది పడుతుండగా.. కనీసం రూ.3 వేలకు పైగా వ్యయమవుతోంది. ఇక సిరిసిల్ల ట్రాక్ వద్ద రోజుకు కేవలం 300 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చే అవకాశం ఉండడంతో డ్రైవర్లు అక్కడికి వెళ్లాక ఎప్పుడు పిలుస్తారో తెలియక పడిగాపులు పడాల్సి వస్తోంది. మినహాయింపు ఇవ్వండి.. రెండు, మూడు జిల్లాలు కలిపి వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ట్రాక్ను నిర్మిస్తే తమకు అందుబాటులో ఉంటుందని డ్రైవర్లు అంటున్నారు. సిరిసిల్ల దూరాభారం కావడంతో కొత్తగా మరిన్ని డ్రైవింగ్ ట్రాక్లు అందుబాటులోకి వచ్చే వరకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్కు టీఐడీఈఎస్ సరిఫికెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డ్రైవర్లు, లారీ యజమానుల నుంచి డిమాండ్ వస్తోంది. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హెవీ డ్రైవింగ్ లైసెన్సు కలిగిన వారు సుమారు 20వేల మంది ఉంటారనేది అంచనా. -
ఈ ఏడాది మండిపోనున్న ఎండలు..
-
చిక్కుల్లో ట్విటర్: వారు గుడ్బై, ఆదాయం ఢమాల్..రీజన్?
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ భారీగా యాక్టివ్ యూజర్లను పెద్దమొత్తంలో కోల్పోతోందట. ట్విటర్ ఇంటర్నెల్ రీసెర్చ్ ప్రకారం ట్విటర్ గ్లోబల్ ఆదాయంలో కీలక భూమిక పోషిస్తున్న 10 శాతం హెవీ ట్వీటర్లు ట్విటర్ను వీడుతున్నారట. ఈ మేరకు రాయిటర్స్ ట్విటర్లో ఒక రిపోర్ట్ను పోస్ట్ చేసింది. హెవీ ట్వీటర్లు అంటే ఎవరు? రాయిటర్స్ నివేదిక ప్రకారం తనవ్యాపారంలో కీలకమైన సెలబ్రిటీలు, అత్యంత చురుకైన వినియోగ దారులను నిలబెట్టుకోవడానికి కష్టాలు పడుతోంది. వారానికి ఆరు లేదా ఏడు రోజులు ట్విట్టర్లోకి లాగిన్ అయి వారానికి మూడు నుండి నాలుగు సార్లు ట్వీట్ చేసే వ్యక్తిని "హెవీ ట్వీటర్" గా పిలుస్తారు. వీరి సంఖ్య నెలవారీ మొత్తం వినియోగదారులలో 10శాతం కంటే తక్కువే అయినా ప్రపంచ ఆదాయంలో సగం సృష్టిస్తున్నారని రాయిటర్స్ నివేదించింది. ఇంగ్లీష్ మాట్లాడే ఎక్కువ యూజర్లలో క్రిప్టోకరెన్సీ, అశ్లీలతతో కూడిన కంటెంట్పై ఆసక్తి బాగా పెరిగిందని తెలిపింది. అదే సమయంలో వార్తలు, క్రీడలు, వినోదంపై ఆసక్తి తగ్గుతోందని పేర్కొంది. (ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!) కాగా టెస్లా సీఈవో ట్వీటర్ డీల్ ను రద్దు చేసుకోవడంతో, షేర్ ధర పడిపోవడం, భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోవడం, న్యాయపోరాటం లాంటి ఇబ్బందుల్లో ఉన్న సంస్థకు దీంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టే యూజర్లను కోల్పోవడం మరో సమస్య కానుంది. ఇదీ చదవండి : ఇండోనేషియా కొత్త వీసా: ‘సెకండ్ హోం’ అక్కడే పదేళ్లు పండగ! EXCLUSIVE Twitter is losing its most active users, internal documents show https://t.co/EoHgcznik5 pic.twitter.com/Jlz5zWyipN — Reuters (@Reuters) October 25, 2022 -
హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం
-
అస్సాం వరద విధ్వంసం.. హృదయవిదారక దృశ్యాలు
-
హైదరాబాద్ : వరదలు మిగిచ్చిన వేదన
-
నాలుగు నెలలు... 68 దశలు
2019 లోక్సభ ఎన్నికలు రెండు నెలల పాటు ఏడు దశల్లో జరుగుతున్నాయంటేనే ..అబ్బో..అంత టైమా...అనుకుంటున్నాం. అయితే, మన దేశంలో మొట్టమొదటి ఎన్నికలు ఏకంగా 68 దశల్లో నాలుగు నెలల పాటు జరిగాయి. 1951 అక్టోబరు నుంచి 1952,ఫిబ్రవరి వరకు ఆ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఎన్నికల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా 3000 సినిమా హాళ్లలో డాక్యుమెంటరీలు ప్రదర్శించారు. రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం ప్రతినిధులు కూడా ఇంటింటికీ తిరిగి ఓటు వేయమని ప్రజలకు చెప్పారు. మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి దేశంలో 85శాతం ప్రజలు నిరక్షరాస్యులు. అప్పుడున్న 40కోట్ల జనాభాలో కేవలం 15శాతం మందికి మాత్రమే ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వచ్చు. దాంతో ఓటర్లు రాజకీయ పార్టీల పేర్లను, అభ్యర్థ్ధుల పేర్లను చదవడం, గుర్తు పెట్టుకోవడం కష్టమని భావించిన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించాలని నిర్ణయించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి నాగలి దున్నుతున్న జోడెద్దుల గుర్తు వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ చిహ్నమైన హస్తం మొదటి ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్( నేతాజీ సుభాష్ చంద్రబోస్పార్టీ) పార్టీకి దక్కింది. ఈ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేయడానికి 16వేల మందికిపైగా సిబ్బంది ఆరు నెలల పాటు ఇల్లిల్లూ తిరిగారు. తీరా ఓటర్ల జాబితా తయారయ్యాక పేరు లేని కారణంగా 28 లక్షల ఓటర్ల పేర్లను తొలగించాల్సి వచ్చింది. అప్పట్లో మహిళలు బయటివారికి తమ పేరు చెప్పేవారు కాదు. ఫలానా వారి భార్యననో, కూతురిననో, చెల్లెలిననో చెప్పడంతో సిబ్బంది అలాగే రాసుకోక తప్పలేదు. అలాంటి పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు,అభ్యర్థులకు ప్రచారం ఎలా చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. నెహ్రూ వంటి నేతలు బహిరంగ సభలు పెట్టి ఓట్లు అడిగేవారు.కొందరు ఇళ్లకు వెళ్లి అభ్యర్థించేవారు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ రోడ్లమీద తిరిగే ఆవుల ఒంటిపై ‘కాంగ్రెస్కు ఓటెయ్యండి’అని రాసేవారు. ఆ ఆవుల్ని ప్రజలు ఆసక్తిగా ఉత్సుకతతో చూసేవారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ప్రముఖుల్లో అంబేడ్కర్ ఒకరు. ఎస్సిలకు కేటాయించిన ఉత్తర మధ్య బొంబాయి నియోజకవర్గం నుంచి అంబేడ్కర్ పోటీ చేసి ఓడిపోయారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అన్నవరం(ప్రత్తిపాడు) : రత్నగిరిపై కొలువైన శ్రీసత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ఆలయంతో పాటు, ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సాయంత్రం వరకూ భక్తులు తండోప తండాలుగా వస్తూనే ఉన్నారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రత్నగిరిపై వివాహాలు జరిగాయి. దానికి తోడు వరుస సెలవులు కావడం కూడా భక్తులు పోటెత్తడానికి కారణమైంది. వ్రతాల కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు.. సత్యదేవుని వ్రతాలాచరించేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ప్రధానంగా రూ.200, రూ.400 వ్రతాలాచరించే భక్తులైతే భారీ క్యూలో వేచి ఉన్నారు. ధ్వజస్తంభం వద్ద వ్రతాలాచరించేందుకు రూ.1500 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. స్వామి దర్శనానికి మూడు గంటలు సత్యదేవుని దర్శనానికి మూడు గంటలు సమయం పట్టింది. స్వామివారి అంతరాలయం దర్శనం కోసం రూ.వంద టిక్కెట్ తీసుకున్న భక్తులు కూడా రెండు గంటలు వేచియుండాల్సి వచ్చింది. వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఆలయానికి సుమారు ఎనిమిది వేల వాహనాలలో భక్తులు తరలివచ్చారు. పలుమార్లు ఘాట్రోడ్లో వాహనాలు నిలిచిపోయాయి. గతంలో భక్తుల రద్దీ ఉన్న సమయంలో చిన్న కార్లు, ఇతర వాహనాలను ప్రకాష్సదన్ వెనుక గల మైదానంలో నిలిపివేసేవారు. ఈ సారి వాహనాలను యథేచ్ఛగా వదిలేయడంతో కార్లను పశ్చిమ రాజగోపురం ముందు నిలిపివేశారు. అదే విధంగా ఆటోలను కూడా నిలిపివేయడంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. పాలకమండలి సమావేశంలో అధికారులు సత్యదేవుని దర్శనానికి భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా అదే రోజు పాలక మండలి సమావేశం నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పాలకమండలి సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ దేవస్థానం చైర్మన్, సభ్యులు, ఇన్చార్జి ఈఓ, వివిద విభాగాల ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ప్రధానార్చకుడు, అందరూ పాల్గొన్నారు. ఓ వైపు వేలాది మంది భక్తులు ఆలయప్రాంగణంలో ఇబ్బంది పడుతుంటే గుమస్తాలు, నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రమే వారికి సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఇటువంటి రద్దీ రోజుల్లో మిగిలిన విభాగాల సిబ్బందికి కూడా ఆలయం వద్ద, వ్రత మండపాల వద్ద ప్రత్యేక డ్యూటీలు వేసేవారు. చైర్మన్, ఇన్చార్జి ఈఓ ఆలయ ప్రాంగణం అంతా తిరిగి సిబ్బందికి సూచనలిచ్చేవారు. ఈ సారి అందుకు విరుద్ధంగా అక్కడ విధుల్లో ఉండాల్సిన అధికారులు కూడా భక్తులను గాలికి వదిలేసి పాలక మండలి సేవలో తరించడం విశేషం స్వామిని దర్శించిన 45 వేల మంది భక్తులు సత్యదేవుని ఆలయానికి సుమారు 45 వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 4,185 జరగగా రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
నీట మునిగిన పంటలు
పామిడి: పామిడిలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకూ కురిసిన భారీ వర్షానికి పంటలు నీటమునిగాయి. లోతట్టు కాలనీలు, ప్రభుత్వ జూనియర్కళాశాల ద్వీపకల్పంగా మారాయి. కేవలం మండలంలోని ఒక నీలూరులోనే 19.62 ఎకరాల పత్తి, వేరుశనగ పంటలు నీట మునిగాయి. అలాగే స్థానిక వైజంక్షన్ వద్ద గల ఓ డిగార్డిగేటర్లో 12వేల కేజీల వేరుశనగ పప్పు, వేరుశనగకాయల బస్తాలు తడిసిముద్దాయి. నీలూరులో నీట మునిగిన పంటలను, డీ గార్డిగేటర్లో తడిసిముద్ద అయిన వేరుశనగ బస్తాలను ఇన్చార్జ్ తహసీల్దార్ ఆర్.బాలాజీరాజు పరిశీలించారు. నష్టంపై రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. -
పామిడిలో వీధులు జలమయం
ఇళ్లలో చేరిన నీరు నీటమునిగిన పంటలు దంచేసిన వాన పామిడి: ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన వరుణుడు ఒక్కసారిగా తన ఉగ్రరూపం చూపాఽడు. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరుగా వర్షం కురిసినా...పామిడి మండలంలో మాత్రం దంచేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకూ ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో 70 మిల్లీ మీటర్ల వర్షంపాతం నమోదైంది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన వెంగమనాయుడుకాలనీ, చైతన్యకాలనీ, వీకే ఆదినారాయణరెడ్డి కాలనీ, సీఎస్ఐ చర్చీవీధి జలమయమయ్యాయి. వెంగమనాయుడుకాలనీలోని ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీకే ఆదినారాయణరెడ్డి కాలనీ ప్రధాన రోడ్డులో వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే స్థానిక టీసీ హైస్కూల్ ఆవరణలో వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. నేలకూలిన ఇళ్లు మండలంలో కురిసిన భారీ వర్షానికి ఖాదర్పేట, పి.కొత్తపల్లి గ్రామాల్లో మూడు ఇళ్లు నేలకూలాయి. కాలువలు, కుంటలు పొంగిపొర్లాయి. ప్రధానవీధులు జలమయం కావడంతో వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీట మునిగిన పంటలు భారీ వర్షానికి పంటలు నీటమునిగాయి. మండలంలోని నీలూరులోనే 19.62 ఎకరాల పత్తి, వేరుశనగ పంటలు నీట మునిగాయి. అలాగే స్థానిక వైజంక్షన్ వద్ద గల ఓ డిగార్డిగేటర్లో 12వేల కేజీల వేరుశనగ పప్పు, వేరుశనగకాయల బస్తాలు తడిసిముద్దాయి. నీలూరులో నీట మునిగిన పంటలను, డీ గార్డిగేటర్లో తడిసిముద్ద అయిన వేరుశనగ బస్తాలను ఇన్చార్జ్ తహసీల్దార్ ఆర్.బాలాజీరాజు పరిశీలించారు. -
అమ్మో.. చదువుకొనలేం!
ఏలూరు (ఆర్ఆర్పేట) ఇన్నాళ్లూ స్కూలుకు వెళ్లాలంటే పిల్లలు భయపడేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పిల్లల చదువుకు ఎంత ఫీజు కట్టమంటారో.. బస్సుకు ఎంత చెల్లించమంటారో అని.. ఇక పుస్తకాలు, టై, యూనిఫాం, బెల్టు, షూ.. అంటూ ఎంత బాదేస్తారో అంటూ గుండెల్లో గుబులు. పోనీ ఇవన్నీ బయట తీసుకుందామంటే యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఇలా బడులు తెరిచే రోజులు దగ్గర పడే కొలదీ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. జిల్లాలో చిన్నా చితకా ప్రైవేట్ పాఠశాలలు, ఒక మోస్తరు సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కలిపి సుమారు 1200 ఉన్నాయి. వీటిలో సుమారు 2.20 లక్షల మంది విద్యార్థులు అభ్యాసం చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి ఫీజు కింద సుమారు రూ.6 నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, షూ, వంటి సామగ్రి రూపంలో మరో రూ.5 నుంచి 7 వేల వరకూ బాదుడు. పుస్తకాల విషయంలో మరీ దోపిడీ. బహిరంగ మార్కెట్తో పోలిస్తే సుమారు 40 నుంచి 60 శాతం అధికంగా విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రుల ఆరోపణ. బహిరంగ మార్కెట్లో పుస్తకాలపై 10 నుంచి 25 శాతం డిస్కౌంట్ ఇస్తుండగా విద్యా సంస్థల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించడం లేదు. ఈ పరిస్థితి జిల్లా కేంద్రం ఏలూరుతో పాటు భీమవరం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు వంటి ప్రాంతాల్లో అధికంగా ఉంది. కన్నెత్తి చూడని వాణిజ్య పన్నుల శాఖ చిన్నచిన్న దుకాణాలపై కూడా పన్నులు విధిస్తూ వసూలు చేసే వాణిజ్య పన్నుల శాఖ ప్రైవేటు విద్యా సంస్థల్లో సాగుతున్న ఇటువంటి వ్యాపారంపై కన్నెత్తి చూడ్డంలేదు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో సుమారు రూ.300 కోట్లపైనే వ్యాపారం చేస్తున్నాయని అంచనా. దానిపై ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం కూడా రావడం లేదు. ఇదిలా ఉండగా పెద్దనోట్ల రద్దు ప్రభావంతో అధిక మొత్తంలో నగదు అందుబాటులో లేని పరిస్థితి. కాగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో విక్రయిస్తున్న పుస్తకాలు, ఇతర సామగ్రికి చెల్లింపులు చేయడానికి వారి వద్ద స్వైపింగ్ యంత్రాలు కూడా అందుబాటులో లేకపోవడం తల్లిదండ్రులకు విషమ పరీక్ష. జీఓలు ఏం చెబుతున్నాయంటే.. జీవో నెంబర్ ఎంఎస్ 42 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్స్ రెగ్యులైజేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. జీవో నెంబర్ ఎంఎస్ 246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి. సీబీఎస్ఈ చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. ఈ అసోసియేషన్లలో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి. కమిటీ నిర్ణయించిన తరువాతనే ఫీజులను పెంచాలి. జీవో ఎంఎస్ నెంబర్ 1994 జనవరి ఒకటో తేదీ ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయుల వేతనాలకు చెల్లించాలి. ఏటా వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించాలి. జీవో ఎంఎస్ నెంబర్ 91 ప్రకారం వన్టైం ఫీజుగా రూ.100, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500 రిఫండబుల్ కాషన్ డిపాజిట్ రూ.5 వేలకు మించకుండా తీసుకోవాలి. జీవోలోని సెక్షన్ 1(సీ) ప్రకారం పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేవీ పెట్టరాదు. వీటి అమ్మకాలకు పాఠశాలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చిన షాపుల్లో కొనుగోలు చేయవచ్చు. 2013 మే 16వ తేదీన జారీ చేసిన సీఅండ్డీఎస్ఈ ఆర్సీ నెంబర్ 780 సెక్షన్ ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలిపింయాడ్, కాన్సెప్ట్, ఈ టెక్నో వంటివి తగిలించరాదు. కేవలం పాఠశాల అని మాత్రమే పేర్కొనాలి. కానీ ఆ నిబంధనలు పాటించని పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పటికీ ఆయా పేర్లు పెట్టి తల్లిదండ్రులను ఆకర్షిస్తూ వారిని ఈ విధంగా దోచుకుంటున్నాయని ఆరోపణ. అధికారుల పర్యవేక్షణ కొరవడింది ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న ఇటువంటి దోపిడీపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియం కూడా సమాంతరంగా ప్రవేశపెడితే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే అవకాశం ఉంది. తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనే నిబంధన విధిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
గాలి వాన బీభత్సం
– కూలిన పేపర్ పరిశ్రమ పైకప్పు – ముద్దిరెడ్డిపల్లిలో ఆవు మృతి – తూముకుంటలో రేషం షెడ్లు «ధ్వంసం హిందూపురం రూరల్ : హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించాయి. హిందూపురం పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తాకిడికి పరిశ్రమ, రేషం షెడ్ల పైకప్పులు ధ్వంసం కాగా విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. తూముకుంట గ్రామంలో ఈదురు గాలులకు శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్రెడ్డికి చెందిన రేషం షెడ్లకు చెందిన సిమెంట్ రేకులు ధ్వంసమయ్యాయి. చంద్రికల్లో వేసిన పట్టు పురుగులు పూర్తిగా దెబ్బ తిని రూ.6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు వాపోయారు. అదేవిధంగా బసవనపల్లిలో లోటస్ పేపర్ పరిశ్రమ పైకప్పు అల్యూమినియం రేకులు గాల్లో తేలాడుతూ పాఠశాల మైదానంలో ఎగిరిపడ్డాయి. పరిశ్రమలో ముడిసరుకు వర్షానికి తడిసి పూర్తిగా యంత్రాలు దెబ్బతిన్నాయి. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు పరిశ్రమ యాజమాని జయమ్మ వాపోయింది. బసవనపల్లి సమీపంలో 12 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్కో సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. పట్టణంలోని ముద్దిరెడ్డిగపల్లిలో ఉరుముల దెబ్బకు రూ.70 వేలు విలువ చేసే పాడి ఆవు మృత్యువాత పడిందని బాధిత రైతు నాగరాజు వాపోయాడు. నష్ట పరిహారం కోసం తహాసీల్దారుకు వినతి ఈదురు గాలుల బీభత్సానికి రేషం పంట చేతికి అందకుండా పోయిందని తూముకుంట రైతులు శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్రెడ్డి వాపోయారు. చంద్రికల్లో వేసిన రేషం పురుగులు గాలివాన బీభత్సానికి ఇద్దరికి సుమారు రూ.1.40 లక్షలు నష్టం వాటిల్లిదని ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఆదుకోవాలని విన్నవించుకున్నారు. -
ముంగారు’ మురిసింది!
ప్రారంభమైన ‘తొలకర్లు’ ఓడీచెరువులో భారీ వర్షం 49 మండలాల పరిధిలో వాన 6.6 మి.మీ సగటు నమోదు అనంతపురం అగ్రికల్చర్ : ముంగారు వర్షాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి జిల్లాలోని 49 మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. మే నెల సాధారణ వర్షపాతం 39.8 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా.. తొలిరోజే 6.6 మి.మీ సగటు నమోదైంది. ఓడీచెరువు మండలంలో 49.8 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే అమడగూరు 35.4 మి.మీ, నల్లచెరువు 35.4, యల్లనూరు 28.2, యాడికి 24.7, ముదిగుబ్బ 24.3, తలుపుల 20.5 మి.మీ, పామిడి 19.8 మి.మీ, నల్లమాడ 18.1, పెద్దవడుగూరు 17.5, గుంతకల్లు 16.9, గాండ్లపెంట 12.4, గుత్తి 12.2, తాడిపత్రిలో 11.1 మి.మీ మేర వర్షం కురిసింది. వీటితో పాటు వజ్రకరూరు, ధర్మవరం, తాడిమర్రి, చెన్నేకొత్తపల్లి, తనకల్లు, ఉరవకొండ, కొత్తచెరువు, బుక్కపట్నం, కూడేరు, ఎన్పీకుంట, బొమ్మనహాళ్, కుందుర్పి, నార్పల, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రామగిరి, కంబదూరు, డి.హీరేహాళ్, పుట్లూరు తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో లోతుగా దుక్కులు చేసుకోవాలని, ఖరీఫ్ సాగుకు సమాయత్తం కావాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి, శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ ఎం.జాన్సుధీర్, డాక్టర్ డి.సంపత్కుమార్ రైతులకు సూచించారు. పొంగిన వాగులు, వంకలు ఓడీ చెరువు : మండలంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో సున్నంపల్లి, డబురువారిపల్లి, కుసుమవారిపల్లి, తిప్పేపల్లి, ఓడీసీ, దాదిరెడ్డిపల్లి, గౌరాపురం, చౌడేపల్లి గ్రామాల్లోని చిన్న చిన్న కుంటలు, చెక్డ్యాంలు పొంగి పొర్లాయి. తిప్పేపల్లి చెరువుకు సగం వరకు నీరు వచ్చి చేరింది. మహమ్మదాబాద్ క్రాసింగ్లో ఎగువ ప్రాంతం నుంచి నీరు వచ్చి చేరడంతో ఇళ్లు జలమయ్యాయి. ఇళ్లలోని తిండిగింజలు, దుస్తులు తడిచిపోయాయి. మండల కేంద్రంలోని థియేటర్ వద్దనున్న వాగు కదిరి - హిందూపురం రోడ్డుపై భారీగా ప్రవహించింది. దీంతో వాహన రాకపోకలకు కొంతసేపు అంతరాయం కల్గింది. గత 30 ఏళ్లలో ఏనాడూ ఈ వాగు ప్రవహించిన దాఖలాలు లేవని స్థానికులు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోకి వర్షపు నీరు చేరడంతో సోమవారం ‘మీకోసం’కు వచ్చిన అధికారులు, ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. శేషయ్యగారిపల్లి, ఓడీసీ, మామిళ్లకుంట్లపల్లి గ్రామాల్లో మామిడి కాయలు రాలిపోవడం, చెట్లు విరిగి పడటంతో రైతులకు నష్టం వాటిల్లింది. జెరికుంటపల్లిలో చిన్న వెంకటరమణ అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట, మిట్టపల్లి, ఓడీసీకి చెందిన రైతులు నరసింహారెడ్డి, వెంకటనర్సుకు చెందిన కనకంబరాల పంట దెబ్బతిన్నాయి. -
బీభత్సం
ముంచెత్తిన అకాల వర్షం తోడైన పెనుగాలులు, భారీ ఉరుములు, పిడుగులు నేలనంటిన వరి చేలు 2 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట కూలిన హోర్డింగ్లు ∙ భీతిల్లిన ప్రజలు గొల్లప్రోలు (పిఠాపురం) : పెనుగాలులు.. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు.. ఫెళఫెళారావాలతో చెవులు చిల్లులు పడేలా ఉరుములు, పిడుగులతో కురిసిన అకాల వర్షంతో ప్రజలు భీతిల్లారు. రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి, శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారీ ఉరుములు, పిడుగులు, మెరుపులకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలుల వేగానికి పలు ప్రాంతాల్లో హోర్డింగులు, చెట్లు విరిగిపడ్డాయి. వివిధ శుభకార్యాలకు వేసిన టెంట్లు, కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పెళ్లిళ్లు చేసుకునేవారు ఇబ్బందులకు గురయ్యారు. గొల్లప్రోలులో 216 జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న కార్మికులు ఏర్పాటు చేసిన గుడారాలు దెబ్బ తిన్నాయి. పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం కూడా భారీవర్షం కురిసింది. ఈ అకాల వర్షం అన్నదాతకు తీరని చేటును కలిగించింది. గొల్లప్రోలు రైల్వేస్టేషన్ ఆవల ఉన్న బాడవ, సీతానగరం, చింతరేవళ్లు తదితర ప్రాంతాల్లో ఈనిక, పొట్టదశలో ఉన్న వరి చేలు నేలనంటాయి. ముందుగా ఊడ్చిన చేలు అధికంగా వెన్ను వంచే దశలో ఉండడంతో గాలులకు ఒరిగిపోయాయి. కొన్నిచోట్ల సుడిగాలుల మాదిరిగా వీయడంతో చెల్లాచెదురుగా చేలు పడిపోయాయి. నేలనంటిన చేనులో అధిక శాతం రీసెర్చ్ వెరైటీకి చెందినవి ఉన్నాయి. గింజ పాలు పోసుకునే దశలో వరిచేలు నేలనంటడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 10 బస్తాల వరకూ దిగుబడి తగ్గుతుందని చెబుతున్నారు. మరో వారం పది రోజుల్లో పంట చేతికందుతుందనుకుంటున్న దశలో కురిసిన అకాల వర్షం తమకు తీరని నష్టం మిగిల్చిందని వారు ఆవేదన చెందుతున్నారు. చెట్టు పడి ముగ్గురికి గాయాలు పిఠాపురం టౌన్ : భారీ వర్షానికి గోర్స రైల్వే గేటు సమీపాన మోహన్నగర్ వద్ద చెట్టు కూలి పడింది. దీంతో అక్కడ ఉన్న రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయి. దుకాణంలో నిద్రిస్తున్న భార్యాభర్తలు కానూరి వేణు, కమల తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. అదే ప్రాంతంలోని మరో దుకాణంలో ఉన్న వనుము నాగేశ్వరరావు కూడా గాయపడ్డాడు. రథాలపేట సెంటర్లో హోర్డింగ్ విరిగి పడిపోయింది. పాతబస్టాండ్ వద్ద ఉన్న ఎగ్జిబిషన్లో వస్తువులు చెల్లాచెదురయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వర్షపు నీటికి మురుగు కాలువల్లోని నీరు తోడై పలు ప్రాంతాలు బురదమయంగా తయారయ్యాయి. వర్ష బీభత్సానికి పట్టణంలోని పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
మద్యం రేట్లను పెంచిన ప్రభుత్వం
యానాం : పుదుచ్చేరికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మద్యంపై అడిషనల్ ఎక్సైజ్డ్యూటీని(ఏఈడీ) మంగళవారం పెంచడంతో ధరలు పెరిగాయి. స్పిరిటోరియస్ లిక్కర్, విదేశీ తయారీ లిక్కర్, ఇండియా తయారీ విదేశీ మద్యం బ్రాండ్లకు 25 శాతం మేర ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. దీంతో ప్రభుత్వానికి రూ.15 కోట్ల మేర ఆదాయం లభించనుందని అంచనా వేస్తున్నారు. 2013లో పెంచిన ఎౖMð్సజ్ డ్యూటీని మళ్లీ ఇప్పుడు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్లు ఆదాయం లక్ష్యంగా నిర్ణయించారు. మద్యం రేట్లు పెంచినప్పటికి సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు కన్నా తక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. నోట్ల రద్దు ప్రభావం టూరిజంపై పడిన నేపథ్యంలో లిక్కర్ అమ్మకాలు మందగించాయి. దీంతో అదనపు డ్యూటి ద్వారా ఆదాయం రాబట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
రత్నగిరి.. భక్తజనఝరి
- భీష్మ ఏకాదశి పర్వదినాన పోటెత్తిన భక్తులు - సోమవారం రాత్రి నుంచే వెల్లువలా రాక - స్వామివారిని దర్శించిన 80 వేల మంది - రూ.60 లక్షల ఆదాయం అన్నవరం (ప్రత్తిపాడు) : కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడు, రత్నగిరి వాసుడు అయిన సత్యదేవుని సన్నిధి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో జనసంద్రంగా మారింది. సుమారు 80 వేలమంది సత్యదేవుని దర్శించుకున్నారు. 7,276 వ్రతాలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో వేలాదిగా భక్తులు సోమవారం సాయంత్రం నుంచే రత్నగిరికి చేరుకోవడం ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం వరకూ భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే వ్రతాలు, స్వామివారి దర్శనాలు ప్రారంభించారు. అప్పటినుంచి సాయంత్రం వరకూ స్వామి సన్నిధికి భక్తులు వస్తూనే ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. వ్రతమండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. దీంతో ఉదయం పది గంటల వరకూ స్వామివారి నిత్యకల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించారు. సర్క్యులర్ మండపంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారి నాగేంద్రరావు అన్నవరం దేవస్థానానికి రూ.50 వేల విలువైన 6 టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. ఈ ఒక్క రోజే దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సత్యదేవునికి లక్ష పుష్పార్చన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్ల మూలవరులకు లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు గాడేపల్లి వేంకట్రావు తదితర అర్చకస్వాములు, రుత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవారం రాత్రి గరుడ వాహనంపై ఘనంగా ఊరేగించారు. తొలి పావంచా వద్ద దేవస్థానం చైర్మన్ రాజా రోహిత్, ఈఓ నాగేశ్వరరావు దీనిని ప్రారంభించారు. -
మహిళా ఓటర్లే అధికం
విడుదలైన తుది జాబితా ∙ జిల్లాలో మొత్తం 37,33,336 మంది ఓటర్లు మహిళలు : 18,74,091 l పురుషులు : 18,58,964 l ఇతరులు : 281 కాకినాడ సిటీ : ఎన్నికల కమిష¯ŒS ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణను జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. జిల్లా ఓటర్ల తుది జాబితాను సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 37,33,336 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 18,58,964 మంది, మహిళలు 18,74,091 మంది, ఇతరులు 281 మంది ఉన్నారు. గత ఏడాది జనవరిలో విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లాలో 37,04,882 మంది ఓటర్లు ఉండగా, తాజా సవరణ అనంతరం 28,454 మంది కొత్త ఓటర్లు చేరారు. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రంపచోడవరం, అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రాజోలు నిలిచాయి. నియోజకవర్గాలవారీగా ఓటర్లు ఇలా.. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం తుని 97,171 97,380 12 1,94563 ప్రత్తిపాడు 92,502 93,620 17 1,86,139 పిఠాపురం 1,08,972 1,06,831 6 2,15,809 కాకినాడ రూరల్ 1,06,496 1,05,028 13 2,11,537 పెద్దాపురం 90,762 91,181 16 1,81,959 అనపర్తి 98,777 1,00,755 3 1,99,535 కాకినాడ సిటీ 94,259 98,171 73 1,92,503 రామచంద్రపురం 90,726 89,547 10 1,80,283 ముమ్మిడివరం 1,03,886 1,01,419 3 2,05,308 అమలాపురం 94,775 92,172 7 1,86,954 రాజోలు 84,871 83,542 1 1,68,414 పి.గన్నవరం 87,519 82,565 0 1,70,084 కొత్తపేట 1,12,275 1,12,297 11 2,24,583 మండపేట 97,456 1,00,552 4 1,98,012 రాజానగరం 91,451 92,942 13 1,84,406 రాజమహేంద్రవరం సిటీ 96,843 1,02,122 58 1,99,014 రాజమహేంద్రవరం రూరల్ 1,00,578 1,03,386 18 2,03,982 జగ్గంపేట 97,076 98,334 10 1,95,420 రంపచోడవరం 1,12,578 1,22,247 6 2,34,831 -
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ
-
తొలిరోజే పేలిన పెట్రో బాంబు
పెట్రోల్పై రూ.1.29, డీజిల్పై 97 పైసల పెంపు అర్ధరాత్రి నుంచే అమల్లోకి.. జిల్లాపై రూ.4.26 కోట్ల భారం సాక్షి, రాజమహేంద్రవరం : నూతన సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా మునిగి ఉన్న ప్రజలపై.. మోదీ ప్రభుత్వం ఈ ఏడాది తొలి రోజే పెట్రోలు, డీజిల్ ధరల భారం మోపింది. పెట్రోల్ లీటరుకు రూ.1.29, డీజిల్ 97 పైసల చొప్పున పెంచేసింది. పెరిగిన ధరలు ఒకటో తేదీ అర్ధరాత్రి నుం చే అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో నిన్నటివరకూ రూ.74.40గా ఉన్న లీటర్ పెట్రోలు ధర రూ.75.69కు, డీజిల్ ధర రూ.63.07 నుంచి రూ.64.04కు పెరిగాయి. ఈ ధరలకు రాష్ట్ర ప్రభుత్వం వేసే పన్ను అదనం. జిల్లాలో ఉన్న 251 పెట్రోలు బంకుల్లో ప్రతి రోజూ దాదాపు 5 లక్షల లీటర్ల పెట్రోల్, 8 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా పెట్రోల్ వినియోగదారులపై రోజుకు రూ.6.45 లక్షలు, నెలకు రూ.1,93,50,000 భారం పడనుంది. డీజిల్ వినియోగదారులపై రోజుకు రూ.7.76 లక్షలు, నెలకు రూ.2,32,80,000 భారం పడుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో మొత్తం మీద జిల్లా వినియోగదారులపై రోజుకు రూ.14.21 లక్షలు, నెలకు రూ.4,26,30,000 మేర అదనపు భారం పడనుంది. గతంలో పెరిగిందిలా.. గత ఏడాది సెప్టెంబర్ 1న రూ.65.17గా ఉన్న పెట్రోలు ధరను డిసెంబర్ ఒకటికి రూ.71.40కి, డిసెంబర్ 15నాటికి రూ.74.40కు పెంచగా.. తాజా పెంపుతో ఈ ధర రూ.75.69కు చేరింది. అలాగే సెప్టెంబర్ 1న రూ.56.33గా ఉన్న డీజిల్ ధర డిసెంబర్ ఒకటికి రూ.60.86కు, డిసెంబర్ 15కు రూ.63.07కు పెరగ్గా.. తాజా పెంపుతో రూ.64.04కు చేరింది. -
రద్దయిన నోట్లే.. రాబడికి రూట్లు
నగర, పురపాలక సంస్థలకు వరంగా మారిన కేంద్రం నిర్ణయం రూ.500, రూ.1000 నోట్లతో పన్ను చెల్లించే వెసులుబాటుతో అనూహ్యంగా పెరిగిన వసూళ్లు నవంబర్లో భారీగా పెరిగిన ఆదాయం అంత వరకూ దర్జాగా బతికిన వాళ్లు దివాళా తీసి దరిద్రులుగా మిగిలినట్టయింది .. గత నెల 8న రూ.500, రూ.1000 నోట్ల పరిస్థితి. జేబులోనో, ఇంట్లోని బీరువాలోనో ఉంటే ఎంతో భరోసానిచ్చిన ఆ కరెన్సీయే అకస్మాత్తుగా నెత్తి మీద ముళ్లకట్టెల మోపు మోస్తున్నంత భారంగా, దుర్భరంగా అనిపించింది. ఆ రోజు ఆ నోట్ల చలామణీని రద్దు చేసిన కేంద్రం..కలుగుల్లో పొగ బెట్టి ఎలుకల్ని బయటికి రప్పించినట్టు..‘నల్లధనాన్ని వెలికి తీయడానికే ఈ విప్లవాత్మక నిర్ణయం’ అని చెప్పినా.. ఆ నోట్లు దగ్గరున్న పేదలు సైతం వాటిని ఎలా మార్చుకోవాలా అని కలవరపడ్డారు. ప్రతి బ్యాంకూ, ప్రతి పోస్టాఫీసు వద్దా.. పుష్కరాల వేళ గోదావరి రేవుల్లోలా ఒకటే రద్దీ. అంతేకాక..నోట్ల మార్పిడికి పరిమితీ ఉండడంతో తమ వద్ద ఉన్న ఆ నోట్లు విరగడ అవుతాయో, లేదోనని దిగాలు పడ్డారు. అయితే కేంద్రం.. నిర్దిష్ట వ్యవధిలో వాటితో కొన్ని చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించింది. అలాంటి వాటిలో ఒకటి.. రద్దయిన పెద్దనోట్లతో పురపాలక సంఘాలకు, నగర పాలక సంస్థలకు పన్నుల బకాయిలు చెల్లించే అవకాశం. ఈ వెసులుబాటు ఆ స్థానిక పరిపాలనా సంస్థలకు ‘సిరి’ని తెచ్చి పెట్టింది. రద్దయిన నోట్లతో పన్నులకు సంబంధించిన మొండి బకాయిలతో సహా చెల్లించడానికి ప్రతి పట్టణంలో, నగరంలో ఎందరో ఆరాటపడడంతో నవంబర్లో స్థానిక సంస్థల రాబడి ఎన్నో రెట్లు పెరిగింది. ఈ పరిణామంపై ‘సాక్షి’ ఫోకస్.. కాకినాడకు కాసుల పంట కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో నవంబర్ 11 నుంచి 30 వరకూ సుమారు రూ.3 కోట్ల పన్నులు రూపంలో వసూలు చేయగలిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.26 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, సెప్టెంబర్తో ముగిసిన అర్ధ సంవత్సరా>నికి దాదాపు 50 శాతం వసూలు చేయగలిగారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే 2వ అర్ధసంవత్సరం బకాయిలు సాధారణంగా జనవరి నుంచి మార్చి మధ్యలో వసూలయ్యేవి. ఈ ఏడాది అక్టోబర్లో రూ.1.5 కోట్ల వరకు వసూలయ్యాయి. నవంబర్ 8న నోట్ల రద్దు అనంతరం 11 నుంచి 24 వరకు పాత నోట్లను స్వీకరిస్తామని నగరపాలక సంస్థ ప్రకటించింది. మరో అడుగు ముందుకు వేసి వచ్చే ఐదేళ్ళకు అడ్వా¯Œ్స ట్యాక్స్ చెల్లించినా తీసుకుంటామనడంతో పన్ను చెల్లింపుదారుల్లో స్పందన బాగా కనిపించింది. నిర్ణీత సమయంలో ఇంటి పన్నుల ద్వారా రూ.2.50 కోట్లు, నీటి పన్నుల ద్వారా రూ.37 లక్షలు, ఖాళీ స్థలాల పన్ను ద్వారా రూ.13 లక్షలు మొత్తం రూ.3కోట్ల పన్నులు రాబట్టగలిగారు. అడ్వా¯Œ్స ట్యాక్స్ చెల్లించొచ్చన్న దానికి మాత్రం స్పందన కానరాలేదు. మొత్తం మీద.. దండోరాలు వేసి, రెడ్నోటీసులు, జప్తు నోటీసులు ఇస్తే తప్ప వసూలు కాని పన్నులు, బకాయిలు నోట్ల రద్దు పుణ్యమాని నేపద్యంలో బాగానే వసూలయ్యాయని కార్పొరేష¯ŒS వర్గాలు చెబుతున్నాయి. – కాకినాడ ఒక్క నెలలోనే నాలుగో వంతు.. రద్దయిన పెద్ద నోట్ల భారం దించుకునేందుకు వాటితో అనేకులు పన్నులను చెల్లించడంతో అమలాపురం పురపాలక సంఘానికి ఒక్క నవంబర్ నెలలోనే రూ.61.60 లక్షల ఆదాయం వచ్చింది. మున్సిపాలిటీలో మొత్తం పన్నుల డిమాండు రూ.3.37 కోట్లు. నవంబర్ ఎనిమిదిన పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచీ ఆ నెలలో మిగిలిన 22 రోజుల్లో మున్సిపాలిటీకి ఏకంగా రూ.61.50 లక్షల పన్ను రాబడి లభించింది. సాధారణంగా నవంబర్ నెల పన్నుల వసూళ్లకు అ¯ŒS సీజ¯ŒS. సెప్టెంబర్, అక్టోబర్, మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే పన్ను వసూళ్లు ముమ్మరంగా ఉంటాయి. మున్సిపాలిటీలో గత అక్టోబర్ నెలలో ఆస్తి పన్నులు రూ.9.76 లక్షలు, తాగునీటి పన్నులు కేవలం రూ.77 వేలు మాత్రమే వసూలయ్యాయి. నోట్ల రద్దు అనంతరం నవంబర్లో ఆస్తి పన్నులు రూ.52 లక్షలు వసూలైతే.. తాగునీటి పన్ను రూ.9.50 లక్షలు వసూలైంది. అక్టోబర్తో నవంబర్ వసూళ్లను పోల్చుకుంటే ఆస్తి పన్ను నాలుగు రెట్లకు పైగా పెరిగితే... తాగునీటి పన్ను దాదాపు 11 రెట్లు పెరిగింది. అంటే మొత్తం పన్నుల డిమాండు రూ.3.37 కోట్లలో ఒక్క నవంబర్లోనే నాలుగో వంతు వసూలైనట్లయింది. అమలాపురం టౌ¯ŒS అక్టోబర్లో కన్నా ఆరు రెట్లు పెద్ద నోట్ల రద్దు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కాసుల వర్షాన్ని కురిపించింది. రూ. వెయ్యి, రూ. 500 నోట్లతో ఇంటి పన్నులు, కుళాయి పన్నుల బకాయిలు చెల్లించవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో మునుపెన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థకు భారీగా ఆదాయం వచ్చింది. వ్యాపారస్తులు, ఇంటి యజమానులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆస్తి, వ్యాపార పన్నులు చెల్లించారు. పెద్దనోట్లు రద్దు అయిన నవంబర్ 8 నుంచి 30 వరకు నగరపాలక సంస్థకు పన్నులు, బకాయిలు రూపంలో రూ.6.31 కోట్లు సమకూరాయి. అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 7 వరకు కేవలం రూ.86.80 లక్షలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. నవంబర్లో నగరపాలక సంస్థ ఆదాయం మునుపటి నెలకన్నా ఆరు రెట్లకు పైగా పెరగడం విశేషం. నగరపాలక సంస్థను ఎప్పటి నుంచో వేధిస్తున్న మొండిబకాయిల వసూలు బాధ పెద్దనోట్ల రద్దు వల్ల తీరినట్టయింది. – రాజమహేంద్రవరం రామచంద్రపురానికి కలిసొచ్చిన ‘రద్దు’ పెద్ద నోట్ల రద్దు అనంతరం రామచంద్రపురం మున్సిపాలిటీకి రూ.22 లక్షల ఆస్తిపన్ను వసూలయింది. నోట్లు రద్దు చేసిన మూడవ రోజే రూ. 10 లక్షలువసూలు కావటం గమనార్హం. అక్టోబర్ నెలలో రూ.4,41,924 వసూలు కాగా ఒక్క నవంబర్లో మొత్తం రూ.22,04,773 వసూలయ్యింది. సాధారణంగా నవంబర్లో రెండు నుంచి మూడు లక్షల వరకు మాత్రమే ఆస్తిపన్ను వసూలవుతుంది. కానీ ఈసారి పెద్దనోట్ల రద్దుతో ఆ మొత్తం అనేక రెట్లు పెరిగింది. – రామచంద్రపురం రెండు మున్సిపాలిటీల్లో దండిగా.. పెద్ద నోట్ల రద్దు పెద్దాపురం నియోజక వర్గ పరిధిలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలకు వరంగా మారింది. పెద్దాపురం మున్సిపాలిటీలో ఏడాది మొత్తం పన్ను డిమాండ్ రూ.2,50,00,000 అని మున్సిపల్ కమిషనర్ ఎ. వెంకట్రావు తెలిపారు. అక్టోబరు నెలలో ఇంటి పన్నులుగా రూ.5,02,500, కుళాయి పన్నులుగా రూ.3,66,600, షాపుల అద్దెలుగా రూ.48 వేలు వసూలు కాగా నవంబరు నెలలో ఇంటి పన్నులుగా రూ.21,39,600, కుళాయి పన్నుగా రూ. 6,65,900, షాపుల అద్దెలుగా రూ.6,16,900 వసూలైనట్టు చెప్పారు. నోట్ల రద్దుతో నవంబరు నెలలో రూ.25,32,700 అదనంగా ఆదాయం వచ్చింది. సామర్లకోట మున్సిపాలిటీలో మొత్తం పన్ను డిమాండ్ రూ.2, 55,75,000 కాగా అక్టోబరు నెలలో ఇంటి పన్నులుగా రూ. 3.51 లక్షలు, కుళాయి పన్నుగా రూ.99 వేలు, షాపుల అద్దెలుగా రూ.2,61,000 వసూలైనట్టు కమిషనర్ కేటీ సుధాకర్ తెలిపారు. నవంబరు నెలలో ఇంటి పన్నులుగా రూ.15.77 లక్షలు, కుళాయి పన్నుగా రూ.4.30 లక్షలు, షాపుల అద్దెలుగా రూ.2.38 లక్షలు వసూలు అయినట్లు తెలిపారు. – సామర్లకోట నవంబర్లో రూ.25 లక్షల రాబడి రద్దయిన పెద్దనోట్లతో పన్ను బకాయిలు చెల్లించవచ్చని చెప్పడంతో పిఠాపురం పురపాలక సంఘానికి ఆదాయం భారీగా పెరిగింది. గడిచిన అక్టోబర్లో ఆస్తిపన్ను వసూలు కేవలం సుమారు రూ.8 లక్షలుండగా పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలుబడిన నవంబర్లో సుమారు రూ.25 లక్షలు ఆస్తిపన్ను, కుళాయి పన్నుల రూపంలో వసూలయినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ.2.53 కోట్లు ఉండగా ఇంతవరకు రూ.1.82 కోట్లు వసూలయినట్టు తెలిపారు. – పిఠాపురం టౌ¯ŒS మండపేటలో రికార్డుస్థాయి.. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మండపేట మున్సిపల్ పరిధిలో రికార్డుస్థాయిలో పన్నులు వసూలయ్యాయి. ఆస్తిపన్నుగా రద్దయిన నోట్లను చెల్లించుకునేందుకు అవకాశమివ్వడంతో పెద్ద ఎత్తున భవన యజమానులు పన్నులు చెల్లించారు. ఏడాదికి మునిసిపాలిటీ ఆస్తిపన్ను డిమాండ్ రూ.2.74 కోట్లు కాగా ఇప్పటి వరకూ వసూలైన మొత్తం రూ.1.79 కోట్లు. దీనిలో రూ.57 లక్షలు పెద్దనోట్లు రద్దు తర్వాత వసూలైందే కావడం గమనార్హం. అక్టోబరు నెలలో కేవలం రూ. 9.63 లక్షలు వసూలయ్యాయి. సాధారణంగా నవంబరులో ఆస్తిపన్ను వసూలు దాదాపు రూ. 10 లక్షలు ఉంటుంది. – మండపేట -
మళ్లీ పేలిన పెట్రోబాంబు
పెట్రోలుపై రూ.1.34, yీ జిల్పై రూ.2.37 పెంచిన కేంద్రం పన్నుపోటుతో అదనంగా బాదేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై నెలకు రూ.7.75 కోట్లు పైగా భారం నెలన్నరలో మూడుసార్లు వడ్డన సాక్షి, రాజమహేంద్రవరం : పెట్రో ధరల బాంబు మరోమారు పేలింది. లీటర్ పెట్రోలుపై రూ.1.34, డీజిల్పై రూ.2.37 చొప్పున పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 63 పైసలు, డీజిల్పై 53 పైసల మేర పన్ను విధించింది. ఫలితంగా శనివారం వరకూ రూ.69.78గా ఉన్న లీటర్ పెట్రోలు ధర ఆదివారం రూ.71.72కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ.58.78 నుంచి రూ.61.68కు పెరిగింది. 45 రోజుల్లో భారం మోపారిలా.. గడచిన 45 రోజుల వ్యవధిలో పెట్రో ధరలను మూడుసార్లు పెంచారు. తాజా వడ్డనతో కలిపి ఈ నెలన్నర వ్యవధిలో పెట్రోలుపై రూ.4.86, డీజిల్పై రూ.4.84 మేర వినియోగదారులపై భారం పడింది. గత నెల ఒకటో తేదీన పెట్రోలుపై రూ.3.38, డీజిల్పై రూ.2.37 చొప్పున ధరలు పెరిగాయి. ఈ నెల 4వ తేదీన డీలర్ల కమీషన్ పెంచే పేరుతో పెట్రోలుపై 14 పైసలు, డీజిల్పై 10 పైసల చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి. దీనికి తాజా పెంపు తోడైంది. రోజుకు రూ.26 లక్షల బాదుడు తాజా పెరుగుదలతో జిల్లా ప్రజలపై రోజుకు సుమారు రూ.26 లక్షల భారం పడుతోంది. జిల్లాలో 251 పెట్రోలు బంకులు ఉన్నాయి. వీటిల్లో ప్రతి రోజూ సుమారు 5 లక్షల లీటర్ల పెట్రోలు, 8 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. లీటర్ పెట్రోలుపై రూ.1.34 పెంచడంతో రూ.6.90 లక్షలు, లీటర్ డీజిల్పై రూ.2.37 పెంచడంతో రూ.18.96 లక్షల చొప్పున రోజుకు దాదాపు రూ.25.86 లక్షల మేర వినియోగదారులపై అదనపు భారం పడింది. ఈ లెక్కన జిల్లాపై నెలకు రూ.7.75 కోట్ల భారం పడుతోంది. డీజిల్కన్నా విమాన ఇంధనం ధర తక్కువ పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపించే పెట్రోల్, డీజిల్ ధరల కన్నా ధనికుల ప్రయాణ సాధనమైన విమాన ఇంధనం ధర తక్కువగా ఉండడం గమనార్హం. విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర కన్నా డీజిల్ ధర సుమారు రూ.8 పైగా ఎక్కువగా ఉంది. విశేషం. లీటర్ ఏటీఎఫ్ ధర రూ.46.82 కాగా, డీజిల్ ధర రూ.54.98 కావడం గమనార్హం. ఏటీఎఫ్ ధరకన్నా పెట్రోల్ ధర దాదాపు 50 శాతం అధికంగా ఉంది. పేదల జేబుకు చిల్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. ద్విచక్రవాహనదారుల నెలవారీ పెట్రోలు ఖర్చు తక్కువలో తక్కువ రూ.200 పెరగనుంది. పెరిగిన డీజిల్, పెట్రోలు ధరలకు అనుగుణంగా ఆటోవాలాలు కూడా చార్జీలు పెంచే పరిస్థితి నెలకొంది. ఆటో చార్జీలు పెంచితే తిరిగి ఆ భారం కూడా ప్రజలపైనే పడుతుంది. ఒకవేళ పెరిగిన ధరలను ఆటోవాలాలే భరిస్తే ఆ మేరకు నష్టపోవాల్సి వస్తుంది. మరోపక్క పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా లారీల రవాణా చార్జీలు కూడా పెరగనున్నాయి. ఆ మేరకు నిత్యావసరాలు, కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. వీటన్నింటి ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది. రోజుకు రూ.30 కోల్పోతున్నాను ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నిత్యావసరాల ధరలు, పిల్లల స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగాయి. రోజుకు 18 గంటలు ఆటో నడుపుతూంటే మూడు నాలుగు వందల రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు డీజిల్ ధర పెరగడం వల్ల రోజుకు రూ.30 వరకూ నష్టపోవాల్సి వస్తుంది. డీజిల్ ధరల పెంపు మేరకు చార్జీలు పెంచలేని పరిస్థితి. – దూనబోయిన శ్రీనివాస్, ఆటోవాలా, రాజమహేంద్రవరం మధ్యతరగతివారికి ఇబ్బందులే.. పెట్రో ధరలను అదుపు చేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈమధ్య కాలంలో తరచూ పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో పేద, మధ్యతరగతి వారికి ఇబ్బందులు తప్పవు. ధరల పెంపు నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలను అదుపు చేయాల్సిన అవసరం ఉంది. – దంగేటి నాగేశ్వరరావు, దంగేరు, కె.గంగవరం మండలం -
రాజన్న సన్నిధిలో భక్తుల కిట కిట
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 84,787 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
పాలేరుకు వరద పోటు
22 అడుగులకు చేరిన నీటిమట్టం అప్రమత్తమైన ఎన్నెస్పీ సిబ్బంది కూసుమంచి: భారీ వర్షాల కారణంగా పాలేరు రిజర్వాయర్కు వరద పోటెత్తుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో.. వరదనీరు కొంత మేర పాలేరు రిజర్వాయర్లో కలుస్తోంది. పాలేరుకు 1000క్యూసెక్కుల వరదనీరు వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని దేవులపల్లి రిజర్వాయర్ అలుగు పోస్తుండగా మరో 3,500 క్యూసెక్కుల వరదనీరు కాలువ ద్వారా రిజర్వాయర్కు చేరుతోంది. దీంతో రిజర్వాయర్కు సుమారు 5వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో రిజర్వాయర్ నీటి మట్టం శుక్రవారం 18.6 అడుగులు ఉండగా శనివారం సాయంత్రానికి 22 అడుగులకు చేరింది. ఇన్టేక్వెల్కు పొంచి ఉన్న ప్రమాదం.. పాలేరుకు వరద పోటెత్తుతుండటంతో రిజర్వాయర్ ఒడ్డున మిషన్ భగీరథ పథకం కోసం నిర్మిస్తున్న ఇన్టేక్వెల్కు ప్రమాదం పొంచి ఉంది. రిజర్వాయర్కు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఇన్టేక్వెల్లోకి నీరు వెళ్లకుండా మట్టితో నిర్మించిన కట్ట కోతకు గురవుతోంది. అది తెగితే రిజర్వాయర్లోని నీరు ఇన్టెక్వెల్లోకి చేరి నిర్మాణాలు మునిగే ప్రమాదం ఉంది. దీంతో సిబ్బంది అప్రమత్తమై ఇసుక బస్తాలను వేసి కట్టను పటిష్ట పరుస్తున్నారు. దిగువకు నీటి విడుదల.. పాలేరు రిజర్వాయర్ నిండుతుండటంతోపాటు రిజర్వాయర్లోని ఇన్టేక్వెల్కు ప్రమాదం కలుగకుండా ఉండేందుకు ఎడమ కాలువకు 3,500 క్యూసెక్కుల నీటిని శనివారం మధ్యాహ్నం నుంచి విడుదల చేస్తున్నారు. ఈ నీరు రెండో జోన్కు సరఫరా అవుతోంది. కాగా రిజర్వాయర్ నీటిమట్టం 22 అడుగుల దాటితే ఇన్టెక్వెల్కు ప్రమాదం ఉన్నందున ఎన్నెస్పీ సిబ్బంది అప్రమత్తమై ఇన్ఫ్లోకు అనుగుణంగా అవుట్ప్లోను పెంచే చర్యలు చేపట్టారు. -
రాష్ట్ర పునర్నిర్మాణానికి వరం
‘సాగర్’కు పూర్వవైభవం మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి నిజాంసాగర్: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్ర పునర్నిర్మాణానికి వరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రెండు రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతుందన్నారు. ప్రాజెక్టును మంత్రి శనివారం పరిశీలించారు. అధికారులను ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, ప్రాజెక్టు నీటిమట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన జలాశయాలు నిండాయన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సింగూరు నుంచి 60వేల క్యూసెక్కులు, హల్దీవాగు నుంచి 30వేలు, ఘనపురం ఆనకట్ట నుంచి 25వేలు, పోచారం నుంచి 25వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందన్నారు. కొన్నేళ్ల తర్వాత పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటున్న ప్రాజెక్టును పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే హన్మంత్సింధే, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, నాయకులు వినయ్కుమార్, దుర్గారెడ్డి, గంగారెడ్డి, నార్ల సురేశ్, నీటిపారుదల శాఖ ఎస్ఈ గంగాధర్, ఈఈ సత్యశీలారెడ్డి తదితరులున్నారు. -
వరద ప్రభవంతో నాలుగు రోజులుగా బస్సులోనే...
-
గుంటూరు జిల్లాలో జల విలయం
-
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
-
బీర కాదు.. ‘భీమ’ కాయలు
గోగన్నమఠం (మామిడికుదురు): సాధారణంగా దేశవాళీ రకం బీర కాయలు రెండు వందల నుంచి మూడొందల గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. అంతకు మించి తూగడం చాలా అరుదు. అయితే గోగన్నమఠంలో భూపతిరాజు సతీష్రాజు ఇంటి పెరట్లో దేశవాళీ బీరపాదుకు కాసిన కాయల్లో కొన్ని కేజీ బరువు తూగుతున్నాయి. చూడ్డానికి తక్కువ పొడవు ఉన్నా వాటి బరువు మాత్రం భారీగా ఉండడం విశేషం. స్థానికులు ఈ బీరకాయలను ఆసక్తిగా చూస్తున్నారు. బీర కాయల ‘భీమ’ పరిమాణంపై ఉద్యాన శాఖాధికారి శైలజను సోమవారం ‘సాక్షి’ వివరణ కోరగా పెరట్లో మొట్టమొదటిసారిగా బీర పాదు పెట్టడం వల్ల అది భూమిలో ఉన్న పోషకాలను విరివిగా గ్రహించి అధిక బరువు గల కాయలు కాస్తోందన్నారు. ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుందన్నారు. -
జిల్లావ్యాప్తంగా వర్షం
అత్యధికంగా మహాముత్తారంలో 6.9 సెంటీమీటర్లు సగటున 2సెంటీమీటర్ల వర్షపాతం నమోదు ముకరంపుర : జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సగటను 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మహాముత్తారంలో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా జూన్ నుంచి ఇప్పటివరకు 746.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 739.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. కాటారంలో 6.3, సుల్తానాబాద్ 2.7, ఓదెల 2.3, ఎలిగేడు 2.9, శ్రీరాంపూర్, ఇల్లంతకుంట 4, గంభీరావుపేట 5.4, ఎల్లారెడ్డిపేట 3.2,ముస్తాబాద్ 5, మల్లాపూర్ 2.7, ఇబ్రహీంపట్నం 2.8, చిగురుమామిడి 3.1, వీణవంక 3.6,చొప్పదండి 4.2, హుజూరాబాద్ 2.9, హుస్నాబాద్ 4.2, కోహెడ 3.2, ఎల్కతుర్తి 2.4, భీమదేవరపల్లి 2.3, కమలాపూర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మల్హర్, మహదేవపూర్, కమాన్పూర్, జూలపల్లి, బోయినపల్లి, చందుర్తి, సిరిసిల్ల, పెగడపల్లి, కొడిమ్యాల, రాయికల్, మెట్పల్లి, రామడుగు, కేశవపట్నం, గంగాధర, సైదాపూర్, బెజ్జంకి మండలాల్లో ఒకటి నుంచి 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ఇప్పటివరకు ఎనిమిది మండలాల్లో అధికం, 39 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయింది. కోనరావుపేట, పెగడపల్లి, కొడిమ్యాల, కథలాపూర్, మేడిపల్లి, గొల్లపల్లి, ధర్మపురి, రామడుగు, మహాముత్తారం, మంథని ముత్తారంలో లోటు వర్షపాతం రికార్డయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి, పత్తి, ఆరుతడి పంటలకు జీవం పోశాయి. అయితే పలు ప్రాంతాల్లో పొలాలు, చేన్లలో నీళ్లు నిలవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. -
తెలంగాణలో అల్ప పీడన ప్రభావం
-
ప్రకాశంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు
-
గుంటూరులో హడలెత్తిస్తున్న వర్షాలు
-
పంటలను తుడిచిపెట్టిన కుంభవృష్ఠి
కూనవరం: పెదనర్సింగపేటలో శనివారం రాత్రి కురిసిన కుంభవృషి్ఠకి వాగు పొంగడంతో పొలాలు నీటమునిగాయి. వరద ఉధృతికి పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. పొలాలన్నీ ఇసుకమేటలతో దర్శనమిస్తున్నాయి. దీంతో మరో పంట వేసుకునే అవకాశం లేకుండా పోయిందని కూళ్లపాడు, నర్సింగపేట, పెదనర్సింగపేట రైతులు గగ్గోలు పెడుతున్నారు. మిర్చి, వరి, మినుము పంటలు సుమారు 100 ఎకరాలు తుడిచిపెట్టుకుపోయాయని, రూ.25 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. నాలుగు రోజుల నుంచి చెదురుమదురు జల్లులు పడుతున్నాయని, అవి మెరక ప్రదేశాల్లోని పంటలకు మేలుచేసేవిగా భావిస్తున్న తరుణంలో, ఏకబిగిన కురిసిన కుంభవృష్ఠి తమను నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మినుము పంటలకు ఎకరానికి రూ.12 వేల నుంచి రూ.15 వేలు పెట్టుబడులు పెట్టామని, మిర్చికి ఇప్పటివరకు రూ.30 వేలకు పైగా పెట్టుబడులు పెట్టినట్టు వివరించారు. -
సినిమా టికెట్ ధరలకు రెక్కలు
వరంగల్ బిజినెస్ : సినిమా థియేటర్లలో టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజీ సినిమా గురువారం విడుదల కాగా నగరంలోని పలు థియేటర్లలో టికెట్ల ధరలు పెంచారు. వరంగల్లోని రామ్, నటరాజ్, సునీల్, లక్ష్మణ్, హన్మకొండలోని అమృత, అశోక థియేటర్లలో రూ.60 ఉన్న టికెట్ ఏకంగా రూ.100కు, రూ.40 ఉన్న టికెట్ను రూ.60, రూ.20 ఉన్న టికెట్ను రూ.30కు పెంచారు. థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పించకుండానే ఇష్టారాజ్యంగా టికెట్ ధరలను పెంచడంతో సామాన్యులు సినిమా చూసే పరిస్థితి లేకుండా పోతోంది. టికెట్ ధరలు పెంచాలంటే జేసీ అనుమతి తీసుకోవాల్సి ఉండగా యాజమన్యాలు పట్టించుకోకపోవడం గమనార్హం. అలాగే, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాకే టికెట్ల ధరలు పెంచినట్లు చెబుతున్నారని పలువురు వాపోయారు. కాగా, సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు అధిక మొత్తం వెచ్చించడంతో టికెట్ల ధరలు పెంచినట్లు చెప్పారని సమాచారం. అయితే, వరంగల్ వెంకట్రామ థియేటర్లో కూడా టికెట్ ధర పెంచాలని డిస్ట్రిబ్యూటర్ ఒత్తిడి తెచ్చినా యజమాని నిరాకరించడంతో పాత ధరలతో విక్రయించారు. -
భారీ వర్షంతో అతలాకుతలం
మిర్యాలగూడ : భారీ వర్షం మిర్యాలగూడ నియోజకవర్గంలో అతలాకుతలమైంది. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి తెల్లవారే వరకు వర్షం కురిసింది. దాంతో చెరువులు పూర్తిగా నిండాయి. మిర్యాలగూడ పెద్ద చెరువులో చుక్క నీరు లేకుండా ఉండగా ఒక్క రాత్రికే చెరువు నిండింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని హనుమాన్పేట, రెడ్డికాలనీ, ముత్తిరెడ్డి కుంట, బంగారుగడ్డ, హౌజింగ్బోర్డు కాలనీలలో భారీగా వర్షపు నీరు నిలిచింది. దాంతో పాటు గాంధీ పార్కు పాఠశాలలో భారీగా వర్షపునీరు చేరింది. దాంతో ప్రజలు రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హనుమాన్పేటలో ఉన్న గుడిసె వాసులు ఇండ్లలోకి నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం భారీ వర్షం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడ నుంచి తడకమళ్లకు వెళ్ల ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి, తడకమళ్ల సమీపంలోని కల్వర్టుల మీదుగా నీరు ప్రవహిస్తుండం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడ మండలంలోని ఊట్లపల్లి పాఠశాలలో వర్షపు నీరు చేరి చెరువును తలపించేలా ఉంది. అధికారుల పట్టింపు లేకనే నష్టం పట్టణంలోని హనుమాన్పేటలోని సీఐటీయూ కార్యాలయం వెనుకభాగంలో ఉన్న గుడిసెల్లోకి వర్షపు నీరు చేరడంతో సామగ్రి పూర్తిగా తడిసిపోయిందని వార్డు కౌన్సిలర్ బావండ్ల పాండు పేర్కొన్నారు. సోమవారం హునుమాన్పేటలోని నీటమునిగిన గుడిసెలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ గతంలో కూడా ఎన్నో పర్యాయాలు రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు చెప్పినా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టకపోవడం వల్లనే గుడిసెల్లోకి నీరు చేరిందన్నారు. ఆయన వెంట సైదులు, తిరుపతయ్య, సంగయ్య, జయమ్మ, రాంబాబు, మహేష్రెడ్డి తదితరులు ఉన్నారు. -
హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది
-
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాల 12 రోజులలో 18.04 లక్షల మంది యాత్రికులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకున్న యాత్రికులు 22 లక్షల లడ్డూలను ప్రసాదంగా అందుకున్నారు. అమ్మవారి అన్న ప్రసాదాన్ని రెండు లక్షల మందికి పంపిణీ చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. చివరి రోజైన మంగళవారం అమ్మవారి సన్నిధికి యాత్రికుల తాకిడి అధికంగానే ఉంది. మంగళవారం 1.75 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ యాత్రికులతోపాటు పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వీఐపీలకు ఆలయ ఈవో సూర్యకుమారి సాదరంగా స్వాగతం పలికారు. పుష్కర యాత్రికులకు దుర్గమ్మ కుంకుమ ప్రసాదం నగరంలోని వేర్వేరు స్నానఘాట్లలో పుష్కర స్నానమాచరించిన యాత్రికులకు చివరి రోజున దుర్గమ్మ కుంకుమ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బస్టాండ్లోని నమూనా ఆలయంతోపాటు పున్నమి, భవానీ, సంగమం స్నాన ఘాట్లలో యాత్రికులకు అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం కాకపోయినా కుంకుమ ప్రసాదాన్ని నేరుగా యాత్రికులకు అందచేయడం సంతోషదాయకమని యాత్రికులు పేర్కొన్నారు. 12వ రోజున 1.75 లక్షల మంది.. పుష్కరాలలో 12వ రోజున 1.75 లక్షల మంది యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ప్రారంభమైన రద్దీ రాత్రి వరకు కొనసాగింది. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన యాత్రికులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. మంగళవారం 2.25 లక్షల లడ్డూలను దేవస్థానం విక్రయించింది. అమ్మవారి అన్న ప్రసాదాన్ని 21,600 మందికి అందచేశారు. -
దుర్గగుడిపై కొనసాగుతున్న రద్దీ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : దుర్గగుడిలో అమ్మవారి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ నెలకుంది. పుష్కరాలలో ఆరో రోజైన బుధవారం 1.30 లక్షల మంది పుష్కర యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ నరసింహన్తోపాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ, మంత్రులు శిద్దా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు పుష్కర యాత్రికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అమ్మవారి దర్శనానికి ఉచిత క్యూలైన్లతోపాటు శీఘ్రదర్శనం, వీఐపీ దర్శనాలకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో అలంకరించారు. 6వ రోజు ఆదాయం రూ.18. 24లక్షలు పుష్కరాలను పురష్కరించుకుని అమ్మవారి దేవస్థానానికి ఆరో రోజు రూ. 18.24 లక్షల ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.14 లక్షలు, మూడు వందల టికెట్ల విక్రయం ద్వారా రూ. 2.10 లక్షలు, రూ.5 వందల టికెట్ల విక్రయం ద్వారా రూ. 57,500, భవానీ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 1.20 లక్షల మేర ఆదాయం సమకూరింది. కేశకండన టికెట్ల విక్రయం ద్వారా రూ. 34,500 ఆదాయం సమకూరింది. -
ఆది దంపతుల దర్శనానికి బారులు
తరలివస్తున్న పుష్కర యాత్రికులు ఐదో రోజు కొనసాగిన రద్దీ విజయవాడ(ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకునేందుకు పుష్కర యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఐదో రోజు యాత్రికుల రద్దీ కొనసాగింది. మంగళవారం సుమారు 1.20 లక్షల మంది యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వృద్దులు, వికలాంగులు అమ్మవారి దర్శనానికి ఇబ్బందులకు గురి కావడం, మహా మండపం మీదగా కొండపైకి చేరేందకు లిఫ్టు వద్ద ఇబ్బందులకు గురి కావడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా బస్సు సదుపాయాన్ని కల్పించారు. మహా మండపం వద్ద విజయనగరం సమీపంలోని జామికి చెందిన గంగాధర్ ఫిట్స్తో కుప్పకూలిపోయాడు. దీంతో గంగాధర్ ముఖానికి గాయం కావడంతో ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి మంగళవారం రూ. 20, 28,790 ఆదాయం సమకూరింది. అర్జున వీధిలో అన్నప్రసాదం.. అర్జున వీధిలోని అన్నదానం షెడ్డులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి గంట పాటు యాత్రికులకు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు. మంగళవారం సుమారు 20 వేల మందికి అన్న ప్రసాదాన్ని అందించారు. అమ్మవారిని సన్నిధిలో ప్రముఖులు పుష్కర స్నానాల అనంతరం పలువురు ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డి, ఏపీ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ ఏబీ వెంకటేశ్వరరావు, సినీ నటుడు కోట శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు. -
పోటెత్తిన భక్తజనం
-
పోటెత్తిన భక్తజనం
కృష్ణా పుష్కరాల్లో రెండో రోజు పది లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు ► వరుస సెలవులతో పెరిగిన రద్దీ ► పాలమూరు ఘాట్లకే ఎక్కువగా తాకిడి ► నేడు, రేపు భక్తుల రాక పెరిగే అవకాశం ► టోల్ప్లాజాల వద్ద స్తంభించిన ట్రాఫిక్ ► పలు చోట్ల స్వల్ప అపశ్రుతులు సాక్షి నెట్వర్క్: వరుస సెలవుల నేపథ్యంలో పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. రెండో రోజు శనివారం 10 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పుష్కర ఘాట్లకే జనం తాకిడి ఎక్కువగా ఉంది. ఆది, సోమవారాల్లో పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పాలమూరులో పోటెత్తిన భక్త జనం.. శనివారం మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా కృష్ణా పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలకు చేశారు. జిల్లాలోని అన్ని ఘాట్లలో కలిపి 8.5 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. పలు చోట్ల అధికారుల అంచనాలకు మించి జనం రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. బీచుపల్లిలో సోమశిల, అలంపూర్, పస్పుల, కృష్ణ, జూరాల, నది అగ్రహారం, గొందిమళ్ల, క్యాతూర్ పుష్కరఘాట్లు భక్తులతో నిండిపోయాయి. అలంపూర్లో స్నానం అనంతరం జోగుళాంబను దర్శించుకోవడానికి భారీగా బారులు తీరారు. రంగాపూర్, బీచుపల్లిలో నీటి మట్టం తగ్గింది. గుడబల్లూరు పుష్కరఘాట్లో మంత్రి లక్ష్మారెడ్డి, బీచుపల్లి పుష్కరఘాట్లో అదనపు డీజీపీ అంజనికుమార్, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పుణ్య స్నానాలు చేశారు. నల్లగొండ ఘాట్లలో ప్రముఖుల పుణ్య స్నానాలు నల్లగొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలకు రెండో రోజు భక్తుల సంఖ్య పెరిగింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 28 ఘాట్లలో శనివారం 1.7 లక్షల మంది పుష్కర స్నానం చేశారు. నాగార్జునసాగర్లోని శివాలయం వీఐపీ ఘాట్లోనే 90 వేల మందికిపైగా పుణ్య స్నానమాచరించినట్లు అంచనా. వాడపల్లి, మట్టపల్లిల్లోనూ జన సందోహం పెరిగింది. వాడపల్లిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధర్మవర్దనరావు పుష్కర స్నానం చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మట్టపల్లిలో, ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాగార్జునసాగర్లో, ప్రభుత్వ సలహాదారు రాంలక్ష్మణ్ మట్టపల్లిలో, మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్రె డ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తదితరులు కుటుంబ సమేతంగా వాడపల్లిలో పుణ్య స్నానాలు చేశారు. ఆది, సోమవారాలు సెలవుదినాలు కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పలు అపశ్రుతులు.. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా నల్లగొండ సమీపంలో ఏర్పాటు చేసిన పానగల్ ఘాట్లో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆయన తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తర్కు చెందిన ఎస్. పెరుమాళ్లుగా గుర్తించారు. ఉదయం స్నానానికి వెళ్లిన ఆయన.. అలంకరణ బల్బుల కోసం ఏర్పాటు చేసిన తీగలు తగలడంతో మరణించాడు. అయితే పెరుమాళ్లు గుండెపోటుతో మరణించాడని అధికారులు చెబుతున్నారు. ఇక అదే ఘాట్లో ఓ ఐదేళ్ల చిన్నారి, 45 ఏళ్ల మహిళ నీళ్లలో మునిగిపోతుండగా.. గజ ఈతగాళ్లు రక్షించారు. ఇక పుణ్య స్నానాల కోసం మట్టపల్లి ఘాట్కు వెళుతున్న భక్తుల ఆటో.. చౌడపల్లి, మఠంపల్లి మధ్య బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక తమకు పని కల్పించాలని పారిశుద్ధ్య కార్మికులు, తమకు సరైన సౌకర్యాలు కల్పించాలని అర్చకులు పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. హైవేలపై వాహనాల రద్దీ కృష్ణా పుష్కర స్నానాలకు వెళ్తున్న భక్తుల వాహనాలతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అధికారులు టోల్ వసూలును తాత్కాలికంగా నిలిపివేసి.. వాహనాలను వదిలివేశారు. ట్రాఫిక్ తగ్గాక టోల్ వసూలు చేశారు. మరోవైపు నల్లగొండ జిల్లా పంతంగి టోల్ప్లాజా వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. -
ముంబైలో భారీ వర్షాలు.. హై అలర్ట్..!
ముంబైః భారీవర్షాలు ముంబైని ముంచెత్తాయి. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాణిజ్యనగరంలో జన జీవనం స్తంభించిపోయింది. రోడ్లు, రైల్వే ట్రాక్ లు, ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో కూడా భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్ళు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచీ పడుతున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో ఉదయం ఆఫీసులు, స్కూళ్ళకు వెళ్ళాల్సిన జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రైల్వే ట్రాక్ లపై నీరు నిలిచిపోవడంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పశ్చిమ, మధ్య రైల్వే కు చెందిన అనేక సబర్బన్ రైళ్ళు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. సియాన్-కుర్లా మధ్య రైల్వే ట్రాక్ లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలు, కారణంగా ముంబైనుంచీ బయల్దేరాల్సిన, ముంబైకి రావాల్సిన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సైతం అరగంట నుంచీ గంట వరకూ ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే మార్గాలు మళ్ళించడం, కాన్సిలేషన్స్ వంటి మార్పులేమీ లేవని, కేవలం ఆలస్యం మాత్రమే అవుతున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ముంబైకి దగ్గరలోని థానె, పాల్ఘర్, రాయ్ ఘడ్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో అహ్మదాబాద్, పూనె, నాసిక్, గోవాలనుంచి ముంబైకి చేరే మార్గాలన్నింటిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రాగల 48 గంటల్లో ముంబైతోపాటు, కొంకణ్ తీరప్రాంతాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందుజాగ్రత్తల్లో భాగంగా రాష్ట్రంలోని పోలీస్, అగ్నిమాపక, ఎన్డీ ఆర్ ఎఫ్ విభాగాలకు హై అలర్ట్ ప్రకటించింది. సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. -
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
కరీంనగర్: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. 20 టీఎంసీల సామర్ధ్యంగల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 18.5 టీఎంసీల నీరు ఉంది. అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి 93 వేల342 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 62 వేల 881 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. -
తాలిపేరు జలాశయానికి భారీ వరద
ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండింది. ప్రాజెక్టు 15 గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు 50,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 72.70 అడుగులు కాగా ఇన్ఫ్లో 1200 క్యూసెక్కులు. -
మహారాష్ట్రలో వర్ష బీభత్సం
-
‘నీలగిరి’లో భారీ వర్షం
నల్లగొండ టూటౌన్ : పట్టణంలో బుధవారం సాయంత్రం అరగంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శాంతినగర్, ఆర్పీరోడ్డు, బొట్టుగూడ, సాయినగర్ కాలనీ, చైతన్యపురి, లైన్వాడ, లెప్రసీకాలనీ, పద్మావతీకాలనీ, ఆర్టీసీకాలనీ, అంధుల పాఠశాల ఏరియా, శ్రీరాంనగర్ తదితర కాలనీల్లో రోడ్ల వెంట వరదనీరు భారీగా పారింది. పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ఉన్న డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.
-
పుట్టగొడుగు.. విస్తరించె అడుగడుగు
ద్వారకా తిరుమల: పుట్టగొడుగు.. ఎదిగే .. సాధారణంగా రెండు, మూడు అంగుళాల సైజులో ఉండే పుట్ట గొడుగు ఏకంగా రెండు అడుగుల వెడల్పున విస్తరించి చూపరులను అబ్బుర పరుస్తోంది. ద్వారకా తిరుమలలోని పుప్పాల మురళి ఇంటి ఆవరణలో రోజురోజుకు ఎదుగుతున్న ఈ పుట్టగొడుగును స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.