IIP
-
ద్రవ్యోల్బణం దారికి...పరిశ్రమ పక్కకు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి మంగళవారం మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న వాస్తవిక లక్ష్యానికి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం) ఇంకా అధికంగా ఉన్నప్పటికీ.. నాలుగు నెలల కనిష్టానికి సూచీ దిగిరావడం గమనార్హం. అలాగే గరిష్ట లక్ష్యానికన్నా (6 శాతం) దిగువన ఉండడం హర్షణీయ పరిణామం. కాగా, జనవరిలో 8.3 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ధర, సమీక్షా నెల ఫిబ్రవరిలో 8.66 శాతానికి ఎగసింది. ఇక పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 2024 జనవరిలో 3.8 శాతానికి మందగించింది. 2023 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీసహా మైనింగ్, విద్యుత్ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు గణాంకాలు ,కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కలు తెలిపాయి. 2023 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 4.2 శాతంకాగా, నవంబర్లో 2.4 శాతం. -
మందగించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: తయారీ రంగ పేలవ పనితీరు కారణంగా దేశీయంగా 2023 నవంబర్లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి మందగించింది. 8 నెలల కనిష్ట స్థాయి 2.4 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే తక్కువ స్థాయి వృద్ధి. చివరిసారిగా 2023 మార్చిలో అత్యంత తక్కువగా 1.9% స్థాయిలో ఐఐపీ వృద్ధి నమోదైంది. గతేడాది నవంబర్లో ఇది 7.6%. 2023–24 ఏప్రిల్–నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి 6.4%. అంతక్రితం ఆర్థిక సంవత్సరం అదే వ్యవధిలో వృద్ధి 5.6%. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తయారీ రంగం వృద్ధి 1.2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం నవంబర్లో ఇది 6.7%గా ఉంది. విద్యుదుత్పత్తి వృద్ధి కూడా 12.7% నుంచి 5.8 శాతానికి నెమ్మదించింది. మైనింగ్ రంగ ఉత్పత్తి వృద్ధి 9.7% నుంచి 6.8 శాతానికి తగ్గింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 5.4% మేర క్షీణించింది. అంతక్రితం నవంబర్లో 5% వృద్ధి నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి 3.6 శాతం క్షీణించింది. గత నవంబర్లో 10% వృద్ధి నమోదైంది. మౌలిక సదుపాయాలు/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం స్వల్పంగా 1.5% వృద్ధి చెందింది. -
పరిశ్రమలు వెనక్కి.. ధరలు పైపైకి!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్లో మైనస్లోకి జారిపోతే... రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. పారిశ్రామిక ప్రగతి శూన్యం... పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్లో కొంచెం పుంజుకుందనుకుంటే, డిసెంబర్లో మళ్లీ నీరసించిపోయింది. ఉత్పత్తి సూచీ (ఐఐపీ) –0.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 డిసెంబర్తో పోల్చిచూస్తే, 2019 డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణతలోకి జారిందన్నమాట. తయారీ, విద్యుత్ రంగాలూ క్షీణబాటలోనే నిలిచాయి. ఐఐపీ గతేడాది వరుసగా మూడు నెలల పాటు క్షీణ బాటలోనే ఉన్నప్పటికీ (ఆగస్టులో –1.4 శాతం, సెప్టెంబర్లో – 4.6 శాతం, అక్టోబర్లో –4 శాతం) నవంబర్లో కాస్త పుంజుకుని 1.8 శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాత నెల డిసెంబర్లో మళ్లీ క్షీణించడం గమనార్హం. 2018 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. కీలక రంగాలను చూస్తే... ► తయారీ: 2019 డిసెంబర్లో తయారీ రంగ ఉత్పాదకత క్షీణించి మైనస్ 1.2 శాతానికి పరిమితమైంది. 2018 డిసెంబర్లో ఇది 2.9 శాతం వృద్ధిలో ఉంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, 0.5 శాతం వృద్ధిలో ఉన్నా... ఇది 2018 ఇదే కాలంతో పోల్చిచూస్తే (4.7 శాతం) తక్కువకావడం గమనార్హం. ► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 4.5% వృద్ధి నుంచి నుంచి –0.1%కి పడింది. ► మైనింగ్: 5.4 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది డిసెంబర్లో ఇది మైనస్ 1 శాతంగా నమోదైంది.అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఈ రేటు 3.1 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర సామాగ్రి కొనుగోలుకు కొలమానంగా నిల్చే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో రేటు ఏకంగా – 18.2 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్లో ఇది 4.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్కండీషనర్ల వంటి ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో ఉత్పత్తి మైనస్ 6.7 శాతం. తొమ్మిది నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 4.7 శాతం. నిత్యావసర ధరల మంట ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్ రిటైల్ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. కట్టుదాటి...! రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయికి దూరంగా నవంబర్ (4.62 శాతం), డిసెంబర్ (7.35 శాతం), జనవరి (7.59 శాతం)ల్లో జరుగుతూ వచ్చింది. 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్లో తాకింది. ఆర్బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2019 ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని ఈ నెల మొదటి వారంలో జరిగిన ఏడు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి రెండుసార్లు మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గిం చింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపు లో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఆందోళనకరం... గత నెల దాకా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న దాఖలాలు కనిపించినప్పటికీ డిసెంబర్లో గణాంకాలు ఆందోళన రేకెత్తించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో అన్ని పరిశ్రమలకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎకానమీకి ఇది అంత మంచిది కాదు. – రుమ్కీ మజుందార్, డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త -
మళ్లీ వడ్డీ రేట్ల కోత చాన్స్..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో దఫా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం)కు తగిన ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో కేవలం 2.05 శాతంగా నమోదయ్యింది. గడచిన 19 నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఇక పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2018 డిసెంబర్లో కేవలం 2.4 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 7.3 శాతం. ధరలు తక్కువగా ఉండడం, పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడడం నేపథ్యంలో ఏప్రిల్ 2 పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ మరోదఫా రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలకు మరింత బలం చేకూరింది. పారిశ్రామిక విభాగాలు వేర్వేరుగా... ► తయారీ: సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధిరేటు డిసెంబర్లో 8.7 శాతం (2017 డిసెంబర్) నుంచి 2.7 శాతానికి (2018 డిసెంబర్) పడిపోయింది. అయితే 2018 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఈ రేటు 3.8 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలను నమోదుచేశాయి. ► మైనింగ్: డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –1.0 శాతం క్షీణించింది. 2017 ఇదే నెలలో ఈ రేటు కనీసం 1.2 శాతంగా ఉంది. అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి చూస్తే, వృద్ధి రేటు 2.9 శాతం నుంచి 3.1 శాతానికి పెరిగింది. ► విద్యుత్: డిసెంబర్లో వృద్ధి అక్కడక్కడే 4.4 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో మాత్రం ఈ రేటు 5.1 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులకు, యంత్ర సామగ్రి కొనుగోలుకు సూచిక అయిన ఈ రంగంలో వృద్ధి రేటు 13.2 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ రంగంలో మాత్రం వృద్ధి 2.1 శాతం నుంచి 2.9 శాతానికి పెరిగింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: ఈ విభాగంలో ఉత్పాదకత వృద్ధి రేటు భారీగా 16.8 శాతం నుంచి 5.3 శాతానికి దిగజారింది. జనవరిలో మరింత తగ్గిన ధరలు జనవరిలో రిటైల్ ధరల పెరుగుదల వేగం (ద్రవ్యోల్బణం) కేవలం 2.05 శాతంగా ఉంది. 2018లో ఈ రేటు 5.07 శాతం. జనవరిలో మొత్తం ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం సూచీ పెరక్కపోగా –1.29 శాతం తగ్గింది. వేర్వేరుగా చూస్తే, గుడ్లు (–2.44 శాతం), పండ్లు (13.32 శాతం), కూరగాయలు (–13.32 శాతం), పప్పు దినుసులు (–5.5 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తుల (–8.16 శాతం) ధరలు 2018 ఇదే నెలతో పోల్చితే తగ్గాయి. అయితే మాంసం, చేపల ధరలు 5.06 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 1.45 శాతం ఎగశాయి. ప్రిపేర్డ్ మీల్స్ ధరలు 3.48 శాతం పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణంలో మరో నాలుగు ప్రధాన విభాగాలను చూస్తే... పాన్, పొగాకు, ఇతర మత్తు ప్రేరితాల విభాగం బాస్కెట్ ధర 5.62 శాతం పెరిగింది. దుస్తులు, పాదరక్షల విభాగంలో ధరల సూచీ 2.95 శాతం ఎగసింది. హౌసింగ్ ధర 5.20 శాతం పెరిగితే, ఫ్యూయెల్ అండ్ లైట్లో ద్రవ్యోల్బణం 2.20 శాతం పెరిగింది. -
పారిశ్రామిక వృద్ధి పరుగులు
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్ మాసంలో వేగాన్ని పుంజుకుంది. మైనింగ్, విద్యుత్, తయారీ రంగాల తోడ్పాటుతో గడిచిన 11 నెలల కాలంలో అత్యధికంగా 8.1 శాతం వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక తయారీ సూచీ (ఐఐపీ) అన్నది క్రితం ఏడాది (2017) అక్టోబర్లో కేవలం 1.8 శాతమే వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు వివరాలను కేంద్ర గణాంక కార్యాలయం బుధవారం విడుదల చేసింది. 2017 నవంబర్లో ఐఐపీ వృద్ధి గరిష్టంగా 8.5 శాతం కాగా... ఆ తరవాత ఈ ఏడాది అక్టోబర్లో నమోదైన 8.1 శాతమే గరిష్ఠం. ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించి వృద్ధి 4.5 శాతంగా గతంలో విడుదల చేసిన తాత్కాలిక అంచనాల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే ఐఐపీ వృద్ధి 5.6 శాతం మేర నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 2.5 శాతం వృద్ధితో పోల్చి చూస్తే గాడినపడినట్టు తెలుస్తోంది. రంగాల వారీగా... ∙ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం అక్టోబర్ మాసంలో 7.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే మాసంలో ఉన్న వృద్ధి 2 శాతమే. ∙మైనింగ్ రంగంలో వృద్ధి 7 శాతంగా ఉంది. 2017 అక్టోబర్లో ఇది 0.2 శాతం మాత్రమే. ∙విద్యుత్ రంగం 10.8 శాతం వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే మాసంలో ఈ రంగంలో నమోదైన వృద్ధి 3.2 శాతంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. ∙క్యాపిటల్ గూడ్స్ రంగం 16.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ రంగంలో నమోదైన వృద్ధి 3.5%గా ఉంది. ∙కన్జ్యూమర్ డ్యురబుల్స్ రంగంలో వృద్ధి 17.6 శాతం కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న వృద్ధి 9 శాతం. ∙తయారీ రంగంలో 23 రకాల పరిశ్రమలకు గాను 21 పరిశ్రమలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. 17 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం నవంబర్లో 2.33 శాతంగా నమోదు న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు దిగొచ్చింది. కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.33 శాతానికి పడిపోయింది. ఇది 17 నెలల్లోనే అత్యంత తక్కువ ద్రవ్యోల్బణం. వినియోగ ధరల ఆధారితంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించే విషయం తెలిసిందే. ఇది అక్టోబర్ నెలలో 3.31 శాతంగా ఉందన్న గత అంచనాలను, తాజాగా 3.38 శాతానికి ప్రభుత్వం సవరించింది. 2017 నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.88 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్బీఐ విధానపరమైన నిర్ణయాల్లో రిటైల్ ద్రవ్యోల్బణా న్ని కూడా పరిగణనలోకి తీసుకునే విషయం తెలిసిందే. 2017 జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.46%గా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్లో 2.61% ప్రతికూలంగా ఉంది. కూరగాయల ధరలు అక్టోబర్లో మైనస్ 8.06%(డిఫ్లేషన్)గా ఉంటే, నవంబర్లో ఇంకాస్త తగ్గి మైనస్ 15.59%కి చేరాయి. పప్పు ధాన్యాల డిఫ్లేషన్ రేటు అక్టోబర్లో మైనస్ 10.28% నుంచి నవంబర్లో మైనస్ 9.22%కి రికవరీ అయ్యాయి. -
ఆర్థిక గణాంకాల నీరసం!
న్యూఢిల్లీ: భారత్ తాజా ఆర్థిక గణాంకాలు కొంత నిరాశ పరిచాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి చూస్తే) నమోదయ్యింది. మూడు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్ రంగం అలాగే భారీ ఉత్పత్తుల యంత్ర పరికరాలకు సంబంధించి క్యాపిటల్ గూడ్స్ విభాగాల పేలవ పనితీరు దీనికి కారణం. జూలైలో ఐఐపీ వృద్ధి రేటు 6.5 శాతంకాగా, గత ఏడాది ఇదే కాలంలో రేటు 4.8 శాతం. ఇక సెప్టెంబర్లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.77 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.28 శాతం. ఈ ఏడాది ఆగస్టులో ఈ రేటు పది నెలల కనిష్ట స్థాయిలో 3.69 శాతంగా నమోదయ్యింది. పారిశ్రామికం... రంగాల వారీగా.. మైనింగ్: 2017 ఆగస్టులో 9.3 శాతం వృద్ధి రేటు నమోదయితే 2018 ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా, –0.4 శాతం క్షీణత నమోదయ్యింది. అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ రేటు 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది. క్యాపిటల్ గూడ్స్: ఈ రంగం కూడా 7.3 వృద్ధిరేటు నుంచి 5 శాతం క్షీణతకు పడిపోయింది. తయారీ: ఈ రంగంలో వృద్ధి రేటు 3.8 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు (ఐదు నెలలు) మధ్య ఈ రేటు 1.7 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానుకూలంగా ముగిశాయి. విద్యుత్: ఈ రంగం నిరాశాజనకంగా ఉంది. ఆగస్టులో వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గితే, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఈ రేటు 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది. కన్జూమర్: కన్జూమర్ డ్యూరబుల్స్, కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ రంగాల్లో వృద్ధి రేట్లు వరుసగా 5.2 శాతం, 6.3 శాతంగా ఉన్నాయి. ఐదు నెలల్లో బాగుంది.... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో (ఏప్రిల్–ఆగస్టు) వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగింది. పెరిగిన క్రూడ్, ఆహార ధరలు! పెరిగిన క్రూడ్, ఆహార ధరలు సెప్టెం బర్లో రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయి. చేపలు, గుడ్లు, పాలు, పాలపదార్థాలు ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే పండ్ల ధరలు మాత్రం కొంచెం తగ్గాయి. కన్జూమర్ ఫుడ్ బాస్కెట్ ధర 0.51 శాతం పెరిగింది. ఫ్యూయెల్, లైట్ కేటగిరీలో ద్రవ్యోల్బణం రేటు 8.47 శాతం పెరిగింది. -
వాణిజ్య యుద్ధం, రూపాయిపై దృష్టి
స్థూల గణాంకాల వెల్లడి ఈ వారంలో సూచీల దిశానిర్దేశం చేయనున్నట్లు మార్కెట్ పండితులు భావిస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి, అమెరికా–చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ పరిణామాలు సూచీలకు కీలకం కానున్నాయని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి వివరించారు. ఈ సమాచారం ఆధారంగానే అక్టోబరులో సమావేశంకానున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షను వెల్లడించనుందన్నారు. వడ్డీ రేట్ల ప్రకటనకు కీలకంగా ఉన్న ద్రవ్యోల్బణ సమాచారం ఈవారంలోనే సూచీలకు ఒక దిశను ఇవ్వనుందని విశ్లేషించారు. ఇక గురువారం (సెప్టెంబరు 13న) వినాయక చవితి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. గణాంకాలే కీలకం: ఎపిక్ రీసెర్చ్ ఆగస్టు నెలకు సంబంధించిన వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) బుధవారం వెల్లడికానుంది. ఇదే రోజున జూలై పారిశ్రామికోత్పత్తి డేటా వెలువడనుంది. వీటితోపాటు ఆగస్టు టోకు ధరల(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం శుక్రవారం వెల్లడికానుండగా.. మార్కెట్కు ఈ గణాంకాలు కీలకమని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. సెప్టెంబరు 7 నాటికి విదేశీ మారక నిల్వలు.. ఆగస్టు 31 వారాంతానికి డిపాజిట్లు, బ్యాంకు రుణాల వృద్ధి రేటు గణాంకాలను శుక్రవారం ఆర్బీఐ వెల్లడించనుంది. రూపాయి కదలికల ప్రభావం ‘ముడిచమురు ధర మరోసారి 80 డాలర్ల దిశగా ప్రయాణం చేస్తూ రూపాయి మారకం విలువను కుంగదీస్తోంది. 80% దిగుమతిపైనే ఆధారపడుతున్న భారత్కు క్రూడ్ ధరలో ర్యాలీ ప్రతికూల ప్రభావమే చూపనుంది. మరోవైపు అమెరికా జాబ్ డేటా సానుకూలంగా ఉన్నందున డాలరు విలువ మరింత బలపడి రూపాయి విలువ క్షీణతకు దారి తీస్తోంది.’ అని కొటక్ సెక్యూరిటీస్ కరెన్సీ విభాగం డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనింద్య బెనర్జీ వెల్లడించారు. డాలర్ మారకంలో రూపాయి విలువ గతవారం ఒకదశలో 72.11 జీవిత కాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వారాంతానికి 71.73 వద్ద నిలిచింది. ఏడాదిలో 13 శాతం క్షీణతను నమోదుచేసింది. వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా ఉత్పత్తులపై మరోసారి తాజా ట్యారిఫ్ ప్రకటన ఉండనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో రూపాయి స్పాట్ స్థాయిని 71.60–72.60 మధ్య అంచనావేస్తున్నట్లు తెలిపారు. ‘10– ఏళ్ల బాండ్ ఈల్డ్ గతవారంలో 8 శాతానికి చేరుకోవడం, ద్రవ్య లోటు భయాల ఆధారంగా చూస్తే త్వరలోనే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచేందుకు అవకాశం ఉంది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. అంతర్జాతీయ గణాంకాలు ఏం చెబుతాయి? అమెరికా ఆగస్టు కోర్ సీపీఐ గురువారం, రిటైల్ అమ్మకాల డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఫెడ్ తదుపరి సమావేశానికి కీలకం కానున్న ఈ డేటాపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు సోమవారం చైనా ఆగస్టు వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, శుక్రవారం పారిశ్రామికోత్పత్తి డేటాలను వెల్లడించనుంది. ఈ చైనా గణాంకాలు సైతం మార్కెట్పై ప్రభావం చూపను న్నాయి. గురువారం జరగనున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సమావేశం సైతం వడ్డీరేట్ల నిర్ణయానికి కీలకంగా ఉంది. 11,760 వద్ద తక్షణ నిరోధం ‘టెక్నికల్గా గతవారం నిఫ్టీ దిద్దుబాటును నమోదుచేసింది. చార్టుల ఆధారంగా అప్ట్రెండ్ కనిపిస్తోంది. నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,760 పాయింట్ల వద్ద ఉంది. దిగువస్థాయిలో 11,393–11,340 శ్రేణిలో మద్దతు ఉంది.’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. నిరాశపరిచిన విదేశీ నిధుల ప్రవాహం ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత కారణంగా గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.5,600 కోట్లను వెనక్కు తీసుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం సెప్టెంబరు 3–7 మ ధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.1,021 కోట్లు.. డెట్ మార్కెట్ నుంచి రూ.4,628 కోట్లు ఎఫ్పీఐలు వెనక్కు తీసుకున్నారు. ఏప్రిల్–జూన్ కాలంలో రూ.61,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న వి దేశీ ఇన్వెస్టర్లు ఆ తరువాత నికర కొనుగోలుదారులుగా నిలిచినప్పటికీ.. తాజాగా మరోసారి నికర అమ్మకందారులుగా నిలిచారు. -
పరిశ్రమల పరుగు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) వృద్ధి రేటు జూన్లో 7%గా నమోదైంది. మే నెలలో ఈ రేటు 3.9% కాగా, 2017 జూన్లో వృద్ధి అసలు లేకపోగా, –0.3% క్షీణత నమోదయ్యింది. సూచీలో దాదాపు 77 శాతంగా ఉన్న తయారీతోపాటు మైనింగ్, విద్యుత్ రంగాల నుంచి మెరుగైన ఉత్పత్తి జూన్లో మంచి వృద్ధి ఫలితానికి దారితీసింది. తయారీ: జూన్లో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా –0.7%క్షీణించింది. ఇక ఈ విభాగాన్ని ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చూస్తే వృద్ధిరేటు 1.6% నుంచి (2017 ఇదే కాలంతో పోల్చి) 6.2 శాతానికి చేరింది. తయారీ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 19 సానుకూల వృద్ధి తీరును నమోదుచేసుకున్నాయి. మైనింగ్: జూన్లో వృద్ధి రేటు 0.1 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. ఏప్రిల్–జూన్ మధ్య ఈ రేటు 1.1 శాతం నుంచి 5.4 శాతానికి చేరింది. విద్యుత్: వృద్ధి రేటు 2.1 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఈ రేటు 5.3% నుంచి 4.9%కి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల డిమాండ్కు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి రేటు 9.6%. గత ఏడాది ఇదే నెలలో వృద్ధిలేకపోగా –6.1 శాతం క్షీణత నమోదయ్యింది. కన్జూమర్ డ్యూరబుల్స్: –3.5 శాతం క్షీణత భారీగా 13.1 శాతం వృద్ధికి మారింది. ఆరునెలల్లో...: ఐఐపీ వృద్ధి రేటు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 1.9 శాతం. -
అయిదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: మార్చి నెలలో భారత వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం 4.28 శాతానికి దిగి వచ్చింది. వార్షిక ప్రాతిపదికన సిపిఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 4.28 శాతం వద్ద అయిదు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు నెలలో 5.07 శాతంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రధానంగా ఆహార ధరలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. అయితే ఫిబ్రవరి నెలలో పారిశ్రామిక ఉత్పాదకత 7.1 శాతానికి తగ్గింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఓ) వృద్ధిని సాధించింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూరగాయల విభాగంలో ద్రవ్యోల్బణం మార్చి నెలలో 11.7 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 17.57 శాతంగా ఉంది. గుడ్లు, పాలు, ఇతర ఉత్పత్తుల వంటి ప్రోటీన్ వస్తువుల ధరల పెరుగుదల రేటు గత నెలలో మార్చి నెలలో చాలా మోడరేట్ చేసింది. మొత్తం ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.26 శాతానికి పడిపోయి 2.81 శాతంగా ఉంది. ఇంధన, లైట్ విభాగంలో కూడా మంత్ ఆన్ మంత్ ద్రవ్యోల్బణం 5.73 శాతంగా నమోదైంది. -
ఆర్థిక వ్యవస్థకు జోష్..!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంబంధించి సోమవారం కేంద్రం గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలు ఊరట నిచ్చాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి జనవరిలో 7.5 శాతంగా నమోదయ్యింది (డిసెంబర్లో 7.1 శాతం). 2017 జనవరిలో 3.5 శాతం. అయితే పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో భారీగా పెరిగినా, ఆర్థిక సంవత్సరం మొదటి నుంచీ ఇప్పటి వరకూ చూస్తే, నిరాశలోనే ఉంది. వృద్ధి రేటు 5 శాతం నుంచి 4.1 శాతానికి పడిపోయింది. ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 4.4 శాతంగా నమోదయ్యింది. మరింత విశ్లేషిస్తే... పరిశ్రమలకు తయారీ ఊరట... ♦ మొత్తం ఐఐపీలో దాదాపు 78 శాతం వాటా ఉన్న తయారీ రంగం జనవరిలో మంచి పురోగతి చూపించడం మొత్తం గణాంకాలపై సానుకూల ప్రభావం చూపింది. ఈ విభాగంలో వృద్ధి 8.7%గా నమోదయ్యింది. 2017 జనవరిలో ఈ పెరుగుదల శాతం కేవలం 2.5 శాతమే. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకూ చూస్తే, (2017 ఏప్రిల్ నుంచీ) ఈ విభాగంలో వృద్ధి 4.8% నుంచి 4.3%కి పడిపోయింది. జనవరిలో తయారీ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానుకూల వృద్ధిని నమోదచేసుకున్నాయి. ♦ కేపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సూచిక అయిన ఈ విభాగంలో జనవరిలో వృద్ధిరేటు 0.6%(2017 జనవరిలో) భారీగా 14.6%కి ఎగసింది. ♦ మైనింగ్: ఈ రంగంలో మాత్రం జనవరిలో వృద్ధి భారీగా పడిపోయింది. ఈ రేటు 8.6 శాతం నుంచి 0.1 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో కూడా ఈ రేటు 4.8 శాతం నుంచి 2.5 శాతానికి పడిపోయింది. ♦ విద్యుత్: విద్యుత్ రంగంలో వృద్ధి జనవరిలో 5.1 శాతం నుంచి 7.6 శాతనికి పెరిగినా, ఏప్రిల్ నుంచీ జనవరి మధ్య మాత్రం ఈ రేటు 6.3 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది. ♦ వినియోగ వస్తువులు: సబ్సులు, టూత్ పేస్ట్లు వంటి ఎఫ్ఎంజీసీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) వస్తువులు ప్రధాన భాగంగా ఉండే కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. అయితే ఫ్రిజ్లు, ఎయిర్ కండీషన్లు వంటి డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తుల వృద్ధి భారీగా 8 శాతం పెరిగింది. 2017 ఇదే నెలలో ఈ ఉత్పత్తుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, మైనస్ 2శాతం క్షీణత నమోదయ్యింది. రిటైల్ ధరల ఊరట... రిటైల్ ధరల విషయానికి వస్తే, జనవరిలో 5.07 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4.44 శాతానికి తగ్గింది. నవంబర్లో ఇంత తక్కువగా (4.88) ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఇందులో మొత్తం ఐదు విభాగాలనూ వేర్వేరుగా చూస్తే... ♦ ఆహారం, పానీయల ధరలు 3.38 శాతం పెరిగాయి. ♦ పాన్, పొగాకు, ఇతర హానికారక వినియోగ వస్తువుల ధరలు 7.34 శాతం ఎగశాయి. ♦ దుస్తులు, పాదరక్షల విషయంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల 5 శాతం. ♦ హౌసింగ్లో రిటైల్ ద్రవ్యోల్బణం 8.28 శాతం. ♦ ఇంధనం–లైట్ విభాగంలో రేటు 6.80 శాతం. కూరగాయలు భారమే... ఆహారం, పానీయల విభాగాన్ని విశ్లేషిస్తే... జనవరిలో కూరగాయల ధరలు భారీగా 17.57 శాతం ఎగశాయి. అయితే డిసెంబర్లో ఈ రేటు ఇంకా భారీగా 26.97 శాతంగా ఉంది. గుడ్ల ధరలు 8.51 శాతం ఎగశాయి. పండ్ల ధరలు 4.80 శాతం పెరిగాయి. తక్కువగా ధరలు పెరిగిన వస్తువుల్లో తృణ ధాన్యాలు (2.10 శాతం), మాంసం, చేపలు (3.31 శాతం), పాలు, పాలపదార్థాలు (3.83 శాతం), ఆయిల్స్, ఫ్యాట్స్ (1.09 శాతం) ఉన్నాయి. ఆల్కాహాల్యేతర పానీయాల ధరలు 1.34 శాతం పెరిగితే, ప్రిపేర్డ్ మీల్స్ ధరలు (స్నాక్స్, స్వీట్స్ కాకుండా) 4.47 శాతం పెరిగాయి. ఇక పప్పు ధాన్యాల ధరలు అసలు పెరక్కపోగా, – 17.34 శాతం తగ్గాయి. ధరలు తగ్గిన ఉత్పత్తుల్లో చక్కెర (–0.26 శాతం), సుగంధ ద్రవ్యాలు (–1.01 శాతం) ఉన్నాయి. -
గణాంకాలు కీలకం!
పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్కు కీలకం కానున్నాయని మార్కెట్ నిపుణులంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్తో రూపాయి మారకం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సరళి తదితర అంశాలు కూడా మార్కెట్పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. నేడు రిటైల్ ద్రవ్యోల్బణం డేటా... నేడు (సోమవారం) ఫిబ్రవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, జనవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) మార్కెట్ ముగిసిన తర్వాత వస్తాయి. గత ఏడాది డిసెంబర్లో 5.21 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో 5.07 శాతానికి తగ్గింది. ఇక గత ఏడాది డిసెంబర్లో ఐఐపీ 7.1 శాతంగా నమోదైంది. ఈ ఏడాది జనవరిలో ఐఐపీ 6.3–6.4 శాతం రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఇక ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు (డబ్ల్యూపీఐ) ఈ నెల 14న(బుధవారం) వెలువడతాయి. ఈ ఏడాది జనవరిలో డబ్ల్యూపీఐ 2.84 శాతంగా ఉంది. సోమవారం వాణిజ్య లోటు గణాంకాలు, మంగళవారం (ఈ నెల 13న) క్యూ4 కరంట్ అకౌంట్ లోటు గణాంకాలు వస్తాయి. ఐఐపీ, రిటైల్ద్రవ్యోల్బణ గణాంకాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 4.74 శాతానికి దిగి వస్తుందన్న అంచనాలున్నాయని ఆయన అన్నారు. ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రతికూలంగా ఉంటే మార్కెట్ పతనమవుతుందని ఎపిక్ రీసెర్చ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముస్తఫా నదీమ్ చెప్పారు. ఐఐపీ, రిటైల్ గణాంకాల ప్రభావం బ్యాంక్ నిఫ్టీపై అధికంగా ఉంటుందని, ఈ సూచీ 200 రోజుల సగటు కంటే దిగువకు ట్రేడవుతోందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ వికాస్ జైన్ చెప్పారు. వాహన, ప్రైవేట్ బ్యాంక్, కన్సూమర్ డ్యూరబుల్ రంగాల షేర్లు సానుకూలంగా చలించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. బలహీనతలు కొనసాగుతాయ్... గత శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించడంతో అమెరికా మార్కెట్ భారీగా లాభపడిందని, దీంతో ఈ సోమవారం మన మార్కెట్ సానుకూలంగానే ఆరంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వారంలో బలహీనతలు కొనసాగుతాయని, కన్సాలిడేషన్ కొనసాగుతుందని వారంటున్నారు. స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడుతాయని, అయితే బ్యాంక్ రుణ కుంభకోణాలకు సంబంధించి కొత్త అంశాలు వెల్లడైతే మాత్రం అమ్మకాలు వెల్లువెత్తుతాయని వారు హెచ్చరిస్తున్నారు. రూ.5,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్కు సంబంధించి ఆంధ్రాబ్యాంక్ మాజీ డైరెక్టర్పై ఈడీ చార్జ్షీట్ వేయడం, రూ.50 కోట్లకు మించిన బ్యాంక్ రుణాలకు సంబంధించి బ్యాంక్ పుస్తకాలను తనిఖీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఈ వారంలో మూడు ఐపీఓలు ఈ వారంలో మూడు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లు రానున్నాయి. భారత్ డైనమిక్స్ ఐపీఓ ఈ నెల 13న(మంగళవారం) ఆరంభమై 15న ముగుస్తుంది. ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.413–428గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.961 కోట్ల మేర సమీకరించనుంది. కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. బంధన్ బ్యాంక్ ఐపీఓ ఈ నెల 15న(గురువారం) ఆరంభమై ఈ నెల 19న ముగుస్తుంది. రూ.370–375 ధర శ్రేణితో ఈ బ్యాంక్ రూ.4,473 కోట్లు సమీకరించనున్నది. కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఐపీఓ ఈ నెల 16(శుక్రవారం) ప్రారంభమై 21న ముగుస్తుంది. రూ.1,215–1,240 ప్రైస్బాండ్తో రూ.4,482 కోట్లు సమీకరిస్తుంది. ఈ వారం ఈవెంట్స్ 12 సోమ - జనవరి ఐఐపీ గణాంకాలు ,ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణగణాంకాలు , వాణిజ్య లోటు వివరాలు 13 మంగళ - క్యూ4 కరంట్ అకౌంట్ లోటు గణాకాలు 14 బుధ - ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ వివరాలు -
గణాంకాలకు మారనున్న బేస్ ఇయర్!
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకు ప్రభుత్వం బేస్ ఇయర్ను మార్చనుంది. జీడీపీ, ఐఐపీ గణాంకాలకు బేస్ ఇయర్ 2017–18గా మార్చుతున్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ఇక్కడ జరిగిన ఒక సదస్సులో వెల్లడించారు. రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్ను 2018గా మార్చుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మూడు కీలక ఆర్థిక గణాంకాలకూ 2011–12 బేస్ ఇయర్గా ఉంది. ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో పారదర్శకత, స్పష్టత లక్ష్యంగా కేంద్రం బేస్ ఇయర్ మార్పు నిర్ణయం తీసుకుంటోందన్నారు. గణాంకాల వ్యవస్థ పటిష్టతకు మరిన్ని చర్యలు తీసుకుంటుందని కూడా పేర్కొన్నారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గణాంకాల్లో స్పష్టత ఆవశ్యకత ఎంతో ఉంటుందని అన్నారు. 2018–19లో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖకు కేంద్రం రూ.4,859 కోట్లను కేటాయించింది. -
పరిశ్రమలు రయ్..రయ్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ), రిటైల్ ద్రవ్యోల్బణం అంశాలకు సంబంధించి సోమవారంనాడు విడుదలైన తాజా గణాంకాలు కొంత ఊరటనిచ్చాయి. తయారీ రంగం ఊతంతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2017 డిసెంబర్లో 7.1 శాతంగా ఉంది. 2016 డిసెంబర్లో ఈ రేటు 2.4 శాతం. అయితే నవంబర్ 2017తో (8.8 శాతం) పోల్చితే మాత్రం ఐఐపీ తక్కువగా నమోదయ్యింది. డిసెంబర్తో పోల్చితే జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారంనాడు విడుదల చేసిన గణాంకాలు చూస్తే... పారిశ్రామిక ఉత్పత్తిలో ముఖ్యాంశాలు... ♦ తయారీ: మొత్తం సూచీలో 74 శాతంగా ఉన్న ఈ విభాగంలో డిసెంబర్లో వృద్ధి 0.6 శాతం నుంచి భారీగా 8.4 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రేటు మాత్రం 5 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి. ♦ మైనింగ్: వృద్ధి రేటు డిసెంబర్లో 10.8 శాతం నుంచి తీవ్రంగా 1.2 శాతానికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో ఈ రేటు 4.3 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గింది. ♦ విద్యుత్: డిసెంబర్లో వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గగా, ఏడు నెలల కాలంలో ఈ రేటు 6.3 శాతం నుంచి 5.1 శాతానికి పడింది. ♦ క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు ప్రతిబింబంగా పరిగణించే ఈ విభాగంలో డిసెంబర్లో వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 16.4 శాతానికి ఎగసింది. ♦ అన్ని విభాగాలూ కలిసి... రేటు 2.4 శాతం నుంచి 7.1 శాతానికి పెరిగింది. అయితే ఆర్థిక సంవత్స రం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య నెలల్లో ఈ రేటు 5.1 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. రిటైల్ ధరలు కాస్త తగ్గాయి 2018 జనవరిలో టోకు ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా ఉంది. 2017 డిసెంబర్లో ఈ రేటు 17 నెలల గరిష్ట స్థాయిలో 5.21 శాతం. అయితే 2017 జనవరిలో మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం 3.17 శాతంగా నమోదయ్యింది. అంటే నెలవారీలో తగ్గినా వార్షికంగా చూస్తే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందన్నమాట. విభాగాలవారీగా... జనవరిలో ఐదు ప్రధాన విభాగాల్లో ద్రవ్యోల్బ ణాన్ని చూస్తే...ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం 4.58 శాతం, పాన్, పొగాకు, ఇతర హానికారక ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.58 శాతం, దుస్తులు పాదరక్షల విభాగంలో ధరలు 4.94 శాతం, హౌసింగ్ విషయంలో 8.33 శాతం, ఫ్యూయెల్ అండ్ లైట్కు సంబంధించి 7.73 శాతం ధరలు పెరిగాయి. ఆహారం, పానీయాల విషయంలో ప్రధానంగా పప్పు దినుసులు (20.19 శాతం క్షీణత) మినహా మిగిలిన అన్ని ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయి. కూరగాయల ధరలు భారీగా 26.97 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 8.70 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 6.24 శాతం పెరగ్గా, మాంసం చేపల ధరలు 4.34 శాతం, పాలు, పాల పదార్థాల ధరలు 4.21 శాతం ఎగశాయి. -
పగ్గాలు తెంచుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం చాలా నెలల తర్వాత మరోసారి దౌడుతీసింది. ఆహారోత్పత్తులు, కూరగాయలు, గుడ్ల ధరల పెరుగుదలతో ఆర్బీఐ నియంత్రిత లక్ష్యమైన 4 శాతాన్ని దాటేసుకుని గడిచిన డిసెంబర్ మాసంలో ఏకంగా 5.21 శాతానికి ఎగిసింది. దీంతో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలన్నీ ఆవిరయ్యాయి. వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్) ద్రవ్యోల్బణం గత నవంబర్ నెలలో 4.88 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో (2 పాయింట్లు అటు, ఇటుగా) కొనసాగించేలా చూడాలంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరిన విషయం తెలిసిందే. ఆహార ధరల ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 4.42 శాతంగా ఉంటే, అది డిసెంబర్లో 4.96 శాతానికి పెరిగింది. గుడ్లు, కూరగాయలు, పండ్ల ధరలు ప్రియమైనట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తృణధాన్యాలు, పప్పుల విషయంలో ద్రవ్యోల్బణం మోస్తరుగానే ఉంది. దూసుకెళ్లిన పారిశ్రామికోత్పత్తి దేశ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 17 నెలల గరిష్టానికి చేరింది. గత నవంబర్ నెలలో ఐఐపీ 8.4 శాతంగా నమోదైంది. తయారీ రంగం, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో మెరుగైన పనితీరు వృద్ధికి దోహదపడింది. 2016 నవంబర్లో ఐఐపీ 5.1 శాతంగా ఉండగా, దాంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడినట్టు తెలుస్తోంది. 2016 జూన్లో ఐఐపీ 8.9 శాతం తర్వాత ఆ స్థాయిలో వృద్ధి మళ్లీ గత నవంబర్లోనే సాధ్యమైంది. మరోవైపు గతేడాది అక్టోబర్ నెలకు సంబంధించిన ఐఐపీ గణాంకాలను గతంలో వేసిన 2.2 శాతం అంచనాలకు బదులు 2 శాతానికి ప్రభుత్వం సవరించింది. వృద్ధి బాటలో... ♦ ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం నవంబర్లో 10.2 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 4 శాతమే. ♦ ఫార్మాస్యూటికల్స్, ఔషధ రసాయనాలు, బొటానికల్ ఉత్పత్తుల విభాగం మాత్రం 39.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఉత్పత్తుల్లో ఇది 29.1 శాతంగా ఉంది. ♦ పెట్టుబడులకు కొలమానమైన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 9.4 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది నవంబర్లో ఇది 5.3 శాతం. ♦ ఎఫ్ఎంసీజీ రంగం 23.1 శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే మాసంలో ఉన్న 3.3 శాతంతో పోలిస్తే భారీ వృద్ధి నమోదైనట్టు. తగ్గిన రంగాలు ♦ ఇక కీలకమైన గనుల రంగంలో వృద్ధి పడిపోయింది. కేవలం 1.1 శాతంగానే నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే మాసంలో ఇది 8.1 శాతం కావడం గమనార్హం. ♦ విద్యుదుత్పత్తి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోలిస్తే 9.5 శాతం నుంచి 3.9 శాతానికి క్షీణించింది. ♦ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మెషీన్లతో కూడిన కన్యూమర్ డ్యూరబుల్స్లో వృద్ధి 6.8 శాతం నుంచి 2.5 శాతానికి పరిమితమైంది. -
స్పీడు తగ్గిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తి (ఐఐపీ) సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. ఈ ఏడాది ఆగస్ట్లో 4.5 శాతంగా ఉన్న ఐఐపీ వృద్ధి మరుసటి నెల సెప్టెంబర్లో మాత్రం 3.8 శాతం వద్దే ఆగిపోయింది. గతేడాది సెప్టెంబర్ మాసంనాటి వృద్ధి 5 శాతంతో పోల్చుకున్నా తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఈ మేరకు తాజా వివరాలను కేంద్ర గణాంక విభాగం శుక్రవారం విడుదల చేసింది. వీటిని గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఐఐపీ 2.5 శాతం వృద్ధి చెందగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 5.8 శాతంతో పోల్చుకుంటే సగానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది. విభాగాల వారీగా... ♦ ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్లో 3.4 శాతానికే పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో 1.9 శాతమే వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది. ♦ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హోమ్అప్లియెన్సెస్ తదితర) ఉత్పత్తి 4.8 శాతం మేర వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 10.3 శాతం. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 1.5 శాతంగా ఉండగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 6.9 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్ విభాగం మాత్రం గరిష్ట స్థాయిలో 10 శాతం పెరిగింది. ♦ విద్యుదుత్పత్తి రంగం వృద్ధి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా ఉండగా, అది తాజాగా 3.4 శాతానికి పడిపోయింది. -
పారిశ్రామిక రంగం పరుగులు
న్యూఢిల్లీ: పారిశ్రామిక వృద్ధి మళ్లీ పరుగు అందుకుంది. ఆగస్ట్లో 4.3 శాతం వృద్ధితో తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. మైనింగ్, విద్యుత్ రంగాల చక్కని పనితీరుతో ఇది సాధ్యపడింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గతేడాది ఆగస్ట్లో 4 శాతంగా నమోదు కావటం గమనార్హం. 2016 నవంబర్లో పారిశ్రామికోత్పత్తి 5.7 శాతంగా నమోదు కాగా, ఆ తర్వాత తిరిగి మళ్లీ అధిక స్థాయికి చేరడం ఇదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు చూసుకుంటే మాత్రం పారిశ్రామిక వృద్ధి నిదానించిందనే చెప్పుకోవాలి. ఈ కాలంలో వృద్ధి 2.2 శాతంగా నమోదు కాగా, 2016 ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో ఇది 5.9 శాతం వృద్ధి చెందడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది జూలై ఐఐపీ గణాంకాలను గతంలో ప్రకటించిన 1.2 శాతం నుంచి 0.94 శాతానికి కేంద్రం సవరించింది. రిటైల్ ద్రవ్యోల్బణం మారలేదు రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 3.28 శాతంగా నమోదైంది. ఆగస్ట్లో ఇది 3.36 శాతం ఉన్నట్టు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా తాజాగా దాన్ని 3.28 శాతానికి సవరించింది. దీంతో ఆగస్ట్ నెలలో ఉన్నట్టుగానే సెప్టెంబర్ నెలలోనూ ద్రవ్యోల్బణం రేటు కొనసాగింది. కూరగాయలు, ధాన్యం ధరలు నెమ్మదించినట్టు ప్రభుత్వం తెలిపింది. కూరగాయల ధరలు 9.97 శాతం నుంచి 3.92 శాతానికి తగ్గాయని పేర్కొంది. 2016 సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.39 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. -
రేట్ల కోతకు ‘సానుకూల’ అంకెలు
♦ పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం.. ♦ మేలో కేవలం 1.7 శాతం వృద్ధి ♦ చరిత్రాత్మక కనిష్టంలో రిటైల్ ధరల స్పీడ్ ♦ జూన్లో 1.54 శాతం ♦ ఆగస్టు ఆర్బీఐ పాలసీపై దృష్టి ముంబై: రెపో, రివర్స్ రెపో వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను మరింత తగ్గించాలన్న డిమాండ్కు బలం చేకూరే స్థూల ఆర్థిక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీ మే నెలలో కేవలం 1.7 శాతం (2016 ఇదే నెలతో ఉత్పత్తితో పోల్చితే) నమోదయ్యింది. ఇక జూన్లో వినియోగ ధరల (సీపీఐ) సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చరిత్రాత్మక కనిష్ట స్థాయి 1.54 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం నుంచీ ఇటు పారిశ్రామిక వర్గాల నుంచీ రేటు తగ్గింపునకు ఆర్బీఐకి విజ్ఞప్తులు అందుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం నేపథ్యంలో బుధవారం ఆయా శాఖలు విడుదల చేసిన గణాంకాల వివరాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ఐఐపీ... 8 నుంచి 1.7 శాతానికి డౌన్ ⇔ 2016 మే నెలలో (2015 మే నెలతో పోల్చితే) పారిశ్రామిక ఉత్పత్తి 8%గా నమోదయ్యింది. అయితే తాజా దిగువ ధోరణికి కారణం– కీలకమైన తయారీ, మైనింగ్ వంటి విభాగాల పేలవ పనితీరే. ⇔ మొత్తం సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగంలో వృద్ధి రేటు 8.6 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. ⇔ భారీ వస్తు ఉత్పత్తికి, డిమాండ్, పెట్టుబడులకు సూచిక అయిన క్యాపిటల్ గూడ్స్లో అసలు వృద్ధిలేకపోగా – 3.9% క్షీణత నమోదయ్యింది. 2016 మే నెలలో ఈ విభాగంలో వృద్ధి భారీగా 13.9%. ⇔ కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలోనూ క్షీణత నమోదయ్యింది. ⇔ మైనింగ్ రంగం 5.7% క్షీణత నుంచి 0.9% క్షీణతకు జారింది. ⇔ విద్యుత్ రంగంలో ఉత్పాదకత వృద్ధి మాత్రం 6.1 శాతం నుంచి 8.7 శాతానికి ఎగసింది. ఏప్రిల్–మే నెలల్లోనూ దిగువకే... 2016 ఏప్రిల్–మే నెలల్లో ఐఐపీ 7.3 శాతం నుంచి 2.3 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో తయారీ రంగం వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 1.8 శాతానికి, మైనింగ్ రంగానికి సంబంధించి ఈ శాతం 6.2 శాతం నుంచి 1.1 శాతానికి, విద్యుత్ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గింది. తగ్గిన రిటైల్ ‘ధర’ వేగం ⇔ 2016 జూన్ నెలతో పోల్చితే 2017 జూన్లో రిటైల్ ధరల పెరుగుదల వేగం గణనీయంగా తగ్గిపోయింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయిలో 1.54 శాతంగా నమోదయ్యింది. ⇔ ఆహార ఉత్పత్తులు: కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా ధరలు 17% తగ్గాయి. పప్పులు, సంబంధిత ప్రొడక్టుల ధరలు కూడా 22% తగ్గాయి. గుడ్లు (–0.08%), సుగంధ ద్రవ్యాలది(–0.73%) కూడా ఇదే పరిస్థితి. తృణధాన్యాలు (4.39%), మాంసం, చేపలు (3.49%), పాలు, పాలపదార్థాలు (4.15%), చమురు, వెన్న (2.34 శాతం), పండ్లు (1.98%) ధరలు స్వల్పంగా పెరగ్గా, చక్కెర సంబంధిత ఉత్పత్తుల ధర 8.74% ఎగశాయి. ⇔ పాన్, పొగాకు: ఈ విభాగంలో ధరలు 5.62 శాతం పెరిగింది. ⇔ దుస్తులు, పాదరక్షలు: ధరల పెరుగుదల 4.17 శాతం. ⇔ హౌసింగ్: ధరల పెరుగుదల రేటు 4.7 శాతం. ⇔ ఫ్యూయెల్, లైట్: 4.54 శాతం ఎగసింది. స్థిరత్వానికి సంకేతం రిటైల్ ద్రవ్యోల్బణం స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వానికి సంకేతం. ఈ తరహా గణాంకాలు మనం 1999లో అంతకుముందు 1978 ఆగస్టుల్లోనే చూశాం. – అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు -
మే 9న ఐఐపీ కొత్త బేస్ ఇయర్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)కి బేస్ ఇయర్ మారనుంది. 2011–12 బేస్ ఇయర్తో మే 9వ తేదీన కొత్త ఐఐపీ సిరీస్ ప్రారంభం కానుందని ఒక ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. ప్రస్తుతం ఐఐపీకి 2004–05 బేస్ ఇయర్గా ఉంది. తాజా సిరీస్ను చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ ప్రారంభిస్తారని సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలకు మరింత పారదర్శకత చేకూరుతుందని కూడా ఆయన తెలిపారు. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) బేస్ ఇయర్ కూడా 2011–12గా మార్చేందుకు మదింపు జరుగుతోందని ఉన్నతాధికారి వెల్లడించారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) బేస్ ఇయర్ ఇప్పటికే మారిన సంగతి తెలిసిందే. దీనితోపాటు వినియోగ సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకూ బేస్ ఇయర్గా 2011–12ను అమలు చేస్తున్నారు. -
పారిశ్రామిక ఉత్పత్తిపై తయారీ దెబ్బ
► ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా మైనస్ 1.2 శాతం క్షీణత ► నాలుగు నెలల కనిష్ట స్థాయి ►తయారీ రంగం ఉత్పత్తి మైనస్ 2 శాతం పతనం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఫిబ్రవరిలో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు పెరుగుదల లేకపోగా –1.2 శాతం (2016 ఫిబ్రవరితో పోలిస్తే) క్షీణించింది. నాలుగు నెలల్లో ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి. తాజా ఫలితానికి మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం ప్రతికూలతే కారణం. ఈ విభాగంలో సైతం అసలు వృద్ధిలేకపోగా –2 శాతం క్షీణత నమోదయ్యింది. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, వినియోగ విభాగాల్లో ఉత్పత్తుల ధోరణి కూడా నిరాశే. 2016 ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధిరేటు 1.99 శాతం గాకా, ఈ ఏడాది జనవరిలో 3.27 శాతంగా నమోదయ్యింది. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను చూస్తే... క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్కు సూచికయిన ఈ విభాగం 2016 ఫిబ్రవరిలో భారీగా –9.3 శాతం క్షీణత నమోదుచేస్తే, 2017లో ఈ క్షీణ రేటు –3.4 శాతంగా ఉంది. వినియోగ ఉత్పత్తులు: వార్షికంగా 0.6 శాతం వృద్ధి 5.6 శాతం క్షీణతకు పడిపోయింది. ఇందులో ఒక భాగమైన నాన్–డ్యూరబుల్ కన్జూమర్ గూడ్స్ – 4.9 శాతం క్షీణత నుంచి మరింతగా –8.6 క్షీణ రేటుకు జారిపోయింది. డ్యూరబుల్ సెగ్మెంట్ విషయంలో 10.4% వృద్ధి –0.9% క్షీణతకు జారింది. 11 నెలల్లో... గడచిన ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ 11 నెలల కాలంలో (2016 ఏప్రిల్–2017 ఫిబ్రవరి) పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 0.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఈ రంగం వృద్ధి 2.6 శాతం. కాగా తాజా పారిశ్రామిక ఉత్పత్తి ఫలితాల నేపథ్యంలో తిరిగి పారిశ్రామిక వర్గాల నుంచి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) కోత డిమాండ్ ప్రకటనలు వెలువడుతున్నాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15 శాతంగా ఉన్న పారిశ్రామిక రంగం పునరుత్తేజానికి రేటు కోత తప్పదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ ధరల సెగ మార్చిలో 3.81 శాతం అప్ ఐదు నెలల గరిష్టం న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 మార్చిలో 3.81 శాతంగా నమోదయ్యింది. అంటే రిటైల్ ధరల బాస్కెట్ మొత్తంగా 2016 మార్చితో పోల్చితే 2017 మార్చిలో 3.81 శాతం పెరిగాయన్నమాట. మార్చికి ముందు గడచిన ఐదు నెలల కాలంలో రిటైల్ ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఫిబ్రవరిలో ఈ రేటు 3.65 శాతంగా ఉంది. గత ఏడాది మార్చి రేటు 4.83 శాతం. బుధవారంనాడు విడుదల చేసిన మార్చి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► ఆహార ఉత్పత్తుల విషయానికి వస్తే– పాల ధరలు 4.69 శాతం పెరిగితే, పాల ఉత్పత్తుల ధరలు 3.21 శాతం ఎగశాయి. ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ధరలు 5.65 శాతం ఎగశాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం అసలు పెరక్కపోగా – 7.24 శాతం క్షీణించాయి. ► ఇంధనం, లైట్ కేటగిరీలో ద్రవ్యోల్బ ణం 5.56 శాతంగా ఉంది. ► కాగా గ్రామీణ ప్రాంతంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.74 శాతంగా ఉంటే, పట్టణ ప్రాంతంలో 3.88 శాతంగా నమోదయ్యింది. -
గతవారం బిజినెస్
కోలుకున్న పారిశ్రామికోత్పత్తి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2017 జనవరిలో కోలుకుంది. 2016 జనవరితో పోలిస్తే 2017 జనవరిలో ఉత్పత్తి 2.7 శాతం పురోగతి సాధించింది. 2016 డిసెంబర్లో ఐఐపీ అసలు వృద్ధిలేకపోగా (2015 డిసెంబర్ ఉత్పత్తితో పోలిస్తే) 0.11 శాతం క్షీణత నమోదయ్యింది. పెద్ద నోట్ల రద్దు, నగదు లభ్యత సమస్యలు ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. కాగా 2016 జనవరిలో కూడా అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదయ్యింది. ‘ఉడాన్’కు ఊతం చిన్న నగరాలు, పట్టణాల్లో విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఉడాన్ ప్రాజెక్టుకు ఊతమిచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సర్వీసులు లేని, సేవల సంఖ్య తక్కువగా ఉన్న దాదాపు 50 ఎయిర్పోర్టులు, ఎయిర్స్ట్రిప్లను సుమారు రూ. 4,500 కోట్లతో పునరుద్ధరించే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్లోకి చైనా కంపెనీ ‘ఐవోమి’! చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘ఐవోమి’ అతిత్వరలో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇది తన తొలి స్మార్ట్ఫోన్ ‘ఐవీ505’ను ఈ నెలలో మార్కెట్లోకి తీసుకురానుంది. దీని ధర రూ.3,999గా ఉంది. చౌక, మధ్య ధర శ్రేణిలోని స్మార్ట్ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫోన్ జియో 4జీ సిమ్ కార్డును సపోర్ట్ చేస్తుందని తెలిపింది. కుబేరులు తగ్గారు.. సంపద పెరిగింది.. దేశంలోని కుబేరుల సంఖ్య తగ్గింది. హురుణ్ రిపోర్ట్ తాజాగా రూపొందించిన అత్యంత ధనవంతుల జాబితాలో 11 మంది స్థానం కోల్పోయారు. ఇక ఎప్పటిలాగే ముకేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డును కొనసాగిస్తున్నారు. ఈయన నికర సంపద విలువ 26 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో 1 బిలియన్ డాలర్లు/అంతకన్నా ఎక్కువగా నికర సంపద కలిగిన బిలియనీర్ల సంఖ్య 143 నుంచి 132కు తగ్గింది. కుబేరుల సంఖ్య తగ్గినా కూడా వీరి మొత్తం సంపద మాత్రం 16 శాతంమేర ఎగసింది. ఇక అంబానీ తర్వాత 14 బిలియన్ డాలర్ల సంపదతో ఎస్పీ హిందుజా రెండో స్థానంలో ఉన్నారు. సన్ఫార్మా ప్రమోటరు దిలీప్ సంఘ్వీ కూడా 14 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. చక్కెర ఉత్పత్తి అంచనాల్లో మళ్లీ కోత ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) తాజాగా చక్కెర ఉత్పత్తి అంచనాలను మళ్లీ తగ్గించింది. 2016–17 మార్కెటింగ్ సంవత్సరానికి సంబంధించి ఇలా ఉత్పత్తి అంచనాలను తగ్గించడం ఇది మూడవసారి. కరువు నేపథ్యంలో మహరాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెరకు సరఫరా తగ్గడం వల్లనే చక్కెర ఉత్పత్తి అంచనాల్లో కోత విధించామని ఐఎస్ఎంఏ పేర్కొంది. 2016–17 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఉత్పత్తి 20.3 మిలియన్ టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. కాగా ఐఎస్ఎంఏ 2016–17లో చక్కెర ఉత్పత్తి 23.4 మిలియన్ టన్నులుగా ఉంటుందని మొదటిసారిగా అంచనా వేసింది. ఈ అంచనాలను తర్వాత 21.3 మిలియన్ టన్నులకు కుదించింది. తాజాగా ఇప్పుడు ఈ అంచనాలను కూడా 20.3 మిలియన్ టన్నులకు తగ్గించింది. చమురు ఉత్పత్తికి బూస్ట్ దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తికి ఊతమిచ్చే దిశగా కేంద్రం కొత్త లైసెన్సింగ్ విధానాన్ని ప్రకటించింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్పీ) కింద చమురు, గ్యాస్ బ్లాక్ల వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తొలి విడత వేలం ఈ ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంధన పరిశ్రమ దిగ్గజాల సదస్సు సీఈఆర్ఏవీక్లో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటిదాకా ఉన్న పాలసీ ప్రకారం లాభాల్లో వాటాల విధానం పాటిస్తుండగా.. ఓఏఎల్పీ కింద ఆదాయాల్లో వాటాల విధానం అమల్లోకి వస్తుంది. అలాగే, ఆపరేటర్లకు ధర, మార్కెటింగ్పరమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఇక మార్కెట్లోకి బీఎస్–4 వాహనాలు భారత్ స్టేజ్ ఫోర్ (బీఎస్–4) పర్యావరణ నిబంధనలకనుగుణంగా ఉండే వాహనాలను అందించడానికి వాహన పరిశ్రమ సిద్దంగా ఉందని సియామ్ పేర్కొంది. బీఎస్–4 పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. భారం భరించక తప్పదు: ఎస్బీఐ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే జరిమానాలు విధించాలన్న నిర్ణయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సమర్థించుకుంది. జన్ధన్ అకౌంట్ల నిర్వహణకు బ్యాంక్పై భారం పెరిగిపోతోందని, జరిమానాల విధింపు తప్పదని స్పష్టం చేసింది. అయితే జన్ధన్ అకౌంట్లకు సంబంధించి మాత్రం ఇటువంటి పెనాల్టీలు ఉండబోవని పేర్కొంది. జరిమానాల విధింపు అంశాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం నుంచి ఎటువంటి సూచనలూ ఇంకా అందలేదనీ, వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. డీల్స్.. దేశీ దిగ్గజ వాహన సంస్థ ‘టాటా మోటార్స్’ తాజాగా అదే రంగంలోని ఫోక్స్వ్యాగన్ గ్రూప్, స్కోడా కంపెనీలతో దీర్ఘకాలపు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా ప్రొడక్టులను రూపొందించనున్నాయి. తొలి ఉత్పత్తిని 2019లో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని టాటా మోటార్స్ తెలిపింది. కెనరా బ్యాంక్ తాజాగా తన అనుబంధ సంస్థ అయిన కెన్ ఫిన్ హోమ్స్లో 13.45 శాతం వాటాను సింగపూర్ జీఐసీకి రూ.758.8 కోట్లకు విక్రయించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి సైబర్ సెక్యూరిటీ సేవల సంస్థ ట్రెండ్ మైక్రో సర్వీసులు అందించనుంది. ఐదేళ్లకు పైగా ఈ టెక్నాలజీ కాంట్రాక్ట్ అమల్లో ఉంటుందని ట్రెండ్ మైక్రో తెలిపింది. దీని కింద దేశ, విదేశాల్లో ఎస్బీఐకి ఉన్న 26,000 పైగా శాఖల్లో వినియోగిస్తున్న సర్వర్లు, పీసీలు, ల్యాప్టాప్లను సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించనున్నట్లు వివరించింది. ఐడీఎఫ్సీ ఎంఎఫ్లో నాటిక్సిస్ గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్కు ఉన్న 25 శాతం వాటాను ఐడీఎఫ్సీ కొనుగోలు చేయనుంది. ఈ వాటాను తమ పూర్తి అనుబంధ సంస్థ ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ కొనుగోలు చేయనున్నట్లు ఐడీఎఫ్సీ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.244 కోట్లు. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్లో 1 శాతం వాటాను రిలయన్స్ క్యాపిటల్ విక్రయించింది. ఈ వాటాను చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్కు రూ.275 కోట్లకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ విక్రయించిందని సమాచారం. ఈ వాటా విక్రయంతో రిలయన్స్ క్యాపిటల్కు భారీగా లాభాలు వచ్చాయి. ఈ 1 శాతం వాటాను గతంలో రిలయన్స్ క్యాపిటల్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ వాటాను రూ.275 కోట్లకు విక్రయించింది. -
కోలుకున్న పారిశ్రామిక ఉత్పత్తి...
⇒ జనవరిలో ఐఐపీ 2.7 శాతం అప్ ⇒ క్యాపిటల్ గూడ్స్ ఉత్పాదకత దన్ను న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2017 జనవరిలో కోలుకుంది. 2016 జనవరితో పోల్చిచూస్తే 2017 జనవరిలో ఉత్పత్తి 2.7 శాతం పురోగతి సాధించింది. 2016 డిసెంబర్లో ఐఐపీ అసలు వృద్ధిలేకపోగా (2015 డిసెంబర్ ఉత్పత్తితో పోల్చిచూస్తే) 0.11 శాతం క్షీణత నమోదయ్యింది. పెద్ద నోట్ల రద్దు, నగదు లభ్యత సమస్యలు ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. కాగా 2016 జనవరిలో కూడా అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదయ్యింది. ప్రధాన విభాగాలు చూస్తే... తయారీ: సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో వృద్ధి 2017 జనవరిలో 2.3 శాతంగా ఉంది. 2016 ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో అసలు వృద్ధిలేకపోగా –0.2 శాతం క్షీణించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో తొమ్మిది గ్రూపులు సానుకూల ఫలితాన్ని నమోదు చేసుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్: తాజా సమీక్షా నెలలో పెట్టుబడులు, పెద్ద యంత్రాల ఉత్పత్తికి ప్రతిబింబంగా నిలిచే క్యాపిటల్ గూడ్స్ విభాగం జనవరిలో భారీగా 10.7 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం సూచీకి మొత్తంగా సానుకూలమైంది. 2016 జనవరిలో ఈ విభాగం ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా (2015 జనవరి ఉత్పత్తితో పోల్చిచూస్తే) భారీగా – 21.6 శాతం క్షీణత నమోదయ్యింది. మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి 1.5 శాతం నుంచి 5.3 శాతానికి పెరిగింది. 10 నెలల కాలంలో ఈ రేటు 2.1% నుంచి 1.4%కి తగ్గింది. విద్యుత్: ఉత్పత్తి వృద్ధి 6.6 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఏప్రిల్–జనవరి మధ్య ఈ రేటు 4.7 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. వినియోగ వస్తువులు: రీమోనిటైజేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ, జనవరిలో వినియోగ వస్తువుల ఉత్పత్తి విభాగంలో అసలు వృద్ధిలేకపోగా –1% క్షీణత నమోదయ్యింది. 2016 జనవరిలో ఈ క్షీణత –0.1%. ఈ విభాగంలో డ్యూరబుల్ ఐటమ్స్ 2.9 శాతం పెరగ్గా, నాన్–డ్యూరబుల్ విషయంలో అసలు వృద్ధిలేకపోగా 3.2% క్షీణించింది. 10 నెలల్లో...: 2016–17 ఏప్రిల్–జనవరి మధ్య 10 నెలల కాలంలో ఐఐపీ 0.6% క్షీణించింది. 2015–16 ఇదే కాలంలో ఈ రేటు 2.7%. -
కీలక సూచీల బేస్ ఇయర్ మార్పు!
2004–05 నుంచి 2011–12కు జంప్ ఏప్రిల్ నుంచే కొత్త బేస్ ప్రకారం ఐఐపీ, టోకు ధరల సూచీ గణాంకాల విడుదల న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న బేస్ ఇయర్ను ఏప్రిల్ నుంచీ మార్చనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 2004–05గా ఉన్న బేస్ ఇయర్ను 2011–12కు మార్చడానికి మదింపు జరుగుతున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మార్చి 14వ తేదీన క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో జరిగే సీనియర్ అధికారుల సమావేశంలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర గణాంకాల సంస్థ డైరెక్టర్ జనరల్ జీసీ మన్నా తెలిపారు. ఫిబ్రవరి గణాంకాలకు వర్తింపు..! ఏప్రిల్ నాటికి ఐఐపీ, డబ్ల్యూపీఐలకు సంబంధించి బేస్ ఇయర్ను మార్చడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మన్నా తెలిపారు. ఇదే జరిగితే, ఫిబ్రవరి ఐఐపీ, డబ్ల్యూపీఐ గణాంకాలు కొత్త బేస్ ఇయర్తో ఏప్రిల్లో వెలువడే వీలుంది. బేస్ ఇయర్ అంటే.. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం– ఒక నిర్దేశిత సంవత్సరంలో ఉన్న ఉత్పత్తి లేదా ధరలను ప్రమాణంగా తీసుకుని, ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తి లేదా ధరలను లెక్కిస్తారు. వార్షిక మార్పులను లెక్కిస్తూ... ఇందుకు అనుగుణంగా శాతాలను నిర్ణయిస్తారు. ఇక్కడ ప్రమాణంగా తీసుకునే మూల సంవత్సరాన్నే బేస్ ఇయర్గా పరిగణిస్తారు. ఇక్కడి బేస్ ప్రమాణంగా ఏడాదికి ఆయేడాదిగా ధరల మార్పునకు అనుగుణంగా శాతాలను నిర్ణయిస్తారు. ఆర్థిక క్రియాశీలత, గణాంకాల్లో పారదర్శకత, స్పష్టత కోసం సాధారణంగా 10 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి బేస్ ఇయర్ మారుతుంటుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి ఇప్పటికే కేంద్రం బేస్రేటులో మార్పు చేసింది. -
ఐఐపీ గణాంకాలు వాస్తవికంగా లేవు: క్రిసిల్
న్యూఢిల్లీ: ప్రభుత్వం గతేడాది నవంబర్ నెలకు సంబంధించి విడుడల చేసిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు (ఐఐపీ) లోపాలతో కూడుకున్నవిగా రేటింగ్స్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఇవి భారత తయారీ రంగం వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతేడాది నవంబర్లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలను ప్రభుత్వం ఈ నెలారంభంలో విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి 1.81 శాతం క్షీణించగా, పెద్ద నోట్లను రద్దు చేసిన తొలి నెల నవంబర్లో మాత్రం 5.7 శాతం వృద్ధిని నమోదు చేయడంపై క్రిసిల్ సందేహాలు వ్యక్తం చేసింది. అయితే, ఆటో వంటి పలు రంగాలపై డీమోనిటైజేషన్ ప్రభావం ఏ విధంగా ఉందన్నది డిసెంబర్ నెల గణాంకాల్లో మరింతగా ప్రస్ఫుటం కానుందని పేర్కొంది. ప్రతికూలంగా ఉండొచ్చు... ‘‘గతేడాది నవంబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు చాలా ఎక్కువగా సూచిస్తోంది. డీమోనిటైజేషన్ ప్రకటించిన తొలి నెల కావడంతో ఐఐపీ ప్రతికూలంగా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ నెలలో ఐఐపీ 1.8 శాతం క్షీణించింది. నవంబర్లో ఒక్కసారిగా పెరిగిపోయింది’’ అని తన నివేదికలో క్రిసిల్ పేర్కొంది. -
గణాంకాల ప్రభావం
• జీడీపీ, ఐఐపీ గణాంకాలతో మార్కెట్ గమనం • వాహన కంపెనీల షేర్లు వెలుగులో • ఈ వారం మార్కెట్పై నిపుణుల అంచనాలు న్యూఢిల్లీ: ఈ వారంలో వెలువడే జీడీపీ, ఇతర ఆర్థిక గణాంకాలు, టాటా పవర్ వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్మార్కెట్పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్తో రూపారుు మారకం ప్రభావం, అంతర్జాతీయంగా స్టాక్ మార్కె ట్ పోకడలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. 30న జీడీపీ గణాంకాలు సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు ఈ నెల 30(బుధవారం) వెలువడుతారుు. అదే రోజూ అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడుతారుు. ఇక డిసెంబర్ 1 గురువారం రోజు తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాం కాలు వస్తారుు. అదే రోజు నవంబర్ నెల వాహన విక్రయ వివరాలను వాహన కంపెనీలు వెల్లడిస్తారుు. ఈ కారణంగా వాహన కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. ఇక కంపెనీల ఆర్థిక ఫలితాల విషయానికొస్తే, ఈ నెల 28 సోమవారం రోజు ఆరుుల్ ఇండియా, అబాట్ ఇండియా కంపెనీలు, 29 మంగళవారం రోజు టాటా పవర్ కంపెనీలు తమ తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తారుు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, సోమవారం (ఈ నెల 28న) నవంబర్ నెల యూరోజోన్ ఎకనామిక్ సెంటిమెంట్ ఇండికేటర్ గణాం కాలు, గురువారం(డిసెంబర్ 1) చైనా తయారీ యేత ర రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, శుక్రవారం (డిసెంబర్ 2)అమెరికా వ్యవసాయేతర రంగ ఉద్యోగ గణాంకాలు (నవంబర్ నెల) వస్తారుు. గత వారం లో సెన్సెక్స్166 పారుుంట్లు, నిఫ్టీ 40 పారుుంట్ల చొప్పున పెరిగారుు. తరలిపోతున్న విదేశీ నిధులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి 470 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచుతుందన్న భయాలే దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. ఈ నెల1-25 మధ్య విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.15,763 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.16,154 కోట్లు, మొత్తం మన క్యాపిటల్ మార్కెట్నుంచి రూ.31,917 కోట్లు(470 కోట్ల డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్లో మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.10,306 కోట్ల నిధులు వెనక్కి తీసుకోగా, సెప్టెంబర్లో రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.37,146 కోట్లు నికర పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.23,868 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అమ్మకాల ఒత్తిడిని మరింతగా పెంచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనిశ్చితి కారణంగా అక్టోబర్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభమయ్యాయని ఫండ్సఇండియాడాట్కామ్ సీఓఓ విద్యా బాల చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా అనూహ్యంగా ట్రంప్ గెలవడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండడం, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వృద్ధి తగ్గొచ్చన్న ఆందోళనలు వంటి అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ ఏడాది 11 నెలల్లో ఏడు నెలల పాటు విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్లో నికర అమ్మకాలు జరుపుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ‘పార్లమెంట్ సమావేశాల’ ప్రభావం ఈ వారంలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కీలకమైన ఆర్థిక గణాంకాలు వెలువడుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్పై ఉంటుందని వివరించారు. పెద్ద కరెన్నీ నోట్ల రద్దుకు సంబంధించి తదుపరి వార్తలు ఏమీ రాకుంటే, మార్కెట్ సానుకూలంగా చలిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డెరైక్టర్ అబ్నిష్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. -
గణాంకాలు, ఫలితాలు కీలకం..
బక్రీద్ సందర్భంగా మంగళవారం సెలవు * ట్రేడింగ్ నాలుగు రోజులే * ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాల ప్రభావం న్యూఢిల్లీ: ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఈ గణాంకాలతో పాటు రుతుపవనాల గమనం, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు తదితర అంశాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. కాగా బక్రీద్ సందర్భంగా ఈ నెల 13న(మంగళవారం) సెలవు కారణంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. లాభాల స్వీకరణ ఇటీవల స్టాక్ సూచీలు బాగా పెరిగాయని, అందుకని పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చని సింఘానియా అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కొంత స్తబ్ధత లేదా క్షీణత సాధారణమేనన్నారు. రానున్న సెషన్లలో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ తప్పదని, మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని ట్రేడ్బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. పటిష్టమైన ఫండమెంటల్స్ కారణంగా వాహన, ఫార్మా షేర్లు పెరగవచ్చనేది ఆయన అంచనా. నేడు టాటా స్టీల్ ఫలితాలు సోమవారం టాటా స్టీల్ క్యూ1 ఫలితాలు వెలువడనున్నాయి. ఇక మంగళవారం కోల్ ఇండియా క్యూ1 ఫలితాలను ప్రకటిస్తుంది. ఈ కంపెనీలతో పాటు రిలయన్స్ కమ్యూనికేషన్స్, నాల్కో, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, సీఈఎస్సీ, ఎన్బీసీసీ, ఎంఎంటీసీ, రోల్టా, యూనిటెక్ కంపెనీలు కూడా ఈ వారంలోనే క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తన ద్రవ్య విధానాన్ని ఈ గురువారం(ఈ నెల 15న) వెల్లడించనున్నది. అదే రోజు ఆగస్టు నెలకు సంబంధించిన అమెరికా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, రిటైల్ అమ్మకాల గణాంకాలు వెలువడుతాయి. భారత క్యాపిటల్ మార్కెట్లో(స్టాక్స్,బాండ్లలో) ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు వంద కోట్ల డాలర్ల (రూ.6,800 కోట్లు)వరకూ పెట్టుబడులు పెట్టారు. ఈ వారం ఈవెంట్స్... 12 సోమవారం రిటైల్ ద్రవ్యోల్బణం(ఆగస్టు) గణాంకాలు జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు టాటా స్టీల్ క్యూ1 ఫలితాలు 1 3 మంగళవారం బక్రీద్.. మార్కెట్కు సెలవు కోల్ ఇండియా క్యూ1 ఫలితాలు 14 బుధవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు 15 గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ అమెరికా ఐఐపీ, రిటైల్ అమ్మకాల గణాంకాలు -
గణాంకాలు కీలకం
* ఈ నెల 12న ఐఐపీ, రిటైల్ గణాంకాలు * హెచ్యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ఫలితాలు * ఇవే ఈ వారం స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపే అంశాలు... న్యూఢిల్లీ: మార్చి నెల పారిశ్రామికోత్పత్తి, ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బోణ గణాంకాలు, కొన్ని కంపెనీల క్యూ4 ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు కీలకం కానున్నాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, రూపాయి కదలికలు, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి...ఇవన్నీ స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. భవిష్యత్ అంచనాల ప్రభావం... మార్చి నెల పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు ఈ గురువారం (ఈ నెల 12న) వెలువడతాయి. అదే రోజు ఏప్రిల్ నెలవినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బోణం(సీపీఐ) గణాంకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇక పలు ప్రధాన కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ వారంలోనే వెల్లడిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యునిలివర్ సోమవారం(ఈ నెల9న), కోటక్ మహీంద్ర బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీలు బుధవారం( ఈ నెల 11న), డాక్టర్ రెడ్డీస్ గురువారం(ఈ నెల 12న), తమ క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ యాజమాన్యం భవిష్యత్ అంచనాలు మార్కెట్పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. మొత్తం మీద మార్కెట్ ఓవర్సోల్డ్ (అధిక అమ్మకాల)జోన్లోనే కొనసాగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిఫ్టీ మళ్లీ 8,000 పాయింట్లకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలకు అనుగుణంగా మార్కెట్ కదలికలు ఉంటాయని మనీపామ్ సీఈఓ, ఎండీ నిర్దోశ్ గౌర్ చెప్పారు. నెస్లే, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్లతో పాటు ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంక్ల ఫలితాలను మార్కెట్ గమనిస్తుందని పేర్కొన్నారు. కంపెనీలు వెల్లడించనున్న ఆర్థిక ఫలితాలు, వర్షపాతంపై తదుపరి అంచనాలు, అంతర్జాతీయ సంకేతాలు... స్టాక్ మార్కెట్ స్వల్పకాలిక ట్రెండ్ను నిర్దేశిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా తెలిపారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తడి కారణంగా వరుసగా రెండో వారమూ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 378 పాయింట్లు (1.48 శాతం) నష్టపోయి 25,229 పాయింట్ల వద్ద ముగిసింది. విదేశీ జోరుకు బ్రేక్లు: విదేశీ ఇన్వెస్టర్ల రెండు నెలల కొనుగోళ్ల జోరుకు గత వారంలో బ్రేక్ పడింది. ఈ నెల మొదటివారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.774 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన. యూరోజోన్ జీడీపీ అంచనాల్లో తగ్గింపు, చైనా తయారీ రంగ కార్యకలాపాల్లో మందగమనం, ముడి చమురు ధరల్లో అస్థిరత్వం కారణంగా ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు ఇదే వారంలో డెట్ మార్కెట్లో రూ.769 కోట్లు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెల 6 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.774 కోట్ల నికర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అంతకు ముందటి రెండు నెలల్లో(మార్చి-ఏప్రిల్)రూ.29,558 కోట్లు పెట్టుబడులు పెట్టారు. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.12,137 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, రూ.170 కోట్లు డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. మొత్తం భారత క్యాపిటల్ మార్కెట్లో నికరంగారూ.11,967 కోట్లు పెట్టుబడులు పెట్టారు. -
ఆర్థిక వ్యవస్థకు శుభ సంకేతాలు..!
♦ ద్రవ్యోల్బణం తగ్గింది.. పారిశ్రామికోత్పత్తి పెరిగింది.. ♦ ఆరు నెలల కనిష్టానికి మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం ♦ 3 నెలల క్షీణత తర్వాత ఫిబ్రవరిలో పుంజుకున్న ఐఐపీ న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు ఈ మంగళవారం రెండు మంచి వార్తలను అందించింది. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్టానికి పడిపోవడం, మూడు నెలల క్షీణత తర్వాత ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి 2 శాతం వృద్ధి సాధించడం... భారత ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుందని నిపుణులంటున్నారు. ఫిబ్రవరిలో 5.26 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 4.83 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం 5.3 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గినట్లు కేంద్ర గణాంకాల సంస్థ వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందని పేర్కొంది. గత మూడు నెలల్లో క్షీణత నమోదు చేసిన పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) మైనింగ్, విద్యుత్, కన్సూమర్ రంగాలు మంచి పనితీరు కనబరచడంతో ఈ ఫిబ్రవరిలో పుంజుకుంది వివరాలు.. పారిశ్రామికోత్పత్తి ఫిబ్రవరి నెలలో 2 శాతం వృద్ధి సాధించింది. మైనింగ్, విద్యుత్, కన్సూమర్ రంగాలు మంచి పనితీరు కనబరచడంతో ఫిబ్రవరిలో పుంజుకుంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతోందనడానికి ఇది సూచిక అని నిపుణులంటున్నారు. అంతకుముందు మూడు నెలల్లో పారిశ్రామికోత్పత్తి క్షీణత నమోదు చేసింది. కేంద్ర గణాంకాల సంస్థ(సెంట్రల్ స్టాటిస్టికస్ ఆఫీస్-సీఎస్ఓ) వెల్లడించిన గణాంకాల ప్రకారం., -ఫ్యాక్టరీ ఉత్పత్తిని ప్రతిబింబించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్-ఐఐపీ) గత ఏడాది నవంబర్లో 3.4%, డిసెంబర్లో 1.2%, ఈ ఏడాది జనవరిలో 1.5% చొప్పున క్షీణించింది. ♦ గత ఫిబ్రవరిలో మైనస్ 3.8 శాతంగా ఉన్న కన్సూమర్ డ్యూరబుల్ గూడ్స్ (వినియోగదారుల మన్నిక వస్తువుల) సెగ్మెంట్ ఉత్పత్తి ఈ ఫిబ్రవరిలో 9.7 శాతానికి పెరగడంతో ఐఐపీ మెరుగుపడింది. ♦ పారిశ్రామికోత్పత్తి సూచీలో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం 0.7 శాతం వృద్ధిని సాధించింది. ♦ మైనింగ్ రంగం 5 శాతం వృద్ధి సాధించింది. ♦ విద్యుదుత్పత్తి 9.6 శాతానికి ఎగసింది. ♦ ఇక వినియోగదారుల ఆధారిత వర్గీకరణ పరంగా చూస్తే, ప్రాధమిక వస్తూత్పత్తి రంగం వృద్ధి 5.4 శాతానికి పెరిగింది. ♦ పెట్టుబడుల ప్రవాహానికి ప్రతీకగా భావించే యంత్ర పరికరాల తయారీ 8.3 శాతం వృద్ధి నుంచి మైనస్ 9.8 శాతానికి పడిపోయింది. ♦ మొత్తం మీద 22 పరిశ్రమల గ్రూపుల్లో 16 వృద్ధిని నమోదు చేశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతం చౌకైన కూరగాయలు, పప్పుల ధరలు న్యూఢిల్లీ: కూరగాయలు, పప్పుల ధరలు చౌకగా ఉండటంతో మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతానికి పడిపోయింది. వినియోగదారుల ధరల సూచీ (కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్-సీపీఐ)గా పరిగణించే రిటైల్ ద్రవ్యోల్బణానికి ఇది ఆరు నెలల కనిష్ట స్థాయి. ఇక ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.18 శాతం నుంచి 5.26 శాతానికి సవరించారు. గత ఏడాది సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.41 శాతంగా నమోదైంది. ఈ ఫిబ్రవరిలో 5.3 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఈ మార్చిలో 5.21 శాతానికి తగ్గిందని గణాంకాలు వెల్లడించాయి. వివరాలు..., ♦ ధరల పెరుగుదల రేటు కూరగాయల్లో 0.54%, నూనెలు, కొవ్వులకు 4.85%, పాలు, పాల ఉత్పత్తులకు 3.33%గా ఉంది. -పండ్ల ధరలు 1.10% తగ్గగా, పప్పుల ధరలు కూడా చౌకఅయ్యాయి. ♦ ఫిబ్రవరిలో 0.51% పెరిగిన పంచదార, స్వీట్ ఉత్పత్తుల ధరలు ఈ మార్చిలో 3.92% పెరిగాయి. అలాగే పాన్, పొగాకు ఉత్పత్తుల ధరలు 8.39 శాతం నుంచి 8.51 శాతానికి ఎగిశాయి. ♦ తృణ ధాన్యాల ధరలు 2.43% పెరిగాయి. మాంసం, చేపల ధరలు 7.74%, కోడిగుడ్ల ధరలు 6.68 శాతం చొప్పున పెరిగాయి. ♦ సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణ రేటు గ్రామీణ ప్రాంతాల్లో 5.7 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 3.95 శాతంగా నమోదైంది. -
మైనస్లోనే పరిశ్రమలు..!
♦ రెండోనెలా ఐఐపీ తిరోగమనం ♦ డిసెంబర్లో 1.3 శాతం క్షీణత న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి వృద్ధి వరుసగా రెండో నెలా మందగించి మైనస్లోనే కొనసాగింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) డిసెంబర్లో అసలు వృద్ధి కనపర్చకపోగా.. 1.3 శాతం క్షీణించింది. ప్రధానంగా తయారీ, యంత్రపరికరాల రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉండటమే ఇందుకు కారణమయ్యాయి. నవంబర్లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 3.4 శాతంగా ఉంది. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్వో) శుక్రవారం ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం గతేడాది డిసెంబర్లో ఐఐపీ 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి 3.1 శాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే వ్యవధిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2.6 శాతమే. ఇక ఐఐపీలోని వివిధ విభాగాల పనితీరు చూస్తే.. ♦ యంత్ర పరికరాల ఉత్పాదకత క్షీణతలోకి జారిపోయింది. డిసెంబర్లో ఏకంగా 19.7 శాతం తగ్గింది. క్రితం ఏడాది డిసెంబర్లో ఇది 6.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ♦ సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉండే తయారీ రంగం మైనస్లో 2.4 శాతం క్షీణించింది. గతంలో 4.1 శాతం వృద్ధి నమోదైంది. ♦ క్రితం డిసెంబర్లో 1.7 శాతం క్షీణించిన మైనింగ్ రంగం ఈసారి 2.9 శాతం వృద్ధి సాధించింది. విద్యుదుత్పత్తి విభాగం వృద్ధి 3.2 శాతానికి పరిమితమైంది. గతంలో ఇది 4.8 శాతం. వినియోగ ఆధారిత వర్గీకరణను బట్టి ప్రాథమిక వస్తువుల ఉత్పత్తి స్వల్పంగా 0.5 శాతం మేర పెరిగింది. వినియోగ వస్తువుల తయారీ 0.6 శాతం నుంచి 2.8 శాతానికి పెరిగింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పాదకత మాత్రం మైనస్ 9.2 శాతం నుంచి వృద్ధిలోకి మళ్లి, ఏకంగా 16.5 శాతానికి ఎగిసింది. అయితే, కన్జూమర్ నాన్ డ్యూరబుల్ విభాగం ఉత్పాదకత గతేడాది 5.6 శాతం వృద్ధి కనపర్చగా.. ఈసారి మాత్రం మైనస్ 3.2 శాతంగా నమోదైంది. తయారీ రంగంలోని ఇరవై రెండు పరిశ్రమల గ్రూప్లో పది ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. -
గణాంకాలపై మార్కెట్ దృష్టి...
ఈ వారంలోనే జీడీపీ, ఐఐపీ, ద్రవ్యోల్బణం * ముడిచమురు, రూపాయి కదలికలూ కీలకమే... * మార్కెట్ గమనంపై నిపుణుల అంచనా.. న్యూఢిల్లీ: జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. ఎస్బీఐ, ఓఎన్జీసీ వంటి బ్లూచిప్ కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను కూడా ఈ వారమే వెల్లడిస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్కు సంబంధించి ఈ వారం దేశీయ అంశాలే కీలకం కానున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్పై ఇన్వెస్టర్లు బాగానే ఆశలు పెట్టుకుంటున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ పోకడలు, ఈ వారంలో వెల్లడయ్యే కంపెనీల క్యూ3 ఫలితాలు, ముడిచమురు ధరల కదలికలు, రూపాయి విలువ హెచ్చుతగ్గులు కూడా స్టాక్ మార్కెట్పై ప్రభావంచూపుతాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. ఈ వారంలో స్టాక్ మార్కెట్ సానుకూలంగానే చలించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. దిగ్గజాల ఫలితాలు.. ఈ వారం పలు దిగ్గజ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, గెయిల్, సిప్లా, కోల్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, భెల్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్...తదితర కంపెనీలన్నీ ఈ వారంలోనే తమ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. కాగా శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత జనవరి నెల వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. మిడ్ క్యాప్ షేర్లపై దృష్టి.. సమీప భవిష్యత్లో స్టాక్ మార్కెట్ పోకడపై జీడీపీ గణాంకాలు ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ సింఘానియా పేర్కొన్నారు. రానున్న బడ్జెట్పై అంచనాలతో మిడ్-క్యాప్ షేర్లలో చురుగ్గా కదలికలు ఉండొచ్చని వివరించారు. నేడు(సోమవారం) వెలువడే జీడీపీ గణాంకాలు ఈ వారం స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని జియోజిత్ బీఎన్పీ పారిబా హెడ్(టెక్నికల్ రీసెర్చ్ డెస్క్) ఆనంద్ జేమ్స్ చెప్పారు. చాంద్రమాన కొత్త సంవత్సరం సందర్భంగా ఈ వారమంతా చైనా మార్కెట్కు సెలవులని, ఈ కారణంగా మన మార్కెట్ గమనంపై అమెరికా స్టాక్ మార్కెట్ ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఇక ఇప్పటి నుంచి మార్కెట్ బడ్జెట్పై దృష్టిపెడుతుందని కోటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా అభిప్రాయపడ్డారు. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 254 పాయింట్ల నష్టంతో 24,617 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 7,489 పాయింట్ల వద్ద ముగిశాయి. మళ్లీ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ నెల మొదటి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లో రూ.2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో ఎక్కువ భాగం డెట్ మార్కెట్లోకి వచ్చాయి. గతనెలలో క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా రూ.6,245 కోట్ల నికర నిధులు వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ఈ నెల 1 నుంచి 5 వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.604 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 1,965 కోట్లు చొప్పున నికర పెట్టుబడులు పెట్టారు. జీఎస్టీ, దివాళా బిల్లు వంటి కీలక బిల్లులు ఈ బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం పొందగలవని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచ్చిందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. గత ఏడాది విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.17,806 కోట్లుగా, బాండ్ మార్కెట్లో రూ.45,856 కోట్లుగా ఉన్నాయి. -
ఫలితాలు, గణాంకాలే కీలకం
* మార్కెట్పై ప్రభావం చూపనున్న అంశాలు ఇవీ.. * ఈ వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాలు * ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా * ప్రపంచ మార్కెట్ల పోకడ ముంబై: బ్లూ చిప్ ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు... ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్ ఐటీ కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే రానున్నాయి. నవంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, డిసెంబర్ నెల వినియోగదారుల, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ వారంలోనే రానున్నాయి. ఈ అంశాలతో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి కదలికలు ఈ వారం మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్లతో పాటు హిందూస్తాన్ యూనిలివర్, జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్ఇంద్ బ్యాంక్ తదితర దిగ్గజ కంపెనీలు ఈ వారంలోనే తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. జనవరి 12న టీసీఎస్, 14న ఇన్ఫోసిస్ ఫలితాలు వెలువడతాయి. ఈ వారంలో పలు కీలకాంశాలు చోటు చేసుకోనున్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని, వీటితో పాటు పలు ప్రధాన కంపెనీలు తమ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయని పేర్కొన్నారు. డాలర్తో రూపాయి మారకం చలించే తీరు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు కదలికలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వివరించారు. ‘అంతర్జాతీయ’ ప్రభావమే అధికం ! భారత కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రభావం కంటే అంతర్జాతీయ సంకేతాల ప్రభావమే ఈ వారంలో స్టాక్మార్కెట్పై అధికంగా ఉంటుందని రిలయన్స్ సెక్యూరిటీస్ సంస్థ అభిప్రాయ పడింది. అంతర్జాతీయ సంకేతాల్లో ఎలాంటి మెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొంది. అందువల్ల ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. నాణ్యత గల షేర్లపైననే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇచ్చింది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై తాజా ఆందోళనలు, ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం వంటి కారణాల వల్ల గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,227 పాయింట్లు(4.68 శాతం) నష్టపోయింది. డెట్ మార్కెట్లో ‘విదేశీ’ జోరు భారత డెట్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,700 కోట్లకు పైగా డెట్మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. గత ఏడాది మొత్తం మీద భారత డెట్మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.45,856 కోట్లుగా ఉన్నాయి. డిపాజిటరీ సంస్థలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ఈ నెల 8వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా డెట్ మార్కెట్లో రూ.3,706 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి ఒకింత స్థిరంగా ఉండడం వల్ల డెట్ మార్కెట్లో ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ముడి చమురు ధరలు బ్యారెల్కు 50 డాలర్లలోపే ఉండడం, కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణలోనే ఉండడం, రూపాయి అవుట్లుక్ సానుకూలంగా ఉండడం వంటి అంశాలూ ప్రభావం చూపాయని వారంటున్నారు. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై ఆందోళన కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.493 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం క్యాపిటల్ మార్కెట్లో జనవరి 1-8 కాలానికి వీరి నికర పెట్టుబడులు రూ.3,214 కోట్లుగా ఉన్నాయి. -
పరిశ్రమలు రయ్ రయ్..
అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి 9.8% వృద్ధి; ఐదేళ్ల గరిష్టం వినియోగ ఉత్పత్తులు, యంత్రపరికరాల విభాగాల్లో వృద్ధి న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తులు, యంత్రపరికరాల తయారీ ఊతంతో అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అయిదేళ్ల గరిష్టానికి ఎగిసింది. 9.8 శాతం వృద్ధి నమోదు చేసింది. దీపావళి కొనుగోళ్లతో డిమాండ్ పెరుగుదల దీనికి తోడ్పడి ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది అక్టోబర్లో ఐఐపీ వృద్ధి మైనస్ 2.7 శాతంగా ఉంది. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్వో) శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్లో ఐఐపీ సూచీ 9.8 శాతం మేర పెరిగి 181.3గా ఉంది. సెప్టెంబర్లో ఐఐపీ వృద్ధిని 3.84 శాతానికి సవరించారు. ఇక, ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో ఇది 4.8 శాతంగా ఉంది. తాజా ఐఐపీ గణాంకాలు చాలా మెరుగ్గాను, ప్రోత్సాహకరంగాను ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ తెలిపారు. అయితే, సదరు నెలలో పెరుగుదలకు కేవలం దీపావళి కొనుగోళ్లే కారణమయ్యే అవకాశాలు ఉన్నందున, ఈ గణాంకాలను ఆచితూచి విశ్లేషించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఐఐపీ చివరిసారిగా 2010 అక్టోబర్లో గరిష్టంగా 11.36 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. తయారీ రంగం జోష్.. ఆర్థిక కార్యకలాపాల తీరుతెన్నులను ప్రతిబింబించే తయారీ రంగం వార్షిక ప్రాతిపదికన అక్టోబర్లో 10.6 శాతం పెరగ్గా, విద్యుదుత్పత్తి 9 శాతం, మైనింగ్ రంగం 4.7 శాతం మేర వృద్ధి నమోదు చేసాయి. ఇక, కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం ఏకంగా 4.2 శాతం ఎగిసింది. అందులో కన్జూమర్ గూడ్స్ విభాగం 18.4 శాతం, నాన్-డ్యూరబుల్స్ విభాగం 4.7 శాతం పెరిగింది. అటు యంత్రపరికరాల విభాగం 16.1 శాతం పెరిగింది. ఇక భారీ వృద్ధి నమోదు చేసిన విభాగాల్లో వజ్రాభరణాలు (372.5 శాతం), చక్కెర తయారీ యంత్రాలు (103.4 శాతం), మొబైల్ ఫోన్లు తదితర టెలికం ఉత్పత్తులు (61.5%), యాంటీబయోటిక్స్ (38.5%), కార్లు (21.4%) ఉన్నాయి. యంత్రపరికరాల విభాగం భారీగా 16.1 శాతం మేర వృద్ధి చెందడం మళ్లీ పెట్టుబడుల పెరుగుదలకు సూచనగా పరిశ్రమల సమాఖ్య అసోచాం పేర్కొంది. -
కీలక పరిశ్రమల వృద్ధిరేటు 3.2%
నాలుగు నెలల గరిష్టం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అంటే 2014 సెప్టెంబర్ ఉత్పత్తి విలువతో పోల్చితే 2015 సెప్టెంబర్లో ఉత్పత్తి విలువ 3.2 శాతం ఎగసిందన్నమాట. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 2.6 శాతమే. తాజా 3.2 శాతం వృద్ధి నమోదుకు ఎరువులు, విద్యుత్ రంగాలు కారణమయ్యాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి (మేలో 4.4 శాతం) మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 38 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఎనిమిది రంగాలనూ వార్షికంగా వేర్వేరుగా చూస్తే... వృద్ధిలో... ఎరువులు: ఈ రంగం వృద్ధి రేటు భారీగా 18.1 శాతం పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్లో ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా, 11.6 శాతం క్షీణత (మైనస్)లో ఉంది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు 3.9 శాతం నుంచి 10.8 శాతానికి ఎగసింది. రిఫైనరీ ప్రొడక్టులు: ఎరువుల రంగం తరహాలోనే ఈ విభాగం - 2.6 శాతం క్షీణత నుంచి స్వల్పంగా 0.5 శాతం వృద్ధిలోకి మళ్లింది. సహజ వాయువు: ఈ రంగం కూడా -5.8 శాతం క్షీణత నుంచి 0.9 శాతం వృద్ధి బాటకు మళ్లింది. బొగ్గు: వృద్ధి నమోదుచేసుకుంది. అయితే ఈ రేటు 7.6 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది. క్షీణతలో.. క్రూడ్: -1.1% నుంచి -0.1%కి మెరుగుపడింది. స్టీల్: 6.6% వృద్ధి నుంచి -2.5% క్షీణతకు మళ్లింది. సిమెంట్: 3.7% వృద్ధి నుంచి -1.5% క్షీణించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ.. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ ఈ గ్రూప్ వృద్ధి రేటు 2.3 శాతంగా ఉంది. 2014 ఇదే కాలంలో ఈ రేటు 5.1 శాతం. -
ఫలితాలే దిక్సూచి..!
ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా.. * ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణులు * నేడు ఇన్ఫీతో కార్పొరేట్ ఫలితాల సీజన్ షురూ * 13న టీసీఎస్, 14న హెచ్యూఎల్, 16న రిలయన్స్ ఆర్థిక ఫలితాలు... న్యూఢిల్లీ: ప్రధానమైన బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్ధేశించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సమీప కాలానికి జూలై-సెప్టెంబర్(క్యూ2) ఫలితాలే ప్రధాన ట్రిగ్గర్గా నిలుస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే గెడైన్స్(పనితీరు అంచనాలు)పై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు నిపుణులు తెలిపారు. నేడు(సోమవారం) ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్తో క్యూ2 ఫలితాల సీజన్ ఆరంభమవుతోంది. 13న టీసీఎస్, 14న హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్యూఎల్) కూడా ఫలితాలను ప్రకటించనున్నాయి. ఆ తర్వాత వారాంతంలో(16న) దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఫలితాలు వెలువడనున్నాయి. ‘కీలక కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలతోపాటు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), ద్రవ్యోల్బణం గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల ట్రెండ్ ఈ వారం మన స్టాక్ మార్కెట్ల ట్రెండ్కు దిక్సూచిగా నిలవనున్నాయి. అదేవిధంగా డాలరుతో రూపాయి మారక విలువ, ముడిచమురు ధరల కదలికలు సైతం కీలక పాత్ర పోషిస్తాయి’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా వ్యాఖ్యానించారు. కీలక గణాంకాలు... మార్కెట్ సెంటిమెంట్ను బ్లూచిప్స్ ఫలితాలు ప్రభావితం చేయనున్నాయని, తీవ్ర ఒడిదుడుకులకు కూడా ఆస్కారం ఉండొచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. మరోపక్క, నేడు కీలకమైన ఐఐపీ డేటాతో పాటు రిటైల్ ద్రవ్యోల్బణం గాణాంకాలు కూడా విడుదల కానున్నాయి. ఇన్వెస్టర్లు ఈ రెండింటిపైనా నిశితంగా దృష్టిపెడతారని ఆయన చెప్పారు. 14న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం డేటా వెల్లడికానుంది. కాగా, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ) ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు దేశీ సూచీల ట్రెండ్కు దిశానిర్దేశం చేయనున్నాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్(రీసెర్చ్) వివేక్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. గత వారం మార్కెట్... అమెరికాలో సెప్టెంబర్ నెలకు ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే దిగువన నమోదు కావడంతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును వాయిదా వేస్తుందన్న అంచనాలతో భారత్ సహా పలు విదేశీ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగబాకాయి. సెప్టెంబర్ 29న ఆర్బీఐ అనూహ్యంగా అర శాతం పాలసీ రేటు తగ్గింపు చర్య కూడా దేశీ మార్కెట్కు సంజీవనిలా పనిచేసింది. దీంతో గత వారంలోనూ దేశీ సూచీలు లాభాల జోరును కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 859 పాయింట్లు లాభపడి 27,080 వద్ద ముగిసింది. గడిచిన రెండు వారాల్లో సూచీ 1,216 పాయింట్లు(4.7%) ఎగబాకింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం 239 పాయింట్ల లాభంతో 8,190 వద్ద స్థిరపడింది. మళ్లీ కొనుగోళ్ల బాటలో విదేశీ ఇన్వెస్టర్లు... గత రెండు నెలలుగా భారీ మొత్తంలో పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) మళ్లీ కొనుగోళ్ల బాటలోకి వచ్చారు. ప్రస్తుత అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ(10వ తేదీ) దేశీ మార్కెట్లలోకి నికరంగా రూ.2,013 కోట్ల నిధులను వెచ్చించారు. ఇందులో స్టాక్స్లో రూ.1,607 కోట్లు, బాండ్లలోకి(డెట్ మార్కెట్) రూ.406 కోట్ల చొప్పున పెట్టుబడిగా పెట్టినట్లు సెబీ తాజా గణాంకాలు వెల్లడించాయి. ఆర్బీఐ అర శాతం రెపో రేటు కోతకు తోడు అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా అంచనాలు ఎఫ్పీఐలతో తిరిగి ఉత్సాహం నెలకొనేలా చేసిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో రూ.23,000 కోట్లకు పైనే(ఈక్విటీ, డెట్ మార్కెట్) భారత్ నుంచి ఎఫ్పీఐలు నికరంగా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. చైనాలో ఆర్థిక మందగమనం భయాల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడం, ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న ఆందోళనలు దీనికి ప్రధాన కారణం. కాగా, ఈ ఏడాది ఇప్పటిదాకా ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో రూ.22,654 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.39,802 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. -
తయారీ రంగం దన్ను!
భారత్ పారిశ్రామిక ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో ఊరటనిచ్చింది. పారి శ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత కర్మాగారాల ఉత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్లో 4.1 శాతంగా నమోదయ్యింది. ఇది రెండు నెలల గరిష్ట స్థాయి. మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం పురోగతి మొత్తం సూచీని తగిన స్థాయిలో ఉంచింది. అయితే డిమాండ్కు సూచిక అయిన భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి విభాగం వృద్ధి వేగం తగ్గింది. ఇదిలావుండగా, 2014 ఏప్రిల్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 3.7 శాతం. 2015 మార్చికి సంబంధించి తొలి గణాంకం 2.1 శాతాన్ని 2.5 శాతానికి కేంద్ర గణాంకాల కార్యాలయం సవరించింది. తయారీ రంగం ఏప్రిల్లో 5.1 శాతం వృద్ధి రేటును సాధించింది. 2014 ఇదే నెలలో ఈ రేటు 3%. తయారీ రంగానికి సంబంధించి మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానూకూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. -
తయారీ రంగం దన్ను!
- ఏప్రిల్లో పారిశ్రామిక ఉత్పత్తి ఊరట - వృద్ధి రేటు 4.1 శాతం న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో ఊరటనిచ్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత కర్మాగారాల ఉత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్లో 4.1 శాతంగా నమోదయ్యింది. ఇది రెండు నెలల గరిష్ట స్థాయి. మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం పురోగతి మొత్తం సూచీని తగిన స్థాయిలో ఉంచింది. అయితే డిమాండ్కు సూచిక అయిన భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి విభాగం వృద్ధి వేగం తగ్గింది. ఇదిలావుండగా, 2014 ఏప్రిల్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 3.7%. 2015 మార్చికి సంబంధించి తొలి గణాంకం 2.1 శాతాన్ని 2.5 శాతానికి కేంద్రం సవరించింది. ప్రభుత్వం శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ► తయారీ రంగం ఏప్రిల్లో 5.1 శాతం వృద్ధి రేటును సాధించింది. 2014 ఇదే నెలలో ఈ రేటు 3 శాతం. తయారీ రంగానికి సంబంధించి మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానూకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ► డిమాండ్, ఆర్థిక క్రియాశీలతకు ప్రధాన సూచిక అయిన భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్ రంగం వృద్ధి రేటు 13.4 శాతం నుంచి 11.1 శాతానికి తగ్గింది. ► మైనింగ్ రంగం వృద్ధి రేటు కూడా 1.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► కాగా విద్యుత్ విభాగం మాత్రం 11.9 శాతం వృద్ధి బాట నుంచి 0.5 శాతం క్షీణతలోకి జారింది. ► మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ 20.6% వృద్ధిని నమోదు. ► కలప, తత్సంబంధ ఉత్పత్తుల వృద్ధి 16.2 శాతం పురోగతి. ► ఆఫీస్, అకౌంటింగ్, కంప్యూటింగ్ మిషనరీ భారీగా 36.5 శాతం క్షీణించింది. ► రేడియో, టీవీ, కమ్యూనికేషన్ పరికరాల ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా 24 శాతం క్షీణించింది. ► పొగాకు ఉత్పత్తులు 26.7 శాతం క్షీణించాయి. ► వినియోగ వస్తువుల రంగం వృద్ధి కేవలం 1.3 శాతం.. ఇంకా మంచిరోజులు రావాలి: పరిశ్రమలు పరిశ్రమల ఉత్పత్తి వృద్ధి రేటు 4.1 శాతంగా నమోదుకావడం హర్షనీయ పరిణామమేనని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే పూర్తి స్థాయిలో మంచిరోజులు ఇంకా రావాల్సి ఉందని కూడా వారు వ్యాఖ్యానించారు. ఎవరేమన్నారంటే... అంచనాలకన్నా బాగున్నాయి మార్కెట్ అంచనాలకన్నా అధికంగానే ఈ గణాంకాలు ఉన్నాయి. పటిష్ట రికవరీ జరుగుతోందనడానికి ఇది సంకేతమే. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవల వల్ల రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుందని విశ్వసిస్తున్నాం. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ మరింత పటిష్టం కావాలి... ఆర్బీఐ కఠిన పరపతి విధాన సరళీకరణ వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలప్రదానికి మరింత దోహదపడతాయని భావిస్తున్నా. ప్రస్తుతానికి వాస్తవరీతిన మంచి రోజులు ఇంకా రాలేదన్నది మా అభిప్రాయం. - రాణా కపూర్, అసోచామ్ -
రుతుపవనాల కదలికలపై దృష్టి
► ఐఐపీ, ద్రవ్యోల్బణం డేటా కూడా కీలకమే ► ఈ వారం మార్కెట్పై నిపుణుల అంచనా న్యూఢిల్లీ : ఇటీవల కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాల కదలికలపై ఇన్వెస్టర్లు ఈ వారం దృష్టి నిలుపుతారని, రుతుపవనాలు వివిధ ప్రాంతాల్లో విస్తరించడానికి సంబంధించిన వార్తలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు అంచనావేశారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా ప్రతి ఏటా దేశంలో ప్రవేశించే తేదీకన్నా ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా గత శుక్రవారం కేరళ తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం సగటుకన్నా తక్కువ వర్షపాతం నమోదుకావొచ్చంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు రుతుపవనాల కదలికల్ని సునిశితంగా గమనిస్తారని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ చెప్పారు. మార్కెట్ అప్ట్రెండ్కు తగిన ట్రిగ్గర్లు సమీప భవిష్యత్తులో ఏవీ లేనందున, సూచీలు హెచ్చుతగ్గులకు లోనవుతూ దిగువముఖంగా పయనించవచ్చని ఆయన అంచనావేశారు. ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి, మే నెల వినియోగ ద్రవ్యోల్బణం డేటా కూడా మార్కెట్ కదలికల్ని నిర్దేశించవచ్చని విశ్లేషకులు చెప్పారు. ఈ రెండు గణాంకాలు వచ్చే శుక్రవారం వెలువడనున్నాయి. డాలరుతో రూపాయి మారకపు విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ట్రెండ్, చమురు ధరలు ట్రేడింగ్ను ప్రభావితం చేస్తాయని వారన్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కొద్ది నెలల్లో వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు, యూరోజోన్లో కొనసాగుతున్న రుణ సంక్షోభం, పెరుగుతున్న చమురు ధరలు తదితర అంశాలు భారత్ మార్కెట్ను ఒడుదుడులకు లోనుచేయవచ్చన్నది నిపుణుల అంచనా. కొద్ది ట్రేడింగ్ సెషన్లపాటు మార్కెట్ బలహీనంగా వుండవచ్చని బొనంజా పోర్ట్ఫోలియో వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ అన్నారు. గత శుక్రవారం రాత్రి వెలువడిన అమెరికా ఉద్యోగ గణాంకాల డేటాకు ఈ సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో భారత్ మార్కెట్ స్పందిస్తుందని ఆయన చెప్పారు. మే నెలలో అమెరికాలో ఉపాధి కల్పన అంచనాలకంటే అధికంగా జరిగినట్లు గణాంకాలు వెలువడ్డాయి. ఈ డేటా కారణంగా ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ నెలలో వడ్డీ రేట్లు పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతవారం మార్కెట్... వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం లేదంటూ రిజర్వుబ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ జూన్ 2నాటి పాలసీ సమీక్ష సందర్భంగా స్పష్టంచేయడంతో గతవారం భారత్ సూచీలు పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 3.8% నష్టంతో 26,768 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అంతేశాతం క్షీణించి 8,115 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు బాగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 1,600 కోట్లు న్యూఢిల్లీ : మే నెలలో భారత్ మార్కెట్లో అమ్మకాలు జరిపిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) జూన్ తొలివారంలో మాత్రం ఈక్విటీల్లో రూ.1,600 కోట్లు నికరంగా పెట్టుబడి చేశారు. అయితే ఇదేవారంలో రూ. 1,883 కోట్ల విలువైన రుణపత్రాల్ని విక్రయించినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. గత నెలలో వారు రూ. 5,700 కోట్ల ఈక్విటీల్ని, రూ. 8,500 కోట్ల విలువైన రుణపత్రాల్ని నికరంగా విక్రయించారు. -
పారిశ్రామిక వృద్ధి.. ప్చ్!
మార్చిలో 2.1 శాతం; 5 నెలల కనిష్టస్థాయి ఇది... ⇒ 2014-15 ఏడాదికి వృద్ధి రేటు 2.8% న్యూఢిల్లీ: తయారీ, యంత్రపరికరాల రంగాలు కాస్త పుంజుకున్నప్పటికీ.. పరిశ్రమల పనితీరు మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు(ఐఐపీ) 2.1 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరిలో ఈ రేటు 4.86 శాతం(సవరణకు ముందు 5%)గా నమోదైంది. అయితే, గతేడాది ఐఐపీ మైనస్ 0.5 క్షీణతలో ఉండటం గమనార్హం. మంగళవారం కేంద్రీయ గణాంకాల సంస్థ ఈ వివరాలను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్లో మైనస్ 2.7 శాతంగా ఉన్న ఐఐపీ.. నవంబర్లో 5.2 శాతం, డిసెంబర్లో 3.56 శాతం, జనవరిలో 2.77 శాతం చొప్పున వృద్ధి చెందింది. దీని ప్రకారం చూస్తే మార్చి గణాంకాలు ఐదు నెలల కనిష్టస్థాయి కింద లెక్క. రంగాల వారీగా చూస్తే... తయారీ: గతేడాది మార్చిలో ఈ పరిశ్రమల ఉత్పాదకత మైనస్ 1.3 శాతం కాగా.. ఈ ఏడాది మార్చిలో 2.2 శాతానికి వృద్ధి చెందింది. మొత్తం ఐఐపీ సూచీలో తయారీ వాటా 75 శాతానికిపైగా ఉంది. తయారీ రంగంలో మొత్తం 22 పరిశ్రమల విభాగాలకుగాను 13 వృద్ధి బాటలో(ఫిబ్రవరితో పోలిస్తే) ఉన్నాయి. యంత్ర పరికరాలు: ఈ ఏడాది మార్చిలో 7.6 శాతం వృద్ధి చెందింది. గతేడాది మార్చిలో మైనస్ 11.5 శాతం భారీ క్షీణతలో ఉంది. మైనింగ్: ఉత్పాదకత వృద్ధి 0.5 శాతం నుంచి 0.9 శాతానికి స్వల్పంగా పెరిగింది. విద్యుత్: ఉత్పాదకత వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది. కన్సూమర్ గూడ్స్: మార్చిలో ఈ రంగం ఉత్పాదకత మైనస్ 0.7 శాతం క్షీణించింది. గతేడాది మార్చిలో ఈ క్షీణత మైనస్ 2.2 శాతం. కన్సూమర్ నాన్డ్యూరబుల్స్: ఉత్పాదకత వృద్ధి రేటు 5 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది. కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగంలో క్షీణత తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చిలో ఉత్పాదకత మైనస్ 11.8% కాగా, ఈ మార్చిలో ఇది మైనస్ 4.7 శాతంగా ఉంది. పూర్తి ఏడాదికి ఇలా... గత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఉత్పాదకత మైనస్ 0.1 శాతం క్షీణించింది. ఇక తయారీ రంగం ఉత్పాదకత మైనస్ 0.8 శాతం నుంచి 2.3 శాతం వృద్ధిలోకి వచ్చింది. యంత్రపరికరాల ఉత్పాదకత కూడా మైనస్ 3.6 శాతం నుంచి 6.2 శాతం వృద్ధి చెందింది. మైనింగ్ రంగం 1.4 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 8.4 శాతానికి ఎగబాకింది. రేట్ల కోత అంచనాలకు బలం రిటైల్ ధరలు ఏప్రిల్లో నాలుగు నెలల కనిష్ట స్థాయికి తగ్గడం... పారిశ్రామిక ఉత్పత్తి మార్చిలో మందగమనంలో ఉన్న నేపథ్యంలో... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)పై మళ్లీ పారిశ్రామిక ప్రతినిధులు, విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు, విధాన నిర్ణేతల దృష్టి సారిస్తున్నారు. ద్రవ్యోల్బణం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో మందగించిన పారిశ్రామిక ఉత్పత్తికి ఉత్తేజాన్ని ఇవ్వడానికి, తద్వారా ఆర్థికాభివృద్ధికి ఊతం అందించడానికి ఆర్బీఐ మరోదఫా పాలసీ రేటును తగ్గించే అవకాశం ఉందని వారు అంచనాలు వేస్తున్నారు. జూన్ 2 పాలసీ సమీక్షకు ఆర్బీఐ తాజా ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటుందని భావిస్తున్నారు. జనవరి నుంచీ ఆర్బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) రెండు దఫాలుగా పావుశాతం చొప్పున మొత్తం అరశాతం తగ్గించింది. అయితే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడంలో తొలుత బ్యాంకులు వెనుకంజవేసాయి. రెపో రేటు తగ్గించి రుణ రేటు తగ్గింపునకు సంకేతాలు ఇచ్చినా... బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెన్స్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. -
ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా కీలకం
వీటిపై ఇన్వెస్టర్ల దృష్టి జీఎస్టీ, భూసేకరణ బిల్లులు... ఏప్రిల్ రిటైల్, టోకు ద్రవ్యోల్బణం మార్చి పారిశ్రామికోత్పత్తి సూచి కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు... న్యూఢిల్లీ: పార్లమెంటు ముందున్న కీలక సంస్కరణల బిల్లులతో పాటు ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. జీఎస్టీ బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలకమైన భూసేకరణ బిల్లును ఈ వారం లోక్సభలో ప్రవేశపెడతారని భావిస్తున్నారు. మరో మూడు రోజులు మాత్రమే పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ కీలక బిల్లులపై వచ్చే ఫలితం ఆధారంగా మార్కెట్ ట్రెండ్ వుండవచ్చని నిపుణులు చెప్పారు. అలాగే ఈ మంగళవారం వెలువడే రిటైల్ ద్రవ్యోల్బణం (ఏప్రిల్ నెల), పారిశ్రామికోత్పత్తి సూచీ (మార్చి నెల)ల హెచ్చుతగ్గులు మార్కెట్ కద లికల్ని ప్రభావితం చేస్తాయని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అంచనావేశారు. ఏప్రిల్ నెలకు టోకు ద్రవ్యోల్బణం డేటా గురువారం విడుదల కానున్నది. గత శుక్రవారం మార్కెట్ జోరుగా పెరిగినప్పటికీ, గరిష్టస్థాయిలో సూచీలు స్థిరపడటం కష్టసాధ్యమని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. వివిధ దేశీయ, అంతర్జాతీయ అంశాల కారణంగా ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లడం ఇందుకు కారణమన్నారు. అయితే విదేశీ ఇన్వెస్టర్లపై మ్యాట్ విధింపునకు సంబంధించి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏర్పాటుచేయడం శుక్రవారం అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటా ఫలితంగా అక్కడి మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపిన ప్రభావం తొలుత ఈ సోమవారం కన్పిస్తుందని మాంగ్లిక్ అన్నారు. అటుతర్వాత దేశీయ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి మళ్లిస్తారన్నారు. అంతేకాకుండా మార్చితో ముగిసిన క్యూ4 ఫలితాలకు అనుగుణంగా ఆయా షేర్లు సర్దుబాటుకు లోనవుతాయని, ఈ ఫలితాలు కూడా మార్కెట్ ట్రెండ్ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, లుపిన్, కేడిలా హెల్త్కేర్, అశోక్ లేలాండ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలు ఈ వారం క్యూ4 ఫలితాల్ని ప్రకటించనున్నాయి. రూ. 12 వేల కోట్లు వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు కొద్ది నెలల నుంచి దేశీయ మార్కెట్లో అదేపనిగా పెట్టుబడులు పెడుతూ వస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) మే నెలలో ఇప్పటివరకూ రూ. 12,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్యకాలంలో ఎఫ్ఐఐలు రూ. 94,241 కోట్లు పెట్టుబడి చేసినప్పటికీ, ఏ నెలకు ఆ నెల వారి పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నాయి. 2015 జనవరిలో రూ. 33,688 కోట్ల నిధుల్ని ఇక్కడి మార్కెట్లో వారు కుమ్మరించగా, ఫిబ్రవరిలో అవి రూ. 24,564 కోట్లకు, మార్చిలో రూ. 20,723 కోట్లకు, ఏప్రిల్లో రూ. 15,266 కోట్లకు తగ్గాయి. మే నెలలో మాత్రం ఇప్పటివరకూ రూ. 12,256 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. విదేశీ ఇన్వెస్టర్లు సంపాదించిన లాభాలపై 20 శాతం కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధించడం ఈ అమ్మకాలకు కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ చెప్పారు. -
29,000 దాటిన సెన్సెక్స్
* ప్రభావం చూపిన ఐఐపీ జోరు * 8,800 దాటిన నిఫ్టీ * 165 లాభంతో 29,044కు సెన్సెక్స్ * 54 లాభంతో 8,834కు నిఫ్టీ * మార్కెట్ అప్డేట్ ముంబై: స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. చివరి రెండు గంటల్లో కొనుగోళ్ల జోరు కారణంగా సెన్సెక్స్ 29,000, నిప్టీ8,800 పాయింట్ల పైన ముగిశాయి. ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)గణాంకాలు అంచనాలను మించి, తొమ్మిది నెలల గరిష్టానికి చేరడం కూడా ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్ సూచీలు నెల గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్ 165 పాయింట్ల లాభంతో 29,044 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు లాభంతో 8,834 వద్ద ముగిశాయి. ఫలితాలను బట్టే గమనం సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. కొనుగోళ్ల జోరుతో 29,000 పాయింట్లను దాటింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా 28,844 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో 29,073 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 165 పాయింట్ల లాభంతో 29,044 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 8,842,8,762 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి నిఫ్టీ 8,834 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ తర్వాత వెలువడిన వినియోగదారుల ధరల సూచీ, రేపు(మంగళవారం) వెలువడనున్న టోకు ధరల సూచీ గణాంకాలు నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు. .మార్కెట్ భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. 1,703 షేర్లు లాభాల్లో 1,124 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,080 కోట్లుగా, ఎన్ఎస్ఈలో రూ.16,355కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,84,139 కోట్లుగా నమోదయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.417 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.46 కోట్లు చొప్పున నికర కొనుగోళ్లు జరిపారు. -
ఆర్బీఐ పాలసీ, ఐఐపీ డేటాలతో తీవ్ర హెచ్చుతగ్గులు
న్యూఢిల్లీ: రిజర్వుబ్యాంక్ వెల్లడించబోయే పరపతి విధానం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ వారం మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తాయని, ఈ మూడు అంశాలు మార్కెట్ను తీవ్ర హెచ్చుతగ్గులకు గురిచేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 7న వెలువడబోయే ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష మార్కెట్కు కీలకమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఆర్బీఐ పాలసీ తర్వాత ఏప్రిల్ 10న వెలువడబోయే ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను శాసించవచ్చన్నది అంచనా. ఈ రెండు ఘటనలతో వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్టీలకు చెందిన షేర్లు భారీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటాకు తొలుత ఈ సోమవారం మన మార్కెట్లు స్పందిస్తాయి. మార్చి నెలలో అమెరికాలో ఉద్యోగాల సంఖ్య 1.5 లక్షలకు తగ్గినట్లు డేటా వెలువడింది. ఈ సంఖ్య అక్కడి అంచనాలకంటే బాగా తక్కువ. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినట్లు ఈ డేటా సూచిస్తోంది. తదుపరి ట్రిగ్గర్ కార్పొరేట్ ఫలితాలు. అటు తర్వాత మార్కెట్ ట్రెండ్ను కార్పొరేట్ల క్యూ4 ఆర్థిక ఫలితాలు నిర్దేశిస్తాయి. 2015 మార్చితో ముగిసే త్రైమాసికపు ఆర్థిక ఫలితాలకు ఐటీ దిగ్గజం టీసీఎస్ ఏప్రిల్ 16న శ్రీకారం చుడుతుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఏప్రిల్ 24న ఫలితాలు వెల్లడిస్తుంది. ఇటీవల వరుసగా కేంద్ర బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాల తర్వాత ర్యాలీకి అవసరమైన ట్రిగ్గర్ల కోసం మార్కెట్ వేచి చూస్తున్నదని అషికా స్టాక్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ పరాస్ బోథురా చెప్పారు. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 2.91 శాతం ర్యాలీ జరిపింది. -
పరిశ్రమలకు తయారీ బూస్ట్
- జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2.6 శాతం - ఏప్రిల్-జనవరి మధ్య ఈ రేటు 2.5 శాతం న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి 2015 జనవరిలో 2.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అంటే 2014 జనవరితో పోల్చితే తాజాగా జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి 2.6 శాతం పెరిగిందన్నమాట. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటును లెక్కిస్తారు. సూచీలో దాదాపు 75 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం పనితీరు బాగుండడం తాజా సానుకూల ఫలితానికి ఒక కారణం. డిమాండ్కు ప్రతిబింబంగా భావించే భారీ యంత్రపరికరాల (క్యాపిటల్ గూడ్స్) ఉత్పత్తి మెరుగ్గా ఉండడం కూడా ఊరటనిచ్చే వృద్ధి రేటుకు కారణం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ గడచిన 10 నెలల కాలంలో ఈ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 0.1 శాతం. 2014 జనవరిలో ఈ వృద్ధి రేటు 1.1 శాతం. 2014 డిసెంబర్లో 3.23 శాతం. తొలి అంచనాల ప్రకారం ఈ రేటు 1.7 శాతంగా ఉన్నా... తాజాగా దీనిని 3.23 శాతంగా సవరించారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) తాజా లెక్కలను విడుదల చేసింది. వివిధ రంగాల పనితీరును చూస్తే... - జనవరిలో తయారీ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 0.3% నుంచి 3.3 శాతానికి ఎగసింది. మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 14 సానుకూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో ఈ రంగం వృద్ధి రేటు 1.7 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా 0.3 శాతం క్షీణించింది (మైనస్). - కేపిటల్ గూడ్స్ ఉత్పత్తి కూడా 3.9 క్షీణ దశ నుంచి 12.8 శాతం వృద్ధి బాటకు మళ్లింది. 10 నెలల కాలంలో కూడా ఉత్పత్తి -0.8 శాతం (క్షీణత) నుంచి 5.7 శాతం వృద్ధికి నడిచింది. - విద్యుత్ ఉత్పాదకత వృద్ధి రేటు 6.5% నుంచి 2.7 శాతానికి తగ్గింది. 10 నెలల్లో మాత్రం ఈ వృద్ధి రేటు 5.7% నుంచి 9.3%కి ఎగసింది. - మైనింగ్ రంగం కూడా 2.7 శాతం వృద్ధి నుంచి 2.8 శాతం క్షీణతలోకి జారింది. 10 నెలల కాలంలో మాత్రం ఈ రంగం ఉత్పత్తి 1.1 శాతం క్షీణత నుంచి 1.3 శాతం వృద్ధికి మళ్లింది. వినియోగ వస్తువుల రంగం నిరాశ... వినియోగ వస్తువుల ఉత్పత్తి 0.5 శాతం క్షీణత లోంచి మరింతగా 1.9 శాతం క్షీణతలోకి జారింది. 10 నెలల కాలంలో కూడా 2.7 శాతం క్షీణత మరింతగా 4.7 శాతం క్షీణతలోకి పడింది. ఇందులో ఒక భాగమైన దీర్ఘకాలిక వినియోగ వస్తువుల ఉత్పత్తి సైతం జనవరిలో క్షీణతలోనే ఉంది. అయితే క్షీణత 8.3 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది. 10 నెలల కాలంలో సైతం క్షీణత 12.5 శాతం నుంచి 14.2 శాతానికి పెరిగింది. స్వల్పకాలిక వినియోగ వస్తువుల విభాగంలో 4.5 శాతం వృద్ధి 0.1 శాతం క్షీణతలోకి పడింది. 10 నెలల కాలంలో చూస్తే వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 1.9 శాతానికి దిగింది. -
ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా కీలకం
ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై నిపుణుల విశ్లేషణ - విదేశీ పెట్టుబడులు, క్రూడ్ ధరల కదలికలపైనా దృష్టి - 12న రిటైల్ ద్రవ్యోల్బణం,ఐఐపీ గణాంకాలు... - స్వల్పకాలానికి తీవ్ర హెచ్చుతగ్గులు ఉండే అవకాశం... న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ ట్రెండ్కు కీలకంగా నిలుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు(క్రూడ్) ధరల కదలికలపైనా ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టిసారించనున్నారని వారు పేర్కొన్నారు. గురువారం(12న) జనవరి నెలకు ఐఐపీ డేటాతో పాటు ఫిబ్రవరి నెల రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు కూడా వెలువడనున్నాయి. స్టాక్ సూచీల గమనం స్వల్పకాలానికి ఈ రెండు డేటాలపైనే ఆధారపడి ఉంటుందనేది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. కాగా, సమీప కాలంలో మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్కు చెందిన వివేక్ గుప్తా అంచనా వేశారు. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.11 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ధరలు అదుపులోనే ఉండటంతో ఆర్బీఐ గవర్నర్ రెండు నెలల వ్యవధిలోపే రెండోసారి పావు శాతం పాలసీ వడ్డీరేటు(రెపో)ను తగ్గించి ఆశ్చర్చపరిచారు. దీంతో ఈ రేటు 7.5 శాతానికి దిగొచ్చింది. ఇక ఐఐపీ డిసెంబర్లో నామమాత్రంగా 1.7 శాతం వృద్ధి రేటును మాత్రమే నమోదు చేసింది. నవంబర్లో ఐఐపీ 3.9 శాతంగా ఉంది. అమెరికా ఉద్యోగ గణాంకాల ప్రభావం... గురువారం అమెరికాలో వెలువడిన ఫిబ్రవరి నెల ఉద్యోగ గణాంకాల ప్రభావానికి అనుగుణంగా నేడు(సోమవారం) దేశీ స్టాక్ సూచీలు ప్రతిస్పందించే అవకాశాలున్నాయి. యూఎస్లో నిరుద్యోగ రేటు 5.7శాతం 5.5 శాతానికి తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ఫిబ్రవరిలో కొత్తగా అంచనాలకు మించి 2,95,000 కొలువులు జతైనట్లు తాజా ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. పటిష్టమైన జాబ్ డేటా నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను సమీప భవిష్యత్తులోనే పెంచొచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లుల పురోగతిని ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారని.. బొనాంజా పోర్ట్ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధాకన్ పేర్కొన్నారు. మార్కెట్లో నెలకొన్న ఆందోళనలు చాలావరకూ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ) నిధుల ప్రవాహం కొనసాగనుందని.. ప్రస్తుత వేల్యుయేషన్స్ నిలదొక్కుకోవడానికి అధికంగా ఆస్కారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వారంలో దేశీ మార్కెట్లు బుల్లిష్గానే ఉండొచ్చని కూడా అంచనా వేశారు. గడచిన వారంలో సెన్సెక్స్ 88 పాయింట్లు లాభపడి 29,449 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. కాగా, యాడ్ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) మంగళవారం(10న) మార్కెట్లో లిస్ట్ కానుంది. -
‘ఇన్ఫ్రా’ ఉత్పాదకత వృద్ధి అంతంతే
డిసెంబర్లో 2.4 శాతం మూడు నెలల కనిష్టస్థాయి ఇది... న్యూఢిల్లీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన 8 కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ వృద్ధి రేటు 2014 డిసెంబర్లో మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. వృద్ధి రేటు ఈ నెలలో 2.4 శాతంగా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, ఎరువులు, స్టీల్ రంగాల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదుకావడం వృద్ధి రేటు 3 నెలల కనిష్టానికి పడిపోడానికి కారణం. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య, పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. 2013 డిసెంబర్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 4 శాతం. 2014 నవంబర్లో 6.7 శాతం. 2013 డిసెంబర్తో పోల్చితే 2014 డిసెంబర్లో వేర్వేరుగా ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేట్లు ఇలా... వృద్ధిలో ⇒ బొగ్గు ఉత్పత్తి 7.5 శాతం వృద్ధి చెందింది. ⇒ రిఫైనరీ వృద్ధి రేటు 6.1 శాతం వృద్ధి సాధించింది. ⇒ సిమెంట్ రంగం వృద్ధి రేటు 3.8 శాతం పెరిగింది. ⇒ విద్యుత్ రంగం వృద్ధి రేటు 2013 డిసెంబర్తో పోల్చితే 2014 డిసెంబర్లో 7.6 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. క్షీణతలో... ⇒ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా -1.4 శాతం క్షీణత ⇒ సహజ వాయువు ఉత్పత్తి - 3.5 శాతం క్షీణించింది. ⇒ ఎరువుల రంగం - 1.6 శాతం క్షీణించింది ⇒ స్టీల్ ఉత్పత్తి - 2.4 శాతం పడింది. 9 నెలల్లో స్వల్ప వృద్ధి కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 4.4 శాతానికి ఎగసింది. -
దిద్దుబాటు మరికొన్నాళ్లు..!
అమ్మకాలు కొనసాగుతాయ్ ⇒పారిశ్రామికోత్పత్తి క్షీణత ఎఫెక్ట్ ⇒టోకు ధరల గణాంకాలు నేడు వెల్లడి ⇒పార్లమెంట్ సమావేశాలపైనా దృష్టి ⇒ఈ వారం మార్కెట్పై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో గడిచిన వారం మొదలైన దిద్దుబాటు(కరెక్షన్) ఈ వారం కూడా కొనసాగుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గత వారం చివర్లో వెలువడ్డ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) ఇందుకు కొంతమేర కారణంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ నెలకు ఐఐపీ మైనస్ 4.2%కు పడిపోవడం ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఈ బాటలో నవంబర్ నెలకు గత శుక్రవారమే(12న) వెల్లడైన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.4%కు దిగివచ్చినప్పటికీ, ఈ సోమవారం విడుదలకానున్న టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ)పై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని వివరించారు. వీటితోపాటు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ కీలకంగా నిలవ నున్నట్లు తెలిపారు. విదేశీ సంకేతాలూ అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ స్టాక్ మార్కెట్ల తీరు సైతం ట్రేడింగ్ను ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేశారు. మరోవైపు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్కు కీలకంగా నిలవనున్నట్లు తెలిపారు. ఇక విదేశీ మార్కెట్లలో తాజాగా ముడిచమురు ధరలు ఐదేళ్ల కనిష్టానికి దిగిరావడం తెలిసిందే. ఇలాంటి పలు అంశాలు సమీప కాలానికి దేశీ మార్కెట్ల ట్రెండ్ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ముందస్తు పన్ను చెల్లింపులు... గత వారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డ ఐఐపీ, సీపీఐ గణాంకాలకు అనుగుణంగా మార్కెట్లు స్పందించే అవకాశమున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఇక ఈ సోమవారం విడుదలకానున్న డబ్ల్యూపీఐ కూడా సెంటిమెంట్కు కీలకంగా నిలవనుందని తెలిపారు. ఇవికాకుండా కార్పొరేట్ సంస్థల ముందస్తు పన్ను చెల్లింపు వివరాలకూ ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. వీటి ఆధారంగానే కంపెనీల క్యూ3(అక్టోబర్-డిసెంబర్) ఫలితాలపై అంచనాలకు వచ్చే వీలుంటుందని తెలియజేశారు. ఈ నెల 23తో ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనే ఇన్వెస్టర్లు దృష్టినిలుపుతారని చెప్పారు. మరింత దిగువకు..: ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కూడా ఈ వారం మార్కెట్లు దిద్దుబాటుకు లోనవుతాయని అంచనా వేస్తున్నట్లు జయంత్ చెప్పారు. పలు అంశాల నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూస్తాయని, ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని వివరించారు. కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష ఈ నెల 16-17న జరగనుంది. ఈ వివరాలతోపాటు, పార్లమెంట్ సమవేశాల్లో చర్చకురానున్న బీమా బిల్లు, సంస్కరణలు, తదితర ప్రభుత్వ చర్యలకూ ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఎంటీ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. రూ. 10 లక్షల కోట్లకు విదేశీ పెట్టుబడులు ఇప్పటివరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవహించిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) మొత్తం పెట్టుబడులు రూ. 10 లక్షల కోట్లను అధిగమించాయి. ఇందుకు ఈ ఏడాది(2014) జనవరి నుంచి ఇన్వెస్ట్చేసిన రూ. 2.6 లక్షల కోట్లు(43.4 బిలియన్ డాలర్లు) కూడా జత కలిశాయి. వీటిలో ఈక్విటీలలో రూ. 1.05 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయగా, రూ. 1.6 లక్షలను బాండ్ల కొనుగోలుకి వెచ్చించారు. ఈక్విటీలకు సంబంధించి ఎఫ్పీఐలు ఒక ఏడాదిలో రూ. లక్ష కోట్ల స్థాయిలో ఇన్వెస్ట్చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. ఇంతక్రితం 2013, 2012, 2010లలోనూ రూ. లక్ష కోట్లకుపైగా ఇన్వెస్ట్ చే శారు. 1992లో తొలిసారి విదేశీ ఇన్వెస్టర్లను దేశీ క్యాపిటల్ మార్కెట్లోకి అనుమతించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ చూస్తే నికరంగా దేశీ ఈక్విటీలలో రూ. 8 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు రూ. 2.6 లక్షల కోట్లను రుణ సెక్యూరిటీల కొనుగోలుకి వినియోగించారు. వెరసి మొత్తం ఎఫ్పీఐల నికర పెట్టుబడులు 10.54 లక్షల కోట్లను(214 బిలియన్ డాలర్లకుపైనే) తాకాయి. వివిధ రకాల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను సెబీ ఇటీవలే ఎఫ్పీఐలుగా వర్గీకరించింది. స్వల్పకాలిక పెట్టుబడులుగా భావించే ఈ నిధులను హాట్మనీగా మార్కెట్ వ్యవహరిస్తుంది. దీర్ఘకాలిక నేపథ్యంగల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐలు) కోవలోకి ఇవిరాకపోగా, ఎప్పుడైనా మార్కెట్ల నుంచి వెనక్కి(విదేశాలకు) మళ్లిపోతుంటాయి. కాగా, 2014 సంవత్సరం ముగియడానికి ఇంకా 2 వారాల గడువున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు!
దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకంలాంటి రెండు కీలక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. ఒకపక్క పారిశ్రామిక రంగం పుంజుకోగా.. మరోపక్క రిటైల్ ధరలు మరింత శాంతించాయి. కార్పొరేట్ రంగానికి రానున్న రోజుల్లో ఇది సానుకూల పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో రానున్న పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక రంగం కోలుకుంటున్న సంకేతాలు బలపడుతున్నాయి. సెప్టెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వృద్ధి రేటు భారీగా పుంజుకొని 2.5 శాతానికి ఎగబాకింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 0.48 శాతం మాత్రమే. అయితే, క్రితం ఏడాది సెప్టెంబర్లో పరిశ్రమల వృద్ధి 2.7 శాతంగా ఉంది. ప్రధానంగా మైనింగ్, తయారీ, యంత్రపరికరాల రంగాల మెరుగైన పనితీరు మొత్తం పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడానికి ప్రధానంగా దోహదపడింది. ఏప్రిల్-సెప్టెంబర్కు ఇలా... ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధికి కూడా పరిశ్రమల ఉత్పాదకత జోరందుకుంది. ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతానికి ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 0.5 శాతమే కావడం గమనార్హం. రంగాల వారీగా... తయారీ: పారిశ్రామికోత్పత్తి సూచీలో 75 శాతం వెయిటేజీ ఉన్న ఈ రంగం ఉత్పాదకత సెప్టెంబర్లో 2.5 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 1.4 శాతం. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధికి చూస్తే వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 2 శాతానికి పెరిగింది. మొత్తంమీద తయారీ రంగంలోని 22 పారిశ్రామిక విభాగాల్లో 15 విభాగాలు సెప్టెంబర్లో వృద్ధి చెందడం ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం. మైనింగ్: సెప్టెబర్లో ఉత్పాదకత 0.7 శాతంగా వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 3.6 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఉత్పాదకత 2.5%గా నుంచి 2.1 శాతానికి తగ్గింది. యంత్రపరికరాలు: డిమాండ్కు కొలమానంగా పరిగణించే ఈ రంగం ఉత్పాదకత వృద్ధి రేటు సెప్టెంబర్లో ఏకంగా 11.6 శాతానికి ఎగబాకింది. గతేడాది ఇదే నెలలో ఉత్పాదకత మైనస్ 6.6 శాతంగా ఉంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో కూడా మైనస్ 0.6 శాతం క్షీణత నుంచి 5.8 శాతం వృద్ధి బాటలోకి మళ్లింది. విద్యుత్: ఉత్పాదకత 12.9 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో మాత్రం 5.9 శాతం నుంచి 10.4 శాతానికి ఎగసింది. కన్జూమర్ గూడ్స్: ఉత్పాదకత 1 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో మైనస్ 1.2 శాతం క్షీణత నుంచి 4.6 శాతం వృద్ధిరేటును సాధించింది. కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగం ఉత్పాదకత మైనస్ 10.6 క్షీణత నుంచి మరింత తగ్గి మైనస్ 11.3 శాతానికి క్షీణించింది. ఆరు నెలల వ్యవధిలో కూడా ఉత్పాదకత మైనస్ 12.6 శాతానికి(అంతక్రితం ఇదే కాలంలో మైనస్ 11.1 శాతం) దిగజారింది. రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు.. న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో రిటైల్ ధరల పెరుగుదల రేటు కూడా భారీగా తగ్గింది. అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) 5.52 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్లో ఈ రేటు 6.46 శాతంగా ఉంది. వరుసగా నాలుగో నెలలోనూ ఇది తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2012 జనవరిలో ఈ కొత్త సిరీస్ గణాంకాలను ప్రవేశపెట్టిన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి. కాగా, బేస్ రేటు తక్కువగా ఉండటం కూడా తాజా గణాంకాలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కూరగాయల ఎఫెక్ట్... సీపీఐలో ఆహార ధరల ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్లో 7.69 శాతంగా ఉండగా.. అక్టోబర్లో 5.59 శాతానికి తగ్గింది. ముఖ్యంగా కూరగాయల ధర పెరుగుదల సెప్టెంబర్లో 8.59 శాతంగా ఉంది(గతేడాది ఇదే నెలతో పోలిస్తే). అక్టోబర్లో ఈ రేటు మైనస్ 1.45 శాతంగా నమోదైంది. పండ్ల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు కూడా అక్టోబర్లో 17.49 శాతానికి తగ్గింది(సెప్టెంబర్లో 22.4 శాతం). ఇక గుడ్లు, చేపలు, మాంసం వంటి ఆహారోత్పుత్తలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 6.35 శాతం నుంచి స్వల్పంగా 6.34 శాతానికి తగ్గింది. ఆర్బీఐ సమీక్షపైనే అందరికళ్లూ.. రిటైల్ ధరలు నేలకు దిగిరావడం... టోకు ధరలు కూడా కనిష్టస్థాయిలోనే కొనసాగుతుండటంతో ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్లను తగ్గింస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మందగమనంలో ఉన్న వృద్ధి రేటును గాడిలోపెట్టాలంటే వడ్డీరేట్లను తగ్గించాల్సిందేనని పారిశ్రామిక రంగం పదేపదే డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 2న ఆర్బీఐ పాలసీ సమీక్ష జరపనుంది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) సెప్టెంబర్లో ఐదేళ్ల కనిష్టమైన 2.38 శాతానికి తగ్గడం తెలిసిందే. అక్టోబర్ గణాంకాలు రేపు(శుక్రవారం) రానున్నాయి. వచ్చే ఏడాది మార్చికల్లా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 8 శాతానికి, 2016 మార్చినాటికి 6 శాతానికి తగ్గాలనేది ఆర్బీఐ లక్ష్యం. గత నాలుగు సమీక్షల్లో పాలసీ వడ్డీరేట్లను ఆర్బీఐ గవర్నర రఘురామ్ రాజన్ యథాతథంగా కొనసాగించడం విదితమే. -
కీలక పరిశ్రమల మందగమనం
న్యూఢిల్లీ: కీలక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ సెప్టెంబర్లో నిరాశను మిగిల్చింది. కేవలం 1.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ఇది ఎనిమిది నెలల కనిష్ట స్థాయి. గత యేడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 9శాతం. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదు కావడం సెప్టెంబర్లో మొత్తం గ్రూప్ పనితీరును దెబ్బతీసింది. ఇక బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు కూడా వృద్ధి రేటు తగ్గింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలు రంగాల వారీగా చూస్తే... * క్రూడ్ ఆయిల్: 2013 సెప్టెంబర్లో 0.5 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, 2014 సెప్టెంబర్లో అసలు వృద్ధి లేకపోగా -1.1 శాతానికి (క్షీణతకు) జారింది. * సహజవాయువు: క్షీణతలోనే కొనసాగినా ఈ రేటు -13.9 శాతం నుంచి -6.2 శాతానికి తగ్గింది. * రిఫైనరీ ప్రొడక్టులు: 7.7 శాతం వృద్ధి రేటు -2.5 శాతానికి క్షీణించింది. * ఎరువులు: ఈ రంగంలో కూడా వృద్ధి 5.3 శాతం నుంచి -11.6 శాతానికి పడింది. * బొగ్గు: వృద్ధి రేటు 13.6% నుంచి 7.2%కి తగ్గింది. * స్టీల్: వృద్ధి 10.7% నుంచి 4.0 శాతానికి జారింది. * సిమెంట్: ఈ రంగం వృద్ధి రేటు 12.1 శాతం 3.2 శాతానికి పడిపోయింది. * విద్యుత్: ఈ రంగంలో వృద్ధి 12.9 శాతం నుంచి 3.8 శాతానికి జారింది. ఆరు నెలల్లో చూసినా డౌన్! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో (2013-14, ఏప్రిల్-సెప్టెంబర్) చూసినా ఈ కీలక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు దిగజారింది. 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ కోర్ గ్రూప్ వాటా దాదాపు 38 శాతం. సెప్టెంబర్ ఐఐపీ గణాంకాలు ఈ నెల రెండవ వారంలో రానున్నాయి. తాజా ఫలితాలు మొత్తంపై ఐఐపీ సెప్టెంబర్ గణాంకాలపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రికవరీ బాటలో పరిశ్రమలు..
న్యూఢిల్లీ: పరిశ్రమలు మే నెలలో సానుకూల ఫలితాన్ని అందించాయి. ఆర్థికాభివృద్ధికి సంకేతాలను ఇస్తూ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.7 శాతం వృద్ధి సాధించింది. ఇది 19 నెలల గరిష్ట స్థాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈ యేడాది జనవరి నుంచీ చూస్తే, మొదటి నెలలో స్వల్ప వృద్ధి 1.1 శాతం నమోదుకాగా, అటు తర్వాత రెండు నెలల్లో (ఫిబ్రవరిలో 2 శాతం క్షీణత, మార్చిలో 0.5 శాతం క్షీణత) అసలు వృద్ధి చోటు చేసుకోలేదు. ఏప్రిల్లో వృద్ధి రేటు 3.4 శాతం నమోదుకాగా, మేలో ఇది మరింత పెరగడం సానుకూలాంశం. కాగా 2013 మే నెలలో ఐఐపీలో అసలు వృద్ధి లేదు. ఆ నెలలో మైనస్ 2.5 (క్షీణత) నమోదయ్యింది. 2 నెలల్లో వృద్ధి 4 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్-మే) చూస్తే వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. 2013-14ఇదే కాలంలో ఈ రేటు క్షీణతలో -0.5 శాతంగా నమోదయ్యింది. కీలక రంగాలను చూస్తే... తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన ఈ రంగం ఉత్పత్తి 2013 మేతో పోల్చితే 2014 మేలో క్షీణత నుంచి వృద్ధి బాటకు మళ్లింది. ఈ రేటు -3.2 శాతం నుంచి 4.8 శాతం వృద్ధికి మళ్లింది. ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలూ ఏప్రిల్-మేలోనూ ఇదే పరిస్థితి నమోదయ్యింది. 0.7 క్షీణత నుంచి ఈ రంగం 3.7 శాతం వృద్ధికి మళ్లింది. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో 16 సానుకూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. మైనింగ్: ఈ రంగం ఉత్పత్తి 2013 మేతో పోల్చితే 2014 మేలో క్షీణత నుంచి బైట పడింది. -5.9 శాతం నుంచి 2.7 శాతం వృద్ధి బాటలోకి మళ్లింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది. విద్యుత్: ఉత్పత్తి వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. రెండు నెలల్లో వృద్ధి భారీగా 5.3 శాతం నుంచి 9 శాతానికి ఎగసింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్కు చిహ్నంగా ఉన్న ఈ రంగం ఉత్పత్తి 2013 మేలో అసలు వృద్ధి లేకపోగా 3.7 శాతం క్షీణించింది. అయితే 2014 మేలో ఈ రంగం 4.5 శాతం వృద్ధికి మళ్లింది. ఏప్రిల్-మే నెలల్లో సైతం ఉత్పత్తి -2.1 శాతం (క్షీణత) నుంచి 9.3 శాతం వృద్ధికి మళ్లింది. వినియోగ వస్తువులు: ఈ రంగం ఉత్పత్తి 18.3 శాతం క్షీణ బాటలోంచి 3.2 శాతం వృద్ధిలోకి మళ్లింది. అయితే ఏప్రిల్-మే నెలల్లో క్షీణత కొనసాగుతోంది. అయితే ఈ క్షీణత - 14 శాతం నుంచి - 2.5 శాతానికి మెరుగుపడింది. విశ్వాసం పెరుగుతోంది...: పారిశ్రామిక ప్రతినిధులు తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కలిగిస్తున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పారిశ్రామిక ఉత్పత్తిలో క్షీణత ధోరణి ముగిసినట్లేనని, ఉత్పత్తి రికవరీ బాట పట్టిందని పేర్కొనేలా గణాంకాలు ఉన్నాయన్నారు. ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానిస్తూ, తయారీ రంగం వృద్ధిని నమోదుచేసుకున్నప్పటికీ, బేస్ ఎఫెక్ట్నూ (తాజా గణాంకాలకు గత ఏడాది మేలో క్షీణతను ప్రాతిపదికగా తీసుకోవడం) ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అయితే తయారీ రంగంలోని మెజారిటీ విభాగాలు సానుకూలతలో ఉండడం హర్షణీయమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పారిశ్రామికోత్పత్తి గణాంకాల్లో సానుకూల ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.5 శాతాన్ని అధిగమించడానికి ఈ సానుకూల పరిస్థితి దోహదపడుతుందని కూడా కపూర్ అభిప్రాయపడ్డారు. -
పరిశ్రమలు పుంజుకున్నాయ్...
* మే నెలలో పారిశ్రామికోత్పత్తి 3.4 % అప్ * వరుసగా2 నెలల క్షీణత తర్వాత వృద్ధి బాటలోకి * 13 నెలల గరిష్టస్థాయి ఇది... * మైనస్ నుంచి ప్లస్లోకి తయారీ, మైనింగ్.. * విద్యుత్, యంత్రపరికరాల మెరుగైన పనితీరు... ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు వస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎగుమతులు చాన్నాళ్ల తర్వాత మళ్లీ రెండంకెల వృద్ధిని నమోదుచేయగా... ఇప్పుడు పారిశ్రామికోత్పత్తి కూడా మెరుగైన స్థాయిలో పుంజుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ జోరందుకుంటుందన్న విశ్వాసాన్ని పెంచుతున్నాయి. మరోపక్క, ద్రవ్యోల్బణం కూడా శాంతిస్తుండటం రానున్న రోజుల్లో ప్రగతి పురోగతికి బాటలు వేసేలా చేస్తోంది. న్యూఢిల్లీ: తీవ్ర నైరాశ్యంలో ఉన్న పారిశ్రామిక రంగం ఎట్టకేలకు మళ్లీ శక్తికూడగట్టుకుంది. వరుసగా రెండు నెలల తిరోగమనం నుంచి కోలుకొని వృద్ధి బాటలోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పాదకత సూచీ(ఐఐపీ) 3.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసింది. ఇది 13 నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. అంతక్రితం 2013 మార్చిలో 3.5 శాతం ఐఐపీ రేటు నమోదైంది. ముఖ్యంగా తయారీ, మైనింగ్ రంగాలు క్షీణత నుంచి ప్రగతి బాటలోకి రావడమే కాకుండా... యంత్రపరికరాలు, విద్యుత్ రంగాలు మెరుగైన వృద్ధి సాధించడంతో మొత్తం పారిశ్రామికోత్పత్తి ఉత్పాదకత పుంజుకోవడానికి దోహదం చేసింది. గతేడాది ఏప్రిల్ నెలలో ఐఐపీ 1.5 శాతం వృద్ధిని సాధించగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనస్ 1.8 శాతం, మార్చిలో మైనస్ 0.5 శాతం చొప్పున కుంగిన సంగతి తెలిసిందే. కేంద్రీయ గణాంకాల సంస్థ(సీఎస్ఓ) గురువారం తాజా గణాంకాలను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ వరుసగా తిరోగమనం(మైనస్)లోనే ఉన్న పారిశ్రామిక ఉత్పాదకత.. ఆ తర్వాత జనవరిలో కాస్త మెరుగుపడి వృద్ధిబాటలో వచ్చింది. అయితే, మళ్లీ ఫిబ్రవరి, మార్చిలో మైనస్లోకి జారిపోవడంతో పరిస్థితి ఆందోళకరంగా మార్చింది. అయితే, తిరిగి ఏప్రిల్లో వృద్ధి బాటలోకి రావడమేకాకుండా... మెరుగైన ప్రగతి నమోదుకావడం సానుకూలాంశం. కాగా, ఏప్రిల్లో తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూప్లలో 14 విభాగాలు వృద్ది పథంలో ఉండటం గమనార్హం. రంగాల వారీగా పరిస్థితి ఇదీ.. తయారీ రంగం: మొత్తం పారిశ్రామిక ఉత్పాదకత(ఐఐపీ)లో దాదాపు 75 శాతం వెయిటేజీ ఉండే ఈ రంగం ఏప్రిల్లో 2.6 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది మార్చిలో మైనస్ 1.2 శాతం క్షీణించగా... క్రితం ఏడాది ఏప్రిల్లో 1.8 శాతం వృద్ధి నమోదైంది. మైనింగ్: మార్చిలో మైనస్ 0.4 శాతం క్షీణత నుంచి ఏప్రిల్లో వృద్ధి బాటలోకి వచ్చి 1.2 శాతం పుంజుకుంది. క్రితం ఏడాది ఏప్రిల్లో ఈ రంగం మైనస్ 3.4 శాతం క్షీణించింది.యంత్ర పరికరాలు: డిమాండ్కు కొలమానంగా భావించే ఈ రంగం వృద్ధి రేటు ఏప్రిల్లో ఏకంగా 15.7 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో మైనస్ 0.3 శాతం తిరోగమనంలో ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చిలో మైనస్ 12.5 శాతం క్షీణతలో ఉంది. అంటే క్రితం నెలతో పోలిస్తే అత్యంత వేగంగా పుంజుకున్నట్లు లెక్క. విద్యుత్: గతేడాది ఏప్రిల్లో 4.3 శాతం వృద్ధిని నమోదు చేసిన ఈ రంగం ఈ ఏడాది ఇదే నెలలో 11.9 శాతం వృద్ధి రేటును సాధించింది. మార్చిలో ఈ వృద్ధి 5.4 శాతంగా ఉంది.కన్సూమర్ గూడ్స్: మిగతా రంగాలకు భిన్నంగా ఏప్రిల్ నెలలో మైనస్ 5.1 శాతం క్షీణించింది. గతేడాది ఇదే నెలలో 1.7 శాతం వృద్ధిచెందగా.. ఈ ఏడాది మార్చిలో ఈ రంగంఉత్పాదకత మైనస్ 0.9 శాతం క్షీణించింది.కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగం ఉత్పాదకత క్షీణత గతేడాది ఏప్రిల్లో మైనస్ 9.6% కాగా, ఈ ఏడాది ఇదే నెలలో మైనస్ 7.6 %గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో ఈ రేటు మైనస్ 11.8 శాతం. సానుకూల పరిణామమిది: కార్పొరేట్లు ఐఐపీలో కీలకమైన మైనింగ్, తయారీ, విద్యుత్ ఈ మూడు రంగాలూ వృద్ధి బాటలో పయనించడం ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిణామమని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రంగం, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచాలంటే(ఫీల్ గుడ్ ఫ్యాక్టర్) మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు వేగవంతమైన, వృద్ధికి ఊతమిచ్చే విధానాలను తక్షణం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం నుంచి కొన్ని భారీ సంస్కరణలు, విధానపరమైన చర్యలను ఆశిస్తున్నట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా చెప్పారు. -
సెన్సెక్స్ 100 పాయింట్ల లాభం!
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ కంపెనీ షేర్లు లాభాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీల సెన్సెక్స్ లాభాల్ని నమోదు చేసుకుంది. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 102 పాయింట్ల లాభంతో 25576 వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 7640 వద్ద క్లోజైంది. హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేర్లు లాభపడటమే కాకుండా సెన్సెక్స్ 80 పాయింట్ల లాభాన్ని సంపాదించిపెట్టాయి. టీసీఎస్, సన్ ఫార్మా, ఐటీసీ, టాటా మోటార్స్, హిండాల్కో, మారుతి సుజుకీ, ఎన్ టీపీసీ కంపెనీలు ఓ మాదిరి లాభాల్ని నమోదు చేసుకున్నాయి. భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 3.76 నష్టపోగా, కోల్ ఇండియా 2.33, యాక్సీస్ బ్యాంక్ 1.96, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.80, భెల్ 1.44 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
పరిశ్రమలు మైనస్
ఆర్థిక వ్యవస్థకు కష్టకాలం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒకేరోజు విడుదలైన రెండు కీలక గణాంకాలు దీనికి అద్దం పడుతున్నాయి. మార్చి నెలలో ఎగుమతులు క్షీణించడంతో పాటు 2013-14 పూర్తి ఏడాదికి ప్రభుత్వం నిర్ధేశించుకున్న ఎగుమతుల లక్ష్యాన్ని చేరకపోవడం, ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి రంగం మళ్లీ తిరోగమనంలోకి జారిపోవడం మందగమనం తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగం తీవ్ర ఆటుపోట్లతో కుదేలవుతోంది. మినుకుమినుకుమంటూ కొద్దిగా ఆశలు రేపడం... అంతలోనే తిరోగమనంలోకి జారిపోతుండటంతో పారిశ్రామిక వర్గాలకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో వృద్ధిబాటలోకి వచ్చిన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ).. ఫిబ్రవరిలో మళ్లీ మైనస్లోకి కుంగిపోయింది. 1.9 శాతం క్షీణించింది. ప్రధానంగా తయారీ, యంత్ర పరికరాల రంగాలు అత్యంత పేలవ పనితీరు పారిశ్రామికోత్పత్తిని తూట్లుపొడుస్తోంది. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి 0.6 శాతంగా నమోదైంది. కేంద్రీయ గణాంకాల సంస్థ(సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలను వెల్లడించింది. మళ్లీ ఉసూరుమనిపించింది... గతేడాది అక్టోబర్ నుంచి పారిశ్రామికోత్పత్తి తిరోగమనం(మైనస్)లోకి జారిపోవడం మొదలైంది. అక్టోబర్లో 1.2% కుంగిన ఐఐపీ.. డిసెంబర్ వరకూ మైనస్లోనే కొనసాగింది. తిరిగి జనవరిలో కాస్త వృద్ధిలోకి వచ్చినట్లే వచ్చి.... మళ్లీ ఈ ఫిబ్రవరిలో భారీగా క్షీణించడం(మైనస్ 1.9 %) గమానార్హం. పరిశ్రమల వెనుకబాటుకు అధిక వడ్డీరేట్లు కూడా ప్రధాన కారణమేనంటూ గగ్గోలుపెడుతున్న కార్పొరేట్లు... తక్షణం వడ్డీరేట్లు తగ్గించి ఆర్బీఐ చేయూతనందించాలని డిమాండ్ చేశారు. తయారీ తుస్... మొత్తం ఐఐపీలో 75% మేర వాటా కలిగిన తయారీ రంగం ఘోరంగా చతికిలపడింది. గతేడాది ఫిబ్రవరిలో 2.1% వృద్ధి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.7 శాతం క్షీణతలోకి దిగజారిపోయింది. ఇక 2013-14 ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలోనూ ఈ రంగం ఉత్పాదకత 0.7% కుంగింది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధికి 1 శాతం వృద్ధి నమోదైంది. యంత్ర పరికరాల రంగం ఉత్పాదకత ఫిబ్రవరిలో ఏకంగా 17.4% కుంగిపోయింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రంగం 9.1% వృ ద్ధి సాధించింది. తయారీ రంగంలోనూ 22 పారిశ్రామిక విభాగాలకుగాను 13 విభాగాలు ఈ ఫిబ్రవరిలో మైనస్లోనే కొనసాగడం దుర్భర పరిస్థితికి నిదర్శనం. ఇతర రంగాల పరిస్థితి ఇదీ... కన్జూమర్ గూడ్స్ ఉత్పాదకత ఫిబ్రవరిలో 4.5% కుంగింది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం ఉత్పాదకత క్షీణత 2.6% నుంచి 9.3 శాతానికి చేరింది. కన్జూమర్ నాన్డ్యూరబుల్స్ విభాగం ఉత్పాదకత కూడా ఫిబ్రవరిలో 3.2 శాతం వృద్ధి నుంచి 1.2 % క్షీణతలోకి జారింది. ఇక విద్యుత్ రంగం ఉత్పాదకత ఫిబ్రవరిలో 11.5 % పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ రంగం 3.2 శాతం క్షీణతను నమోదుచేసింది. మైనింగ్ రంగం క్రితం ఏడాది ఫిబ్రవరిలో 7.7 శాతం క్షీణించగా.. ఈ ఏడాది ఇదే నెలలో 1.4 శాతం వృద్ధిరేటును సాధించింది. -
పారిశ్రామికోత్పత్తి షాక్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి 2013 నవంబర్లో పూర్తి నిరాశను మిగిల్చింది. వరుసగా రెండవనెల ఉత్పత్తిలో సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేక క్షీణత మరింత దిగజారింది. అంటే అక్టోబర్లో ఉత్పత్తి రేటు 1.6 క్షీణత (-) నమోదుకాగా, నవంబర్లో పరిస్థితి మరింత క్షీణించి - 2.1కు దిగజారింది. ఇది 6 నెలల కనిష్టం. ప్రధానమైన తయారీ, వినియోగ రంగాల పేలవ పనితీరు ఇందుకు కారణం. 2012 నవంబర్లో కూడా ఉత్పత్తి క్షీణత (-1.0)లోనే ఉంది. ఎనిమిది నెలల్లో: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలలనూ (ఏప్రిల్-నవంబర్) చూస్తే ఉత్పత్తి రేటులో క్షీణత నమోదయ్యింది. 2012 ఇదే కాలంలో స్వల్పంగా 0.9 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, 2013 ఇదే కాలంలో -0.2% క్షీణతలోకి జారింది. కీలక రంగాల తీరు: సూచీలో దాదాపు 75% వాటా కలిగిన తయారీ రంగం నవంబర్లో భారీగా క్షీణించింది. అక్టోబర్లో ఈ క్షీణత 2% కాగా ఇది మరింతగా 3.5%కు దిగజారింది. 2012 ఇదే నెలలో సైతం ఈ రేటు -0.8 క్షీణతలోనే ఉంది. ఐఐపీలో 14% వాటా కలిగిన మైనింగ్ రంగం క్షీణ బాట వృద్ధికి మళ్లడం హర్షణీయం. ఇది క్షీణత (-)5.5 % నుంచి 1% వృద్ధికి మళ్లింది. విద్యుత్ రంగంలో వృద్ధి సానుకూల రీతిలో 2.4% నుంచి 6.3%కు పెరిగింది. వినియోగ వస్తువుల విభాగం వృద్ధి 2012 నవంబర్లో -0.3% కాగా, ప్రస్తుతం ఈ రేటు మరింత దిగజారి -8.7%గా ఉంది. క్యాపిటల్ గూడ్స్ వృద్ధి స్వల్పంగా 0.3%గా నమోదయ్యింది. 2012 నవంబర్లో ఇది క్షీణతలో 8.5 శాతంగా ఉంది . ఎనిమిది నెలల కాలంలో చూస్తే క్షీణత తగ్గడం కొంతలోకొంత ఊరట. ఈ కాలంలో ఈ రేటు -11.3 శాతం నుంచి -0.1 శాతానికి తగ్గింది. -
క్యూ2లో వృద్ధి 4.6 శాతం: ఇక్రా అంచనా
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన 2వ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.6 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. జూన్తో ముగిసిన తొలి క్వార్టర్లో ఈ రేటు 4.4 శాతం. తన అంచనా ప్రకారం క్యూ2లో వృద్ధి స్వల్ప మెరుగుదలకు పారిశ్రామిక, ఎగుమతుల రంగంలో చోటుచేసుకున్న రికవరీనే కారణమని ఇక్రా అభిప్రాయపడింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 4.7-4.9 శాతం శ్రేణిలో ఉంటుందన్నది ఇక్రా అంచనా. -
పరిశ్రమలు.. నవ్వాయ్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జూలైలో అనూహ్యంగా మెరుగుపడింది. సంబంధిత సూచీ (ఐఐపీ) 2.6 శాతం వృద్ధి సాధించింది. వృద్ధి రేటు క్షీణించవచ్చన్న అంచనాలకు భిన్నంగా రేటు పెరగడం విశేషం. అంతకుముందు రెండు నెలల్లో అంటే మే, జూన్లలో ఈ సూచీలో అసలు వృద్ధిచెందకపోగా, క్షీణత (మేలో -2.8 శాతం, జూన్లో 1.8 శాతం) నమోదయ్యింది. గత ఏడాది జూలైలో కూడా ఈ రేటు -0.1 శాతం పడిపోయింది. తయారీ, విద్యుత్ రంగాల మెరుగైన పనితీరు 2013 జూలైలో మొత్తం సూచీకి సానుకూల ఫలితాలను అందించింది. కేంద్ర గణాంకాల సంస్థ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2012 జూలైతో పోలిస్తే 2013 ఇదే నెలలో పలు కీలక రంగాలు ముందడుగు వేశాయి. కీలక రంగాల పరుగు తయారీ: మొత్తం ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఈ రంగం వృద్ధి 3 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది అసలు వృద్ధి లేకపోగా తటస్థంగా నిలిచింది. తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూపుల్లో 11 సానుకూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. విద్యుత్: వృద్ధి రేటు 2.8 శాతం నుంచి 5.2 శాతానికి ఎగసింది. మైనింగ్: ఈ రంగంలో వృద్ధిలేకపోగా మైనస్లోనే కొనసాగుతోంది. అయితే క్షీణత రేటు -3.5% నుంచి -2.3%కి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్కు సూచిక అయిన భారీ యంత్రపరికరాల విభాగం క్షీణబాట నుంచి వృద్ధి బాటకు మళ్లి 15.6 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతం క్షీణతలో ఉంది. వినియోగ వస్తువులు: ఈ విభాగం వృద్ధి నుంచి క్షీణతలోకి జారింది. 0.7% వృద్ధి నుంచి -0.9 శాతం కిందకు దిగింది. నాలుగు నెలల్లో చూస్తే నిరాశే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో ఐఐపీ మైనస్లోనే వుంది. -0.2 శాతం నమోదయ్యింది. తయారీ రంగాన్ని తీసుకుంటే క్షీణత -0.6 శాతం నుంచి -0.2 శాతానికి తగ్గింది. విద్యుత్ రంగం వృద్ధి 5.5 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఇక మైనింగ్ రంగం -3.5 శాతం నుంచి -2.3 క్షీణతను నమోదు చేసుకుంది. జూలై నెల మంచి పనితీరువల్ల క్యాపిటల్ గూడ్స్ విభాగం -16.8 శాతం నుంచి 1.8 శాతం వృద్ధికి మళ్లింది. వినియోగ వస్తువుల విభాగంలో ఉత్పత్తి క్షీణించి -2%గా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.1 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ముందుంది మంచికాలం: ప్రభుత్వం తాజా గణాంకాల పట్ల ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మయారామ్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో వృద్ధి మరింత పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడుల క్యాబినెట్ కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) మొదటి త్రైమాసికంలో ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తెలిపారు. జూన్ క్వార్టర్లో ఈ పరిమాణం 22 శాతం వృద్ధితో 5.39 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు వెల్లడించారు. మరిన్ని చర్యలు అవసరం: పరిశ్రమలు పారిశ్రామిక వృద్ధి రేటు మరింత పెరగడానికి విధాన నిర్ణేతలు మరిన్ని చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. వడ్డీరేట్ల తగ్గింపు, ఇండస్ట్రియల్ క్యారిడార్ల వంటి భారీ ప్రాజెక్టుల సత్వర అమలు తదితర సాకారాత్మక చర్యల ద్వారా వృద్ధి వేగం పుంజుకుంటుందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిబార్ సింగ్ పేర్కొన్నారు. వినియోగ వస్తువుల రంగం వంటి కీలక విభాగాలు పుంజుకోడానికి వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించాల్సి ఉంటుందని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత గణాంకాలను చూసి, రికవరీ ప్రారంభమైందని అప్పుడే చెప్పడం సాధ్యంకాదని కూడా ఆయన విశ్లేషించారు. -
సెన్సెక్స్ కు 216 పాయింట్ల నష్టం!
డాలర్ తో పోల్చితే రూపాయి బలహీనపడటం, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ప్రతికూలంగా స్పందించాయి. సెన్సెక్స్ 216 పాయింట్ల నష్టంతో 19781 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 5850 వద్ద ముగిసాయి. గత ఆరు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోవడం ఇదే తొలిసారి. ఇక అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో డాలర్ తో పోల్చితే రూపాయి 12 పైసలు క్షీణించి 63.50 వద్ద ముగిసింది. టాటాపవర్, ఐడీఎఫ్ఎసీ, ఐటీసీ, గెయిల్, రాన్ బాక్సీ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకోగా, జయప్రకాశ్ అసోసియేట్స్ అత్యధికంగా 11 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్, భెల్, టాటా స్టీల్, హీరో మోటో కార్ప్ లు 4 శాతానికి పైగా నష్టపోయాయి. -
రూపాయి, గణాంకాలవైపే చూపు
న్యూఢిల్లీ: డాలరుతో మారకంలో రూపాయి కదలికలతోపాటు, ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. ఇవికాకుండా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల ట్రెండ్కూడా మార్కెట్ల దిశను నిర్దేశించనున్నదని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. సోమవారం గణేశ్ చతుర్థి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఈవారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా, జూలై నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలతోపాటు, రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు గురువారం(12న) విడుదల కానున్నాయి. ఓవైపు ఆర్థిక గణాంకాలు, మరోవైపు అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ వంటి అంశాలు మార్కెట్లను ఒడిదుడుకులకు లోనుచేస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నెల 20న పాలసీ సమీక్ష ఈ నెల 20న రిజర్వ్ బ్యాంకు పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు గణాంకాలపై దృష్టి నిలుపుతారని విశ్లేషకులు తెలిపారు. అయితే రూపాయి విలువ క్షీణత కారణంగా వడ్డీ రేట్లలో కోతకు అవకాశాలు తక్కువేనని బొనాంజా పోర్ట్ఫోలియో సీనియర్ వైస్ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ అంశాలు, విదేశీ మార్కెట్లు కూడా దేశీయంగా సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని వివరించారు. మరోపక్క సిరియాలో చెలరేగిన అశాంతి కారణంగా ముడిచమురు ధరలపైనా మార్కెట్ దృష్టి పెడుతుందని తెలిపారు. మార్కెట్ ఫండమెంటల్స్నుబట్టి చూస్తే రూపాయి క్షీణత సానుకూల అంశమేనని ఇన్వెంచర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీస్ చైర్మన్ నాగ్జీ కె.రీటా చెప్పారు. అయితే ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు చమురు ధర కదలికలకు కూడా ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. కాగా, దేశీయంగా ప్రభుత్వం త్వరలో డీజిల్ ధరలను పెంచనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. కొత్త గవర్నర్ ఎఫెక్ట్ గత బుధవారం రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్గా పదవీ బాధ్యతలను రఘురామ్ రాజన్ చేపట్టిన చర్యలతో రూపాయి విలువ బలడుతూ వచ్చింది. శుక్రవారం రెండు వారాల గరిష్టం 65.24 వద్ద ముగిసింది. విదేశీ కరెన్సీ డిపాజిట్లను స్వాప్ చేసుకునేందుకు బ్యాంకులకు అవకాశాన్ని కల్పించడంతోపాటు, విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే పలు చర్యలను రాజన్ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు సైతం పుంజుకోవడం తెలిసిందే. గత వారంలో సెన్సెక్స్ 650 పాయింట్లు ఎగసి 19,270 వద్ద నిలిచింది. సిరియా ఆందోళనల నేపథ్యంలో స్వల్ప కాలానికి మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూడవచ్చునని నిపుణులు తెలిపారు. ఈ నెలాఖరులో ఇటు ఆర్బీఐ, ఇటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలను నిర్వహించనుండటం కూడా దీనికి కారణంకానుందని వివరించారు. ఇక గత శుక్రవారం వెలువడ్డ అమెరికా ఉద్యోగ గణాంకాలు నిరాశపరచడం గమనార్హం. మళ్లీ ఎఫ్ఐఐల కొనుగోళ్ల బాట.. న్యూఢిల్లీ: గడిచిన నెలలో అత్యధిక రోజులు అమ్మకాలకే పరిమితమైన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) సెప్టెంబర్లో యూటర్న్ తీసుకుని నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. వెరసి గత వారం దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో దాదాపు రూ. 2,600 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. రూపాయిని బలోపేతం చేయడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రోత్సాహాన్నిచ్చే బాటలో రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ చేపట్టిన తాజా చర్యలు ఇందుకు దోహదపడ్డాయని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, ఆగస్ట్ నెలలో ఎఫ్ఐఐలు అటు ఈక్విటీలు, ఇటు డెట్ సెక్యూరిటీల నుంచి మొత్తంగా రూ. 16,000 కోట్ల(250 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు విరుద్ధమైన రీతిలో సెప్టెంబర్ తొలి వారంలో నికరంగా రూ. 2,600 కోట్లను(39.2 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. దీనిలో డెట్ మార్కెట్లో పెట్టుబడులు రూ. 1,689 కోట్లు(25.6 కోట్ల డాలర్లు)కాగా, ఈక్విటీలలో రూ. 882 కోట్ల(13.5 కోట్ల డాలర్లు)ను ఇన్వెస్ట్ చేశారు. సెబీ తాజా గణాంకాలివి. 7 బ్లూచిప్స్ విలువకు రూ. 81,554 కోట్లు ప్లస్ ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా టాప్-10 కంపెనీలలో ఏడింటి విలువ రూ. 81,554 కోట్లమేర ఎగసింది. ప్రధానంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి నికర కొనుగోలుదారులుగా నిలవడంతో గత వారం స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 650 పాయింట్లు పుంజుకుంది. వెరసి 7 ప్రధాన బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ భారీగా పుంజుకుంది. వీటిలో ఓఎన్జీసీ విలువ అత్యధికంగా రూ. 34,093 కోట్లు జంప్చేయగా, కోల్ ఇండియా మార్కెట్ క్యాప్నకు రూ. 17,023 కోట్లు జమయ్యింది. ఈ బాటలో హెచ్డీఎఫ్సీ విలువ రూ. 6,880 కోట్లమేర పుంజుకోగా, ఐటీసీ రూ. 6,872 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ. 5,996 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ. 5,437 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 5,253 కోట్లు చొప్పున లాభపడ్డాయి. అయితే మార్కెట్ క్యాప్లో టాప్ ర్యాంక్లో నిలుస్తున్న టీసీఎస్ మార్కెట్ విలువకు రూ. 6,968 కోట్లమేర చిల్లుపడింది. -
గణాంకాల ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, రూపాయి కదలికలు, ఎస్బీఐ, ఓఎన్జీసీ వంటి బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటికితోడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని తెలిపారు. ఆహార భద్రత బిల్లు తదితర పలు బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. కాగా, ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ నెల 15న(గురువారం) స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా మార్కెట్లకు సెలవు. తొలుత సోమవారం(12న) జూన్ నెల పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), గణాంకాలు వెలువడనున్నాయి. అదే రోజు వినియోగ ధరల(రిటైల్) ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు కూడా తెలియనున్నాయి. ఇక బుధవారం(14న) జూలై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం (డ బ్ల్యూపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఐఐపీ 1% ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకునే అవకాశమున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. రుణ రేట్లు దిగిరాకపోవడంతో పారిశ్రామికోత్పత్తి ప్రగతికి అడ్డుకట్ట పడుతున్నదని చెప్పారు. డ బ్ల్యూపీఐ 5% లోపునకు పరిమితమైతే, వడ్డీ రేట్లను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంకుకు వీలు చిక్కుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ విశ్లేషించింది. వరుసలో బ్లూచిప్స్: తొలి క్వార్టర్ ఫలితాలను సోమ వారం ఎస్బీఐ ప్రకటించనుంది. ఈ బాటలో ఇతర దిగ్గజాలు టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, హిందాల్కో, డీఎల్ఎఫ్ సైతం క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎస్బీఐ ఫలితాలు రానున్న కొద్ది రోజులపాటు బ్యాంకింగ్ రంగ షేర్లపై ప్రభావాన్ని చూపనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ఇటీవలి ట్రెండ్నుబట్టి మార్కెట్లు సాంకేతికంగా పుంజుకుంటే అమ్మకాలు పెరుగుతాయన్నారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5,750కుపైన నిలవగలిగితేనే కొనుగోళ్లకు అవకాశముంటుందని చెప్పారు. వెరసి దిగువముఖంగా 5,450 స్థాయిని నిఫ్టీ చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు. అంతర్జాతీయ అంశాలు కూడా బ్లూచిప్ కంపెనీల ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలకు తోడు అంతర్జాతీయ అంశాలు కూడా మార్కెట్ల ట్రెండ్ను ప్రభావితం చేస్తాయని బొనాంజా పోర్ట్ఫోలియో సీనియర్ వైస్ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. కాగా, డాలరుతో మారకంలో రూపాయి విలువ గత వారం చరిత్రాత్మక కనిష్ట స్థాయి 61.80ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి విలువ దాదాపు 13% పతనంకాగా, స్టాక్ మార్కెట్లు సైతం ఇటీవల బలహీనపడుతూ వచ్చాయి. ఈ ప్రభావంతో రిజర్వ్ బ్యాంకు రూపాయి విలువను నిలబెట్టేందుకే విధానపరమైన చర్యలను పరిమితం చేసింది. ఇకపై ప్రభుత్వం రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయగల చర్యలను చేపడుతుందని విశ్వసిస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ నిపుణులు దీపేన్ షా చెప్పారు.