Indian culture
-
ఇప్పటికైనా బౌద్ధాన్ని అర్థం చేసుకున్నామా?
‘నా దృక్పథం రాజకీయాల నుంచి కాక మత సంస్కృతి నుంచి అలవడింది.’’ – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హేతువుకు ప్రాధాన్య మిచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ముందుకు తీసుకొచ్చిన బౌద్ధం ప్రాచీన భారతదేశంలోనే కాకుండా ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాసంగికతను కలిగివుంది. గౌతమబుద్ధుడు భారతదేశపు మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. ఆయన తన కాలం నాటికి అమలులో ఉన్న సాంఘిక దుర్నీతినీ; మతం పేరున జరుగుతున్న హింసాకాండ, అమానవీయతనూ ప్రశ్నించాడు. హేతువు పునాదిగా ప్రజాస్వామిక సంస్కృతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేశాడు. బుద్ధుడు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దికి చెందిన వాడైనప్పటికీ ఆయన బోధించిన సమానత్వ భావన, హేతువాద దృక్పథం, ప్రజాస్వామికతత్త్వం ఈనాటికీ ఎంతో ప్రాసంగికతను సంతరించుకున్నాయి. ఆయన ముందుకు తీసుకువచ్చిన ‘అనాత్మవాదం’, ‘అనిత్యత’, ‘ప్రతీత్య సముత్పాద’ వంటి భావనలు బౌద్ధాన్ని ఇతర మతాల కంటే భిన్నంగా నిలబెట్టాయనవచ్చు. ఈ భావనలు బౌద్ధాన్ని ఒక మతం అనే స్థాయి నుంచి గొప్ప ప్రాపంచిక దృక్పథాన్నిచ్చే తాత్విక స్థాయికి తీసుకెళ్ళాయనవచ్చు. బుద్ధుడి బోధనలలో ముఖ్యమైన ‘అష్టాంగ మార్గం’ మనుషుల వ్యక్తిత్వ వికాసానికి దోహదంజేసే అత్యున్నత మార్గం. సమత, కరుణ, ప్రజ్ఞ, మైత్రి, శీలం అనేవి బుద్ధుని తాత్వికతలోని ప్రధాన అంశాలు. అలాగే బుద్ధుడు వైదిక మతంలో భాగం అని వాదించడం బుద్ధుణ్ణి బ్రాహ్మణ వాదంలో జీర్ణం చేసుకోవాలనే ప్రయత్నం చెయ్యడమే! అటువంటి ఆకాంక్షల ఫలితమే పురాణాల కాలానికి బుద్ధుడిని విష్ణుమూర్తి దశావతారాలలో ఒక అవతారంగా మార్చడమని తెలుస్తోంది. విద్య, విజ్ఞానం, ఆధునిక భావాల పరంగా ఎంతో ముందంజ వేశామని భావిస్తున్న ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మతమౌఢ్యం పెచ్చరిల్లిపోతోంది. బౌద్ధం రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల పరంగా విస్తృతమైన పరిధి కలిగిన తత్త్వం కాబట్టి సమకాలీన సామాజిక, సాంస్కృతిక వైరుద్ధ్యాలకు బౌద్ధంలో పరిష్కారమార్గాలు వెదకవచ్చు.పండిత అయోతీదాస్, ప్రొఫెసర్ లక్ష్మీ నరసు, డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధాన్ని సామాజిక విముక్తి సిద్ధాంతంగా ప్రతిపాదించారు. అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడాన్ని హిందూమతంలో అంటరానివారనే దళితుల సామాజిక స్థాయిని తిరస్కరించడంగా భావించాడు. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా లౌకికవాదులు, హేతువాదులు, శాస్త్రవేత్తలు అయిన మేధావులు తాము బౌద్ధాభిమానులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నారు. ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్నట్లు బుద్ధుడు ‘ఆసియా జ్యోతి’ మాత్రమే కాదు ఆయన బోధనల ప్రాసంగికత పెరిగేకొద్దీ బుద్ధుడు ‘ప్రపంచ జ్యోతి’గా పరిణామం చెందుతున్నాడు. అయితే బుద్ధుడిని సమాజం కేవలం అహింసా మూర్తిగా, చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకున్న సన్యాసిగా, లేకపోతే శాకాహారిగా మాత్రమే అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడు అహింసావాది అన్నమాట నిజమే... కానీ శాంతిని, న్యాయాన్ని స్థాపించడం కోసం యుద్ధం చెయ్యడంలో తప్పు లేదంటాడు. ఆయన కేవలం ధ్యానం మాత్రమే చెయ్యక ప్రాపంచిక విషయాలపై వివిధ వ్యక్తులతో చర్చించి సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. చాలామంది భావించినట్లు బుద్ధుడు శాకాహారి కాడు. అలాగే ఆయన శాకాహారాన్ని కీర్తించలేదు. క్రతువులలో జంతు వధను ఖండించి, పండితుల భాషగా ఉన్న సంస్కృతం స్థానంలో ప్రజల భాష అయిన ‘పాళీ’ని ప్రతిపాదించి వైదిక సంస్కృతికి ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశపెట్టాడు. నిజానికి బౌద్ధం సంధించిన విమర్శల ఫలితంగానే తర్వాత కాలంలో హిందూమతం తనను తాను సంస్కరించుకుని అహింసనూ, శాకాహారాన్నీ ఆదర్శాలుగా స్వీకరించింది. బౌద్ధ భిక్షువులు సామాజిక కార్యకర్తల వలే బహుజన హితం, బహుజన సుఖం కోసం పనిచెయ్యాలని బుద్ధుడు సూచించాడు. బౌద్ధసంఘంలో రాజుల నుంచి, బానిసల వరకు అందరికీ సమాన హోదాను కల్పించాడు. బౌద్ధసంఘంలో ‘ఉపాలి’ అనే మంగలి కులస్థుడు, ‘జీవకుడు’ అనే వేశ్యాపుత్రుడు, ‘ఆమ్రపాలి’ అనే వేశ్య, రాజవంశీకులైన ‘ప్రసేనజిత్’, రాకుమార్తె ‘విశాఖ’; భర్త, బిడ్డల చేత, సమాజం చేత నిర్లక్ష్యానికి గురైన స్త్రీలు... సమానమైన గుర్తింపును పొందారు. భిన్న సామాజిక వర్గాల మధ్య బుద్ధుడు సామరస్యాన్ని కుదిర్చాడు. ‘విధికుడు’ అనే చర్మకారుడు అమరావతి క్షేత్రానికి కానుకగా ఇచ్చిన పూర్ణకుంభం బౌద్ధంలోని సమతకు చిహ్నంగా మిగిలింది. బౌద్ధంలో దేవుడి స్థానాన్ని నైతికత ఆక్రమిస్తుంది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గెయిల్ ఆంవెత్ బౌద్ధం అధికారిక మతంగా ఉన్న ప్రాచీన భారత సంస్కృతిని ‘బుద్ధిస్ట్ సివిలైజేషన్’గా పేర్కొన్నారు. ‘భారతీయ ఆత్మను కలిగి ఉన్న బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్లగొట్టి భారతదేశం ఆత్మహత్య చేసుకుంద’ని గురజాడ అనడంలో అతిశయోక్తి లేదు. బౌద్ధం అనే గొడుగు కింద ప్రజల్లో సమైక్య భావన ఏర్పడే అవకాశం ఉంది. - ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బుద్ధిస్ట్ స్టడీస్ శాఖలో సీనియర్ ప్రొఫెసర్ (మే 12న బుద్ధ పూర్ణిమ) -
భారతీయ సంస్కృతిపై విదేశీయుల ఆసక్తి
సాక్షి, పుట్టపర్తి (శ్రీసత్యసాయి జిల్లా): దేశ, విదేశాల నుంచి వచ్చిన మహిళలు భారతీయ సంస్కృతిపై ఇష్టం పెంచుకున్నారు. చీర, పంచెకట్టులో దర్శనిమిచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడి విధానాలను పరిచయం చేయడమే కాకుండా.. స్థానిక అలవాట్లను వంటబట్టించుకున్నారు. సత్యసాయిబాబా నడయాడిన పుట్టపర్తికి పలు దేశాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. తెలుగోడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి సత్యసాయి తీసుకెళ్లారని చెబుతున్నారు. అంతేకాకుండా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు మరువలేనివని కొనియాడుతున్నారు. ఓసారి పుట్టపర్తికి వస్తే.. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్ని సమస్యలతో వచ్చినా.. మందిరంలో అడుగు పెట్టాక ప్రశాంతత వస్తుందని పేర్కొంటున్నారు. శనివారం శ్రీసత్యసాయి 99వ జయంతి సందర్భంగా విదేశీయులతో ‘సాక్షి’ మాటామంతీ.. ప్రశాంతతకు మారుపేరు పుట్టపర్తికి చాలా ఏళ్ల నుంచి వస్తున్నా. వచ్చిన ప్రతిసారీ నెల రోజులు ఉంటా. ఫుడ్ బాగా నచ్చింది. తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. చీరకట్టు చాలా నచ్చింది. సత్యసాయి కోట్ల మంది గుండెల్లో కొలువై ఉన్నారు. – మెరియిల్లె, ఫ్రాన్స్మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది పుట్టపర్తి గురించి చాలా ఏళ్లుగా వింటున్నా. తొలిసారి 15 రోజుల క్రితం వచ్చా. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. ఒక వ్యక్తి ఇంతమందికి ఓ శక్తిలా మారి.. ఒక ఊరిని తయారు చేశారంటే మామూలు విషయం కాదు. – ఒట్టావి, ఫ్రాన్స్ సంప్రదాయాలు బాగున్నాయి తెలుగు సంప్రదాయం నచ్చిoది. చీరకట్టుకోవడం, తెలుగు వంటకాలు నేర్చుకున్నా. సెంట్రల్ ట్రస్టు సేవలు చాలా బాగున్నాయి. విద్య, వైద్యంపై భగవాన్ శ్రీసత్యసాయి సేవలను చరిత్ర మరువదు. – డానేలా, ఇటలీసాయిబాబా వ్యక్తి కాదు.. శక్తి 1980 నుంచి పుట్టపర్తికి వస్తున్నా. సాయిబాబా ఓ వ్యక్తి కాదు.. ఆయన ఓ శక్తి. ఇక్కడ చాలామంది పరిచయమయ్యారు. సొంత బంధువుల్లా ఆదరిస్తారు. తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకున్నా. – లిండా, లండన్ సాయిబాబానే బతికించారు ఇక్కడకు చాలాసార్లు వచ్చాను. నేను మూడుసార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యా. బాబానే బతికించాడని నమ్ముతున్నా. ఏటా బాబా జయంతి వేడుకలు మిస్ కాకుండా వస్తా. దోశ అంటే చాలా ఇష్టం. – ఫెర్నాండో, ఇటలీ అతిథులకు లోటు రానివ్వం భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులకు ఎలాంటి లోటు రానివ్వం. ఏ దేశం నుంచి అతిథులు వచ్చినా సాదరంగా స్వాగతిస్తాం. వారికి కావాల్సిన వసతి ఏర్పాటు చేస్తున్నాం. బాబా ఆశయాల సాధన మేరకు శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు ఉన్నాయి. చిన్న గ్రామాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి భగవాన్ శ్రీసత్యసాయిబాబా. – ఆర్జే రత్నాకర్రాజు, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ -
‘మా అల్లుడు వెరీగుడ్’: సుధా మూర్తి
తన అల్లుడు ఎంతో మంచివాడని, ఆయన్ని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉందని అంటున్నారు ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి. లండన్ విద్యాభవన్లో జరిగిన దీవాళి గళా కార్యక్రమంలో ఆమె భారతీయ విలువలు, సంస్కృతి మీద మాట్లాడుతూ..మనిషికి మంచి చదువే కాదు.. సంప్రదాయ మూలాలు కూడా ముఖ్యమేనని అంటున్నారు సుధా మూర్తి. శనివారం లండన్లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్లో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూతురు అక్షతా మూర్తి, ఆమె భర్త..బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్లు హాజరయ్యారు.మంచి విద్య మీకు పైకి ఎగరడానికి(ఎదగడానికి) రెక్కలను ఇస్తుంది, కానీ గొప్ప సంస్కృతి మిమ్మల్ని మీ మూలాల్లో నిలబెట్టేలా చేస్తుంది. ఉషా సునాక్(రిషి తల్లి) ఆయన్ని(రిషి) అద్భుతంగా పెంచారు. ఆ పెంపక పునాదుల్లో.. బలమైన భారతీయ సంస్కృతి ఉంది. సునాక్ బ్రిటిష్ జాతి గర్వించదగ్గ వ్యక్తి. అదే సమయంలో.. ఆయన భారతీయ వారసత్వంలో విలువలు కూడా కనిపిస్తాయి అంటూ అల్లుడిని ఆకాశానికెత్తారామె.ఈ సందర్భంగా.. భారతీయ కళను, సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు భారతీయ విద్యాభవన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. భారతీయ సంప్రదాయాల్ని నేర్చుకునేందుకు మీ పిల్లలను ఇక్కడికి(విద్యాభవన్)కు పంపండి. మనం ఒక వయసుకి వచ్చాక.. మన మూలాలను తాకాల్సి ఉంటుంది అంటూ ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్లు సైతం హాజరయ్యారు. విద్యాభవన్ నిర్వాహకులకు రిషి, అక్షతలు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్,అంతకు ముందు.. భవన్ యూకే చైర్మన్ సుభాను సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎన్ నందకుమారలు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే.. భారత కళలను ఎలా ప్రదర్శిస్తున్న తీరును, ఆ సెంటర్ సాధించిన విజయాల్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. రామాయణం, కలిపూజ వంటి అంశాలను ప్రస్తావించారు. పలువురు కళాకారులు భారతీయ నృత్య కళలు ప్రదర్శించారు. -
వరి అంటే ఆహారం మాత్రమే కాదు, మన కరెన్సీ కూడా!
‘అన్నం గురించి చెప్పండి’ అని అడిగితే... ‘రోజూ తింటాం’ అనేవాళ్లే ఎక్కువ. ‘మీకు తెలిసిన వరివంగడాల గురించి చెప్పండి’ అని అడిగితే... ఒకటి, రెండు మాత్రమే చెప్పేవాళ్లు ఎక్కువ. అంతేనా! ‘కాదు... ఎంతో ఉంది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ వినయ్ వారణాసి. భారతీయ సంస్కృతిలో అన్నం, సంప్రదాయ వరి ధాన్యాల ప్రాముఖ్యతను చెబుతున్న వినయ్ ప్రసంగాలు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి.మనం ఎప్పుడూ వినని కొత్త కథలు కాదు. అయితే వాటిని కొత్తగా ఎలా చెప్పవచ్చో వినయ్ ప్రసంగాలు వింటే అర్థం అవుతుంది. అన్నంతో సంబంధం ఉన్న వివిధ ఆచారాలు, వాటి పట్ల రుషులకు ఉన్న భక్తి, మనిషి జీవితాన్ని నిలబెట్టడంలో దాని విలువైన పాత్ర, దైవత్వానికి దాని ప్రతీకాత్మక సంబంధం గురించి వివరిస్తాడు. అన్నదానం చేసే ప్రక్రియను పౌరాణిక కథల ద్వారా చెబుతాడు. ‘మన దేశంలో బియ్యం అనేది సామాజిక, ఆర్థిక కరెన్సీ’ అంటున్న వినయ్ ‘స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్’ అనే సంస్థతో కలిసి బడులను నుంచి వ్యవసాయ కళాశాలల వరకు వరి ధాన్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.‘ఎన్నో రకాల వరి వంగడాలను పునరుద్ధరించడంపై మేము దృష్టి సారించాం. ప్రతి దానికి దాని ప్రత్యేకమైన ఆకృతి. రంగు, వాసనకు పేరు ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు కన్యాకుమారిలో కనిపించే అనికొంబస్ ఇప్పుడు అంతరించిపోయింది. అనేక దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి’ అంటుంది ‘స్పిరిట్ ఆఫ్ ఎర్త్’ ఫౌండర్ షీలా బాలాజి. ప్రాచీన వరి వంగడాల పునర్జీవానికి వాటి గురించి అవగాహన కలిగించడం అనేది కీలకం.హైబ్రిడ్ వరి వంగడాల వైపు ఎక్కువగా దృష్టి సారించడం వల్ల అనేక సంప్రదాయ వరి రకాలు క్షీణించాయి. ఎక్కువమంది ఈ పురాతన రకాలపై ఆసక్తి చూపితే సహజంగానే వాటికి డిమాండ్ పెరుగుతుంది. పెరిగిన డిమాండ్ మన వ్యవసాయ వైవిధ్యాన్ని కాపాడుతుంది. దీనికి అవగాహన కల్పించడం అవసరం. ఆ పనిని సగర్వంగా భుజాల కెత్తుకున్నాడు వినయ్ వారణాసి.ఇక వినయ్ మల్టీ టాలెంట్ విషయానికి వస్తే... ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ మాత్రమే కాదు ఆర్కిటెక్ట్, డిజైన్ రిసెర్చర్, క్లాసిక్ మ్యూజిక్ లిరిసిస్ట్, డిజైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘అన్బైండ్’ ఫౌండర్. -
Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా!
పురాణాలు ఇప్పుడు కాలక్షేపం కోసం కాదు. వయసు మళ్లిన వారి కోసం మాత్రమే కాదు. మిలీనియల్స్ నుంచి జెన్ జెడ్ వరకు యువతరం పురాణాలను ఇష్టపడుతోంది. అయితే అది చదువు రూపంలో కాదు. గేమింగ్ రూపంలో. ఇండియన్ మైథలాజికల్ గేమ్స్ను ఆడడానికి గేమర్స్లో 82 శాతం మంది ఇష్టపడుతున్నట్లు చెబుతోంది గేమింగ్ అండ్ ఇంటరాక్టివ్ మీడియా ఫండ్ సంస్థ లుమికై. అర్జునుడి నుంచి కర్ణుడి వరకు రకరకాల పురాణపాత్రలలో ‘ప్లేయర్’ రూపంలో పరకాయ ప్రవేశం చేస్తోంది యువతరం...వెల్కమ్ టు గేమ్ జోన్..అహ్మదాబాద్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని శాన్వీకి గేమింగ్ అంటే బోలెడంత ఇష్టం. ఎక్కువ సమయాన్ని టెక్ట్స్బుక్స్తోనే గడిపే శాన్వీ కాసేపు వీడియో గేమ్స్ ఆడడం ద్వారా రిలాక్స్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డెత్స్ డోర్’ నుంచి ‘మాన్స్టర్ హంటర్’ వరకు ఎన్నో గేమ్స్ ఆడింది. అయితే ఒక ఫ్రెండ్ సలహా ప్రకారం కొన్ని నెలల క్రితం తొలిసారిగా ఇండియన్ మైథలాజికల్ గేమ్ ఆడింది. ఇక అప్పటి నుంచి అలాంటి గేమ్స్ మాత్రమే ఆడుతోంది.‘మైథలాజికల్ గేమ్స్కు ఇతర గేమ్స్కు తేడా ఏమిటో తొలిసారిగా తెలుసుకున్నాను. ఇవి కేవలం కాలక్షేప ఆటలు కావు. పురాణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని పెంచుతాయి’ అంటుంది శాన్వీ. ‘చిన్న పట్టణాలతోపాటు గ్రామీణ ్రపాంతాలలో కూడా స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడంతో గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగింది. మన దేశంలో పెద్ద గేమింగ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. గతంతో ΄ోల్చితే వచ్చిన మార్పు ఏమిటంటే మన సాహిత్యం, సంస్కృతితో ముడిపడి ఉన్న పాత్రలను యువ గేమర్స్ ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్–క్లాస్ టెక్నాలజీతో మనవైన పాత్రలను ఇండియన్ స్టూడియోలు డెవలప్ చేస్తున్నాయి’ అంటుంది ‘విన్జో గేమ్స్’ కో–ఫౌండర్ సౌమ్య సింగ్ రాథోడ్.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మన పురాణాలు, చరిత్ర, సంస్కృతి, జానపద సాహిత్యంలోని పాత్రల ఆధారంగా మరిన్ని గేమ్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ నుంచి రానున్నాయి అంటుంది సౌమ్య. ‘పురాణాలను గేమింగ్తో మిళితం చేయడంతో ప్లేయర్స్ కొత్త రకం అనుభూతికి గురవుతున్నారు. అన్ని వయసుల వారిని ఈ గేమ్స్ ఆకట్టుకుంటున్నాయి’ అంటున్నాడు ‘ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్’ ఫౌండర్ చిన్మయ్ శర్మ. ‘మన పురాణాల్లో దాగున్న ఎన్నో ఇతివృత్తాలు డెవలపర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ పాత్రలు యూత్ను ఆకట్టుకునేలా గేమ్ను డిజైన్ చేస్తున్నారు’ అంటున్నాడు యుగ్ మెటావర్స్ సీయీవో ఉత్కర్ష్ శుక్లా.మైథలాజికల్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఫస్ట్–పర్సన్ షూటర్(ఎఫ్పీఎస్) గేమ్స్. మెయిన్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆడే గేమ్స్.‘టెస్ట్ యువర్ స్కిల్స్ ఇన్ దిస్ ఎపిక్ స్ట్రాటజీ గేమ్’ అంటూ ఆహ్వానించిన ‘కురుక్షేత్ర: అసెన్షన్’ దిల్లీకి చెందిన సజనికి బాగా నచ్చింది. ఈ వీడియో గేమ్లో అర్జునుడు, భీముడు, కర్ణుడులాంటి ఎన్నో పాత్రలు ఉంటాయి.‘మైథలాజికల్ గేమ్స్ మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళతాయి. మన పురాణాలు, జానపదాల ఆధారంగా గేమ్స్ను రూపొందించే అద్భుత అవకాశం ఇప్పుడు గేమ్ డెవలపర్లకు వచ్చింది. దేవ, దానవుల మధ్య యుద్ధానికి సంబంధించి సెకండ్ గేమ్ను రూపొందిస్తున్నాం’ అంటున్నాడు ‘కురుక్షేత్ర’ గేమ్ను రూపొందించిన ‘స్టూడియో సిరా’ కో–ఫౌండర్ అభాస్ షా.‘కురుక్షేత్ర’ను తక్కువ సమయంలో ఆరు లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు.మన దేశంలోనే కాదు ఆగ్నేయాసియా దేశాలలో కూడా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన గేమ్స్ను ఆడడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టాన్ని క్యాష్ చేసుకోవడం అని కాకుండా ఈ గేమ్స్ ద్వారా యువతలో నైతిక విలువలు పాదుకొల్పే, ఆత్మస్థైర్యం పెంచగలిగే ప్రయత్నం చేస్తే భవిష్యత్ కాలంలో వాటికి మరింత ఆదరణ పెరుగుతుంది. రాజీ పడకుండా...నోడింగ్ హెడ్స్ గేమ్స్ కంపెనీ రూపొందించిన ‘రాజీ: యాన్ ఏన్షియెంట్ ఎపిక్’ మనల్ని మన పురాణ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మన దేవాలయాల సౌందర్యం నుంచి ఇతిహాస కళ వరకు ఈ గేమ్లో ప్రతిఫలిస్తుంది. కంపెనీ ్రపారంభం నుంచి మన పురాణాల ఆధారంగా గేమ్ను రూపొందించాలని కల కన్నది పుణేకు చెందిన ‘నోడింగ్ హెడ్స్ గేమ్స్’ కంపెనీ ఫౌండర్ శృతి ఘోష్.‘రాజీ’ రూపంలో తన కలను నిజం చేసుకుంది.‘గ్రీకు ఇతర పురాణాలు సినిమాలు, గేమ్స్ రూపంలో మనల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఆ స్థాయిలో మన పురాణాలు గుర్తింపు పొందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పురాణాల ఆధారంగా రాజీ గేమ్కు రూపకల్పన చేశాం. ఇది ఎంతో మంది డెవలపర్లకు స్ఫూర్తిని ఇచ్చింది. ఎంత చెప్పినా మన పురాణాల్లో నుంచి చెప్పడానికి ఇంకా ఎంతో ఉంటుంది’ అంటుంది శృతి ఘోష్.– శృతి ఘోష్ -
ఎయిరిండియా ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియో : విభిన్న నృత్య రీతులతో
టాటా గ్రూపు యాజమాన్యంలో ఎయిరిండియా ఇటీవల సరికొత్తగా ముస్తాబైంది. విమానాల్ని కలర్ఫుల్గా, ముఖ్యంగా ఎయర్హెస్టెస్ తదితర సిబ్బంది డ్రెస్ కోడ్ను అందంగా తీర్చిదిద్దింది. తాజాగా మరో కొత్త అప్డేట్ను కూడా ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొత్త ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియోను తీసుకొచ్చింది. ఎయిరిండియా విమానం బయలు దేరడానికి ముందు వినిపించే ప్రయాణీకుల కోసం 'సేఫ్టీ ముద్ర' అనే కొత్త ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియోను పరిచయం చేసింది. వివిధ కళారూపాల నుండి ప్రేరణ పొందినట్టు తెలిపింది. "శతాబ్దాలుగా, భారతీయ శాస్త్రీయ నృత్యం , జానపద-కళా రూపాలు కథలు, సూచిక మాధ్యమంగా పనిచేశాయి. నేడు, అవి విమాన భద్రత గురించి మరొక కథను చెబుతున్నాయి." అని ట్వీట్ చేసింది. సుసంపన్నమైన, విభిన్నమైన నృత్య రీతుల ప్రేరణతో కొత్త సేఫ్టీ ఫిల్మ్అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. మెకాన్ వరల్డ్గ్రూప్కు చెందిన ప్రసూన్ జోషి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ , డైరెక్టర్ భరతబాల సంయుక్తగా 'సేఫ్టీ ముద్రాస్'ను దీన్ని తీసుకొచ్చారు. భరతనాట్యం, బిహు, కథక్, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్ .గిద్దా, ఎనిమిది విభిన్న నృత్య రూపాల్లో ముద్రలు లేదా నృత్యవ్యక్తీకరణలు ఇందులో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అవసరమైన భద్రతా సూచనలను అందించేలా దీన్ని తీర్చిదిద్దడం సంతోషదాయమన్నారు ఎయిరిండియా సీఎండీ కాంప్బెల్ విల్సన్ For centuries, Indian classical dance and folk-art forms have served as medium of storytelling and instruction. Today, they tell another story, that of inflight safety. Presenting Air India’s new Safety Film, inspired by the rich and diverse dance traditions of India.#FlyAI… pic.twitter.com/b7ULTRuX1Z — Air India (@airindia) February 23, 2024 -
G20 Summit: నేతల సతీమణులకు ప్రత్యేక విందు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్రానికి వచి్చన ప్రపంచ నేతల సతీమణులకు శనివారం జైపూర్ హౌస్లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అనంతరం వారందరికీ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో కళాకృతులను తిలకించేందుకు అవకాశం కలి్పంచారు. విందులో భాగంగా వారికి మిల్లెట్లతో చేసిన వంటకాలను వడ్డించారు. స్ట్రీట్ ఫుడ్ రుచి చూపించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విందుకు తుర్కియే అధ్యక్షుడి సతీమణితోపాటు, జపాన్ ప్రధాని సతీమణి యోకో కిషిదా, యూకే ప్రధాని సతీమణి అక్షతామూర్తి, ఆ్రస్టేలియా, మారిషస్ తదితర దేశాల ప్రధానుల సతీమణులు, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా సతీమణి రితు బంగా తదితర 15 మంది వరకు హాజరయ్యారని వెల్లడించాయి. అంతకుముందు, వీరంతా సుమారు 1,200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఏఆర్ఐ)పుసా క్యాంపస్కు వెళ్లారు. వీరికి విదేశాంగ మంత్రి జైశంకర్, ఆయన భార్య కియోకో స్వాగతం పలికారు. తృణధాన్యాల సాగు గురించి తెలుసుకున్నారు. ప్రముఖ చెఫ్లు లైవ్ కుకింగ్ సెషన్లో తృణధాన్యాల వంటకాలను వివరించారు. మధ్యప్రదేశ్లోని డిండోరికి చెందిన గిరిజన మహిళా రైతు లహరీ బాయి తదితర 20 మంది మహిళా రైతులతో వీరు ముచ్చటించారు. -
టీబీజెడ్లో ‘మంగళ 2023 కలెక్షన్’
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ టీబీజెడ్ ‘మంగళ 2023 కలెక్షన్’ ఆవిష్కరించింది. పంజాగుట్ట షోరూంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం వేడుకలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కొత్త కలెక్షన్ విడుదల చేసింది. ‘‘భారతదేశ సంస్కృతి స్ఫూర్తితో తీర్చిదిద్దిన ఈ బంగారు వజ్రాభరణాలు ఏ సందర్భంలో ధరించినా ప్రత్యేకత చాటుతాయి. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా ఉంది’’ అని రకుల్ తెలిపారు. పంజాగుట్ట స్టోర్ పునః ప్రారంభంతో భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని టీబీజెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభిõÙక్ మాలూ ఆశించారు. -
గ్రామదేవతలే భరత సంస్కృతికి ఆధారం!
నిజామాబాద్: భారతీయ సంస్కృతికి ఆధారం గ్రామ దేవతలేనని, ఆ గ్రామ దేవతలే గ్రామాలను, దేశాన్ని రక్షిస్తున్నాయని విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ గంగల్ లక్ష్మీపతి వ్యాఖ్యానించారు. శనివారం ఇందూరు ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో స్థానిక హరిచరన్ మార్వాడీ విద్యాలయంలో శ్రీగ్రామ దేవతలు – ఆరాధనా సంస్కృతిశ్రీ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనిషి తాను చేసే ప్రతి పనిలో భగవంతుని దర్శించడమే సంస్కృతి అని పేర్కొన్నారు. శ్రీరాముడు, పాండవులు సైతం అయోధ్య గ్రామ దేవతను, రాజ్యలక్ష్మీ దేవతను ఆరాధించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 145 రూపాల్లో గ్రామ దేవతల్ని ఆరాధిస్తున్నారని వెల్లడించారు. ఇతిహాస సంకలన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్ మాట్లాడుతూ చరిత్ర అధ్యయనం కోసమే ఇతిహాస సంకలన సమితి అంకితమైన సంస్థ అన్నారు. ఈ కార్యక్రమంలో భోగరాజు వేణుగోపాల్, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్, బొడ్డు సురేందర్, డా వారె దస్తగిరి, బలగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
Special Marriage : బ్యాండ్ బాజాలతో ఘనంగా చిలుక పెళ్లి!
పెళ్లి అనేది భారతీయ సంప్రదాయంలో ఒక గొప్ప వేడుక. పెద్దలు ఈ వేడుకను గొప్ప పవిత్ర కార్యంగా నిర్వహిస్తారు. అలాంటి సంప్రదాయరీతిలో ఇక్కడొక ఇద్దరు వ్యక్తులు రెండు పక్షులకు పెళ్లి చేశారు. ఈ వింత పెళ్లి మధ్యప్రదేశ్లోని కరేలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్లోని పిపారియాలో ఉండే రామ్స్వరూప్ పరిహర్ మైనా అనే పక్షిని కన్న కూతురి మాదిరిగా చూసుకుంటున్నాడు. అలాగే బాదల్ లాల్ విశ్వకర్మ చిలుకను కన్న బిడ్డలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వారిద్దరూ తమ పక్షులకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఆ ఇద్దరు తమ పక్షులకు హిందూ సంప్రదాయ పద్ధతిలో జాతకాలు చూసి మరీ భాజ భజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఆ పక్షులను రెండింటిని చిన్న కారులో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ పెళ్లి అంతటిని రామస్వరూప్ తన ఇంటిలో ఘనంగా నిర్వహించాడు. ఈ పెళ్లికి బాదల్ తరుఫున అతని గ్రామం నుంచి విజయ పటేల్, ఆదిత్య పటేల్, పితమ్ పటేట్, దేవి సింగ్ పటేల్, ఆశోక్ పటేల్, రాజు పటేల్, పురుషోత్తం శివన్య, సునీల్ పటేల్, విమేలేష్ పటేల తదితరులంతా హాజరయ్యారు. ఈ వింత పెళ్లిలో బరాత్ కూడా నిర్వహించడం విశేషం. ప్రస్తుతం అక్కడి గ్రామస్తులు ఈ పెళ్లి గురించే కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. (చదవండి: 17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..) -
ఆ కథ.. తీరని వ్యథ.. ‘సిరివెన్నెల’పై కళాతపస్వి మానసిక సంఘర్షణ
భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకుని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి కె. విశ్వనాథ్ కళాతపస్వి అనిపించుకున్నారు అయన ఆవిష్కరించిన శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారాన్ని అందుకుని తెలుగుతెరపై ఒక కళాఖండంగా మిగిలిపోయింది. అలాగే, స్వాతిముత్యం, సాగరసంగమం, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల.. ఇలా ఆయన ప్రతి చిత్రం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇంతటి గొప్ప చిత్రాలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన్ని పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే తదితర అవార్డులతో సత్కరించింది. కానీ, తన సినిమాలతో ప్రేక్షకుల మనసుని తేలికపరిచే విశ్వనాథ్ మనసుని మాత్రం ఒక సినిమా చిత్రవధ చేసిందట. అదే ‘సిరివెన్నెల’ సినిమా. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మిమ్మల్ని బాగా తృప్తిపరిచిన సినిమా ఏది’ అని ప్రశ్నించగా.. విశ్వనాథ్ బదులిస్తూ, ‘కళాకారుడు అనేవాడు జీవితాంతం తృప్తి పొందడు. ఇంకా ఏదో చేయాలి, సాధించాలనే అసంతృప్తితోనే బతుకుతాడు. నేను అంతే. కానీ, నన్ను మానసికంగా చాలా సంఘర్షణకు గురిచేసిన సినిమా మాత్రం ‘సిరివెన్నెల’. అసలు ఒక మాటలు రాని అమ్మాయి ఏంటి.. కళ్లు కనబడని అబ్బాయి ఏంటి.. వారిద్దరి మధ్య సన్నివేశాలు సృష్టించడానికి నేను రాత్రి పగలు కష్టపడడం ఎందుకు? ఆ కథ ఎందుకు మొదలుపెట్టానా అని ఎంతో బాధపడ్డా. చిత్రీకరణ మధ్యలో సినిమాను ముగించలేను, ఆపేయలేను.. ఆ సమయంలో మానసికంగా ఎంతో చిత్రవధ అనుభవించా’.. అంటూ విశ్వనాథ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కట్ చేస్తే.. సిరివెన్నెల సినిమా తెలుగుతెరపై మరో కళాఖండమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Rishi Sunak: పక్కా హిందూ
‘‘నేను హిందువుని అని చెప్పుకోవడానికి గర్వపడతాను’’ అని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించారు. ఎంత ఎదిగినా తన మూలాలను ఆయన ఎన్నడూ మరచిపోలేదు. రిషి బ్రిటన్లో పుట్టి పెరిగినప్పటికీ చిన్నప్పట్నుంచి భారత సంస్కృతి సంప్రదాయలను వంటపట్టించుకున్నారు. తరచూ దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. సోమవారం ఉపవాసం చేస్తారు. గోమాంసం ముట్టరు. యూకే రాజకీయాల్లో హిందువునని చెప్పుకునే రిషి పైకి ఎదిగారు. అదే ఆయన ప్రత్యేకత. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీతపైన అపారమైన నమ్మకం. 2015లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేశారు. జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు కూడా గీతపైనే ప్రమాణం చేశారు .ప్రధానిగా లిజ్ ట్రస్తో పోటీ పడే సమయంలో ప్రచారంలోనూ శ్రీకృష్ణ జయంతి రోజున గోపూజ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ఆయన ట్వీట్లు చేశారు.రిషి ఇంగ్లీషుతో పాటు హిందీ, పంజాబీ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. సునాక్కు భారత్ పాస్పోర్టు కూడా ఉంది. బెంగుళూరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబమైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను పెళ్లి చేసుకున్న సునాక్ ఇంట్లో కూడా భారతీయ సంప్రదాయాలనే పాటిస్తారు. వారి ఇద్దరి ఆడపిల్లలు అనౌష్క, కృష్ణని కూడా భారతీయతనే నేర్పిస్తున్నారు. కుటుంబానికి అత్యంత విలువ ఇస్తారు. తన అత్తమామలు ఎప్పటికీ గర్వకారణమని చెప్పుకుంటారు. వారిని కలవడానికి తరచూ బెంగుళూరు వచ్చి వెళుతుంటారు. ప్రతీ ఏటా దీపావళిని ఘనంగా జరుపుకునే సునాక్ ప్రధానిగా దీపావళి రోజే ప్రమాణం చేయడం విశేషం. ఒక హిందువును ప్రధానిగా అంగీకరించడం ద్వారా బహుళ విశ్వాసాలు, వైవిధ్యాలను అంగీకరించగలిగే సహనం యూకే ప్రజలకు బాగా ఉందని అర్థమవుతోంది. కుటుంబ నేపథ్యం ఇదీ రిషి సునాక్ తాత రామదాస్ సునాక్ అవిభాజ్య భారత్లో పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రనవాలాకు చెందినవారు. 1935 సంవత్సరంలోనే రామదాస్ తూర్పు ఆఫ్రికాలోని నైరోబియాకి వలస వెళ్లిపోయారు. నాన్నమ్మ రాణి సునాక్ ఓ రెండేళ్లు ఢిల్లీలో ఉండి తర్వాత భర్త దగ్గరకి వెళ్లారు. రామదాస్ దంపతులకి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ 1949లో కెన్యాలో జన్మించారు. 1960లో ఆఫ్రికాలో భారతీయులపై జరిగే దాడులకు భయపడి యశ్వీర్ యువకుడిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బ్రిటన్కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. పంజాబ్ నుంచి టాంజానియా వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందిన ఉషా బెర్రీని యశ్వీర్ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల మొదటి సంతానమే రిషి సునాక్. రిషి తాత ముత్తాతలు ఉంటే గుజ్రనవాలా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండడంతో ఆ దేశం కూడా రిషి మా వాడే అని అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాణి ఎలిజబెత్–2కు భారత్ అంటే అభిమానం
లండన్: భారత్ అంటే రాణి ఎలిజబెత్–2కు ప్రత్యేకాభిమానం. బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చాక బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తు్తరాలైన తొలి పాలకురాలు ఆమే. 1952లో రాణిగా బాధ్యతలు స్వీకరించారు. భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకొనేందుకు అమితాసక్తి చూపేవారు. 1961, 1983, 1997ల్లో మూడుసార్లు భారత్ను సందర్శించారు. ‘జలియన్వాలాబాగ్’పై విచారం.. 1961లో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ దంపతులు తొలిసారిగా ఇండియా వచ్చారు. నాటి బాంబే, మద్రాస్, కలకత్తాలను సందర్శించారు. తాజ్మహల్నూ తిలకించారు. ఢిల్లీలో రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాదరక్షలు విప్పి గౌరవం చాటుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్లో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఢిల్లీలో రాంలీలా మైదానంలో నాటి ప్రధాని నెహ్రూ అధ్యక్షతన జరిగిన సభలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ భవనాన్ని ప్రారంభించారు. కామన్వెల్త్ దేశాధినేతల భేటీలో పాల్గొనేందుకు 1983లో ఎలిజబెత్ రెండోసారి భారత్ వచ్చారు. మదర్ థెరిసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేశారు. ఇక భారత 50వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1997లో భర్తతో కలిసి మూడోసారి భారత్ వచ్చారు. వలస పాలన నాటి చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ జలియన్వాలా బాగ్ ఉదంతం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అమృత్సర్లో జలియన్వాలా బాగ్ స్మారకాన్ని సందర్శించారు. కాల్పుల్లో అమరులైన వారికి నివాళులర్పించారు. ముగ్గురు భారత రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, ప్రతిభా పాటిల్కు ఇంగ్లండ్లో రాణి ఆతిథ్యమిచ్చారు. 1983లో భారత్ పర్యటన సందర్భంగా ఇందిరాగాంధీతో... -
గురుపూజోత్సవం: గురువంటే... వెలిగే దీపం
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది. సమున్నతమైనది, గౌరవప్రదమైనది. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుది. ఒక వ్యక్తి, సమాజ, జాతి నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం. ఉత్తమ గ్రంథాలన్నీ ఆచార్యుని ప్రాధాన్యతను ప్రస్తుతించాయి. ఒక జాతి ఉత్తమజాతిగా రూపొందటంలో ప్రజల గుణగణాలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. ప్రజలు శీలవంతులుగా ఉండాలంటే ప్రప్రథమంగా వారు చక్కని సంస్కార వంతులు కావాలి. ఈ గొప్ప సంస్కారం మన మనస్సుల్లో ఉద్దీపింప చేసే మహోన్నతుడే గురువు. మనకు విద్యను బోధిస్తూనే మన హృదయ సంస్కారాన్ని పెంచే యత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఒకసారి మృదువుగా, మరొకసారి కఠినంగా వ్యహరిస్తుంటాడు. ఆపై తల్లిగా లాలిస్తాడు. ప్రేమను కురిపిస్తాడు. అక్కున చేర్చుకుంటాడు. అందుకే తల్లి ప్రేమ, ఆత్మీయత; అవసరమైన వేళలో తండ్రిలా దండన, సంరక్షణల మేళవింపే గురువు. ఉత్తమగురువు తన విద్యార్థులతో ఒక స్నేహితుడిగా, వేదాంతిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాడు. చదువు ద్వారా జ్ఞానాన్ని పెంచుతూనే హృదయ సంస్కారాన్ని పెంచుతాడు. విద్యను చెప్పేవాడికే బుద్ధులు చెప్పే విశేష అధికారం, అవకాశం ఉంటాయి. ఉత్తమ గురువెన్నడూ తన ఈ గురుతర బాధ్యతను విస్మరించడు. తన ఆధిక్యతను ఎక్కడా ప్రదర్శించడు. చక్కని విద్యతోపాటు హృదయ సంస్కారం అలవడి వృద్ధి చెందే గొప్ప వాతావరణం, జ్ఞానం గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి గురువుకు ప్రసరిస్తుంది. గ్రీకు తత్త్వవేత్త, వేదాంతి, విద్యావేత్త ప్లేటో ఏథెన్స్ నగరంలో బోధనా పద్ధతిలో ఒక గొప్ప పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆయన కూడ తన విధానంలో విద్యార్థులకు పెద్ద పీట వేసాడు. అక్కడ ప్రతి లౌకిక, అలౌకిక విషయాలను, జ్ఞానం, దాని లోతుపాతులు, అది లభ్యమయ్యే మార్గాలు.. ఇలా ఎన్నో విషయాలను గురుశిష్యులు చర్చించేవారు. ఎవరి భావాలు ఉన్నతంగా ఉంటే వాటినే తీసుకునే వారు. ఇక్కడ విద్యంటే ఆలోచనల మార్పిడి. అలాగే ఈ గురుకులంలో ఎవరు ఎవరికీ బోధిస్తున్నారో చెప్పటం కష్టం. ఎవరిది గొప్ప ఆలోచనైతే దాన్నే మిగిలినవారు స్వీకరించే వారు. ఈ దేశాలలో కూడ ఒకరు ఎక్కువ, రెండవవారు తక్కువన్న ప్రసక్తే లేదు. ఎంత ఉన్నతమైన భావనో గమనించండి. ప్రాచ్య దేశాలైనా, పాశ్చాత్య దేశాలైనా గురువు విలువను, ఆయన ఆవశ్యకతను గుర్తెరిగి వర్తిస్తాయని ఆయనకు ఉన్నత స్థానాన్నిస్తాయని చెప్పటానికే ఈ ఉదాహరణ. గురువులో రవ్వంత గర్వమైనా ఉండకూడదు. అసలు పొడచూపకూడదు. మనస్సు నిర్మలమైన తటాకం కావాలి. ఇలా కావటానికి అతడు పక్షపాత రహితుడు కావాలి. అపుడే తన జ్ఞానాన్ని శిష్యులకు అందచేస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందిన శిష్యుడు దాన్ని జీర్ణించుకుని తన మేధతో మరింతగా ప్రకాశింపచేసి తరువాత తరాలవారికి అందచేస్తాడు. అలా తన శిష్యులు తన జ్ఞానవాహికలు కావటం ఏ గురువుకైనా ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎంతో ఉప్పొంగిపోతాడు. జ్ఞానపరంపరకు వారధి కనుక అతనంటే అవ్యాజమైన ప్రేమ. ఎంతో గౌరవం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో గురుశిష్యులు జ్ఞానపాయలు. ఉత్తమ గురువు కోసం శిష్యుడు ఎలా తపిస్తూ, అన్వేషిస్తాడో, గురువు కూడ అంతే. గురువు క్షేత్రమైతే శిష్యుడు విత్తు లాంటివాడు. రెండిటి మేలు కలయిక వల్లే జ్ఞానమనే బంగరు పంట పండుతుంది. గురువు ఎవరినైనా శిష్యుడి తీసుకునే ముందు అతడి జ్ఞానంతో పాటు, అతడి జ్ఞానతృష్ణనూ పరీక్షిస్తాడు. అవి తృప్తికరంగా ఉన్నప్పుడే అతనికి విద్య గరిపేవాడు. గురువు జ్ఞానధారను ఒడిసిపట్టుకున్న శిష్యుడు తన ప్రతిభతో, అనుభవంతో దానిని మరింతగా విస్తరించి భావితరాలకు అందిస్తాడు. నేటి విద్యావ్యవస్థలో ఆనాటి ప్రమాణాలు, అంతటి ఉత్తమ గురుశిష్యులు, విలువలు లేవని కొందరి గట్టి నమ్మకం. ఆరోపణ. కొంత వాస్తవం లేకపోలేదు. నేటి కాలంలోనూ బోధనావృత్తిని ఎంతో పవిత్రంగా భావించి దానిని చేపట్టి ఎంతో సమర్థంగా నిర్వహించేవారు ఉన్నారు. దానికి మరిన్ని సొబగులద్ది, మరింత గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచిన వారు, పెంచుతున్న వారు ఉన్నారు. పొందవలసిన గౌరవాన్ని పొందుతూనే ఉన్నారు. సాంకేతికాభివృద్ధి విశేషంగా పెరిగి మనకు ఎంతగానో చేరువైంది. నేటి గురువులు ఈ సాంకేతికతని అందిపుచ్చుకుని మరీ పాఠాలు చెప్పేటందుకు సంసిద్ధులవుతున్నారు. వీరి లాగానే, ఉత్తమ శిష్యులు కూడ గురువుల మాదిరిగానే తయారవుతున్నారు. కనుక నేటి అధ్యాపకులకు చాలా అప్రమత్తత ఉండాలి. తమ జ్ఞానాన్ని, బోధనానైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి. అప్రమత్తులుగా ఉంటేనే కదా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని, నాలుగు కాలాలపాటు నిలువగలిగేది. ఉత్తమ గురువు మన ఆలోచనలకు నడకలు నేర్పుతాడు. మన ఊహలకు రెక్కలనిచ్చి మనం అద్భుత ప్రపంచాలలో విహరించే శక్తినిస్తాడు. ఉత్తమ గురువు మనలోని సృజనాత్మకతను మనం గుర్తించేటట్టు చేస్తాడు. ఉత్తమ గురువు చేసే, చేయగలిగే మహాత్తర కార్యమిదే. దీనివల్ల మనకు ప్రశ్నించే అలవాటు, శోధించే తత్వం అలవడుతుంది. అందుకే ఈ గురుశిష్యుల పాత్రను జాతిని సముద్ధరింపచేసే అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా భావిస్తారు. వారి పాత్ర ఎంతో అమూల్యమైనది. అపురూపమైనది. ► మనకు తెలుసు అని అనుకున్నప్పుడు మనం నేర్చుకోవటం మానేస్తాం. ► విద్య అంతిమ లక్ష్యం ఒక స్వేచ్ఛా సృజనశీలిగా రూపొందటం. అపుడే చారిత్రక పరిస్థితులు, ప్రకృతి విపత్తులతో పోరాడగలడు. ► దేశంలో అందరికన్నా ఉపాధ్యాయుల మనస్సులు ఉత్తమమైనవిగా ఉండాలి. మన స్వీయ ఆలోచనాశక్తిని పెంపొందించటానికి సహాయపడే వాడే ఉపాధ్యాయుడు. ► విద్యావ్యవస్థకు ఉపాధ్యాయుడు వెన్నెముక. – డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ► ఏది చూడాలో చెప్పక ఎక్కడా చూడాలో మాత్రమే చెప్పేవాడు అధ్యాపకుడు. – అలెగ్జాండర్ ట్రెన్ఫర్ ► అగ్ర సింహాసనం మీదఎవరినైనా కూర్చోపెట్టదలచుకుంటే అతడు అధ్యాపకుడే. – గై కవాసాకి ► వెయ్యి రోజులు పరిశ్రమించి నేర్చుకున్న విద్యకన్నా ఒక గొప్ప అధ్యాపకుడితో ఒకరోజు గడపటం విలువైనది.– జపాన్ సామెత బోధించటమంటే మరోసారి నేర్చుకోవటం. – జోసెఫ్ జాబర్ట్ ► నేను అధ్యాపకుణ్ణి కాదు. కాని వైతాళికుణ్ణి – రాబర్ట్ ఫ్రాస్ట్ – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
‘క్లాస్ రూమ్లో గర్ల్స్, బాయ్స్ కలిసి కూర్చోవడం వల్లే అలా జరుగుతోంది’
ప్రస్తుత జనరేషన్లో కో-ఎడ్యుకేషన్ కామన్ అయిపోయింది. విద్యార్థులు జండర్ బేధం లేకుండా విద్యనభ్యసిస్తున్నారు. కాగా, కో-ఎడ్యుకేషన్పై కేరళ సీఎం పినరయి సన్నిహితుడు వెల్లపల్లి నటేశన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, వెల్లపల్లి నటేశన్ తాజాగా కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ ‘జండర్ న్యూట్రల్ పాలసీ’ గురించి స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ‘క్లాస్ రూమ్స్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడానికి మేము మద్దతు తెలపడం లేదు. భారతదేశానికి అంటూ ప్రాచీన కాలంగా ఓ సంస్కృతి ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు కౌగిలించుకోవడం, కలిసి కూర్చోవడం వంటి చర్యలను మన సంస్కృతి ఒప్పుకోదు. ఇలాంటిది మన సంస్కృతికి విరుద్ధం. మనమందరం ఇంగ్లండ్, అమెరికాలో బ్రతకడంలేదంటూ వ్యాఖ్యలు చేశారు. Girls, boys sitting together in classes against Indian culture: Kerala leader #VellappallyNatesanhttps://t.co/RsvHXARxCB — India TV (@indiatvnews) August 29, 2022 ఈ క్రమంలోనే 18 ఏళ్ల లోపు వారు లేదా కళాశాలల్లో యువకులు చదువుకుంటున్నప్పుడు ఒకరినొకరు కలిసి కూర్చుని కౌగిలించుకోకూడదని ఆయన అన్నారు. ఇలా వారు కలిసి కూర్చోవడం దేశానికే ప్రమాదకరమన్నారు. పిల్లలు పెద్దయ్యాక, పరిపక్వత వచ్చిన తర్వాత, వారు కోరుకున్నది చేయగలరని చెప్పారు. ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చుంటున్న కారణంగానే విద్యార్థులు చదువులో రాణించలేకపోతున్నారు. అలాగే, విద్యా సంస్థలు మంచి గ్రేడ్లను సాధించలేకపోతున్నాయి. దీంతో, విద్యాసంస్థలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి నిధులు పొందలేకపోతున్నాయి అని తెలిపారు. -
చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు..
న్యూఢిల్లీ: ఖజురహో నృత్యోత్సవాలు మధ్యప్రదేశ్లో జరుగుతాయని మీకు తెలుసా? పోనీ .. ఆసియా సింహాలకు ఏకైక ఆవాసం గుజరాత్లోని గిర్ అభయారణ్యమనే సంగతి తెలుసా? కొంత మందికి తెలిసి ఉండొచ్చేమో గానీ.. చాలా మంది భారతీయులకు మన దేశం, చరిత్ర, సంస్కృతి, ఆహార విహారాలు మొదలైన వాటి గురించి పెద్దగా అవగాహనే ఉండటం లేదు. మహీంద్రా హాలిడేస్ తమ 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘‘తమ దేశం గురించి, దేశ భిన్నత్వం, విస్తృతి, సంస్కృతి, వారసత్వం, వంటకాలు మొదలైన వాటి గురించి మన వారిలో అవగాహన లేమి .. ఆశ్చర్యపర్చేలా ఉంది’’ అని సర్వే పేర్కొంది. ఇందులో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మన దేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, పర్యటన స్థలాలు, వాతావరణం, ఆహారం మొదలైన వాటి గురించి తమకు అంతగా తెలియదని వెల్లడించారు. ‘‘భారతదేశ వైవిధ్యంపై అవగాహన, పరిజ్ఞానం గురించి నిర్వహించిన ఈ సర్వే ప్రకారం చాలా మందికి మన వంటకాల గురించి అతి తక్కువగా తెలుసు. నిజానికి భారతదేశానికి కాఫీని పరిచయం చేసినప్పుడు మొట్టమొదటి సారిగా కూర్గ్లో పండించిన సంగతి తెలిసిన వారి సంఖ్య మూడో వంతు కన్నా (31 శాతం) తక్కువే’’ అని సర్వే పేర్కొంది. దేశీయంగా వివిధ ప్రాంతాలను సందర్శించే కొద్దీ వివిధ రాష్ట్రాలకు సంబంధించి తమకు తెలియని సంస్కృతులు, వంటకాలు మొదలైన వాటి గురించి ఆసక్తి పెరుగుతుందని, తద్వారా భారతదేశ వైవిధ్యం గురించి అవగాహన పెంచుకోవచ్చని మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా ఎండీ కవీందర్ సింగ్ తెలిపారు. సర్వేలో మరిన్ని వివరాలు.. ► భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వంపై కూడా ప్రజల్లో అవగాహన అంతంతమాత్రమేనని సర్వేలో వెల్లడైంది. ఉదాహరణకు ఖజురహో ఉత్సవాలను మధ్యప్రదేశ్లో నిర్వహిస్తారన్న సంగతి మూడో వంతు మందికి (39 శాతం) పైగా తెలియదు. ఇక మహారాష్ట్ర .. పైఠనీ చీరలకు పెట్టింది పేరని సుమారు మూడో వంతు మంది (32 శాతం)కి తెలియదు. ► భారతదేశ భౌగోళికాంశాలపై కూడా ప్రజల్లో పరిజ్ఞానం ఒక మోస్తరుగానే ఉంది. భారతదేశంలోని గిర్ అభయారణ్యంలో మాత్రమే ఆసియా సింహాలు కనిపిస్తాయన్న విషయం మూడొంతుల మందికి (దాదాపు 39 శాతం) తెలియదు. అలాగే, ఉదయ్పూర్ను సరస్సుల నగరంగా వ్యవహరిస్తారని, చైనా వాల్ తర్వాత అత్యంత పొడవైన గోడ గల కుంభల్గఢ్ కోట .. రాజస్థాన్లో ఉందన్న సంగతి గానీ సుమారు మూడోవంతు మందికి తెలియదు. ► టెలిఫోన్, ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా మహీంద్రా హాలిడేస్ ఈ సర్వే నివేదిక రూపొందించింది. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, చండీగఢ్ తదితర 16 నగరాల నుంచి 4,039 మంది ఇందులో పాల్గొన్నారు. -
ఢిల్లీ విమానాశ్రయంలో హ్యుందాయ్ రోబోటిక్ ‘నమస్కారం’
హైదరాబాద్: భారత సంస్కృతిలో నమస్కారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎదుటివారిని ఆహ్వానిస్తూ.. పలకరిస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించడం సంప్రదాయంలో భాగం. దీన్ని గుర్తిస్తూ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యందాయ్ ఇండియా ఒక వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 మీటర్ల ఎత్తయిన నమస్కార రోబోను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు నమస్కారంతో స్వాగతం పలుకుతుంది. ఒక మనిషి చేయి, ఒక రోబో చేయి కలిసిన ప్రతిరూపంగా ఇది కనిపిస్తుందని కంపెనీ తెలిపింది. మానవత్వం, టెక్నాలజీ ఈ రెండూ కలసి మెరుగైన భవిష్యత్తుకు ప్రతిరూపమని తెలియజేయడమే దీని ఏర్పాటులోని ఉద్దేశమని పేర్కొంది. ‘‘భారత్లో మనుషులు, టెక్నాలజీ మధ్య అంతరం పూడ్చడమే హ్యుందాయ్ అసలైన విజన్. దీన్ని ప్రతిబింబించే రూపమే ఈ ఏర్పాటు’’అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూకిమ్ తెలిపారు. -
ఆయన కవిత్వం... భారతీయాత్మ స్వరూపం
‘‘మామిడి కొమ్మ మీద కల మంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మ్రొక్కి యీ యభినవ స్వరకల్పన కుద్యమిం చితిన్’’ అంటూ గత శతాబ్దంలో తెలుగులో ఆధునిక కవిత్వానికి ప్రారంభ కుడైన వాడు రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు తన సమస్త వాఙ్మయం ద్వారా భారతీయ సంస్కృతి స్వరూప స్వభావాలను సమకాలీన జనానికి పునః సాక్షాత్కరింప జేసి వాటి విలువల పరిరక్షణకు సంకల్పించినారు. మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద చేసిన విద్యాభ్యాసం ప్రాచీన వాఙ్మయంలోని మౌలిక విషయాల అవగాహనకు తోడ్పడినది. వేదాధ్యయన అధ్యాప నలకు పుట్టిల్లు అయిన ‘వెదుళ్ళపల్లి’లోని ఆయన జీవనం వేదోపనిషత్తుల యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగించినది. ఆధునిక కవులకు ‘మ్యానిఫెస్టో’గా రచించిన ‘రమ్యా లోకం’ లక్షణ గ్రంథంలో– ‘‘క్రొత్త నీరు తొల్కరి యేళ్ళ క్రుమ్మి పాఱ/ప్రాతనీరు కలంగుట బ్రమ్ముకాదు’’అని అంటారు. కాలానుగుణమైన మార్పును ఆహ్వానించవలసిందే అంటారు. ఆధునికతా పరివేషంలో నూతన అభివ్యక్తి కోసం మార్పును ఆహ్వానించిన రాయప్రోలు సంప్రదాయ సంస్కృతులను మాత్రం వదలి పెట్టలేదు. తన కవిత్వం ద్వారా రాయప్రోలు ప్రతిపాదించిన సంస్కృతీపరమైన అంశాలను మనం ఇట్లా గమనించవచ్చును – ‘‘ఏ దేశమేగిన ఎందు కాలిడినా / ఏ పీఠ మెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని / నిలుపరా నీ జాతి నిండు గౌరవమును’’అంటూ మాతృ దేశా రాధనం వ్యక్తి సంస్కృతికి నిదర్శనమని చాటినారు. అట్లే ‘‘తమ్ముడా! చెల్లెలా!’’ అంటూ సోదర సోదరీ భావంతో దేశీయమైన, జాతీయమైన సాంస్కృతిక వార సత్వాన్ని ప్రబోధించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను తెలుగువాడిగా పుట్టడమే ఒక అదృష్టంగా భావించా డాయన. ‘‘ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు / పూజ సల్పి తినో యిందు పుట్టినాడ! కలదయేని పునర్జన్మ కలుగా గాక / మధు మధు రంబయిన తెన్గు మాతృభాష.’’ ప్రతి మనిషీ భాషా తపస్సు చేయడం ద్వారా మాతృ భావనకు పునాది వేయమంటా రాయన. భాషలు వేరైనా మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయుల సాంస్కృతిక విధానం ఒక్క టేనన్నది రాయప్రోలు ఉద్దేశ్యం. అందుకే మాతృ భాషలో ఇతర భాషా పదాలు వచ్చి చేరడమన్నది ఆ భాష గొప్పదనానికి నిదర్శన మంటాడు. భారతీయ సమాజంలో కుటుంబ సంబంధాలను, మానవీయ సంబంధాలను అంటి పెట్టుకొని ఉన్న సంస్కృతి ఆధు నిక కాలంలో ప్రేమ రాహిత్యం వల్ల సంక్షోభంలో పడిపోయిందన్న ఆవేదనను రాయప్రోలు తన ‘రూపనవనీతం’లో ఇలా వ్యక్తం చేసినారు – ‘‘మానవ గాత్రమునకు మాన్పరాని గాయములు తగిలి నవి చైతన్యమంతా అనిష్టముష్టి ఘాతాలతో కాయలు కాసినవి. ప్రేమ ప్రవహింపక గడ్డలు కట్టింది... నైతిక చక్రము సవ్యాప సవ్య మార్గములు తెలియకుండా త్రిప్పినందువల్ల, ఒడుదొడు కులతో మిట్టపల్లాలతో కుంటుతుంది. గమ్యం కానరాకుండా చాటయింది.’’ ‘‘పరమ ధర్మార్థమైన దాంపత్య భక్తి’’ అనే పద్యంలో ప్రేమ అన్నది ఒక అఖండమైన పదార్థంగా అది భక్తి, రక్తి, సక్తి అని మూడు విధాలుగా అభివ్యక్త మవుతున్నదని ప్రకటించినాడు. ఈ మూడింటినీ భారతీయ సంస్కృతిలోని ప్రధానమైన అంశాలుగా వ్యాఖ్యానించవలసి ఉన్నది. ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతికి అత్యున్నత గౌరవం లభించడానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. మానవ సంస్కృతి వికాసానికి మూలమైన స్త్రీ – పురుష సంబంధాలను రాయప్రోలు తన కావ్యాలలోనూ, లక్షణ గ్రంథాలలోనూ ‘నరనారీ సంబంధం’ పేరుతో విశ్లేషించినారు. మానవులందరూ స్త్రీ పురుష భేదం చేత మౌలికంగా రెండే రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల పరస్పర సంబంధం మీదనే మానవ జీవితం, మానవ సమాజం అభివృద్ధి మార్గంలో విస్తరిస్తాయని అంటారు. ఇట్లే రాయప్రోలు సాహిత్యపరంగా రసభావనను గురించి చెప్పిన నిర్వచనము గానీ, సమాజపరంగా ఆయన ప్రతిపాదించిన నూతన సిద్ధాంతము శాంతం, శివం, సుందరం అన్నది కానీ భారతీయ సంస్కృతిలోని ప్రధాన లక్ష్యాన్ని ఆవరించుకొని చెప్పినవే. భారతీయ సంస్కృతీ సారమైన శాంతం, శివం, సుందరం అన్నవి మూడు వన్నెల జెండా వంటివనీ, ప్రతి ఒక్కరూ వాటిననుసరించి శిరసావహించి భారతీయ సంస్కృతికి గౌరవ వందనం చేయ వలసిందేనని ప్రబోధించినాడు. వ్యాసకర్త మాజీ సంచాలకులు తెలుగు అకాడమి ‘ 93901 13169 -
ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే
Priyanka Chopra Interesting Comments On India And Culture: గ్లోబల్ స్టార్ ప్రియాంక జోనాస్ ఎప్పుడూ తన సినిమాలతో బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. అలాగే తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరైన తక్కువ చేసిన ఊరుకోదు. వెంటనే కౌంటర్ ఇస్తుంది ప్రియాంక. ఇందుకు ఉదాహరణ ఇటీవల తనను 'వైఫ్ ఆఫ్ జోనాస్'గా ప్రస్తావించడమే. ప్రస్తుతం ప్రియాంక తన రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ ప్రమోషన్లో బిజీగా ఉంది. 'ది మ్యాట్రిక్స్' ఫ్రాంచైజీ నుంచి 18 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో ప్రియాంక సీత పాత్రను పోషించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన టెలివిజన్ హోస్ట్ రాషా గోయెల్తో ముచ్చటించింది ప్రియాంక. ఈ క్రమంలోనే ప్రియాంక తన మూలాలను గుర్తు చేసుకుంది. తాను ఇంటికి దూరంగా ఉన్నట్లు ఎప్పుడూ భావించలేదని చెప్పింది. అలాగే 'మీరు నన్ను భారతదేశం నుంచి బయటకు తీసుకురావచ్చు. కానీ భారతదేశాన్ని నా నుంచి వేరు చేయలేరు. నేను ఎక్కడికీ వెళ్లినా నాతోపాటు నా సంస్కృతి కూడా వస్తుంది. అందుకే నేను ఎప్పుడూ ఇంటికు (ఇండియా) దూరంగా ఉన్నట్లు భావించలేదు. నా ఇళ్లు, నా మందిరం, మా అమ్మ, నా ఆచారాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. కాబట్టి నేను బాగానే ఉన్నాను. ఇలా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను.' అని చెప్పుకొచ్చింది ప్రియాంక జోనాస్. ప్రియాంక, నిక్ జోనాస్ను వివాహం చేసుకున్న తర్వాత యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో నివసిస్తోంది. ఇప్పుడు ఇది చాలా వ్యూహాత్మకంగా ఉందని భావిస్తున్నట్లు ప్రియాంక తెలిపింది. అలాగే రెండు పరిశ్రమలను (బాలీవుడ్, హాలీవుడ్) బ్యాలెన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఎందుకంటే అలా చేయగలిగే నటులు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ మంది ఉన్నారని ప్రియాంక అభిప్రాయపడింది. So much love for @priyankachopra and seeing her be a part of this franchise. not often South Asian actors get booked in these parts. Talked about her exp on set and how the Indian culture is always with her. ❤️Always fearless in her endeavors. #southasian #PriyankaChopraJonas pic.twitter.com/slRA0fbCfd — Rasha Goel (@RashaGoel) December 16, 2021 ఇదీ చదవండి: 'నిక్ జోనాస్ వైఫ్' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్.. -
Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ హర్నాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?
Interesting Facts About Harnaaz Sandhu: ప్రపంచం ఎదుట భారతీయ సౌందర్యం మరోసారి మెరుపు నవ్వు నవ్వింది. ప్రపంచం ఎదుట భారతీయ సంస్కారం మరోసారి తన ఎరుకను ప్రదర్శించింది. ప్రపంచం ఎదుట భారతీయ స్త్రీ సౌందర్యకాంక్ష తన శిరస్సు మీదకు జయ కిరీటాన్ని ఆహ్వానించింది. చండీగఢ్కు చెందిన హర్నాజ్ సంధు ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుంది. 21 ఏళ్ల హర్నాజ్ 2021లో 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మరోసారి ఈ కిరీటాన్ని దేశానికి తెచ్చింది. ‘చక్ దే ఫట్టే ఇండియా’ అని కేరింతలు కొట్టింది హర్నాజ్ కిరీటం గెలిచాక. అంటే ‘సాధించు. గెలుపు సాధించు ఇండియా’ అని అర్థం. నేడు ఇండియా గెలిచింది. ‘విశ్వసుందరి’ మిస్ ఇండియా హర్నాజ్ సంధు (మధ్యలో) ఇరువైపులా రన్నరప్స్ పరాగ్వేకు చెందిన మిస్ నాడియా, సౌతాఫ్రికాకు చెందిన మిస్ లలేలా డిసెంబర్ 12న (మన తేదీ ప్రకారం 13 తెల్లవారుజామున) భారతీయురాలైన హర్నాజ్ సంధు తల మీద విశ్వసుందరి కిరీటం తళుక్కున మెరిసింది. ప్రపంచమంతా కరతాళధ్వనులు మోగిస్తుండగా దేశం అందమైన ఈ విజయంతో ఉత్సాహంగా నిద్ర లేచింది.1994లో సుస్మితా సేన్ మొదటిసారి ఈ టైటిల్ గెలిచి స్ఫూర్తి ఇచ్చాక 2000లో లారా దత్తా రెండోసారి గెలిచాక మూడోసారి టైటిల్కై సాగుతున్న ఎదురుచూపులకు అడ్డుకట్ట వేస్తూ హర్నాజ్ ఈ సౌందర్యాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇజ్రాయిల్ రేవు పట్టణం ఐలత్లో తాత్కాలికంగా నిర్మించిన భారీ ప్రాంగణంలో సుప్రసిద్ధ వ్యాఖ్యాత స్టీవ్ హార్వే హోస్ట్గా జరిగిన ఈ విశ్వ పోటీలో 80 దేశాల పోటీదారులను దాటి హర్నాజ్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. ఎర్రసముద్రం మురిసిపోయింది ఎర్రసముద్రం ఒడ్డు మీద ఉన్న 50 వేల జనాభా కలిగిన ఐలత్ పట్టణంలో హర్నాజ్ విజయంతో భారత్ పేరు మార్మోగింది. ఎవరీ అందగత్తె అని ఎర్రసముద్రం తొంగి చూసి మురిసిపోయింది. ‘భారతీయ సౌందర్యానికి నేను బెస్ట్ వెర్షన్ని’ అని పోటీలకు వెళ్లబోతూ వ్యాఖ్యానించిన హెర్నాజ్ 80 దేశాల అందగత్తెలతో తలపడి ముందు టాప్ 16లో ఆ తర్వాత టాప్ 10లో ఆపైన టాప్ 5లో వెళ్లి టైటిల్ మీద ఆశలు రేపింది. టాప్-3లోకి రాగానే ఉత్కంఠ నెలకొంది. చివరి ఇద్దరిలో పరాగ్వే దేశ పోటీదారైన నాడియా చేతులు పట్టుకుని అంతిమ ఫలితం కోసం నిలుచున్న హెర్నాజ్ ‘ఇండియా’ అన్న ప్రకటన వెలువడిన వెంటనే ఆనందబాష్పాలు రాల్చింది. సెకండ్ రన్నర్ అప్గా సౌత్ ఆఫ్రికాకు చెందిన లలేలా నిలిచింది. సౌందర్యంతో పాటు చైతన్యం కూడా అందాల పోటీలో భాగంగా ప్రశ్న–జవాబు ఘట్టంలో లాటరీ ద్వారా ‘గ్లోబల్ వార్మింగ్’ అంశం తన వంతుకు రాగా హర్నాజ్ చైతన్యవంతమైన జవాబు చెప్పింది. ‘ఒకనాడు మనకు మన జీవితం సాక్షాత్కరిస్తుంది. అది వీక్షించదగ్గదిగా ఉండాలని మనం అనుకుంటాం. కాని పర్యావరణానికి మనం చేస్తున్న అవమానకరమైన కీడు వల్ల ఆ జీవితం మనం ఆశించినట్టుగా ఉండదు. ప్రకృతి మరణిస్తుంది. ఇప్పటికైనా ఈ చేటును మనం నివారించగలం. కనీసం అక్కర్లేని లైట్లను ఈ రాత్రి నుంచే ఆఫ్ చేయడం మొదలెడదాం’ అంది. అలాగే ‘నేటి యువతులు ఎదుర్కొంటున్న వొత్తిడిని మీరెలా చూస్తారు’ అనే ప్రశ్నకు ‘నేటి యువతులకు అన్ని శక్తులూ ఉన్నాయి. కాని వారికి వారి పైన నమ్మకం లేదు. ఇతరులతో పోల్చుకుని న్యూనత చెందుతున్నారు. మీరు మీలాగే ఉండటం మీ ప్రత్యేకత అని తెలుసుకోవాలి’ అంటూ సమాధానం చెప్పింది. ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్కు విశ్వకిరీటం దక్కగానే తొలి భారతీయ విశ్వసుందరి సుస్మితాసేన్ తన సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ‘ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ’ అని వ్యాఖ్యానించింది. ఇక లారాదత్తా అయితే ‘విశ్వసుందరుల క్లబ్లోకి ఆహ్వానం. ఈ విజయం కోసం 21 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్ చేసింది. నిన్న మొన్నటి వరకూ ఒకటి రెండు పంజాబీ సినిమాల్లో నటించింది సంధు. బహుశా అతి త్వరలో ఆమెను బాలీవుడ్ తెర మీద చూడొచ్చు. మధ్యతరగతి విజయం ‘హర్నాజ్ మధ్యతరగతి అమ్మాయి. మధ్యతరగతి అమ్మాయిలు కలలు కని సాధించుకోవచ్చు అనడానికి ఉదాహరణ’ అంటుంది హర్నాజ్ తల్లి రవిందర్ సంధు. ఆమె గైనకాలజిస్ట్గా పని చేస్తున్నారు. హర్నాజ్ తండ్రి పేరు పి.ఎస్.సంధు. ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు హరూన్. వీరి కుటుంబం చండీగడ్లోని మోహలీలో ఉంటుంది. ఒకవైపు అందాలపోటీ జరుగుతుంటే హర్నాజ్ తల్లి దగ్గరలో ఉన్న గురుద్వార్లో రాత్రంతా ప్రార్థనలో కూచుంది. తెల్లవారుజామున హర్నాజ్ టైటిల్ గెలవడం చూసి సోదరుడు హరూన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గురుద్వారాలోని తల్లికి ఈ విషయం తెలియచేశాడు. ‘నా కూతురు తిరిగి రావడంతోటే ఆమెకు ఇష్టమైన ‘మక్కికి రోటీ’, ‘సర్సన్ ద సాగ్’ చేసి పెడతాను’ అంది తల్లి ఉత్సాహంగా. హర్నాజ్ చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేది. సాటి విద్యార్థుల గేలి ఎదుర్కొనేది. అయినా సరే టీనేజ్లోకి వచ్చాక అందాలపోటీ పట్ల ఆసక్తి పెంచుకుంది. 2017లో ‘మిస్ పంజాబ్’ టైటిల్ గెలుచుకుంది. 2019లో ‘మిస్ ఇండియా’లో సెమీ ఫైనలిస్ట్ దశకు చేరుకుంది. ‘అప్పుడు అర్థమైంది నాకు అందాల పోటీ అంటే కేవలం అందంగా కనిపించడం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అని. విశ్వ కిరీటం సాధించడానికి ఆ విధంగా నేను సిద్ధమయ్యాను.’ అంటుంది సంధు. కుటుంబ సభ్యులతో హర్నాజ్ The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 -
సమాజాన్ని ఏకం చేసే శక్తి సంస్కృతిదే
సాక్షి, హైదరాబాద్: కుల, ప్రాంత, వర్గాలకు అతీతంగా సమాజాన్ని ఒకచోటకు చేర్చగలిగే శక్తి సంస్కృతికి ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్–బలయ్ కార్యక్రమమని, అస్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటు దేశ సాంస్కతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యత అని తెలిపారు. ఆదివారం నెక్లెస్రోడ్డులోని జలవిహార్లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రే య ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దత్తన్న అలయ్ బలయ్–దసరా సమ్మేళన్’కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మా ట్లాడుతూ, భారతదేశానికే ప్రత్యేకమైన అస్తిత్వం ఇంకా నిలబడి ఉండడానికి కారణం మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణేనని అలయ్–బలయ్ కూడా అలాంటి కార్యక్రమమేనని తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్ర, విజ్ఞాన, పరిశోధన రంగాల్లో విశేష కృషి జరిపినందుకుగాను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి, రెడ్డిలాబ్స్ ఎండీ జీవీ ప్రసాద్రెడ్డి, బయోలాజికల్ ఈవాన్స్ మహీమా దాట్లను నిర్వాహకుల తరఫున ఉపరాష్ట్రపతి సన్మానించారు. సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేసుకునేందుకే: దత్తాత్రేయ భిన్న సంస్కృతులు, ఆచారాలు, భావజాలాలున్నా అందరూ ఆత్మీయంగా ఒకచోట కూడి ఆడిపాడి, భిన్నరుచులతో కూడిన భోజనం చేయడం, మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకోవడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, అక్కడి నుంచి మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం ఉండడంతో రాలేకపోయారని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వారంతా శత్రువులు కాదు రాజకీయాల్లో ఉన్న వారంతా శత్రువులు కాదని, రాజకీయ ప్రత్యర్థులం మాత్రమేనని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. అందరూ ఐకమత్యంగా ఉండాలన్న భావనతోనే బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. భిన్నసంస్కృతులు, ఆచారాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఇలాంటి ఉత్సవాలను ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహించాల్సిన అవసరం ఉందని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లెకర్ అన్నారు. హైదరాబాద్లో జరిగే అలయ్ బలయ్ వంటి ఉత్సవాలు దేశంలోనే ఎక్కడా జరగవని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంచికి, సహృదయతకు దత్తాత్రేయ ప్రతిరూపంగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ప్రాంతీయతలు, ఎజెండాలకు అతీతంగా భాషలు వేరైనా మనమంతా ఒక్కటేననే సంస్కృతిని దత్తాత్రేయ ముందుకు తీసుకెళుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ అన్నారు. బండారు దత్తాత్రేయ సతీమణి వసంత, ఆహ్వాన కమిటీ తరఫున దత్తాత్రేయ వియ్యంకులు బి.జనార్దనరెడ్డి, బండారు విజయలక్ష్మి–డాక్టర్ జిగ్నేష్రెడ్డి దంపతులు, చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా కెప్టెన్ రేష్మా రెజ్వాన్, డా.షేక్ హసీనా, గాయకురాలు మధుప్రియ, అనూహ్యరెడ్డి, ప్రవీణ్కుమార్ గోరకవిలను ఈ సందర్భంగా సన్మానించారు. పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు... శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్ ఎం.భూపాల్రెడ్డి, రాష్ట్ర హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, సినీనటులు మంచు విష్ణు, కోట శ్రీనివాసరావు, ఎంపీ కె.కేశవరావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, వి.హనుమంతరావు, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి, ఏపీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం.రఘునందన్రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్, బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలయ్–బలయ్ కార్యక్రమంలో కోలాటమాడుతున్న గవర్నర్లు దత్తాత్రేయ, తమిళిసై. చిత్రంలో దత్తాత్రేయ కుమార్తె.. -
నాసా ఇంటెర్న్.. ఇష్ట దైవాలు
‘నాసా’ ఇంటెర్న్గా శిక్షణ పొందుతున్న భారత సంతతి అమెరికన్ ప్రతిమా రాయ్ నాసా లోగో ఉన్న షర్ట్ వేసుకుని, తన డెస్క్టాప్ వెనుక హైందవ దేవతల విగ్రహాలు కనిపించేలా తీయించుకున్న ఫొటో ఇంటర్నెట్ను ఇప్పుడు మంత్రముగ్ధం చేస్తోంది. నిజానికి ఆ ఫొటోను ఆమె షేర్ చేయలేదు. కొత్త అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించే ప్రకటనకు నాసా ఉపయోగించిన నలుగురు ఇంటెర్న్ ఫొటోలలో ఈ ఫొటో కూడా ఉంది. ‘మా దగ్గర శిక్షణ పొందదలచిన ఔత్సాహిక వ్యోమగాములకు గడువు తేదీ దగ్గర పడింది’ అని గుర్తు చేస్తూ ఈ నెల 10 న నాసా ఆ ఫొటోలను ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. వాటిల్లో ఒకటైన ప్రతిమ ఫొటో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఉంది. అదే సమయంలో శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు సంకేతంగా ఆమె వేసుకున్న షర్ట్ ప్రతిఫలిస్తోంది. ఈ వైరుధ్యంపై నెటిజన్లు మొదట ప్రతికూలంగా స్పందించినప్పటికీ.. మెల్లిమెల్లిగా ప్రతిమకు మద్దతు లభించడం ఆరంభమైంది. సైన్స్కు, విశ్వాసాలకు పొంతన ఏమిటి అనే ప్రశ్న కన్నా.. ఒక దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రతిమ ఫొటో చక్కగా ఉన్నదన్న సమర్థింపులే ఎక్కువగా పోస్ట్ అవుతున్నాయి. అలా ఫొటో తీయించుకున్న ప్రతిమకు, ఆ ఫొటోనే ఏరి కోరి షేర్ చేసిన నాసాకు ప్రశంసలు లభిస్తున్నాయి. -
ప్లీజ్.. సంప్రదాయ దుస్తుల్లో రండి: షిర్డి
ముంబై: బాబా దర్శనానికి వచ్చే వారు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా షిర్డి సాయిబాబా ఆలయ ట్రస్టు నిర్వహకులు భక్తులను అభ్యర్థించారు. ఇది కేవలం అభ్యర్థన మాత్రమే అని.. భక్తులపై ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే మాట్లాడుతూ.. ‘బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే గతంలో కొందరి వస్త్రధారణ పట్ల పలవురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకర దుస్తులు ధరించి ఆలయంలోకి వచ్చారని కొందరు ఫిర్యాదు చేశారు. అందుకే ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. కనుక మోడర్న్ దుసుల్లో వచ్చే వారికి మా విజ్ఞప్తి ఇదే.. దయచేసి భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రండి. ఇది కేవలం విన్నపం మాత్రమే. భక్తుల మీద ఎలాంటి డ్రెస్ కోడ్ విధంచలేదు’ అని తెలిపారు. (చదవండి: సమసిన షిర్డీ వివాదం) -
చీరకట్టు కేవలం అలంకారం కోసమే కాదు..
జూబ్లీహిల్స్: భారతీయ మహిళల చీరకట్టు కేవలం అలంకారం కోసమే కాదు. వారి ఆత్మగౌరవం పెంచడంలో, చక్కటి స్ఫూర్తిని ఇవ్వడంతో పాటు ఒక విలక్షణ ఉనికిని చాటుతాయని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ అన్నారు. ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం “ద ఫ్యూచర్ ఆఫ్ లగ్జరీ అండ్ ద మేకిన్ ఇండియా’ పేరుతో నిర్వహించిన వెబ్నార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన డిజైన్ ఎంతో సరళంగా ఉంటుందన్నారు. దుస్తులు మనిషి మేధకు పొడిగింపులాంటిదన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ మాజీ జాతీయ అధ్యక్షురాలు పింకీరెడ్డి, ఎఫ్ఎల్ఓ చాప్టర్ అధ్యక్షురాలు సుధారాణి సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఓగ్ ఇండియా మేగజైన్ ఎడిటర్ ప్రియాతన్నా సంధానకర్తగా వ్యవహరించారు. ప్రముఖ డిజైనర్ సవ్యసాచితో వెబ్నార్ దృశ్యం.. -
కోమేషా కరోనా
ఉహురు కెన్యాట్టా – కెన్యా అధ్యక్షుడు, మార్గరెట్ వాంజిరు గకువో – కెన్యా తొలి మహిళ, వాళ్ల ముందు భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి ప్రసంగించారు ఓ మహిళ. మన వివాహ వ్యవస్థను చప్పట్లతో అభినందిస్తూ మళ్లీ మళ్లీ విన్నారు వాళ్లు. కెన్యాలో ఉన్న హిందువుల పెళ్లిని నిర్ధారించాల్సిన బాధ్యత ఆమెకే అప్పగించారు. ఇప్పుడు... దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తున్నాయి... యుద్ధానికి దేశాన్ని సన్నద్ధం చేయాల్సిన బాధ్యతనూ ఆమె భుజాల మీదనే పెట్టింది కెన్యా. ఇప్పుడామె... ఆ దేశంలో వాళ్లకు మన నమస్కారాన్ని నేర్పిస్తున్నారు. చిలుక పచ్చ బోర్డరున్న నేవీ బ్లూ చేనేత చీర కట్టుకుని, చెవులకు బుట్ట జూకాలు ధరించిన ఓ అచ్చమైన తెలుగింటి మహిళ చక్కటి ఇంగ్లిష్లో మాట్లాడి చివరగా స్వాహిలి భాషలో ‘కోమేషా కరోనా’ అంటూ నమస్కారంతో పూర్తి చేశారు. కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కెన్యా దేశ ప్రజలకు వివరించడానికి రూపొందించిన వీడియో అది. ఇరవై ఏడేళ్ల కిందట భర్త ఉద్యోగ రీత్యా ఆరు నెలలు మాత్రమే ఉండడానికి కెన్యాలో అడుగుపెట్టారు కోటంరాజు సుజాత. ‘ఇరవై ఏడు క్యాలెండర్లు మారినా నాకింకా ఆరు నెలలు పూర్తికాలేద’న్నారామె నవ్వుతూ. స్వాహిలి భాష నేర్చుకుని కెన్యా ప్రజలతో మమేకమైపోయారామె. కరోనాసంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కెన్యా తీసుకుంటున్న రక్షణ చర్యల్లో భాగంగా ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ సుజాత దగ్గరకు వచ్చింది. భౌతికదూరం పాటించడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం, షేక్హ్యాండ్కు బదులు నమస్కారం చేయడం ద్వారా కరోనాను దూరంగా ఉంచవచ్చనే సందేశాన్ని సుజాత మాటల్లో చెప్పించుకుంది కెన్యా. ఆ దేశ టీవీల్లో ఆమె సందేశమిచ్చిన వీడియో ప్రసారమవుతోంది. బందరమ్మాయి కోటంరాజు సుజాత పుట్టింది, పెరిగింది మచిలీపట్నంలో. పెళ్లి తరవాత హైదరాబాద్కి వచ్చి చైల్డ్ సైకాలజీలో కోర్సు చేశారు. భర్త కోటంరాజు రుద్రప్రసాద్ బరోడాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న రోజులవి. ఉద్యోగంలో భాగంగా కెన్యాకు వెళ్లాల్సి వచ్చింది. ఆ దేశం వెళ్లడానికి మొదట్లో ఏ మాత్రం ఇష్టపడని సుజాత... కొన్నాళ్ల తర్వాత అయిష్టంగానే కెన్యాలో అడుగుపెట్టారు. అది కూడా ఆరునెలల్లో వచ్చేయవచ్చనుకుంటూ విమానం ఎక్కారు. ఆ తర్వాత ఆమె ఇండియాకి వచ్చింది ప్రసవం కోసమే. ‘గృహిణిగా కెన్యాలో అడుగుపెట్టిన సుజాత... ఇప్పుడక్కడ కీలకమైన బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నారు. కెన్యా సమాజ నిర్మాణంలో కూడా ఆమె సేవలందిస్తున్నారు. జర్మనీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన అంతర్జాతీయ శాంతిసదస్సుకు కెన్యాప్రతినిధిగా హాజరయ్యారు. ‘ఆఫ్రికా ఉమెన్ ఫెయిత్ నెట్వర్క్’, కెన్యా హెల్త్కేర్, లేబర్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, యాంటీ కరప్షన్ స్టీరింగ్ కమిటీలలో మెంబరుగా విశేషంగా సేవలందిస్తున్నారు. కెన్యాలోని హిందూ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ, సత్యసాయి సేవా సమితి వైస్ప్రెసిడెంట్గా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కరోనా భూతాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో ఉపాధికి దూరమైన వాళ్లను ఆదుకోవడానికి కెన్యాలో ఉన్న హిందూ కౌన్సిల్ ప్రభుత్వానికి వంద మిలియన్ షిల్లింగులను (సుమారు ఏడు కోట్ల పదిలక్షల రూపాయలు) విరాళంగా ఇవ్వడంలో సుజాత చొరవ ప్రధానమైనది. ఇవి కాకుండా స్వయంగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, హెచ్ఐవి బాధితుల శరణాలయాలకు వెళ్లి విరాళాలను పంపిణీ చేశారామె. మనవాళ్లే స్ఫూర్తి ‘‘1992లో మా వారు కెన్యాలో కొంతకాలం పని చేయాలని చెప్పగానే ప్రపంచ పటం తీసుకుని కెన్యా ఎక్కడ ఉందోనని చూసుకున్నాను. అన్యమనస్కంగానే బయలుదేరాను. అప్పటికి కెరీర్ ప్లాన్లు కూడా ఏమీ లేవు. అక్కడికి వెళ్లిన తర్వాత నాలో మార్పు వచ్చింది. సమాజాన్ని చూసే దృక్కోణం మారిపోయింది. కెన్యాలో నూరుశాతం అక్షరాస్యత ఉంది. ఇళ్లలో పని చేయడానికి వచ్చిన వాళ్లు కూడా మంచి ఇంగ్లిష్ మాట్లాడతారు. రెండు–మూడు తరాల కిందట మనదేశం నుంచి వెళ్లిన అనేక కుటుంబాలు నాలో ఇండిపెండెంట్గా జీవించగలగాలనే కోరిక కలిగించాయి. ముఖ్యంగా గుజరాత్ వాళ్లయితే ముసలి వాళ్లు కూడా సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుని వస్తుంటారు. దాంతో నేను ఇండియాలో చదివిన మాంటిస్సోరీ చైల్డ్ సైకాలజీలోనే అడ్వాన్స్డ్ కోర్సు చేసి అదే విద్యాసంస్థలో టీచర్గా చేరాను. పిల్లలతోపాటు నేనూ స్కూలుకెళ్లేదాన్ని. కొన్నేళ్లకు మా వారు ఉద్యోగం మానేసి నైరోబీ (కెన్యా రాజధాని)లో సొంత వ్యాపారం మొదలు పెట్టారు. తరచూ మారిపోయే ఉద్యోగులతో ఆయనకు ఇబ్బంది ఎదురవుతుండేది. దాంతో నేను టీచర్ ఉద్యోగం మానేసి మా సంస్థలో హెచ్ఆర్, అకౌంట్స్ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టాను. సంస్థ నిర్వహణలో నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయమేమిటంటే... కరోనా లాక్డౌన్ కారణంగా పనులు ఆగిపోవడంతో అనేక కంపెనీలు ఉద్యోగాల కోత, జీతాల కోతను ఆశ్రయిస్తున్నాయి. కానీ నేను ఆ పని చేయలేదు. కెన్యా భాష స్వాహిలి నేను సరదాగా స్వాహిలి భాష నేర్చుకున్నాను. నేను మాట్లాడే స్వాహిలి విన్న వాళ్లు నేను కెన్యాలో పుట్టి పెరిగాననుకుంటారు. వాళ్ల భాష నేర్చుకోవడం వల్ల స్థానికంగా సామాజిక కార్యక్రమాల నిర్వహణలో వాళ్లతో సులభంగా కలిసిపోగలిగాను. ప్రస్తుతం కెన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి కరోనా నియంత్రణ, నివారణ కోసం పని చేస్తున్నాను. చాలా బాగా కట్టడి చేయగలిగామనే చెప్పాలి. మా దగ్గర కోవిడ్ కేసులు పదకొండు వందల దగ్గరే ఆగిపోయాయి. మరణాలు యాభై దాటలేదు’’ అన్నారు సుజాత. రెండూ సొంత దేశాలే మన భారతదేశంలో పుట్టి, కెన్యా గురించి మాట్లాడేటప్పుడు ‘మా దగ్గర’ అన్నారామె. అంతగా ఆ దేశంతో మమేకమైపోయారు సుజాత. ‘‘మరి ఈ దేశం (కెన్యా) మాకు పౌరసత్వం కూడా ఇచ్చింది. ‘మా’ అనుకోకుండా ఉండలేను. ఇండియా ఎంతో నాకు కెన్యా కూడా అంతే’’ అన్నారు సుజాత. కరోనా తగ్గిన తర్వాత ఫ్రాన్స్లో ఉన్న పెద్ద కొడుకు, యూఎస్లో ఉన్న చిన్న కొడుకుకీ సెలవు చూసుకుని అందరం ఒకసారి ఇండియాకి రావాలని ఉందన్నారామె. – వాకా మంజులారెడ్డి ‘కరోనాను కట్టడి చేద్దాం’ అని కెన్యా ప్రజలకు పిలుపునిస్తున్న కోటంరాజు సుజాత -
తెల్లని దుస్తుల్లో రాజహంసలా..
అహ్మదాబాద్: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. ఒకప్పటి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ కూడా. భారత్ పర్యటన సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో వస్తారా లేదానని యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అమెరికా నుంచి అహ్మదాబాద్కి వచ్చిన ఎయిర్ఫోర్స్ వన్ విమానం నుంచి మెలానియా తనకు ఎంతో ఇష్టమైన తెలుపు రంగు దుస్తుల్లో ఒక రాజహంసలా కిందకి దిగారు. తెల్లని జంప్ సూట్ ధరించి నడుం చుట్టూ ఆకుపచ్చని రంగు సాష్ (ఫ్యాషన్ కోసం ధరించేది) అందంగా చుట్టుకున్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా, మన దేశీ టచ్తో రూపొందించిన డ్రెస్ ధరించడం అందరినీ ముగ్ధుల్ని చేసింది. జుట్టును లూజ్గా వదిలేసి అతి కొద్దిగా మేకప్ వేసుకొని తన సహజ సౌందర్యంతోనే ఆమె మెరిసిపోయారు. స్వయంగా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మెలానియా సాధారణంగా తన దుస్తుల్ని తానే డిజైన్ చేసుకుంటారు. కానీభారత్ పర్యటన కోసం ప్రముఖ ఫ్రెంచ్ అమెరికన్ డిజైనర్ హెర్వ్ పెయిరె డిజైన్ చేసిన సూట్ని ధరించారు. పాల నురుగులాంటి తెల్లటి జంప్ సూట్ వేసుకొని, ఆకుపచ్చ రంగు పట్టు మీద బంగారం జరీ ఎంబ్రాయిడీతో చేసిన దుప్పట్టాను చుట్టుకున్నారు. భారత్ వస్త్ర పరిశ్రమకు చెందిన 20 శతాబ్దం నాటి తొలి రోజుల్లో డిజైన్లను ఆకుపచ్చ రంగు దుప్పట్టాపై చిత్రీకరించినట్టుగా హెర్వ్ పెయిర్ తన ఇన్స్ట్రాగామ్ అకౌంట్లో వెల్లడించారు. తన మిత్రులు పంపించిన కొన్ని డాక్యుమెంట్లని చూసి అత్యంత శ్రద్ధతో ఆకుపచ్చ రంగు సాష్ను తయారు చేసినట్టు తెలిపారు. మెలానియా ధరించిన డ్రెస్పై ట్విటర్లో ప్రశంసలే వచ్చాయి. కొందరు హాస్యఛలోక్తుల్ని కూడా విసిరారు. అందానికే అందంలా ఉండే మెలానియా కొంటె కుర్రాళ్ల బారి నుంచి తనని తాను కాపాడుకోవడానికి కరాటే డ్రెస్ తరహాలో దుస్తులు ధరించారని కామెంట్లు చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ డార్క్ కలర్ సూట్ , పసుపు రంగు టై ధరించారు. మన భారతీయు వాతావరణానికి తగ్గట్టుగా వారి దుస్తుల్ని డిజైన్ చేశారు. -
భళా బెలుం
కోవెలకుంట్ల/కొలిమిగుండ్ల: భారతీయ సంస్కృతిలో గుహలకు ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్లు, దేవతలకు గుహలు నివాసమని కొందరు నమ్మితే.. మరికొందరు ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లుగా గుర్తిస్తారు. అందుకే అవి పవిత్ర స్థలాలుగా, పర్యాటక స్థలాలుగా విలసిల్లుతున్నాయి. సాధారణంగా గుహలు కొండ చరియల్లో, అడవుల్లో ఎక్కువగా కన్పిస్తాయి. దీనికి భిన్నంగా సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమి లోపల ఏర్పడిన గుహలు కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. కొలిమిగుండ్ల మండలం బెలుం సమీపంలోని ఈ గుహలు ప్రపంచంలోనే రెండో అంతర్భూభాగ గుహలుగా, దేశంలోనే పొడవైనవిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఈ నేపథ్యంలో బెలుం గుహల విశేషాలు తెలుసుకుందాం. గుహల ఉనికిని చాటిన ఆంగ్లేయుడు 1884వ సంవత్సరంలో హెచ్బీ ఫూటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా బెలుం గుహల ఉనికిని చాటినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తర్వాత వందేళ్ల వరకు వీటి ప్రస్తావన లేదు. 1982–1984 మధ్య కాలంలో హెచ్డీ గేబర్ అనే జర్మనీ దేశస్తుడు ఇక్కడకు వచ్చి 3,225 మీటర్ల వరకు శోధించి ఒక పటాన్ని తయారు చేశాడు. వీరికి స్థానికులైన అప్పటి రిటైర్డ్ ఎస్పీ చలపతిరెడ్డి, ఆయన అల్లుడు రామసుబ్బారెడ్డి పూర్తి సహకారం అందించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ ఈ గుహలను రక్షిత స్థలంగా ప్రకటించి కొన్నేళ్లపాటు కాపాలాదారుని నియమించింది. ఇక్కడ క్రీ.పూ. 450 సంవత్సరాల కాలం నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు, రాతి కత్తి లభ్యం కావడంతో ఈ గుహలను కూడా ఆనాటి మానవులు నివాస స్థలాలుగా వినియోగించుకున్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. వీటిని అనంతపురం మ్యూజియంలో భద్రపరిచారు. 1999లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ బెలుం గుహలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ఆధీనంలోకి తీసుకుంది. 2003 నుంచి బెలుం గుహల సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. సొరంగ మార్గాల్లో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున మట్టి దిబ్బలను తొలగించి నాపరాళ్లు పరిచి నడక దారిని ఏర్పాటు చేశారు. విశేషాలివీ - బెలుం గుహల్లో 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల లోతు వరకు రకరకాలుగా ఉన్న ఈ సొరంగాలు కొన్నిచోట్ల ఇరుకుగాను, మరికొన్నిచోట్ల విశాలమైన గదులుగాను ఉండి కొన్నిచోట్ల స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు అనబడే స్ఫటికాకృతులు ఏర్పడి ఉన్నాయి. - ఈ శిలల ఆకృతుల ఆధారంగా కొన్ని ప్రదేశాలకు వేయి పడగలు, కోటి లింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం, వంటి పేర్లు పెట్టారు. - ఇవికాకుండా ధ్యానమందిరం, మండపం, కప్పులో ఉన్న బొంగరపు గుంతలు, గుహల చివరి వరకు పోతే పాతాళగంగ అనే నీటి మడుగు అక్కడే రాతిలో మలచిన శివలింగం ఉన్నాయి. - విద్యుద్దీప కాంతులతో ఈ సొరంగ సోయాగాలను తిలకిస్తూ లోపలికి వెళ్లే కొద్దీ మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. - గుహల్లో ఉండే నీటికి, బెలుం గ్రామంలోని శివాలయం పక్కనే నిటారు దారులు కలిగిన రాతిబావిలోని నీటిమట్టంకు సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు చోట్లా ఎప్పుడూ నీటి మట్టాలు సమానంగా ఉంటాయని పేర్కొంటున్నారు. పెరుగుతున్న సందర్శకుల తాకిడి ప్రతి శని, ఆదివారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు రోజుల్లో బెలుం గుహలకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు విదేశీయులు బెలుం గుహలను సందర్శిస్తున్నారు. పెద్దలకు రూ. 65, పిల్లలకు రూ. 45 ప్రకారం నామమాత్రపు రుసుం వసూలు చేస్తున్నారు. తద్వారా టూరిజం శాఖకు ఏటా రూ. 1.79 కోట్ల ఆదాయం చేకూరుతోంది. గుహల ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఇక్కడ తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషలు తెలిసిన తెలుగు గైడ్లు అందుబాటులో ఉన్నారు. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాల కంటే బెలుం గుహల నుంచి టూరిజం శాఖకు అధిక ఆదాయం చేకూరుతుండటం విశేషం. -
పరమహంస యోగానంద
సాధారణమైన వ్యక్తుల కథ కేవలం అక్షరాలతో తయారవుతుంది. కాని యోగుల ఆత్మకథలు మాత్రం అనుభవాలతో కూడి తరువాతి తరాలకు మార్గదర్శకాలవుతాయి. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. భారతీయ సంస్కృతికి గౌరవాన్ని ఇనుమడింపచేసి చరిత్రపుటల్లో నిలిచిన యోగిగురువులు పరమహంస యోగానంద. వీరు సనాతన ధ్యాన ప్రక్రియ అయిన క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తం చేసి భారతీయ యోగసమున్నతిని విశ్వమంతా చాటారు. భక్తిభావం... క్రియాయోగం ఎంతోమంది మహనీయులకు జన్మనిచ్చిన గోరఖ్పూర్ ప్రపంచానికి అందించిన యోగిరత్నమే ముకుందలాల్ ఘోష్. బాల్యం నుంచే భక్తిభావాలతో యోగవిద్యను తెలుసుకునేందుకు పలువురు సాధువులను, సన్యాసులను కలుసుకునే సందర్భంలో పదిహేడో ఏట కోల్కతాలో ఓ సాధువును కలిశారు. వారే యుక్తేశ్వరగిరి. వీరివద్దే సన్యాసాశ్రమ స్వీకారం చేసి స్వామియోగానందగా గుర్తింపుపొందారు. క్రియాయోగ సాధనలో మెలకువలనూ నేర్చారు. యోగవిద్యకు ప్రాచుర్యం అనంతరం పశ్చిమబెంగాల్లో తొలి యోగ పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే రాంచీలో మరో యోగ పాఠశాలను స్థాపించగా, తర్వాతి కాలంలో అదే భారత యోగా సత్సంగంగా రూపొందింది. పిమ్మట ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలలో పర్యటించి భారతీయ యోగవిద్యకు విశేష ప్రచారం కల్పించారు. వీరి ప్రభావంతో క్రియాయోగం వైపు మళ్లిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వినోదం, విజ్ఞానం... కలిస్తే ఒక పుస్తకం ఖండాంతర కీర్తికలిగిన యోగానంద మహానుభావుని జీవిత చరిత్రను ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో గ్రంథరూపంలో ప్రకటించారు. ఈ గ్రంథం 20వ శతాబ్దపు 100 అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటిగా పేరుగాంచి నేటివరకు ఎన్నో ముద్రణలను పొందుతూ భారతదేశపు ప్రాచీన విజ్ఞానసారాన్ని ప్రపంచానికి అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు భాషల్లోకి అనువదించబడిన ఈ పుస్తకం ఎంతోమంది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను తీర్చుతోంది. కృషియే సాధనం మనిషి చేసే మానసిక ఆధ్యాత్మిక కృషికి మాత్రమే శాశ్వతమైన విలువ ఉంటుందనీ, మనిషి తనశక్తిని సరిగ్గా ఉపయోగించగలిగితే భౌతికంగా ఎదురయ్యే ఎన్నో అవరోధాలను జయించగలడనీ వీరి జీవితం ద్వారా మనం గ్రహించగలం. చెడును మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, క్రూరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించగలమనే వీరి సందేశం శిరోధార్యం. మానవ అస్తిత్వపు అంతిమ మర్మాలను విడమరిచే యోగానందుల జీవితాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే మనిషి జీవితం ఉన్నతమవుతుంది. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
భారతీయ సంస్కృతి చాలా గొప్పది
కడ్తాల్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని హైదరాబాద్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన దసరా ఉత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్) వ్యవస్థాపకుడు కె.లక్ష్మారెడ్డి, చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆయుధపూజ, జమ్మిపూజలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి కోలాటం వేశారు. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. సీజీఆర్ సంస్థ, గ్రేస్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన తూర్పు కనుమల పర్యావరణ నివేదికను ఆండ్రూ ఫ్లెమింగ్, జోయల్ రిఫ్మన్లకు అందించారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మాజీ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి, పారిశ్రామికవేత్తలు విజయభాస్కర్రెడ్డి, కృష్ణారెడ్డి, సూదిని పద్మారెడ్డి, దేవేంద్ర ఫౌండేషన్ డైరెక్టర్ విజయేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నిటికీ అతీతం యోగా
రాంచీ/ న్యూఢిల్లీ/ ఐరాస: భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా అన్నిటికీ అతీతమైందని, దీనిని జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అదేవిధంగా పార్లమెంట్ హాల్లో, ఐక్యరాజ్యసమితిలో, ఇతర దేశాల్లోనూ ఈ కార్యక్రమాలు జరిగాయి. రాంచీలోని ప్రభాత్ తారా గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో 40 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడిగా మారిన ప్రధాని మోదీ వివిధ ఆసనాల విశిష్టతను వివరిస్తూ ఆసనాలు వేయించారు. ఆరోగ్యం కోసం యోగా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా కుల, మత, వర్ణ, లింగ, ప్రాంతీయ వంటి విభేదాలకు అతీతమైంది. అందుకే దీనిని జీవితంలో అంతర్భాగంగా మార్చుకోవాలి’ అని సూచించారు. ‘నగరాల నుంచి పల్లెలు, గిరిజన ప్రాంతాలకు యోగాను వ్యాపింపజేయాలి. గిరిజనుల జీవితాల్లో యోగాను విడదీయరాని భాగంగా మార్చాలి. ఆరోగ్యవంతమైన శరీరం, స్థిరమైన మనస్సు, ఏకాత్మతా భావం అనే మూడు యోగా విశిష్టతలు ఏమాత్రం మారలేదు. జ్ఞానం, కర్మ, భక్తి అనే మూడింటి సమ్మేళనమే యోగ’ అని ప్రధాని వివరించారు. శాంతి, సామరస్యాలను సాధించే యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తప్పనిసరిగా ఆచరించాలన్నారు. ‘ఈ రోజుల్లో యువత గుండె జబ్బులకు ఎక్కువగా గురవుతున్నారు. గుండె జబ్బుల బెడద నుంచి కాపాడుకునేందుకు యోగా మంచి ఆయుధం. ఈ దిశగా వారిని అప్రమత్తం చేయాల్సి ఉంది. అందుకే ఈ ఏడాది యోగా డేకు ‘హృదయం కోసం యోగా’ నినాదాన్ని ఇతివృత్తంగా పెట్టుకున్నాం. అనారోగ్య సమస్యల నుంచి రక్షించే ముఖ్య సాధనంగా యోగాను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని చెప్పారు. తెల్లటి దుస్తులు, టీ షర్టు, స్కార్ఫుతో వచ్చిన ప్రధాని ప్రసంగం అనంతరం స్టేజీ దిగి అందరితో కలిసి కూర్చుని వివిధ ఆసనాలు, ప్రాణాయామం చేయించారు. రాష్ట్రపతి భవన్లో..: రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. పార్లమెంట్ పరిసరాల్లో జరిగిన కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ఢిల్లీ రాజ్పథ్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రోహ్తక్లో హోం మంత్రి అమిత్ షా, నాగ్పూర్లో నితిన్ గడ్కారీ పాల్గొన్నారు. ప్రవాసీ భారతీయ కేంద్రంలో విదేశాంగ మంత్రి జై శంకర్ నేతృత్వంలో జరిగిన యోగాడే కార్యక్రమంలో 60 దేశాల రాయబారులు పాల్గొన్నారు. చైనా, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ యోగా డే పాటించారు. అంతర్జాతీయ యోగా ఉత్సవాల్లో పాల్గొన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఐరాసలో మార్మోగిన ఓం శాంతి... అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హాల్లో ఓం శాంతి మంత్రం మార్మోగింది. ప్రపంచ నేతలు ప్రసంగించే విశ్వ వేదిక జనరల్ అసెంబ్లీ హాల్లో యోగా డే సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులు, అధికారులు, శిక్షకులు, గురువులు వివిధ ఆసనాలు వేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీ హాల్లో ఈ తరహాలో యోగా ఉత్సవం జరపడం ఇదే ప్రథమం. రాహుల్ ట్వీట్ కలకలం న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోలు వివాదానికి దారితీశాయి. ఆర్మీకి చెందిన జాగిలాలు, వాటి శిక్షకులు యోగా చేస్తున్న ఫొటోలు పోస్ట్ చేసిన రాహుల్ వాటికి ‘నవ భారతం’ అనే వ్యాఖ్యను జోడించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. యోగా డేను అపహాస్యం చేశారని, ఆర్మీ బలగాలను రాహుల్ అవమానపరిచారని కేంద్ర హోం మంత్రి అమిత్షా విమర్శించారు. ‘కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేక ధోరణితోనే ఉంటుంది. ట్రిపుల్ తలాక్కు మద్దతిచ్చినప్పుడే ఈ విషయం పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు యోగాడేను అపహాస్యం చేయడమే కాకుండా ఆర్మీ బలగాలను అవమానపరిచారు. వారిలో సానుకూల ధోరణి పెరగాలని ఆశిస్తున్నాను’అంటూ అమిత్ షా ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఓ సీనియర్ రాజకీయవేత్త యోగాడేను ఇలా అవమానపరచడం బాధాకరం. ఓటు బ్యాంకు రాజకీయాలే వారిని ఇలా భారతీయ సంస్కృతులు, సంప్రదాయాలను అవమానించేలా చేస్తున్నట్లు ఉంది’అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధి ట్విట్టర్లో దుయ్యబట్టారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నవ భారత్ అవతరించింది. తన ఆధ్వర్యంలో కొత్త కాంగ్రెస్ ఎలా ఉందో రాహుల్ గాంధీ ట్వీట్లో అర్థమైంది’అంటూ బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి ఎద్దేవా చేశారు. ‘రాహుల్కు జీవితం అంటే ఓ జోక్గా మారింది. తన పెంపుడు కుక్కను గుర్తు చేసుకుంటూ పోస్టులు చేస్తున్నట్లు ఉన్నారు’ అంటూ చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. బ్రిటన్లోని స్టోన్హెంజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆసనాలు వేస్తున్న ప్రజలు శిక్షకులతో కలిసి యోగా చేస్తున్న ఆర్మీ జాగిలాలు -
ఖాదీ ఫర్ నేషన్.. ఖాదీ ఫర్ ఫ్యాషన్
సాక్షి, న్యూఢిల్లీ: భారత సంస్కృతిలో భాగమైన చేనేతను రక్షించేందుకు యువత ఖాదీ వస్త్రాలు ధరించాలని కోరుతూ యాదగిరి గుట్ట యువకులు ‘ఖాదీ ఫర్ నేషన్.. ఖాదీ ఫర్ ఫ్యాషన్’పేరిట చైతన్య యాత్ర చేపట్టారు. తెలంగాణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో యాదగిరి గుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన చేనేత కార్మికుడు నరేశ్, సాదువెల్లికి చెందిన రాజశేఖర్ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. 18 రోజుల అనంతరం గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్ల మీదుగా ప్రయాణించి శనివారం ఢిల్లీ చేరుకున్నారు. దేశంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, దాన్ని కాపాడేందుకు ఖాదీ వస్త్రాలు ధరించాలని ఆయా రాష్ట్రాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. వీరిరువురి యాత్ర ఢిల్లీ చేరుకున్న సందర్భంగా ఎంపీ డి.రాజా, మాజీ ఎంపీ ఆనందభాస్కర్ ఇక్కడి తెలంగాణ భవన్లో వారికి స్వాగతంపలికి సన్మానించారు. అనంతరం నరేశ్, రాజశేఖర్ మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని రక్షించేందుకు, యువతను ఖాదీ వైపు మళ్లించడానికి యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. జీఎస్టీ, విద్యుత్ చార్జీల పెంపు వల్ల పలు రాష్ట్రాల్లో చేనేత పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమను ఆదుకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డి.రాజా కోరారు. -
పాఠ్యాంశాల్లో త్యాగధనుల జీవితచరిత్రలు
న్యూఢిల్లీ: విద్యావ్యవస్థను ప్రక్షాళించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పీజీడీఏవీ కళాశాల వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో లో పాల్గొన్న ఆయన భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విలువలతో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఇతర గొప్ప నాయకుల త్యాగాలు, జీవిత చరిత్రలు పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. విద్యాలయాలు జ్ఞానమందిరాలుగా విలసిల్లాలన్నారు. శాంతి, అభివృద్ధికి కేంద్రాలుగా మారాలన్నారు. చదువుతో సంబంధంలేని కార్యక్రమాలను విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో నిర్వహించొద్దని సూచించారు. విద్యార్థుల్లో మంచిగుణాలు, మంచి ప్రవర్తన నింపడమే విద్యాధర్మంగా గుర్తించాలన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ లాంటి కార్యక్రమాల్లో పిల్లలు కచ్చితంగా భాగం కావాలని కోరారు. వీటి వల్ల వారిలో క్రమశిక్షణ, సేవాగుణం అలవడుతాయన్నారు. వ్యక్తి సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణంలో విద్య కీలక పాత్ర పోషించాలన్నారు. చదువుతో పాటు ఆటలు, యోగా వంటి అలవాట్లను సాధన చేయాలని సూచించారు. రోజు రోజుకీ పుట్టుకొస్తున్న సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించాలని కోరారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. జీవనశైలి వ్యాధులు, మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఎదుర్కొనేలా జాగ్రత్త వహించాలన్నారు. యువతలో అంతర్జాలం పట్ల పెరుగుతున్న మోజును నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికత వల్ల తలెత్తే ప్రతికూలతలను అధిగమించడంలో పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. -
3 వేల మందితో భారతమాతకు హారతి
-
వైవిధ్యం రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకం
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతిలోని వైవిధ్యమే భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకమని వివిధ భాషలు, సంస్కృతులు, ఆచారాలు, జీవన విధానాలను పరిరక్షించడంలోనే ఏకత్వం ఇమిడి ఉందని నల్సార్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా అన్నారు. ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంస్కృతి అనే భావన రాజ్యాంగ విరుద్ధమైనదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సాహితీ ఉత్సవం రెండో రోజైన శనివారం నిర్వహించిన ‘డైవర్సిటీ అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్’ అనే అంశంపైన ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పీఠికలోనే ‘భారత ప్రజలమైన మేము..’ అనే సంబోధన ఉంటుందని, అది విభిన్న వర్గాల ప్రజల సమష్టితత్వాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ప్రధాని నరేంద్ర మోదీ మినహా భారత ప్రధానులంతా ఆ స్ఫూర్తినే కొనసాగించారన్నారు. మతం ప్రాతిపదికన మెజారిటీ, మైనారిటీ నిర్వచించడం సరైంది కాదని, స్థానిక పరిస్థితులు, భాషను ఇందుకు ప్రామాణికంగా భావించాలని పేర్కొన్నారు. దేశంలో హిందూ మతం మెజారిటీ అని, మిగతావి మైనారిటీవని చెప్పేందుకు అవకాశం లేదన్నారు. పంజాబ్, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీ వర్గాలన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మైనారిటీ వర్గాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పార్లమెంట్ ఉభయ సభలు అత్యధిక మెజారిటీతో ఆమోదించినంత మాత్రాన కొలీజియంపై సుప్రీంకోర్టు తీర్పే అంతిమమైందని, అలాగే అగ్రకుల పేదల రిజర్వేషన్ల విషయంలోనూ మెజారిటీ పార్లమెంట్ సభ్యుల ఆమోదమే ప్రామాణికం కాకపోవచ్చునన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. దళితులు, ముస్లింలు,ఆదివాసీలు, తదితర వర్గాలపైన జరుగుతున్న దాడులు, వారి జీవన విధానాలను లక్ష్యంగా చేసుకొని కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ మార్గమే అనుసరణీయం..... గాంధీ 150వ జయంతి సందర్భంగా ‘గుజరాత్ సాహిత్యం– గాంధీజీ తులనాత్మక అధ్యయనం’పై జరిగిన సదస్సులో పలువురు వక్తలు మాట్లాడారు.నేటికీ గాంధీజీ మార్గమే అనుసరణీయమని, జయాపజయాలు అనే కోణంలో దాన్ని అర్థంచేసుకోవడం సరైంది కాదన్నారు. గుజరాతీ రచయిత సితాన్షు యశస్చంద్ర మాట్లాడుతూ, ‘నా తల్లి స్తన్యమిస్తూ చెప్పిన పలుకులు గుర్తు లేవు, కానీ ఆ పలుకులను ఆమె ఏ భాషలో పలికిందో ఆ భాష... పాలతోపాటే నా ఒంట్లోకి ప్రవహించింది. భావాన్ని యధాతధంగా వ్యక్తం చేయగలిగేది తల్లి భాషలోనే’అని చెప్పిన గాంధీ మాటలను గుర్తు చేశారు. ‘సమాజం మారాలని చూడవద్దు, మనిషి ఎలా ఉండాలనుకుంటున్నావో ఆ విధంగా నిన్ను నువ్వు మార్చుకుంటే సమాజం నువ్వనుకున్నట్లే మారుతుంది’అని గాంధీజీ చెప్పిన విషయాన్ని... ‘నీటి బిందువులు మారితే సముద్రం కూడా మారిపోతుంది’‘గాంధీ, యాన్ ఇంపాజిబుల్ పాజిబులిటీ’ అంశం మీద సుధీర్ చంద్ర ప్రసంగించారు. ప్రణయ్ లాల్ రాసిన ‘ఇండియా, ఎ డీప్ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ సబ్కాంటినెంట్’పుస్తకం మీద చర్చాగోష్టి జరిగింది. ‘కాంటెంపరరీ కరెంట్స్ ఇన్ గుజరాతీ లిటరేచర్’ అంశం మీద సాగిన చర్చలో గుజరాతీ సాహిత్యంలో చోటు చేసుకున్న మార్పులను ప్రస్తావించారు. హింసకు కూడా ఓ మానవీయ కోణం రచయితలు, కళాకారుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో పాల్గొంటున్నది సామాజికంగా కింది స్థాయిలోనివాళ్లే కావడాన్ని మానవీయ కోణంలో చూడాలని అభిప్రాయపడ్డారు ‘ఆర్ట్ ఎటాక్స్’ పుస్తక రచయిత్రి ప్రొఫెసర్ మాళవిక మహేశ్వరి. ‘కళ, ఆదర్శవాదం’ అంశం మీద జరిగిన చర్చలో ఆమె సీని యర్ పాత్రికేయుడు సలీల్ త్రిపాఠితో కలిసి పాల్గొన్నారు. చందనా చక్రవర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు. వెనకవుండి దాడులను ప్రోత్సహించేది ఎవరైనా, జీవితంలోని నిరాశ వల్ల ‘ఏదో సాధించిన తృప్తి’కోసం పేదవాళ్లు ఈ హింసలో పాల్గొంటున్నారని మాళవిక చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేశాయి. మనోభావాలు గాయపడటం అనే కోణాన్ని స్పృశిస్తూ– స్వేచ్ఛకు పరిమితులు విధించినట్టుగా కనబడే రాజ్యాంగం, నిజానికి అప్పటి కాలాన్ని ప్రతిబింబించడంతోపాటు ప్రజలను ఉదారవాదులుగా పరిణామం చెందించే పాత్ర కూడా పోషిస్తోందనీ, అందువల్ల ప్రజాస్వామ్యానికి వచ్చిన తక్షణ ముప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. మృణాళిని సారాభాయి శత జయంతి సందర్భంగా ఆమె కుమార్తె మల్లికాసారాభాయి నివాళులర్పించారు. రెండో రోజు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మోహన్ భగవత్ తర్వాతి ప్రధాని? ప్రధాని అభ్యర్థిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా తెరమీదకు వచ్చే అవకాశముం దని సీనియర్ పాత్రికేయుడు కింగ్షుక్ నాగ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ స్పష్టమైన మెజారిటీæ గెలుచుకుంటే సహజంగా మోదీయే అభ్యర్థిగా ఉంటారు. కానీ 150–160 సీట్లు మించి బీజేపీ గెలవకపోతే మాత్రం భగవత్ కూడా బరిలోకి దిగవచ్చన్నారు. ‘ద చీఫ్ అండ్ ద చీఫ్ మినిస్టర్’ చర్చాకార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు యూపీఏ అభ్యర్థిగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రధాని పదవికి పోటీపడే అవకాశం ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కాకపోవచ్చన్నారు. మమతా బెనర్జీ జీవిత కథ ‘దీదీ.. అన్టోల్డ్ స్టోరీ’ రాసిన పాత్రికేయురాలు శుతాపా పాల్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి మరో పాత్రికేయురాలు ఉమా సుధీర్ సమన్వయకర్తగా వ్యవహరించా రు. ప్రణబ్ ముఖర్జీకి ఎన్డీయే ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం ‘క్విడ్ ప్రో కో’ చర్యనా అన్న ప్రశ్నకు.. బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకు ని చేసిన చర్యగా ప్యానెల్ అభిప్రాయపడింది. -
3 వేల మందితో భారతమాతకు హారతి
హైదరాబాద్: భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ భారతమాత వేషధారణలో మూడు వేల మంది విద్యార్థినులు అలరించారు. వీరంతా కలిసి శనివారం భారతమాతకు హారతి ఇచ్చారు. ఈ అద్భుత కార్యక్రమానికి హైదరాబాద్ నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికైంది. మూడు వేల మందితో నిర్వహించిన ఈ కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. భారతమాత ఫౌండేషన్ చైర్మన్ కిషన్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘భారతమాతకు హారతి’కార్యక్రమానికి ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో దేశభక్తిని పెంచేందుకు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలను చదివేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు, దక్షిణామూర్తి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భారతమాత ఫౌండేషన్ కన్వీనర్ శ్యాంసుందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విప్లవ యోగి
‘మనకి నిజమైన శత్రువని చెప్పుకునే శక్తి అంటూ బయట ఏదీ లేదు. రోదిస్తున్న మన బలహీనతలు, పిరికితనం, మన స్వార్థ చింతన, మన భేషజం, దృష్టి లోపించిన మన భావాలు ఇవే అసలైన శత్రువులు.’ ఈ మాట అరవింద ఘోష్ అన్నారు.ఈ మట్టిలో, ఈ గాలిలో ఉన్న తన మూలాల కోసం, దూరమైన స్పర్శ కోసం ఒక తృష్ణతో అన్వేషిస్తూ భారతదేశానికి వచ్చినవారు అరవిందులు. కానీ తనవైన మూలాల కోసం పరితపిస్తున్న భారతజాతి భారత భూమిలో కనిపించలేదు. పైగా వాటిని విస్మరిస్తున్న వాస్తవం ఇక్కడ కనిపించింది. విదేశీ పాలన నుంచి విముక్తం కావడం విదేశీయుల దిశా నిర్దేశంతో ఎలా సాధ్యమవుతుంది? భౌతికంగా ఉన్న సంకెళ్లను తెంచుకోవాలనుకున్న వారు మొదట మనసుకు పడిన బంధనాలను ఛేదించకుంటే ఎలా? స్వాతంత్య్రోద్యమంలో మొదట ఆయన అతివాది. తరువాత విప్లవకారుడు. ఆపై యోగి. కానీ ఆయన పలాయనవాది కాదు. గతంలోకి నిష్క్రమించడమే వర్తమాన సమస్యలకు పరిష్కారమని భావించిన వారు కూడా కాదు. భారత స్వాతంత్య్రోద్యమంలో అరవింద్ ఘోష్ (ఆగస్ట్ 15, 1872–డిసెంబర్ 5, 1950) పాల్గొన్నది కేవలం ఐదేళ్లు. 1905లో ఆయన ఉద్యమంలో అడుగు పెట్టారు. 1910 నాటికే యోగి అవతారంలో పుదుచ్చేరిలో ప్రత్యక్షమయ్యారు. ఈ కొద్ది సమయంలోనే అరవిందుల జీవితం అగ్ని పర్వతాల నిలయంగా కనిపిస్తుంది. అరవింద్ ఘోష్ అవిభాజ్య బంగాళంలోని కున్నాగర్ గ్రామంలో పుట్టారు. తండ్రి కృష్ణధన్ ఘోష్ అసిస్టెంట్ సర్జన్. ఒకప్పుడు బ్రహ్మ సమాజంలో సభ్యుడు. తల్లి స్వర్ణలతాదేవి. కృష్ణధన్ ఇంగ్లండ్లోనే వైద్య విద్య చదివారు. ఆయన వంగ దేశీయుడే కావచ్చు. కానీ ఆంగ్లేయుల సంస్కృతిని అణువణువూ పట్టించుకున్నారు. ఇంట్లో వంగ భాష వినిపించడానికి వీలులేదు. భారతీయ సంస్కృతికీ జీవన విధానానికీ చోటు లేదు. కుటుంబ సభ్యులంతా ఆంగ్లంలోనే మాట్లాడాలి. పని మనుషులతో మాట్లాడడానికి మాత్రం హిందుస్థానీ. తన కొడుకుల ఆంగ్ల పరిజ్ఞానాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో కృష్ణధన్ డార్జిలింగ్లో ఉన్న లోరెటో పాఠశాలలో చేర్పించారు. అప్పటికి అరవింద్కు ఐదో సంవత్సరం. నిజానికి తొలి సంతానం తరువాత స్వర్ణలతాదేవి మానసిక ఆరోగ్యం కొంచెం పాడైంది. దీనితో తల్లికి దూరంగా ఉంచే ఉద్దేశం కూడా ఇందులో ఉంది. కొడుకులంతా కూడా ఐసీఎస్ చేయాలన్నదే ఆయన కోరిక. అందుకు డార్జిలింగ్ చదువు మొదటి మెట్టు. ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలంటే ఇంగ్లండ్లో ఉండడం తప్పనిసరి అయింది. అందుకే కుటుంబంతో సహా కృష్ణధన్ 1879లో అక్కడికి వెళ్లిపోయారు. మాంచెస్టర్లో రెవరెండ్ డబ్ల్యూ హెచ్ డ్రెవిట్ పర్యవేక్షణలో ఉంచారు. డ్రెవిట్, ఆయన భార్య ఆ పిల్లలకు లాటిన్ చెప్పేవారు. 1884లో ఆ దంపతులు ఆస్ట్రేలియా వెళ్లిపోవలసి వచ్చింది. దీనితో డ్రెవిట్ ఆ ముగ్గురు పిల్లలని ఇంగ్లండ్లో ఉన్న తన తల్లి సంరక్షణలో ఉంచారు. అక్కడే ఆమె వారిని సెయింట్ పాల్స్ పాఠశాలలో చేర్పించింది. అక్కడే గ్రీక్, సాహిత్యం, ఇంగ్లిష్ కవిత్వం ఆ పిల్లలు చదువుకున్నారు. జర్మన్, ఇటాలియన్ భాషలతో కూడా పరిచయం కలిగింది. కానీ మొదటి ఇద్దరు సోదరులు కొన్ని కారణాలతో ఐసీఎస్ పరీక్షకు దూరంగా ఉండిపోవలసి వచ్చింది. అంటే తండ్రి కలని నిజం చేయవలసిన బాధ్యత అరవిందుడి మీద పడింది. కానీ అప్పటికే ఆర్థిక పరిస్థితి బాగాలేక తండ్రి భారత్కు వెళ్లిపోయారు. అప్పుడప్పుడు ఉత్తరాలు మాత్రం వచ్చేవి. ఆ విధంగా చిన్నతనంలో తల్లీ తండ్రీ ఉండి కూడా వారికి లేకుండా అయిపోయారు. దీనితో విద్యార్థి వేతనం అనివార్యమైంది. అందుకే ఎంతో కష్టపడి కేంబ్రిడ్జ్లోని కింగ్స్ కాలేజీలో చేరారు, అరవిందులు. ఆ ఏడాది 250 మంది అభ్యర్థులు ఐసీఎస్ పరీక్ష రాస్తే, అరవింద్ ఘోష్కు పదకొండో స్థానం వచ్చింది. కానీ తరువాత జరిగిన గుర్రపుస్వారీ పరీక్షలో ఆయన విఫలమయ్యారు. ఐసీఎస్ దక్కలేదు. నిజానికి గుర్రపు స్వారీ పరీక్షకి ఆయన కావాలనే ఆలస్యంగా వెళ్లారు. బహుశా బ్రిటిష్ అధికారులకి కావలసింది కూడా అదే అయి ఉండాలి. అరవిందులకి ప్రభుత్వ సేవ అంటే ఇష్టం లేదు. అందుకే పరీక్షకు ఆలస్యంగా వెళ్లారు. అప్పటికే బరోడా మహారాజా పరిచయం కలగడం, ఆయన తన సంస్థానానికి ఆహ్వానించడం జరిగిపోయాయి. అరవిందులు ∙1893లో స్వదేశానికి చేరారు. అంతలోనే కృష్ణధన్ హఠాత్తుగా కన్నుమూశారు. అదొక చిత్రమైన సన్నివేశం. ఐసీఎస్ అయి కొడుకు వస్తున్నాడని ఆయన భావన. కానీ ఇంతలోనే బొంబాయి ట్రావెలింగ్ ఏజెంట్లు ఆయనకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చారు. అరవింద్ ఘోష్ ప్రయాణిస్తున్న ఓడ పోర్చుగల్ తీరంలో మునిగిపోయిందన్నదే ఆ సమాచారం. ఈ సమాచారం విని తట్టుకోలేక కృష్ణధన్ మరణించారు. బరోడా సంస్థానంలో చేరిన తరువాత అరవిందుడు చేసిన పని సంస్కృతం, బెంగాలీ భాషలు నేర్చుకోవడం. ఆ తరువాత అంతదాకా తన కుటుంబానికి దూరంగా ఉండిపోయిన బంధువులని, సాక్షాత్తు తన సోదరుడు బరీన్ని, సోదరి సరోజని ఆయన కలుసుకున్నారు. బరోడాలో ఉండగానే బాలగంగాధర తిలక్, సిస్టర్ నివేదితలతో పరిచయం ఏర్పడింది. అతివాదులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. కానీ ఇదంతా రహస్యం. మొదట రెవెన్యూ శాఖలో చేసినా, తరువాత బరోడా మహారాజా విద్యా సంస్థలో అరవిందుడు ఫ్రెంచ్ బోధించారు. ఆపై వైస్ ప్రిన్సిపాల్ అయ్యారు. ఈ సమయంలోనే బెంగాల్ విభజన ఘటన చోటు చేసుకుంది. అది 1905. ఆ మరుసటి సంవత్సరమే తన స్వస్థలానికి చేరుకున్నారు అరవిందుడు. జాతీయ కాంగ్రెస్లోని మితవాదులకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద నమ్మకం పోగొట్టిన ఘటన బెంగాల్ విభజన. దేశంలోని యువతరం తీవ్ర జాతీయవాదం వైపు చూసేటట్టు చేసిన సంఘటన కూడా అదే. 1905లో వారణాసి కాంగ్రెస్ సభలకు అరవిందుడు పరిశీలన కోసం వెళ్లారు. జాతీయ కాంగ్రెస్తో అదే ఆయన పరిచయం. విదేశీ వస్తు బహిష్కరణ పిలుపునిచ్చిన సమావేశం అదే. దానిని అరవిందుడు పాటించారు. 1906 లో జరిగిన కలకత్తా సభలు స్వదేశీ పిలుపునిచ్చాయి. కలకత్తాలోని జాతీయ కళాశాలలో అరవిందుడు చేరారు. ఆ సంత్సరమే అయన జుగాంతర్ (బెంగాలీ), వందేమాతరం (ఇంగ్లిష్) పత్రికలను స్థాపించారు. ఇందుకు సాయపడినవారు ఇద్దరు– సుబో«ద్ మల్లిక్, బిపిన్చంద్ర పాల్. సంపూర్ణ స్వాతంత్య్రం అన్న విశాల భావన మొదట వందేమాతరం పత్రికలోనే దర్శనమిచ్చిందని ఒక వాదన ఉంది. 1906 నాటికే కలకత్తా కేంద్రంగా కొన్ని తీవ్ర జాతీయవాద సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో అనుశీలన్ సమితి ఒకటి. ఇందులో అరవిందుడి సోదరుడు బరీన్ కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. అరవిందుడు కూడా సభ్యుడయ్యారు. అప్పుడే జరిగింది అలీపూర్ కుట్ర కేసు.ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి ముజఫరాపూర్ దగ్గర బెంగాల్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ఫోర్డ్ మీద హత్యా ప్రయత్నం చేశారు. ఇది 1908లో జరిగింది. ఇందులో అనుశీలన్ సమితిదే కీలక పాత్ర అని పోలీసులు నిశ్చయానికి వచ్చారు. పైగా 1907 డిసెంబర్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆండ్రూ ఫ్రేజర్ ప్రయాణిస్తున్న రైలు పడగొట్టాలని కొందరు ప్రయత్నించారు. ఈ రెండింటికి సంబంధం ఉందని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బరీన్, ఆయన సోదరుడు అరవిందుడు, మరో 37 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువ మందిని ఒకేసారి బరీన్కు చెందిన గార్డెన్ హౌస్లో ఉండగా పట్టుకున్నారు. అది కలకత్తా శివార్లలలో ఉండేది. ఈ కేసును చిత్తరంజన్ దాస్ వాదించారు. అదృష్టవశాత్తు ఆ 37 మందిలో అప్రూవర్గా మారిన వ్యక్తిని జైలులోనే ఎవరో హత్య చేశారు. దీనితో అరవిందుడు బయటపడ్డారు. సోదరుడు బరీన్కు మాత్రం శిక్ష పడింది. అప్పటిదాకా అరవిందుడు అలీపూర్ ప్రెసిడెన్సీ జైలులో ఉన్నారు. ఇక్కడే ఆయన మానసికంగా ఎంతో మారిపోయారు. అందుకు ఉదాహరణ– స్వామి వివేకానందుల దివ్య ఆత్మ వచ్చి తనతో సంభాషించిందని చెప్పడం. జైలు నుంచి విడుదలైన తరువాత 1910లో ఆయన పుదుచ్చేరి చేరుకుని ఆశ్రమం ఆరంభించారు. అదొక దశ. భారత జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతం, పంథా రెంటినీ కూడా అరవిందుల వారు హర్షించలేకపోయారు. ఆమోదించలేకపోయారు. 1907 నాటి సూరత్ జాతీయ కాంగ్రెస్ సభలకు ఆయన అధ్యక్షుడు. ఆ సమావేశంలోనే జాతీయ కాంగ్రెస్లోని అతివాద, మితవాద వర్గాల విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. సూరత్ సభలలో తిలక్ ప్రసంగిస్తున్నప్పుడు ఫిరోజ్షా అనుయాయులు ఎవరో ఆయన మీదకు బూటు విసిరారు. అది వచ్చి వేదిక మీదే ఉన్న సురేంద్రనాథ్ బెనర్జీకి తగిలింది. తరువాత గోఖలే (తిలక్ను తీవ్రంగా వ్యతిరేకించేవారు) వంటివారంతా వచ్చి లోకమాన్యకు రక్షణగా నిలిచారు. కానీ ఆ ఘటనతో వచ్చిన అపకీర్తి నుంచి కాంగ్రెస్ను వారు ఎప్పటికీ రక్షించలేకపోయారు. మితవాద వర్గం నుంచి జరిగిన దుశ్చర్యతో సంస్థ పెద్ద మూల్యమే చెల్లించవలసి వచ్చింది. సూరత్ సమావేశాల తరువాతే అరవిందుడు వెళ్లి విష్ణుభాస్కర్ లేలే అనే మరాఠీ యోగిని కలుసుకున్నారు. ఆ యోగికి అరవిందుడిని పరిచయం చేసినవారు ఆయన సోదురుడు బరీన్. ఆ సమావేశం వ్యక్తిగా అరవిందులను ఎంతో మార్చిందని అనిపిస్తుంది. అలీపూర్ కారాగారం మొత్తం తనకు వాసుదేవుడి రూపంలోనే కనిపించిందని ఆయన చెప్పేవారు. అక్కడి చెట్ల కింద నడుస్తున్నా, ఆ గోడలను చూస్తున్నా కూడా అదే భావన కలిగేదని ఆయన ప్రకటించారు. నిజానికి బరోడా సంస్థానంలో ఉండగానే అరవిందుడు యోగాభ్యాసంలో ఎంతో సాధించారు. 1904 నాటికే రోజుకి నాలుగు నుంచి ఐదు గంటలు ప్రాణాయామం చేసేవారాయన. అంతకు ముందు ఏదైనా కవిత రాయాలంటే గంట సేపు ప్రయత్నిస్తే 12 పంక్తులకు మించి సాధ్యమయ్యేది కాదు. ఇక 200 పంక్తులు రాయాలంటే నెల రోజులు పట్టేది. కానీ ప్రాణాయామంలో ఉన్నత శిఖరాలకు చేరిన తరువాత గంటలోనే 200 పంక్తులు రాసే స్థాయికి మానసిక స్థితి ఎదిగిందని ఆయన చెప్పుకున్నారు. అంతటి కృషి చేసినప్పటికి కూడా ‘సావిత్రి’ అనే అజరామర కావ్యం రాయడానికి దాదాపు ఐదు దశాబ్దాలు పట్టింది. అరవిందుడు ‘సావిత్రి’తో పాటు మరెన్నో పుస్తకాలు రాశారు. చదువంటే ఆధ్యాత్మికం, ఆత్మికం మాత్రమే కాదు, హేతుబద్ధత కలిగినది కూడా కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక దశ వరకు విద్య అనేది మాతృభాషలో ఉండాలనే ఆయన వాదించారు. అసలు జీవితం అంటేనే చదువు. కాబట్టి పాఠ్య ప్రణాళికకు పరిమితులంటూ ఏమీ ఉండవు. చదువు కొన్ని పాఠ్య పుస్తకాలు చదవడంతోనే ముగిసిపోయేది కాదు అన్నారాయన. అరవిందుని పేరుని 1943లో నోబెల్ సాహిత్య పురస్కారానికీ, 1950లో నోబెల్ శాంతి పురస్కారానికీ సిఫారసు చేశారు. డా. గోపరాజు నారాయణరావు -
నమస్కారం భారతీయ సంస్కారం
సాధారణంగా మనం పెద్దలను, గురువులనూ, అధికారులనూ కల్సినపుడు, దేవాలయాలకు వెళ్ళినపుడూ రెండుచేతులూ జోడించి నమస్కరిస్తాం. ఇలా చేతులు జోడించడంలోని అంతరార్ధం ఏంటీ? చేతులు జోడించినపుడు రెండు అరచేతులూ కలిపినపుడు పదివేళ్ళూ కలుసుకుంటాయి కదా...ఇవి ఐదు ఙ్ఞానేంద్రియాలకు ఐదుకర్మేంద్రియాలకూ సంకేతం. ఈ పదివేళ్ళనూ కలపడం అంటే ఙ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ దైవంవైపు మరల్చి శరణాగత భావంతో అర్పణ చేయటమే! న+మమ, నాది అనేది ఏమీలేదు. అంతా నీదే! స్వీకరించు పరమాత్మా! అనే అర్పణ భావనను కలిగి ఉండటం. ఇంతేకాక నమస్కారం ‘ తత్వమసి ‘ అనే నిత్య సత్యాన్ని గుర్తుచేస్తుంది. కుడి అరచేయి మనకు కనపడని ‘తత్ ’ ను సూచిస్తుంది. ఎడమ అరచేయి వ్యక్తికి ప్రతీక .రెండూ కలిసినపుడు –– తత్వమసి అవుతుంది. ఉన్నది ఒక్కడే రెండవది లేదనే భావనే! ఇది శాస్త్రీయమైన, సంప్రదాయమైన కారణమైతే, దీనివెనక ఎంతో సైన్స్ విజ్ఞానం దాగి ఉంది. అదేమిటో చూద్దాం...నమస్కరించే సమయంలో మన చేతులకున్న పది వేళ్లు ఒకదానికి మరొకటి తాకడం వల్ల మన శరీరంలోని కళ్లు, చెవులు, మెదడు వంటి అవయవాలలో చైతన్యం కలుగుతుంది. దీనివల్ల ఎదుటివ్యక్తిని చిరకాలం గుర్తుంచుకోవచ్చనే నమ్మకం ఉంది. నమస్కారం చేయడం వల్ల గుండె భాగంలో ఉండే చక్రం తెరుచుకుంటుంది. ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరికొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతారు. కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఆత్మానుసంధానమైన వారధి నిర్మించుకోవడానికి ఈ నమస్కారం దోహదం చేస్తుంది. అంటే మాటలతో అవసరం లేకుండా.. ఒకరి మనసు, ఒకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుందనేది నమస్కారం వెనక ఉన్న రహస్యం.సైంటిఫిక్ రీజన్ ఏమిటో మరోసారి చూద్దాం... నమస్కారం పెట్టే సమయంలో అరచేతులని దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ విధమైన శక్తి విస్ఫోటనం అవుతుంది. ఇలా చేయడం వల్ల జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతుంది. అవతలి వారికి సదభిప్రాయం కలుగుతుంది. అలా అవతలి వ్యక్తిని మనతో సహకరించే జీవిగా చేసుకుంటామన్నమాట. -
గుమ్మాలకు మామిడి తోరణాలెందుకు?
భారతీయ సంస్కృతి ఎంతో విశిష్టమైనది, మరెంతో శాస్త్రీయమైనది. మన సంస్కృతిలోని ఆచారాలన్నీ అద్భుతమైన ఆరోగ్య సూత్రాలతో ముడిపడి ఉండటం విశేషం. దానిలోని అంతస్సూత్రం తెలీనివారికి చాదస్తంగా అనిపించవచ్చు, కానీ అంతరార్థం తెలిస్తే, అంతా నిజమేనని అంగీకరించక తప్పదు..ఇంటిగుమ్మాలకు కట్టే మామిడాకుల తోరణాలతో ముందుగా ప్రారంభిద్దాం. ప్రతిపండగకూ ఇంటి సింహద్వారానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టడం మనకు తెలుసు కదా! పెళ్ళిళ్ళూ, వ్రతాలు జరిగేప్పుడు వాకిలిముందరి స్తంభాలకు అరటిచెట్లు, పూజామందిరానికి అరటిపిలకలు కడతారు. పూర్వం పల్లెల్లో తప్పని సరిగా కొబ్బరిమట్టలు స్తంభాలకు కట్టేవారు.ఇది ఒక చాదస్తమా! లేక ఏదైనా ఉపయోగం ఉందా! చాలామంది ఒకచోట చేరినపుడు అంతా విడిచే బొగ్గు పులుసువాయువు (కార్బన్ డై ఆక్సైడ్ వల్ల గాలి కలుషితమై, ఊపిరాడక పోవడం, తలతిరగటం తలనొప్పి రావటం జరుగుతుంటాయి. అందుకే ముఖ్యంగా పసిపిల్లలు ఇలాంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో దారుణమైన ఉక్కపోత, వేడిమికి గురై, ఊపిరి బిగదీసినట్లై గుక్కపట్టి ఏడస్తుంటారు. దీన్నే ఆంగ్లంలో ‘సఫకేషన్‘అంటారు. ఈ మామిడి, అరటి, కొబ్బరి ఆకుల్లో చెట్టునుంచి కోశాక కూడా చాలాసేపటి వరకూ కార్బన్ డై యాక్సైడ్ను పీల్చుకుని, ఆక్సిజన్ను వదిలే గుణం ఉంటుంది. అందువల్ల ఊపిరాడకపోడం జరగదు. అంతేకాక ఈ ఆకులలోని ఆకుపచ్చరంగు కంటికి ఆహ్లాదాన్ని, మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. సహజరీతిలో అలంకారంతో పాటుగా, ఆరోగ్యాన్నీ కలిగిస్తాయి. చూశారా... ఈ మామిడాకులు, తోరణాలవల్ల ఎంత మేలు జరుగుతుందో! ఇంటి గుమ్మాలకు ముఖ్యంగా సింహద్వారాలకు పసుపు పూసి, కుంకుమబొట్లు పెట్టడం, ఇంటిలోకి దేవిని స్వాగతించడం! పసుపు యాంటీబయాటిక్ సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. నోములూ వ్రతాల సమయంలో మహిళల పాదాలకు పసుపు రాసేవారు, మహిళలు ఎక్కువగా నీళ్ళలో పని ఉంటుంది, ఈ పసుపు రాసుకోడం వల్ల కాళ్లు, వేళ్లు పాయటం వంటివి జరగదు. . శరీరానికీ మహిళలు పసుపురాసుకుని స్నానంచేసేవారు. దీనివల్లా శరీరానికి రంగురావటమేకాక అనవసర కేశాలు రాలిపోతాయి. ఇదేవిధంగా పెళ్లిళ్లలో కర్పూరపు దండలు అని ఇచ్చేవారు. వీటిలో కూడా బయటి గాలిలోని కాలుష్యాన్ని పీల్చుకుని, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే గుణం ఉంది. అందుకే వివాహాది శుభకార్యాలలో కర్పూరపు బంతులను ప్రతి ఒక్కరికీ ఇస్తుంటారు. వధూవరులకు మెడలో తప్పనిసరిగా వీటిని ధరింపజేస్తుంటారు. వీటితోబాటు వెనకటి రోజుల్లో శుభకార్యాలు జరిగేటప్పుడు అందరికీ తలొక తాటాకు విసన కర్రా ఇచ్చేవారు. వీటినుంచి వీచే గాలి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ విసన కర్రలు తడిసినా కూడా మంచి వాసన వేస్తుంది. చల్లటి గాలి వంటికి తగులుతుంది. -
హిందూ ఆలయాలపైనే పెత్తనమెందుకు?
కొల్లాపూర్: పాలకులు కేవలం హిందూ ఆలయాలపైనే తమ పెత్తనం ప్రదర్శిస్తూ.. మజీదులు, చర్చిల జోలికి ఎందుకు వెళ్లడం లేదని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో కేవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ హిందువుల ఆలయాలు రాజకీయాలకు వేదికలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో పాలకవర్గాలే విజయవాడ కనకదుర్గమ్మ గుడి, అమ్మవారిని రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. హిందూ దేవుళ్లను దర్శించుకోవాలంటే ఎమ్మెల్యే, ఎంపీల సిఫారసు లేఖలు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు కుహనా మేధావులు భారతీయ సంస్కృతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
హిందుస్తాన్ హిందువులదే: భాగవత్
ఇండోర్: భారత్ కేవలం హిందువుల దేశమేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జర్మనీ ఎవరి దేశం? జర్మన్లది. బ్రిటన్ బ్రిటిషర్లది. అమెరికా అమెరికన్లది. అలాగే హిందుస్తాన్(భారత్) హిందువులది’ అని అన్నారు. ఇతర మతస్తులు భారత్లో జీవించవచ్చని సెలవిచ్చారు. భారత సంస్కృతిని అనుసరిస్తూ జీవించేవారందరూ భారతీయులేనన్నారు. ఏ రాజకీయ నేత, పార్టీ కూడా దేశాన్ని గొప్పగా మార్చలేరని, ఇందుకు తొలుత సమాజంలో చైతన్యం రావడం అవసరమన్నారు. ప్రజలు తమ మనసుల్లోంచి అన్ని రకాల వివక్షల్ని తొలగించుకుంటేనే భారత్ శక్తిమంతమైన విశ్వ గురువుగా అవతరిస్తుందన్నారు. -
మళ్లీ మంటపెట్టిన మరో బీజేపీ ఎమ్మెల్యే
-
భారతీయ సంస్కృతి గొప్పది
నల్లగొండ ,భూదాన్పోచంపల్లి (భువనగిరి) : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు చాలా గొప్పగా ఉన్నాయని విదేశీ అధికారుల బృందం కొనియాడింది. మంగళవారం హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ, లఘు, మధ్యపరిశ్రమల సంస్థ(నిమిస్మే) ఆధ్వర్యంలో 19 దేశాలకు చెందిన 28 మంది విదేశీ అధికారుల బృందం పోచంపల్లిని సందర్శించింది. స్థానిక టూరిజం సెంటర్, చేనేత గృహాలను సందర్శించి ప్రాచీన చేనేత కళ, దానికున్న ఆదరణను అడిగి తెలుసుకున్నారు. మగ్గాలపై తయారవుతున్న చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీని ప్రత్యకంగా పరిశీలించి కార్మికుల కళా నైపుణ్యాలను అభినందించారు. అలాగే చేనేత గృహాలకు వెళ్లి వారి జీవనశైలి, లభిస్తున్న కూలిని అడిగి తెలుసుకున్నారు. చేనేతతో పాటు చేతివృత్తులపై ఎంత మంది ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని ఆరా తీశారు. కాగా గ్రామీణ ప్రజల జీవన విధానాలు, ఆచారాలను చూసి అబ్బురపడ్డారు. ఎంతో వైవిధ్యంగా ఉన్న భారతీయ సంస్కృతి చాలా గొప్పగా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రొగ్రాం డైరెక్టర్ టి.వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ నిమిస్మేలో ‘టూరిజం అండ్ హాస్పిటలిటీ మేనేజ్మెంట్’లో 3 నెలల పాటు అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటన నిమిత్తం ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, కాంబోడియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాక్, జోర్డాన్, కజకిస్తాన్, కెన్యా, లిబేరియా, మాలి, మారిషస్, మంగోలియా, నైగర్, శ్రీలంక, తజకిస్తాన్, టాంజానియా, వియత్నాం, జాంబియా దేశాలకు చెందిన టూరిజం, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్, ప్రొగ్రాం అధికారులు వచ్చారని తెలిపారు. -
భారత సంస్కృతితో కొత్త రూ.50 నోట్లు
-
భారత సంస్కృతితో కొత్త రూ.50 నోట్లు
ఆర్బీఐ త్వరలో మహాత్మా గాంధీ నూతన సిరీస్లో కొత్త రూ.50 నోట్లను చెలామణిలోకి తీసుకురానుంది. ఇవి నీలి రంగులో (ఫ్లోరోసెంట్ బ్లూ) ఉంటాయి. వీటిపై ఒకవైపు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్ భారత్ లోగో.. మరొకవైపు మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం ఉంటాయి. కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చినా పాత రూ.50 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తెలిపింది. -
పురాణాల గురించి కనీస అవగాహన ఉందా?
సెల్ఫ్ చెక్ భారతదేశం కర్మభూమి. రాముడు, కృష్ణుడు వంటి ఎందరో మహానుభావుల పాదపద్మాల జాడలను ఇముడ్చుకున్న పుణ్యపుడమి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను దశదిశలా చాటిన రామాయణ భారత భాగవతాల గురించిన కనీస అవగాహన అవసరం. వాటి గురించి మీకు ఎంత మాత్రం తెలుసో పరీక్షించుకునేందుకే ఈ సెల్ఫ్ చెక్. 1. రామాయణంలోని భాగాలు లేదా అధ్యాయాలను ‘కాండలు’అంటారని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 2. రామాయణంలో మొత్తం ఆరు కాండలున్నాయని, అవి వరుసగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 3. మహాభారతాన్ని పంచమ వేదమంటారని తెలుసు. ఎ. అవును బి. కాదు 4. మహాభారతంలోని భాగాలను పర్వాలు అంటారు... తెలుసు? ఎ. అవును బి. కాదు 5. మహాభారతంలో మొత్తం 18 పర్వాలుంటాయని తెలుసు. ఎ. అవును బి. కాదు 6. సంస్కృత మహాభారతాన్ని తెనిగించినవారు నన్నయ, తిక్కన, ఎర్రన అని, వారిని కవిత్రయం అంటారనీ తెలుసు. ఎ. అవును బి. కాదు 7. భాగవతాన్ని ముక్తికావ్యమంటారని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 8. మహాభాగవతంలోని భాగాలను స్కందాలంటారని, మొత్తం పన్నెండు స్కందాలుంటాయని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 9. భాగవతాన్ని రచించినది పోతనామాత్యుడని (బమ్మెర పోతన) తెలుసు. ఎ. అవును బి. కాదు 10. మహాభాగవతంలో పోతన వదిలేసిన ఓ పద్యపాదాన్ని సాక్షాత్తూ శ్రీరాముడే ఆయన రూపంలో వచ్చి పూరించినట్లు మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు పై వాటిలో కనీసం ఏడింటికి ‘ఎ’లను గుర్తించినట్లయితే మీకు ప్రాచీన సంస్కృతిపై తగినంత అవగాహన ఉందని, పురాణాలు, కావ్యాల గురించి తెలియని వారికి కూడా మీరు ప్రాథమిక అవగాహన కల్పించగలరని చెప్పవచ్చు. కనీసం ఐదింటికి కూడా ‘ఎ’లు రాకపోతే మన ఇతిహాసాలపై ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేదని, వాటి గురించి ఎవరు ఏం చెప్పినా ఔననీ, కాదనీ చెప్పలేని స్థితిలో ఉన్నారని, కాబట్టి కనీసం పరిజ్ఞానం పెంచుకోక తప్పదని చెప్పవచ్చు. -
సీతమ్మ కొలిచిన దేవత పళ్లేలమ్మ
పుణ్య తీర్థం వానపల్లి పళ్లేలమ్మ తల్లి భారతీయ సంస్కృతిలో దేవుళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో, దేవతామూర్తులకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. లక్ష్మి, పార్వతి, అలమేలు మంగమ్మ, పద్మావతీదేవి రమ, ఉమ వంటి దేవతలు దేవసహితంగా పూజలు అందుకుంటుంటే, ఆదిశక్తి స్వరూపిణి అయిన దుర్గ, చాముండి, కాళిక మొదలైన దేవతలు స్వయంప్రభతో వెలుగొందుతూ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లులుగా ఖ్యాతినందుకుంటున్నారు. కాళికాదేవి మరో అవతారంగా పేర్కొనదగ్గ దేవతలలో పవిత్రగోదావరి తీరప్రాంతవాసులకు ఆరాధ్యదైవంగా ఉన్న దేవత పళ్లాలమ్మ తల్లి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం, వానపల్లిలో పూజలందుకుంటోంది. స్థలపురాణం వనవాస కాలంలో సీతాదేవి గౌతమి, గోదావరి నదిలో స్నానమాచరించి, ఆ ప్రకృతి వనంలో ఒక పీఠాన్ని నెలకొల్పి అక్కడ దేవతాస్వరూపం ఉన్నట్లు భావన చేసుకుని, అక్కడ దొరికే పండ్లు, పూలతో అమ్మవారిని అర్చించేదట. సీతాదేవి భక్తికి మెచ్చిన ఆ ప్రకృతి దేవత పళ్లాలమ్మగా దర్శనమిచ్చి అనుగ్రహించిందట. గౌతమీ నదీతీరంలో గల ఈ వానపల్లిని పూర్వం వానరపల్లి అని పిలిచేవారు. ఈ గ్రామం త్రేతాయుగంలో వాల్మీకి రామాయణ కాలం నాటిదని, వనవాస కాలంలో సీతమ్మ గౌతమీ నదీతీరంలో వానపల్లి ప్రాంతంలో సంచరించినట్లు నానుడి. అయితే, వనాలు, వానరాలతో ఉండటం వల్ల వానరపల్లిగా ఈ గ్రామానికి పేరొచ్చింది. ఇప్పటికీ ఈ గ్రామానికి పక్కనే కోతుల తోట పేరుతో ఒక గ్రామం ఉంది. సీతాదేవి వనవాస సమయంలో గౌతమీనదిలో స్నానం చేసి, ప్రకృతినే దేవతగా పూజించగా ఆమె పళ్లాలమ్మగా దర్శనమివ్వడమేగాక సీతమ్మవారు కోరిన కోరికలన్నీ నెరవేరేలా ఆశీర్వదించింది. అప్పుడు సీతమ్మవారు ఈ ప్రాంతంలో ఒక పేరులేని చెట్టును నాటిందని, ఆ చెట్టు నేటికీ ఉందని స్థానికులు చెబుతుంటారు. అమ్మవారు నాటిన ఆ చెట్టు చుట్టూ మూడుమార్లు ప్రదక్షిణం చేసి, చెట్టును పూజిస్తే సంతానంలేని వారికి వంశాభివృద్ధి చేసేలా కుమారుడు పుడతాడని భక్తుల విశ్వాసం. ఈ వృక్షానికి మొక్కుకుని, సంతానం కలిగిన వెంటనే ఒక కొబ్బరి మొక్కను, చీరను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. రాజుల నుంచి దొరల వరకు.... పిఠాపురం మహారాజావారి దగ్గరనుంచి, ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి ఆనకట్టను కట్టిన సర్ ఆర్థర్ కాటన్ దొర కూడా ఈ అమ్మవారిని ఆరాధించిన వారే. కాటన్ దొరకు అమ్మవారే స్వయంగా కలలో కనిపించి, ఆలయం పక్కన కాలువ తవ్వకం ప్రారంభిస్తే దిగ్విజయంగా కాలువ తవ్వకం పనులు జరుగుతాయని చెప్పిందట. ఆమె చెప్పినట్లుగానే కాటన్ దొర ముందు అనుకున్నట్లుగా గాకుండా కాలువను ఆలయం పక్కగా మరల్చి పనులను పూర్తి చేశాడట. ఆనకట్ట పనులు విజయవంతం కావడంతో కాటన్ దొర అమ్మవారికి పూలు, పళ్లు, చీర, సారె సమర్పించేవాడు. అలా క్రమం తప్పకుండా అమ్మవారికి పళ్లేల కొద్దీ సంభారాలు సమర్పిస్తుండడంతో... ఈ అమ్మవారిని స్థానికులు పళ్లేలమ్మ అని పిలవసాగారు. అదే వాడుకలోకి వచ్చింది. అక్కచెల్లెళ్లతో ఆటపాటలు! పళ్లేలమ్మ అర్ధరాత్రులలో తన 101 మంది అక్కచెల్లెళ్లతో ఆటపాటలతో గడుపుతుందని, ఆ సమయంలో ఆమె ఆనందానికి అవరోధం కలిగించడం అంత మంచిది కాదని పెద్దలు చెబుతారు. అందుకే స్థానికులెవరూ చీకటి పడిన తర్వాత ఆలయం ఛాయలకు వెళ్లరు. ఆలయానికి దగ్గరలోనే పోలేరమ్మ ఆలయం ఉంది. అక్కడే అమ్మవారి సోదరుడు పోతురాజు విగ్రహం కూడా ఉంది. పౌర్ణమి వెళ్లిన సోమవారం ఈ పోతురాజుకు, పోలేరమ్మకు కుంభం సమర్పించి గ్రామంలో ఉన్న ఆలయానికి అమ్మవారిని శ్వేతవస్త్రాలంకరణతో ప్రవేశింపజేస్తారు. ఈ సమయంలో అమ్మవారికి ఎదురుగా ఎవరూ రాకూడదని, అలా వస్తే వారు శిలగా మారుతారని చెబుతారు. అలాగే చైత్రశుద్ధ పౌర్ణమి వెళ్లిన సోమవారం గుడిలోని అమ్మవారిని గ్రామంలోని మరొక గుడికి తీసుకుని వెళ్లి నెలరోజులపాటు నిత్యం రాత్రిసమయంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేస్తారు. అలా మరుసటి పౌర్ణమి వెళ్లిన మంగళవారం వరకు నెలరోజులపాటు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నెలరోజులూ ప్రతి ఆదివారం ఉదయం తూర్పుదిశగా అమ్మవారి ముందు కుంభం పోస్తారు. అభిషేకాలు, ఆరాధనల అనంతరం తూర్పుదిశగా అమ్మవారు బయలుదేరి ఏ తోటలో అడుగుపెట్టి తాడిచెట్టుకు పసుపు పూస్తారో, ఆ తాడిచెట్టును నరికి చిన్న గుడి వద్దకు తీసుకు వస్తారు. మరుసటి రోజు పడమర కుంభం పోసి పడమర దిశగా బయలుదేరి సిరిబండపై గ్రామప్రజలు తీసుకుని వస్తారు. ఆ రోజు అమ్మవారి జాగరణ జరుగుతుంది. తాటి ఊయలపై ఊపి అదే రోజు సాయంత్రం సిరిబండ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.ఈ నెలరోజులూ ఆలయం వద్ద తీర్థం జరుగుతుంది. ఈ తీర్థానికి దేశం నలుమూలల నుంచి అనేకమంది భక్తులు విశేషంగా విచ్చేస్తారు. ఎలా వెళ్లాలి? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి 35 కిలోమీటర్ల దూరంలో కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం నుండి ఈ వానపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు, వివిధ రకాల వాహనాలలో కూడా వెళ్లవచ్చు. -
డ్యాన్స్.. గిన్నిస్ అంత..
హైదరాబాద్: వంద స్కూళ్లు... 2,200 మంది విద్యార్థులు... లయబద్ధమైన అందెల సవ్వడులు... అద్భుతమైన అభినయంతో మంత్రముగ్ధులను చేశారు. మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందిన ‘లావణి’ నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్బుక్ రికార్డు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు 570 మందితో ప్రదర్శించి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు సాధించిన రికార్డును వెనక్కి నెట్టి తెలంగాణ పేరును గిన్నిస్బుక్లో లిఖించారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో తనూష్, నీలిమా డ్యాన్స్ అకాడమీల ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులు ప్రదర్శించిన ఈ మహానృత్యాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వీక్షించి పరవశించారు. నాట్య బృందానికి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ను మంత్రి అందించారు. భారతీయ సంస్కృతికి రూపం భారతీయ సంస్కృతికి రూపమీ లావణి నృత్యమని, చిన్నారులు అద్భుతంగా ప్రదర్శించారని దత్తాత్రేయ చెప్పారు. గిన్నిస్బుక్లో చోట్టు దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్, గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అడ్వైజర్ జయంతిరెడ్డి, నిర్వాహకులు వేదకీర్తి, లక్ష్మి పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘అనుపు’ ఉత్సవాలు
సాగర్ వద్ద అనుపు యాంఫీ థియేటర్ వేదికగా ఉత్సవాలు మూడు రోజులపాటు జానపద, సంప్రదాయ నృత్యాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి వెల్లడి సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతి, కళల పునరుజ్జీ వమే లక్ష్యంగా శుక్రవారం నుంచి ‘అనుపు’ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి తెలిపారు. నాగార్జునసాగర్ డ్యామ్ సమీపంలో ఉన్న అనుపు గ్రామంలో మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. ఈ ఉత్సవాల్లో దాదాపు 350 మంది కళాకారులు వేర్వేరు కళారూపాలను ప్రదర్శించనున్నారని గురువారం విలేకరుల సమావేశంలో సుధామూర్తి తెలిపారు. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ సమయంలో మహాయాన బౌద్ధానికి సంబంధించిన అనేక అవశేషాలు బయటపడ్డాయని, దాదాపు 1700 ఏళ్ల పురాతనమైన యాంఫీ థియేటర్ (ప్రదర్శన స్థలం) సమీపంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నామని ఆమె వివరించారు. శుక్రవారం సాయంత్రం ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అనంతరం కూచిపూడి, నాదస్వర ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా భరతనాట్యం, సంగీత, నాటక, జానపద నృత్యాలను కూడా ఏర్పాటు చేశామని, ఇన్ఫోసిస్ ఉద్యోగు లు కూడా ప్రదర్శన ఇవ్వనున్నారని చెప్పారు. మూడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు మధ్యాహ్నం 3.30 గంట ల నుంచి సాయంత్రం ఏడు గంటల వర కూ ఉంటాయని, అందరూ ఆహ్వానితు లేనని తెలిపారు. భారతీయ కళలు, సంస్కృతిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇన్ఫోసిస్ ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తోందని, దానిలో భాగంగానే ఈ ఏడాది మార్చిలో గదగ్ (కర్ణాటక)లో లక్ష్మిశ్వర ఉత్సవాలను నిర్వహించామని చెప్పారు. కర్ణాటకలో ఇలాంటి ఉత్సవాలు దాదాపు వంద వరకూ నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్నామని, అనుపు ఉత్సవాలకు వచ్చే స్పందన ఆధారంగా తెలుగు రాష్ట్రాలోనూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. విద్యార్థుల్లో భారతీయ కళలపై ఆసక్తిని పెంచేందుకు, వారిని ప్రోత్సహిం చేందుకు భారతీయ విద్యాభవన్తో కలసి పనిచేస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారతీయ విద్యాభవన్ ప్రతినెలా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ప్రతిభ కలవారికి తాము నిర్వహించే ఉత్సవాల్లో ప్రదర్శనలిచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఇన్ఫోసిస్ హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ మనీషా సాబూ తదితరులు పాల్గొన్నారు. -
బికినీల సంస్కృతి మనది కాదు
కాంగ్రెస్ మహిళా విభాగం నిరసన ర్యాలీ బీచ్లవ్ ఫెస్టివల్ను అడ్డుకుని తీరుతాం.. ఏబీవీపీ బీచ్ ఫెస్టివల్ పై నిరసనలు మిన్నంటుతున్నాయి. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.భారతీయ సంస్కృతిపై దాడి అంటూ పలువురు మండిపడుతున్నారు. తక్షణమే బీచ్లవ్ ఫెస్టివల్ రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. ప్రభుత్వం పంతంతో ముందుకెళితే ఎలాగైనా అడ్డుకుంటామని ప్రజాసంఘాలు,విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. డాబాగార్డెన్: బికినీల సంస్కృతి మాకొద్దంటూ కాంగ్రెస్ పార్టీ మహిళా భాగం..విషసంస్కృతిని ప్రోత్సహిస్తున్న బీచ్ లవ్ ఫెస్టివల్ను అడ్డుకుని తీరుతామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), తక్షణమే రద్దు చేయాలంటూ ఉత్తరాంధ్ర సంస్కృతి పరిరక్షణ వేదిక నిరసన చేపట్టారుు. బీచ్లవ్ ఫెస్టివల్ ను వ్యతిరేకిస్తూ నగర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం యల్లమ్మతోటలో గల పార్టీ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టగా..అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) డాబాగార్డెన్స అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. బికినీల సంస్కృతి మాకొద్దు.. : బికినీల సంస్కృతి మాకొద్ద ని నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి అన్నారు. మహిళా సాధికారత అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. మహిళలను అవమానపరిచే బీచ్ ఫెస్టివల్ను రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి గుంటూరు భారతి మాట్లాడుతూ పాశ్చత్య సంస్కృతి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు యల్లపు రఘురాం, హైదరాలీ షింకా, ఆలేటి హేమలత, రజియాబేగం పాల్గొన్నారు. బీచ్ ఫెస్టివల్ను అడ్డుకుంటాం : విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్న బీచ్ లవ్ ఫెస్టివల్ను అడ్డుకుని తీరుతామని అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) హెచ్చరించింది. బీచ్లవ్ ఫెస్టివల్ను వ్యతిరేకిస్తూ డాబాగార్డెన్స అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అల్లూరి నడచిన భూమిపై అశ్లీలత రద్దు చేయాలని..యువతను అభివృద్ధి వైపు నడిపించాలి..కానీ ఆకర్షణల వైపు కాదని..బీచ్ ఫెస్టివల్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి టి.ఎన్.రాజు, జిల్లా కన్వీనర్ ఎం.గణేష్, సిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ దేశ సంస్కృతిని కించపరుస్తూ పాశ్చాత్య సంస్కృతి ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. అభివృద్ధి పేరిట మందు వ్యాపారం, అశ్లీల వాతావరణం సృష్టించడం టీడీపీ ప్రభుత్వానికి తగునా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మహేంద్ర, మౌనిక, రమ్య, లావణ్య అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏ విలువలకీ విష సంస్కృతి?
రెండో మాట సంస్కరణల తదుపరి మొదలైన విశృంఖల పాలనా పద్ధతులలో భాగమే పర్యాటక పరిశ్రమకు ప్రోత్సాహం పేరిట పాశ్యాత్య విష సంస్కృతిని ప్రోత్సహించడం. ఏపీ ప్రభుత్వం దేశ విదేశాల నుంచి 9 వేల జంటలను ఆహ్వానించి బీచ్ లవ్ ఫెస్టివల్ను నిర్వహించబోవడం ఇందులో భాగమే. గోవాకే పరిమితమైన ‘బీచ్ లవ్’ సంస్కృతిని బీజేపీ మద్ధతుతో నడుస్తున్న టీడీపీ ప్రభుత్వం కూడా ఆశ్రయిస్తోంది. భారతీయ ప్రాచీన సంస్కృతిని ఆరాధకుల మనే బీజేపీ పాలకులకు ఈ ‘బీచ్ లవ్’ ఎలా నప్పిందో ప్రజలకు వారు వివరించాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ విశృంఖల విహారాన్ని నేడు మన దేశంలో వివిధ స్థాయిలలో కళ్లారా చూస్తున్నాం. రకరకాల మార్గాలలో ఇది ప్రదర్శితమ వుతోంది. 1991లో ప్రపంచబ్యాంకు-అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు జమిలిగా ‘‘నూతన సమాచార వ్యవస్థ’’ వెన్నుదన్నుగా ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లకు తెరఎత్తాయి. తద్వారా అమెరికా పతనమవుతున్న తమ సామ్రాజ్య పెట్టుబడి వ్యవస్థ ఆర్థిక చట్రాన్ని, కోల్పోతున్న మార్కెట్ను రక్షించుకునే ప్రయత్నంలో ‘ప్రపంచీకరణ’ మంత్రదండంతో వర్ధమాన దేశా లను తన సరుకులతో నింపదలచింది. పర్యవసానంగా భారత పాలకవర్గాలు (కాంగ్రెస్-బీజేపీ) ప్రపంచ బ్యాంకు ద్వారా అమలులోకి తెచ్చిన సంస్కర ణలలో భాగంగానే అన్నిరకాల అవలక్షణాలు ఆర్థికంగానే గాకుండా సాంస్కృ తికంగా కూడా మన దేశాన్ని ముప్పెరగొన్నాయి. వాటిలో భాగమే మన పాలకులు ఆ సంస్కరణలపై బేషరతుగా ముద్రవేయడం. ఆ ‘ముద్ర’ కాస్తా దేశం ఉసురు తీస్తోంది. యువతను పక్కదారులు పట్టించి చెడగొట్టే విష సంస్కృతిని వ్యాపింపజేయడంద్వారా, ప్రజావ్యతిరేక సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను, సంస్కృతి, సంప్రదాయాలను వినాశనం వైపుగా మళ్లించి, తమకు శాశ్వత బానిసగా పడి ఉండే ఇండియాను తయారు చేయ డమే అమెరికా లక్ష్యం. సంస్కరణలవల్లే కుక్కమూతి పిందెల సంస్కృతి 1991లో ఈ ప్రక్రియను ప్రారంభించిన మన్మోహన్ సింగ్, నాటి ప్రధాని పీవీ నరసింహారావుకన్నా వరల్డ్ బ్యాంకు ‘సంస్కరణల’ను దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా మూడేళ్లు ముందుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆచరణలో పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాగా, బీజేపీ నాయకునిగా. ప్రధాన మంత్రి హోదాలో వాజ్పేయి మరొక అడుగు ముందుకు వేసి సంస్కరణ లను పెద్ద ఎత్తున అమలులోకి తెచ్చే ప్రక్రియను ‘‘వెలిగిపోతున్న భారతం’’ అన్నారు. నాయకులు, వారి అనుయాయులంతా ఆర్థికంగా ‘వెలిగి’పోయా రుగానీ, దేశ సామాన్య ప్రజాబాహుళ్యం బతుకులు మాత్రం చీకట్లోకి జారు కున్నాయి. ఆనాటి నుంచి ఈనాటి దాకా సామాజికంగానే గాక సాంస్కృతి కంగా కూడా ఈ సంస్కరణలు బతుకు విలువల్ని నైతిక విలువలను దిగజా రుస్తూనే వచ్చాయి. ఈ సర్వవ్యాపిత పతన సంస్కృతిలో భాగంగానే సాంస్కృ తిక రంగంలోనూ కుక్కమూతి పిందెలు మొలకెత్తి ఎదిగిపోతున్నాయి. ఇందుకు ఉదాహరణ దేశంలో పలు చోట్ల మహిళలు, విద్యార్థులు, వృత్తిదా రులు, కార్మిక, బలహీన వర్గాలపైన అనేక అత్యాచారాలు, దాడులూ పెరిగి పోతున్నాయి, హత్యల సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతోంది. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్ని బహిర్గతం చేసే పాత్రికేయులపైన, పత్రికలపైన, విశ్వవిద్యాలయాలు, విద్యార్థి సంఘాలపైన, వాటి నాయకులపైన ప్రివెంటివ్ డిటెన్షన్, సెడిషన్ (రాజద్రోహ నేరం) చట్టాలను ప్రయోగించేందుకు పాలకులు సాహసిస్తు న్నారు. ఈ సంస్కరణల తదుపరి ఈ 20 ఏళ్లలోనే స్త్రీల మధ్యనే వివక్ష చూపే అందాల పోటీలు, బ్యూటీపార్లర్లు, క్యాట్వాక్లూ, ఆహార్యం, సౌందర్య పోషణ పేరిట వింత పోకడలూ చోటు చేసుకున్నాయి. సమానతా సూత్రం ప్రాతిపదికపై వనరుల పంపిణీ పద్ధతిలోగాక ప్రభుత్వాలు దుబారా పర్యటన లకు, మంత్రుల, ముఖ్యమంత్రుల విహార యాత్రలకూ మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెడుతూ ప్రజల కనీస అవసరాలను తుంగలో తొక్కుతున్నారు. పర్యాటక వృద్ధి పేరిట విశృంఖలత ఈ విశృంఖల పాలనా పద్ధతులలో భాగమే పర్యాటక పరిశ్రమను ప్రోత్సహిం చడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి వనరులు సమకూర్చుకోవాలన్న యత్నం. స్థానిక, సంప్రదాయ కళల ద్వారా సంగీత, నృత్య విభావరులు పునాదిగా, దేశంలోని వివిధ స్థానిక సంస్కృతులకు ఆలవాలమైన జానపదుల కళారూపాల ద్వారా కూడా పర్యాటక రంగ ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చు. కానీ పాశ్చాత్య సంస్కృతి ద్వారా విష సంస్కృతిని పెంచి పోషించడం, స్థానిక యువత అభిరుచుల్ని పక్కదారులు పట్టించే ప్రయత్నాలు అభ్యంతరకరం. దేశ విదేశాల నుంచి 9 వేల జంటలను ఆహ్వా నించి, అందాల పోటీలు, హాలీవుడ్- బాలీవుడ్ తారల నృత్యాలు, వలంటైన్ (ప్రేమికుల) దినోత్సవాన్ని కలుపుకుంటూ ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 12 నుంచి 14 వరకూ ‘‘బీచ్ లవ్’’ ఉత్సవాలను నిర్వహించబోవడం ఇందులో భాగమే. అందుకే మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా స్వామిక శక్తులూ ఈ ‘బీచ్ లవ్’ ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి గోవాకే (బీజేపీ పాలన) పరిమితమైన ‘బీచ్ లవ్’ సంస్కృతిని బీజేపీ మద్ద తుతో నడుస్తున్న టీడీపీ ప్రభుత్వం కూడా ఆశ్రయిస్తోంది. నిత్యమూ భార తీయ ప్రాచీన సంస్కృతిని ఆరాధిస్తున్నట్టు కన్పించే బీజేపీ పాలకులకు ఈ ‘బీచ్ లవ్’ ఎలా నప్పిందో ప్రజలకు వారు వివరించాలి. ఆచరణలో రాజ్యాంగానికి, రాజ్యాంగంలోని ప్రాథమిక పౌర బాధ్యతల అధ్యాయంలో 51-ఎ (హెచ్) అధికరణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాల కులు పాలనకు అనర్హులవుతారు. సెక్యులర్ వ్యవస్థను రక్షించలేని వారు రాజ్యాంగ వ్యతిరేకులు. బ్యాంకు సంస్కరణలు అమలులోకి వచ్చిన తరువాత సమాజంలోని వివిధ సామాజిక వర్గాలపైన వాటి చెడు ప్రభావం ఎలా విస్తరిస్తూ వచ్చిందో, ముఖ్యంగా దేశ మహిళల జీవితాలపైన ఎలాంటి ప్రభావానికి దారిదీశాయో ‘బ్యాంక్-ఐఎంఎఫ్ సంస్కరణల కింద భారత మహిళల పనిపాటపైన ఎలాంటి ప్రభావం పడిందో’ ప్రసిద్ధ పరిశోధకురాలు రజనీ దేశాయ్ (1998 ఏప్రిల్ 24) వివరించారు. ఆమె ఇలా అన్నారు: ‘‘ఈ సంస్కరణలవల్ల పని చేసుకుంటూ దోపిడీకి గురైన శ్రామిక వర్గ మహిళలు అత్యధికులు. కేవలం ఆర్థిక కారణాలవల్ల ఆహారం, ఇతర నిత్యావసరాలు అందని పేద కుటుంబాలున్నాయి. ఈలోగా ప్రపంచబ్యాంకు ‘పొదుపు’ కార్య క్రమాలూ, ‘పథకాలు’ దూసుకు వచ్చిన ఫలితంగా ఆహార ధాన్యాల రేషన్ ధరలు బహిరంగ సంతలో రెట్టింపుకు పెరిగిపోయాయి. ఈ మహిళా కార్మికుల్లో ఐదింట నాలుగు వంతులు వ్యవసాయ కూలీలు లేదా పేద రైతులు. వీరంతా అసంఘటిత కార్మికులు. ఈ ఆర్థిక దోపిడీకి తోడుగా నూతన ‘ఆర్థిక సంస్కరణల’ పేరు చాటున మహిళలపైన సాంస్కృతికం గానూ, సామాజికంగానూ దాడులు ముమ్మరం అయ్యాయి. సంస్కరణలు ప్రారంభమైన తరువాత అందాల పోటీల పేరిట మహిళల మధ్య ఒక రకమైన ఉన్మాద వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారు. ఈ ‘అందాల పోటీలు’ ఆధారంగా తమ సౌందర్యోపకరణ సరుకుల్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి వీలు చిక్కింది. పట్టణాల్లోని మహిళల మనస్సులపైన, ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి యువతులపైన ఈ పోటీల ప్రభావం పడింది’’. దీంతో దేశ మంతటా బ్యూటీపార్లర్లు తామరతంపరగా వ్యాపించాయి. అందంగా ముఖాలు కనబడేలా చేసే ఫేసియల్ క్రీమ్స్ వచ్చాయి. అలా, మార్కెట్ ఎకా నమీ (సంత దోపిడీ) తత్వాన్నిబట్టి వ్యభిచార వృత్తిని కూడా ఒక ‘సేవా రంగం’గా పరిగణించే సంస్కృతిని పెంచేశారు. స్త్రీని విపణి సరకుగా మార్చే విష సంస్కృతి ఈ సంస్కరణల ప్రభావంతోనే కొన్ని దేశాల్లో విదేశీ మారక ద్రవ్య సంపాదన కోసం పర్యాటక పరిశ్రమలో భాగంగా ‘సెక్స్ టూరిజాన్ని’ ప్రవేశపెట్టారు. చివరికి పూర్వపు సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల్లో కూడా బ్యాంక్-ఐఎంఎఫ్ల సంస్థాగత మార్పుల పేరిట ఈ సెక్స్ టూరిజాన్ని ప్రవేశ పెట్టారు. అలాగే ఇండియాలో కూడా అవే సంస్కరణల పేరిట టూరిజం ద్వారా ఆదాయం సంపాదించేందుకు ప్రభుత్వాలు సిద్ధం అయిన కొద్దీ ఈ విష సంస్కృతి ప్రబలిపోయే అవకాశాలూ పెరిగాయని కూడా రజనీ దేశాయ్ వివరించారు. అలాగే ప్రపంచీకరణ జపం ఫలితంగా సౌందర్య పోషకాల (కాస్మెటిక్స్) పరిశ్రమ కూడా దూసుకు వచ్చింది. ఇందుకు కార్పొరేట్లు ప్రచార, ప్రసార మాధ్యమాలైన మీడియాను విస్తారంగా వాడుకోవడం ప్రారంభించారు. ఫలితంగా ఈ పరిశ్రమ పదేళ్ల వ్యవధిలోనే (1991-2000) రూ.2,311 కోట్ల వ్యాపారం నుంచి రూ. 18,900 కోట్లకు పెరిగిపోయింది. ఇక ‘మిస్ ఇండియా’ పోటీలూ పెరిగిపోయాయి. ఈ జాడ్యం కళాశాలల నుంచి ‘గల్లీల’కూ పాకిపోతూ వచ్చింది. ఈ పోటీలు స్త్రీల మధ్య వ్యత్యాస భావనను పనిగట్టుకుని మరీ పెంచేసిందని మరచిపోరాదు. అందుకే ఆనాడు గురజాడ స్త్రీల కన్నీటి గాథలకు కారణం నాకు తెలుసని అంటే, శ్రీశ్రీనే కాదు, ‘‘స్త్రీ స్త్రీ’’ని కూడా అన్నాడు. అలాగే ‘మనిషే బంగారమని’ వ్యత్యాస సంస్కృ తిని సాహిత్యపరంగా తుత్తునియలు చేసినవాడు మహాకవి రాబర్ట్ బర్న్స్. కానీ ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లు దేశంలోనూ అంతర్జాతీయంగానూ ప్రవేశ పెట్టిన ఆంగ్లో-అమెరికన్ వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్లు మాత్రం ‘మహిళల్ని వ్యాపార వస్తువులు’గా పరిగణించే విష సంస్కృతికి తలుపులు తెరిచాయి. ఆ ఎంగిలిని మన పాలకులూ అభిమానించి, ఆదరించడం దుస్సహకారణమవు తోంది. బహుశా అందుకే వస్తుదాహ సంస్కృతిలో ఇంద్రజాల, మహేంద్ర జాల శక్తిని గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ శాశ్వత ప్రక్రియగా మార్చింది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
భారతీయ సంస్కృతిపై విదేశీయుల మోజు
-
గోమాత సంరక్షణకు పాటుపడాలి
ఆదిలాబాద్ కల్చరల్: భారతీయ సంస్కృతి హిందుధర్మంలో గోమాతను సర్వదేవత ప్రతి రూపాలుగా పూజిస్తామని, అటువంటి గోమాతను సంరక్షించేందుకు హిందువులంత పాటుపడాలని హిందువాహిని పట్టణ అధ్యక్షుడు ఓరగంటి అఖిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్రగోపాలకృష్ణమఠంలో గోసంరక్షణ కమిటి ఎన్నికను హిందువాహిని ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందు ధర్మాన్ని పరిరక్షించాలని, గోమాతలు అంతరించకుండా పాటుపడాలని, ప్రజల్లోనూ చైతన్యం తేవాలని చెప్పారు. గో సంరక్షణ కమిటి పట్టణ అధ్యక్షుడుగా మాడిపెల్లి ప్రమోద్, ప్రధాన కార్యదర్శిగా రాకేశ్, కార్యదర్శులుగా పోతుగంటి మల్లికార్జున్, బొమ్మకంటి ప్రేమ్సాగర్, లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో హిందువాహిని లోలపుల నరేష్, ఉపాధ్యక్షులు సాయిచరణ్,శ్రీకాంత్, రఘు, క్రిష్ణ, హరిష్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ సంస్కృతి చూస్తే గర్వంగా ఉంది
- ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రానర్ - దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న ఎన్నారైలకు అభినందనలు: వెంకయ్య - అట్టహాసంగా ప్రారంభమైన ‘ఆటా’ వేడుకలు చికాగో నుంచి శ్రీనాథ్ భారతీయ సంస్కృతి చూస్తే గర్వంగా ఉందని ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రానర్ అన్నారు. అమెరికాలోని చికాగోలో శనివారం ఆయన ‘ఆటా’ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబాల సంప్రదాయాన్ని అమెరికన్లూ నేర్చుకోవాలని కోరారు. వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని విదేశీయులు కూడా ఇష్టపడుతున్నారని, దానికి భారతీయులు చేస్తోన్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. అమెరికాలోని భారతీయులు మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నారైలను కోరారు. ఆటా వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రోజా చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న లక్షలాది మంది ఎన్నారైలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆటా వేడుకలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ స్థాయిలో క్యాడర్ రావడం సంతోషంగా ఉందనీ, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నట్లుగా పాలన జరగడం లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శృతిలయలు సినిమాలో చిన్నారిగా నటించిన షణ్ముఖ శ్రీనివాస్ చేసిన కూచిపూడి నృత్యం తొలిరోజు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకట్టుకున్న పల్లె సెట్టింగ్ : ఆటా వేడుకల్లో రోజ్మెంట్ ఈ స్టీఫెన్ సెంటర్లో భారత పల్లెదనాన్ని ప్రతిబింబిస్తూ వేసిన సెట్టింగ్ పలువురిని అమితంగా ఆకట్టుకుంది. తొలి రోజు ఆటా వేడుకల్లో ఎంపీలు మిథున్రెడ్డి, జితేందర్రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేవాలయాలు ఏటీఎంలు కాదు..
విద్యారణ్య భారతి స్వామి చార్మినార్: భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా సైతం గౌరవిస్తుండగా... మనము మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు. సోమవారం మీరాలంమండి మహంకాళేశ్వర దేవాలయంలో శివపంచాయితం, మహంకాళి అమ్మవారు, అంజనేయ స్వామి, నాగ ఫణింద్రుడు, నవగ్రహాలకు ఆయన ప్రాణ ప్రతిష్ట చేశారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్బంగా ఒబామా దీపాలు వెలిగించి హిందూ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. భారతీయులు ఏదో ఒక సాకు చెబుతూ దేవాలయాలు, పూజలకు దూరమవుతున్నామన్నారు. దేవాలయాలు ఏటీఎం కేంద్రాలు కాదని, మానవ వికాస కేంద్రాలుగా ఆయన అభివర్ణించారు. దేవాలయాన్ని కోర్కెలు తీర్చే మిషన్గా కాకుండా ఆధ్యాత్మిక వికాస కేంద్రంగా చూడాలన్నారు. 180 ఏళ్ల క్రితం లార్డ్ మెకాలే భారత సంసృ్కతి, సంప్రదాయాలను దెబ్బతీసేలా కార్యచరణను రూపొందించారని, ఈ కుట్రలను సమష్టిగా ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో దేవాలయం కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలోనూ మనోళ్లే టార్గెట్
చైన్ స్నాచర్ల బారిన పడుతున్న భారత మహిళలు సాక్షి, హైదరాబాద్: ఇక్కడే కాదు... అమెరికాలోనూ చైన్ స్నాచర్ల టార్గెట్ భారత మహిళలేనట! మూడు నెలల్లో అక్కడ మొత్తం 13 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైతే అందులో 11 మంది భారత సంతతికి చెందిన మహిళలే బాధితులు. అమెరికాలోని ఫ్రీమాంట్ పోలీసు విభాగ అధికారిణి జెనీవా బొస్క్వస్ ఇటీవల ఈ వివరాలు వెల్లడించారు. షాపింగ్ ప్రాంతాలతో పాటు నివాస సముదాయ పరిసరాల్లో నడుచుకొంటూ వెళుతన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని గొలుసుల చోరీలకు తెగబడుతున్నారన్నారు. బాధితుల్లో ఎక్కువగా ఇండో-అమెరికన్ మహిళలే ఉన్నారన్నారు. ‘బరువైన’ నగలపై గురి... భారత సంస్కృతి ప్రతింబింబించేలా ఇండో-అమెరికన్ మహిళలు అధిక బరువుండే బంగారు గొలుసులు ధరించేందుకు ఇష్టపడుతున్నారు. వీటి విలువ మార్కెట్లో 300 నుంచి 3,000 డాలర్లు ఉంటోంది. దీంతో వీటిపై చైన్ స్నాచర్లు కన్నేశారు. ఇలాంటి మహిళలనే టార్గెట్ చేసి కొట్టేసిన నగలను గుర్తింపునడగని షాపుల్లో సులువుగా అమ్మేస్తున్నారు. ఫ్రీమాంట్ హబ్ షాపింగ్ ప్రాంతంలో నడుచుకొంటూ వెళుతుండగా బైక్పై వచ్చిన దుండగులు తన మెడలోని గొలుసు లాక్కెళ్లారని ఓ భారత సంతతి మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్దకు వచ్చిన ఆఫ్రికన్ మెడలో గొలుసు తెంపుకొని వెళ్లాడనేది మరో మహిళ ఫిర్యాదు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలను దుస్తుల లోపల ధరించాలని బొస్క్వస్ సూచిస్తున్నారు. -
రేపటి నుంచి నంది నాటకోత్సవాలు
తిరుపతిలో చురుగ్గా ఏర్పాట్లు తిరుపతి కల్చరల్: నంది నాట కోత్సవాలకు తిరుపతి నగరం ముస్తాబైంది. నాటకోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పౌరాణిక పద్య, సాంఘిక నాటికలను ప్రదర్శించనున్నారు. 2006లో ప్రథమంగా ప్రభుత్వ నందినాటకోత్సవాలు తిరుపతి నగరంలో జరిగాయి. దశాబ్దం తర్వాత రెండో సారి ఆధ్యాత్మిక తిరుపతి నగరం నంది నాటకోత్సవాలకు వేదికగా నిలవబోతోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఎఫ్డీసీ ఆధ్వర్యంలో చురుగ్గా సాగుతున్నాయి. ప్రారంభోత్సవ సభను దృష్టిలో ఉంచుకుని మహతి కళా వేదికను కలియుగ వైకుంఠుడు, సప్తగిరీశ్వరుడైన శ్రీవేంకటేశ్వరుని ప్రతిమతో సుందరంగా అలంక రించారు. మహతి ఆవరణలో నంది నాటకోత్సవాలను చాటే విధంగా కటౌట్లు, నంది ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు. ఎఫ్డీసీ మేనేజర్ శేషసాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మార్గదర్శకమైన కళా రంగ పరిరక్షణతో పాటు ప్రోత్సహిస్తూ వాటిని భావితరాలకు అందించాలనే సంలక్పంతో ప్రభుత్వం నంది నాటకోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఏడాది సుమారు 190 పద్య, సాంఘిక నాటికలకు ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. వీటిని పరిశీలించి 44 నాటకాలను ప్రదర్శనకు ఎంపిక చేశామన్నారు. ఇందులో సుమారు 3 వేల మంది కళాకారులు పాల్గొంటారని తెలిపారు. నంది నాటకోత్సవాల పట్ల ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ స్పందిస్తున్నారని చెప్పారు. చివరిరోజైన 27న జరిగే బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై బహుమతుల అందజేస్తారని తెలిపారు. -
అదిరేటి డ్రస్సు మేమేస్తే..
భారతీయ సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిన విదేశీ విద్యార్థులు గుంటూరు పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాంప్ వాక్ గుంటూరు ఎడ్యుకేషన్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువతో గుం‘టూరు’ వచ్చిన విదేశీ విద్యార్థులు సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే వస్త్రాలు ధరించి ర్యాంప్వాక్ చేసి ఆకట్టుకున్నారు. యూకే-ఇండియా ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (యూకేఐఈఆర్ఐ) ప్రాజెక్టు కింద ఏఐసీటీఈ సహకారంతో గుంటూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్యాషన్ అప్పారెల్ టెక్నాలజీపై స్కాట్లాండ్కు చెందిన గ్లాస్గో కెల్విన్ కాలేజీ విద్యార్థుల బృందం నాలుగు రోజులుగా శిక్షణ పొందుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన 10 మంది విదేశీయుల బృందం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులతో కలిసి ఆధునిక, సంప్రదాయ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్లో హోయలొలికించారు. గార్మెంట్ మేకింగ్పై పొందిన శిక్షణ ఆధారంగా యూకే విద్యార్థులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు సంయుక్తంగా రూపొందించిన వస్త్రాలను ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి తిలకించారు. అనంతరం స్వదేశీ, విదేశీ విద్యార్థులు ‘ఫ్యాషన్ టెక్స్టైల్ రిఫ్లెక్షన్స్’ పేరుతో ర్యాంప్పై నడుస్తూ అలరించారు. ఉదయలక్ష్మి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన భారతదేశ వస్త్రాలకు విదేశాల్లో గుర్తింపు ఉందన్నారు. విదేశాల నుంచి విద్యార్థులు శిక్షణ పొందేందుకు రావడం శుభ పరిణామమని చెప్పారు. యూకేలోని గ్లాస్గో కెల్విన్ కళాశాల సందర్శనకు పాలిటెక్నిక్ కళాశాల తరపున అధ్యాపక బృందాన్ని పంపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్లాస్గో కెల్విన్ కాలేజీ డెరైక్టర్ ఎలస్టైర్ అండర్సన్ మెక్గే పైస్లీ ప్యాట్రన్ నిపుణుడు డాక్టర్ డాన్ కౌలీన్, ఇరువురు ఫ్యాకల్టీతో పాటు ఆరుగురు విద్యార్థులు, ఎస్బీటీఈటీ కార్యదర్శి నిర్మల్కుమార్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ ప్రతినిధి గజేంద్ర కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ ప్రసాద్, శిక్షణా కార్యక్రమం సమన్వయకర్త బి.నాగమణి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో నిర్మించిన శిక్షణా కేంద్ర నూతన భవనాన్ని కమిషనర్ ప్రారంభించారు. -
మన సంస్కృతికి ఇవే మచ్చు తునకలు
న్యూఢిల్లీ: భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిని, భిన్నమతాల వారు ఐకమత్యంతో కలసి ఉండడం భారత్లాంటి దేశానికే సాధ్యమైందని లండన్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడ గొప్పగా చాటి చెప్పారు. దేశంలో *అసహనం* పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు రాజకీయమే కావచ్చుగాక... నిజంగా మనది భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతని చాటి చెప్పేందుకు కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు.... ముస్లిం దంపతుల కొడుకుకు గణేశ్ పేరు 27 ఏళ్ల ఇలాయజ్ షేక్ ఒకరోజు నిండు చాలాలు అయిన తన భార్య నూర్ జహాన్ను డెలివరి కోసం ముంబైలోని ఓ ఆస్పత్రికి కారులో తీసుకెళుతున్నాడు. మార్గమధ్యంలోనే నూర్ జహాన్కు నొప్పులు పెరిగాయి. తన కారులో ప్రసవం ఒప్పుకోనంటూ ఆ కారు డ్రైవర్ వారిని బలవంతంగా అక్కడే దించేశారు. ఏం చేయాలో తోచని షేక్ సమీపంలోవున్న గణపతి గుడికి తన భార్యను తీసుకొని వెళ్లాడు. అక్కడున్న హిందూ మహిళలు కొందరు ఆమె పరిస్థితిని గమనించి గుడి స్తంభాలకు అడ్డుగా చీరలు కట్టి నూర్ జహాన్కు ప్రసవం చేశారు. అలా పుట్టిన కొడుకును షేక్ దంపతులు గణేశ్ అని నామకరణం చేశారు. హిందూ స్నేహితుడికి అంత్యక్రియలు చేసిన ముస్లిం ప్రాణాంతక జబ్బుతో అర్ధాంతరంగా కన్నుమూసిన సంతోష్ సింగ్ అనే మిత్రుడికి రజాక్ ఖాన్ తికారి హిందూ మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం, ఇది సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రాచుర్యం పొందిన విషయం తెల్సిందే. ఈ సంఘటన చత్తీస్గఢ్లో ఇటీవల చోటుచేసుకొంది. పేదవారైన సంతోష్ సింగ్ కుటుంబాన్ని రజాక్ ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. ఉమ్మడిగా అంత్యక్రియలు మధ్యప్రదేశ్లోని బార్వాని జిల్లా సెంద్వా పట్టణంలో సీతారాం అనే 75 ఏళ్ల వృద్ధుడు ఇటీవల మరణించాడు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూలేక పోవడంతో స్థానిక హిందువులు, ముస్లింలు కలసి హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. అనుమాన్ ఛాలీసా ఉర్దూలోకి అనువాదం హిందూ, ముస్లింల ఐక్యతను కోరుకుంటా అబీద్ అల్వీ అనే ముస్లిం యువకుడు హనుమాన్ ఛాలీసాను ఉర్దూలోకి అనవదించారు. ముస్లింల విశ్వాసానికి చెందిన ఉర్దూ పుస్తకాలను హిందీలోకి, హిందువుల గ్రంధాలను ఉర్దూలోకి మార్చాల్సిన అవసరం ఉందని ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్కు చెందిన అబీద్ అల్వీ అభిప్రాయపడ్డారు. గణపతి పందిరిలో ముస్లిం ప్రార్థనలు ముంబైలోని ఓ మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు చాలినంత చోటు లేకపోవడంతో మసీదు పక్కన వేసిన గణపతి పందిరిలోకి ముస్లింలను హిందూ భక్తులు ఆహ్వానించారు. పక్కన వినాయకుడి విగ్రహం ప్రతిష్టించి ఉన్నప్పటికీ ముస్లింలు అదే పందిరిలో ప్రార్థనలు జరిపారు. లూథియానా జైల్లో ఉమ్మడి పండుగలు లూథియానా జైల్లో ముస్లింలు, హిందువులు, సిక్కులు రంజాన్, దీపావళి, గురుపూరబ్ పండగలు కలసే జరుపుకుంటారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సంఘీభావంగా హిందువులు, సిక్కులు 40 రోజుల పాటు ఉపవాసం చేయగా, ముస్లింలు, సిక్కులు దసరా, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. హిందూ కీర్తనలు ఆలపించే బాబా.... మహారాష్ర్టలోని బీడ్ నగరానికి చెందిన 73 ఏళ్ల సాయిక్ రియాజొద్దీన్ అబ్దుల్ గనీ హిందూ దేవాలయాల్లో మీరా భక్తి గీతాలు, హిందూ కీర్తనలు ఆలాపిస్తూ హిందువులను ఎంతోగానో ఆకర్షిస్తున్నారు. రాజుబాబా కీర్తనకారుడు అని ఆయన్ని హిందువులు పిలుస్తారు. మతసామరస్యమనేది భారతీయ సంస్కృతిలో ఆనాదిగా ఉన్నదే. సూఫీ మతాధికారుల సమాధుల వద్దకెళ్లి ఉర్సు కార్యక్రమాల్లో హిందువులు పాల్గొనడం తెల్సిందే. హిందువులు, సిక్కులు కలసి దేశంలో మసీదులు నిర్మించడం, ముస్లింలు, హిందువులు కలసి దేవాలయాలు, గురుద్వారాలు నిర్మించడం లాంటి సంఘటనలు మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి. -
దాండియా నైట్..
-
చీరేశారు!
చీర అంటే అందం. చీర అంటే ఆనందం. చీర సౌందర్యాన్ని పెంచే ఓ వస్త్రమే కాదు... భారతీయ సంస్కృతికి చిహ్నం కూడా. అందుకే అతివల దుస్తుల వరుసలో చీర ఎప్పుడూ ముందుంటుంది. ‘నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా... ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అన్నాడో కవి. పట్టు చీరే కాదు... పట్టుమని వంద రూపాయలు చేయని చీరలో కూడా ముగ్ధ అందం మూడింతలవుతుంది. దక్షిణాది కంజీవరం నుంచి బెంగాల్ వారి బలుచరి వరకు... సెలెబ్రిటీలు కట్టే ఫ్యాన్సీ చీరల నుంచి పల్లె పడుచులు కట్టే నేత చీర వరకూ... చీర చీరకూ అందమే. కట్టిన ప్రతి పడతిలోనూ సౌందర్యమే. అందుకే మోడ్రన్ దుస్తుల్లో మురిపించే సినిమా తారలు సైతం చీరను చిన్నచూపు చూడరు. ఏ ప్రముఖ సందర్భం వచ్చినా చీరను వదలరు. విభిన్నమైన డిజైన్లతో, వైవిధ్యభరితమైన కట్టుబడితో చీరకు కొత్త అందాన్ని తెస్తున్నారు బాలీవుడ్ సుందరాంగులు. వివిధ సందర్భాల్లో వాళ్లు ఎలా ‘చీరే’శారో చూడండి! -
విడాకులు.. పెళ్లిచేసుకున్నంత తేలిక కాదు!
-
విడాకులు.. పెళ్లిచేసుకున్నంత తేలిక కాదు!
విడాకులు తీసుకోవడం, పెళ్లిచేసుకున్నంత తేలిక కాదు! ఈ మాటలో అతిశయోక్తి లేదు. భారతీయ సంస్కృతిలో సమాజం అయినా, చట్టం అయినా... భార్యాభర్తలను కలిపి ఉంచేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. భర్తగానీ, భార్య గానీ డైవోర్స్ తీసుకోదలచినప్పుడు... తగిన కారణం చూపాలని చట్టం నిర్దేశిస్తోంది. ఆ కారణం సరైనదని అనిపించినప్పుడు మాత్రమే... విడాకులు మంజూరు చేస్తుంది. ఇంతకీ ఆ సరైన కారణాలేమిటి? క్రూయల్టీ కారణాలు చూపి భర్త కూడా విడాకులు పొందవచ్చా? నాకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. ఏ లోటూ లేని సంసారం. కానీ పెళ్లయిన కొద్దిరోజుల నుండే నా భార్య తను డబ్బున్న కుటుంబం నుంచి వచ్చానన్న అహంకారంతో ప్రతి దానికీ నన్ను సతాయించడం మొదలు పెట్టింది. నా తలిదండ్రులను, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లను చిన్న చూపు చూస్తోంది. నా అనుమతి లేకుండా ఒకసారి అబార్షన్ చేయించుకుంది. పిల్లల్ని సరిగా పట్టించుకోదు, వారి ఆలనాపాలనా చూడదు. అదేమని నేను అడిగితే అందరి ముందు నన్ను దుర్భాషలాడటం, లేదంటే ఆత్మహత్యాయత్నం చేయడం... ఇలా చాలాసార్లు జరిగింది. ఎప్పటికైనా తెలుసుకుంటుందేమో అని నేను ఓపిక పడుతూ వచ్చాను. కానీ ఇంక నా వల్ల కాదు. విడాకులు తీసుకుందామని అడిగితే క్రిమినల్ కేసు పెట్టి, నన్ను జైల్లో వేయిస్తానని బెదిరిస్తోంది. నాకు ఏమీ పాలుపోవడం లేదు. అసలు మగవారు విడాకులు తీసుకోవాలంటే ఏ కారణాలుండాలి? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. - ఎ.లక్ష్మారెడ్డి, కామారెడ్డి మీరు చెప్పినవన్నీ నిజమే అయితే మీది చాలా బాధాకరమైన పరిస్థితి. క్రూయల్టీ ఎగనెస్ట్ హస్బెండ్ అనే గ్రౌండ్స్ కింద భర్త, భార్యకు కోర్టు ద్వారా విడాకుల నోటీసు పంపుకోగలగడానికి వీలు కల్పించే కారణాలున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని... భర్తను నలుగురి సమక్షంలోనూ దుర్భాషలాడటం, ఎందుకూ పనికిరానివాడివి, ఏమీ చేతకాని అసమర్థుడివి, నపుంసకుడివి అని తిట్టడం, భర్తతో సంసారం చేయడానికి నిరాకరించడం, భర్త అనుమతి లేకుండా అబార్షన్ చేయించుకోవడం, భర్త బలహీనతలను అందరిలోనూ ప్రచారం చేయడం, భర్తకు అక్రమ సంబంధం అంటగట్టడం, పిల్లలను రోడ్డు మీద వదిలేయడం, అత్త లేదా మామగారు చనిపోయినప్పుడు చావుకు రాకపోవడం, చనిపోతానని బెదిరించడం, భర్త తీవ్ర అనారోగ్యానికి గురై, ఆస్పత్రి పాలైనప్పుడు అతని సంరక్షణ బాధ్యతను చూడకుండా గాలికి వదిలేయడం, ఇంటిని, పిల్లలను, భర్తను పట్టించుకోకపోవడం, భర్త కళ్ల ముందే పరపురుషునితో అశ్లీలంగా, అసభ్యంగా ప్రవర్తించడం, ఫ్రిజిడిటీ ఉండి, చికిత్స కోసం ఆస్పత్రికి రాకుండా నిరాకరించడం, తన చిరునామా కూడా భర్తకు తెలియకుండా అజ్ఞాతంగా జీవించడం, భర్త అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిపోవడం, భర్తకు తన కన్నబిడ్డల్ని చూపక పోవడం, కలవనివ్వక పోవడం... ఇలా ఏ కారణం ఉన్నా భర్త విడాకులకు దరఖాస్తు చెయ్యవచ్చు. డి.పి.మహోపాత్రా కేసులో భార్య, భర్తతో అతని కుటుంబ సభ్యులతో సహకరించకపోవడం, సామరస్యంగా ఉండకపోవడంతో వారి వైవాహిక జీవితంలో ఎప్పుడూ కలతలు ఉండడం వల్ల సంతోషంగా జీవించలేకపోతున్నారని అభిప్రాయపడి, సుదీర్ఘకాలం వారిద్దరి మధ్య సంసార బంధం సరిగా లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. నా భర్త ఇటీవల అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్తో చనిపోయారు. మాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరూ మైనర్లే. ఆయన చనిపోయాక మా తలిదండ్రులు నాకు మరో పెళ్లి చేయాలని సంబంధం చూసి ఖాయం చేశారు. పిల్లలతో సహా నన్ను తన జీవితంలోకి ఆహ్వానించడానికి నన్ను పెళ్లి చేసుకోబోయే అతను పెద్దమనసుతో ఒప్పుకున్నాడు. కానీ ఈ విషయం తెలిసిన మా అత్తమామలు (మావారి అమ్మానాన్నలు) అందుకు ఒప్పుకోకపోవడమే గాక పిల్లల కష్టడీ వారికి ఇచ్చేయమని గొడవ పెట్టారు. నేనసలు పిల్లలకు గార్డియన్నే కాదన్నది వారి వాదన. అది నిజమేనా? ఈ పరిస్థితుల్లో నేను ఏమి చేయాలి? - సరళ, నరసరావుపేట హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం తండ్రి పిల్లలకు సహజ సంరక్షకుడుగా ఉంటాడు. తండ్రి తదనంతరం తల్లే పిల్లలకు నేచురల్ గార్డియన్. పిల్లలకు తండ్రి జీవించి ఉన్నంత వరకూ తల్లి కూడా నేచురల్ గార్డియనే కానీ, ఆమె హక్కు భర్త ఉన్నంతవరకూ సస్పెండ్ అయి ఉంటుంది. తండ్రి మరణానంతరం తల్లికే పిల్లల మీద సర్వహక్కులుండడంతోపాటు, మైనర్ పిల్లలకు తల్లే సంరక్షకురాలు. బహుశ ఇక్కడ ఆస్తి పంచి ఇవ్వకుండా ఉండడం కోసమో లేదా సవతి తండ్రి సంరక్షణలో తమ మనుమల సంరక్షణ సరిగా ఉండదేమో అనే అనుమానంతోనో మీ అత్తమామలు పిల్లల్ని కూడా తామే చూస్తామని అడుగుతున్నట్లున్నారు. ఇంత పెద్ద వయసులో వారికి పిల్లలని చూసే ఓపిక ఉండదు కాబట్టి, మీరు వారిని స్థిమితంగా కూర్చోబెట్టి అన్నీ వివరించండి. కోర్టు కూడా ఇదే విషయాన్ని నమ్ముతుంది కాబట్టి పిల్లల్ని వారి కష్టడీకి అంగీకరించకపోయే అవకాశాలే ఎక్కువ శాతం ఉంటాయి. సాధారణంగా పిల్లలు తల్లిని వదిలి ఉండలేరు కాబట్టి మీరు ఈ విషయంలో ఏ మాత్రం చింతించవద్దు. మీరు పునర్వివాహం చేసుకోవడం వల్ల పిల్లల కష్టడీ మిస్ అవుతారని ఎంతమాత్రం అపోహ పడవద్దు. ధైర్యంగా జీవితంలో ముందడుగు వేయండి. కేస్ స్టడీ ఎండమావులు వెతుక్కుంటే... నిలువ నీడ పోయింది! రాధ, హనుమంతరావులది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఐదేళ్ల సంసార జీవితంలో ఇద్దరు పిల్లలకు తలిదండ్రులయ్యారు. రాధ విదేశీ వ్యామోహంలో సాఫ్ట్వేర్ ఉద్యోగరీత్యా 2, 4 సంవత్సరాల వయసున్న పిల్లలను, భర్తను వదిలేసి అమెరికా వెళ్లిపోయింది. అప్పటినుంచి తన క్షేమసమాచారాలను ఫోన్ ద్వారా ఒకటి రెండుసార్లు మాత్రం భర్తకు, పిల్లలకు తెలిపింది. తన తలిదండ్రులతో రెండుమూడుసార్లు మాట్లాడింది. ఆ తర్వాత 7, 8 సంవత్సరాల వరకు తన చిరునామా, ఫోన్నంబర్ కూడా తెలియనివ్వకుండా ఆఫీస్ మారిపోవడమే కాకుండా అమెరికా నుండి ఇంగ్లండ్, కెనడా తదితర దేశాలలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నతోద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. ఈ విషయాలు కూడా వాళ్లద్వారా వీళ్లద్వారా తెలుసుకోవడమే కాని ఆమె తన భర్తకు కానీ, తలిదండ్రులకు కానీ, స్నేహితులకు కానీ తెలియజేయలేదు. హనుమంతరావు విసిగిపోయి నాట్ హర్డ్ ఫర్ 7 ఇయర్స్ అంటే ఏడేళ్లుగా క్షేమసమాచారాలు, ఉనికి తెలియజేయలేదు అనే కారణంతో కోర్టులో విడాకులకు దరఖాస్తు చే శాడు. ఆమె చిరునామా తెలియనందువల్ల పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసులు అందజేసి, విడాకులు తీసుకున్నాడు. అన్ని సంవత్సరాల్లో భర్త, పిల్లలు, అత్తమామలు, తలిదండ్రులు సమాజంలో చెప్పలేనంత వ్యధను అనుభవించారు. వాళ్లూ వీళ్లూ అనే సూటీపోటీ మాటలతో హనుమంతరావు ఒకటి రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. మొత్తానికి విడాకులు మంజూరయ్యాక తన గురించి అంతా తెలిసిన వారి అమ్మాయిని రెండోపెళ్ళి చేసుకున్నాడు.పెళ్లి జరిగాక అకస్మాత్తుగా 10 సంవత్సరాల తర్వాత రాధ విదేశాల నుంచి (తన లివింగ్ టుగెదర్ పార్ట్నర్ మోసం చేశాక) ఇండియా వచ్చి హనుమంతరావు గొడవ పడింది. తనను విడిచి పెట్టి వేరే పెళ్లి ఎలా చేసుకుంటావని, క్రిమినల్ కేసు పెడతానని పోలీస్ స్టేషన్కు వెళ్లి బెదిరించింది. కానీ ఆమెను తన సొంత తలిదండ్రులు, సోదరులు కూడా సమర్థించలేదు. ఎలాగూ ప్రభుత్వం ద్వారా మంజూరైన డైవోర్స్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి హనుమంతరావును ఆమె ఏమీ చేయలేకపోయింది. ఇటు తన కడుపున పుట్టిన పిల్లలు కూడా తమను పట్టించుకోకుండా చిన్నప్పుడే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లినందుకు తల్లిని దగ్గరకు రానివ్వలేదు. ఎండమావులు వెతుక్కుంటూ వెళ్లిన రాధ రెంటికి చెడ్డ రేవడి అయింది. నేడు ఎంత డబ్బు, హోదా ఉన్నా సంఘంలో చెడ్డపేరుతో దయనీయంగా బతుకీడుస్తోంది. జీవితంలో డబ్బు, హోదానే ప్రధానం కాదు, విలువలు, ప్రేమానుబంధాలు. విలువలు లేని జీవితం వ్యర్థం. నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ -
ఇస్కాన్లో ‘భగవద్గీత’పై శిక్షణ శిబిరం
హైదరాబాద్: భారతీయ సంస్కృతి, సంప్రదాయం ఈతరం పిల్లలకు తెలియజెప్పి.. వారిలోని సృజనాత్మతను వెలికి తీసేందుకు ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా వేసవి శిక్షణ శిబిరం’ నిర్వహిస్తున్నట్టు కూకట్పల్లి ఇస్కాన్ సెంటర్ డెరైక్టర్ మహా శృంగదాస తెలిపారు. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు కూకట్పల్లిలోని ఇస్కాన్ సెంటర్లో శిక్షణ ఉంటుందన్నారు. ప్రస్తుత యువత ఎక్కువ సమయం టీవీలు, కంప్యూటర్తో గడుపుతున్నారని, ఈ ధోరణి మానసిక, భౌతిక రుగ్మతలకు కారణమవుతుందన్నారు. ఈ శిబిరంలో సంస్కృత శ్లోక పఠనం, వైదిక కథలు, డ్రామాలు, డాన్స్, ఆటలతో పాటు ఎగ్ రహిత కేకులు, బిస్కెట్స్, కుకీన్ లాంటివి తయారీ నేర్పుతామన్నారు. శిబిరంలో పాల్గొనే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నట్టు చెప్పారు. వివరాలకు 8008924201, 9866340588 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
దళిత సాహిత్యం
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటు నిద్ర అదియు నొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే చండాలుండేటి సరి భూమి యొకటే ఎప్పుడో వందేళ్ల క్రితం బ్రహ్మమొక్కటే అని గళమెత్తాడు అన్నమయ్య. చాపకూడుతో సమానత్వాన్ని సాధించ ప్రయత్నించాడు బ్రహ్మనాయుడు. మతం పేరుతో సాగుతున్న అమానవీయ వ్యవస్థని ఎండగట్టాడు వేమన. ఇవన్నీ ఎక్సప్షన్లే కానీ రూల్స్ కాదు. భారతీయ సంస్కృతిపై మాయని మచ్చలా నిలిచిన ఈ ఆచారం ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయింది. తారతమ్యాలు తెలియని లేతమనసుల ఆటపాటల్లో కూడా ఈ అసమానతని ఉగ్గుపాలతో పట్టించిందీ సమాజం. మధ్యయుగంలో వీరైశైవ, వీరవైష్ణవాలు, ఇస్లాం కొంత వరకూ నిమ్నజాతుల్లో చలనశీలతకి అవకాశమిచ్చినా ఆధునిక యుగారంభానికి కులవ్యవస్థ బిర్రబిగుసుకుంది. ఈస్టిండియా కంపెనీ రాజకీయాల్లో ముస్లిం అధికారవర్గం పట్ల వైరం, హిందూ అగ్రవర్ణాల పట్ల పక్షపాతం ఈ అమానుషం మరింత బలపడేందుకు పరోక్షంగా దోహదం చేసింది. 19వ శతాబ్దం చివర్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్తమార్పులు వచ్చాయి. స్థానిక యాజమాన్య వ్యవస్థ ప్రాముఖ్యం పోయి, వ్యవసాయం వ్యాపారమయమైంది (మానిటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్). గ్రామాల్లో నిరుద్యోగం ప్రబలింది. కడుపు కూటికై పట్టణాలకి వలసలు మొదలయ్యాయి. క్రైస్తవ మిషనరీల వల్ల, పిఠాపురం రాజా వంటి సామాజిక సృ్పహ ఉన్న జమీందారుల వల్ల దళితవర్గాల్లో కొందరికి విద్యావకాశాలు లభించాయి. పాశ్చాత్య దేశాల్లోని సమానత్వ భావన, పెరుగుతున్న సోషలిస్ట్ సిద్ధాంతాల ప్రభావంతో ఆధునిక సాహిత్యంలో సాంఘిక అసమానతలపై నిరసనలు మొదలయ్యాయి. 1909లో ఆంధ్రభారతిలో అచ్చయిన ‘మాలవాండ్ర పాట’ తెలుగు దళిత సాహిత్యంలో మొట్టమొదటిది. ‘మంచియన్నది మాల అయితే మాల నేనవుతా’ అంటూ గురజాడ వంటి ఆధునిక కవులు తమ గళం విప్పారు. మంగిపూడి వేంకటశర్మ ‘నిరుద్ధ భారతం’, కొండపల్లి జగన్నాథరావు 1921లో రాసిన ‘మేలుకొలుపు’ గీతం, 1930లో జాలా రంగస్వామి ‘అంటరానివాడెవ్వడు’ పాట, 1933లో కుసుమ ధర్మన్న ‘మాకొద్దీ నల్లదొరతనము’ గేయం, ఆనాటి దళిత సాహిత్యంలో మైలు రాళ్లుగా నిలిచాయి. ఉన్నవ లక్ష్మీకాంతం రచించిన ‘మాలపల్లి’ నవల హరిజనుల కష్టనష్టాలు, అవమానాల గురించి తెలియజేసి అగ్రవర్ణాల దృక్పథంలో మార్పుకి పురిగొల్పింది. కానీ ఆనాటి సాహిత్యంలో, పత్రికల వ్యాసాలలో దళితులపై శతాబ్దాలుగా సాగిన అణచివేతకు పశ్చాత్తాపం బదులు ఏడు కోట్ల హరిజనులు హిందూ సమాజానికి దూరమైపోతారేమో అన్న భయమే ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ దళిత సాహిత్య చైతన్యం కొనసాగింది. గుర్రం జాషువా రచించిన ‘గబ్బిలం’, గాంధీ-అంబేద్కర్ల భావాలకి అద్దంపడుతూ బోయి భీమన్న రచించిన ‘గుడిసెలు కాలిపోతున్నై’ ‘పాలేరు’ వంటి కావ్యాలు బడుగు వర్గాలకి మరింత ఆత్మస్థైర్యాన్నిచ్చాయి. దళితుల్లో వచ్చిన ఆనాటి నూతన చైతన్యంలో మూడు నిర్దిష్టమైన కోణాలు కనిపిస్తాయి. మహారాష్ట్రలో జీవం పోసుకున్న అంబేద్కర్ భావాలు భాగ్యరెడ్డి వర్మ వంటి వారికి ఉద్యమస్ఫూర్తినిస్తే, గాంధీజీ నిర్దేశించిన సేవా విధానం ఎందర్నో కాంగ్రెస్ వాదానికి అనుకూలురను చేసింది. కమ్యూనిస్ట్ దృక్పథంలోని భూస్వామ్య వ్యతిరేకత కొందర్ని రాడికల్ ఉద్యమాలకి ప్రోత్సహించింది. 1919లో మాంటేగూ సంస్కరణల తరువాత వచ్చిన ప్రజాస్వామిక మార్పుల వల్ల రాజకీయాల్లో దళితుల సంఖ్యకి గుర్తింపు వచ్చింది. వివిధ రాజకీయ పార్టీలు బలహీన వర్గాలని తమవైపు తిప్పుకోవడంలో సఫలమయ్యాయి. కానీ అన్ని పార్టీల్లో నాయకత్వం అగ్రవర్ణాలకే స్వంతమై, దళిత మేధావివర్గం పక్కవాద్యాలకే సరిపోయింది.దళిత వర్గాల్లో కాస్తో కూస్తో కనిపించే ఆర్థిక, సామాజిక ప్రగతి పట్టణాలకే పరిమితమయింది. గ్రామాల్లో వ్యవసాయం, సాంప్రదాయక వృత్తులపై ఆధారపడిన వారి జీవన విధానంలో హోదాలో మార్పు శూన్యమే. విద్య, ఉద్యోగం, సంపాదన, సమాన హోదా విద్యావంతులని పట్టణాలలో కట్టేస్తాయి. ఆస్తిపాస్తులున్న అగ్రవర్ణాల వారు కొంత వరకూ గ్రామాలతో సంబంధాలు నిలుపుకున్నా, ఏ ఆస్తులూ లేని దళిత మేధావి వర్గం గ్రామాలకి మరింత దూరమైంది. ఈనాటికీ పట్టణాలకీ, గ్రామాలకీ మధ్య జీవనసరళిలో వ్యత్యాసం బలహీన వర్గాల్లో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నది నిజం. -
అందం ఓ వరం
అందానికి చిరునామాగా నిలిచిన ఆ ముద్దుగుమ్మ.. పట్టుచీరలో మరింత మెరిసిపోయింది. అందం దేవుడిచ్చిన వరం అంటోన్న ఈ బ్యూటీక్వీన్ ఒకే ఏడాది ఏడు బ్యూటీ అవార్డులు సొంతం చేసుకుంది. భారతీయ సంస్కృతి చాటే చీరకట్టు.. మగువల అందాన్ని రెట్టింపు చేస్తుందని చెబుతోంది. సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో బ్యూటిఫుల్ బ్రైడ్గా కనిపించిన మిస్ ఇండియా ఎర్త్ అలంకృత సహాయ్ను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: వాంకె శ్రీనివాస్ నేను పుట్టి పెరిగింది ఢిల్లీలో. చదువంతా అక్కడే సాగింది. చిన్నప్పుడు డ్రెస్సింగ్కు ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు. ఓసారి మా బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ అంటే ఏంటో నాకు తెలిసొచ్చింది. నలుగురిలో స్పెషల్గా కనిపించాలంటే మన ఆహార్యం అదిరిపోయేలా ఉండాలనిపించింది. అప్పట్నుంచి మార్కెట్లోకి వచ్చే నయా డిజైన్స్ గురించి వాకబు చేస్తుండేదాన్ని. నచ్చిన కాస్ట్యూమ్ను ట్రై చేసేదాన్ని. కాలేజ్ డేస్లోనూ అందం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాను. అలా మోడల్గా రంగప్రవేశం చేశాను. బ్యూటీ అనేది దేవుడిచ్చిన వరం. అందుకే ఆ అందానికి ప్రాధాన్యం కలిగించేందుకు బ్యూటీ కాంపిటీషన్స్లో పాల్గొంటూ వచ్చాను. నమ్మకంతో... 2009లో మిస్ నోయిడా కిరీటాన్ని దక్కించుకున్నా. ఏదో రోజు మిస్ ఇండియాగా మెరవగలననే నమ్మకం కలిగింది. తర్వాత సెకండ్ మిస్ దివా కాంటెస్ట్లో పాల్గొని ఫస్ట్ రన్నర్గా నిలిచాను. అదే జోష్లో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాను. ఫిలిప్పీన్స్లో జరిగిన అందాల పోటీల్లో ఎకో బ్యూటీ వీడియో అవార్డు కూడా దక్కింది. వీటితో పాటు మిస్ స్టైల్ ఐకాన్, మిస్ పర్ఫెక్ట్ బాడీ, మిస్ టాలెంట్ అవార్డులూ వరించాయి. ఒకే ఏడాది ఏడు అవార్డులు అందుకున్న ఇండియన్ బ్యూటీగా గౌరవం దక్కింది. మా చెల్లి పుట్టింది ఇక్కడే... నా చిన్నతనంలో మా పేరెంట్స్ కొన్నాళ్లు హైదరాబాద్లోనే ఉన్నారు. మా చెల్లి అపూర్వ ఇక్కడే పుట్టింది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేను. అప్పుడప్పుడూ ఈ బ్యూటిఫుల్ సిటీకి వస్తుండేదాన్ని. ఇక్కడ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. జ్యువెలరీ కొనుగోలు చేస్తాను. బాలీవుడ్తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించాలని ఉంది. టాలీవుడ్లో మంచి చాన్స్ దొరికితే తప్పకుండా చేస్తాను. సూపర్స్టార్ రజనీకాంత్ మూవీలో అవకాశం వస్తే అస్సలు వదులుకోను. ప్రస్తుతం ఫెమినా కవర్ పేజీపై దృష్టి సారించాను. -
మన కుమార్తెలు స్వేచ్ఛగా, ఆనందంగా ఉండాలి
అతి ప్రాచీన కాలం నుండి జీవితంలో అన్ని విషయాలలో స్త్రీ పురుషులను సమానంగా గౌరవించింది భారతీయ సంస్కృతి. భగవంతుని దివ్వరూపాన్ని అర్థనారీశ్వరరూపంలో సృజించటం ద్వారా ఈ సృష్టిని అంతటినీ రక్షించి పోషించటంలో స్త్రీ పురుషులకు గల సమాన భాగస్వామ్యాన్ని సూచించింది. ఆరోగ్యవంతమైన, ప్రగతిశీలమైన సమాజం కోసం స్త్రీలను, సమాజంలో వారి పాత్రను గౌరవించి తీరాలి. ఈనాడు ప్రపంచంలో స్త్రీశిశు మరణాలలో అత్యధిక సగటు భారతదేశంలో నమోదు అవుతోంది. బాలికల ఆరోగ్య సంరక్షణ విషయంలో శ్రద్ధవహించకపోవటమే దీనికి ప్రధాన కారణం. మగపిల్లలతో పోలిస్తే, ఆడపిల్లలు అనారోగ్యానికి గురైనపుడు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళటానికి ఆలస్యం జరుగుతోంది. పురిటి మరణాలు తప్పించుకున్నా, ఆడశిశువులకు రోగనిరోధక శక్తి, పోషణ మగశిశువులకంటే తక్కువగా ఉన్నట్లు అనేక గణాంకాలు తెలియజేస్తున్నాయి. పసివారిని లైంగిక అకృత్యాలకు వాడుకోవటమనే అమానుషమైన విషయాన్ని మనం ఎదుర్కొనాల్సివస్తోంది. యాభై శాతానికి పైగా స్త్రీలకు విద్యాభ్యాసం లేకపోవటం మనం ఎదుర్కొంటున్న మరో పెద్ద సవాలు. ఇవన్నీ కేవలం స్త్రీ హక్కులకు సంబంధించిన విషయాలుగానే చూడరాదు. దీనిని మానవహక్కుల విషయంగా చూడాల్సి ఉంది. మనిషి మంచివాడు కావటానికి అతడి తల్లి పెంపకమే కారణమని ఒక సామెత ఉన్నది. ఆమె విలువలను పాదుకొల్పుతుంది. పునాదుల నుండి సమాజంలో పై స్థాయిల వరకూ ఉన్న మన పిల్లలలో మానవతా విలువలు, సకారాత్మక భావనలకు బీజాలు వేయటానికి ఇదే మంచి తరుణం. భానుమతీ నరసింహన్ (రచయిత అంతర్జాతీయ మహిళా సమ్మేళనానికి ఛైర్ పర్సన్గా , ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలకు డెరైక్టర్గా సేవలు అందిస్తున్నారు. www.artofliving.org -
సంక్రాంతి సంతోషమే వేరబ్బా
సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి ఆప్యాయత, అనురాగాలను పెంచుతాయి కోడి పందాలు, జూదాలు వేస్ట్ వాటిపై ఉక్కుపాదం మోపడమే బెస్ట్ ఏలూరు సిటీ/వన్టౌన్/బిర్లాభవన్ సెంటర్ : తెలతెలవారుతుండగానే నిద్రలేచి.. భోగి మంటల్లో కాచిన వేడినీళ్లతో తలారా స్నానం చేసి.. ఇంటి ముంగిట రంగవల్లులు వేసి.. గొబ్బెమ్మలతో అలంకరించి.. చిన్నారులకు బోగిపళ్లు పోసి.. నోరూరించే పిండి వంటల్ని కడుపారా తింటూ కుటుంబ సభ్యులు, బంధువులతో ఆప్యాయత, అనురాగాల పంచుకునే పండగ సంక్రాంతి వచ్చేస్తోంది. భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సంప్రదాయూలను కచ్చితంగా పాటించాలని యువత నినదించింది. కోడి పందాలు.. ఇతర జూద క్రీడల్లో మునిగి తేలడం తగదని స్పష్టం చేసింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావటం వల్ల తమలో చాలామందికి సంప్రదాయాలపై సరైన అవగాహన లేదని యువత పేర్కొంది. సంప్రదాయూలను కొనసాగించకపోతే భవిష్యత్లో యువతపై దుష్ర్పభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెరుుంట్ జోసఫ్ దంత వైద్య కళాశాల విద్యార్థులు సంక్రాంతి సంప్రదాయూలు, జూద క్రీడలపై తమ మనోగతాన్ని ఇలా ఆవిష్కరించారు. నాగరికత దెబ్బతింటుంది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు వ్యక్తిగత జీవితాలు పెరిగిపోయాయి. బాంధవ్యాలకు విలువ లేకుం డా పోతోంది. పండగ రోజైనా అందరూ కలిసి సంతోషంగా గడపాలనే పరిస్థితి లేదు. దీనివల్ల నాగరికత దెబ్బతింటుంది. - కె.శ్రీధర్రెడ్డి కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి మన సంప్రదాయాలు, సంస్కృతి గురించి తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేయాలి. ప్రేమానురాగాలు పెరగాలన్నా.. సమాజం బాగుండాలన్నా అది మన ఫ్యామిలీ నుంచే ప్రారంభం కావాలి. అప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుంది. - డి.నిహిత ట్రెండ్స్ పేరుతో పెడదారులు వినూత్నంగా చేయాలనే ఆలోచనతో ఏదేదో చేసేస్తున్నారు. మన సంప్రదాయం వెనుక ఉన్న ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. మన సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచే పరికిణి, ఓణీ, చీరకట్టు మహిళల అందాన్ని మరింత పెంచుతాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. - డి.స్వాతి ఒక పెళ్లిలా.. పెళ్లంటే ఇల్లంతా ఎంత సందడి ఉంటుందో సంక్రాంతి పండగ రోజుల్లోనూ అలాగే ఉంటుంది. ప్రజలంతా ఎంతో ఆనందంగా ఉంటారు. తెల్లవారుజామునే తలారా స్నానం, ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టటం, బోగి పళ్లు పోయటం వంటి కార్యక్రమాలన్నీ గొప్ప అనుభూతుల సమాహారం. - టి.రాజ్యలక్ష్మి ప్రేమానుగారాల నెలవు కుటుంబ సభ్యులు, బంధువులంతా ఒకచోట చేరి పండగ చేసుకుంటే ఆ ప్రేమానురాగాలతో జీవితం ధన్యమౌతుంది. భోగి రోజున పాత జీవితాన్ని వదులుకుంటానంటూ భోగి పిడకల్ని మంటల్లో వేస్తారు. సంక్రాంతి గొప్పతనం, మజాయే వేరు - వై.తేజస్వి జూదం ఆచారమా సంక్రాంతి సందర్భంగా కోడి పందాలపై చర్చ జరుగుతోంది. దీనిని అనాదిగా వస్తున్న ఆచారంగా రాజకీయ నాయకులు చెబుతున్నారు. జూదమాడటం సంప్రదాయమా. కఠిన చర్యలు తీసుకోవాలి. కోర్టులే కోడిపందాలు నిర్వహించవద్దని చెప్పినప్పుడు ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలిగా. - డి.వేణు జూదగాళ్ల ఆటల్ని సాగనివ్వొద్దు పండగ పేరుతో సంప్రదాయానికి ముడిపెట్టి కోడిపందాలు అడితే వాటిని ఆపాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది. అవినీతి పెరిగిపోవటం వల్లే జూదరుల ఆటలు సాగుతున్నాయి. రాజకీయ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే పోలీస్ అధికారులు వంత పాడటం కరెక్ట్ కాదు. - సీహెచ్ రాజేష్ వ్యాపారం కాకూడదుగా పండగ పేరుతో మూగజీవాలను హింసించటం న్యాయం కాదు. కోడిపందాల్లో బెట్టింగ్లు వేయడం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల వారు ఆర్థికంగా నష్టపోరుు రోడ్డున పడుతున్నారు. కుటుంబాలు చితికిపోవటం ఆయూ కుటుంబాలకే కాదు.. సమాజానికీ మంచిది కాదు. - వి.శ్రావణి పండగంటే జల్సాలు చేయడం కాదు గ్రామాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఉంది. పట్టణాలు, నగరాల్లో పండగల విశిష్టత, విలువ తెలియడం లేదు. పండగ రోజు జల్సాలు చేస్తే సరిపోతుందనే విధానంలో మార్పు రావాలి. - సీహెచ్ హర్షిణి -
గజ్జె గల్ఫ్మంది!
ఎడారి దేశమైన కువైట్లో కూచిపూడి ద్వారా భారతీయ సంస్కృతిని ప్రతిష్ఠాపన చేయిస్తున్నారు వేదవల్లి ప్రసాద్. గృహిణిగా ఏడేళ్ల క్రితం కువైట్లో అడుగుపెట్టిన వేదవల్లి... నృత్య గురువుగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన కూచిపూడి నృత్యోత్సవాలలో పాల్గొనడానికి తన ఇరవై మంది కువైట్ శిష్యబృందాన్ని, వారి తల్లిదండ్రులను వెంటబెట్టుకొచ్చారు. ఆ సందర్భంగా తనను కలిసిన ‘ఫ్యామిలీ’తో ఆమె పంచుకున్న విషయాలు, విశేషాలు. - నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి కువైట్ వెళ్లిన మొదట్లో మనవారెవరూ కనిపించక, విసిరేసినట్టు దూర దూరంగా ఉన్న ఇళ్ల మధ్య ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఎంతో మానసిక ఒత్తిడికి లోనయ్యారు వేదవల్లి. ‘‘బాబోయ్ ఆ రోజుల్ని అస్సలు ఊహించుకోలేను. నాలుగు నెలల పాటు డిప్రెషన్లో ఉండిపోయాను’’ అంటారు వేదవల్లి. ఐదు పదులకు చేరువవుతున్న ఈ కూచిపూడి నృత్యకళాకారిణి స్వస్థలం తెనాలి. కొన్నాళ్లు హైదరాబాద్లో ఉన్నారు. అయితే భర్త ఉద్యోగరీత్యా ఏడేళ్ల క్రితం కువైట్ వెళ్లారు. అంతవరకు బాగానే ఉంది కానీ... భర్త ఉద్యోగానికి, కొడుకు స్కూల్కి వెళ్లాక వేదవల్లిని భయంకరమైన ఒంటరితనం అలుముకోవడం మొదలైంది! ‘గెట్ టు గెదర్’ మలుపు తిప్పింది ‘‘ఆ దుఃఖం మాటల్లో చెప్పలేను. తెలిసినవారెవరూ లేరు. కొత్త పరిచయాలు పెంచుకోవడానికి అక్కడ ఆడవాళ్లెవరూ బయటకు రారు. చుట్టుపక్కల మన భారతీయులు ఎవరైనా కనిపిస్తే బాగుండు అని రోజూ కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూసేదాన్ని. ఒక్కరూ కనిపించేవారు కాదు. రోజూ మా వారితో గొడవ.. మన దేశం వెళ్లిపోదామని. కానీ, చేస్తున్న ఉద్యోగం వదిలి ఎలా వెళ్లడం? నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. నాలాగే చాలామంది గృహిణులు అక్కడ ఉన్నారని చాలారోజుల తర్వాత తెలిసింది. ఓసారి ‘ఎంప్లాయీస్ గెట్ టు గెదర్’ అంటే మావారితో కలిసి వెళ్లాను. అక్కడ మన వారిని కొంతమందిని చూశాక ప్రాణం లేచివచ్చినట్లయింది. వారంతా మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు. అయితే వారి పిల్లల్లో మనదైన సంస్కృతి ఏదో మిస్ అయినట్లు అనిపించింది. ఇంటికి వచ్చాక కూడా కొన్నాళ్ల పాటు అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. నాకు కూచిపూడి వచ్చు. దీనినే అక్కడి పిల్లలకు పంచగలిగితే... కాలక్షేపమే కాదు, నా విద్య కూడా మెరుగుపడుతుంది. మనదైన సంస్కృతిని కాపాడటానికి ఇదో మంచి అవకాశం అనిపించింది’’ అని చెప్పారు వేదవల్లి. ఇంటికి కళ వచ్చింది ఆలోచన వచ్చిందే తడవుగా డ్యాన్స్ క్లాస్ బోర్డ్ పెట్టేశారు వేదవల్లి. పార్టీలో పరిచయమైన నలుగురికి ఆ సంగతి చెప్పారు. ముందు ఒకరు, ఇద్దరు తమ పిల్లలను తీసుకువచ్చారు. సాధారణంగా డ్యాన్స్ క్లాస్ అంటే వారంలో రెండు, మూడు రోజులు ఉంటుంది. కానీ, వేదవల్లి దగ్గర ప్రతి రోజూ క్లాస్ ఉంటుంది. ఒకరిద్దరితో మొదలైన క్లాస్ ఏడాది తిరగక ముందే ఇరవై మంది పిల్లల వరకు చేరుకుంది. ‘‘పిల్లలంతా చాలా ఉత్సాహంగా క్లాసులకు వస్తారు. వారి వెంట వారి తల్లులు కూడా! ఒకరిద్దరు తల్లులు కూడా డ్యాన్స్ క్లాస్లో చేరారు. మొదట్లో నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టుగా ఉండే మా ఇల్లు రోజూ సాయంత్రం పిల్లల కాలి అందెలతో సందడిగా మారిపోయేది’’ అని వేదవల్లి అన్నారు. మంచీచెడు కూడా! క్లాస్కు వచ్చే పిల్లలకు, వారి తల్లులకు ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ప్రవర్తనలకు సంబంధించి మంచి విషయాలు చెబుతుంటారు వేదవల్లి. ‘‘వాళ్లు కోపం తెచ్చుకుంటారేమో అని కూడా ఆలోచించాను. అయినా మంచి చెబితే తప్పేమిటి? అందుకే వినేంతవరకు వదలను. అంతేకాదు, పండగలు, వేడుకలు అంతా కలిసి చేసుకునేలా ప్లాన్ చేస్తాను’’ అని చెప్పారు వేదవల్లి. ఎక్కడ కూచిపూడి నృత్యోత్సవాలు జరిగినా అక్కడికి తన శిష్యురాళ్లను తీసుకెళతారు ఆవిడ. ‘‘కువైట్లో మాతో పాటు కేరళ, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల వారు ఉన్నారు. ఒకప్పటిలా ఎవరికివారు అన్నట్టు కాకుండా ఇప్పుడు అందరం మంచి మిత్రులమైపోయాం. ఇంట్లో కూర్చుని ఉండి ఉంటే ఇవన్నీ చేసేదాన్ని కాదు. ఈ ఏడాది హైదరాబాద్ వచ్చి అంతర్జాతీయ కూచిపూడి నృత్య సంబరాల్లో పాల్గొని ప్రదర్శన ఇచ్చిన మా పిల్లలంతా ఎంతో సంతోషించారు. రెండేళ్ళ క్రితం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం’’ అని తెలిపారు వేదవల్లి. ‘‘ఏడేళ్ల క్రితం ఒంటరిని అని బాధపడిన నేను, ఇప్పుడు నా చుట్టూ ఉన్న నాట్యబృందాన్ని చూసి ముచ్చటపడిపోతుంటాను. ఎవరైనా మహిళలు ఒంటరిగా ఉంటే ఊరుకోను. తెలిసింది ఏ చిన్న పనైనా భయపడకుండా ముందు మొదలుపెట్టమని చెబుతుంటాను. ఎంచుకున్న పని ఇచ్చే సంతృప్తి నాకు తెలుసు కాబట్టి, ఆ ఆనందాన్ని నలుగురూ పొందాలని కోరుంటాను’’అని వివరించారు వేదవల్లి. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి తెలిసిన ఊరే కానక్కర్లేదు. కొత్త ప్రపంచమైనా మనకు అనుకూలంగా మార్చుకునే నేర్పును పెంచుకుంటే చాలు, అనుకున్నది సాధిస్తాం అని నిరూపిస్తున్నారు వేదవల్లి. ఫొటోలు: సృజన్ పున్నా నృత్యం వ్యక్తిత్వం మేం పన్నెండేళ్లుగా కువైట్లో ఉంటున్నాం. మా అమ్మాయి సాయిశ్రీ శ్రావ్య నాలుగేళ్లుగా వేదవల్లి గారి దగ్గర నృత్యం నేర్చుకుంటోంది. నృత్యంతో పాటు వ్యక్తిత్వ వికాస విషయాలూ నేర్పిస్తున్నారు వేదవల్లి. - విజయ, విజయవాడ (కువైట్) ఎడారిలో ఒయాసిస్సు మా అమ్మాయి వర్షికి 12 ఏళ్లు. రెండేళ్లుగా వేదవల్లిగారి దగ్గర నృత్యం నేర్చుకుంటోంది. వేల మంది మధ్య నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం మాకు వేదవల్లి ద్వారా లభించింది. ఎడారిలో మాకు దొరికిన ఒయాసిస్ ఆవిడ. - స్మిత, బెంగళూర్ (కువైట్) చదువూ మెరుగైంది నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను. వేదవల్లి మేడమ్ దగ్గర మూడేళ్లుగా నృత్యం నేర్చుకుంటున్నాను. డ్యాన్స్లోనే కాదు చదువులోనూ బెస్ట్ అయ్యానని మా మమ్మీ డాడీ, టీచర్స్ చెబుతుంటారు. ఆ క్రెడిట్ అంతా మా మేడమ్దే. - అఖిల, కువైట్ -
సీమాంధ్ర బుడగ జంగాలకు ఎస్సీ హోదా ఇవ్వాలి
భారతదేశ సంస్కృతిని భావితరాలకు అందిస్తూ పురాణ గాథలను కళారూపాల్లో ప్రదర్శిస్తూ జీవనం సాగించే జాతిలో ‘బుడగ జంగం’ కులం ఒకటి. ఢిమికీ, తంబూర, అందెల సహాయంతో వీరు ఊరూరా తిరుగుతూ కథలు చెబుతారు. పూర్వం నుంచి కళను ఉపాధిగా చేసుకుని బతికే వీరు నేడు వాటికి ఆదరణ తగ్గిపోవడంతో భిక్షాటన చేస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. గ్రామాల్లో ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు అవుతున్నా చట్ట సభల్లో ఇప్పటికీ వీరికి ప్రాతినిధ్యం లేదు. నిజాం స్టేట్లో షెడ్యూలు కులంగా గుర్తింపు పొందిన బుడగ జంగాలను 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఎస్సీలుగా ధ్రువీకరిం చింది. అప్పటికీ బుడగ జంగాలు కేవలం తెలంగాణ ప్రాంతానికి పరిమితమయ్యారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయం లో కూడా బుడగ జంగం కులస్తులు తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ గా ఉన్నందున ఇక్కడ వీరిని ఎస్సీలుగా గుర్తించింది. అనంతరం బుడగ జంగాలు పెద్ద సంఖ్యలో ఆంధ్ర, రాయలసీమ జిల్లాలకు వలసపోయారు. సంచార జీవితం గడిపే వీరు పక్క రాష్ట్రాలకు కూడా వలసపోయారు. ఈ నేపథ్యంలో 1976లో రాష్ట్ర ప్రభుత్వం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు సవరణ జరిపి ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా బుడగ జంగాలు ఉన్నారని, వారికి కూడా తెలంగాణలో మాదిరి గా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి 2008 వరకు అంటే 32 ఏళ్లపాటు ఆంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలో బుడగ జంగాలు ఎస్సీలుగానే పరిగణించబడ్డారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇతర కులస్తులు కొందరు అక్రమంగా బుడగ జంగం కుల ధ్రువీకరణ పత్రాలు సంపాదించి ప్రభు త్వ ఉద్యోగాలు పొందిన విషయం వెలుగుచూసింది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు మాల రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కుట్రతో ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బుడగ జంగాలు లేరని అక్కడ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 2008లో ప్రభుత్వం జీవో 144ను వెలువరించి బుడగ జంగాలకు తెలంగాణలోని 10 జిల్లాల పరిధిలోనే కుల ధ్రువీ కరణ పత్రాలు ఇవ్వాలని, ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జారీ చేయకూ డదని ఉత్తర్వులిచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే చదువుల బాట పట్టిన బుడగ జంగం విద్యార్థులు ఎస్సీ రిజర్వేషన్కు దూరమయ్యారు. అక్రమార్కులను కనిపెట్టి వారిని శిక్షించి, చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎవరో ఆరోపించారని ఏకంగా ఒక కులం మొత్తాన్ని శిక్షిం చడం గర్హనీయం. ఇప్పటికైనా తమకు న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్ లోని బుడగ జంగాలు కోరుకుంటున్నారు. - తూర్పాటి జె శ్రీధర్ అఖిల భారత బేడబుడగ జంగం సమాఖ్య -
మన సంస్కృతి మహోన్నతం
కామారెడ్డి : ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పదని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ఆ సంస్కృతి పరంపరను కొనసాగించాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయ రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న మహాపడిపూజ కార్యక్రమాన్ని స్వామీజీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి పరిపూర్ణానంద స్వామి ప్రవచనామృతాన్ని అందించారు. భారతీయుల చింతన, భావన విలక్షణమైనవన్నారు. విలక్షణమైన భావన వెనుక ఒక సంస్కారం, ఒక సంస్కృతి, ఒక మహత్తరమైన సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. సంస్కారాన్ని, సంస్కృతిని, చరిత్రను అర్థం చేసుకోకపోతే వెర్రిలా కనబడుతుందన్నారు. అర్థం చేసుకోలేనివానికి ఏదైనా తప్పుగానే కనబడుతుందన్నారు. దీనిని అర్థం చేసుకోలేనివారే దేవునిపేరు మీద పెద్ద వ్యాపారం జరుగుతోందని విమర్శిస్తుంటారన్నారు. ఆచరించే ధర్మం వెనుకనున్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాలు నిర్వహించే విషయంలో భుజానికెత్తుకునేవారికి అవగాహన ఉండాలని, లేకపోతే విమర్శలపాలవుతారని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, సంస్కారం, చరిత్రను చాటేందుకు చేపడుతున్న కార్యక్రమాలను నాస్తికులు సైతం అర్థం చేసుకోగలుగుతారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు రాధాకృష్ణశర్మ, గంగవరం ఆంజనేయశర్మ, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు చీల ప్రభాకర్, ప్రతినిధులు ఉదయ్, లక్ష్మీకాంతం, శ్రీనివాస్, రమేశ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప ఆలయ రజతోత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సంస్కృతికి వారసులుగా పిల్లల్ని పెంచండి
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు రాజమండ్రి: పిల్లలను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా పెంచాలని ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు తల్లిదండ్రులకు సూచిం చారు. రాజమండ్రిలోని శ్రీ షిర్డీసాయి విద్యానికేతన్, డ్యాఫ్నీ ఏసియాటిక్ పాఠశాలల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్వీ ఫంక్షన్ హాలులో జరిగిన తల్లుల సదస్సులో ఆయన మాట్లాడారు. విదేశీ విద్యను బలవంతంగా అంటగడుతూ పిల్లలను సంస్కృతికి దూరం చేస్తున్నారని గొల్లపూడి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ విష్ణుప్రియ, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు దారపు నాగిరెడ్డి, స్కూలు కరస్పాండెంట్ తంబాబత్తుల శ్రీధర్, ప్రిన్సిపాల్ శ్రీవిద్య పాల్గొన్నారు. -
మన సంస్కృతికి విరుద్ధం
కిస్ ఆఫ్ లవ్’పై రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ బెంగళూరు : మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా నగరంలో కొందరు ప్రజాహక్కుల కార్యకర్తలు నిర్వహించ తలపెట్టిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ వెల్లడించారు. గురువారమిక్కడి కేపీసీసీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తల సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మోరల్ పోలీసింగ్ను వ్యతిరేకించేందుకు ‘కిస్ ఆఫ్ లవ్’ తరహా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రేమ, అభిమానం అనేవి సంస్కారం అనే పరిధిని దాటకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సంస్కారమనే హద్దులు దాటే ఎలాంటి కార్యక్రమానికైనా భారతీయ సంస్కృతిలో స్థానం లేదని, అందువల్ల ఇలాంటి కార్యక్రమాలను తాను సమర్థించబోనని పేర్కొన్నారు. ఇక పరప్పన అగ్రహార జైలులోని మహిళా ఖైదీలపై అక్కడి వార్డర్లు లైంగిక హింసకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందిస్తూ... ‘నేను ఈ విషయంపై పరప్పన అగ్రహార జైలులోని ఖైదీలను కలిసి మాట్లాడాను. వారు నాతో ఏ విషయాలైతే చెప్పారో అవే మీడియాకు సైతం వివరించాను. ఇందులో నేను సొంతంగా కల్పించినవి ఏమీ లేవు’ అని స్పష్టం చేశారు. -
10 వేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం
* కేంద్ర మంత్రి అనంతకుమార్ సాక్షి,బెంగళూరు: భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై అవగాహన కల్పించడానికి వీలుగా డిసెంబర్ 31 అర్ధరాత్రి పదివేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం గీతాలాపన చేయించనున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న అదమ్య చేతన సంస్థ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో మహిళా సేవా సమాజ ఉన్నతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ‘స్వచ్ఛభారత్-హసిరుభారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లల్లో దేశభక్తిని పెంచాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్-హసిరుభారత్లో భాగంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి నేషనల్ కళాశాల క్రీడా మైదానంలో 10 వేల మంది పిల్లలు ఒకే చోట చేరి వందేమాతరం గీతాన్ని ఆలాపిస్తారన్నారు. అదేవిధంగా డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకూ పిల్లల్లో భారతీయ సంస్కృతి, కళలు తదితర విషయాల పై అవగాహన కల్పించడం కోసం అదమ్య చేతన సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులో చిత్రలేఖనం, పాటల పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అనంతకుమార్ తెలిపారు. ఇందులో రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారన్నారు. కార్యక్రమంలో అదమ్య చేతన వ్యవస్థాపక అధ్యక్షురాలు తేజశ్వినీ అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శాల్యూట్ టు లెజెండ్
ఖాదర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్-2014 శిల్పకళావేదికలో నేటి నుంచి నవాబుగా పుట్టినా తన జీవితం భారతీయ సంస్కృతిలో ఉందని గుర్తించిన వ్యక్తి ఖాదర్ అలీ బేగ్!. 9 జూన్ 1938న మరణించిన ఖాదర్అలీ జీవించింది 46 ఏళ్లే. తరతరాలకూ స్ఫూర్తినిచ్చే నాటకాలను ప్రదర్శించి దక్కన్ పతాకను జాతీయ రంగస్థలిపై రెపరెపలాడించారు! ‘నీ చేతుల్లో నాటకరంగం భవిష్యత్తు పదిలంగా ఉంటుంది’ అన్నారు ఖాదర్ అలీ ప్రదర్శించిన నాటకాలను ముంబైలో చూసిన పృథ్వీరాజ్ కపూర్. తండ్రికి తగ్గ తనయుడు మహమ్మద్ అలీబేగ్! తండ్రి నుంచి నటననే కాకుండా, జాతీయ భావాలనూ వారసత్వంగా స్వీకరించారు. ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్ స్థాపించి వివిధ దేశాలకు చెందిన నాటకాలను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచదేశాల కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శిస్తూ ఖాదర్ అలీ బేగ్కు ‘శాల్యూట్ టు లెజెండ్’ అంటున్నారు! ఏటా జరుపుతున్న థియేటర్ ఫెస్టివల్లో భాగంగా ఈ ఏడాది ఉత్సవాలను ఈ రోజు సాయంత్రం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శిల్పకళావేదికలో ప్రారంభిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 16 వరకు నగరంలోని వివిధ వేదికలలో వైవిధ్యభరితమైన నాటికలను ప్రదర్శిస్తున్నారు. వర్క్షాప్లను నిర్వహిస్తున్నారు. పుస్తకావిష్కరణలు చేస్తున్నారు. కార్యక్రమాల వివరాలు శుక్రవారం (7): రాత్రి 7-30: శిల్పకళావేదిక- ‘బాయిల్డ్ బీన్స్ ఆన్ టోస్ట్’, దర్శకత్వం: లిలిట్ దుబె శనివారం (8): రాత్రి 7-30: రవీంద్రభారతి- ‘సావన్-ఎ-హయత్’, దర్శకత్వం: మహ్మద్ అలీబేగ్ ఆదివారం (9): సాయంత్రం 6: రవీంద్రభారతి- ‘ద కిడ్స్ గాట్ చరిష్మా’, దర్శకత్వం: ముర్రెమలయ్ రాత్రి 7-30: రవీంద్రభారతి- ఫ్రెంచ్ నాటిక ‘ద టూ పారెలల్స్’ సోమవారం (10): రాత్రి 7-30: రవీంద్రభారతి- తెలుగు నాటిక ‘సుందరి-సుందరుడు’, దర్శకత్వం: రాళ్లపల్లి మంగళవారం (11): రాత్రి 7-30: రవీంద్ర భారతి- తెలుగు-ఇంగ్లిష్-తమిళ్-హిందీ-సంస్కృతం-కన్నడ భాషలలో120 ని.ల నృత్యరూపకం ‘ద్వారం’, నృత్య దర్శకత్వం: వాణీగణపతి బుధవారం (12): రాత్రి 7-30: రవీంద్రభారతి- ‘సిమ్లా కాఫీ హౌస్, దర్శకత్వం: బేడీ గురువారం (13): సాయంత్రం 6, సాలార్జంగ్ మ్యూజియం- ‘ద వన్ అండ్ ఓన్లీ నానా’, దర్శకత్వం: మోహన్ అగాసే రాత్రి 7-30, ‘జుగ్ జుగ్ జియో’, దర్శకత్వం: స్మితాభారతి శుక్రవారం (14): రాత్రి 7-30, సాలార్జంగ్ మ్యూజియం- ‘రోజానా’, దర్శకత్వం: ఉషాగంగూలీ శనివారం (15): రాత్రి 7-30, సాలార్జంగ్ మ్యూజియం- ‘హమ్ ముక్తారా’, దర్శకత్వం: ఉషాగంగూలీ ఆదివారం (16): రాత్రి 7-30, తాజ్ దక్కన్- ‘కామియా’, దర్శకత్వం: రామ్గోపాల్ బజాజ్ -
సైకిల్ హెరిటేజ్ క్విజ్
భారతదేశ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వసంపదపై అగర్బత్తీల కంపెనీ సైకిల్ బ్రాండ్ ఈ రోజు వినూత్న క్విజ్ నిర్వహించనుంది. ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులను ఈ పోటీకి ఆహ్వానిస్తోంది. గ్లోబలైజేషన్లో సంప్రదాయ గీతలు చెరిగిపోతున్న వేళ.. మన సంస్కృతిని చాటి చెప్పడానికి ఈ క్విజ్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శ్రీనగర్కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఈ పోటీ జరగనుంది. -
మహాలక్ష్మికి హారతి ఇవ్వడమే దీపావళి
సందర్భం- 23న దీపావళి భారతీయ సంస్కృతిలో పండుగలన్నీ పరమార్థంతోనే ఏర్పడ్డాయి. అందుకనే పైకి కనిపించే వేడుకలు, వినోదాలతోనే సరిపుచ్చకుండా పండుగలలోని అంతరార్థాన్ని తెలుసుకుని మరీ వాటిని జరుపుకోవాలి. శరదృతువు అయిన ఆశ్వయుజ, కార్తిక మాసాలలో వచ్చే పెద్ద పండుగలు దసరా, దీపావళితో పాటు మరికొన్ని పండుగలు మన బాధ్యతలను గుర్తు చేస్తాయి. ధనత్రయోదశి ధర్మశాస్త్ర గ్రంథాలలో దీన్ని యమదీప త్రయోదశి అని చెప్పారు. కొన్ని పురాణాలు, బౌద్ధమతాచారాల సమ్మేళనంతో ధనత్రయోదశిగా మారింది. దానికి రెండు కథనాలున్నాయి. ఒక యువరాణి తన భర్తకు ఈ తిథినాడు రాసిపెట్టి ఉన్న మరణాన్ని తప్పించటానికి ఇల్లంతా దీపాలు వెలిగించింది. నగలు కుప్పలుగా పోసింది. ఆ వెలుగులో దారి కనపడక యముడు వెనక్కు వెళ్లిపోయాడు. అందరూ ఈ రోజు ఇలా చేస్తే ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్థిల్లుతారు. కనుక ఇది ధనత్రయోదశి అయింది. ధన్వంతరి పాలసముద్రం నుంచి ఈ రోజు అమృతాన్ని పైకి తెచ్చాడు కాబట్టి ఆయన పేరిట ఇది ధనత్రయోదశి అయింది. ఈ రోజు దీపం పెట్టటం, లక్ష్మీపూజ, శక్తిని బట్టి బంగారం, వెండి, నూతన వస్తువులు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. నరక చతుర్దశి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి పండుగ జరుపుకోవాలి. పండుగల తిథులన్నిటిలో ఒక దుర్మార్గుడి పేరుతో ఏర్పడిన ప్రత్యేకత నరక చతుర్దశికే ఉంది! స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారిని శిక్షించి తీరాలనే సందేశాన్ని ఇచ్చే పండుగ నరకచతుర్దశి. భూదేవి తల్లి అయినా, పుట్టినవాడు ప్రజాకంటకుడు అయ్యాడు. నరకుడు అంటే నరులను ప్రేమించేవాడు అనే అర్థంతో తల్లిదండ్రులు పేరు పెడితే నరులను పీడించేవాడు అనే అర్థాన్ని తెచ్చుకున్నాడు. ‘అసుర’ బిరుదును కూడా కలుపుకుని నరకాసురుడు అయ్యాడు. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మించింది. భూలోకంలో నరకాసురుడిగా అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్న తన కుమారుడిని శిక్షించడానికి భర్తతో పాటు ఆమె కూడా యుద్ధానికి వెళ్లింది. శ్రీకృష్ణుని కంటే మరింత చొరవను, పరాక్రమాన్నీ చూపించింది. నిర్దాక్షిణ్యంగా నరకాసురుడిని సంహరించింది. ఆ దుర్మార్గుని మరణానికి ప్రజలతోపాటు తాము కూడా ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకున్న ఆదర్శప్రాయులైన తల్లిదండ్రులు సత్యభామాశ్రీకృష్ణులు. దీపావళి ఆశ్వయుజ అమావాస్యనాడు దీపావళి పండుగ. దీపం నుంచి దీపాన్ని వెలిగించినట్లు తరాల మధ్య అంతరాలు ఉన్నా ఒకే వెలుగు కొనసాగుతుండాలని పరమార్థం. దీపావళినాడు మహాలక్ష్మిపూజ ప్రధానం. అసలైతే అమ్మవారి దగ్గర, ఇంటిముందు, దేవాలయాల్లో; ఏనుగులు, గుర్రాలు, గోవులు ఉండేచోట దీపాలు వెలిగించడమే అసలైన దీపావళి పండుగ. దీపావళినాడు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది. ఆమె మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆమె అక్కగారిని సాగనంపాలి. ఆమెపేరు జ్యేష్ఠాదేవి. ఆమెను వెళ్లగొట్టేందుకు స్త్రీలు చీపురు, చేట పట్టుకుని చప్పుడు చెయ్యాలి. ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ విషయంలో స్వచ్ఛత, పరిశుభ్రత సంపదలకు మూలమనే శాశ్వత సత్యం దాగుంది. ఈ ఆశ్వయుజ అమావాస్య పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీ, పురుషుల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తుంది. కార్తీకం-పాడ్యమి కార్తికమాసంలోవచ్చే శుద్ధ పాడ్యమికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిల్లో మొదటిది గోక్రీడనం. ఈ పాడ్యమినాడు గోపూజ చేస్తే పశుసంపద వర్థిల్లుతుంది. పాడిపంటలకు లోటు ఉండదు. ఇందులో భాగం గా ఉదయాన్నే ఆవులకు నీరాజనం ఇవ్వాలి. సాయంకాలం ఆవుల మెడలో పూలదండలు వేసి పూజించాలి. అలాగే ఆవుపేడతో గోవర్ధన పర్వతాన్ని చేసి పాడ్యమి పొద్దున దాన్ని పూజించాలి. పాడ్యమి మధ్యాహ్నం రెల్లుగడ్డితో పేనిన తాడును తూర్పు దిక్కున గల స్తంభానికి కట్టి పూజించాలి. భగినీహస్త భోజనం కార్తిక శుద్ధ ద్వితీయను యమద్వితీయ (విదియ) అంటారు. ఆ రోజున యమున తన సోదరుడైన యముడికి భోజనం పెట్టింది. కాబట్టి కార్తిక శుద్ధ విదియనాడు అన్నదమ్ములు తప్పకుండా అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతి భోజనం తిని రావాలి. దీనినే భగినీహస్త భోజనం అంటారు. ధర్మరాజు వంటి మహానుభావునికి కూడా భీష్మాదులు, మహర్షులు ఈ ధర్మాచరణను బోధించారు. ఉత్తములు ఆచరిస్తే సామాన్యులు కూడా వారి దారిలో నడుస్తారు. అందుకే కార్తిక శుద్ధ ద్వితీయ (విదియ) నాడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి తప్పకుండా భోజనం చేసి, వస్త్రాభరణాలతో సత్కరించి రావాలని ధర్మరాజుకు వివరించారు. - డా॥పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ సరసిజ నిలయే సరోజ హస్తే ధవళ తరాంకుశ గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్... అనే శ్లోకంతో శ్రీమహాలక్ష్మిని పూజించి దీపాలు వెలిగిస్తే సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతారని, ‘దీపైః నీరాజనాదత్ర సైషా దీపావళిః’... అంటే దీపాలు వెలిగించడం, మహాలక్ష్మి అమ్మవారికి హారతులు ఇవ్వడమే దీపావళి అనీ ధర్మశాస్త్రం చెబుతోంది. -
రత్నమైన కెరీర్.. జెమాలజిస్ట్
రత్నాలు భారతీయ సంస్కృతిలో ఒక భాగం.. ప్రాచీన కాలం నుంచి వజ్రాలు, కెంపులు, పచ్చలు వంటి వాటిని జ్యోతిశ్శాస్త్ర ప్రాధాన్యత మేరకు ధరించడం ఆనవాయితీగా వస్తోంది.. అంతేకాకుండా రత్నాలను శక్తికి, శ్రేయస్సుకు ప్రతీకగా భారతీయులు పరిగణిస్తారు..దీంతో రత్నాల వినియోగం ఈ ఆధునిక యుగంలోనూ విపరీతంగా పెరుగుతోంది..ఈ నేపథ్యంలో రత్నాల పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తూ..ఉద్యోగార్థులకు మంచి కెరీర్గా మారుతోంది.. రత్నాలు లేదా విలువైన లోహాలను అధ్యయనం చేయడాన్ని జెమాలజీ అంటారు. ఇది జియోసైన్స్లోని ఒక విభాగం. కొనుగోళ్లు, గ్రేడింగ్, మూల్యాంకనం, ప్రాసెస్ వంటి విధానాలు రత్నాల పరిశ్రమలో కీలక అంశాలు. పెరుగుతున్న డిమాండ్, అవసరాల మేరకు సంబంధిత విధులు నిర్వహించే మానవ వనరులు కావాలి. ఇటువంటి విధులను నిర్వర్తించే వారిని జెమాలజిస్ట్లు అంటారు. విధులు: జెమాలజిస్ట్లు రత్నాల నాణ్యత, వాటిలో ఏవైనా నష్టపరిచే అంశాలు ఉన్నాయా అనే విషయాలను పరిశీలిస్తారు. ఒక రత్నం లేదా ముక్కలుగా చేసిన రత్నాన్ని ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. వీటిని నాణ్యమైన లోహాల నుంచి సేకరిస్తారు. మరికొన్ని రకాల రాళ్లు, అంబర్/జెట్ వంటి సేంద్రియ లోహాలను కూడా నగలను రూపొందించడంలో వినియోగిస్తారు. జాబ్ప్రొఫైల్స్: డైమండ్ గ్రేడర్, జ్యూయలరీ డిజైనర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఆక్షన్ మేనేజర్ పెరిగిన అవకాశాలు: నగలు, రాళ్లతో చేసిన ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. దీంతో జెమాలజిస్ట్ల అవసరం కూడా అధికమైంది. సంప్రదాయ నగలకు తోడు బ్రాండెడ్ జ్యూయలరీ ప్రవేశంతో వీరికి అవకాశాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతుల్లో 70 శాతం భారత్ నుంచే ఉంటున్నాయి. భారత్కు చెందిన జెమ్ కట్టర్స్, క్రాఫ్ట్మ్యాన్స్కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దీన్నిబట్టి జెమాలజిస్ట్లకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. అవకాశాలకు వేదికలు: మైనింగ్ పరిశ్రమ, జ్యూయలరీ మేకింగ్, డిజైనింగ్ యూనిట్స్, జ్యూయలరీ షాప్స్, షోరూమ్స్, జెమ్ ఎక్స్పోర్టింగ్ ఆర్గనైజేషన్స్, జెమ్ కటింగ్, పాలిషింగ్ పరికరాల తయారీ యూని ట్లు, జెమ్ టెస్టింగ్ లేబొరేటరీలు, ఆక్షన్ హౌసె స్, జెమ్స్టోన్ గ్రేడింగ్, క్వాలిటీ సర్టిఫైయింగ్ ఏజెన్సీస్లో ఉపాధి పొందొచ్చు. వేతనాలు: పొందిన శిక్షణ, చేస్తున్న పనిని బట్టి వేతనం ఉంటుంది. జెమాలజిస్ట్గా ప్రాథమిక శిక్షణను తీసుకుంటున్న వారికి నెలకు రూ.10 వేల -20 వేల వరకు చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు రూ. 30 వేల వరకు సంపాదించవచ్చు. సొంతంగా కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. రిటైల్ అవుట్లెట్ ఏర్పాటు చేస్తే ద్వారా నెలకు ఆరంకెల ఆదాయాన్ని కూడా పొందొచ్చు. ప్రవేశం ఇలా: సంబంధిత రంగంలో డిగ్రీ పూర్తి చేయడం ద్వారా జెమాలజిస్ట్గా స్థిరపడొచ్చు. దేశంలోని చాలా సంస్థలు గ్రాడ్యుయేట్ జెమాలజిస్ట్ డిగ్రీని అందిస్తున్నాయి. దీనికి అర్హత గ్రాడ్యుయేషన్. ప్రాక్టికల్స్, థియరీ కలయికగా ఉండే ఈ కోర్సును పూర్తి చేస్తేనే గ్రాడ్యుయేట్ జెమాలజిస్ట్ క్రెడెన్షియల్స్ లభిస్తాయి. ఆరు నెలల వ్యవధితో ఉండే ఈ కోర్సు ఫీజు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో రూ. లక్ష, ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లలో రూ. 50 వేలు. విదేశాల్లోనైతే రూ.4-8 లక్షల వరకు ఉంటుంది. నైపుణ్యాలు: రాళ్లు, లోహాలు వంటి విషయాల్లో ఆసక్తి ఉండాలి. రాళ్లతోపాటు వాటిని గుర్తించే, మూల్యాంకనం చేసే ప్రక్రియలో ఉపయోగించే పరికరాలపై అవగాహన అవసరం. వినియోగదారులతో వ్యవహారం కాబట్టి చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్, నిజాయితీ ఉండాలి. డిజైన్, నాణ్యత అంశాల పట్ల జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సునిశిత పరిశీలన, చొరవ, ఏకాగ్రత, సృజనాత్మకత, బాధ్యతాయుతంగా వ్యవహరించగలగడం వంటి లక్షణాలు ఉండాలి. కోర్సులు, సంస్థలు: జెమాలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-ముంబై వెబ్సైట్: http://giionline.com/ సెయింట్ జేవియర్స్-ముంబై వెబ్సైట్: http://xaviers.edu/ ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇన్స్టిట్యూట్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.igiworldwide.com నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-న్యూఢిల్లీ వెబ్సైట్: www.nift.ac.in/delhi విదేశీ ఇన్స్టిట్యూట్లు: జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా వెబ్సైట్: www.gia.edu ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజికల్ సెన్సైస్- బ్యాంకాంక్ వెబ్సైట్: www.aigsthailand.com ఎడ్యూ న్యూస్: టోఫెల్ స్కాలర్షిప్స్ ప్రకటన వెల్లడి దేశ వ్యాప్తంగా ప్రతిభావంతులైన పది మంది విద్యార్థులకు ఇచ్చే టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కాలర్షిప్స్కు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) ప్రకటన విడుదల చేసింది. నిర్దేశిత అకడెమిక్ రికార్డ్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ అదే విధంగా లీడర్షిప్ స్కిల్స్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి ఈ స్కాలర్షిప్స్ అందిస్తారు. అంతేకాకుండా అభ్యర్థులు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రధానంగా సామాజిక సేవా విభాగంలో సమర్థతను చూపాల్సి ఉంటుంది. దీంతోపాటు తమ వ్యాసాల్లో పేర్కొన్న విధంగా వినూత్న ఆలోచనలు కలిగుండాలి. - స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసేందుకు 100 పాయింట్ స్కేల్ విధానంలో 80 జీపీఏను, లేదా 4-గ్రేడ్ పాయింట్ స్కేల్ విధానంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ స్కోరు పొందాలి. వీటితోపాటు నిర్దిష్ట టోఫెల్ స్కోర్ తప్పనిసరి. - ఎంపికైన ప్రతి విద్యార్థికి అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల అభ్యసనం కోసం ఏడు వేల అమెరికన్ డాలర్ల స్కాలర్షిప్ మంజూరవుతుంది. ఈ స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు.. టోఫెల్ డెస్టినేషన్ సెర్చ్ (www.toeflgoanywhere.org)లో పేర్కొన్న యూనివర్సిటీలు లేదా ఇన్స్టిట్యూట్లలో ఆగస్ట్ 2014, డిసెంబర్ 2015 మధ్యలో తమ యూజీ, పీజీ కోర్సులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మంజూరైన స్కాలర్షిప్ మొత్తాలను 2015 ప్రారంభంలో, విద్యార్థి యూనివర్సిటీలో ప్రవేశించిన తర్వాత నేరుగా సదరు యూనివర్సిటీలకు అందిస్తారు. ఈ స్కాలర్షిప్స్ అవకాశం నేరుగా ప్రవేశాలు పొందే వారికే లభిస్తుంది. ట్రాన్స్ఫర్ విధానంలో కొత్త యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో అడుగుపెట్టే అభ్యర్థులకు అవకాశం ఉండదు. ఆన్లైన్ ద్వారా ప్రాథమిక దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ: అక్టోబర్ 30, 2014. -
నా కల నెరవేరబోతోంది
పణజి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించాలనేది తన కలని బ్రిటిష్ నటి సమీరా మహ్మద్ అలీ తెలిపింది. త్వరలో విడుదల కానున్న ‘బీ పాజిటివ్’ సినిమాలో ఈ మోడల్ అమితాబ్తో నటిస్తోంది. ‘భారతీయ నటులందరిలోకి అమితాబ్ నా ఫేవరెట్. అద్భుతమైన నటుడు. దుబాయ్లో ఉన్న సమయంలో అవకాశమున్నంతవరకూ అమితాబ్ సినిమాలే చూస్తూ పెరిగా. నిజంగా అంత గొప్ప స్టార్ సరసన నటించడమంటే నిజంగా ఓ కలే’ అని అంది. 29 ఏళ్ల ఈ వయ్యారి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా గోవాలో ఉంది. ఈ సినిమాకు వె ంకటేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తక్కువ బడ్జెట్తో ఈ సినిమా కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ఈ సినిమాలో అమితాబ్, సమీరతోపాటు రాజ్ పురోహిత్, నివేదిత బిశ్వాస్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్ సినిమాలో నటించడం ఇబ్బందికరంగా అనిపించడం లేదా అని ప్రశ్నించగా ఈ సినిమాని ఎంత బడ్జెట్తో తీస్తున్నారనేది విషయమే కాదంది. ఈ సినిమా కంటెంట్ను మాత్రమే తాను పరిగణనలోకి తీసుకున్నానంది. లండన్లో చిన్న బడ్జెట్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలుస్తాయని పేర్కొంది. మూడు భాషల్లో తీస్తున్న ఈ సినిమా తనను ఎంతగానో ఆకర్షించిందంది. అయితే ఈ సినిమాలో తాను ఏ పాత్ర పోషిస్తోందనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. స్టోరీలైన్ చెప్పగానే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించానని చెప్పింది. ఈ సినిమా స్టోరీ లైన్ తనకు ఎంతో ఆసక్తి కలిగించిందంది. అందువల్లనే ఈ సినిమా కోసం తన షెడ్యూల్ను మార్చేసుకున్నానంది. కాగా అరబ్, పోర్చుగీస్ జంటకు పుట్టిన సమీర తనకు భారతీయ సంప్రదాయంతో సంబంధముందంది. -
‘దొంగ బతుకుల’ ఉచల్యా
‘భారతదేశం నాది... భారతీయులందరూ నా సోదరులు.... నాకు భారతీయ సంస్కృతి మీద ఎంతో గౌరవం ఉంది... ఈ మాటలు, శబ్దాలు అన్నీ అబద్ధం. మేం ఏమీ చేయకపోయినా దొంగతనం మోపి కారణం లేకుండా మమ్మల్ని ఎందుకు కొడతారు? నన్ను కొడతారు. మా అమ్మని కొట్టి ఆమె చీర పట్టుకొని ఇది దొంగతనం చేసిన చీర... విప్పి ఇచ్చేయి అంటూ పోలీసులు ఆమె చేయి పట్టుకుంటారు. మరి భారతదేశం నాది అయినప్పుడు మమ్మల్ని వేరుగా ఎందుకు చూస్తారు? మాకు పని ఎవరూ ఎందుకు ఇవ్వరు? మాకు సూది మోపేటంత భూమి కూడా ఎందుకు దొరకదు? మనం సోదరులం అయితే మాకు దొంగతనాలు చేయాల్సిన గతి ఎందుకు పట్టింది?’... మరాఠి నవల ‘ఉచల్యా’ రచయిత లక్ష్మణ్ గైక్వాడ్ ఆవేదన ఇది. ఈ నవల రచయిత సొంత కథ. సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈ పుస్తకాన్ని వసంత తెలుగులోనికి తెచ్చారు. మరాఠీలో ‘ఉచల్యాలు’ అంటే చిల్లర దొంగతనాలు చేసే వాళ్లని అర్థం. సంచార జాతులకు చెందిన వీళ్లు అనేక కులాలు, ఉపకులాలుగా ఉన్నారు. వీళ్లని తెలుగులో ‘సంత ముచ్చులు’ అంటారు. ‘ముచ్చులు’ అంటే దొంగలు. ఈ కులాలకి ఒక పేరంటూ లేదు. ఒక ఊరంటూ లేదు. మొత్తం భారతదేశంలో ఈ జాతి వాళ్లకి జాథవ్, గైక్వాడ్ అనే రెండే రెండు ఇంటి పేర్లు ఉన్నాయి. లక్ష్మణ్ ఎప్పుడు పుట్టాడో ఎక్కడ పుట్టాడో తెలియదు. తెల్సిందల్లా దరిద్రం, ఆకలి, పోలీసులు, తన్నులు. లక్ష్మణ్ వాళ్ల నాన్న దొంగతనాలకు దూరంగా చిల్లర నౌకరీ చేసుకుంటూ కొడుకుని చదివించాలని తపన పడతాడు. కాని తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేని దరిద్రం, చుట్టుపక్కల పరిస్థితులు లక్ష్మణ్ని అంతంత మాత్రం చదువులకే పరిమితం చేశాయి. దొంగతనాలు చేయడం ఇష్టం లేక లాటూర్లో వెట్టిచాకిరీలు చేయించే సూత్గిర్నీ మిల్లులో చేరతాడు. అక్కడ యూనియన్ వాళ్లతో పరిచయాలు, రాజకీయాలు... వీటన్నింటి మధ్య తన జాతి వాళ్ల విముక్తి కోసం ఒక సంఘాన్ని స్థాపించి వాళ్ల గొంతులు నలుగురికీ వినిపించడానికి కృషి చేస్తున్నాడు. ఇదంతా సమకాలీన కథ. లక్ష్మణ్ తన కథ ద్వారా మొత్తం ఈ జాతుల వ్యథను మనముందుంచుతాడు. ఊరి చివర విసర్జన స్థలాలలో ఉండే చిన్న చిన్న గుడిసెలే వీళ్ల నివాసం. ఒక్కొక్క గుడిసెలో బోలెడుమంది మనుషులు, వాళ్ల మేకలు, కుక్కలు, వాటి మూత్రం, బయట పంది పిల్లలు.. స్నానాలు చేయడం బట్టలు ఉతుక్కోవడం కల్లో మాటలు. మగపిల్లలకి, ఆడపిల్లలకి తొమ్మిది సంవత్సరాలు రాగానే పోలీసుల దెబ్బలు తట్టుకోవడానికి తల్లిదండ్రులే చావచితకదన్ని తర్ఫీదు ఇస్తారు. అనేకసార్లు సంబంధం లేని దొంగతనాలు కూడా ఒప్పుకోవాలి. జాతర్లు, సంతలు లేనప్పుడు చేల మీద పడతారు. జొన్నలు దొరక్కపోతే ఆకలికి తట్టుకోలేక ఎలుకల్ని, పిల్లుల్ని తింటారు. వీళ్లు ఎంత చీకటిలో ఉంటారంటే కులంలో ఎవరైనా బడికి వెళితే మిగతా వాళ్లందరికీ ‘కలరా’ వస్తుందని నమ్ముతారు. ఈ పుస్తకం మన మధ్యలోనే ఉన్న కొన్ని జాతుల హీనాతిహీనమైన జీవితాలకీ నాగరీకుల ఊహకి కూడా అందని నిజాలకీ నిలుటద్దం. పుస్తకం ముగించిన వెంటనే మన వ్యవస్థ మీద మనకే జుగుప్స కలిగినా వీళ్ల గొంతులు విన్పించే లక్ష్మణ్లాంటి కొద్దిమందైనా ఉండటం భవిష్యత్తు మీద మనకి ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. - కృష్ణ్ణమోహన్బాబు 9848023384 -
కోరికలను అదుపులో పెట్టుకోవాలి
తల్లిదండ్రులు పిల్లలకు బాధ్యతలు నేర్పించాలి మహా సహస్రావధాని గరికపాటి నర్సింహారావు మహబూబాబాద్ టౌన్ : మనల్ని అభివృద్ధి చేసేది, నాశ నం చేసేది కోరికలేనని, ఆ కోరికలను ప్రతి ఒక్కరూ అదుపులో పెట్టుకోవాలని మహాసహస్రావధాని, అవధాన శార ద గరికపాటి నర్సింహారావు అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కామధేను గోశాల శ్రీ బం డ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్లోని వాసవి కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో సోమవా రం రాత్రి ‘పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత’ అనే అంశం పై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి నర్సింహారావు ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, నాగరికతను అంది పుచ్చుకోవడంలో ఇతర భాషల వారి కంటే భారతీయులు ముందంజలో ఉన్నారన్నారు. ఇంగ్లీష్ వాఖ్యాలు వచ్చాక సంస్కృతి, ఆచారాలు, నాగరికత మారిపోయాయన్నారు. మార్పును మంచి కోసమే వినియోగించాలి తప్ప నాశనానికి వినియోగించవద్దన్నారు. తెలుగు విద్యా విధానం అమల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ అంటే ఏమిటో తెలియదన్నా రు. ఎల్కేజీ చదవాలంటే ప్రస్తుత రోజుల్లో మోతలు, లగేజీలు, ప్యాకే జీలు, లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయన్నారు. గతాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దని, కళలను ప్రోత్సహించాలన్నారు. నాటి రోజుల్లో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే పదాలు మొదటి పేజీల్లో ఉంటే నేడు ఏబీసీడీలు మొదటికి చేరుకుని తెలుగుపై పెత్తనం చేయాలని చూస్తున్నాయన్నారు. భాషపై ద్వేషం ఏమి లేదంటూ ఏబీసీడీలు కాదు, అ,ఆ,ఇ,ఈలు కూడా ముఖ్యమేనన్నారు. విద్యార్థుల ధర్మం చదువుకోవటమేనని తెల్పుతూ తల్లిదండ్రులు కూడా అందుకు తగ్గట్టుగా వారి అలవాట్లపై శ్రద్ధ కనపరచాలన్నారు. మనం ఏ పని చేస్తున్నామో దానిపైనే దృష్టి పెట్టాలని, అప్పుడే ఆ పనిపై విజయం సాధించగలుగుతామన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు మానసికోల్లాసాన్ని కల్గిస్తూ విద్యా భోదన చేయాలని తెలిపారు. విద్యార్దులను భాగు చేసే అవకాశం వచ్చిందని అనుకోవాలన్నా రు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు గర్రెపెల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ భువనగిరి అనిల్గుప్త, ఇమ్మడి వెంకటేశ్వర్లు, భార్గవి, తమ్మి ఉపేందర్రావు, కొత్త సోమన్న, నాళ్ళ ప్రకా శ్, రాంకిషన్ ఝవర్, ప్రతాపని విశ్వనాధం, డాక్టర్ అశోక్, మహ్మ ద్ సుభాని, దైద వెంక న్న పాల్గొన్నారు. -
వందే గురు పరంపరామ్
వివరం: యుగయుగాలుగా వర్ధిల్లుతున్న భారతీయ సంస్కృతిలో గురుస్థానం చాలా ప్రధానమైనది. ‘మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ’ అనే వేద వాక్యం క్రమ పరిణామ దశలో బుద్ధి వికసించే సమయానికి ఆచార్యుడే దేవుడౌతున్నాడు. ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు, బోధకుడు, శిక్షకుడు మొదలైనవి పర్యాయపదాలుగా కనపడినప్పటికీ వాటికి వేరువేరు అర్థాలు ఉన్నాయి. దగ్గర కూర్చోబెట్టుకొని చదువు చెప్పేవారిని ఉపాధ్యాయుడు అంటారు. గురు శబ్దానికి విస్తృతమైన అర్థం ఉంది. చదువు చెప్పేవారే కాక, తల్లిదండ్రులు, పెద్దలు, పూజనీయులు, హితం చెప్పేవారు... అందరినీ గురు శబ్దంతో గౌరవించాలి. సక్రమంగా చేయవలసిన విధివిధానాలను, ఆచారాలను శాసించి ఆచరింపజేసేవారు ఆచార్యులు. బోధ చేసేవాడు బోధకుడు. శిక్షణ ఇచ్చేవారు శిక్షకుడు. వీరందరినీ సమానంగా సూచించే పదం గురువు. భారతీయ సంస్కృతికి ప్రధాన గ్రంథాలైన భారత, భాగవత, రామాయణాలను పరిశీలిస్తే, ప్రసిద్ధులైన గురువులు, వారి నుంచి మనం తెలుసుకోవలసిన వ్యక్తిత్వ వికాస లక్షణాలు ఎన్నో ఈ తరానికి ఉపయోగపడతాయి. రామాయణ గురువులు త్రేతాయుగం నాటి రామాయణం మనకు ఆదికావ్యం. రామాయణం పేరు వినగానే గుర్తొచ్చే గురువు వశిష్ఠుడు. ఈయన ఇక్ష్వాకు వంశానికి తరతరాలుగా గురువు. రామ, లక్ష్మణ, భరత, శతృఘు్నలకు నామకరణం చేసి, విద్యాబుద్ధులు నేర్పించి, వేదాలు, శాస్త్రాలు ఆయన నేర్పిస్తే, ధనుర్వేదం మొదలైన యుద్ధ విద్యలను దశరథ మహారాజు పర్యవేక్షణలో నేర్చుకున్నారు. రామావతారం ఆరంభం నుంచి పరిసమాప్తి వరకు వశిష్ఠుడు గురు స్థానంలో ఉన్నాడు. ఏనాడూ ఆయన వారి నుంచి దక్షిణలు ఆశించలేదు. విద్యాబుద్ధులతో, వినయ విధేయతలతో సర్వజన హితంగా, సద్గుణాలతో మానవ జీవితం ఎలా వికసించాలో శ్రీరాముని ద్వారా లోకానికి చాటిచెప్పిన గురువు వశిష్ఠుడు. విద్యార్థికి మరొక పేరు శిష్యుడు. అనగా గురువు చేత శాసింపదగిన వాడు. విద్యార్థి గురువు చెప్పినది భక్తిశ్రద్ధలతో విని, చెప్పినది చేయాలి. గురువు యందు పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. శ్రీరాముని పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించినవాడు వశిష్ఠుడే. కానీ ఆ ముహూర్తానికి రాముడు అరణ్యవాసానికి వెళ్లవలసి వచ్చింది. అంతమాత్రంతో వశిష్ఠుణ్ని తక్కువగా భావించలేదు. రాక్షస సంహారం రామావతార ప్రయోజనం కనుక, రాముణ్ని అరణ్యవాసానికి పంపటానికే బ్రహ్మర్షి వశిష్ఠుడు ఆ ముహూర్తం పెట్టాడని రాముడికి తెలుసు. అరణ్యవాసంలో అరుంధతీ వశిష్ఠుల సత్కారాలను, హితబోధనలను సీతారామలక్ష్మణులు పొందారు. యోగవాసిష్ఠంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను వశిష్ఠ మహర్షి రామునికి బోధించాడు. చివరకు పట్టాభిషేకం కూడా జరిపించాడు. అభిప్రాయ భేదాలు లేని గురుశిష్య సంబంధానికి వశిష్ఠుని గురుత్వం ఆదర్శం. రామాయణంలో మరొక గురువు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. రామునికి పద్నాలుగు, పదిహేనేళ్ల వయసులో యాగ సంర క్షణ పేరుతో దశరథుని అనుమతితో రామలక్ష్మణులను విశ్వామిత్రుడు వెంటబెట్టుకొని అడవికి తీసుకెళ్లాడు. సంచార విద్యాబోధన పద్ధతిలో ఆయా ప్రదేశాలను, ఆశ్రమాలను చూపిస్తూ, వాటి వృత్తాంతాలన్నీ వివరించాడు. తరగతి గదుల్లో పుస్తక పరిజ్ఞానం వస్తే, పర్యటనతో ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. దేశాన్ని పరిపాలించబోయేవాడు దేశం నలుమూలలా ఎక్కడ ఏముందో తిరిగి తెలుసుకోవాలి. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు రాజభవనం లో కాక, ప్రజల్లో తిరిగి పరిశీలించాలి. యుద్ధవిద్యలు అభ్యాసం చెయ్యటమే కాక, అనుభవంలోకి రావాలి. గతంలో పరిపాలనానుభవం ఉన్న రాజర్షిగా విశ్వామిత్రుడు ఇన్ని కోణాలలో రామునికి గురువైనాడు. స్త్రీ సంహారం అధర్మమైనా, తాటకి వంటి దుష్ట స్త్రీలను శిక్షించడం తప్పుకాదని వివరించాడు. అహల్య వంటి ఆర్తులను ఆదుకోవటం పర్యటనలోనే సాధ్యమని చూపించాడు. తన పూర్వజీవితంలోని తప్పొప్పులను దాచకుండా చెప్పటం ద్వారా దాపరికం లేని వ్యక్తిత్వ వికాసాన్ని బోధించాడు. ముందుగా చెప్పి మానసికంగా ఒత్తిడి పెట్టకుండా, మిథిలా నగరానికి చుట్టపు చూపుగా తీసుకువెళ్లి, శివధనుర్భంగం చేయించి, సీతారాములను కలిపాడు. అప్పటివరకు తెలియని ఎన్నో అస్త్ర విద్యలను రామునికి బోధించాడు. రామాయణంలో విశ్వామిత్రుడు ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు, బోధకుడు, శిక్షకుడు అన్నీ తానే అయి, రాక్షస సంహారానికి రంగం సిద్ధం చేసిన ఆదర్శగురువు. రామాయణంలో మరొక గురువు సూర్యభగవానుడు. ఇక్ష్వాకు వంశానికి మూలపురుషుడు, కర్మసాక్షి, గ్రహాధిపతి అయిన సూర్యుడు... తన కర్తవ్యాన్ని తాను ఆచరిస్తూనే, తనతో తిప్పుకుంటూ విద్యలు బోధించిన ఉత్తమ ఉపాధ్యాయుడు. చిన్ననాడే పండు అనుకొని, తనను మింగటానికి వచ్చి నోరు కాల్చుకున్న చిలిపి హనుమంతుని కృషి, పట్టుదల, కార్యదీక్ష గమనించిన సూర్యుడు... ఉదయం నుంచి అస్తమయం వరకు తనతో ఎగిరే శక్తిశాలి అయిన ఆంజనేయుణ్ని, ఎన్నో వ్యాకరణాలు నేర్చిన బుద్ధిశాలిగా తీర్చిదిద్దాడు. మంచి వక్తగా, పరిశీలనా దక్షునిగా, కార్యసాధకునిగా ఒక విద్యార్థిని సానబెట్టిన ఘనత సూర్యునికే చెల్లుతుంది. గురువుగారితో తూర్పు నుండి పడమరకు ఆగకుండా తిరిగిన సామర్థ్యంతోనే హనుమ సముద్రం దాటి, లంకకు వెళ్లగలిగాడు. చిన్ననాటి గురువుల ప్రభావం విద్యార్థుల భావి జీవితంపై తప్పకుండా ఉంటుందనటానికి ఈ గురుశిష్యులు ఉదాహరణ. రామాయణంలో ఇంకొక సుప్రసిద్ధ గురువు వాల్మీకి మహర్షి. తన ఆశ్రమంలో పుట్టి పెరిగిన లవకుశులకు అమిత వాత్సల్యంతో విద్యాబుద్ధులు నేర్పటమే కాక, సంగీత సాహిత్యాది కళాభినివేశం కూడా కలిగించాడు. దానివల్లనే వారు అయోధ్యకు వెళ్లి, తండ్రిని చూసి, మాట్లాడటం వీలైంది. తల్లిని అడవిలో వదిలిన తండ్రిపై వారికి పగ, ద్వేషం పెరగకుండా లలిత కళలతో వారి వ్యక్తిత్వాన్ని మలచిన వాల్మీకి మహర్షి... నేటి ఉపాధ్యాయ లోకానికి, విద్యాప్రణాళికకు ఆదర్శప్రాయుడు. మహాభారత గురువులు పద్దెనిమిది పర్వాలు, లక్షా పాతికవేల శ్లోకాల మహాభారతంలో లోకం అంతా ఉంది. గురువు ఎట్లా ఉండాలో, శిష్యుడు ఎట్లా ఉండాలో, ఎట్లా ఉండకూడదో చెప్పే ఎన్నో ఉదాహరణలకు ఆలవాలం మహాభారతం. ఉదంకోపాఖ్యానమే గురు శిష్య అనుబంధానికి పరిపూర్ణోదాహరణ. పైల మహర్షి దగ్గర ఉదంకుడు విద్యాభ్యాసాన్ని పూర్తిచేశాడు. గురుదక్షిణ ఇచ్చి వెళ్లాలి. చదువు అయిపోయిందని దక్షిణ ఇవ్వకుండా వెళ్లే శిష్యుడు, ఇస్తానన్నాడని ఎక్కువగా అడిగే గురువు ఇద్దరూ నశించిపోతారని భారత సూక్తి. ఉదంకుడు గురువుగారితో దక్షిణ గురించి ప్రస్తావించాడు. ‘నువ్వు నాకు చాలా సేవ చేశావు. ఏమీ ఇవ్వద్దు. పో’ అన్నాడు గురువు. ‘కాదు కాదు. ఏదో ఒకటి అడగండి’ అన్నాడు ఉదంకుడు. ‘నాకేమీ అక్కర్లేదు. గురుపత్ని ఏవి అడిగితే అవి తెచ్చిపెట్టు’ అన్నాడు గురువు. ఉదంకుడు గురుపత్నికి ఈ సంగతి చెప్పాడు. ఆమె ‘ఈ దేశపు రాజుగారి భార్య కర్ణాభరణాలు చాలా గొప్పవి. నాలుగు రోజుల్లో మనింట్లో ఒక ఉత్సవం ఉంది. అప్పుడు నేను అవి పెట్టుకోవాలనుకుంటున్నాను. వెళ్లి త్వరగా తెచ్చిపెట్టు’ అంది. ఉదంకుడు రాజధానికి బయలుదేరాడు. దారిలో ఎన్నో వింతలు విశేషాలు జరిగాయి. పౌష్య మహారాజు దగ్గరకు వెళ్లాడు. ఆయన ‘రాణిగారిని అడిగి తీసుకుపో’ అన్నాడు. అపరిశుభ్రంగా ఉన్న ఉదంకుడికి ఆమె కనపడలేదు. శుచి అయిన తరువాత కనపడి, కుండలాలు ఇచ్చింది. దారిలో వాటిని తక్షకుడనే సర్పరాజు ఎత్తుకుపోయి, పాతాళంలో దాచిపెట్టాడు. వాటికోసం ఉదంకుడు నేల తవ్వుకొని, పాతాళానికి వెళ్లి, అక్కడ ఎన్నో వింతలు చూశాడు. ఒక కొత్త వ్యక్తి సహాయంతో తక్షకుణ్ని భయపెట్టి, కుండలాలు తీసుకొని సమయానికి తెచ్చి గురుపత్నికి ఇచ్చి, ఆమె ఆశీస్సులు పొందాడు. అప్పుడు గురువుగారికి తాను చూసిన వింతలు విశేషాలు చెప్పి, వాటి అర్థాలు అడిగాడు. గురువుగారు అన్నీ వివరించాడు. నీకు సహాయం చేసిన వ్యక్తి ఇంద్రుడు. అతడు నా స్నేహితుడు. అందుకే నీకు సహాయం చేశాడు... అని చెప్పాడు. ఈ కథలో విద్యార్థి ఉదంకుడికి వ్యక్తిత్వ వికాసం, కార్యసాధకత మొదలైన అంశాల శిక్షణ ప్రయోగాత్మకంగా జరిగింది. గురువు వెనుక నుండి గమనిస్తూ, తోడ్పడుతూ సొంతగా, ధైర్యంగా పని సాధించే ఆత్మస్థైర్యాన్ని కలిగించాడు. మహాభారతంలోని మరొక ప్రసిద్ధ సన్నివేశం ‘కచదేవయానుల కథ’. ఈ కథలో గురువు... దేవయాని తండ్రి శుక్రుడు. శిష్యుడు బృహస్పతి కొడుకు కచుడు. మృత సంజీవనీ విద్య కోసం శుక్రుని దగ్గరకు వచ్చిన కచుడు, ‘ఉత్తమ విద్యార్థి పక్కదారులు పట్టకుండా తన లక్ష్యాన్నిఎలా సాధించాలో’ మనకు చూపించాడు. తన సేవలతో, వినయ విధేయతలతో గురువుకు, గురువుగారి అమ్మాయికి ఆత్మీయుడైనాడు. గురువుగారికి రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి పుత్రికా వ్యామోహం. రెండు మద్యపాన వ్యసనం. ఈ రెండూ కచుడికి లాభదాయకమైనాయి. లేకపోతే శత్రువర్గంవాడైన కచుడికి మృతసంజీవనీ విద్యను శుక్రాచార్యుడు చెప్పేవాడు కాదు. ఈ కథ ఉత్తమ ఉపాధ్యాయునికి బలహీనతలు, వ్యసనాలు, వ్యామోహాలు ఉండకూడదనే సందేశాన్ని ఇస్తోంది. స్వయంగా శుక్రుడే ‘ఇక ఎవ్వరూ మద్యపానం చెయ్యకండి’ అని చెప్పాడు. ఇది లోకానికి పాఠం. అటువంటి గురువులకు గుణపాఠం. ప్రధాన భారత కథలో ప్రసిద్ధుడైన కౌరవ పాండవ గురువు ద్రోణాచార్యుడు. గురువులో ఉండవలసిన ప్రధాన గుణం శిష్య వాత్సల్యం. అది లేకుండా ఏ గురువూ సరిగా పాఠం చెప్పలేడు. ఆసక్తి, శక్తి ఉన్న విద్యార్థిని ఉపాధ్యాయుడు కన్నకొడుకు కంటే అధికంగా ప్రేమిస్తాడు, ప్రేమించాలి అని ద్రోణార్జున బంధం చెబుతోంది. అందరి కంటె నిన్ను గొప్పవాడిని చేస్తానని ద్రోణుడు అర్జునునికి మాట ఇచ్చాడు. ఇచ్చినట్లే తన కొడుకు అశ్వత్థామకు కూడా చెప్పని యుద్ధ విద్యా రహస్యాలు, అస్త్రశస్త్రాలను అర్జునుడికి చెప్పాడు. పరోక్షంగా తనను పూజించి ఏకాగ్రతతో, స్వయంకృషితో విద్యాభ్యాసం చేసి అర్జునుని కన్నా మరింత విజ్ఞానాన్ని పొందిన ఏకలవ్యుడు దాన్ని దుర్వినియోగం చేసి, రాజకుమారుల దృష్టిలో పడ్డాడు. కక్షతో వాళ్లు అతణ్ని ఎప్పటికీ చంపకుండా, బొటనవేలు గురుదక్షిణగా తీసుకొని, చెడ్డపేరు తెచ్చుకున్న శిష్య వత్సలుడైన గురువు ద్రోణాచార్యుడు. కక్షలు, కార్పణ్యాలు గల రెండు వర్గాల విద్యార్థులను తన కనుసన్నల్లో క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయించిన నైపుణ్యం గల గురువు ద్రోణాచార్యుడు. మహాభారతంలో పైతరం భీష్మునికీ, యువతరం కర్ణునికీ యుద్ధవిద్యలు బోధించిన పరశురాముడు గురువులూ శిష్యులూ గుర్తుపెట్టుకోవలసిన విలక్షణ గురువు. భీష్ముడు పరశురాముని దగ్గర మహేంద్ర పర్వతంపై విద్యాభ్యాసం చేసి, ఆయన ప్రియ శిష్యుడైనాడు. అయినా కాశీరాజు కూతురు అంబకు భీష్ముని వలన అన్యా యం జరిగిందని తెలుసుకొన్న పరశురాముడు, శిష్యుడు చెప్పిన మాట వినకపోవటంతో 24 రోజులు భయంకరమైన యుద్ధం చేసి, ప్రత్యేక పరిస్థితుల్లో విరమించాడు. తప్పు చేసినవాడు తన ప్రియశిష్యుడైనా, క్షమించకుండా పోరాడిన ధర్మగురువు పరశురాముడు. మరికొంత కాలానికి కర్ణుడు అసత్యం చెప్పి, పరశురాముడి దగ్గర విద్యార్థిగా చేరాడు. విద్యాభ్యాసం పూర్తవుతుండగా, ఒక సన్నివేశంలో కర్ణుని అసత్యం గురువుకు తెలిసింది. ఏ విద్య కోసం అతడు అసత్యం చెప్పాడో, అది అతనికి అవసరమైన సమయంలో గుర్తురాదని శపించాడు. విద్య కోసం అసత్యం చెప్పే వక్రబుద్ధి ఉన్నవాడు, అధర్మం కోసమే దానిని ఉపయోగిస్తాడు. అటువంటి శిష్యుల విషయంలో గురువులు జాలిపడకూడదనే సందేశాన్ని అందిస్తున్నాడు. పరశురాముని ధర్మకాఠిన్యం గురువులకు అవసరం. భాగవత గురువులు భక్తుల చరిత్రలు, భగవంతుని చరిత్ర చెప్పే మహాభాగవతం గురుత్వాన్ని, గురుతత్వాన్ని కూడా చెబుతోంది. వామన చరిత్రలో బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు. తన శిష్యుడు ప్రమాదంలో ఉన్నాడని కనిపెట్టాడు. కష్టకాలంలో మాట తప్పవచ్చునని కొన్ని ధర్మసూక్ష్మాలు చెప్పాడు. ఏది ఏమైనా నేను మాట తప్పనని గురువును ఎదిరించి, బలిచక్రవర్తి మూడడుగులు దానం చేశాడు. పాతాళానికి తొక్కబడినా ఇప్పటికీ పూజలందుకొంటున్నాడు. గురువు అపకీర్తి అలాగే నిలబడింది. గురువుల, తల్లిదండ్రుల వాత్సల్యం, ప్రేమ పిల్లల విద్యాభివృద్ధికి, ఉత్తమ వ్యక్తిత్వానికీ తోడ్పడాలి కానీ, వారు చెడ్డపనులు చేసినా క్షేమంగా ఉండాలని ప్రోత్సహించరాదని భాగవతం బోధిస్తోంది. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదునికి ఇద్దరు గురువులను తండ్రి హిరణ్యకశిపుడు ఏర్పాటు చేశాడు. వారు చండామర్కులు. శుక్రాచార్యుని కొడుకులు. తల్లిదండ్రులు గురువులకు పిల్లల్ని అప్పగించేటప్పుడు ఎలా మాట్లాడాలో హిరణ్యకశిపుని మాటల్లో మనకు తెలుస్తుంది. ‘అయ్యా! మీరు గురువులు. కారుణ్య చిత్తులు, మాకు పెద్దలు. మా పిల్లవాడు ఏమీ తెలియనివాడు, సరిగా మాట్లాడటం కూడా రాదు. బాగా చదివించి నీతి కుశలురుగా చెయ్యండి’ అని ఇంద్రాది దేవతల్ని, విష్ణుమూర్తిని లెక్కచెయ్యనివాడు కూడా తన దగ్గర బతికే గురువుల దగ్గర పిల్లవాడి కోసం వినయంగా మాట్లాడాడు. ఇందులో గురువుల ప్రధాన లక్షణాలు చెప్పాడు. భాగవతంలో మరొక ప్రసిద్ధ గురువు జగద్గురువైన శ్రీకృష్ణుని గురువు సాందీపని. బలరామకృష్ణులు, కుచేలుడు మొదలైనవారు ఆయన దగ్గర వేదశాస్త్రాది విద్యలు అభ్యసించారు. గురువు బాధ్యత... పుస్తకాల్లో ఉన్నది విద్యార్థుల బుర్రకెక్కించటం మాత్రమే కాదు. ఆయన ప్రతి మాట, కదలిక విద్యార్థుల వ్యక్తిత్వాన్ని వికసింపజేయాలి. పేదవాడైన ద్రోణుడు, రాజకుమారుడైన ద్రుపదుడు ఒక గురువు దగ్గరే సన్నిహితంగా చదువుకున్నారు. కానీ తరువాత ద్రుపదుడు రాజై, ద్రోణుడు కనపడితే, ‘నువ్వెవరో నాకు తెలీదు’ అన్నాడు. అలాగే సాందీపని దగ్గర పేదవాడైన కుచేలుడు, శ్రీకృష్ణుడు కలిసి చదువుకున్నారు. ఆ స్నేహాన్ని స్వార్థానికి వాడుకోవాలని కుచేలుడు అనుకోలేదు. వచ్చిన కుచేలుణ్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి, బంగారు పళ్లెంలో కాళ్లు కడిగాడు. ఇది విద్యాలయ ప్రభావం. అలాగే తమకు ఇష్టమైన గురువుగారి కోసం విద్యార్థులు ఎంతటి అసాధ్యమైన పనులైనా చేస్తారు. ద్రోణుని కోసం అర్జునుడు ద్రుపదుణ్ని బంధించి తెచ్చాడు. గురువుగారి అబ్బాయి చనిపోతే బలరామకృష్ణులు యమలోకానికి వెళ్లి, యమునితో పోరాడి, పిల్లవాణ్ని తెచ్చి గురువుగారిని సంతోషపెట్టారు. గురుదక్షిణగా సమర్పించారు. సర్వజ్ఞులు, జగద్గురువులు, సంపూర్ణులు అయిన అవతార పురుషులు బలరామకృష్ణులు గురువుగారి దగ్గర చేరి, ఎందుకు చదువుకున్నారు? మానవులెవరైనా గురు సన్నిధానంలో గురు ప్రబోధితులై తీరాలి. లేదంటే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలగదని లోకానికి తెలియజెప్పటానికే వారు సాందీపని వద్ద చదువుకున్నారు... అని భారత సందేశం. రామాయణ భారత భాగవతాల్లోని ప్రసిద్ధ గురువుల పరిచయంతో భారతీయ విద్యావిధానంలో గురువు ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. గురువులను గౌరవించి, వారి ఆశీస్సులతో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిద్దాం. - డా॥పాలపర్తి శ్యామలానందప్రసాద్ -
భవిష్యత్తును తెలుసుకునేందుకు.. ఆస్ట్రాలజీ
అప్కమింగ్ కెరీర్ : తమ స్థితిగతులను, భవిష్యత్తును తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది విశ్వసించే ప్రాచీన విధానం.. జ్యోతిష్యం లేదా జోస్యం(ఆస్ట్రాలజీ). జీవితంలో జరిగిపోయిన జరుగుతున్న, జరగబోయే విషయాలను జననకాలం, గ్రహస్థితిని బట్టి చెప్పడాన్నే జ్యోతిష్యం అంటున్నారు. ఇది హిందూ ధర్మ శాస్త్రం. ఆరు వేదాంగాల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ జనాదరణ పొందుతున్న ప్రాచీన శాస్త్రాల్లో జ్యోతిష్యం కూడా ఉంది. హస్త సాముద్రికం, గోచారం, నాడీ జోస్యం, న్యూమరాలజీ మొదలైన వాటిని జ్యోతిష్యంలో భాగంగా పరిగణిస్తున్నారు. జ్యోతిష్యానికి ఆదరణ పెరుగుతుండడంతో యువత దీన్ని కెరీర్గా ఎంచుకొనేందుకు ఆసక్తి చూపుతోంది. టీవీ ఛానళ్లలోనూ అవకాశాలు ఆధునిక కాలంలో జ్యోతిష్యం అనేది మంచి ఆదాయాన్ని అందించే ఆకర్షణీయ మైన కెరీర్గా మారింది. ప్రస్తుతం ఆస్ట్రాలజిస్టులకు మంచి డిమాండ్ ఉంది. తమ ఆర్థిక, సామాజిక పరిస్థితిని మార్చుకోవాలనుకునేవారు జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. వారి సలహాల మేరకు నడుచుకుంటున్నారు. నూతన కార్యాలను చేపట్టడా నికి శుభ ముహూర్తాల కోసం ఆస్ట్రాలజర్ల సూచనలు తీసుకుంటున్నారు. ఇక టీవీ ఛానళ్లలోనూ ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఉదయం వారఫలాల కార్యక్రమాల్లో ఆస్ట్రాలజర్లు పాల్గొంటున్నారు. ఇటీవలి కాలంలో కంప్యూటర్ జ్యోతిష్యానికి గిరాకీ పెరిగింది. ఆస్ట్రాలజర్గా ప్రతిభను మెరుగుపర్చుకుంటే అధిక ఆదాయాన్ని ఆర్జించొచ్చు. వీలును బట్టి పార్ట్టైమ్గా, ఫుల్టైమ్గా పనిచేసుకోవచ్చు. ఆస్ట్రాలజర్గా గుర్తింపు తెచ్చుకోవాలంటే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. క్లయింట్లకు అర్థమయ్యేలా చెప్పగలిగే నేర్పు అవసరం. మంచి కౌన్సెలర్కు ఉండే లక్షణాలు ఉండాలి. అర్హతలు: మనదేశంలో ఎన్నో విద్యాసంస్థలు ఆస్ట్రాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వీటిలో చేరొచ్చు. వేతనాలు: ఆస్ట్రాలజర్లు తమ నైపుణ్యాలను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. ప్రారంభంలో నెలకు రూ.10 వేలకు తక్కువ కాకుండా ఆదాయం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవాన్ని బట్టి అధిక ఆదాయం ఆర్జించొచ్చు. నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే జ్యోతిష్యులు మనదేశంలో ఉన్నారు. ఆస్ట్రాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వెబ్సైట్: http://teluguuniversity.ac.in జ్యోతిష్యశాస్త్రానికి ఆదరణ భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు సైన్స్తో ముడిపడినవే అనేది వాస్తవం. ఇప్పటి పరిశోధనల్లోనూ అదే నిర్ధారణ అవుతోంది. పాశ్చాత్య జ్యోతిష్యంతో పోల్చితే వేదిక్ ఆస్ట్రాలజీనే అధికశాతం విశ్వసిస్తున్నారు. జీవనస్థితి గతులను తెలుసుకోవడానికే కాకుండా స్టాక్మార్కెట్లలోనూ ఆస్ట్రాలజర్లను నియమించుకుంటున్నారు. అయితే దీన్ని మూఢ నమ్మకంగా కాకుండా శాస్త్రంగా భావించినప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. గతంతో పోల్చితే ప్రస్తుతం ఈ సబ్జెక్టుకు క్రేజ్ పెరిగింది. పలు విద్యాసంస్థలు ఆస్ట్రాలజీలో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వేదిక ఆస్ట్రాలజీలో భారతీయులకు విపరీతమైన డిమాండ్ ఉంది. విదేశాల్లో 5 నిమిషాలకు 10 డాలర్లు తీసుకుంటారు. మొబైల్, టీవీ ఛానెల్స్, ఆన్లైన్ విభాగాల్లో అవకాశాలు అనేకం. విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రిడెక్షన్ విభాగంలో ఉద్యోగం ఇచ్చేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. -డాక్టర్ సి.వి.బి.సుబ్రహ్మణ్యం, హెడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్, తెలుగు విశ్వవిద్యాలయం -
గోచీ పెట్టుకు తిరగండి
గోవా మంత్రికి ప్రముఖ డిజైనర్ వెన్డెల్ రోడ్రిక్స్ లేఖ పణజి: బీచుల్లో మహిళలు కురచ దుస్తులు, బికినీలు ధరించి సంచరించడం వంటివి నిషేధించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోవా పీడబ్ల్యుడీ మంత్రి సుదిన్ ధవళికర్పై విమర్శల జడి చుట్టుముట్టింది. పాశ్చాత్య పోకడలను, సంస్కృతిని నిషేధించాలనుకుంటే మంత్రే గోచీ పెట్టుకు తిరగాలని, మిరపకాయలు, టమోటా, బంగాళ దుంపలు వంటివాటిని వినియోగించరాదని, కుర్చీలు, బల్లలపై కూర్చుని పని చేయడాన్ని నిషేధించాలని దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెన్డెల్ రోడ్రిక్స్ ఘాటు లేఖ రాశారు. లేఖలో ఎక్కడా మంత్రి పేరును పేర్కొనపోయినప్పటికీ మంత్రి వ్యాఖ్యలను వెన్డెల్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. మంత్రి వ్యాఖ్యలు అభివృద్ధి నిరోధకంగాను ఉన్నాయన్నారు. ప్రస్తుతం ధరిస్తున్న చొక్కా యూరోపియన్దని, పాంట్స్, ఫైజమాలు చైనా, మధ్య ఆసియాలవని, సాక్స్, టీ-షర్టు, బినియన్లు, లోదుస్తులు సహా యూరప్లో కనిపెట్టారని ఇవన్నీ పాశ్చాత్య సంస్కృతివి కాబట్టి వీటిని విడిచిపెట్టి భారతీయ సంస్కృతి అయిన శాలువా కప్పుకుని మీ శాఖకు వెళ్లగలరా? అని లేఖలో ప్రశ్నించారు. -
నిధులు సరే..అభివృద్ధేది?
అసంపూర్తిగా కారిడార్ పనులు తీరు మారని పురాతన ఆలయాలు అలంకారప్రాయంగా అతిథి భవనాలు శ్రీకాళహస్తి, న్యూస్లైన్: భారతీయ సంస్కృతిని ప్రతిభిం భించే పురాతన ఆలయాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు కుమ్మరించినా ఫలితం మాత్రం కని పించడం లేదు. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి 2008లో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి సూచనతో అప్పటి కేంద్ర టూరిజం శా ఖ నడుం బిగించింది. తిరుపతి నుంచి నెల్లూరు జిల్లా వరకు ఒక జోనుగా గుర్తించి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంకు వచ్చే భక్తులు సమీపంలోని పురాతన ఆలయాలను సందర్శించేలా అభివృద్ధి చేసేందుకు చిత్తూరు జిల్లాకు రూ.21 కోట్లు కేటాయించింది. టూరి జం కారిడార్ పేరిట శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నాలుగు పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు రూ.7.55 కోట్లు కేటాయించింది. కొద్ది రోజులకే వై ఎస్ మరణించడం, ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతో ఆరే ళ్లు గడిచినా పనులు అతీగతి లేదు. ఈ పథకం కింద నిర్మించిన అతిథి భవనాలు ప్రారంభానికి నోచుకోక అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. తొండమనాడుకు రూ.2.53 కోట్లు శ్రీకాళహస్తి మండలం తొండమనాడుకు సమీపంలోని ఎగువవీధి శ్రీప్రసన్న వెం కటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి రూ. 2.53 కోట్లు కేటాయించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన ప్రసన్న వెంకటేశ్వరస్వామి కూర్చుని ఉండడం ఈ ఆల యం ప్రత్యేకత. ప్రహరీ గోడ నిర్మాణం, పిల్లల పార్కు, మరుగుదొడ్లు, వసతి సముదాయం, స్వాగత తోరణం, కోనే రు పునర్ నిర్మాణం, మంచినీటి సదుపాయం తదితర పనులు చేయాల్సి ఉన్నా అసంపూర్తిగా ఆగిపోయాయి. బొక్కసంపాళెంకు రూ.2.02కోట్లు శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం లోని శ్రీకోదండరామేశ్వరస్వామి ఆల యాన్ని రూ.2.02 కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉంది. శ్రీరాముడే స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణగాథ. అందుకే కోదండరామేశ్వరస్వామి ఆలయంగా పిలుస్తారు. కోనేరు, ఆలయ ప్రాంగణం అడుగుభాగంలో చలువరాళ్ల ఏర్పాటు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయాభివృద్ధికి రూ.1.07 కోట్లు శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి టూరిజం శాఖ రూ.1.07 కోట్లు కేటాయిం చింది. ఈ నిధులతో మరుగుదొడ్లు, వస తి కేంద్రం, సమాచార కేంద్రం ఏర్పా టు, మంచినీటి సదుపాయం వంటి ప నులను నామమాత్రంగా పూర్తి చేశారు. గుడిమల్లంకు రూ.1.92 కోట్లు ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెల సిన శ్రీపరశురామేశ్వరాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.1.92 కోట్లు కేటాయించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లు ఒకే లింగంలో ఉండడం ఇక్కడ ప్ర త్యేకత. ప్రహరీ గోడ నిర్మాణం, పిల్లల పార్కు, మరుగుదొడ్లు, యాత్రికుల విశ్రాంతి భవనం, సమాచార కేంద్రం, స్వాగత తోరణం, కోనేరు పునర్ నిర్మా ణం, మంచినీటి సౌకర్యం తదితర పను లు చేయాల్సి ఉంది. ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉండడం, వారి నుంచి అనుమతులు రాకపోవడంతో అభివృద్ధి పనుల ఊసేలేదు. పురాతన దేవాలయాల పరిరక్షణ బాధ్యతను భుజాన వేసుకున్న కేంద్ర ప్రభుత్వం పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారులను అడిగితే నిధుల కొరత వల్లే పనులు ఆగిపోయాయని సమాధానం చెబుతున్నారు. -
జాతీయ చేనేత ప్రదర్శన అదుర్స్
- ఆర్కాట్రోడ్డులో ప్రారంభమైన ఎక్స్పో - జూన్ 15 వరకు కొనసాగనున్న ప్రదర్శన కొరుక్కుపేట, న్యూస్లైన్:భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే చేనేత, హస్తకళా వస్తువులు దశాబ్దాల నుంచి ఆదరణ పొందుతూనే ఉన్నాయి. హస్తకళలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వంతోపాటు, పలు సంఘాలు కృషి చేస్తున్నాయి. భారత దేశానికే వన్నె తెచ్చిన చేనేత, హస్తకళలు మరింతగా బతికించుకునేందుకు పుష్పాంజలి ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థాన్ ప్రత్యేకంగా కృషి చేస్తూ చేనేత హస్తకళా ఉత్పత్తులతో ప్రదర్శనలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా చెన్నై, సాలిగ్రామం, భరణీ హాస్పిటల్ సమీపంలోని ఆర్కాట్ రోడ్డులో జాతీయ చేనేత ఎక్స్పోను గురువారం నుంచి ప్రారంభించింది. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, హస్త కళాకారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేసింది. ప్రదర్శనలోని వస్తువులు, హస్తకళాఖండాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీహార్కు చెందిన మధుబానీ రింట్ శారీలు, జైపూర్కు చెందిన తుషార్ సిల్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాంతా సిల్క్ శారీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మధ్య ప్రదేశ్కు చెందిన కాశ్మీర్ ప్లోరల్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్, ప్యూర్ సాఫ్ట్ కాటన్ బందిని శారీలు, బెంగాళ్ కాటన్ శారీలు, మదురై కాటన్ చీరలు మగువలకు కనువిందు చేస్తున్నాయి. అదేవిధంగా హస్తకళా ప్రియులను లెట్ ఉడ్తో, రోజ్ ఉడ్తో చేసిన బొమ్మలు, ఆర్ట్ జ్యువలరీ, చిన్నారుల ఆట బొమ్మలు అలరిస్తున్నాయి. జూన్ 15వ తేదీ వరకు కొనసాగనున్న ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. -
పద్యానవనం: ఎక్కడ్నుంచి వచ్చామో తెలిస్తే గమ్యం చేరడం తేలిక!
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా? విశ్వదాభిరామ వినుర వేమ! పున్నామనరకం నుంచి విముక్తి కలిగించేవాడు పుత్రుడు అంటారు. పైనుండే పున్నామ నరకాన్ని తప్పించడం సంగతేమో కాని, ఈ భూమ్మీదే నరకం చూపకుంటే చాలు, అనుకునే తల్లిదండ్రులెందరో! తల్లిదండ్రుల్ని క్షోభకు గురిచేసే వారి సంతానం గురించి విన్నప్పుడు మనసు కలుక్కుమంటుంది. అంత క్రూరంగా ఎలా ఉండగలుగుతారో! అని సందేహమూ కలుగుతుంది. కారణాలేవైనా, అలా చేయడం సరికాదు, ఎవరూ సమర్థించరు. కడకు వారైనా, విధిలేని పరిస్థితుల్లోనే అలా వ్యవహరించాల్సి వస్తోందని సమర్థించుకో జూస్తారు. కానీ, అలా జరక్కుండా చిత్తశుద్ధి కనబర్చడం పిల్లలుగా వారి కర్తవ్యం. తలిదండ్రులకన్నా ఈ భూప్రపంచంలో ముఖ్యమైన వారెవరుంటారు! భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో తల్లిదండ్రులకు ఎనలేని గౌరవముంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని కావడిలో మోస్తూ సేవలందించిన శ్రవణకుమారుని కథ ఓ గొప్ప ప్రేరణ. మహాత్ముడు బాపూజీని కూడా ప్రభావితం చేసిందా కథ. మన వేదాలు, పురాణేతిహాసాల్లో అటువంటి కథలు ఎన్నో! జన్మనిచ్చిన తల్లి, అందుకు కారకుడైన తండ్రి ప్రతి వ్యక్తికీ ముఖ్యులు కనుకనే ‘మాతృదేవోభవ, పితృదేవోభవ...’ అన్నారు. కనిపించే దేవతలు అయినందున వారికి అగ్రతాంబూలం. అందుకేనేమో, వారు కూడా తమ సంతానానికి అవ్యాజమైన ప్రేమను పంచుతూ, అనురాగం ఆప్యాయతల్ని రంగరించి పిల్లల్ని వృద్ధిలోకి తెస్తారు. అందుకోసం ఎంత వ్యయప్రయాసలకైనా వెనుకాడరు. వివిధ దశల్లో పిల్లల సౌఖ్యం, సౌభాగ్యం కోసం తమవైన జీవన సౌఖ్యాల్ని వదులుకొని పిల్లల కోసం, వారి మంచి భవిష్యత్తు కోసం త్యాగనిరతితో జీవనం సాగించే తల్లిదండ్రులు ఇక్కడున్నట్టు ప్రపంచంలో మరెక్కడా ఉండరని ఒక ప్రతీతి. ఆ ఔన్నత్యాన్ని గుర్తించే కావచ్చు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ దేశాన్ని కీర్తించారు. ఈ విశ్వానికి భారత్ చేసిన గొప్ప మేలు, విలువలతో కూడిన జీవన విధానాన్ని నేర్పడమని నిర్ద్వంద్వంగా పేర్కొన్నారు. అక్షరం ముక్క రాకపోయినా, బతుకు బండి భారంగా ఈడ్చినప్పటి అనుభవాల్ని జీర్ణించుకున్న పెద్ద మనసుతో పిల్లల్ని బాగా చదివిస్తారు పేద తల్లిదండ్రులు కూడా. ‘అమృతం తాగినవాళ్లు దేవుళ్లు, దేవతలు, అది కన్నబిడ్డలకు పంచిన వాళ్లు అమ్మానాన్నలు...’ అంటాడు ఓ సినీగీతంలో ఆచార్య ఆత్రేయ. కానీ, ఏ మేరకు రుణం తీర్చుకుంటున్నాం? జీవన పోరాటంలో, ఉద్యోగాన్వేషణల్లో ఎక్కడెక్కడో దూరతీరాలకు వెళుతూ బతుకు సమరంలో అలిసిపోయే నేటి తరం, తెలిసీ తెలియక తలిదండ్రుల్ని అలక్ష్యం చేస్తోందేమో! డాలర్ మోజులో పునాదులు మరచి.... ‘వృద్దాశ్రమంలో చేర్చి ఇంతింత కడుతున్నాంగా, ఇంకేం చేయాలి?’ అనే వారికి ఏం చెప్పగలం! కర్తవ్యం, బాధ్యతల సంగతలా ఉంచితే, దయ అనేదానికీ తావు లేదే? ఓ జీవిత కాలం పయనించి, బతుకు మలి సంధ్యలో... అనురాగపు అనునయింపు కోసం, ఆత్మీయస్పర్శ కోసం అలమటించే ఆ పండుటాకులకు అసరా కావాలనే స్పృహ అవసరం. పుట్టలో చెదల్లాగ పుట్టి, గిట్టేట్టయితే మనిషి పుట్టుక పుట్టి ఏం ప్రయోజనం! వేమన అడిగాడని కాదు గానీ, ఎవరకు వారం, మనకు మనం ప్రశ్నించుకోవాలి. - దిలీప్రెడ్డి -
భారత సంస్కృతి సమున్నతం
ప్రాక్-పశ్చిమ సమన్వయం ఒక యజ్ఞం జగద్గురు పీఠం అధ్యక్షుడు పార్వతీ కుమార్ సింహాచలం, న్యూస్లైన్: భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పదని, భారతీయులుగా పుట్టినందుకు మనమెంతో గ ర్వించాలని జగద్గురు పీఠం భౌగోళిక అధ్యక్షుడు మాస్టర్ కంభంపాటి పార్వతీ కుమార్ అభిభాషించారు. జగ ద్గురు పీఠం ఆధ్వర్యంలో సింహాచలంలో జరుగుతున్న 53వ గురుపూజా మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ప్రాక్-పశ్చిమ సమన్వయ కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీకుమార్ సాధకులనుద్దేశించి మాట్లాడారు. పరమ గురువుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రాక్-పశ్చిమ ఆధ్యాత్మిక సమ్మేళనం ఒక యజ్ఞమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 1875లో దివ్యజ్ఞాన వ్యవస్థాపకురాలు, రష్యా దేశస్తురాలు మేడం బ్లావెట్క్సీ ఈ యజ్ఞాన్ని ప్రారంభించారని, తర్వాత ఏలిస్ ఏ బైలీ, నికోలిక్, మాస్టర్ ఇ.కె. వంటి మహాత్ములు ఈ యజ్ఞాన్ని కొనసాగించారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్విట్జర్లాండ్ దేశీయుడు లుగ్దర్ ప్రసంగిస్తూ జగద్గురు పీఠం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు భౌగోళికంగా వ్యాప్తి చెందుతున్నాయని, మాస్టర్ పార్వతీ కుమార్ చేసే ప్రసంగాలు, రచనలు విదేశీయులకు ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయన్నారు. జెనీవాకు చెందిన రైనా, స్పెయున్ దేశీయుడు మైకేల్, అర్జంటీనా దేశస్తురాలు పెట్రోషియా తమ భావాలను సభలో వివరించారు. ఈ సందర్భంగా మాస్టర్ ఎం.ఎన్. ప్రాణామాయ గ్రంథాలు, జర్మనీ, స్పానిష్ గ్రంథాలను విడుదల చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హిందూ ధర్మం ప్రచారానికి కృషి చేస్తున్న సంస్థలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సింహాచల దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ అన్నారు. సాధకులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భం పార్వతీకుమార్ ఈవోను దుశ్శాలువతో సత్కరించారు. సామూహిక లలితా సహస్రనామార్చన విశేషంగా జరిగింది. దేశ విదేశీ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు ఉపనయనాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
ఒమెన్లో భారత స్కూళ్లకు ఆన్లైన్ దరఖాస్తులు
మస్కట్: వచ్చే 2014-2015 విద్యా సంవత్సరానికిగానూ మస్కట్లోని ఒమెన్లో భారత విద్యాలయాలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్టు అక్కడి మీడియా గురువారం వెల్లడించింది. ఈ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను డబ్య్లూడబ్య్లూడబ్య్లూ. ఇండియన్ స్కూల్స్ ఒమెన్. కామ్ ( www.indianschoolsoman.com) లో పొందవచ్చునని పేర్కొంది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు వీలుగా సంబందిత దరఖాస్తు ఫారమ్లు జనవరి 1 నుంచి పొందవచ్చునని అక్కడి టైమ్స్ ఆఫ్ ఒమెన్ నివేదించింది. ఈ విద్యాసంవత్సరానికి ఒమెన్లో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ (బీఒడీ) భారతీయ విద్యాలయ శాఖ అధ్వర్యంలో 19 భారతీయ విద్యా సంస్థలు ఉండగా, అందులో చదువుకునే విద్యార్ధులు 37వేల మంది వరకు ఉన్నారు. రిపోర్ట్ ప్రకారం.. కేంద్రీకరించిన అడ్మిషన్ విభాగ వ్యవస్థ (సీఏయస్) ఆధ్వర్యంలో ఆరు రాజధాని ఏరియా విద్యాసంస్థలను సమర్ధవంతముగా నడుస్తున్నాయి. ఈ అడ్మిషన్ విభాగ వ్యవస్థను 2011లో స్థాపించారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం పోటీపడే విద్యార్ధుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో అక్కడి విద్యాసంస్థల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఆ దేశ పాఠశాలలో ప్రధానంగా భారతీయ సంస్కృతికి తగట్టుగా విద్యను అభ్యసించేలా స్థాపించారు. ఈ విద్యా సంస్థలను రాజకీయేతరంగా నడుపుతున్నారు. -
అత్యుత్తమం భారతీయ సంస్కృతి
వన్టౌన్, న్యూస్లైన్ : ప్రపంచానికే భారతీయ సంస్కృతి దిక్సూచి వంటిదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అంత మహోన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి విద్యార్థులంతా కంకణం కట్టుకోవాలని కోరారు. మూడు రోజుల పాటు జరిగే కృష్ణా విశ్వవిద్యాలయం ‘కృష్ణాతరంగ్-2013’ అంతర్ కళాశాల యువజనోత్సవాలు శనివారం కేబీఎన్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. జ్యోతి వెలిగించి యువజనోత్సవాలను వెలంపల్లి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి యావత్ సాంస్కృతిక రంగంలోనే ఇమిడి ఉందన్నారు. ముఖ్యఅతిథిగా హజరైన విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ ఆచార్య డీ.సూర్యచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న కళాత్మకతను వెలికి తీసేందుకే విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కృష్ణాతరంగ్ పేరుతో యువజనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుందన్నారు. యువజనోత్సవాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఈ మూడు రోజుల పాటు వివిధ సాహితీ, సాంస్కృతిక, వైజ్ఞానిక అంశాల్లో తమ ప్రతిభను చాటి చెప్పనున్నారని చెప్పారు. గౌరవ అతిథిగా హజరైన ఉన్నత విద్యాశాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ గీతాంజలి మాట్లాడుతూ యువత నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలను సద్వినియోగించుకుని మరింత ఉన్నతస్థానాలకు చేరుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన నూజివీడు పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.బసవేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు అన్ని రంగాల్లోనూ ప్రతిభను ప్రదర్శిస్తూ తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారన్నారు. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో అనేక మంది ప్రముఖులను జల్లా అందించిందని చెప్పారు. అటువంటి సాంస్కృతిక రంగంలో యువత సైతం అద్భుత ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగడం అభినందనీయమని చెప్పారు. విశ్వవిద్యాలయం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరకృష్ణ, హిందూహైస్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, కేబీఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు ఉప్పల సాంబశివరావు తదితరులు ప్రసంగించారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు... కృష్ణాతరంగ్-2013 అంతర్ కళాశాలల యువజనోత్సవ పోటీల్లో తొలి రోజు శనివారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వివిధ పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జాతీయ బృందగానం, పాశ్చాత్య బృందగానం, క్విజ్ ప్రిలిమ్స్, స్పాట్ ఫొటోగ్రఫీ, క్లేమోడలింగ్, శాస్త్రీయ నృత్యం, జానపద వాద్యం, వక్తృత్వం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు, మొవ్వ, ఉయ్యూరు. నందిగామ, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హజరయ్యారు. -
భారతీయ సంస్కృతి గొప్పది
పొందూరు, న్యూస్లైన్ : భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు చాలా గొప్పవని ఆస్ట్రేలియాకు చెందిన మెల్బోర్న్ యూనివర్సిటి స్కాలర్స్ కొనియాడారు. భారతీయుల స్నేహస్వభావం తమకు నచ్చిందన్నారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు జిల్లాలో పర్యటిస్తున్న బృందం మంగళవారం పొందూరు వచ్చింది. ఈ సందర్భంగా స్కాలర్స్ ఫి జేమ్స్, సారా మార్షల్, సారా జోర్డాన్, బామ్బ్రిడ్జి, బెర్నార్డ్ పియర్స్ మాట్లాడుతూ, ఇండియాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. తాము ఇప్పటివరకు ఒడిశా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీతో పాటు ఆంధ్ర ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పర్యటించామన్నారు. చివరగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నామని అన్నారు. నిరక్షరాస్య నిర్మూలనకు సాక్షరభారత్ ద్వారా చేస్తున్న కృషి తెలుసుకుని ప్రశంసించారు. పీఎంఆర్డీఎఫ్ బాలయ్య మాట్లాడుతూ సాక్షరభారత్లో సభ్యులుగా ఉండి రూ. 2.47 లక్షలు మంది అక్షరాస్యులుగా మారారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమాకుమారి, తదితరులు పాల్గొన్నారు. ‘ఇందిరమ్మ పచ్చతోరణం’ పరిశీలన రణస్థలం రూరల్ : ఉపాధి హామీ పథకం కింద మండలంలో అమలవుతున్న ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా దేశానికి చెందిన సోషల్ వర్క స్కాలర్ బృందం మంగళవారం పరిశీలించింది. పచ్చతోరణం కార్యక్రమంలో బాగంగా మండలంలో కమ్మశిగడాం గ్రామంలో కోనేరు గట్టుపై పెంపకం చేపడుతున్న కొబ్బరి మొక్కలను బృంద సభ్యులు బోనెట్, ఫై, వె స్లీ, షరాలు పరిశీలించారు. ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద భూమిలేని షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందినవారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికీ 100 కొబ్బరి మొక్కలు చొప్పున అందించినట్లు బృంద సభ్యులకు ఉపాధి పథకం ఏపీడీ ఎల్.అప్పలసూరి వివరించారు. ఐదేళ్ల పాటు మొక్కల పెంపకానికి, ఎరువులకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అనంతరం కొబ్బరి మొక్కల నుండి వచ్చిన ఆదాయాన్ని నిరుపేద రైతులే అనుభవించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భూమిలేని నిరుపేదలను కుటుంబాలను ఆదుకునేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా బృంద సభ్యుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ ఏపీడీ ఎల్.రామారావు, బాలయ్య, స్థానిక ఏపీఓ జి.త్రినాథరావుతో పాటు పలువురు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.