Indian women
-
నేను ఈ తరం మహిళను..
సాక్షి, విశాఖపట్నం: ఏటా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు జనం గుండెల్ని గుభేల్మనిపిస్తున్నాయి. సామాన్యులే కాదు.. ఉన్నత వర్గాల వారు కూడా ఇంధన ధరల కారణంగా ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా.. అందరి చూపూ ఎలక్ట్రిక్ వాహనాల(electric vehicle)పై పడుతోంది. పెట్రోల్, డీజిల్తో పనిలేదు.. పరిమిత వేగం.. స్వల్ప బరువు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం.. పర్యావరణ హితం.. ఇలా బోలెడు ప్రయోజనాలున్న ఈ–వెహికల్స్పై ఆసక్తి పెరుగుతోంది.తమకు ఉన్న వాహనంతో పాటు కొత్తగా ఇంకొకటి కొనాలంటే.. ఇప్పుడు చాలామంది ఈ–వెహికల్వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా భారతీయ మహిళలు(Indian Women).. ఈవీలపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. 52 శాతం మహిళలు ఈవీ కొనుగోలు చెయ్యాలంటూ ఇళ్లల్లో ఒత్తిడి తీసుకువస్తున్నారని ‘థింక్ మొబిలిటీ’ శీర్షికన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో కలిసి గూగుల్ సంస్థ నిర్వహించిన సర్వే ఒకటి పేర్కొంది. ఆందోళనలూ ఉన్నాయ్.. అయితే చాలా మంది ఇంకా బ్యాటరీలు పేలిపోవడం, చార్జింగ్ సౌకర్యాలు గణనీయంగా వృద్ధి చెందకపోవడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రతి ముగ్గురిలో ఒకరు బ్యాటరీ లైఫ్టైమ్ ఆశించినంతగా ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.అభిరుచులకు అనుగుణంగా మోడల్స్...ఈవీలో తలెత్తుతున్న సవాళ్లని అధిగమిస్తూ.. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్లు ఈ–వెహికల్స్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కొన్ని బ్రాండ్లు బ్యాటరీ కాలపరిమితిని పెంచుతూ మోడల్స్ని తీసుకువస్తున్నాయి. ఈ తరుణంలో ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్ గణనీయమైన వృద్ధి సాధిస్తోంది. సర్వే అధ్యయనం ప్రకారం 2035నాటికి ఈ– వాహన కొనుగోళ్లు 2.7 రెట్లు వరకూ పెరగనున్నాయి. సర్వేలో వెల్లడైన మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు... ⇒ 3/1 కొత్త వెహికల్ కొనాలనుకునే వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈవీ వైపు మొగ్గు చూపుతున్నారు ⇒36 శాతం ఒక వాహనం ఉంటే రెండోది ఎలక్ట్రిక్ వెహికల్ కావాలని కోరుకుంటున్నవారు⇒ 30 శాతం ఈ–బైక్ బెటర్ ఆప్షన్గా ఎంపిక చేసుకుంటున్న మహిళలు⇒ 41 శాతం జీపీఎస్ సౌకర్యంపై మక్కువ చూపుతున్నవారు⇒ 45 శాతం ఫ్యూయల్ వాహనాలతో పోలిస్తే.. ఈవీలతో డబ్బులు ఆదా అవుతున్నాయని భావిస్తున్నవారుఫ్యూయల్ కోసం ఇబ్బందులు లేవు ఇంట్లో కారు, ఫ్యూయల్ స్కూటీ ఉన్నా.. పట్టుబట్టి మరీ ఎలక్ట్రిక్ స్కూటీని తీసుకున్నాను. ఇది చాలా సౌలభ్యంగా ఉంది. ఇంధన వెహికల్ అయితే.. ఫ్యూయల్ కోసం బంకుల కోసం వెతుకులాట ప్రయాసగా ఉంటోంది. ఈ–బైక్ అయితే ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకుంటే చాలు. హ్యాపీగా ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసుకోవచ్చు. నాలుగు గంటల సమయం వరకు చార్జింగ్ పెడితే దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. – గంపా చైతన్యజ్యోతి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తేలిగ్గా డ్రైవ్ సాధారణ స్కూటీలతో పోలిస్తే ఈవీ చాలా తేలిగ్గా డ్రైవ్ చేసుకోగలుగుతున్నాను. ముఖ్యంగా ఇందులో ఉన్న నేవిగేషన్ సిస్టమ్కి ఫిదా అయిపోయి ఈ–స్కూటీ కొనుగోలు చేశాను. ఎవరినీ అడ్రస్ అడగాల్సిన అవసరం లేకుండా.. ఎక్కడికి కావాలంటే అక్కడికి నేరుగా స్క్రీన్లో చూసుకుంటూ వెళ్లిపోగలుగుతున్నాం. ఇప్పుడు దాదాపు అన్ని చోట్లా చార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. భవిష్యత్తులో ఈ–కారునే కొంటాం. – సీహెచ్ లక్ష్మి, గృహిణి -
టీమిండియా వుమెన్స్ భారీ విజయం
రాజ్కోట్: ఐసీసీ చాంపియన్షిప్ మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఐర్లాండ్ మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ మహిళలు భారీ విజయం సాధించారు. రెండో వన్డేలో భారత్ 116 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా సిరీస్ను ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది భారత్.ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలోఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది.రోడ్రిగ్స్(102) సెంచరీతో కదం తొక్కగా, హర్లీన్ డియోల్(89), మంధనా(73), ప్రతీకా రావల్(67)లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. దాంతో భారత్ 351 పరుగుల లక్ష్యాన్ని స్కోరు బోర్డుపై ఉంచింది.అనంతరం బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కౌల్టర్ రిలీ(80) మాత్రమే ఆ జట్టులో టాప్ స్కోరర్గా నిలవడంతో ఐర్లాండ్కు ఓటమి తప్పలేదు. భారత మహిళ జట్టులోని బౌలర్లలో దీప్తి శర్మ మూడు, ప్రియా మిశ్రా రెండు వికెట్లతో రాణించగా,టిటిస్ బాదు, సాయలి తలో వికెట్ సాధించారు. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికె ట్ల తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జ ట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగనుంది. -
భారత మహిళల రగ్బీ జట్టుకు రజత పతకం
ముంబై: ఆసియా రగ్బీ ఎమిరేట్స్ సెవెన్స్ ట్రోఫీలో భారత మహిళల జట్టు రజత పతకం కైవసం చేసుకుంది. నేపాల్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ 5–7 పాయింట్ల తేడాతో ఫిలిప్పీన్స్ చేతిలో ఓటమి పాలైంది. శిఖా యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అంతకుముందు సెమీఫైనల్లో 24–7 తేడాతో గువామ్పై గెలిచి పట్టికలో అగ్రస్థానంతో తుదిపోరుకు చేరింది. లీగ్ దశలో భారత్ 29–10 తేడాతో శ్రీలంకపై... 17–10తో ఇండోనేసియాపై గెలిచి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఈ టోర్నీలో మరోసారి రజతం గెలవడం ఆనందంగా ఉందని శిఖా యాదవ్ పేర్కొంది. ‘ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటారు. కఠిన ప్రత్యర్థులపై చక్కటి ప్రదర్శన కనబర్చడం వల్లే రజత పతకం సాధించగలిగాం. సహచరుల ఆటతీరుతో గర్వపడుతున్నా. ఈ విజయంలో కోచ్లతోపాటు సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది’అని శిఖా యాదవ్ చెప్పింది. -
ముందు కెరీర్..తర్వాతే పిల్లలు!
ఇల్లు.. పెళ్లి.. పిల్లలు.. ఇది నిన్నటితరం భారతీయ మహిళల మాట.. ఉన్నత చదువు.. కెరీర్.. పెళ్లి.. కెరీర్లో స్థిరత్వం.. ఆ తర్వాతే పిల్లలు.. ఇదీ నేటి భారతీయ మహిళల దృక్కోణంలో వచ్చిన మార్పు.. అవును.. పిల్లలకు జన్మనిచ్చే విషయంలో భారత మహిళల దృక్పథం మారుతోంది. ముందు ఉన్నత చదువును అభ్యసించడం, మంచి ఉద్యోగం సాధించి కెరీర్ను మొదలుపెట్టడం, ఆ తర్వాత దాంపత్య బంధంతో ఒక్కటి కావడం, కెరీర్లో స్థిరత్వం ఇవన్నీ సమకూరాకే సంతానం కనడానికి మొగ్గుచూపుతున్నారు. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరే వరకు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఈ మేరకు 2016 తర్వాత నుంచి భారత మహిళల దృక్పథంలో గణనీయ మార్పులు వచ్చాయని కేంద్ర గణాంకాలు – కార్యక్రమాల అమలు శాఖ తాజా నివేదిక వెల్లడించింది. ‘భారతదేశంలో మహిళలు, పురుషులు– 2023’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో దేశంలో జనాభా పెరుగుదల, పురుషులు–మహిళల నిష్పత్తి, సంతానం విషయంలో మహిళల దృక్పథం తదితర అంశాలపై కీలక విషయాలను పొందుపరిచింది. అందులోని ప్రధాన అంశాలు ఇవీ.. – సాక్షి, అమరావతి2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లు దేశ జనాభా 2036 నాటికి ఏకంగా 152.2 కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల జనాభా నిష్పత్తి క్రమంగా మెరుగుపడుతోంది. 2011లో దేశంలో ప్రతి వేయిమంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా... 2036 నాటికి 952కు పెరుగుతారని అంచనా. 2011లో దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం ఉండగా 2036 నాటికి 48.8 శాతానికి పెరగనున్నారు.మారుతున్న ‘వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు’ భారతదేశంలో ‘వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు’ (ఏజ్ స్పెసిఫిక్ ఫెర్టిలిటీ రేట్) గణనీయంగా మారుతోంది. 20 – 24 ఏళ్లు, 25 – 29 ఏళ్లు, 30– 34 ఏళ్లు, 35– 39 ఏళ్లు.. ఇలా ఐదేళ్లు ఒక్కో కేటగిరీగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో ప్రతి వేయి మంది మహిళలు ఏడాదిలో ఎంతమంది బిడ్డలకు జన్మనిస్తారో దాన్ని వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు అని అంటారు. మహిళల నిర్ణయానికి కారణాలివే» కెరీర్లో స్థిరపడ్డాక నిర్దేశిత లక్ష్యాలు సాధించేవరకు బిడ్డలను కనేందుకు మహిళలు ఇష్టపడటం లేదు. బిడ్డలను కంటే కెరీర్పై తగినంత శ్రద్ధ చూపించలేమని, అలాగే వారికి కావాల్సినంత సమయం కేటాయించలేమనే భావనతో ఉన్నారు. అందుకే 20 నుంచి 29 ఏళ్ల మధ్యలో కెరీర్లో స్థిరపడ్డాకే బిడ్డలను కనాలని భావిస్తున్న మహిళల శాతం పెరుగుతోంది. దీంతో ఆ కేటగిరీల్లో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. » ఇక కెరీర్లో స్థిరపడ్డాక బిడ్డలను కంటున్న మహిళల శాతం పెరుగుతోంది. దేశంలో 35 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. 2011– 2015 మధ్య 35 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు 32 ఉండగా... 2016– 2020లో అది 35కు పెరిగింది. » ఇక 18 ఏళ్ల లోపే బిడ్డలను కంటున్న వారిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య వ్యత్యాసం ఉంది. 2016–2020లో నిరక్షరాస్యుల్లో 18 ఏళ్ల లోపు వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు 39గా ఉండగా... అక్షరాస్యుల్లో ఆ రేటు 11కే పరిమితమైంది. తగ్గుతున్న ప్రసూతి మరణాలు.. ప్రసూతి మరణాలను తగ్గించడంలో భారతదేశం నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తోంది. 2030 నాటికి దేశంలో ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలను 70కు తగ్గించాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో 2018–20 నాటికి ప్రసూతి మరణాలను 97కు తగ్గించారు. 2030 నాటికి కంటే ముందుగానే లక్ష్యాన్ని సాధించగలమని ప్రభుత్వం పూర్తి ధీమాతో ఉంది. ఇక దేశంలో శిశు మరణా లు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రతి వేయి కాన్పులకు శిశు మరణాల రేటు 2015లో 43గా ఉండగా.. 2020నాటికి 32కు తగ్గింది. -
తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ!
బొట్టు, గాజులు, పువ్వులు.. భారతీయ స్త్రీకి అలంకారంగానే చూస్తున్నారు! వాటి చుట్టూ ఆర్థిక, సామాజిక భద్రత చట్రాన్ని బిగించి మహిళను బందీ చేశారు! అయితే స్వాతంత్య్రానికి పూర్వమే బుద్ధిజీవులు ఆ కుట్రను పసిగట్టారు. అలంకారం స్త్రీ హక్కు.. అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. ఆ ఆత్మవిశ్వాసమే ఆమె ఆర్థిక, సామాజిక సాధికారతకు పునాది అని నినదించారు! వితంతు చదువు, కొలువు, పునర్వివాహం కోసం పోరాడారు. సమాజాన్ని చైతన్యపరచడానికి చాలానే ప్రయత్నించారు. అయినా .. వితంతువుల జీవితాలేం మారలేదు.. సంఘసంస్కర్తల పోరు చిన్న కదలికగానే మిగిలిపోయింది! పురోగమిస్తున్న.. పురోగమించిన సమాజాల్లో ఎన్నో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి.. చట్టాలు వస్తున్నాయి!కానీ ఆల్రెడీ చట్టాల తయారీ వరకు వెళ్లిన విడో సమస్యల మీద మాత్రం ఆ సమాజాల్లో కనీస అవగాహన కొరవడుతోంది! చర్చలు అటుంచి ఆ పేరు ఎత్తితేనే అపశకునంగా భావించే దుస్థితి కనపడుతోంది! అందుకే యూఎన్ఓ ‘ఇంటర్నేషనల్ విడోస్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టింది.. ఏటా జూన్ 23న. ఆ రకంగానైనా ప్రపంచ దేశాలు విడో సమస్యలను పట్టించుకుని వాళ్ల రక్షణ, సంరక్షణ బాధ్యతను సీరియస్గా తీసుకుంటాయని.. ప్రజలూ వాళ్లను సమదృష్టితో చూసే పెద్దమనసును అలవరచుకుంటారని! ఆ సందర్భాన్నే ఈ వారం కవర్ స్టోరీగా మలిచాం!మోదీ 3.0 కేబినేట్లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా రక్షా ఖడ్సే రికార్డులోకి ఎక్కారు. ఆ ఘనత ఆమెకు గాలివాటంగా రాలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రక్షా భర్త, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనివార్యంగా రక్షా ఖడ్సే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు మహరాష్ట్రలోని రావేర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భర్త తరఫు కుటుంబం నుంచి సహకారం అందడంతో ఆమె రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే అందరికీ రక్షా ఖడ్సేలా çకుటుంబం నుంచి, సమాజం నుంచి సహాయ సహకారాలు అందడం లేదనడానికి ఒక ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవల కనిపించింది.తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచాయతీ ముదిరింది. ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తరఫు బంధువులు ఆస్తి పంపకం విషయంలో మృతుడి భార్య తరఫువారు వెనక్కి తగ్గితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనకు అవతలి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా మూడు రోజులైనా దహన సంస్కారాలు జరగలేదు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ముందుకు సాగింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ అదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. లేదంటే తనకు, తన పిల్లలకు ఈ సమాజం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే! ఆనాటి నుంచి ఈనాటి వరకు భర్తను కోల్పోయి ఒంటరైన మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు.మధ్యయుగాల్లో..భర్త చనిపోతే అతని చితిపైనే బతికున్న భార్యకు కూడా నిప్పంటించే సతీ సహగమనం అనే అమానవీయ ఆచారాలను రూపుమాపే ప్రయత్నాలు బ్రిటిష్ జమానాలోనే మొదలయ్యాయి. భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసి, తెల్ల చీరలు కట్టించి, ఇంటి పట్టునే ఉంచే దురాచారాన్ని పోగొట్టేందుకు రాజా రామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు అలుపెరగని పోరాటం చేశారు. వీరి కృషి ఫలితంగా ఈరోజు సతీసహగమనం కనుమరుగైంది. తెల్లచీర, శిరోముండన పద్ధతులూ దాదాపుగా కనుమరుగయ్యాయి. అంతగా కాకపోయినా పునర్వివాహాల ఉనికీ కనపడుతోంది. అయితే ఇంతటితో భర్తను కోల్పోయిన మహిళల జీవితాల్లో వెలుగు వచ్చేసిందా? వారి కష్టాలన్నీ తీరిపోయాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే స్ఫురిస్తుంది. భర్తపోయిన స్త్రీలకు కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు మన దగ్గరే కాదు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.ప్రస్తుత ప్రపంచ జనాభాను దాదాపు ఎనిమిది వందల కోట్లకు అటూ ఇటూగా పరిగణిస్తే అందులో వితంతువుల సంఖ్య 25 కోట్లకు పైమాటే! సమాజంలో అందరికంటే అత్యంత నిరాదరణ, అవమానాలు, కనీస మద్దతు వంటివీ కరువైనవారిలో వితంతువులే ముందు వరుసలో ఉన్నారు. జాతి, మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోగా అవమానాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమాజం పుట్టుక నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ జాతి వివక్ష, లింగ వివక్ష, కుల వివక్ష, ఆర్థిక అంతరాల మీద జరుగుతున్నంత చర్చ వితంతు సమస్యల మీద జరగడం లేదు. విపత్తులు, యుద్ధాలు, మహమ్మారులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు ఈ సమస్య పెరుగుతోంది. కరోనా, రష్యా– ఉక్రెయిన్, ఇజ్రాయేల్– పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలోనూ వితంతువుల సమస్యలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.గూంగీ గుడియా..మన దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులరాలైన ఇందిరా గాంధీ తన 43వ ఏట భర్త (ఫిరోజ్ గాంధీ)ను కోల్పోయారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి జవహర్ మరణంతో ఆమె రాజకీయ ప్రవేశం అనివార్యమైంది. ఇందిరా రాజకీయ జీవితం తొలినాళ్లలో సోషలిస్ట్ నేత రామ్మనోహర్ లోహియా ఆమెను గూంగీ గుడియా (మూగ బొమ్మ)గా అభివర్ణించేవారు. తర్వాత ఆమె తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు, చేపట్టిన ప్రజాదరణ పథకాలు, గరీబీ హఠావో వంటి నినాదాలతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలకడం వంటి సాహసాలతో ఆమె గూంగీ గుడియా కాదు ఐరన్ లేడీ అనే ప్రతిష్ఠను సాధించింది. అప్పటిదాకా వితంతువు దేశానికి అపశకునం అని నిందించిన నోళ్లే ఆమె రాజకీయ చతురతను చూసి దుర్గాదేవిగా కీర్తించటం మొదలుపెట్టాయి. ఆ తరానికి చెందిన ఎంతోమంది తమ పిల్లలకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టుకునేలా ప్రేరణను పంచారు ఆమె. ఆఖరికి ఇందిరా సమాధిని శక్తిస్థల్గా పిలిచే స్ఫూర్తిని చాటారు.కరోనాతో మరోసారి..రెండు ప్రపంచ యుద్ధాల సందర్భంగా ఈ ప్రపంచం గతంలో ఎన్నడూ చూడనంతగా వితంతు సమస్యను ఎదుర్కొంది. ఆ గాయాల నుంచి బయటపడే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చరిల్లింది. మరోవైపు సామ్రాజ్యవాదం నాటిన విషబీజాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు గడిచిన రెండు దశాబ్దాల్లో పెరిగాయి. వెరసి ఆయుధాల నుంచి తూటాలు దూసుకువస్తున్నాయి. ఆకాశం నుంచి జారిపడే బాంబుల గర్జన పెరిగింది. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. వీటి వల్ల అనూహ్యంగా వితంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య .. ఇరాక్, అఫ్గానిస్తాన్, పాలస్తీనా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అధికంగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలకు తోడు కరోనా వైరస్ ఒకటి. అది సృష్టించిన భయోత్పాతానికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజుల తరబడి స్తంభించిపోయాయి. 2020, 2021లలో లక్షలాది మంది జనం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారమే నాలుగున్న లక్షల మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కరోనా చేసిన గాయాల కారణంగా మనదేశంలోనూ వితంతువుల సంఖ్య పెరిగింది.మరిన్ని రూపాల్లో.. యుద్ధాలు, విపత్తులు, మహమ్మారుల రూపంలోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, రైతుల ఆత్మహత్యలు వంటివీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వితంతువుల సంఖ్య పెరగడానికి కారణాలవుతున్నాయి. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ స్థితిగతులపై అవగాహన లేకపోవడం, కరువు, అధిక వడ్డీలు, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఏ ఏటికి ఆ ఏడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అప్పటికే అప్పుల పాలైన సదరు రైతు కుటుంబం, ఆ రైతు జీవిత భాగస్వామి అలవికాని కష్టాల్లో మునిగిపోయుంటోంది. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో మద్యం ప్రాణాలను కబళిస్తోంది. తాగుడు అలవాటైన వ్యక్తులు అందులోనే జోగుతూ కుటుంబాలను అప్పుల్లోకి నెడుతూ అనారోగ్యంపాలై చనిపోతున్నారు. ఆఖరికి ఆ కుటుంబం చిక్కుల్లో పడుతోంది. అందులో అత్యంత వేదనను భరిస్తోంది సదరు మృతుడి జీవిత భాగస్వామే!అత్యంత సంపన్న మహిళ..33.50 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళాగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ కూడా ఒంటరి మహిళే! తన ¿¶ ర్త.. జిందాల్ గ్రూప్ ఫౌండరైన ఓంప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత.. స్టీల్, పవర్, సిమెంటుకు చెందిన జిందాల్ గ్రూప్ వ్యాపార సంస్థలకు చైర్పర్సన్ గా ఆ గ్రూప్ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.సమస్యల వలయం..హఠాత్తుగా భర్తను కోల్పోవడం స్త్రీ జీవితంలో అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు తనతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఒక్కసారిగా దూరం అవుతాయి. దీంతో మానసిక తోడును ఒక్కసారిగా కోల్పోతారు. ఆ స్థితిని అర్థం చేసుకుని మానసికంగా తమను తాము కూడగట్టుకోక ముందే ఆచారాలు, సంప్రదాయాలు ఆ స్త్రీ పై తమ దాడిని మొదలెడతాయి. ఆ వెంటనే ఆస్తి పంపకాలు, బాధ్యతల విభజన విషయంలో భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలవుతుంది. కాస్త చదువు, అదిచ్చిన ధైర్యం ఉన్న స్త్రీ అయితే స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉన్న దారిని ఎంచుకుంటుంది. ఆ రెండూ లేని వితంతువులు భర్త తరఫు కుటుంబం లేదా పుట్టింటి వారి దయాదాక్షిణ్యాలకు తల ఒగ్గుతారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ రెండు ఇళ్లలో ఏదో ఒక ఇంటికి స్వచ్ఛంద వెట్టి చాకిరికి కుదిరిపోతారు వారి తుది శ్వాస వరకు. కాలం మారినా ఈ దృశ్యాలు మాత్రం మారలేదు. పై చదువులు, కొలువుల కోసం అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే పురోగతి ఎంతగా కనిపిస్తోందో.. దేశానికి ఇంకోవైపు భర్తపోయిన ఒంటరి స్త్రీల దయనీయ జీవితపు అధోగతీ అంతే సమంగా దర్శనమిస్తోంది.కుటుంబాల మద్దతు లేకపోయినా, మెరుగైన జీవితం కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి జీవన పోరాటం మొదలుపెట్టినా.. పొద్దునే ఆమె ఎదురొస్తే సణుక్కుంటూ మొహం తిప్పుకుని వెళ్లడం, శుభకార్యాలకు ఆమెను దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు ఆమెను బహిష్కరించడం, అంతెందుకు దేవుడి గుడిలోనూ అలాంటి అవమానాన్నే పంటి బిగువున భరించాల్సి వస్తోంది ఆమె! వీటన్నిటినీ జయించే శక్తిని కూడదీసుకున్నా, భర్త పోయిన ఆడవాళ్లకు ఇంటా, బయటా ఎదురయ్యే లైంగిక వేధింపుల చిట్టా మరొక కథ. ఇలా విడో అన్నిటికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిన తీరు అభివృద్ధి చెందుతున్న, చెందిన సమాజాల్లోనూ కామన్ సీన్గా ఉందంటే లేశమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరోవైపు వారికి అందాల్సిన ఆర్థిక మద్దతు కరువైన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆఖరికి యాచకుల్లో కూడా విడోలకు ఆదరణ ఉండదనేది చేదు వాస్తవం. యాచనకు దిగిన వితంతువులను అపశకునంగా భావించి దానం చేసేందుకు నిరాకరించే జనాలు కోకొల్లలు. ఇలా నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోన్న శరణాలయాలు ప్రధాన దిక్కుగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా మానవత్వం లోపించిన వారి నుంచి వితంతువులకు ఇక్కట్లు తప్పడం లేదు.వరల్డ్ విడోస్ డే..ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటి పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలవడానికి ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ విడోస్ డే’ను నిర్వహించాలని 2011లో నిర్ణయించింది. అందుకు జూన్ 23వ తేదీని ఎంచుకుంది. నాటి నుంచి ‘వరల్డ్ విడోస్ డే’ ద్వారా భర్తపోయిన స్త్రీల రక్షణ, సంరక్షణల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధిలో చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం, ఆచారాలు, సంప్రదాయాల పేరిట వారిపై జరుగుతున్న మానసిక, శారీరక దాడుల నుంచి విముక్తి కల్పించడం వంటివి ఐరాస ముఖ్య ఉద్దేశాల్లో కొన్నిగా ఉన్నాయి.మెహినీ గిరి..మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వింతతు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్య కారణాలు ఆడపిల్లలకు చదువు లేకపోవడం, మూఢవిశ్వాసాలు, కన్యాశుల్కం. ఈ సమస్యను స్వాతంత్య్రానికి పూర్వమే గ్రహించారు రాజా రామమోహన్ రాయ్, జ్యోతిబా పూలే, కందుకూరి విరేశలింగం వంటి సంఘసంస్కర్తలు. అందుకే ఆడపిల్లలు, బాల వితంతువులకు చదువు, స్వావలంబన, వితంతు వివాహాల కోసమూ అంతే పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. అయితే వితంతువుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమించిన వారిలో మోహినీ గిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యపై చర్చను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆమె పాటుపడ్డారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆమెకు పద్మభూషణ్ సత్కారాన్ని అందజేసింది.వార్ విడోస్ అసోసియేషన్..స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లక్నో యూనివర్సిటీలో సైన్ ్స డిపార్ట్మెంట్ను ప్రారంభించడంలో మోహిరీ గిరి తండ్రి కీలకమైన పాత్ర పోషించారు. దీంతో యూనివర్సిటీలో మోహినీ గిరి తండ్రికి ఒక పెద్ద బంగ్లాను కేటాయించడంతో పాటు విశేషమైన గౌరవ మర్యాదలనూ ఆ కుటుంబానికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అంటే మోహినీ పదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆ యూనివర్సిటీలో ఆమె కుటుంబ పరిస్థితి తారుమారైంది. అప్పటికే ఆమె తల్లికి సంగీతంలో డాక్టరేట్ పట్టా ఉన్నా, యూనివర్సిటీ నుంచి సరైన రీతిలో ప్రోత్సాహం లభించలేదు. పిల్లల పెంపకం కష్టం కావడంతో ఆమె యూనివర్సిటీని వదిలి బయటకు వచ్చారు. ఒంటరి తల్లిగా ఆమెకు ఎదురైన కష్టాలు, తమను పెంచి పెద్ద చేయడంలో ఆమె పడ్డ ఇబ్బందులను మోహినీ దగ్గరగా చూశారు. ఆ తర్వాత ఆమె మాజీ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆ సమయంలోనే అంటే 1971లో ఇండో–పాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్కు విముక్తి లభించింది. అయితే ఆ పోరులో ఎందరో జవాన్లు అమరులయ్యారు. వారి భార్యలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరయ్యారు. దీంతో ఆమె 1972లో దేశంలోనే తొలిసారిగా ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ను ప్రారంభించారు.దాడులు..ఆ రోజుల్లో (ఇప్పటికీ చాలా చోట్ల) వితంతువులు బయటి పనులకు వెళ్లడాన్ని అనాచారంగా భావించే వారు. అంతేకాదు రంగురంగుల దుస్తులు ధరించడంపైనా ఆంక్షలు ఉండేవి. జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో మోహినీ గిరి.. వారణాసి, బృందావన్, పూరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో వితంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆశ్రయం కల్పించి ఆ కేంద్రాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. వారి పిల్లలకు చదువులు చెప్పించారు. వీవీ గిరి ప్రభుత్వపరంగా పెద్ద పోస్టుల్లో ఉన్నంత వరకు మోహినీ గిరి చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ సహకారం అందించిన సమాజం.. ఆయన పదవుల్లోంచి దిగిపోయిన వెంటనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మోహినీ గిరి.. వితంతువులకు రంగురంగుల దుస్తులు వేసుకోమని ప్రోత్సహిస్తోందంటూ మన తిరుపతిలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. ఆ దాడులకు ఆమె వెరవలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నేటికీ ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. ఎందరో బుద్ధిజీవులు మోహినీ గిరి అడుగుజాడల్లో నడుస్తూ వితంతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.వితంతు రక్షణ చట్టాలు..వితంతువులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి కనిష్ఠంగా నెలకు రూ. 300ల నుంచి రూ.3,000ల వరకు ఆయా ప్రభుత్వాల వారీగా అందుతున్నాయి. పెన్షన్ తో పాటుగా వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలనూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 నుంచి ఇప్పటి వరకు వితంవులు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలను రూపొందించినా, సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయి. చట్టాల రూపకల్పన, ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు వంటివాటిని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై ఆధారపడే స్థితి నుంచి అద్భుతాలు సాధించే దశకు చేరుకుంటారు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
Gitika Talukdar: ప్యారిస్ ఒలింపిక్స్కు మన ఫొటోగ్రాఫర్
వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్. అన్ని దేశాల ఆటగాళ్లే కాదు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా కెమెరాలతో బయలుదేరుతారు. కాని ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ (ఐ.ఓ.సి) గుర్తింపు పొందిన వారికే అన్ని మైదానాల్లో ప్రవేశం. అలాంటి అరుదైన గుర్తింపును పొందిన మొదటి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్. అస్సాంకు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ పరిచయం.‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా కెరీర్ని ఎంచుకోవడానికి స్త్రీలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే అది మగవాళ్ల రంగం చాలా రోజులుగా. అక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. నేను వాటన్నింటినీ అధిగమించి ఇవాళ గొప్ప గుర్తింపు పొందగలిగాను’ అని సంతోషం వ్యక్తం చేసింది గీతికా తాలూక్దార్. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఫొటోలు తీయడానికి ఆమెకు అక్రిడిటేషన్ లభించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి (ఐ.ఓ.సి) చాలా తక్కువ మంది ఫొటోగ్రాఫర్లకు మాత్రమే ఒలింపిక్స్ను కవర్ చేసే అధికారిక గుర్తింపు ఇస్తుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లు ఈ గుర్తింపు పొందితే మన దేశం నుంచి మొదటి, ఏకైక మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా గీతికా తాలూక్దార్ చరిత్ర సృష్టించింది. ఫ్రీ లాన్సర్గా...‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ అంటే విస్తృతంగా పర్యటించాలి. సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థలు ఒక్కోసారి అనుమతిస్తాయి, మరోసారి అనుమతించవు. అందుకని నేను ఫ్రీలాన్సర్గా మారాను. స్వేచ్ఛ పొందాను. నా సేవలు కావాల్సిన సంస్థలు నన్ను సంప్రదిస్తాయి’ అంది గీతిక. ఫ్రీ లాన్సర్గా ఉంటూనే ఆమె ఇంకా చదువు కొనసాగించింది. కొలంబోలో డిప్లమా కోర్సు చేసింది. అలాగే సౌత్ కొరియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వారి స్కాలర్షిప్ పొంది సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కొలంబోలో చదువుకునే సమయంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం గొప్ప అనుభవం. అక్కడ ఆయన పేద పిల్లలకు క్రికెట్ నేర్పేందుకు అకాడెమీ నిర్వహిస్తున్నారు. నేను వెళ్లిన రోజు బాల్ ఎలా విసరాలో నేర్పుతున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారు’ అని చెప్పింది గీతిక.కోవిడ్ రిస్క్ ఉన్నా...ప్రపంచంలో ఎక్కడ భారీ క్రీడా వేడుకలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది గీతిక. ఆస్ట్రేలియా ఫీఫా విమెన్స్ వరల్డ్ కప్, ఖతార్లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ పోటీలను ఆమె కవర్ చేసింది. 2020 సియోల్ ఒలింపిక్స్కు కోవిడ్ కారణంగా చాలా మంది అక్రిడిటెడ్ ఫొటో జర్నలిస్టులు వెళ్లడానికి భయపడ్డారు. కాని అక్రిడిటేషన్ లేకున్నా గీతిక అక్కడకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసి గుర్తింపు పొందింది. తన వృత్తి పట్ల ఆమెకు ఉన్న ఈ అంకిత భావాన్నే ఒలింపిక్స్ కమిటీ గుర్తించింది. అందుకే ఈసారి అధికారికంగా ఆహ్వానం పలికింది. జూలై 23న ప్యారిస్ బయలుదేరి వెళ్లనుంది గీతిక. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ అనేది ఈసారి ఒలింపిక్స్ థీమ్. మరిన్ని వర్గాలను కలుపుకుని ఈ క్రీడలు జరగాలనేది ఆశయం. తక్కువ గుర్తింపుకు నోచుకునే మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఈ ఆశయంలో భాగమే. ‘నాకొచ్చిన అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరింత కష్టపడి పని చేస్తాను. స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా కెరీర్ను ఎంచుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ అవసరం. అంతర్జాతీయ క్రీడాపోటీలు టైముకు మొదలయ్యి టైమ్కు ముగుస్తాయి. వాటిని అందుకోవాలంటే క్రీడల్లోని ఉత్తమ క్షణాలను కెమెరాలో బంధించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరం. అవి ఉన్నవారు ఈ రంగంలో నిస్సందేహంగా రాణిస్తారు’ అంటోంది గీతిక.‘టీ సిటీ’ అమ్మాయిఅస్సాంలోని డూమ్డుమా పట్టణాన్ని అందరూ ‘టీ సిటీ’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ తేయాకు తోటలు విస్తారం. హిందూస్తాన్ లీవర్ టీ ఎస్టేట్ అక్కడే ఉంది. ఆ ఊళ్లో చిన్న ఉద్యోగి కుమార్తె అయిన గీతిక చిన్నప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడింది. అందుకు కారణం ఆమె మేనమామ చంద్ర తాలూక్దార్ ఫిల్మ్మేకర్గా గుర్తింపు పొందడం. అతను కెమెరాలో నుంచి చూస్తూ రకరకాల దృశ్యాలను అందంగా బంధించడాన్ని బాల్యంలో గమనించిన గీతిక తాను కూడా అలాగే చేయాలనుకుంది. పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేశాక మాస్ కమ్యూనికేషన్లో డి΄÷్లమా చేసింది. క్రీడలంటే ఆసక్తి ఉండటంతో స్పోర్ట్స్ జర్నలిస్ట్గా, ఫొటోగ్రాఫర్గా మారి 2005 నుంచి డీఎన్ఏ, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ వంటి సంస్థలతో పనిచేసింది. -
భారత్ X దక్షిణాఫ్రికా
భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త సీజన్ను సొంతగడ్డపై మొదలు పెట్టనుంది. దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా వన్డే సిరీస్కు హర్మన్ప్రీత్ సేన సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి వన్డే జరుగుతుంది. దీని తర్వాత సఫారీ టీమ్తోనే 3 టి20 మ్యాచ్ల సిరీస్ కూడా జరుగుతుంది. గత జనవరిలో ఆ్రస్టేలియా చేతిలో వన్డే, టి20 సిరీస్ కోల్పోయిన భారత మహిళలు... ఆ తర్వాత బంగ్లాదేశ్ను టి20ల్లో 5–0తో చిత్తుగా ఓడించారు. బ్యాటింగ్లో హర్మన్తో పాటు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానున్నారు. -
పది రూపాయలతో ప్రారంభం..
మనం ఒక్కరమే బాగుంటే సరిపోదు... మనతో ΄పాటు మన చుట్టూ ఉన్నవారూ బాగుండాలి అనే ఆలోచన ఇండోర్వాసి కుక్కు ద్వివేదినిది. ఆపదలో ఉన్నవారికి చిన్న సాయమైనా చేయాలి అనే ఆశయంతో బ్యాంకు ఉద్యోగం చేస్తూ, కుటుంబ నిర్వహణను చూస్తూనే పేదలకు కావల్సిన మందులను ఉచితంగా పంపిణీ చేయాలనుకుంది. అందుకోసం 400 మంది సహోద్యోగుల జీతంలో ఒక్కొక్కరి నుంచి పదేసి రూపాయలను సేకరించి, ఆ మొత్తంతో ఉచిత మందుల పంపిణీని మొదలుపెట్టింది. ΄పాతికేళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బ్యాంకు ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకొని గ్రామాలు తిరుగుతూ ఉచిత విద్య, వైద్యసేవలను అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ‘‘నా బాల్యం అందమైన జ్ఞాపకాలతో గడిచింది. మా నాన్న డాక్టర్. నలుగురికి సాయం చేసే స్వభావం కావడంతో ఆయన సాయం కోసం, వైద్యం కోసం ఇంటికి ఎప్పుడూ అనేకమంది వస్తూ ఉండేవారు. వారి కోసం అమ్మ ప్రతిరోజూ వంట చేసి ఉంచేది. అది చూస్తూ పెరగడం వల్ల కాబోలు చిన్నప్పటి నుంచి ఎవరైనా సాయం అడిగితే కాదనే గుణం నాకు లేదు. ఇలా ఉచితంగా చేసే సాయాలను సామాజిక సేవ అంటారని కూడా తెలియకుండానే పదిమందికీ చేతనైన సాయం చేసేదాన్ని. జీవించడానికి తక్కువ వస్తువులు చాలు డిగ్రీ పూర్తవుతూనే తొలి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఇతరులకు నా అంతట నేనే సాయం చేయగలిగే అవకాశం వచ్చిందని సంతోషించాను.పెళ్లయ్యాక నా భర్త మద్దతు లభించింది. నా భర్త కూడా బ్యాంకు ఉద్యోగి. ఇద్దరి సం΄ాదన ఉన్నా మా ఇంట్లో తక్కువ వస్తువుల వినియోగం ఉండేది. నిరాడంబరంగా జీవించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ఇంటి పరిసరాల్లోని అమ్మాయిల చదువుకు సాయం చేసేదాన్ని. పేదలకు అందని వైద్యం ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నా కూతురు తీవ్ర అనారోగ్యానికి గురైంది. నా కుమార్తెకు చికిత్స జరుగుతున్నప్పుడు వైద్యం ఎంత ఖరీదైనదో తెలుసుకున్నాను. అంతటి ఖర్చు మేం ఎలాగో భరించగలిగాం. కానీ, రెండు పూటలా తిండికే నోచుకోని వారి సంగతేంటి? వారికి చికిత్స అవసరమైతే ఏం చేస్తారు? ఈ విషయం పదే పదే ఆలోచించేదాన్ని. ఒంటరిగా చేయడంలో పెద్ద సాయాన్ని అందివ్వలేనని గ్రహించాను. దీంతో నా సహోద్యోగుల సాయం తీసుకోవాలనుకున్నాను. పది రూపాయలతో ప్రారంభం మా బ్యాంకు యూనియన్ లీడర్కు ఈ విషయాన్ని చెప్పిన. ‘మా అందరికీ మంచి జీతం ఉంది. పేద ప్రజల కోసం ఏదైనా సహాయం చేయాలి’ అని వివరించాను. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఆలోచన ఇది. ప్రతి ఉద్యోగీ, తన జీతం నుంచి పది రూ΄ాయలను ‘సేవ’ కోసం కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలా నెలకు నాలుగు వేల రూ΄ాయలు జమ అయ్యేవి. ΄పాతిక వేలు జమ కాగానే మా యూనియన్ లీడర్ ‘ఏం చేయాలో చెప్పమ’ని అడిగారు. హఠాత్పరిణామాలు బ్యాంకు నిధులే కాకుండా విరాళం పేరుతో సాయం చేయడానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. పదేళ్ల ΄ాటు ఈ విధమైన సేవాకార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నా భర్త హఠాత్తుగా చనిపోయాడు. దీంతో నేను చాలా రోజులు డిస్టర్బ్ అయ్యాను. ఆ రోజుల్లో మా సహోద్యోగులు కూడా మరింత సాయం అందించడానికి ముందుకు వచ్చారు. దీంతో రిలీఫ్ సొసైటీగా పేరు మార్చాం. ఎందుకంటే ఇందులో బయటి వ్యక్తులు చేరడం మొదలుపెట్టారు. రూ΄ాయ నుంచి లక్షల రూ΄ాయల విలువైన మందులు వస్తున్నాయి. పేదలకోసం ΄పాఠశాల జబ్బులు వచ్చి, చికిత్సలో ఉన్న రోగులకు మందులు ఇవ్వడం ద్వారా సాయం చేస్తున్నాం. కానీ, జబ్బులు రాకుండా అవగాహన కల్పించాలంటే చదువు ఉండాలనుకున్నాం. సరైన చదువు ఉంటే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోగలరు. ఈ ఆలోచనతో సైన్యంలో వైద్య సేవలు అందించే మా స్నేహితురాలు డాక్టర్ అనురాధతో కలిసి గిరిజన పిల్లలకు చదువులు చెప్పడం ప్రారంభించడం. ఇండోర్కు మూడు గంటల ప్రయాణం దూరంలో ఉన్న ఖర్గోన్లో సంస్థకు ధర్మకర్తగా ఉంటూ అనురాధతో ΄పాటు కలిసి కార్యక్రమాలు నిర్వహించేదాన్ని. అక్కడే 12 ఎకరాల్లో ΄పాఠశాల , హాస్టల్ కూడా నిర్మించాం. నా స్నేహితురాలి హఠాన్మరణంతో నేను బ్యాంకు ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకొని స్కూల్ బాధ్యతలు చూసుకోవడానికి వచ్చేశాను. మొదట ఎనిమిది, పది మంది పిల్లలతో పారంభించిన స్కూల్లో ఇప్పుడు 200 మంది పిల్లలు చదువుతున్నారు. వీరిలో 35 మంది వికలాంగులు. ఇప్పటికీ గ్రామంలో బాల్య వివాహాలు చేస్తుంటారు. దీంతో వారు చదువులు మానేసి వ్యవసాయం చేస్తుంటారు. పెద్దలకు అవగాహన కల్పించి, పిల్లలను స్కూల్కు తీసుకురావడం పెద్ద యుద్ధమే అవుతుంటుంది’ అంటూ తాము చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు ద్వివేదిని. -
సంకల్పమే సగం బలం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్’ (ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్ అందుకున్నారు. సాఫ్ట్స్కిల్స్లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్స్కిల్స్లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్ నుంచి ‘ఐ విల్’ కోర్సు చేశారు. ‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్ క్లాసిక్’లో పాల్గొని ‘మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ విజేతనయ్యాను’’ అన్నారామె. ఉన్నది ఒకటే ఆప్షన్! మిసెస్ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ సూపర్ క్లాసిక్ ఫైనల్స్ హైదరాబాద్లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్లైన్, ఆఫ్లైన్లో దాదాపు ఇరవై సెషన్స్ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది. మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్ ఒక్కటే. ప్లాన్ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్లో ప్రజెంటేషన్స్ చాలా థియరిటికల్గా ఇచ్చాను. ఫైనల్ రౌండ్లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్ అప్ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను. ఇవే విజేతను చేశాయి! మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని. అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను. మహిళలు సాధించలేనిది లేదు! చంద్రయాన్ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి. నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్ని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రోగ్రామ్ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ. ప్రతి రోజూ అమూల్యమే! సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను. – డాక్టర్ విజయ శారదారెడ్డి మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ఇది భారతీయ మహిళల గురించి...
ఒక రిపోర్టర్గా, నేను దశాబ్దాలుగా లెక్కలేనన్ని భయంకర ఘటనలను చూశాను. కానీ ఆ వీడియోలో ఉన్నది వేరే – ఇద్దరు మహిళల దుస్తుల్ని విప్పి, నగ్నంగా ఊరేగించారు. వారిలో ఒకరిని తర్వాత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. ఇది చూసిన ప్రతి భారతీయ మహిళ హృదయం బద్దలైపోయింది. ఈ భయంకరమైన కేసు గురించి తనకు (వీడియో బయటికి రాకముందు) తెలియదని మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అంటున్నారా? లేక తనకు తెలిసిందనీ, కానీ చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాననీ ఒప్పుకుంటున్నారా? ఎలాగైనా సరే, ఇది ఆయన అసమర్థతను లేదా నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుంది. బీరేన్ సింగ్ రాజీనామా చేయాలి లేదా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి! ‘‘ఆ వీడియోలో ఉన్న స్త్రీలకు జరిగింది అనుభవించడం కంటే నేను మరణాన్ని ఎంచు కుంటాను,’’ అని మణిపుర్ కుకీ సమాజానికి చెందిన హక్కుల కార్యకర్త గ్లాడీ హుంజన్ నాతో అన్నారు. కన్నీళ్లు ధారాపాతంగా కారు తున్నందున ఆమె పదాలను కూడా కూడగట్టుకోలేక పోయారు. నిరాశ, నిస్సహాయత, కోపం, వేదనతో ఆమె ఏడ్చినప్పుడు, నేను కూడా ఏడ్చాను. ఒక రిపోర్టర్గా, నేను దశాబ్దాలుగా లెక్కలేనన్ని భయంకర ఘటనలను చూశాను. కానీ ఆ వీడియోలో ఉన్నది వేరే – ఇద్దరు మహిళల దుస్తుల్ని విప్పి, నగ్నంగా ఊరేగించారు. ఒక మూక వాళ్లను తోసుకుంటూ, నెట్టుకుంటూ వచ్చింది. వారిలో ఒకరిని తర్వాత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. ఇది చూసిన ప్రతి భారతీయ మహిళ హృదయం బద్దలైపోయింది. గుమికూడినవాళ్లు చూస్తుండగానే మూక ద్వారా లైంగిక వేధింపు లకు గురైన 21 ఏళ్ల మహిళ గురించీ, ఆమెను రక్షించడానికి ప్రయత్నించినందుకు అక్కడికక్కడే మూక చంపేసిన ఆమె సోదరుడి గురించీ నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అతడి వయస్సు కేవలం 19 సంవ త్సరాలు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మందలింపులు రెండు నెల లుగా జడత్వంలో ఉండిపోయిన ఒక ముఖ్యమంత్రిని నిద్ర లేపాయి. అకస్మాత్తుగా, కొన్ని గంటల వ్యవధిలో, ప్రధాన నింది తుడిని అరెస్టు చేశారు. కాబట్టి, ఇన్ని రోజులు ఎన్. బీరేన్ సింగ్ ఈ ఘటనపై ఉద్దేశ పూర్వకంగా వేరే దృష్టితో చూస్తున్నారా లేక ఏం జరిగిందో ఆయనకు నిజంగానే తెలియదా? ఎలా భావించినా ఆయన (ఇప్పటికే తగ్గి పోయిన) విశ్వసనీయత గురించి సానుకూల మాట రాదు. నన్ను వివరించనివ్వండి ఈ సామూహిక అత్యాచారం, హత్యా ఘటన మే 4న జరిగినట్లు మనకు తెలుసు. జీరో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ (జీరో–ఎఫ్ఐఆర్)గా పిలిచే మొదటి పోలీసు ఫిర్యాదును మే 18న దాఖలు చేశారు. 2012లో జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత, జస్టిస్ జేఎస్ వర్మ ప్యానెల్ ప్రవేశపెట్టిన విధానం ఇది. లైంగిక వేధింపుల బాధితురాలు భారత దేశంలో ఎక్కడైనా, అధికార పరిధితో సంబంధం లేకుండా పోలీసు కేసును దాఖలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ను సంబంధిత పోలీస్ స్టేషన్కు పంపుతారు. ఈ కేసులో జూన్ 21న సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఎఫ్ఐఆర్ను పంపారు. 60 రోజులకు పైగా, అత్యాచారం–హత్య ఘటనపై ఎఫ్ఐఆర్ను ఎవరూ పట్టించుకోలేదు. ఈ వీడియో బయటపడి, దేశం మొత్తాన్ని ఆగ్రహానికి గురి చేసి ఉండకపోతే, రేపిస్టులు, హంతకులు ఇంకా బయటే ఉండేవారు. కాబట్టి, లైంగిక వేధింపులకు సంబంధించిన ఈ భయంకరమైన కేసు గురించి తనకు తెలియదని సింగ్ అంగీకరి స్తున్నారా? లేక తనకు తెలిసిందనీ, కానీ చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాననీ ఒప్పుకుంటున్నారా? ఎలాగైనా సరే, ఇది ఆయన అసమర్థతను లేదా నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుంది. బీరేన్ సింగ్ రాజీనామా చేయాలి లేదా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ ఒక్క అతి భయానక సంఘటన వల్ల మాత్రమే కాదు, గత రెండు నెలలుగా ఆయన దారుణ వైఫల్యాల కారణంగా ఆయన్ని తొలగించాలి. ఇంకా జాతీయ పతాక శీర్షికలకు ఎక్కని ఇతర అత్యాచారాలు, హత్యా ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అవును, వాస్తవానికి, జాతి విభజనకు సంబంధించి రెండు వైపులా బాధితులు, నేరస్థులు ఉన్నారు. నిజమేమిటంటే, బీరేన్ సింగ్ ఆఖరికి తన సొంత శాసన సభ్యులను కూడా రక్షించడంలో విఫలమయ్యారు. ఉదాహరణకు వుంగ్జగిన్ వాల్తే గురించి ఆలోచించండి. ఆయన సింగ్ సహచరుడు, భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు, ముఖ్యమంత్రి సలహాదారు. ఆయనపై దాడి జరిగింది. ఆయన మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఢిల్లీలోని ఆసుపత్రి బెడ్లో కట్లతో పడి ఉన్నారు. తమ కుటుంబం ఎప్పటికీ మణిçపుర్కు తిరిగి వెళ్లదని ఆయన భార్య అన్నారు. నిజమేమిటంటే, స్థానిక పరిపాలనలోని అన్ని విభాగాలు జాతుల పరంగా చీలిపోయినప్పటికీ, ఇప్పటికీ విశ్వసనీయతను కలిగి ఉన్న ఏకైక వ్యవస్థ సైన్యం మాత్రమే. మైతేయిలు, కుకీల మధ్య బఫర్ జోన్లను ఏర్పాటు చేస్తున్నది సైన్యమే; ఇరువైపులా కమ్యూనిటీ నాయకులతో చర్చలను ప్రారంభించిందీ సైన్యమే. పైగా ఇటీవలి ఒక వీడియోలో చెప్పినట్లుగా, ‘మానవీయంగా ఉండటం బలహీనతకు సంకేతం కాదు’ అని సైన్యం భారతీయులకు గుర్తు చేస్తోంది. ఇంకా గుర్తుంచుకోండి, మణిపుర్లోని అనేక ప్రాంతాలలో సైన్యం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి చెందిన చట్టపరమైన రక్షణ లేకుండా పనిచేస్తోంది. ఆ వీడియో కీలకమైన సాక్ష్యాలను అందించిందనీ, వ్యక్తులను గుర్తించడంలో పోలీసులకు సహాయపడిందనీ బీరేన్ సింగ్ పేర్కొ న్నారు. అలా అయినప్పుడు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ లోని కొందరు అధికారులు మణిపుర్పై నివేదికలను, ప్రదర్శనలను (వీటిలో నావి కూడా ఉన్నాయి) ఆపమని కోరడం విడ్డూరం కాదా? ఆ మహిళలను గుర్తించేలా ఉన్నవీ, లేదా దాడికి సంబంధించిన క్రూర త్వాన్ని తెలిపేవీ చూపడానికి ఏ మీడియా హౌస్ను కూడా అనుమతించకూడదు. అలాంటి వీడియోలను బ్లాక్ చేయాలి. అయితే, నిర్దిష్టమైన సంపాదకీయ రక్షణతో ఆ వీడియోను ప్రస్తావిస్తున్నప్పుడు కూడా దాని చుట్టూ ఉన్న మీడియా కవరేజీని తొలగించడం అంటే, మణిపుర్ భయానక స్థితిని వివరంగా చెప్పడాన్ని తీవ్రంగా అడ్డుకోవడమే అవుతుంది. ‘‘ఇది కుకీలు లేదా మెయితీల గురించి కాదు... ఇది భారతీయ మహిళల గురించి. మొత్తం భారతీయ మహిళల గురించి’’ అని గ్లాడీ హుంజన్ చిన్నపిల్లలా ఏడుస్తూ నాతో చెప్పారు. ఈ వీడియో చూసి భారతీయ మహిళలమైన మనం వణికిపోయిన సమయంలోనే,లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ పార్లమెంటేరియన్ కు ఢిల్లీ పోలీసుల నుంచి అనూహ్యంగా బెయిల్ వచ్చింది. పైగా అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు పెరోల్ వచ్చింది. మణిపుర్ గురించి, ఆ వైరల్ వీడియో గురించి మనందరం పట్టించుకోవాలి. మణిపుర్ ప్రజలలో విశ్వాసాన్ని పునరుద్ధరించ డానికి రాష్ట్ర పతి పాలన విధించడమే ప్రారంభ చర్య అవుతుంది. బర్ఖా దత్ వ్యాసకర్త ప్రముఖ పాత్రికేయురాలు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన.. తెలంగాణ అమ్మాయికి ఛాన్స్
దక్షిణాఫ్రికా వేదికగా జరగున్న తొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు భారత సీనియర్ జట్టు విధ్వంసకర ఓపెనర్ షఫాలీ వర్మ నాయకత్వం వహించనుంది. కాగా షఫాలీ వర్మ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటకీ.. ఇంకా 19 ఏళ్లు పూర్తి కాకపోవడంతో అండర్-19 జట్టుకు ఎంపికైంది. అదే విధంగా భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా ఈ జట్టులో భాగమైంది. ఇక షాఫాలీ డిప్యూటీగా శ్వేతా షెరావత్ వ్యవహరించనుంది. శ్వేతా షెరావత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. ఇటీవల ముగిసిన అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో అత్యధిక పరుగుల సాధించిన బ్యాటర్గా షెరావత్ నిలిచింది. అదే విధంగా ప్రపంచకప్ జట్టులో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కింది. ఇక ఈ మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. అండర్-19 ప్రపంచకప్కు భారత జట్టు: షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీప్), జి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లీ గాలా, హృషితా బసు, సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్షవి చోప్రా, టిటాస్ సాధు , ఫలక్ నాజ్, షబ్నమ్ చదవండి: IND vs BAN: షకీబ్ బౌలింగ్ గురించి చిన్న పిల్లలకు తెలుసు! భారత బ్యాటర్లకు మాత్రం.. -
ఆర్ధిక అవసరాలు,ఇతరులపై ఆధారపడుతున్న భారతీయ మహిళలు
ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి... అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి ఇలాంటివి మాటల్ని తరచూ వింటుండేవాళ్లం. కానీ ఇప్పుడు..ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు.. వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పటికీ ఆర్ధిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడిపోతున్నట్లు ఓ అధ్యయనం తెలిపింది. మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్నీ రంగాలకు చెందిన సంస్థల్ని ముందుండి నడిపిస్తున్నారు. అటువంటి వారే ఆర్ధిక నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త వెనకబడిపోతున్నారు. ఇటీవల టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎమాంగ్ విమెన్ పేరుతో దేశవ్యాప్తంగా 18 నగరాల్లో 22 నుంచి 55 ఏళ్ల వయసున్న 1000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించింది. అధ్యయనంలో భారతీయ మహిళల్లో అత్యధిక శాతం మంది ఇప్పటికీ భర్తలపై ఆధారపడుతున్నట్టు పేర్కొంది. అయితే, తమకు అవకాశం వస్తే నిర్ణయాలు తీసుకుంటామని 44 శాతం మంది తమ అధ్యయనంలో చెప్పినట్టు హైలెట్ చేసింది. -
డిస్కస్ త్రోయర్ కమల్ప్రీత్పై మూడేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: భారత మహిళా డిస్కస్ త్రోయర్ కమల్ప్రీత్ కౌర్పై ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) మూడేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో ఇదివరకే తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా డబ్ల్యూఏకి చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) తుది విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. ఆమెకు నాలుగేళ్ల నిషేధం విధించాల్సి ఉండగా, నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో ఏడాది మినహాయించారు. మార్చిలో ఏఐయూ కమల్ప్రీత్ రక్తమూత్ర నమూనాలు సేకరించి పరీక్షించగా ‘పాజిటివ్’ అని తేలడంతో అదే నెల 29న సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆమె భారత ప్రభుత్వ పురస్కారాలు, ప్రోత్సాహకాలకు దూరం కానుంది. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. -
కళ: అమెరికాలో పుష్పవిలాసం
కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... మాన్హాటన్ (యూఎస్) 86 స్ట్రీట్లోని బస్షెల్టర్లో కనిపించిన ఒక చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ కళాప్రేమికులు, ఆధునిక కళాప్రేమికులు... ఇద్దరూ ఇష్టపడే చిత్రం అది. ‘జాయ్ ఆఫ్ లివింగ్’ అనే ఆ చిత్రాన్ని గీసింది మన ఇండియన్ ఆర్టిస్ట్ పుష్పకుమారి. గత రెండు సంవత్సరాల కరోనా కల్లోల చీకటిని వస్తువుగా తీసుకొని, ఆశావాద దృక్పథాన్ని ప్రతిఫలించేలా గీసిన చిత్రం అది. అమెరికాకు చెందిన ‘పబ్లిక్ ఆర్ట్ ఫండ్’ అనే నాన్–ప్రాఫిట్ ఆర్గనైజేషన్ న్యూయార్క్, బోస్టన్, షికాగోలలో పుష్పకుమారి చిత్రప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ చిత్రాలను సాధారణ కళాప్రేమికుల నుంచి చేయి తిరిగిన చిత్రకారుల వరకు ప్రశంసిస్తున్నారు. పేరులోనే ‘కళ’ ధ్వనించే మధుబని (బిహార్) జిల్లాలోని రంతి అనే గ్రామంలో పుట్టింది పుష్ప కుమారి. రంతి అనేది ఊరు అనడం కంటే ‘ఊరంత బడి’ అనడం సమంజసం. ఎటు చూసినా ఆబాలగోపాలం చేతిలో మధుబని మధుర కళావిన్యాసాలే! పుష్ప అమ్మమ్మ మహాసుందరిదేవి మధుబని ఆర్ట్ను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లిన తొలితరం కళాకారుల్లో ఒకరు. అమ్మమ్మ ఒడిలో ఆర్ట్పాఠాలు నేర్చుకుంది పుష్ప. పదమూడేళ్ల వయసులోనే కుంచె పట్టిన పుష్ప కాలంతో పాటు తన కళను మెరుగు పరుచుకుంటూ వస్తోంది. మొదట్లో అందరూ గీసినట్లే తాను గీసేది. తరువాత కాలంలో మాత్రం తనదైన ప్రత్యేకత గురించి ఆలోచించింది. ‘సింబాలిజం’ను సంప్రదాయ కళలోకి తీసుకురావడం ఒకింత కష్టమైన పని. అయితే ఆ కష్టం పుష్ప చిత్రాలలో కనిపించదు. దీనికి కారణం సింబాలిజంను సృజనాత్మకంగా మధుబనిలోకి తీసుకురావడమే. అమ్మమ్మ కుంచె నుంచి అందమైన చిత్రాలను నేర్చుకోవడమే కాదు, ఆమె నోటి నుంచి పురాణాలు, జానపద కథలు ఎన్నో విన్నది పుష్ప. అవేమీ వృథా పోలేదు. తన కళకు ఇంధనంగా పనికి వచ్చాయి. పుష్ప కళాప్రపంచంలో కేవలం కళ మాత్రమే కనిపించదు. సమాజం కూడా కనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే సంప్రదాయ కళ అనే పునాది మీద తనదైన దృశ్యభాషను సృష్టించుకుంది పుష్ప. సామాజిక,రాజకీయ సమస్యలు, జెండర్ సమస్యలు, పర్యావరణ సంబంధిత అంశాలను కేంద్రంగా చేసుకొని చిత్రాలు గీస్తుంది పుష్ప. నాగరికత అనే పేరుతో భూమాతను ఎంత హింస పెడుతున్నామో ‘ఎర్త్–2’ చిత్రంలో కనిపిస్తుంది. ఇటీవల కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని గీసిన చిత్రాలకు మంచి స్పందన లభించింది. ‘నేను గీసే ప్రతి చిత్రానికి తనదైన భావవ్యక్తీకరణ ఉండేలా చూసుకుంటాను’ అంటుంది పుష్ప. బోల్డ్ స్ట్రైకింగ్ ఫిగర్స్ గీయడంలో దిట్ట అనిపించుకున్న పుష్ప చిత్రాలలో రంగుల ఆర్భాటం కనిపించదు. సాదాసీదా ఇంక్బాటిల్నే ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. ‘చిత్రాలు మౌనంగా కనిపిస్తాయి. కాని ఆ మౌనంతోనే అవి మనతో మాట్లాడేలా చేయడం ఆర్టిస్ట్ విశిష్ఠత’ అని చెబుతారు విశ్లేషకులు. పుష్పకుమారి గీసిన చిత్రాలను చూస్తే... అవి మౌనంగా మాట్లాడే చిత్రాలు అనే విషయం కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది. -
ఫస్ట్ టైమ్ పర్వతాలు పరవశించి... ఆశీర్వదించాయి!
‘మనుషులు పర్వతాలతో కలిసి కరచాలనం చేసినప్పుడు గొప్ప అద్భుతాలు సంభవిస్తాయి’ అలాంటి అద్భుతాలను అయిదుసార్లు చవిచూసి మాటలకు అందని మహా అనుభూతిని సొంతం చేసుకుంది ప్రియాంక మోహితే. తాజాగా ప్రపంచంలోనే మూడో ఎల్తైన శిఖరం కాంచన్జంగా(8,586 మీటర్లు)ను అధిరోహించి జేజేలు అందుకుంటోంది మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే. ఈ విజయం ద్వారా ప్రపంచంలోని ఎనిమిదివేల మీటర్లకు పైగా ఎత్తు ఉన్న అయిదు పర్వతశిఖరాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. చిన్నప్పటి నుంచి పర్వతారోహణ గురించిన విషయాలు తెలుసుకోవడం, పర్వతారోహకులతో మాట్లాడడం అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను ప్రపంచం మెచ్చిన పర్వతారోహకురాలిగా మలిచింది. టీనేజ్లో తొలిసారిగా ఉత్తరాఖండ్లోని బందర్పంచ్ పర్వతశ్రేణిని అధిరోహించింది ప్రియాంక. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2013లో మౌంట్ ఎవరెస్ట్(8,849 మీ), 2016లో మౌంట్ మకలు(8,485 మీ), మౌంట్ కిలిమంజారో(5,895 మీ), 2018లో మౌంట్ లోట్సే (8,516 మీ), గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ (8,091 మీ) పర్వతాలను అధిరోహించింది. గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ అధిరోహించడానికి బయలుదేరేముందు కోవిడ్ భయాలు సద్దుమణగలేదు. రకరకాల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకతప్పలేదు. కొత్త విజయాన్ని నా ఖాతాలో వేసుకోబోతున్నాను...అంటూ ఒక వైపు అంతులేని ఆత్మవిశ్వాసం, మరోవైపు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి విన్న భయంగొలిపే విషయాలు తన మనసులో కాసేపు సుడులు తిరిగాయి. అయితే చివరికి మాత్రం ప్రతికూల ఆలోచనలపై ఆత్మవిశ్వాసమే అద్భుత విజయాన్ని సాధించింది. స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి క్రాస్ ఫిట్ వరకు ప్రత్యేక దృష్టి పెట్టింది. సాహసయాత్రకు బయలుదేరేముందు– ‘ప్రతి విజయం తరువాత సోషల్ మీడియాలో నా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతున్నారు. ఈసారి కూడా అలాగే జరగాలని ఆశిస్తున్నాను’ అని ఇన్స్టాగ్రామ్లో రాసింది ప్రియాంక. మౌంట్ అన్నపూర్ణను విజయవంతంగా అధిరోహించిన తరువాత సోషల్మీడియాలో ఆమె ఫాలోవర్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. నాట్యం చేసిన పాదాలు పర్వతాలను ముద్డాడాయి (ప్రియాంకకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది)...అని కవిత్వం చెప్పినవారు కొందరైతే– ‘మీ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచిందో మాటల్లో చెప్పలేను’ అన్నవారు కొందరు. ప్రతి విజయ యాత్రకు ముందు– ‘నా కల నెరవేర్చుకోవడానికి బయలుదేరుతున్నాను’ అని పోస్ట్ పెడుతుంది ప్రియాంక. ఆ వాక్యానికి ఎన్నెన్ని ఆశీర్వాద బలాలు తోడవుతాయోగానీ ఆమె అద్భుత విజయాలను సాధిస్తుంటుంది. ముంబై యూనివర్శిటీలో బయోటెక్నాలజీలో పీజీ చేసిన ప్రియాంకకు పర్వతారోహణ అంటే టీనేజ్లో ఎంత ఉత్సాహంగా ఉండేదో, ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహమే 30 సంవత్సరాల ప్రియాంక బలం, మహా బలం! -
రాణిగారి ఆస్థానం.. స్కాట్లాండ్ ఎంపీగా తొలి భారత మహిళ
ఇటీవలే మే 6 న స్కాట్లాండ్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. బ్రిటన్లో భాగమైన స్వతంత్ర దేశం స్కాట్లాండ్. ప్రధాని ఉంటారు. పైన క్వీన్ ఎలిజబెత్ ఉంటారు. దేశంలో మూడు పార్టీలు ఉన్నాయి. స్కాటిష్ నేషనల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. మొన్నటి ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆ పార్టీ లీడర్ నికోలా స్టర్జన్. ఆమే ఇప్పుడు ప్రధాని. అయితే ఆమె గురించి కాదు మన స్టోరీ. ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీ నుంచి పామ్ గోసల్ (49) అనే అభ్యర్థి విజయం సాధించారు. రాణిగారి ఆస్థానంలో చోటు సంపాదించారు. గోసల్ భారత సంతతి మహిళ. అంతేకాదు, స్కాట్లాండ్ పార్లమెంటులోకి అడుగుపెట్టిన తొలి భారతీయురాలు! పామ్ గోసల్ ఈ నెల 13న స్కాట్లాండ్ పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1998లో ఆ దేశంలో వచ్చిన కొత్త చట్టంతో 1999 నుంచి ఐదేళ్లకోసారి పార్లమెంటు ఎన్నికలు జరగడం మొదలయ్యాక ఒక భారత సంతతి మహిళ స్కాట్లాండ్ ఎంపీ కావడం ఇదే ప్రథమం. మొన్న జరిగినవి ఆరో పార్లమెంటు ఎన్నికలు. వెస్ట్ స్కాట్లాండ్ నుంచి పామ్ గోసల్ గెలుపొందారు. ఆ ముందు నుంచే ఆమె స్కాట్లాండ్ ‘కన్జర్వేటివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్’ (సి.డబ్లు్య.ఓ) కు డిప్యూటీ చైర్మన్గా కూడా ఉన్నారు. సి.డబ్లు్య.ఓ. అన్నది నూట రెండేళ్లుగా ఉన్న సంస్థ. ఇంగ్లండ్, వేల్స్, నార్త్ ఐర్లాండ్లలోని కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మహిళలంతా ఇందులో సభ్యులుగా ఉంటారు. స్కాట్లాండ్ కన్జర్వేటివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్.. సి.డబ్లు్య.ఓ.కు అనుబంధంగా ఉంటుంది. అంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో గోసల్ సభ్యురాలు అవడంతో.. పార్లమెంటు సభ్యురాలిగా ఆమె విజయానికి సహజంగానే ప్రాధాన్యం లభించింది. ఇక భారత సంతతి మహిళగా ఆమె విజయం మన దేశానికి కూడా గర్వకారణమే. స్కాట్లాండ్ పార్లమెంటు భవనం ముందు పామ్ గోసల్ పామ్ గోసల్ పూర్వికులది పంజాబ్లోని భటిండా. సిక్కుల కుటుంబం. స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్ నగరంలో ఆమె జన్మించారు. డిగ్రీ చదివారు. కన్జూమర్ ‘లా’ లో ఎంబీఏ చేశారు. ప్రస్తుతం పిహెచ్.డి చేస్తున్నారు. స్లాట్లాండ్ కన్జర్వేటివ్ పార్టీలో ఉన్న భారతీయ సభ్యులతో ఆమెకు చక్కటి సంబంధాలు ఉన్నాయి. స్కాట్లాండ్లోని కన్జర్వేటివ్ పార్టీకి, బ్రిటన్ సంతతి భారతీయులకు మధ్య ఆమె ఒక వారధి అయ్యారు. వాళ్లంతా ఎంపీగా ఆమె అభ్యర్థిత్వానికి మద్దతిచ్చి, ఆమె విజయానికి సహకరించారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందువరకు కూడా గోసల్ తన కుటుంబ వ్యాపారం లో తల్లిదండ్రులకు సహాయంగా ఉన్నారు. ‘‘భారతీయ నేపథ్యంతో స్కాట్లాండ్ తొలి పార్లమెంటు మహిళా సభ్యురాలిగా ఎన్నికవడం నాకు లభించిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. వెస్ట్ స్కాట్లాండ్ ప్రజలతో కలిసి పని చేసేందుకు త్వరపడుతున్నాను’’ అని గోసల్ ట్వీట్ చేశారు. ఆమె తన ప్రమాణ స్వీకారాన్ని ఇంగ్లిష్లోను, పంజాబీలోనూ చేశారు. ప్రమాణ స్వీకారం పార్లమెంటు సంప్రదాయం ప్రకారం క్వీన్ ఎలిజబెత్ పేరిట మొదలై, భారతీయ సంస్కృతి ని ప్రతిబింబించేలా సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథంలోని పంక్తులతో పూర్తయింది. -
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీ: భారత మహిళల బృందం ఔట్!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు అర్హత ఈవెంట్ అయిన ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నమెంట్ నుంచి భారత మహిళల 4x400 మీటర్ల బృందం వైదొలిగింది. పోలాండ్లో మే 1, 2 తేదీల్లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో రాణించిన రిలే జట్లకు టోక్యో ఒలింపిక్స్కు, వచ్చే ఏడాది జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించే అవకాశముంది. ‘వరల్డ్ రిలే టోర్నీకి సిద్ధమవుతున్న భారత మహిళల 4x400 రిలే బృందానికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి. ఈ నెలారంభంలో పూవమ్మ, సుభా, కిరణ్, అం జలి దేవి, రేవతి, విస్మయ, జిస్నా మాథ్యూలను రిలే జట్టులో ఎంపిక చేశాం. ఈ బృందం లోని నలుగురిలో ముగ్గురు అన్ఫిట్గా ఉన్నా రు. సబ్స్టిట్యూట్ కూడా లేకపోవడంతో భారత బృందం వైదొలగాలని నిర్ణయించుకుంది’ అని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వివరించింది. అయితే పురుషుల 4x400 మీటర్ల రిలే, మహిళల 4x400 మీటర్ల రిలే రేసుల్లో భారత్ బరిలోకి దిగుతుందని ఏఎఫ్ఐ తెలిపింది. జూన్లో క్వాలి ఫయింగ్ గడువు ముగిశాక టాప్–16లో ఉన్న రిలే జట్లు ఒలింపిక్స్ బెర్త్లు దక్కించుకుంటాయి. -
వర్క్ ఫ్రం హోమే బెటర్!
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటి నుంచే కార్యాలయ పని చక్కపెట్టేస్తాం అంటున్నారు భారతీయ మహిళలు. ఐటీ రంగానికి చెందిన మహిళల్లో 38 శాతం మంది ఇంటినుంచి పని చేయడానికే ఆసక్తి చూపుతున్నారని ఓ సర్వేలో తేలింది. గత ఏడాది నవంబర్– డిసెంబర్ కాలంలో సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, ఐటీ సంస్థల్లో పనిచేసే పురుషులు, మహిళల అభిప్రాయాలు సేకరించి సర్వే చేసింది. ఆఫీస్ కంటే ఇంటి నుంచి పనిచేయడం వల్లే ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఉన్నట్లు భావిస్తామని 36 శాతం మహిళలు తెలిపారు. ఇంటి నుంచి పని చేయడం వల్ల రోజువారీ ఇంటి పని విషయాలు వారు పేర్కొన్నారు. ఆఫీస్ పనిచేస్తూనే ఇంటి పనీ పూర్తి చేసుకుంటు న్నామని 33 శాతం పురుషులు, 54 శాతం మహిళలు తెలిపారు. 40 శాతం మంది పురుషులతో పోలిస్తే 54 శాతం మంది మహిళలకు పిల్లలకు చదువు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కుటుంబాన్ని చూసుకోవాల్సి రావడంతో మహిళలు పని వేళలు మార్చుకుంటున్నారు. కరోనా ప్రభావంతో వృత్తిజీవితంలో పురోగతి తగ్గిందని 76 శాతం భారతీయ మహిళలు భావిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో 19 దేశాలకు చెందిన 13 వేల మంది పాల్గొనగా 500 మంది భారతీయులు ఉన్నారు. చదవండి: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త ప్రపంచ విలువైన కంపెనీల్లో టీసీఎస్ -
‘భారతీయ మహిళలు అందవిహీనులు’
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వైట్హౌస్ నుంచి పలు వివాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వెలువడిన కొన్ని ఆడియో క్లిప్స్ దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఈ టేప్స్ వివరిస్తున్నాయి. ‘భారతీయ మహిళలు.. ప్రపంచంలోనే అత్యంత అందవిహీనులు.. సెక్స్లెస్, ఆకర్షణ లేనివారు, ఎలా పునరుత్పత్తి చేస్తారో తెలియదు’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిక్సన్. ఈ విషయాన్ని తాజాగా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గ్యారీ జె. బాస్ ది న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఓపీనియన్ పోల్లో వెల్లడించారు. అమెరికాకు 37వ అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ 1969 నుంచి 1974 వరకు పనిచేశారు. ఇక ఆయనకు సంబంధించిన ఈ టేప్స్ను రిచర్డ్ నిక్సన్ లైబ్రరీ అండ్ మ్యూజియం విడుదల చేసింది. (చదవండి: ట్రంప్ను పొగడుదామని తప్పులో కాలేసింది) భారతీయుల పట్ల నిక్సన్లో ఉన్న వ్యతిరేకతకు ఆ సమయంలో జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ వీరాభిమాని అని బాస్ తెలిపారు. అంతేకాక హెన్రీ 1970 ల ప్రారంభంలో భారత్ పట్ల అమెరికా విధానాన్ని కూడా నిర్ణయించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. జూన్ 17, 1971 న సాయంత్రం 5:15-6:10 గంటల మధ్య జరిగిన సమావేశంలో భాగంగా నిక్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని ఓవల్ ఆఫీస్ టేపింగ్ సిస్టమ్ రికార్డ్ చేసింది. ఈ టేప్స్ను బాస్ తన పుస్తకం ‘ది బ్లడ్ టెలిగ్రామ్’లో ప్రస్తావించారు. నిక్సన్ భారతీయ మహిళలను నల్లజాతి మహిళలతో పోల్చారు. ‘నా ఉద్దేశ్యం ఏమిటంటే, బ్లాక్ ఆఫ్రికన్లలో కొద్దిగా ఆకర్షణ ఉంటుంది. కానీ భారతీయ మహిళలు చూడటానికి అందవిహీనులుగా ఉంటారు’ అని నిక్సన్ పేర్కొన్నారు. అంతేకాకుండా నిక్సన్ నవంబర్ 4, 1971న అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీతో మాట్లాడుతున్నప్పుడు ‘నాకైతే వారు అసలు నచ్చరు. మిగిలిన వ్యక్తులకు వారు ఎలా నచ్చుతున్నారో తెలియట్లేదు’ అని చెప్పినట్లు విన్నానని బాస్ స్పష్టం చేశారు.(చదవండి: వైట్హౌస్ ఒరలో ఇమడరనీ!) అంతేకాక ఈ టేపులు అంతర్జాతీయ సంఘటనలు, నటుల పట్ల నిక్సన్ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తిగత జాత్యహంకారం, భారతీయుల పట్ల అతని వ్యతిరేకతను ఈ టేపులు వెల్లడిస్తున్నాయి. తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాల విషయలో కూడా నిక్సన్ సానుకూల వైఖరిని కలిగి ఉండటమే కాక భారత్ పట్ల ఎంతటి శత్రుత్వం కలిగి ఉన్నారో కూడా ఈ టేపులు స్పష్టం చేస్తున్నాయి. -
ఈ భారత మహిళల గురించి మీకు తెలుసా?
శాస్త్ర సాంకేతిక రంగాలే ప్రపంచ పురోగతికి ఆధారాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి మాత్రం జనాభా నిష్పత్తికి తగినంతగా ఉండటం లేదు. నవ సహస్రాబ్దిలో శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం కొంత పుంజుకున్నా, ఇదివరకటి శతాబ్దాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. మన దేశంలోనైతే మహిళా శాస్త్రవేత్తల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉండేది. మహిళలు చదువుకోవడమే అరుదైన ఆ కాలంలో సైతం కొందరు మహిళలు పరిస్థితులకు ఎదురీది మరీ శాస్త్రవేత్తలుగా తమ సత్తా చాటుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో వారు మైలురాళ్లలా నిలిచిపోయే విజయాలను సాధించారు. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన దేశానికి చెందిన కొందరు తొలితరం మహిళా శాస్త్రవేత్తల గురించి... ఈ ఏడాది థీమ్ విమెన్ ఇన్ సైన్స్ వైద్యంలో పట్టా సాధించిన తొలి భారతీయురాలు ఆనందీబాయి జోషి మన దేశంలో పాశ్చాత్య విద్య ప్రాచుర్యంలోకి వస్తున్న తొలి రోజుల్లోనే వైద్యశాస్త్రంలో పట్టా సాధించిన తొలి మహిళ ఆనందీబాయి జోషి. అప్పటి బాంబే ప్రెసిడెన్సీలోని (ఇప్పటి మహారాష్ట్ర) కల్యాణ్ పట్టణంలో 1865 మార్చి 31న బతికి చెడిన భూస్వాముల కుటుంబంలో జన్మించారామె. ఆనాటి పద్ధతుల ప్రకారం ఆమెకు తొమ్మిదేళ్ల వయసులోనే తపాలా గుమస్తాగా పనిచేసే గోపాలరావు జోషితో పెళ్లి జరిగింది. గోపాలరావు జోషి మొదటి భార్య అప్పటికే మరణించింది. ఇద్దరికీ వయసులో ఇరవయ్యేళ్లకు పైనే తేడా. గోపాలరావు జోషి కొంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి కావడంతో భార్యకు చదువు చెప్పించారు. గోపాలరావు జోషికి కలకత్తా బదిలీ కావడంతో కుటుంబం అక్కడకు చేరుకుంది. పద్నాలుగేళ్ల వయసులో ఆనందీబాయి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. తగిన వైద్యం అందనందున ఆ బిడ్డ పట్టుమని పదిరోజుల్లోనే కన్నుమూయడం ఆనందీబాయిని తీవ్రంగా కలచివేసింది. మహిళలకు ఇలాంటి దుస్థితి నుంచి తప్పించడానికి తానే స్వయంగా వైద్యశాస్త్రం అభ్యసించాలని నిశ్చయించుకుంది. ఆ కృతనిశ్చయమే ఆమెను వైద్యశాస్త్రంలో పట్టభద్రురాలైన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిపింది. ఆనందీబాయి నిశ్చయానికి భర్త ప్రోత్సాహం తోడైంది. తన భార్య వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటోందని, అందుకు తగిన సహాయం చేయమని కోరుతూ ప్రముఖ అమెరికన్ మిషనరీ రాయల్ వైల్డర్కు గోపాలరావు జోషి లేఖ రాశారు. వైల్డర్ ఆ లేఖను తాను నడిపే ‘ప్రిన్స్టన్స్ మిషనరీ రివ్యూ’ పత్రికలో ప్రచురించారు. దానిని చూసిన థియోడిషియా కార్పెంటర్ అనే సంపన్నురాలు ఆనందీబాయికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చింది. కలకత్తాలో ఉంటున్న ఆనందీబాయికి నేరుగా లేఖ రాసింది. అప్పటికి ఆనందీబాయి అనారోగ్యంతో బాధపడుతుండేది. థియోడిషియా ఆమెకు అమెరికా నుంచి మందులు కూడా పంపేది. ఈలోగా గోపాలరావుకు బెంగాల్లోని సీరమ్పూర్ బదిలీ అయింది. పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజీకి దరఖాస్తు చేసుకోమని థియోడిషియా సూచించడంతో ఆనందీబాయి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఒక సందర్భంలో ఆనందీబాయి సీరమ్పూర్ కాలేజీలో ప్రసంగం చేసింది. అమెరికాలో వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటున్నానంటూ ఆమె చేసిన ప్రసంగానికి విపరీతమైన ప్రచారం వచ్చింది. ఆమె చదువు కోసం సంపన్నుల నుంచి విరాళాలు వచ్చాయి. పెన్సిల్వేనియా లోని విమెన్స్ మెడికల్ కాలేజీలో సీటు కూడా వచ్చింది. కలకత్తా నుంచి ఆనందీబాయి ఓడలో ప్రయాణించి అమెరికా చేరుకుంది. పెన్సిల్వేనియా విమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి 1886లో విజయవంతంగా ఎండీ పూర్తి చేసింది. అకుంఠిత దీక్షలో చదువులో మునిగి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఆనందీబాయికి క్షయ సోకింది. పట్టాపుచ్చుకుని ఏడాదైనా గడవక ముందే 1886 ఫిబ్రవరి 26న కన్నుమూసింది. అమెరికా నుంచి వృక్షశాస్త్రంలో పీహెచ్డీ పొందిన తొలి మహిళ జానకి అమ్మాళ్ వృక్షశాస్త్రంలో చిరస్మరణీయమైన పరిశోధనలు సాగించిన జానకి అమ్మాళ్ 1897 నవంబరు 4న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలిచెర్రిలో జన్మించారు. ఆమె తండ్రి దివాన్ బహదూర్ ఇ.కె.కృష్ణన్ సబ్జడ్జిగా పనిచేసేవారు. తండ్రి ప్రోత్సాహంతో ఆమె ఉన్నత చదువులను కొనసాగించగలిగారు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1924లో బోటనీలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం మిషిగాన్ వెళ్లారు. అక్కడ బార్బర్ స్కాలర్షిప్ పొంది 1926లో బోటనీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి, మద్రాసులోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకురాలిగా పనిచేసి, పరిశోధనల కోసం మళ్లీ మిషిగాన్ చేరుకున్నారు. మిషిగాన్ వర్సిటీ నుంచి 1931లో పీహెచ్డీ పొందారు. అమెరికాలోనే వృక్షశాస్త్రంలో పీహెచ్డీ సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. చెరకు, వంకాయలు వంటి పంటల కణనిర్మాణంపై ఆమె చేసిన పరిశోధనలకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. తోటల్లో పెంచుకునే మొక్కలు, వర్షారణ్య వృక్షాలపై ఆమె విస్తృతంగా పరిశోధనలు సాగించి, అంతర్జాతీయంగా మన్ననలు పొందారు. మిషిగాన్ వర్సిటీ ఆమెకు 1956లో ఎల్ఎల్డీ గౌరవ పట్టాను ఇచ్చింది. భారత ప్రభుత్వం 1977లో జానకి అమ్మాళ్ను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. జమ్ములోని రీజియనల్ రీసెర్చ్ లాబొరేటరీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన కాలంలో 3,254 వృక్షజాతులకు చెందిన 21,500 నమూనాలపై పరిశోధనలు సాగించారు. ఆమె పరిశోధనలు జన్యుశాస్త్రం అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డాయి. ఇండియన్ సొసైటీ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాండ్ బ్రీడింగ్, బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు అధ్యక్ష పదవిలో కొనసాగిన తొలి మహిళగా కూడా జానకి అమ్మాళ్ అరుదైన చరిత్ర సృష్టించారు. అనారోగ్యంతో ఆమె 1984 ఫిబ్రవరి 7న మద్రాసులో కన్నుమూశారు. సైన్స్లో డాక్టరేట్ సాధించిన తొలి భారతీయురాలు అసీమా ఛటర్జీ బ్రిటిష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ అసీమా ఛటర్జీ. ఆమె కలకత్తాలో 1917 సెప్టెంబరు 23న జన్మించారు. ఆమె తండ్రి నారాయణ ముఖర్జీ కలకత్తాలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేసేవారు. ఆధునిక భావాలు గల ఆయన కుమార్తెను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో అసీమా కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీ నుంచి 1936లో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ సాధించారు. తర్వాత 1938లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ‘ఫైటోమెడిసిన్స్’పై ఆమె సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి కలకత్తా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. ఆమె పరిశోధన ఫలితంగా మూర్ఛ వ్యాధిని, మలేరియాను నయం చేసే మందుల తయారీకి, కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమోథెరపీ మందుల తయారీకి మార్గం సుగమమైంది. కలకత్తా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తయ్యాక ఆమె అమెరికా వెళ్లి విస్కాన్సిన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో పరిశోధనలు సాగించారు. కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని లేడీ బ్రాబర్న్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగాన్ని స్థాపించిన ఘనత అసీమాకే దక్కుతుంది. పలు శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహించిన అసీమా, 1982–90 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా కూడా కొనసాగారు. భారత ప్రభుత్వం ఆమె విశిష్ట సేవలకు గుర్తింపుగా 1975లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళా శాస్త్రవేత్తగా ఆమె సాధించిన ఘనత చరిత్రలో నిలిచిపోతుంది. రామన్పైనే సత్యాగ్రహం ప్రకటించిన ధీర కమలా సోహనీ శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళల పట్ల వివక్ష ఈనాటిది కాదు. తొలి రోజుల్లో వివక్ష మరింత ఎక్కువగా ఉండేది. కేవలం మహిళ అయిన కారణంగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుకు నిరాకరణ ఎదురైంది. ఆమె దరఖాస్తును తోసిపుచ్చినది ఎవరో కాదు, అప్పట్లో ఆ సంస్థ డైరెక్టర్గా పనిచేస్తున్న ‘నోబెల్’ గ్రహీత సీవీ రామన్. మహిళలు శాస్త్ర పరిశోధనను కొనసాగించలేరంటూ ఆమె దరఖాస్తును రామన్ తోసిపుచ్చారు. పరిశోధన సాగించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలా సోహనీ ఈ తిరస్కారాన్ని తేలికగా తీసుకోలేదు. రామన్ నిర్ణయానికి నిరసనగా సత్యగ్రాహం చేపట్టింది. దెబ్బకు రామన్ దిగివచ్చి, ఆమెను రీసెర్చ్ ఫెలోగా చేర్చుకోక తప్పలేదు. కమలా సోహనీ మధ్యప్రదేశ్లోని (అప్పటి సెంట్రల్ ప్రావిన్స్) ఇండోర్లో 1912 సెప్టెంబర్ 14న జన్మించారు. ఆమె తండ్రి నారాయణరావు భగవత్, పినతండ్రి మాధవరావు భగవత్– ఇద్దరూ రసాయనిక శాస్త్రవేత్తలే! వారిద్దరూ బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పట్టభద్రులు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్స్ తర్వాతి కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్గా (ఐఐఎస్సీ) మారింది. ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు కమలా సోహనీ బాంబే యూనివర్సిటీ నుంచి 1933లో కెమిస్ట్రీ ప్రధానాంశంగా, ఫిజిక్స్ ద్వితీయాంశంగా బీఎస్సీ, 1936లో కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ డిస్టింక్షన్తో పూర్తి చేశారు. కమలా సోహనీ పోరాట ఫలితంగా ఐఐఎస్సీలో మహిళల ప్రవేశానికి 1937 నుంచి మార్గం ఏర్పడింది. ఐఐఎస్సీలో శ్రీనివాసయ్య మార్గదర్శకత్వంలో కమలా సోహనీ పాలు, పప్పుధాన్యాలు, గింజధాన్యాల్లోని ప్రొటీన్లపై పరిశోధన సాగించారు. ఆమె పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో కేంబ్రిడ్జి వర్సిటీ పరిశోధనలు కొనసాగించడానికి ఆమెను ఆహ్వానించింది. అక్కడ ఆమె ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ హిల్ నేతృత్వంలో పద్నాలుగు నెలల్లో పరిశోధన పూర్తి చేసి, సమర్పించిన కేవలం 40 పేజీల సిద్ధాంత వ్యాసానికి పీహెచ్డీ లభించింది. డాక్టరేట్ పూర్తయిన వెంటనే 1939లో ఆమె స్వదేశానికి వచ్చారు. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగా నియమితులయ్యారు. తాజా తాటికల్లు (నీరా) పోషక విలువలపై ఆమె జరిపిన పరిశోధన భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ను ఎంతగానో ఆకట్టుకుంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు నీరా ఇవ్వవచ్చని, నీరాను తాటిబెల్లంగా తయారు చేసినట్లయితే, పోషక విలువలను ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చని ఆమె నిరూపించారు. ‘నీరా’పై పరిశోధన చేసినందుకు ఆమెకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 1998లో ఆమెను ఘనంగా సత్కరిస్తుండగా వేదికపైనే కుప్పకూలిపోయిన ఆమె కొద్ది రోజుల్లోనే కన్ను మూశారు. దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్తగా ఉన్నత స్థాయికి చేరుకున్న అన్నా మణి మద్రాసు ప్రెసిడెన్సీలోని రామనాథపురం జిల్లా పారంకుడిలో 1918 ఆగస్టు 23న జన్మించారు. ఆమె తండ్రి సివిల్ ఇంజనీరు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు, కళలపై అన్నా మణికి విపరీతమైన ఆసక్తి ఉండేది. ఎనిమిదో పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆమెకు వజ్రాల చెవిరింగులు బహుమతిగా కొని తేవడానికి తండ్రి బజారుకు వెళ్లడానికి సిద్ధపడుతుంటే, తనకు వజ్రాల రింగులు వద్దని, వాటికి బదులు ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా’ కావాలని కోరింది. బాల్యంలో ఆమెకు నాట్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. నర్తకి కావాలనుకుంది కూడా. కాలేజీలో చేరిన తర్వాత మాత్రం నాట్యం బదులు పరిశోధనల్లోనే తన భవితవ్యాన్ని తీర్చిదిద్దుకుంది. మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజీ నుంచి 1939లో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేసింది. మరుసటి ఏడాదే ఆమెకు పరిశోధనలు కొనసాగించడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్కాలర్షిప్ లభించింది. అక్కడ ప్రొఫెసర్ సాల్మన్ పాపయ్య మార్గదర్శకత్వంలో వజ్రాలు, కెంపులకు గల కాంతిపరావర్తన లక్షణాలపై పరిశోధన సాగించి, పీహెచ్డీ కోసం సిద్ధాంత వ్యాసం సమర్పించారు. అయితే, ఆమె అప్పటికి ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయనందున ఆమెకు పీహెచ్డీ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం ఆమె లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో చేరారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు సాగించాలనే లక్ష్యంతో వెళ్లిన ఆమె చివరకు వాతావరణ శాస్త్ర పరిశోధకురాలిగా తేలారు. స్వదేశానికి 1948లో తిరిగి వచ్చాక, పుణేలోని వాతావరణ శాఖ కార్యాలయంలో చేరారు. వాతావరణ పరికరాలపై ఆమె అసంఖ్యాకమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. చాలా పరికరాలను ఆమె ప్రామాణీకరించారు. పుణేలో ఆమె ఐదేళ్ల వ్యవధిలోనే వాతావరణ విభాగాధిపతి స్థాయికి ఎదిగారు. ఆమె కింద 121 మంది పురుషులు సిబ్బందిగా పనిచేసేవారు. తర్వాత ఆమె 1968లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పదోన్నతిపై ఢిల్లీ బదిలీ అయ్యారు. కొంతకాలం ఈజిప్టులో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) కన్సల్టంట్గా పనిచేశారు. జీవితాంతం పరిశోధనలకే అంకితమైన ఆమె వివాహం చేసుకోలేదు. 1994లో పక్షవాతం బారినపడిన ఆమె 2001లో కన్నుమూశారు. సూర్యరశ్మి నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావంపై ఆమె జరిపిన పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు దక్కాయి. ఆమె శత జయంతి సందర్భంగా 2018లో డబ్ల్యూఎంవో తన జర్నల్లో ఆమె సంక్షిప్త జీవిత చరిత్రను, ఇంటర్వ్యూను ప్రచురించింది. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టు రూపాబాయి ఫర్దూన్జీ రూపాబాయి ఫర్దూన్జీ హైదరాబాద్లోని ఒక పార్శీ కుటుంబంలో పుట్టారు. ఆమె జనన మరణ వివరాలేవీ తెలియవు గాని, నాటి హైదరాబాద్ మెడికల్ కాలేజీలో (ఇప్పటి ఉస్మానియా మెడికల్ కాలేజీ) 1885లో చేరిన ఐదుగురు మహిళా విద్యార్థుల్లో ఆమె ఒకరు. హైదరాబాద్ మెడికల్ కాలేజీ నుంచి ‘హకీం’ పట్టా తీసుకున్నాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ బాల్టిమోర్లోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో పాశ్చాత్య వైద్యంలో డిగ్రీ కోసం చేరారు. అప్పట్లో అమెరికా, ఇంగ్లాండ్లలో సైతం చాలా వైద్య కళాశాలలు మహిళలకు ప్రవేశం కల్పించేవి కావు. మహిళలకు ప్రవేశం కల్పించే అతి కొద్ది సంస్థల్లో బాల్టిమోర్లోని జాన్స్హాప్కిన్స్ హాస్పిటల్ ఒకటి. బాల్టిమోర్లో చదువు పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లోని తొలి రెండు క్లోరోఫామ్ కమిషన్లలో (1888, 1891) కీలక పాత్ర పోషించారు. తర్వాత 1909లో స్కాట్లాండ్ వెళ్లి, అక్కడ ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో చేరారు. అప్పటికి అనెస్థీషియాలో ఏ యూనివర్సిటీలోనూ స్పెషలైజేషన్ కోర్సులు లేవు. అయినా ఆమె ఒకవైపు అనెస్థెటిక్స్లో పరిశోధనలు సాగిస్తూనే, మరోవైపు ఎడిన్బర్గ్ వర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీలలో డిప్లొమాలు పూర్తి చేశారు. అనెస్థెటిక్స్లో అనుభవజ్ఞానం ఉన్నవారి సేవలను శస్త్రవైద్యులు తమకు అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకునేవారు. అలా రూపాబాయి ఫర్దూన్జీ కూడా పలువురు శస్త్రవైద్యులకు అనెస్థటిస్టుగా సేవలందించారు. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టుగా గుర్తింపు పొందారు. ఎడిన్బర్గ్లో పరిశోధనలు పూర్తయ్యాక ఆమె స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్లోని చాదర్ఘాట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేసి, 1920లో రిటైరయ్యారు. -
నందిని ‘పసిడి జంప్’
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పసిడి బోణీ చేసింది. శనివారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్ అండర్–17 బాలికల లాంగ్జంప్ విభాగంలో తెలంగాణ అమ్మాయి అగసార నందిని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నందిని 5.65 మీటర్ల దూరం దూకి అగ్రస్థానాన్ని దక్కించు కుంది. నందిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థిని. నిర్మా అసారి (గుజరాత్–5.62 మీటర్లు) రజతం... అభిరామి (కేరళ–5.47 మీటర్లు) కాంస్యం సాధించారు. అండర్–17 బాలికల 400 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కుంజా రజిత రజత పతకం సాధించింది. రజిత 57.61 సెకన్లలో గమ్యానికి చేరింది. -
అలసి విశ్రమించిన అలలు
చుక్క పెడితే సమాప్తం అని కాదు. ఆఖరి చరణం పాడితే అది చరమ గీతం కాదు. ‘కట్’ అంటే ప్యాకప్ కాదు. ముకుళిత హస్తాలకు అర్థం ఇక సెలవని కాదు. అంతమే లేని వాటికి మధ్య మధ్య విరామాలు, ఆగి అలుపు తీర్చుకుంటున్న అలలు. ఈ ఏడాది సాహిత్య, సంగీత, సినీ, రాజకీయ, ఆథ్యాత్మిక రంగాలలోని కొందరు సుప్రసిద్ధ మహిళల్ని కోల్పోయాం. వాళ్లు లేని లోటు తీరనిదే అయినా, వాళ్లు మిగిల్చి వెళ్లినది తరగనిది. కృష్ణాసోబ్తీ, రచయిత్రి ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత అయిన కృష్ణా సోబ్తీ(93) ఢిల్లీలో జనవరి 25న కన్నుమూశారు. కృష్ణాసోబ్తీ రచించిన ‘మిత్రో మర్జానీ’ భారత సాహిత్యంలో నూతన శైలిని ప్రతిబింబిస్తుందని సాహితీప్రియులు అంటారు. కృష్ణాసోబ్తీ 2010 లో ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఒక సృజనశీలిగా ప్రభుత్వ గుర్తింపులకు దూరంగా ఉండాలన్నది తన ఉద్దేÔ¶ మని ఆ సందర్భంగా ఆమె అన్నారు. వింజమూరి అనసూయాదేవి, గాయని ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్తి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్లో మార్చి 24 న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత’ పాటకు బాణీ కట్టింది అనసూయాదేవే. విజయనిర్మల, సినీ నటి ప్రముఖ నటి, దర్శకురాలు, సినీ నటుడు కృష్ణ సతీమణి ఘట్టమనేని విజయనిర్మల (73) జూన్ 26న తుదిశ్వాస విడిచారు. 1946 ఫిబ్రవరి 20న గుంటూరు జిల్లా నరసరావుపేటలో విజయనిర్మల జన్మించారు. పాండురంగ మహత్యం సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించారు. 1971లో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆమె అసలు పేరు నిర్మల కాగా.. తనకు సినీరంగంలో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకున్నారు. షీలా దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ (81) జూలై 20న కన్నుమూశారు. పంజాబ్లోని కపుర్తలాలో 1938 మార్చి 31వ తేదీన షీలా కపూర్ (షీలా దీక్షిత్) జన్మించారు. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా షీలా సేవలందించించారు. రాజీవ్ హయాం లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్గా అయిదు నెలలు కొనసాగారు. మాంటిస్సోరి కోటేశ్వరమ్మ, విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ(94) జూన్ 30న విజయవాడలో కన్ను మూశారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925 మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డన్స్ర్ మాంటిస్సోరి స్కూళ్లను స్థాపించారు. ఛాయాదేవి, సాహితీవేత్త ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (85) జూన్ 28న హైదరాబాద్ లోని చండ్ర రాజేశ్వర్రావు వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. గతంలో ఆమె కోరిన మేరకు ఆమె భౌతిక కాయాన్ని ఈఎస్ఐ వైద్య కళాశాలకు అప్పగించారు. అలాగే కళ్లను ఎల్వీ ప్రసాద్ వైద్యులు సేకరించారు. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో మద్దాల వెంకటాచలం, రమణమ్మ దంపతులకు ఛాయదేవి జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు ఆమె భర్త. ఆయన చాలాకాలం క్రితమే చనిపోయారు. ఛాయాదేవి ఎన్నో కథలు రాశారు. బోన్సాయ్ బ్రతుకు అనే కథని 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన ’తన మార్గం’ కథా సంపుటికి 2005 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను తన కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. కాంచన్ చౌదరి, తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య (72) ఆగస్టు 26న ముంబైలో కన్నుమూశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్ దేశంలో తొలి మహిళా డీజీపీగా చరిత్ర సృష్టించారు. కిరణ్ బేడీ తరువాత దేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్లో జన్మించిన కాంచన్ 2004 నుంచి 2007 అక్టోబర్ 31 వరకు ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. సీఐఎస్ఎఫ్ అధిపతిగానూ పనిచేశారు. సుష్మా స్వరాజ్, కేంద్ర మాజీమంత్రి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) ఆగస్టు 6న కన్ను మూశారు. 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మ 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. గీతాంజలి, నటి ప్రముఖ నటి గీతాంజలి (72) అక్టోబర్ 31న కన్నుమూశారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచమయ్యారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో కలిపి 300 కు పైగా చిత్రాల్లో నటించారు. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, శ్రీకృష్ణ పాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాలు గీతాంజలికి మంచి గుర్తింపును తెచ్చాయి. నానమ్మాళ్, యోగా శిక్షకురాలు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యోగా శిక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వి. నానమ్మాళ్ (99) అక్టోబర్ 26న కన్నుమూశారు. నానమ్మాళ్ కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి సమీపంలో ఉన్న జమీన్ కాళియపురంలో 1920లో రైతు కుటుంబంలో జన్మించారు. తాత మన్నర్స్వామి వద్ద యోగా శిక్షణ తీసుకున్న ఆమె.. చనిపోయే వరకు కఠినమైన యోగాసనాలు వేశారు. నానమ్మాళ్ వద్ద శిక్షణ పొందిన 600 మంది ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. వీరిలో 36 మంది ఆమె కుటుంబసభ్యులే ఉన్నారు. నానమ్మాళ్ను కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
స్వర్ణం నెగ్గిన మీరాబాయి చాను
దోహ: భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఖతర్ ఇంటర్నేషనల్ కప్లో సత్తా చాటింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో బరిలో దిగిన ఆమె 194 (83+111) కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. మొదట స్నాచ్లో 83 కేజీలు ఎత్తిన మీరా... క్లీన్ అండ్ జర్క్లో 111 కేజీలను ఎత్తింది. అనైస్ మిచెల్ (ఫ్రాన్స్–172 కేజీలు), మనోన్ లోరెంజ్ (165 కేజీలు) వరుసగా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్లో మీరాబాయి ఎత్తిన 201 కేజీల ప్రదర్శన అత్యుత్తమం కాగా... ఇక్కడ అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ సిల్వర్ లెవల్ ఈవెంట్ అయిన ఈ టోరీ్నలో గెలుపుతో సాధించిన పాయింట్లు 2020 టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో మీరాబాయికి కీలకం కానున్నాయి. -
100 మీ.లో ద్యుతీ చంద్ కొత్త జాతీయ రికార్డు
రాంచీ: భారత మహిళా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ 100 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ఛాంపియన్ షిప్ లో ఈ ఒడిశా అథ్లెట్ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్ ఫైనల్ రేసును 11.25 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ రేసులో ద్యుతీ చంద్ 11.22 సెకన్లలో గమ్యానికి చేరింది. ఈ క్రమంలో 11.26 సెకన్లతో సంయుక్తంగా తన పేరిట (ఏప్రిల్, 2019లో), రచితా మిస్త్రీ (జూలై, 2000లో) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. -
అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్
న్యూఢిల్లీ: భారత వేగవంతమైన మహిళా రన్నర్గా గుర్తింపుకెక్కిన ద్యుతీ చంద్ తన స్వలింగ సహజీవనంపై పెదవి విప్పింది. ఓ టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై తన కుటుంబంలో కలతలు చెలరేగాయని కూడా చెప్పింది. ఇటీవల కాలంలో కొందరు క్రీడాకారిణులు ఇలా బయటపడిన సంగతి తెలిసిందే. కొందరైతే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కోవలో సహజీవనంపై బాహాటంగా అంగీకరించిన తొలి భారత అథ్లెట్ ద్యుతీనే కావడం గమనార్హం! ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని 23 ఏళ్ల ద్యుతీ వెల్లడించింది. తమ సహజీవనం పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... అక్క మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఆమె తన సోదరుడి భార్య నచ్చకపోతే ఇంటిలో నుంచి గెంటేసిందని చెప్పింది. తనను ఇలాంటి పనులు మానుకోకపోతే జైలుకు పంపిస్తానని బెదిరించిందని వెల్లడించింది. అయితే మేజర్ అయిన తను స్వతంత్రంగా ఉండాలనే నిర్ణయించుకున్నానని... అందుకే బహిరంగంగా తన సహజీవనంపై మాట్లాడుతున్నానని ద్యుతీ చెప్పుకొచ్చింది. ‘ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. ఎప్పటిలాగే నా కెరీర్ను కొనసాగిస్తాను. వచ్చే నెలలో జరిగే ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్లో పాల్గొంటాను. ప్రపంచ చాంపియన్షిప్, టోక్యో ఒలింపిక్స్లో అర్హత సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా భాగస్వామి అనుమతితోనే సహజీవనాన్ని బహిర్గతం చేశాను. ఇలా బయట పడటానికి మరో కారణం కూడా ఉంది. గతంలో పింకీ ప్రమాణిక్ అనే మహిళా అథ్లెట్ తన సహచర అథ్లెట్ను బలాత్కారం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. అందుకే అన్ని ఆలోచించాకే, భాగస్వామితో చర్చించాకే మా బంధాన్ని బయటపెట్టాను. పైగా సుప్రీం కోర్టు తీర్పుకూడా మేం బయటపడేందుకు ధైర్యాన్నిచ్చింది’ అని ద్యుతీచంద్ వివరించింది. గతంలో ఆమె కెరీర్లో సవాళ్లు ఎదుర్కొంది. పురుష హార్మోన్లు ఉన్నట్లు తేలడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ఆమెపై నిషేధం విధించింది. దీన్ని ఆమె ఆర్బిట్రేషన్ కోర్టులో సవాలు చేసి విజయం సాధించి మళ్లీ ట్రాక్లో అడుగుపెట్టింది. గతేడాది సుప్రీం కోర్టు మేజర్లయిన వారిమధ్య స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చింది. అయితే ఒకే లింగానికి చెందిన ఇరువురి మధ్య పెళ్లికి మాత్రం భారత్లో చట్టబద్ధత లేదు. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ మార్గదర్శనంలో పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ద్యుతీ చంద్ గత ఏడాది జకార్తా ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు గెలిచింది. ఇటీవల దోహాలో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకం నెగ్గింది. -
నిజంగా సరస్వతీ పుత్రికే!
దుబాయ్: సాధారణంగా అమెరికాలోని ఏదో ఒక విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించుకోవడానికి సగటు భారతీయ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ దుబాయ్లో ఉండే భారతీయ యువతి సిమోనే నూరాలీ(17) మాత్రం ఇందుకు మినహాయింపు. ఎందుకంటే తమ విద్యాసంస్థలో చేరాలని అమెరికాలోని 7 ప్రఖ్యాత వర్సిటీలు ఆహ్వానించాయి. అవి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, డార్ట్మౌత్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, జార్జ్టౌన్ వర్సిటీ, జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ. అమెరికా వర్సిటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏసీటీ పరీక్షలో 36కు 36 పాయింట్లు సాధించింది. భారత్లో మహిళల అక్రమ రవాణాపై సిమోనే రాసిన ‘ది గర్ల్ ఇన్ ది పింక్ రూమ్’ పుస్తకాన్ని పరిశోధన కోసం వాడుతున్నారు. -
లైవ్లో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు
దుబాయ్: యూఏఈలోని షార్జాలో సోషల్ మీడియా లైవ్లో ఆత్మహత్యకు యత్నించి న భారత యువతిని ఆ దేశ పోలీసులు సకాలంలో అడ్డుకుని ప్రాణాల ను కాపాడారు. సోషల్ మీడియాలో స్వయంగా పోస్టు చేసిన తన చిత్రానికి ఎక్కువగా వ్యతిరేక స్పందనలు రావడంతో మనస్తాపం చెందిన యువతి బలవ న్మరణానికి యత్నించిందని పోలీసులు తెలిపారు. షార్జాలోని ఏ1 నహదా ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో సోషల్ మీడియాలో వీడియో లైవ్ పెట్టి ఆత్మహత్యకు సిద్ధం కాగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆమె ఉంటున్న ఇంటి వద్దకు చేరుకుని తలుపు తట్టగా...ఆ యువతి తండ్రి తలుపు తీశాడు. పోలీసులు కన్పించేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి ఆ యువతిని ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు. ఆమెకు వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. -
ముగ్గురు విజేతలు
విజి పేన్కూట్టు, రాహీబాయి, మీనా గయేన్.. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన, స్ఫూర్తిదాయకమైన’ మహిళలుగా బీబీసీ తయారు చేసిన తాజా వందమంది జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ ముగ్గురు భారతీయ స్త్రీలు తమ శక్తికి మించిన ప్రయత్నాలతో వివిధ సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టి సమాజానికి ఆదర్శంగా నిలిచారని బిబీసీ ప్రశంసించింది. రైట్ టు సిట్ విజి పేన్కూట్టు.. వయసు యాభైఏళ్లు. వృత్తి టైలరింగ్. 22 ఏళ్ల వయసులో సామాజిక సేవ మొదలుపెట్టారు. ఘనత.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కోసం పోరాడారు. దాదాపు నాలుగేళ్ల ఉద్యమం తర్వాత ఆమె ఘోష విన్నది కేరళ ప్రభుత్వం ఆ మేరకు చట్టాన్ని సవరించింది. అంతేకాదు ఆడవాళ్లు పనిచేస్తున్న ప్రతి షాపులో వాళ్లు కూర్చోవడానికి వీలుగా కుర్చీలను ఏర్పాటును తప్పనిసరి చేసింది. విజి చేపట్టిన ఉద్యమం పేరు ‘రైట్ టు సిట్’. ‘‘బీబీసీ జాబితాలో నా పేరుండడం నిజంగా సంతోషాన్నిస్తోంది. రైట్ టు సిట్ అనేది కేవలం మనదేశంలోని సమస్యే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేల్స్గర్ల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం’’ అంటుంది విజి పేన్కూట్టు. సీడ్ మదర్ రాహీబాయి.. స్వస్థలం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా, కోంభాల్నే గ్రామం. వృత్తి రైతు. ఘనత.. ఆగ్రో– బయోడైవర్సిటీలో సెల్ఫ్ మేడ్ ఎక్స్పర్ట్. వరిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తూ ఆదర్శరైతుగా నిలిచింది. తన పొలంలో సొంతంగా నీటి సంరక్షణా నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీంతో రెండెకరాల బంజరుభూమిని మాగాణిగా మలచుకుంది. ఆ నేలలో కూరగాయలను పండిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. విత్తన భాండాగారాన్నీ స్థాపించి రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తోంది. ఇదిగాక విత్తనాల ఎంపిక, నేల సారాన్ని వృద్ధిపరుచుకోవడం, ఎరువుల వాడకం వంటివాటిపై రైతులకు, వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు శిక్షణనూ ఇస్తోంది. ఈ కృషికి ‘ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ సంస్థ ఆమెను ‘సీడ్ మదర్’ అనే బిరుదుతో సత్కరించింది. భగీరథి మీనా గయేన్.. పశ్చిమ బెంగాల్ వాస్తవ్యురాలు. ఘనత.. సుందర్బన్స్లోని మహిళలందరినీ ఏకం చేసి ఆ ప్రాంతంలో రహదారులను నిర్మించింది. చుట్టూ నదులతో శాశ్వత రహదారులకు అనుకూలంగా లేని ప్రదేశం సుందర్బన్స్. అలాంటి చోట అక్కడి గ్రామాల స్త్రీలనందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చి పర్మినెంట్ రోడ్లను నిర్మింపచేసి అభినవ భగీరథిగా కీర్తిగాంచింది రాహీబాయి. అందుకే బీబీసీ ఆమెను మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఇన్సిపైరింగ్ ఉమన్గా గౌరవించింది. -
పెప్సీలో ‘ఇంద్రా’ శకానికి తెర!
న్యూయార్క్: భారతీయ మహిళలు వ్యాపార నిర్వహణలోనూ దిట్టలు అని నిరూపించిన మహిళ... ప్రపంచ స్థాయి కంపెనీని సైతం విజయవంతంగా భవిష్యత్తులోకి నడిపించగలరని నిరూపించిన నారీశక్తి... ప్రపంచ పారిశ్రామిక రంగంలో అసాధారణ మహిళగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయి (62) పెప్సీకో కంపెనీ నాయకత్వ బాధ్యతల్ని విడిచిపెట్టబోతున్నారు. శీతలపానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ ఇంద్రానూయి త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు. 12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె అక్టోబర్ 3న తన బాధ్యతలను కొత్త సారథికి అప్పగించనున్నారు. కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తాను నూతన సీఈవోగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఎంపిక చేసింది. ఇవి మినహా కంపెనీ యాజమాన్యంలో మరే మార్పులు లేవని కంపెనీ స్పష్టం చేసింది. పెప్సీకోతో ఇంద్రానూయికి ఉన్న 24 ఏళ్ల అనుబంధం కూడా త్వరలోనే ముగిసిపోనుంది. సీఈవోగా వైదొలిగినా, వచ్చే ఏడాది ఆరంభం వరకు చైర్పర్సన్గా కొనసాగనున్నారు. తాజా పరిణామంపై ఆమె స్పందిస్తూ కంపెనీకి మంచి రోజులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ‘‘భారత్లో పెరుగుతున్న నేను ఈ స్థాయి కంపెనీని నడిపించే అవకాశం లభిస్తుందనుకోలేదు. గడిచిన 12 సంవత్సరాల్లో వాటాదారుల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు మేం చేసిన కృషికి గర్విస్తున్నాం. ఉత్తమ కంపెనీగా మారేందుకు, ఉత్తమ కంపెనీగానూ కొనసాగేందుకు మా ప్రపంచ బృందం చేసిన అద్భుత ప్రయాణాన్ని ప్రశంసిస్తున్నాను’’అని ఇంద్రా నూయి ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘ఈ రోజు నాకు భావోద్వేగాల మిశ్రమంతో కూడినది. పెప్సీకోతో 24 ఏళ్ల ప్రయాణం. నా హృదయంలో కొంత భాగం కంపెనీతోనే ఉంటుంది. భవిష్యత్తు కోసం మేం చేసిన దాని పట్ల గర్విస్తున్నాం. పెప్సీకోకు మంచి రోజులు రావాల్సి ఉంది. పర్యావరణ వినియోగాన్ని పరిమితం చేస్తూనే ప్రజల జీవితాలపై అర్థవంతమైన ప్రభావం చూపించాం. ఉజ్వలమైన భవిష్యత్తుకు వృద్ధిని కొనసాగించే బలమైన స్థితిలో పెప్సీకో ఉంది’’ అని నూయి పేర్కొన్నారు. మార్పు దిశగా నడిపించారు... రామన్ లగుర్తా సైతం పెప్సీకో సీనియర్ ఉద్యోగుల్లో ఒకరు. 22 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ కాలంలో ఎన్నో నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి కంపెనీ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు, కార్పొరేట్ విధానాలు, పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రానూయి నాయకత్వాన్ని ఈ సందర్భంగా రామన్ ప్రశంసించారు. తన సాహసోపేతమైన దృష్టి, అసాధారణ నాయకత్వంతో కంపెనీని మార్చివేశారని పేర్కొన్నారు. వాటాదారులకు లాభాలు... ఇంద్రా సారథ్యంలో పెప్సీకో మంచి ఫలితాలను సాధించింది. 2006 నుంచి 2017 నాటికి వాటాదారులకు 162% ప్రతిఫలం లభించింది. వాటాదారులకు డివిడెండ్లు, షేర్ల తిరిగి కొనుగోలు ద్వారా 2006 ప్రారంభం నుంచి 2017 చివరి నాటికి 79.4 బిలియన్ డాలర్ల (రూ.5.39 లక్షల కోట్లు) లాభాలను పంచారు. 2006లో 35 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆదాయాన్ని 2017 నాటికి 63.5 బిలియన్ డాలర్లకు చేర్చారు. గత 12ఏళ్లలో అసాధారణ నాయకత్వాన్ని అందించారని కంపెనీ డైరెక్టర్ల బోర్డు తరఫున ప్రిసైడింగ్ డైరెక్టర్ ఇయాన్కుక్ పేర్కొన్నారు. శక్తివంతమైన వ్యాపార మహిళ ఇంద్రానూయి పెప్సీకో సీఈవోగా తప్పుకోవడం వెనుక కారణం ఏంటన్నది ఇంకా స్పష్టం కాలేదు. అతిపెద్ద శీతల పానీయాల కంపెనీ సారధిగా ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందారు. ‘ప్రపంచంలో శక్తివంతమైన వ్యాపార మహిళ’ (అమెరికా వెలుపల)గా ఫార్చ్యూన్స్ జాబితా 2017లో 2వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో టాప్–100 శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా 2014లో ఫోర్బ్స్ జాబితాలో 13వ స్థానంలో నిలిచారు. అత్యధిక పారితోషికం అందుకునే మహిళా సీఈవోగానూ అగ్ర స్థానంలో ఉన్నారు. కార్పొరేట్ అమెరికా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ప్రపంచ దిగ్గజ సంస్థను నడిపించిన భారత మహిళామణుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించారు. చెన్నై నుంచి అమెరికాకు.. మద్రాస్లో జన్మించిన ఇంద్రా కృష్ణమూర్తి నూయి అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిధిలోని క్రిస్టియన్ కాలేజీలో 1974లో డిగ్రీ ముగించారు. ఐఐఎం, కల్కత్తా నుంచి ఎంబీఏ చేశారు. దేశీయంగానే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. 1978లో యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేరి పబ్లిక్, ప్రైవేటు మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. తర్వాత బోస్టన్ గ్రూపులో చేరారు. అనంతరం మోటరోలా, ఏసీ బ్రౌన్ బొవేరిలోనూ పనిచేశాక 1994లో పెప్సీకో ఉద్యోగిగా మారారు. 2001లో సీఎఫ్వోగా నియమితులయ్యారు. 2006లో సీఈవోగా, ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. 44 ఏళ్ల పెప్సీకో కంపెనీకి ఆమె ఐదో సీఈవో. యుమ్ బ్రాండ్ పునరుద్ధరణ, ట్రోపికానా కొనుగోలు, క్వాకర్ ఓట్స్ విలీనం, గాటొరేడ్ కొనుగోలులో కీలక పాత్ర పోషించారు. -
చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లోనే భారత మహిళా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పసిడి పతకంతో సత్తా చాటింది. టర్కీ లో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్ కప్లో దీపా వాల్ట్ ఈవెంట్లో స్వర్ణం చేజిక్కించుకుంది. ఫైనల్లో ఆమె 14.150 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 13.400 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. ఈ ప్రదర్శనతో దీపా కర్మాకర్ ప్రపంచకప్ చరిత్రలో పతకం నెగ్గిన రెండో భారతీయ జిమ్నాస్ట్గా, స్వర్ణ పతకం నెగ్గిన తొలి జిమ్నాస్ట్గా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదే తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మెల్బోర్న్లో జరిగిన ప్రపంచకప్లో కాంస్యం సాధించింది. -
ప్రతి ఉద్యోగినికీ నలుగురు శత్రువులు
తనకు తను ఒక శత్రువు... కుటుంబమొక శత్రువు సూపర్వైజర్లొక శత్రువు... సమాజం ఒక శత్రువు ఏ పరిస్థితినైనా మెరుగుపరచడానికి ముందసలు అది ఎలాంటి పరిస్థితితో తెలుసుకోవాలి. రిపోర్టులు అందుకే తయారు చేస్తారు. అశోకా యూనివర్సిటీ (హరియాణా) లోని ‘జెన్పాక్ట్ సెంటర్ ఫర్ ఉమెన్స్ లీడర్షిప్’ విభాగం.. భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న మహిళలపై తాజాగా ఒక రిపోర్టు విడుదల చేసింది. అందులో మరీ కొత్త విషయాలు ఏమీ లేవు కానీ, ఉద్యోగినులపై కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధ తీసుకోవాలని, ఉద్యోగినులకు ప్రభుత్వాలు మరిన్ని వెసులుబాట్లు ఇవ్వవలసిన అవసరం ఉందని నివేదికలోని వివరాలను బట్టి తెలుస్తోంది. యూనివర్సిటీ సర్వే నివేదిక ప్రకారం ఏటా 73 శాతం మంది భారతీయ మహిళలు ప్రసవం తర్వాత తమ ఉద్యోగాలను వదిలిపెట్టేస్తున్నారు! పిల్లల సంరక్షణ కోసం ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న తల్లులలో 50 శాతం మంది 30 ఏళ్ల లోపువారే! వీళ్లలో కొందరు తిరిగి ఉద్యోగాలకు వచ్చినప్పటికీ, ఉద్యోగంలో చేరిన నాలుగో నెలలోనే మళ్లీ ఉద్యోగం మానేస్తున్నారు. ఉద్యోగం చేస్తుండగా తల్లులు అయినవాళ్లలో 27 శాతం మంది మాత్రమే నిలకడగా ఉండి తమ ఉద్యోగాలలో ఎదుగుతున్నారు. ప్రసవం తర్వాత ఉద్యోగం మాని, తిరిగి చేరినవారిలో ఇది కేవలం 16 శాతమే! కార్పొరేట్, మీడియా, అభివృద్ధి రంగాలు.. ఈ మూడు సెక్టార్లలో యూనివర్సిటీ ఈ సర్వేను నిర్వహించింది. సర్వే నివేదికకు ‘ ప్రిడికమెంట్ ఆఫ్ రిటర్నింగ్ మదర్స్’ అనే పేరు పెట్టింది. (ఉద్యోగాలకు తిరిగొస్తున్న తల్లుల సంకటస్థితి). ‘‘పురుషులకు మాత్రమే అన్నివిధాలా అనుకూలతలు ఉన్న ఉద్యోగ రంగాలలో మహిళా ఉద్యోగినులుల నష్టపోతున్నారన్నది నిజం. లోపలికి వచ్చేందుకు వారికి ‘ప్రతిభ’ అనే ఒక ద్వారం ఉంటే.. బయటికి పంపించే ద్వారాలు.. గర్భధారణ, ప్రసవం, శిశు సంరక్షణ, పెద్దలను కనిపెట్టుకుని ఉండాల్సి రావడం, కుటుంబ మద్దతు లేకపోవడం, ఉద్యోగం చేసే చోట ప్రతికూలతలు.. అనే ద్వారాలు అనేకం ఉంటాయి. ప్రతిభ, సామర్థ్యం ఉండి కూడా ఈ ద్వారాల కారణంగానే మహిళలు ఉద్యోగాల్లో నిలదొక్కుకోలేకపోతున్నారు. పైస్థాయిలను అందుకోలేక మధ్యలోనే పక్కకు తప్పుకుంటున్నారు’’ అని నివేదిక వ్యాఖ్యానించింది. బయటికి పంపే ఈ ద్వారాలన్నీ ఇలాగే ఉంటే కనుక 2030 నాటికి స్త్రీ, పురుష ఉద్యోగాల్లో 50:50 నిష్పత్తిని సాధించాలన్న అంతర్జాతీయ లక్ష్యం నెరవేరడం కష్టమేనని కూడా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. నివేదికను బట్టి చూస్తే మహిళలు ఉద్యోగాల్లో రాణించలేకపోవడానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. ఇంటికి న్యాయం చెయ్యలేకపోతున్నామనే అపరాధ భావన. కుటుంబం కోసం రాజీ పడిపోవడం. పనిచేసే చోట పర్యవేక్షకులకు మహిళల శక్తియుక్తులపై విశ్వాసం లేకపోవడం. ఆడది ఇంట్లోనే ఉండాలి, మగాడే బయటికి వెళ్లాలి అనే సామాజిక ధోరణి. ఈ నాలుగూ స్త్రీ ఉద్యోగానికి నాలుగు శత్రువుల్లా ఎప్పుడూ పొంచి ఉంటాయి. అంటే ఉద్యోగానికి వెళ్తున్న ప్రతి మహిళా అనుక్షణం ఒకేసారి నలుగురు ప్రత్యర్థులతో తలపడాలి. వ్యక్తిగా కుటుంబం కోసం, శ్రమలో భాగస్వామిగా దేశ అభివృద్ధి కోసం ఆమె తలపడుతున్నప్పుడు కుటుంబం, ప్రభుత్వం ఆమెకు సహాయ సహకారాలు అందించడం తమ కనీస బాధ్యతగా భావించాలి. -
ఆకాశమే హద్దుగా...
అవకాశం లభించాలేగానీ ఆకాశమే మాకు హద్దు అంటున్నారు భారత మహిళామణులు... అవనీ చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్. దేశంలోనే మొదటి మహిళా సూపర్సోనిక్ జెట్ ఫైటర్లుగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రస్తుతం భారత వాయు సేనలో శిక్షణ పొందుతున్న వీరు మరో నెల రోజుల్లో యుద్ధ విమానాలను నడపబోతున్నారు. యుద్ధ విమానాల్లో మొదటిసారి...! ఈ మహిళా త్రయం తేలికపాటి యుద్ధ విమానాలైన పిలాటస్ పీసీ-7, కిరణ్, హాక్ జెట్లను నడిపేందుకు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం అవని, భావన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, అత్యధిక టేకాఫ్ వేగం కలిగిన మిగ్-21 యుద్ధ విమానాలను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. అవని 2 సీట్ల సామర్థ్యం కలిగిన మిగ్-21 రకం విమానాన్నినడిపేందుకు సూరత్ఘర్ ఎయిర్బేస్లో శిక్షణ పొందుతోంది. భావన కూడా అంబాల ఎయిర్బేస్లో శిక్షణకు సిద్ధమవుతోంది. ఇక మోహన హాక్ జెట్ను నడిపేందుకు కలైకుండ ఎయిర్బేస్లో శిక్షణ పూర్తయిన తర్వాత ఆపరేషనల్ స్క్వాడ్గా వెళ్లబోతుందని సీనియర్ అధికారి తెలిపారు. కఠినమైన శిక్షణలో నెగ్గితేనే...! జెట్ ఫైటర్గా రాణించాలంటే కఠినమైన శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. సుమారు పన్నెండుసార్లు ద్వంద్వ తనిఖీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట విమానం ఎగరటంలో మెళకువలు, నిర్వహణ పద్ధతులు, టేకాఫ్, లాండింగ్ వంటి ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. యుద్ధ విమానం నడిపే సమయంలో ఏర్పడే చిక్కుల్ని ఎదుర్కొనే సమయస్ఫూర్తి, సామర్థ్యం, నేర్పు ఉండాలి. ప్రాథమిక శిక్షణ అనంతరం యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలతో పాటు, యుక్తులు ప్రదర్శించగలగాలి. అవసరాన్ని బట్టి ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమిపైకి విమాన మార్గాన్నిమళ్లించే చతురత కలిగి ఉండాలి. ఈ శిక్షణలో నెగ్గితేనే యుద్ధ విమానాన్ని నడిపేందుకు అర్హత సాధిస్తారు. ఈ దశలన్నీ దాటుకుని సుమారు ఏడాదిన్నరగా జరుగుతున్న శిక్షణ పూర్తి చేసుకుని మొదటి మహిళా పైలట్ ఫైటర్లుగా మారనున్న అవని, భావన, మోహనలకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. - సుష్మారెడ్డి యాళ్ళ -
‘పద్మావతి’తో మహిళల వ్యక్తిత్వం హతం
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ చిత్రంపై రాష్ట్రీయ స్వయక్ సేవక్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ సంస్థ అఖిల భారతీయ ఇతిహాస్ సంకలన్ యోజన (ఏబీఐఎస్వై) అత్యంత తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ చిత్రం భారతీయ మహిళలను కించపరిచేలా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాక ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలిచే భారతీయ మహిళల వ్యక్తిత్వాన్ని ఈ చిత్రం హత్యచేసేలా ఉందని ఏబీఐఎస్వై అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సినిమాలు తీసేవారు.. డబ్బును సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఏబీఐఎస్వై వ్యాఖ్యానించింది. డబ్బు సముపార్జనలో చరిత్రను సైతం వక్రీకరించేందుకు ఏ మాత్రం వెనుకాడ్డంలేదని ఏబీఐఎస్వై జాతీయ ప్రధాన కార్యదర్శి బాలముకుంద్ పాండే పేర్కొన్నారు. భారతీయ, రాజపుత్రలు చరిత్రలో రాణీ పద్మావతికి అత్యంత గౌరవనీయ స్థానం ఉందని ఆయన చెప్పారు. ఈ చిత్రం ద్వారా రాణీ పద్మావతిని మాత్రమేకాక.. యావత్ భారతీయ మహిళలను కించపరిచారని ఆయన అన్నారు. భారతీయ మహిళల గౌరవాన్ని అధఃపాతాళానికి తొక్కొలా ఈ చిత్రం ఉందని బాలముకుంద్ పాండే తీవ్రంగా విమర్శించారు. ఈ చిత్రం విడుదలను తప్పకుండా అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. -
గృహహింసతో పొంచి ఉన్న ముప్పు
న్యూయార్క్(యూఎస్ఏ): భారత్ జరుగుతున్న గృహహింసతో మహిళల ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉన్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. కుటుంబసభ్యులు, భర్తల చేతిలో హింసకు గురవుతున్న భారతీయ మహిళలకు అమెరికా మహిళల కంటే 40 రెట్లు ప్రాణాపాయం ఉందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇండియా, అమెరికాల్లో జరిపిన పరిశీలనలో వెల్లడయింది. భర్త చేతుల్లో హింసకు గురవుతున్న ప్రతి నలుగురు బాధితుల్లో ఒక్కరు మాత్రమే వైద్యం చేయించుకుంటుండటమే ఇందుకు కారణమని ఈ పరిశోధన తేల్చింది. రోడ్డు ప్రమాదానికి గురైనా ఎత్తైన భవనాలపై నుంచి కిందపడిన భారతీయులకు అమెరికా దేశస్తుల కంటే దాదాపు ఏడు రెట్లు తక్కువగా వైద్య సాయం అందే అవకాశాలున్నట్లు గుర్తించామని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకురాలు మోహిని దాసరి వెల్లడించారు. వెంటనే వైద్యం అందని కారణంగా మరణాల శాతం ఎక్కువగా ఉంటోందని తేలింది. ఈ పరిశోధక బృందం 2013-2015 కాలంలో ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాలకు చెందిన 11,670 కేసులను, పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్బర్గ్లోని ట్రామా సెంటర్లలో నమోదైన 14,155 కేసులను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చింది. -
ఇండియన్ వుమెన్ రియల్లీ గ్రేట్!
► జర్మన్ యువతుల ప్రశంసలు నర్సీపట్నం(విశాఖపట్నం): జర్మనీ దేశానికి చెందిన యువతులు స్థానికంగా గ్రామీణ మహిళలు వరినాట్లు వేస్తున్న విధానాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాకవరపాలెం మండలం ఇమ్మాన్యుయేల్ సంస్థ వ్యవస్థాపకుడు జీవన్రాయ్ ఆధ్వర్యంలో జర్మన్ దేశస్తులు సోమవారం తాండవ రిజ ర్వాయరును చూడటానికి వచ్చారు. తాండవ అందా లను తిలకించి వస్తుండగా మార్గమధ్యంలో పంట పొలాల్లో మహిళలు వేస్తు న్న వరి నాట్ల చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. మహిళలు నీటితో దిగి వంగి వంగి ఏం చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలో ప్రజలు తినే వరి ధాన్యం పండించడానికి ఈ విధంగా చేయాలని చెప్పడంతో వారు.. ఆసక్తిగా నాట్లు వేస్తున్న మహిళా కూలీల వద్దకు వెళ్లారు. కాసేపు వారు వేస్తున్న వరినాట్లను పరీశీలించారు. తర్వాత వారు కూడా కూలీలతో కలిసి కొంతసేపు వరినాట్లు వేశారు. కొద్దిసేపటికే వారు ఆయాసపడి.. నీటిలో గంటల తరబడి శారీరకంగా ఎంతో శ్రమపడుతూ మహిళలు నాట్లు వేయడం చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. నాట్లు వేస్తున్న మహిళా కూలీలను అభినందిస్తూ.. ‘వావ్.. ఇట్స్ డిఫికల్ట్ వర్క్.. నీడ్ మోర్ పేషెన్సీ.. ఇండియన్ వుమన్ ఆర్ వెరీ గుడ్.. అండ్ వెరీ గ్రేట్’ అంటూ కితాబిచ్చారు. కూలీలకు జర్మనీ యువతులకు మధ్య సంభాషణను జీవన్రాయ్ అనువాదం చేశారు. వారివెంట నాతవరం మండలానికి చెందిన చర్చి పాస్టర్ జకర్యా ఉన్నారు. -
కెప్టెన్గా మిథాలీ రాజ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మహిళల ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది. వచ్చే నెల 24 నుంచి ఇంగ్లండ్ లో జరిగే ఈ టోర్నమెంట్కు సంబంధించి 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఇందులో మిథాలీ రాజ్ కే జట్టు పగ్గాలు అప్పజెబుతూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2005 లో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్ లో భారత మహిళలు జట్టు రన్నరప్ గా నిలిచింది. అదే ఇప్పటికీ భారత మహిళల అత్యుత్తమ ప్రదర్శన. భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, వేదా కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, పునమ్ రౌత్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిస్త్, సుష్మ వర్మ, మాన్సి జోషి, రాజేశ్వరి గైక్వాడ్, పునమ్ యాదవ్, నుజ్హత్ పార్వీన్, స్మృతీ మందనా -
320 పరుగులతో వరల్డ్ రికార్డు..
-
320 పరుగులతో వరల్డ్ రికార్డు..
పోచెస్ట్రూమ్: గతవారం భారత మహిళా ప్రధాన పేసర్ జులన్ గోస్వామి(181) వన్డేల్లో అత్యధిక వికెట్ల ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా భారత మహిళా ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్ లు సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పారు. వన్డే క్రికెట్ లో తొలి వికెట్ కు 320 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు ఈ జోడి. క్వాడ్రాంగులర్ సిరీస్ లో భాగంగా సోమవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత ఓపెనింగ్ జోడి ఈ ఘనతను కైవసం చేసుకుంది. ప్రపంచ రికార్డును నెలకొల్సే క్రమంలో దీప్తి శర్మ(188;160బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లు), పూనమ్ రౌత్(109;116 బంతుల్లో 11 ఫోర్లు) లు విశేషంగా రాణించి దాదాపు 9 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. 2008లో లార్డ్స్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జోడి ఎస్ జే టేలర్, సీఎంజీ అటికిన్స్లు 268 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని సాధించారు. మహిళల వన్డే క్రికెట్ లో ఇదే ఇప్పటివరకూ అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం. తాజాగా ఆ రికార్డును భారత జోడి అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో భారత మహిళలు 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 358 భారీ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే 320 పరుగుల భాగస్వామ్యాన్ని భారత ఓపెనింగ్ జోడి సాధించింది. ఓవరాల్ గా చూస్తే వన్డే క్రికెట్ లో ఇదే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం కావడం మరో విశేషం. పురుషుల క్రికెట్ లో అత్యధిక పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం 286 పరుగులు. 2006లో శ్రీలంక ఆటగాళ్లు ఉపుల్ తరంగా-జయసూర్యలు ఈ ఘనతను సాధించారు. -
వార్తల్లో వనిత
భారత మహిళలు కిరణ్ బేడీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా 2016, మే 29న బాధ్యతలు స్వీకరించారు. నీతా అంబానీ: 2016, ఆగస్టులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. నజ్మా హెప్తుల్లా: కేంద్ర మంత్రిగా పనిచేసి 2016, ఆగస్టులో మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు. జస్టిస్ మంజులా చెల్లూర్: 2016, ఆగస్టులో బాంబే హైకోర్ట్ చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. శుభా ముద్గల్: ప్రముఖ గాయని శుభా ముద్గల్కు 2016కుగానూ రాజీవ్గాంధీ జాతీయ సద్భావనా అవార్డు లభించింది. అనురాధా రాయ్: ‘స్లీపింగ్ ఆన్ జూపిటర్’ అనే పుస్తకానికి గానూ అనురాధారాయ్కి డీఎస్సీ ప్రైజ్ ఫర్ సౌత్ ఏషియన్ లిటరేచర్–2016 దక్కింది. ఆమె రచించిన ఇతర నవలలు.. ‘యాన్ అట్లాస్ ఆ‹ఫ్ ఇంపాజిబుల్ లాంగింగ్’, ‘ది ఫోల్డెడ్ ఎర్త్’. అర్చనా రామసుందరం: తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరం 2016, ఫిబ్రవరి 1న సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఒక పారామిలటరీ బలగానికి చీఫ్గా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. మెహబూబా ముఫ్తీ: జమ్మూకశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా 2016 ఏప్రిల్ 4న బాధ్యతలు స్వీకరించారు. ఈమె పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు. ఠి ప్రియదర్శిని ఛటర్జీ: గువహటికి చెందిన ఈమె మిస్ ఇండియా–2016గా ఎంపికైంది. మహాశ్వేతాదేవి: ప్రముఖ బెంగాలీ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి 2016, జూలై 28న 91 ఏళ్ల వయసులో మరణించారు. ఆమెకు 1996లో జ్ఞాన్పీఠ్, 1997లో రామన్ మెగసెసే అవార్డు, 2006లో పద్మవిభూషణ్ లభించాయి. ప్రియాంక చోప్రా: యునిసెఫ్ గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నియమితురాలైంది. అసోం రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రచారకర్తగా ప్రియాంక చోప్రాను నియమించింది. మాధురీ దీక్షిత్: తల్లిపాల విశిష్టతను తెలిపే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ (మా) ప్రచారకర్తగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు. ఠి పి.వి.సింధు: 2016, ఆగస్టులో బ్రెజిల్లో రియో డి జనీరో నగరంలో జరిగిన వేసవి ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ సింగిల్స్లో రజత పతకం సాధించింది. దీంతో ఒలింపిక్ రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా పి.వి.సింధు గుర్తింపు పొందింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య 2016, డిసెంబర్లో ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పి.వి.సింధుకు ప్రదానం చేసింది. వైజాగ్ స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఠి సాక్షి మాలిక్: హరియాణాకు చెందిన సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్లో రెజ్లింగ్లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఈమెను హరియాణా ప్రభుత్వం ‘బేటీ బచావ్, బేటీ పడావ్’ కార్యక్రమ ప్రచారకర్తగా, రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ రెజ్లింగ్ డైరెక్టర్గా నియమించింది. ఠి దీపా కర్మాకర్: త్రిపురకు చెందిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా జిమ్మాస్ట్గా చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్ జిమ్నాస్టిక్స్లో రియో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచింది. 2017లో పద్మశ్రీ అవార్డు లభించింది. దీపా మాలిక్: పారాలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ దీపా మాలిక్. 2016, సెప్టెంబర్లో రియో పారాలింపిక్స్లో షాట్పుట్లో రజత పతకం సాధించింది. ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. స్మృతి మంధన మహారాష్ట్రకు చెందిన మహిళా క్రికెటర్. 2016 ఐసీసీ ఉమెన్స్ టీం ఆఫ్ ది ఇయర్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రికెటర్. -
మిథాలీ ఒంటరి పోరాటం
బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ ట్వంటీ 20టోర్నీలో భాగంగా పాకిస్తాన్ తో ఇక్కడ ఆదివారం జరిగిన తుది పోరులో భారత ఓపెనర్ మిథాలీ రాజ్( 73 నాటౌట్;65 బంతుల్లో 7 ఫోర్లు1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. మిగతా భారత క్రీడాకారిణులు విఫలమైనా మిథాలీ చివరి వరకూ క్రీజ్లో నిలబడింది. దాంతో భారత్ జట్టు 122 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించకల్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే మందనా(6)వికెట్ ను నష్టపోయింది. అనంతరం మేఘనా(9), వేదా కృష్ణమూర్తి(2), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5)లు ఘోరంగా విఫలమయ్యారు. కాగా, మిథాలీకి జులాన్ గోస్వామి(17) కొద్దిపాటి సహకారం అందించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. పాక్ మహిళల్లో ఆనమ్ అమిన్ రెండు వికెట్లు తీయగా, సానా మిర్, సదియా యూసఫ్లకు తలో వికెట్ దక్కింది. -
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న తుది పోరులో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ లీగ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్.. అదే ఫలితాన్ని ఇక్కడ కూడా పునరావృతం చేయాలని భావిస్తోంది. మరొకవైపు భారత్ను కంగుతినిపించాలని పాక్ యోచిస్తోంది. -
21 పరుగులకే కూల్చేశారు..
బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ అద్బుత విజయాన్ని సాధించింది. శుక్రవారం నేపాల్ తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 99 పరుగుల తేడాతో గెలుపొందింది. నేపాల్ను 21 పరుగులకే కూల్చేసిన భారత్ సంచలన విజయం సొంతం చేసుకుంది. ఇప్పటికే వరుస నాలుగు విజయాలతో ఫైనల్ కు చేరిన భారత్.. అదే జోరును నేటి నేపాల్తో మ్యాచ్లో కూడా కొనసాగించింది. నేపాల్ స్కోరు బోర్డులో ఎక్సట్రా పరుగులకు వచ్చిన ఏడు పరుగులకే ఆ జట్టు అత్యధిక స్కోరు అంటే మన వాళ్లు ఏ రకంగా చెలరేగిపోయారు అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత సరితా మాగర్(6)దే నేపాల్ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. మొత్తం జట్టు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో నేపాల్ కు ఘోర ఓటమి తప్పలేదు.పూనమ్ పాండే మూడు వికెట్లు తీయగా, మేఘనా, అనుజా పటేల్లు తలో రెండు వికెట్లు సాధించారు.శిఖా పాండే,జోషి,ఏక్తా బిస్త్లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. వెల్లాస్వామి వనితా(21), అనుజ్ పటేల్(16), పార్వీన్(13), శిఖా పాండే(39 నాటౌట్),హర్మన్ ప్రీత్ కౌర్(14 నాటౌట్)లు భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలు పంచుకున్నారు. ఈ టోర్నీలో ఇది భారత్ కు ఐదో విజయం. -
ఎదురులేని భారత్
బ్యాంకాక్:మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ జోరు కొనసాగుతోంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక మహిళల్ని 69 పరుగులకే కట్టడి చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ మిథాలీ రాజ్(62) హాఫ్ సెంచరీ సాధించగా,మందనా(21), వేదా కృష్ణమూర్తి(21)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం 122 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన లంక మహిళలు పోరాడకుండానే చేతులెత్తేశారు. దిలానీ మండోదర(20), ప్రశాదనీ వీరక్కోడి(14)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా క్రీడాకారిణులంతా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. భారత మహిళల్లలో ఏక్తా బిస్త్,ప్రీతి బోస్లు చెరో మూడు వికెట్లతో లంకను కట్టడి చేయగా,జులాన్ గోస్వామి,అనుజా పటేల్, పూనమ్ యాదవ్ లకు తలో వికెట్ దక్కింది. ఈ తాజా మ్యాచ్లో విజయంతో భారత్ వరుసగా నాల్గో గెలుపును సొంతం చేసుకుంది. అంతకుముందు బంగ్లాదేశ్, థాయ్ లాండ్, పాకిస్తాన్లపై భారత్ వరుసగా విజయాల్ని సాధించిన సంగతి తెలిసిందే. -
పాక్ పై భారత్ విజయం
బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ ట్వంటీ 20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు జైతయాత్ర కొనసాగుతోంది. మంగళవారం ఇక్కడ పాకిస్తాన్తో జరిగిన టీ 20 మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి హ్యాట్రిక్ కొట్టింది. పాక్ విసిరిన 98 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. భారత క్రీడాకారిణుల్లో ఓపెనర్లు మిథాలీ రాజ్(36), మందనా(14)లు చక్కటి ఆరంభాన్నిచ్చారు.అనంతరం భారత తడబడినా, మిగతా పనిని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(26 నాటౌట్) పూర్తి చేసి భారత్ కు విజయాన్ని అందించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అబిది(37 నాటౌట్) పాకిస్తాన్ జట్టులో టాప్ స్కోరర్.మరో క్రీడాకారిణి అయేషా జాఫర్(28) ఆకట్టుకుంది. భారత మహిళల్లో ఏక్తా బిస్త్ మూడు వికెట్లు సాధించగా, అనుజా పటేల్, హర్మన్ ప్రీత్లకు తలో రెండు వికెట్లు దక్కాయి.గత రెండు మ్యాచ్ల్లో థాయ్ లాండ్, బంగ్లాదేశ్లపై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
54 పరుగులకే కూల్చేశారు..
బ్యాంకాక్: ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఆరంభపు ట్వంటీ 20 మ్యాచ్లో భారత మహిళలు చెలరేగిపోయారు. బంగ్లాదేశ్ మహిళల్ని 54 పరుగులకే కూల్చేసి 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.భారత క్రీడాకారిణుల్లో మిథాలీ రాజ్(49) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోగా, స్మృతీ మందనా(41) ఆకట్టుకుంది. ఈ జోడి తొలి వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత్ ను పటిష్ట స్థితికి తీసుకెళ్లింది. కాగా, ఆ తరువాత హర్మన్ ప్రీత్ కౌర్(19) మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరుకే పరిమితమైంది. అయితే ఆపై 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 13 పరుగుకే మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది.కాగా, సల్మా ఖాతున్(17), షాలియా షర్మిన్(18) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో బంగ్లాదేశ్ 50 పరుగుల మార్కును దాటింది. వీరిద్దరూ అవుటైన తరువాత బంగ్లా కథ మళ్లీ మొదటికొచ్చింది. కనీసం క్రీజ్లో నిలుచునే ప్రయత్నం చేయకుండానే బంగ్లా క్రీడాకారిణులు క్యూకట్టేశారు. భారత మహిళల్లో పూనమ్ యాదవ్ మూడు వికెట్లు, గోస్వామి, అనుజా పాటిల్ తలో రెండు వికెట్లు సాధించారు. మన్షీ జోషి, ఏక్తా బిస్త్లకు చెరో వికెట్ దక్కింది. -
భారత్ వైట్వాష్
మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడు ట్వంటీల సిరీస్లో భారత్ వైట్వాష్ అయ్యింది. మంగళవారం ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మూడో టీ 20లో భారత మహిళలు 15 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. దాంతో మూడు టీ 20ల సిరీస్ను భారత్ 0-3 తేడాతో విండీస్కు అప్పగించింది. విండీస్ విసిరిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత మహిళలు చతికిలబడ్డారు.భారత్ 20.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి పరాజయం చెందింది. భారత్ ఆదిలోనే ఓపెనర్ వెల్లా వనిత వికెట్ ను స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే కోల్పోయింది.అనంతరం ఫస్ట్ డౌన్ క్రీడాకారిణి మందనా(6), మేఘనా సింగ్(19)లు కూడా నిష్ర్కమించడంతో భారత్ 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తరుణంలో వేదా కృష్ణమూర్తి(31 నాటౌట్),హర్మన్ ప్రీత్ కౌర్(60 నాటౌట్)లు పోరాడినా భారత్ను గెలిపించలేకపోయారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్లు హేలే మాథ్యూస్(47), స్టెఫానీ టేలర్(44) మంచి ఆరంభాన్నిచ్చారు.తొలి వికెట్ కు 61పరుగులు భాగస్వామ్యం చేసి విండీస్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.అంతకుముందు జరిగిన వన్డే సిరీస్లో భారత్ 3-0 తో విండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. -
సిరీస్ కోల్పోయిన భారత్
మూలపాడు(విజయవాడ):మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన రెండో మ్యాచ్లోనూ భారత మహిళలు పరాజయం చెంది సిరీస్ను కోల్పోయారు. విండీస్ విసిరిన 138 పరుగుల లక్ష్యానికి ఛేదించే క్రమంలో భారత మహిళలు 18.1 ఓవర్లలో 106 పరుగులకే పరిమితమై ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఇంకా మ్యాచ్ ఉండగానే సిరీస్ ను చేజార్చుకుంది. భారత జట్టు లో హర్మన్ ప్రీత్ కౌర్(43),దీప్తి శర్మ(24) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ను హర్మన్ ప్రీత్ ఆదుకునే ప్రయత్నం చేసే చేసింది. అయితే మిగతా క్రీడాకారిణులు నుంచి సహకారం లభించలేదు. ఎనిమిది మంది భారత క్రీడాకారిణులు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో భారత్ ఓటమి చెందింది. విండీస్ బౌలర్లలో డాటిన్, అనీసాలు తలో మూడు వికెట్లు తీసి భారత జట్టును కట్టడి చేయగా, మాథ్యూస్ కు రెండు వికెట్లు లభించాయి.అంగ్విల్లెరియా,క్వింటైన్లకు చెరో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. విండీస్ క్రీడాకారిణుల్లో స్టెఫానీ టేలర్(47), డాటిన్(35),అంగ్వెల్లిరియా(21), మాథ్యూస్(27)లు రాణించి ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సాధించి పెట్టారు. తొలి ట్వంటీ 20 ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
తొలి టీ 20లో భారత్ ఓటమి
మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ 20లో భారత మహిళలు ఓటమి పాలయ్యారు. భారత విసిరిన 151 పరుగుల లక్ష్యాన్నివిండీస్ ఐదు వికెట్లతో తేడాతో ఛేదించింది. విండీస్ కెప్టెన్ స్టెఫనీ టేలర్(90;51 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద మాథ్యూస్(18) వికెట్ ను కోల్పోయినా, టేలర్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో అలరించింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ సాధించిన టేలర్.. విండీస్ విజయాన్ని దాదాపు ఖరారు చేసిన తరువాత పెవిలియన్ చేరింది. ఇక ఆ తరువాత విండీస్ వికెట్లు కోల్పోయినప్పటికీ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేశారు. వేదా కృష్ణమూర్తి(50),హర్మన్ ప్రీత్ కౌర్(68 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు సాధించారు. -
భారతీయ మహిళలు ఎంత పనిచేస్తారో తెలుసా?
పని చేయడంలో మగవాళ్ల కంటే మగువలు ముందుంటారని పరిశోధకులు చెబుతున్నారు. రోజు మొత్తమ్మీద మగవాళ్ల కంటే ఆడాళ్లే ఎక్కువ సేపు పనిచేస్తారట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సగటున ఏడాదికి మహిళలు 39 రోజులు ఎక్కువ పనిచేస్తారు. అదే భారతదేశంలో అయితే 50 రోజులు ఎక్కువ పనిచేస్తారని అంటున్నారు. సగటున పురుషుల కంటే మహిళలు 50 నిమిషాలు ఎక్కువగా పనిచేస్తారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక తెలిపింది. ప్రపంచంలో కేవలం ఆరు దేశాలలో మాత్రమే మహిళల కంటే పురుషులు ఎక్కువ గంటలు పనిచేస్తారట. అయితే వీటిలో మూడు దేశాల్లో తల్లిదండ్రులకు ఇచ్చే సెలవులను పురుషులు, మహిళలు సమానంగా పంచుకోవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఉద్యోగానికి వెళ్తే, మరొకరు పిల్లల సంరక్షణ బాధ్యతను చూసుకుంటారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో డేటా ఎనలిస్టుగా పనిచేస్తున్న వెసెలినా రచేవా చెప్పారు. మహిళల కంటే పురుషులకు 34 శాతం వరకు ఎక్కువ జీతాలున్నా, మహిళలే ఎక్కువ సేపు పనిచేస్తున్నారంటున్నారు. చాలావరకు ఇంటి పని, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ లాంటి పనులు చేస్తున్నా, వాటికి జీతభత్యాలు ఏమీ ఉండవని చెప్పారు. దీంతో కలిపి చూసుకుంటేనే ఏడాది మొత్తమ్మీద పురుషుల కంటే ఎక్కువసేపు మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. భారతదేశం, పోర్చుగల్, ఈస్టోనియా దేశాల్లో మహిళలు ఏడాది మొత్తమ్మీద 50 రోజులు ఎక్కువ పనిచేస్తున్నారన్నారు. -
‘ఆ మహిళల మైండ్సెట్ మారాలి’
ముంబై: నగరంలోని హజీ అలీ దర్గాలోకి వెళ్లి సూఫీ ముస్లిం గురువు సమాధిని సందర్శించుకునేందుకు మహిళలకు కూడా హక్కుందని ముంబై హైకోర్టు శుక్రవారం ఉదయం ఇచ్చిన తీర్పు పట్ల మహిళల స్పందనలు భిన్నంగా ఉన్నాయి. ఇతర మతాల మహిళలు దీన్ని ఎక్కువగా హర్షిస్తూ వారు దీన్ని మహిళల విజయంగా పేర్కొంటుండగా, ముస్లిం మహిళల్లోనే ఎక్కువ మంది భిన్నంగా స్పందిస్తున్నారు. కోర్టు తీర్పుతో తమకు సంబంధం లేదని, తాము మాత్రం గర్భగుడి, సూఫీ సమాధి వద్దకు వెళ్లమని, ఎప్పటిలాగే దూరం నుంచి దర్శించుకొని పోతామని చెబుతున్నారు. 600 సంవత్సరాల క్రితానికి చెందిన సూఫీ గురువు సయ్యద్ పీర్ హజీ అలీ షా బుఖారి సమాధిని దర్శించుకునేందుకు 2011 సంవత్సరం వరకు దర్గా నిర్వాహకులు మహిళలను లోపలికి అనుమతించారు. అప్పటి వరకు అనుమతించిన వారు ఎందుకు హఠాత్తుగా మహిళలపై నిషేధం విధించారు? అప్పటి వరకు ఎలాంటి సందేహం లేకుండా సూఫీ సమాధిని సందర్శించుకున్న ముస్లిం మహిళలు ఇప్పుడు ఎందుకు సమాధి వద్దకు వెళ్లడానికి సందేహిస్తున్నారు? వారి వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? ఇప్పుడైనా మహిళల మైండ్సెట్ మారాలని మహిళల నిషేధాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ‘కోర్టు తీర్పు ఆసక్తిదాయకంగానే ఉంది. ఇతర మహిళలు దర్గా లోపలికి వెళితే వెళ్లనీయండి. ముస్లిం మహిళలు లోపలికి వెళ్లకుండా దూరం నుంచే సమాధిని సందర్శించుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం’ అని శుక్రవారం దర్గాను సందర్శించిన 30 ఏళ్ల ఇల్లాలు నసీం బానో మీడియాతో వ్యాఖ్యానించారు. ‘కోర్టు తీర్పు ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు. మేము దర్గా లోపలికి వెళ్లం. అది మగవాళ్ల హక్కు మాత్రమే’ అని షరీఫ్ పఠాన్ అనే మరో మహిళ వ్యాఖ్యానించారు. అడవాళ్లకు రుతుస్రావం లాంటి సమస్యలుంటాయి కనుక దర్గా లోపలికి వెళ్లకపోవడమే మంచిదని పఠాన్ వ్యాఖ్యానించారు. మహిళలకు ఉందే సమస్యల కారణంగానే కేరళలోని శబరిమళ ఆలయంలోకి, మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించడం లేదనే విషయం తెల్సిందే. ముస్లిం ఏతర మహిళలు మాత్రం ఇది మహిళల గొప్ప విజయమని అభివర్ణిస్తున్నారు. ముంబై హైకోర్టు తీర్పు వెలువడిన రోజునే తాను దర్గాకు రావడం తన అదృష్టమని ఢిల్లీ నుంచి వచ్చిన భక్తురాలు మృణాలిని మెహతా లాంటి వారు వ్యాఖ్యానించారు. అయితే తీర్పు వెలువడిన వెంటనే దర్గాలోని సమాధిని సందర్శించే అవకాశం మాత్రం ఇంకా మహిళలకు దక్కలేదు. దర్గా నిర్వాహకులు తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలుపై హైకోర్టు స్టే మంజూరు చేసిన విషయం తెల్సిందే. -
భారత్లో పడిపోతున్న మహిళా కార్మిక శక్తి
న్యూఢిల్లీ: ఆకాశంలో సగం మాదే అని సగర్వంగా చెప్పుకుంటున్న భారత మహిళలు ఉన్నత విద్యలో ఇంతకుముందు కన్నా ఎంతో ముందుకు దూసుకుపోతున్న కార్మిక శక్తిలో మాత్రం ఇంతకుముందు కన్నా వెనకబడి పోతున్నారు. ఉన్నత విద్యలో మహిళలు 2007లో 39 శాతం ఉండగా, అది 2014 నాటికి 46 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1999లో భారత్లో మహిళల కార్మిక శక్తి 34 శాతం ఉండగా, 2014 నాటికి అది 27 శాతానికి పడిపోయింది. మహిళా కార్మికుల్లో ప్రపంచ సగటు 50 శాతం ఉండగా, భారత్లో మాత్రం 27 శాతానికి పడిపోవడం విచారకర పరిణామం. తూర్పు ఆసియా దేశాల్లో ఈ సగటు 63 శాతం ఉండడం గమనార్హం. ఉన్నత విద్యలో మహిళల శాతం ఏటేటా పెరుగుతున్నప్పటికీ కార్మిక శక్తిలో మాత్రం ఎందుకు వెనకబడి పోతున్నారు. మహిళలకు ఉద్యోగావకాశాలు లేకనా? వర్క్ ప్లేస్లో సరైన వసతులు లేకనా? పలు రంగాల్లో మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పటికీ, ఆటోమొబైల్, రవాణా వ్యవస్థలతోపాటు, రక్షణ రంగంలో కూడా మహిళలకు అవకాశాలు పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో ఎందుకు మహిళలు కార్మిక శక్తిలో వెనకబడుతున్నారన్నది ప్రధాన ప్రశ్న. మహిళలు పెళ్లి చేసుకొని ఇంటిపట్టునే ఉండాలనే సామాజిక ధోరణి ఇప్పటికీ కొనసాగడమే అందుకు కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉద్యోగం పురుష లక్షణం నానుడి కనుమరగయ్యేంత వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వారంటున్నారు. పదవ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు విద్యా సంస్థల్లోకి యువతుల ప్రవేశం యువకులకన్నా ఎక్కువగా ఉంటునప్పటికీ ఉన్నత విద్యలో, ముఖ్యంగా ఎంఫిల్, పీహెచ్డీలలో మగవాళ్లతో పోలిస్తే వారు ఇంకా వెనకబడే ఉన్నారు. దానికి కారణం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని వర్గాల ప్రజల్లో యుక్త వయస్సులోనే ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయడం కారణమని తెలుస్తోంది. అయినప్పటికీ దేశంలో సగటు మహిళలను తీసుకుంటే ఉన్నత విద్యలో వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఉన్నత విద్యలో 2012-13 సంవత్సరంలో మహిళలు 20.8 శాతం ఉండగా, మహిళల సంఖ్య 2014-15 సంవత్సరం నాటికి 23.6 శాతానికి పెరిగింది. అయితే ఇది గ్లోబల్ సగటు 27 శాతం కన్నా తక్కువే. ఈ సగటు చైనాలో 26 శాతం ఉండగా, బ్రెజిల్లో 36 శాతం ఉంది. దేశంలో యువకులు సరాసరి సగటున 23.5 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటోండగా, యువతులు సరాసరి సగటున 19.2 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే మహిళల్లో కూడా పెళ్లి చేసుకునే వయస్సు పెరిగినప్పటికీ వారి కార్మిక శక్తి మాత్రం తగ్గుతోంది. భారత ఆర్థిక వృద్ధి రేటు పెరిగినప్పుడల్లా మహిళా కార్మిక శక్తి పడిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. మహిళల్లో విద్యా స్థాయి పెరగడంతోపాటు మహిళాకార్మిక శక్తికి విలువ పెరిగినప్పుడే భారత్లో మహిళా కార్మిక శక్తి పెరుగుతోందని సూత్రీకరించింది. -
టాప్-100 మహిళల్లోనలుగురు భారతీయులు
♦ ప్రపంచ జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్ ♦ అరుంధతీ భట్టాచార్యకు 25వ స్థానం ♦ చందా కొచర్, కిరణ్ షా, శోభనా భర్తియాకు చోటు న్యూయార్క్: ప్రపంచంలోని తొలి వంద మంది శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ఈ జాబితాలో... స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య 25వ స్థానంలో నిలవటం విశేషం. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ 40వ స్థానంలోను... బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 77వ స్థానంలోను, హెచ్టీ మీడియా అధిపతి శోభనా భర్తియా 93వ స్థానంలోను నిలిచారు. హిందుస్థాన్ టైమ్స్ను ప్రచురించే హెచ్టీ మీడియాకు శోభన చైర్పర్సన్, ఈడీగా వ్యవహరిస్తున్నారు. జాబితాలో మొట్టమొదటి స్థానంలో జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ ఉండగా ఆ తరువాతి రెండు స్థానాల్లో వరసగా అమెరికాకు చెందిన హిల్లరీ క్లింటన్, ఫెడరల్ రిజర్స్ చీఫ్ జానెట్ యెలెన్ నిలిచారు. ఈ జాబితాలో ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్బర్గ్ (7వ స్థానం), మిషెల్ ఒబామా (13), పెప్సికో సీఈవో ఇంద్రా నూయి (14) ఉన్నారు. -
డేటింగ్కు రారు.. షేక్ హ్యాండ్ ఇవ్వరు
ముంబయి: 'ఇది 2016.. కానీ ఇండియాలో అమ్మాయిలు ఇప్పటికీ సాధారణంగా చేతులు కలపరు(షేక్ హ్యాండ్స్). ఇక డేటింగ్ అనే విషయం ఇండియాలో అంత సామాన్య విషయం కాదు. ఇక్కడి అమ్మాయిలు చాలా సాంప్రదాయ బద్ధంగా ఉంటారు. సినిమాకొస్తావా అని అడిగితే రాలేమని చాలా గౌరవ ప్రదంగా చెప్తారు' ఈ విషయాలన్నీ కూడా తాజాగా అంతర్జాతీయ పర్యాటకులకు ఇచ్చే హ్యాండ్ బుక్లో పొందుపరిచారు. 1999 నుంచి ఈ పుస్తకం వెలువడుతోంది. విదేశాల నుంచి వచ్చి కొద్ది రోజులపాటు ఉండిపోయే పర్యాటకులకు గైడ్ లైన్స్గా ఈ పుస్తకాన్ని అందిస్తారు. ఆ పుస్తకాన్ని తిరిగి ముద్రించే క్రమంలో భాగంగా తొమ్మిదో ఎడిషన్లో పైన పేర్కొన్న అంశాలను పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ విదేశీ పర్యాటకుల కోసం తాజాగా ఈ అంశాలను పేర్కొంటూ ట్రావెలర్ గైడ్ గా రూపొందించింది. ఇక్కడి అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో అనే విషయాలు స్పష్టంగా ఇందులో తెలిపింది. -
పెళ్లి చేసుకుని.. పౌరసత్వం తెచ్చుకున్నారు
నేపాల్ నూతన రాజ్యంగం అమలైన నాటి నుంచి ఇప్పటివరకు 3,672 మంది భారతీయ స్త్రీలు నేపాలీ వ్యక్తులను వివాహం చేసుకున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వీరందరికీ నేపాల్ పౌరులుగా సభ్యత్వం లభించినట్లు మంగళవారం తెలిపింది. రాజ్యాంగం అమలుకాక ముందు మాదేశీ ఆందోళనల వల్ల నేపాలీలను వివాహం చేసేకున్న భారతీయులకు ఆ దేశ పౌరసత్వం ఇవ్వడం పెద్ద సమస్యగా మారింది. దీంతో గతేడాది సెప్టెంబర్ 7న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో నేపాలీ పౌరసత్వం కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న భారతీయ యువతులకు నూతన రాజ్యంగం వల్ల సాధ్యం కాకపోవచ్చని ఆమె అన్నారు. దీనిపై స్పందించిన నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి బినోద్ కేసీ నేపాలీని వివాహం చేసుకున్న ప్రతి భారతీయ మహిళకు దేశ పౌరసత్వం లభిస్తుందని తెలిపారు. మాదేశీలు ఎక్కువగా ఉన్న 20 జిల్లాల్లోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉందని వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 11(6) ప్రకారం నేపాలీని వివాహం చేసుకున్న ఏ విదేశీ మహిళకైనా దేశ పౌరసత్వం స్వీకరించే హక్కు ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం నేపాల్ పార్లమెంటులో 12 విదేశీయులు నేపాల్ పౌరసత్వాన్ని తీసుకున్నవారేనని అన్నారు. సరైన వివరాలు జతచేయకుండా నేపాల్ పౌరసత్వాన్ని స్వీకరించిన ముగ్గురు భారతీయుల పౌరసత్వాలను నేపాల్ రద్దు చేసింది. -
భారత్ క్లీన్స్వీప్
రాంచీ: మరోసారి ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత మహిళలు.. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేశారు. మూడు వన్డేల సిరీస్లోభాగంగా శుక్రవారం ఇక్కడ ఇరు జట్ల మధ్యజరిగిన చివరి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా భారత్ సిరీస్ను 3-0తో వైట్ వాష్ చేసింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక మహిళలు బ్యాటింగ్ చేసి 38.2 ఓవర్లలో 112 పరుగులకే చాపచుట్టేశారు. శ్రీలంక మహిళల్లో యశోదా మెండిస్(15),ప్రసాదని వీరక్కోడి(19), శశకళా సిరివర్ధనే(14) లు తీవ్రంగా నిరాశపరిచారు. శ్రీలంక తరపున సురంగికా చేసిన 23 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో వేదా కృష్ణమూర్తి(61నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా, దీప్తి శర్మ(28) ఫర్వాలేదనిపించడంతో జట్టు స్కోరు ముందుకు కదిలింది. ఈ జోడీ మూడో వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ 29.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి మ్యాచ్ లో భారత మహిళలు 107 పరుగులతో విజయం సాధించగా, రెండో మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. -
చివరి వన్డే భారత మహిళలదే
హోబార్ట్:మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన చివరి మ్యాచ్ లో భారత మహిళలు సత్తా చాటారు. భారత మహిళలు 232 పరుగుల లక్ష్యాన్ని 47.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఛేదించి క్లీన్ స్వీప్ చేయాలనుకున్న ఆసీస్ను అడ్డుకున్నారు. భారత ఓపెనర్ మందనా(55) హాఫ్ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ వేదా కృష్ణమూర్తి(12) నిరాశపరిచింది. ఆ తరువాత కెప్టెన్ మిథాలీ రాజ్(89) బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరు బోర్డు ముందుకు కదిలింది. రెండో వికెట్ కు 58 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మిథాలీ.. మూడో వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంలో సహకరించింది. అయితే భారత స్కోరు 196 పరుగుల వద్ద ఉండగా మిథాలీ రాజ్ రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరింది. అప్పటికి భారత్ విజయానికి 46 పరుగులు అవసరం కాగా, ఎనిమిదికిపైగా ఓవర్లున్నాయి. ఆ తరుణంలో పూనమ్ రౌత్(24 నాటౌట్), శిఖా పాండే(17)లు తమ వంతు సహకారం అందించడంతో భారత్ ఇంకా మూడు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆసీస్ మహిళలు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 231 పరుగులు నమోదు చేశారు. -
'భారతీయ మహిళల కళ్లు అందంగా ఉంటాయి'
న్యూఢిల్లీ: భారతీయ మహిళల కళ్లు ఎంతో అందంగా, చక్కని ఆకృతిలో ఉంటాయని బాలీవుడ్ నటి అతియా శెట్టి చెప్పింది. కళ్లు పెద్దవిగా, మంచి ఆకారంలో ఉంటాయని అంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతియా శెట్టి తన సౌందర్య రహస్యాన్ని వెల్లడించింది. షూటింగ్ లేనప్పుడు తాను మేకప్ ఎక్కువగా వేసుకోనని చెప్పింది. చాలా తక్కువగా మేకప్ సామాగ్రిని వాడుతానని అంది. ఇప్పటికీ ప్రతి ఆదివారం బామ్మ తన తలకు కొబ్బరినూనె రాస్తుందని తెలిపింది. తన శిరోజాల రహస్యమిదేనని చెప్పింది. అతియా నటించిన బాలీవుడ్ చిత్రం హీరో గత సెప్టెంబర్లో విడుదలైంది. -
బాడీబిల్డర్ శ్వేత కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: ఆసియా బాడీబిల్డింగ్ చాంపియన్షిప్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాడీబిల్డర్గా శ్వేతా రాథోడ్ చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన 25 ఏళ్ల శ్వేత ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఈ పోటీల్లో ఫిట్నెస్ ఫిజిక్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. తద్వారా వచ్చే నెలలో థాయ్లాండ్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్కు అర్హత సాధించింది. ఇంజినీరింగ్ చదివిన శ్వేత ముంబైలో ఫిట్నెస్ ఫరెవర్ పేరుతో అకాడమీని నిర్వహిస్తోంది. గతేడాది ముంబైలోనే జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ ఫిజిక్ చాంపియన్షిప్లో శ్వేతకు కాంస్య పతకం లభించింది. -
ఫోర్బ్స్ శక్తివంత మహిళా వ్యాపారవేత్తల్లో ఆరుగురు భారతీయులు
న్యూయార్క్: ఫోర్బ్స్ 50 ‘శక్తివంతమైన వ్యాపార మహిళ’ జాబితాలో ఆరు మంది భారతీయ మహిళలు చోటుద క్కించుకున్నారు. దీనిలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరితోపాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ వ్యవస్థాపకులు మజుందార్ షా, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా ఎండీ ఆషా సంగ్వాన్లు జాబితాలో స్థానం సంపాదించారు. ఒక ఏడాది కాలంలో వ్యాపార రంగంలో మహిళలు సాధించిన విజయాలను ఆధారంగా చేసుకొని ఈ జాబితాను రూపొందించామని ఫోర్బ్స్ తెలిపింది. శక్తివంత మహిళా వారసుల్లో ఇషా, రాధిక రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, వీఐపీ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దిలీప్ పిరమల్ కుమార్తె రాధిక పిరమల్ ఫోర్బ్స్ 12 ‘శక్తివంతమైన వ్యాపార మహిళా వారసులు’ జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఇషా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్లలో డెరైక్టర్గా ఉన్నారు. రాధిక పిరమల్ వీఐపీ ఇండస్ట్రీస్ (లగేజ్) ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె తన కంపెనీ ఉత్పత్తుల విక్రయాల కోసం బాలీవుడ్ స్టార్లను అంబాసిడర్లుగా నియమించుకోవటం ప్రారంభించించారు. -
'పొగ'రాణులు పెరుగుతున్నారు!
అన్ని రంగాల్లో ముందుకెళుతున్న పడతులు ధూమపానంలోనూ దూసుకెళ్తున్నారు. అవలీలగా సిగరెట్లు ఊదిపడేస్తున్నారు. పొగతాగడంలో భారత మహిళలు అగ్రదేశాలతో పోటీ పడుతున్నారు. ధూమపానంలో భారత వనితలు చైనాను వెనక్కు నెట్టి అమెరికా తర్వాత స్థానంలో నిలిచారు. గత మూడు దశాబ్దాల్లో ఇండియాలో 'పొగ'రాణుల సంఖ్య రెండింతలు పైగా పెరిగిందని ఓ అంతర్జాతీయ పరిశీలనలో వెల్లడైంది. భారతదేశంలో 1.27 కోట్ల మంది ధూమపానం చేసే మహిళలున్నారని తేలింది. ధూమపాన నివారణ చర్యలతో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, రష్యా వుమెన్ స్మోకర్ల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి. భారత్ లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అత్యధిక మరణాలకు కారణవుతున్న వాటిలో మూడో స్థానంలో ధూమపానాన్ని అరికట్టడంలో పాలకులు విఫలమవడం ఈ పరిస్థితికి కారణం. ధూమపానంతో దేశంలో ఏడాదికి దాదాపు పది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని గణంకాలు వెల్లడిస్తున్నా పాలకులు కళ్లు తెరవకపోవడం శోచనీయం. -
ప్రవాస పెళ్లికొడుకులూ... వింటున్నారా?
పొరుగు దేశాలకు వెళ్లగానే స్వదేశ సాంప్రదాయాలు, సంస్కృతులను తూలనాడడం కొంతమందికి అలవాటుగా మారింది. అలాంటి వారు ఇకనుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా పెళ్లికాని యువకులు. స్వదేశీ సాంప్రదాయాలు, విలువలు గౌరవించని వాని కళ్యాణ్ యోగం దూరమయ్యే ముప్పు పొంచివుంది. విలువలకు, వివాహానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా. సాంప్రదాయాల పట్ల అమర్యాద ప్రవర్తించే యువకులను పెళ్లాడేందుకు భారత యువతులు ఇష్టపడడం లేదు(ట). భారతదేశ విలువలు పాటించని ఎన్నారై యువకులను పెళ్లాండేందుకు పుణ్యధరిత్రి పడతులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. పరాయి దేశంలో పైసలు దండిగా సంపాదిస్తున్నా- సొంత సంస్కృతి, సంప్రదాయాలను పట్టించుకోకుంటే అలాంటివారికి వరమాల వేయబోమని కరాకండీగా చెప్పారో సర్వేలో. షాదీ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో యువతులు ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. మన సాంప్రదాయాలను గౌరవించని వారిని వివాహం చేసుకోబోమని 51.7 శాతం మంది యువతులు సర్వేలో పేర్కొన్నారు. సొంతగడ్డను చిన్నచూపు చూసేవారిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని 33.5 శాతం మంది కుండబద్దలుకొట్టారు. తెచ్చిపెట్టుకున్న యాసతో వంకర్లు పోయే వారిని వివాహం చేసుకోబోమని 66.7 శాతం మంది స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పెళ్లికాని 5,200 మంది యువతులను ఆన్లైన్ లో సర్వే చేశారు. నిష్కళంక భాగస్వాములనే యువతులు ఇష్టపడుతున్నారని సర్వేలో స్పష్టమైంది. ప్రవాస పెళ్లికొడుకులూ... వింటున్నారా? -
సెయిలింగ్లో కొత్త చరిత్ర
ఆసియా క్రీడల్లో తొలిసారి భారత మహిళలు సెయిలింగ్లో పతకం నెగ్గి చరిత్ర సృష్టించారు. వర్ష గౌతమ్, ఐశ్వర్య నెదున్చెజియాన్ ద్వయం 29ఈఆర్ డింగీ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచారు. 16 ఏళ్ల వర్ష, 18 ఏళ్ల ఐశ్వర్య జోడీ 11వ రేసులో నెగ్గి, చివరి రేసులో రెండో స్థానాన్ని సంపాదించారు. ఓవరాల్గా 25.0 నెట్ పెనాల్టీ పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకొని కాంస్యాన్ని ఖాయం చేసుకున్నారు. నొప్పకావో పూన్పట్, నిచాపా వైవై (థాయ్లాండ్-19.0 నెట్ పాయింట్లు) స్వర్ణం... ప్రిస్కిల్లా, సెసిల్లా (సింగపూర్-21.0 నెట్ పాయింట్లు) రజతం సాధించారు. ఆప్టిమిస్ట్ ఏకవ్యక్తి డింగీ రేసులో 12 ఏళ్ల చిత్రేశ్ తాతా ఆరో స్థానంలో నిలిచాడు. -
అదిరిన గురి
25 మీటర్ల ఎయిర్ పిస్టల్లో భారత మహిళలకు కాంస్యం ఇంచియాన్: మిగతా విభాగాల్లో ఎలా ఉన్నా... ఏషియాడ్లో భారత షూటర్ల గురి మాత్రం అదురుతోంది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్లో రాహీ సార్నోబాత్, అనిసా సయ్యద్, హీనా సిద్ధూల బృందం ఓవరాల్గా 1729 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ర్యాపిడ్లో సూపర్ షాట్స్తో అలరించిన అనిసా 294/300 పాయింట్లు సాధించింది. ప్రిసిషన్ రౌండ్లో 283 పాయింట్లు రావడంతో ఓవరాల్గా 577 పాయింట్లు సాధించింది. సార్నోబాత్ ర్యాపిడ్ 298, ప్రిసిషన్లో 291 పాయింట్లతో 580 పాయింట్లు గెలిచింది. హీనా ర్యాపిడ్లో 281, ప్రిసిషన్లో 291 పాయింట్లతో 572 పాయింట్లు సాధించింది. ఈ విభాగంలో కొరియా (1748 పాయింట్లు), చైనా (1747 పాయింట్లు) స్వర్ణం, రజతం గెలుచుకున్నాయి. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రాహీ సార్నోబాత్ సెమీస్లో 15 పాయింట్లు సాధించి ఏడో స్థానంతో ఫైనల్స్కు దూరమైంది. అనిసా, హీనాలు నిరాశపర్చారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అయోనికా పాల్ (417.7), అపూర్వి చండిలా (413.8), రాజ్ చౌదురీ (407.6)లు ఓవరాల్గా 1239.1 పాయింట్లు సాధించి ఆరోస్థానంతో సంతృప్తిపడ్డారు. చైనా (1253.8 పాయింట్లు), ఇరాన్ (1245.9 పాయింట్లు) స్వర్ణం, రజతాలను దక్కించుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో అపూర్వి, రాజ్ చౌదురీ నిరాశపర్చినా అయోనిక ఫైనల్స్కు చేరుకుంది. కానీ తుది పోరులో ఆమె 101.9 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. -
జ్వాల జోడికి వాకోవర్
బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్ కోపెన్హాగెన్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత మహిళల డబుల్స్ జోడి గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ జంటతో తలపడాల్సిన హీతర్ ఆల్వర్-కేట్ రాబర్ట్షా (ఇంగ్లండ్) ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత ద్వయానికి వాకోవర్ లభించింది. రెండో రౌండ్లో జ్వాల-అశ్విని, చైనాకు చెందిన ఐదో సీడ్ కింగ్ టియాన్-యున్లీ జావోను ఎదుర్కొంటారు. గతంలో వీరితో తలపడిన ఆరు సార్లూ భారత జంట ఓటమిపాలైంది. మరో వైపు మిక్స్డ్ డబుల్స్లో మాత్రం భారత్కు చెందిన అశ్విని పొన్నప్ప-తరుణ్ కోన జోడి తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. ప్రపంచ 16వ ర్యాంక్ జంట అండర్స్ క్రిస్టియన్సెన్-జూలీ హౌమన్ (డెన్మార్క్) 21-16, 27-25తో అశ్విన్-తరుణ్పై విజయం సాధించింది. -
పొగరాణులు పెరిగిపోతున్నారు బాబోయ్!!
భారతీయుల్లో పొగతాగే అలవాట్లు క్రమంగా మారిపోతున్నాయి. క్లబ్బులు, పబ్బులు, కాఫీడేలు, సాంస్కృతిక కేంద్రాలు, బస్టాపులు.. ఇలా ఎక్కడ చూసినా ఉఫ్. ఉఫ్.. అంటూ పొగతాగే పొగరాణుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఓవైపు అబ్బాయిలు తమ జేబు బరువును, ఆరోగ్యాన్ని చూసుకుని కాస్తంత జాగ్రత్త పడుతుంటే.. అమ్మాయిలు మాత్రం అదేమీ లెక్కచేయకుండా పొలోమంటూ పొగ తాగేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్లనూ తాగిస్తున్నారు. దీంతో సంతానరాహిత్యం, కేన్సర్ లాంటి ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. 1980 నుంచి 2012 వరకు మొత్తం 187 దేశాల్లోని ప్రజల ధూమపాన అలవాట్లు, పోకడలను పరిశీలించిన అమెరికన్, బ్రిటిష్ వైద్య పత్రికలు ఈ మార్పును స్పష్టంగా గమనించాయి. భారతీయ పురుషుల్లో పొగ తాగేవారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోతే, మహిళల్లో మాత్రం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చుట్టలు, తంబాకు.. ఇలా ఏదో ఒకపేరుతో పొగతాగే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఇది బాగా కనిపిస్తుంటుంది. 1980 నాటికి మన దేశంలో దాదాపు 53 లక్షల మంది పొగరాణులుంటే, 2012 నాటికి ఆ సంఖ్య ఏకంగా 1.22 కోట్లకు చేరుకుంది. అంటే రెట్టింపునకు పైగా పెరిగిపోయిందన్న మాట. మొదట్లో సిగరెట్లు కాల్చేవాళ్లు రోజుకు నాలుగైదు మాత్రమే కాలుస్తారని, దానివల్ల వాళ్ల ఆరోగ్యంలో కూడా పెద్దగా తేడా కనపడదని.. అదే కొన్నాళ్ల తర్వాత మాత్రం సిగరెట్ల సంఖ్య పెరుగుతుందని .. దానివల్ల ఆడవాళ్లలో అయితే సంతానరాహిత్యం సమస్య చాలా ఎక్కువ అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికితోడు పొగతాగే అలవాటు వల్ల పలురకాల కేన్సర్ కేసులు కూడా భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో సిగరెట్ తయారీ సంస్థలపై విపరీతంగా కేసులు నమోదయ్యాయని, అందువల్ల అక్కడి కేసులను వదిలించుకుని బయటపడటం కంటే భారత్, చైనా లాంటి జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మహిళలకు పొగతాగే అలవాటు పెంచితే తమ అమ్మకాలు పెరుగుతాయని కుట్రపన్ని, సిగరెట్లు కాల్చడాన్ని ఒక సోషల్ స్టేటస్గా అవి మార్చేస్తున్నాయని సప్నా నంగియా అనే కేన్సర్ వైద్య నిపుణురాలు చెప్పారు. ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకుని, ఇప్పటికైనా పొగరాయుళ్లు, పొగరాణులు ఆ అలవాటును మానుకోవడం మంచిది. -
వివరం: స్ఫూర్తి శిఖరాలు
శిఖరం కన్న సంకల్పబలం ఎత్తైదని నిరూపించిన భారతీయ మహిళలు వీరంతా! బచేంద్రీపాల్ మొదలు... ఒంటికాలితో ఎవరెస్టును ఎక్కిన అరుణిమ సిన్హా వరకు ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. అందరిదీ ఒకే పట్టుదల. అందుకే వీరు స్ఫూర్తి శిఖరాలయ్యారు. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన శిఖరం ఏది? ప్రశ్న పూర్తయే లోపు ‘ఎవరెస్టు’ అనే సమాధానం వస్తుంది. 29,029 అడుగుల ఎత్తయిన హిమాలయ పర్వతాల్లో మహలాంగుర్ సెక్షన్లో ఉంది ఎవరెస్టు శిఖరం. దీనిని నేపాలీయులు ‘సాగర్మాత’ అనీ, టిబెట్ వాసులు చోమోలుంగ్మా అనీ పిలుచుకుంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నా... శిఖరం ఎప్పుడూ గొప్పదే. ఎవరికీ అందనంత ఎత్తులో ఉండడమే దాని గొప్పదనం. అయితే, ‘ఆ గొప్పదనమేంటో మేమూ చూస్తాం’ అంటూ ఎగబాకుతారు సాహసికులు. ఎవరెస్టును అధిరోహించిన సాహసికుల్లో... ఏడడుగులే కాదు, శిఖరయానం కూడా కలిసే అంటూ ఎవరెస్టునెక్కిన దంపతులు మరీజా, ఆమె భర్త యాండ్రెజ్ స్ట్రెమ్ఫెల్జ్... అరవైలలో ఒకసారి, డెబ్బైలలో మరోసారి ఎవరెస్టు ఎక్కిన రికార్డు నాది అంటూ టేమీ వాటనబుల్... ఇప్పటికి ఇరవైసార్లకు పైగా ఎక్కాను తెలుసా అంటూ అపా షెర్పా... ఇలా ప్రపంచదేశాల నుంచి లెక్కలేనంత మంది ఎవరెస్టును అధిరోహించి తమ కీర్తిని శిఖర స్థాయికి చేర్చుకున్నారు. ఈ అధిరోహణలో భారతీయుల స్థానం కూడా తక్కువేం కాదు. ఈ పరంపరకు తొలి అడుగు బచేంద్రిపాల్. ఆ తర్వాత తండోపతండాల్! ఆ మహిళల అడుగులే ఈవారం మన ‘వివరం’. బచేంద్రిపాల్: ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్. ఆమె 1984 మే నెల 23న ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు. బచేంద్రిపాల్ భారతీయ మహిళా పర్వతారోహకులకు స్ఫూర్తి ప్రదాత. ఆమె తర్వాత ఎవరెస్టును అధిరోహణకు పూనుకున్న ప్రతి పర్వతారోహకులూ ఒక్కసారైనా ఆమెను కలవాలనీ, సూచనలను తీసుకోవాలనీ, ఆమెతో ఫొటో తీసుకోవాలనీ ఉవ్విళ్లూరినవారే. బచేంద్రిపాల్ 1954 మే నెల 24వ తేదీన జన్మించారు. అంటే నిన్నటికి అరవై ఏళ్ల కిందట అన్నమాట. విశేషం ఏమిటంటే... ఆమె ఎవరెస్టును అధిరోహించింది 1984 మే నెలలోనే తన పుట్టినరోజుకు సరిగ్గా ఒక రోజు ముందే. అంటే ఆమెకు 30 ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె కీర్తి ఎవరెస్టు శిఖరానికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గడచిన ముప్ఫై ఏళ్లుగా ఆమె కీర్తి అలాగే శిఖరస్థాయిలో కొనసాగుతోంది. నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ద్వారా ఆమె చాలాకాలంగా పర్వతారోహణలో మహిళలకు (పురుషులకు కూడా) శిక్షణనిస్తున్నారు. టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్కు అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఈ రికార్డులకంటే ముందు ఆమె సాధించిన మరో రికార్డు కూడా ఉంది. నకురి గ్రామంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి అమ్మాయి బచేంద్రిపాల్. ఆ తర్వాత ఆమె సంస్కృతంలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె తొలిసారి పర్వతారోహణ చేసింది పన్నెండేళ్ల వయసులో. స్కూలు విద్యార్థులతోపాటు పిక్నిక్లో భాగంగా 13, 123 అడుగుల పర్వతాన్ని అధిరోహించారు. సంతోష్యాదవ్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండవ భారతీయ మహిళ సంతోష్ యాదవ్. ఆమె 1992, 1993లలో మే నెలలో ఎవరెస్టును అధిరోహించారు. అలా ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించారు. సంతోష్ యాదవ్1967 అక్టోబర్ 10న జన్మించారు. ఆమెది హర్యానా రాష్ట్రం, రెవారీ జిల్లాలో జోనియావాస్ గ్రామం. జైపూర్లోని మహారాణి కాలేజ్లో చదివారు. ఉత్తరకాశిలోని కస్తూర్బా హాస్టల్లో ఉంటూ ‘నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్’ సంస్థలో శిక్షణ పొందారు. ఆమె ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్షలకు చదువుతూనే పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. ఇరవై ఐదేళ్ల వయసులోనే ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రస్తుతం ఆమె ఇండో- టిబెట్ సరిహద్దు పోలీస్ అధికారి. ఆమె సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. కల్పనా దాస్: 2008, మే 21వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని చేరారు. అది ఆమెకు మూడవ ప్రయత్నం. ప్రతికూలమైన వాతావరణపరిస్థితులు, ఆరోగ్యం సహకరించకపోవడం వంటి కారణాల వల్ల ఈమె 2004, 2006లలో రెండుసార్లు విఫలమయ్యారు. మొదటిసారి 7,300 మీటర్లు, రెండవసారి 8, 048 మీటర్ల వరకు మాత్రమే వెళ్లగలిగారు. మూడవ ప్రయత్నానికి ముందు బచేంద్రిపాల్ను కలిసి సలహా తీసుకున్నట్లు ఆమె చెప్తారు. కల్పనాదాస్ 1966 జూలై 7వ తేదీన ఒరిస్సా రాష్ట్రం థేన్కానల్ జిల్లా సరియాపారా గ్రామంలో జన్మించారు. ఆమె వృత్తి రీత్యా న్యాయవాది. ఎవరెస్టును అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ ‘దేవుడి దయ వల్ల, మా కుటుంబ సభ్యుల ఆశీస్సుల వల్ల అత్యంత ఎత్తై శిఖరాన్ని అధిరోహించి రికార్డు సాధించగలిగాను. విఘ్నాలను అధిగమిస్తూ శిఖరాన్ని చేరడంతోపాటు అంతే క్షేమంగా వెనక్కు రాగలిగాను. ఆ శిఖరాన్ని మళ్లీ మళ్లీ అధిరోహించాలనుంది’’ అన్నారామె. ప్రస్తుతం ఆమె థేన్కానల్ పట్టణంలో నివసిస్తున్నారు. ప్రేమలతా అగర్వాల్: 2011, మే నెల 20వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఈ రికార్డుతోపాటు ఆమెకు ‘ఎవరెస్టును అధిరోహించిన భారతీయ మహిళల్లో పెద్ద వయస్కురాలిగా’ మరో రికార్డు కూడా ఉంది. ఎవరెస్టు ఎక్కేనాటికి ఆమె వయసు 45 ఏళ్లు. ఆమెకి ఇద్దరు కుమార్తెలు. ఆమె ఎవరెస్టు ఎక్కే నాటికే పెద్దమ్మాయికి వివాహమైంది కూడ. జార్ఖండ్కు చెందిన ప్రేమలత గృహిణి. ఆమె భర్త విమల్ అగర్వాల్ సీనియర్ పాత్రికేయులు. ఎవరెస్టు ఆరోహణకు ముందు ఆమె 40 రోజుల పాటు ఎడారిలో పర్యటించారు. థార్ డెజర్ట్ ఎక్స్పిడిషన్లో భాగంగా ఆమె గుజరాత్ లోని భుజ్ ప్రాంతం నుంచి పంజాబ్లోని అట్టారి (వాఘా బోర్డరు) వరకు ఒంటె మీద సవారీ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదయ్యారు. ప్రపంచంలోని ఏడు శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఆఫ్రికాలో ఎత్తై శిఖరం కిలిమంజరో అగ్నిపర్వత శిఖరాన్నీ, అర్జెంటీనాలోని మౌంట్ అకాంగువా శిఖరాన్నీ అధిరోహించారు. ఆమె తన పెద్ద కూతురు ప్రియాన్ష తోపాటు టాటా స్టీల్ అడ్వెంచర్ ఇన్స్ట్యూట్లో బచేంద్రిపాల్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. విద్యాపతీ దేవి: 2013, మే 17వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. పూర్తిపేరు నింగ్తోజమ్ విద్యాపతీదేవి. ఆ ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన ఆమె ఎవరెస్టు బేస్ క్యాంపుకు చేరారు. అక్కడి నుంచి హిమాలయ పర్వతాల ఆరోహణ మొదలు పెట్టిన వీరి బృందం ఏప్రిల్ నెలాఖరుకు 24,000 అడుగుల ఎత్తులో ఉన్న మూడవ క్యాంపుకు చేరింది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. ఆ వాతావరణంలో కొనసాగుతూ మే నెల 17వ తేదీకి శిఖరాన్ని చేరారు. విద్యాపతీదేవి 2004లో ఉత్తరకాశిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్ లో పర్వతారోహణలో శిక్షణ పొందారు. దీనితోపాటు సియాచిన్ గ్లేసియర్లో వింటర్ ట్రైనింగ్ కోర్సు కూడా చేశారు. లైజన్ ఆఫీసర్ కోర్సు, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఆల్పైన్ కోర్సు, మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కోర్సులు కూడా చేశారు. ప్రస్తుతం ఆమె మణిపూర్ మౌంటనియరింగ్ ట్రెకింగ్ అసోసియేషన్లో అడ్వెంచర్ ఇన్స్ట్రక్టర్గా కొనసాగుతున్నారు. విద్యాపతీదేవి ఎవరెస్టు ఎక్స్పెడిషన్ని మణిపూర్లోని ‘మణిపూర్ మౌంటనియరింగ్ అండ్ ట్రెక్కింగ్ అసోసియేషన్’ నిర్వహించారు. ఈ బృందంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్షు జామ్సెన్పా కూడా ఉన్నారు. వాన్షుక్ మిర్తాంగ్: ఈమె మేఘాలయకు చెందిన ఆర్మ్డ్ పోలీసు కానిస్టేబుల్. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 16 మంది పర్వతారోహకుల బృందంతోపాటు ఈమె 2013 మే నెల 17వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. వీరు బృందాలుగా విడిపోయి ఆరోహణ కొనసాగించారు. మొదటి బృందంలో విద్యాపతీదేవితోపాటు మరో ఇద్దరు ఉన్నారు. ఆరుగురితో కూడిన రెండవ బృందంలో వాన్షుక్ ఉన్నారు. వాన్షుక్ ‘నార్త్ ఈస్ట్ జోన్ స్పోర్ట్స్ క్లైంబింగ్ కమిటీ’ నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2006లలో మేఘాలయ పోలీస్ శాఖలో చేరిన వాన్షుక్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ‘ఔలి’ లో ఉన్న మౌంటనియరింగ్ అండ్ స్కీయింగ్ ఇన్స్టిట్యూట్లో పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. చందా గయేన్: 2013, మే నెల 18వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. హౌరాలో నివసిస్తున్న చందా ఈ రికార్డును సాధించిన బెంగాలీ మహిళ. డార్జిలింగ్లోని ‘హిమాలయన్ మౌంటనియరింగ్ ఇన్స్టిట్యూట్’లో ఆమె శిక్షణ పొందారు. ఎవరెస్టు అరోహణకు ముందు ఆమె గర్వాల్ జిల్లాలోని జోగిన్ శిఖరాలను, హిమాచల్ ప్రదేశ్లోని మనిరంగ్ శిఖరాన్ని అధిరోహించారు. కరాటే వంటి యుద్ధకళల్లో ప్రావీణ్యత సాధించిన చందా గయేన్ ఆత్మరక్షణ మెళకువలు నేర్పించే ఉపాధ్యాయిని. తన తల్లి జయా గయేన్ నుంచి స్ఫూర్తి పొందారు. జయాగయేన్కు ట్రెకింగ్ హాబీ. చందాగయేన్ రాక్ క్లైంబింగ్, ట్రెకింగ్, మౌంటనియరింగ్లలో శిక్షణ పొందారు. చందా డార్జిలింగ్లో హిమాలయన్ మౌంటనియరింగ్ ఇన్స్టిట్యూట్, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్ లో పర్వతారోహణ సాధన చేశారు. దీంతోపాటు హిమాలయన్ నేచర్ అండ్ అడ్వెంచర్ ఫౌండేషన్ నిర్వహించిన అడ్వెంచర్ ట్రెకింగ్ క్యాంపులో పాల్గొన్నారు. ఆమె స్విమ్మింగ్, కబడీ, ఎన్సిసి, మార్షల్ ఆర్ట్స్, మౌంటనియరింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్తోపాటుగా పాటలు పాడడంలో కూడా సుశిక్షితురాలు. జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకం, రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో చాంపియన్షిప్, కరాటే చాంపియన్షిప్లు సాధించారు. తాషి మాలిక్, నాంగ్షి మాలిక్: ఈ అక్కాచెల్లెళ్లు ఎవరెస్టును అధిరోహించిన తొలి కవలలు. వీరు 2013 మే 19వ తేదీన శిఖరాన్ని చేరారు. అప్పటికి వారి వయసు 21 ఏళ్లు. వీరిది హర్యానాలోని సోనీపత్ జిల్లా. వీరి తండ్రి కల్నల్ వీరేంద్రసింగ్ మాలిక్ మిలటరీలో ఉద్యోగం చేసి డెహ్రాడూన్లో రిటైరవడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. వీరు 2010లో ఉత్తరకాశిలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం, గుల్మార్గ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటనియరింగ్లో శిక్షణ పొందారు. పాఠశాల స్థాయి నుంచి ఆటల్లో, సాహస క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న నేపథ్యం వీరిది. జర్నలిజం- మాస్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఏడు శిఖరాల అధిరోహణలో భాగంగా ఇప్పటికి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికా ఖండాలలోని శిఖరాలను అధిరోహించారు. ఇండోనేసియా, యుఎస్, అంటార్కిటికాలలోని శిఖరాలను ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు. అరుణిమా సిన్హా : 2013, మే 22వ తేదీన శిఖరాన్ని చేరారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అరుణిమా సిన్హా. ప్రమాదవశాత్తూ ఒక కాలిని కోల్పోయిన తర్వాత అందరూ తన మీద చూపించే సానుభూతికి సమాధానంగా ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అరుణిమ జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. మూడేళ్ల కిందట ఒకసారి అరుణిమ రైలో ప్రయాణిస్తుండగా దొంగలు ఆమె పర్సును లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ ప్రతిఘటనలో దొంగలు ఆమెను కదులుతున్న రైల్లోంచి బయటకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఆమె ఎడమకాలు నుజ్జనుజ్జయింది. ఆమెను బతికించాలంటే ఆ కాలిని తీసేయడమే మార్గం అని తేల్చేశారు డాక్టర్లు. ఆమె ఎవరెస్టును అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ... ‘కాలు పోతే జీవితాన్ని కోల్పోయినట్లు కాదు...’ అని నిరూపించడానికే ఈ సాహసం చేశానన్నారు. తన సాహసయాత్రను ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’ స్పాన్సర్ చేసింది. వ్యక్తిగతంగా వీళ్లే కాకుండా, 2005లో అంతా మహిళలే ఉండే ‘ఆల్ ఉమెన్ ఆర్మీ ఎక్స్పెడిషన్’ జరిగింది. భారతీయ సైనిక రంగానికి చెందిన మహిళల బృందం ఎవరెస్టును అధిరోహించి వచ్చింది. ఇక ఈ ఏడాది (2014) ఏప్రిల్ 18వ తేదీన శిఖరం మీద జరిగిన ప్రకృతి వైపరీత్యం కారణంగా 16 మంది పర్వతారోహకులు మరణించారు. ఈ ఘటన కారణంగా ఈ ఏడాది ఎవరెస్టు శిఖరారోహణను నిషేధించారు. అలా జరగకపోయి ఉంటే ఈ మే నెల మరికొంత మంది మహిళలను ఎవరెస్టు శిఖరంపై ఖాయంగా నిలబెట్టి ఉండేదే.ఎవరెస్టు శిఖరం అన్నిటి కన్నా ఎత్తయినది కావచ్చు. అయితే మహిళల సంకల్పబలం ఎవరెస్టును మించినదని ఈ పది మంది మహిళా పర్వతారోహకులు నిరూపించారు. - వాకా మంజులారెడ్డి -
9 నెలలుగా జీతాల్లేవ్!
సౌదీలో భారత మహిళల కష్టాలు దుబాయ్: దేశం కాని దేశానికి వలస వెళ్లిన భారత మహిళలు.. చేసిన పనికి నెలల తరబడి జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని ఒక ఆస్పత్రిలో క్లీనర్లుగా పని చేస్తున్న 11 మందికి తొమ్మిది నెలలుగా జీతాలు అందట్లేదు. ఈ విషయంపై తాము భారత ఎంబసీకి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని కేరళకు చెందిన ఆ మహిళలు వాపోయారు. భారత్కు చెందిన వారిపై ఆస్పత్రి వర్గాలు వివక్ష చూపిస్తున్నాయని, ఇతర దేశాల పనివార్లకు జీతాలు చెల్లిస్తూ తమకు మాత్రమే నిలిపివేశారని వారు ఆరోపించారు. సెలవులపై స్వదేశాలకు వెళ్దామన్నా తమను ఇక్కడకు తీసుకొచ్చిన కంపెనీ అనుమతి ఇవ్వడంలేదన్నారు. ఆదివారం నుం చి తాము విధులకు హాజరు కావడంలేదని, జీతాలు చెల్లించిన తర్వాతే మళ్లీ పని చేస్తామని చెప్పారు. దీనిపై భారత ఎంబసీ అధికారులు స్పందిస్తూ.. ఈ విషయానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి ఆస్పత్రి యజమానులతో, సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు