Jaipur Pink Panthers
-
సెమీస్ బెర్త్ ఎవరిదో!
పుణే: గత రెండు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ చివరి అంకానికి చేరింది. లీగ్ దశ పోటీలు ముగియగా... ఇక నాకౌట్ సమరాలకు వేళయింది. పాయింట్ల పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచిన హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధించగా... ఆ తర్వాత 3 నుంచి 6వ స్థానం వరకు నిలిచిన జట్ల మధ్య గురువారం ఎలిమినేటర్ మ్యాచ్లు జరగనున్నాయి.ఇందులో విజయం సాధించిన జట్లు సెమీఫైనల్కు చేరనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న తొలి ఎలిమినేటర్లో యూపీ యోధాస్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనుండగా... రాత్రి 9 గంటల నుంచి జరగనున్న రెండో ఎలిమినేటర్లో పట్నా పైరేట్స్తో యు ముంబా పోటీపడుతుంది. పీకేఎల్లో యూపీ యోధాస్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోగా... జైపూర్ పింక్ పాంథర్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది. పట్నా పైరేట్స్ మూడుసార్లు చాంపియన్గా నిలవగా... యు ముంబా కూడా ఒకసారి విన్నర్స్ ట్రోఫీని ముద్దాడింది. తాజా సీజన్లో యూపీ యోధాస్ 13 విజయాలు సాధించి 79 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలవగా... పింక్ పాంథర్స్ 12 విజయాలతో 70 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. కెపె్టన్ సురేందర్ గిల్తో పాటు శివమ్ చౌధరీ యోధాస్కు కీలకం కానుండగా... పింక్ పాంథర్స్ జట్టు సారథి అర్జున్ దేశ్వాల్పై ఎక్కువగా ఆధారపడుతోంది. మరి ఈ కీలక పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. లీగ్ చివరి మ్యాచ్ విజయంతో యు ముంబా ముందడుగు వేయగా... పట్నా పైరేట్స్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి నాకౌట్లో అడుగు పెట్టింది. యు ముంబా జట్టు తరఫున కెప్టెన్ సునీల్ కుమార్, అజిత్ చౌహాన్, మన్జీత్ రాణిస్తుండగా... పైరేట్స్ తరఫున దేవాంక్, దీపక్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఎలిమినేటర్లో విజయం సాధించిన జట్లు శుక్రవారం జరగనున్న సెమీఫైనల్స్లో తలపడనున్నాయి. -
అర్జున్ సూపర్ రెయిడింగ్.. జైపూర్ ఘన విజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 35–26 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో విజృంభించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తన సూపర్ రెయిడింగ్తో ఆకట్టుకున్న అర్జున్ ప్రత్యర్థి డిఫెన్స్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. బెంగళూరు బుల్స్ స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ 5 పాయింట్లకే పరిమితమయ్యాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో పింక్ పాంథర్స్ 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... బుల్స్ 12 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. తాజా సీజన్లో 20 మ్యాచ్లాడిన పింక్ పాంథర్స్ 11 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 64 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. మరోవైపు 20 మ్యాచ్లాడిన బుల్స్ 2 విజయాలు, 17 పరాజయాలు, ఒక ‘టై’తో పట్టిక అట్టడుగున కొనసాగుతోంది. మరోవైపు యూపీ యోధాస్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరువైంది. తాజా సీజన్లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకోగా... యూపీ యోధాస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో యూపీ యోధాస్ 31–24 పాయింట్ల తేడాతో హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్పుత్ 11 పాయింట్లు సాధించగా... స్టీలర్స్ తరఫున వినయ్, విశాల్ చెరో 6 పాయింట్లు సాధించారు. లీగ్లో ఇప్పటి వరకు 20 మ్యాచ్లాడిన యోధాస్ 11 విజయాలు 6 పరాజయాలు, 3 ‘టై’లతో 69 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్కు అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటికే బెర్త్ ఖరారు చేసుకున్న స్టీలర్స్ వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. లీగ్లో భాగంగా నేడు తమిళ్ తలైవాస్తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరెట్స్తో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
తమిళ్ తలైవాస్ అవుట్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయటకు వచ్చింది. ఈ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న తలైవాస్... ఆదివారం జరిగిన మ్యాచ్లో 27–34 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. తమిళ్ తలైవాస్ తరఫున హిమాన్షు, నితీశ్ కుమార్ చెరో 7 పాయింట్లతో రాణించగా... పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్, నీరజ్ నర్వాల్ చెరో 6 పాయింట్లు సాధించారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో పింక్ పాంథర్స్ 13 రెయిడ్ పాయింట్లు సాధించగా... తలైవాస్ 7 రెయిడ్ పాయింట్లకే పరిమితమై పరాజయం మూటగట్టుకుంది. తాజా సీజన్లో 19 మ్యాచ్లాడిన తలైవాస్ 6 విజయాలు, 12 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. పీకేఎల్ ముగింపు దశకు చేరుకుంటుండగా... మిగిలిన అన్నీ మ్యాచ్ల్లో గెలిచినా... తలైవాస్ ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం లేదు. జైపూర్ పింక్ పాంథర్స్ 19 మ్యాచ్ల్లో 10 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 59 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 30–27 పాయింట్ల తేడాతో యూ ముంబాపై విజయం సాధించింది. ఈ సీజన్లో 19 మ్యాచ్లాడిన యూపీ యోధాస్ 10 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 64 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నేడు జరగనున్న మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరేట్స్తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
అర్జున్ అదరహో
పుణే: స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లతో సత్తా చాటాడు. దాంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో జైపూర్ పింక్పాంథర్స్ తొమ్మిదో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ పోరులో పింక్పాంథర్స్ 42–29 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి సూపర్ రెయిడ్లతో అర్జున్ అదరగొట్టగా... నీరజ్ నర్వాల్ (8 పాయింట్లు) అతడికి సహకరించాడు. గుజరాత్ జెయింట్స్ జట్టు తరఫున గుమాన్ సింగ్, రాకేశ్ చెరో 9 పాయింట్లు సాధించారు. తాజా సీజన్లో 18 మ్యాచ్లు ఆడిన జైపూర్ పింక్ పాంథర్స్ 9 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 54 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గుజరాత్ కేవలం ఐదు విజయాలతో పట్టికలో 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 44–29 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. వారియర్స్ తరఫున విశ్వాస్ 14 పాయింట్లు, ప్రణయ్ 9 పాయింట్లతో రాణించగా... బెంగళూరు తరఫున స్టార్ రెయిడర్, ‘డుబ్కీ కింగ్’ ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తమిళ్ తలైవాస్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
దేవాంక్ ధమాకా
పుణే: స్టార్ రెయిడర్ దేవాంక్ దలాల్ 14 పాయింట్లతో సత్తా చాటడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ పదో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 38–28 పాయింట్ల తేడాతో మాజీ విజేత జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే దేవాంక్ తన రెయిడింగ్తో వరుస పాయింట్లు కొల్లగొట్టగా... అతడికి అయాన్ (6 పాయింట్లు), దీపక్ (5 పాయింట్లు), అంకిత్ (5 పాయింట్లు) సహకరించారు. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో పోరాడాడు. తాజా సీజన్లో 17 మ్యాచ్లాడిన పట్నా పైరేట్స్ 10 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 58 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 17 మ్యాచ్ల్లో 8 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 49 పాయింట్లు సాధించిన పింక్ పాంథర్స్ ఏడో స్థానంలో ఉంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 34–33 పాయింట్ల తేడాతో యు ముంబాపై విజయం సాధించింది.గుజరాత్ జెయింట్స్ తరఫున గుమాన్ సింగ్, రాకేశ్ సుంగ్రోయా చెరో 10 పాయింట్లతో సత్తాచాటారు. యు ముంబా జట్టు తరఫున అజిత్ చవాన్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
రెండు మ్యాచ్లూ ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో గురువారం జరిగిన రెండు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి. దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 32–32 పాయింట్లతో... జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్ 22–22 పాయింట్లతో ‘టై’ అయ్యాయి. ఢిల్లీ తరఫున అశు మలిక్ 11 పాయింట్లు, నవీన్ 8 పాయింట్లతో రాణించారు. యోధాస్ తరఫున గగన్ గౌడ 13 పాయింట్లు, భవానీ రాజ్పుత్ 10 పాయింట్లు సాధించారు. మాŠయ్చ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. రక్షణాత్మక ధోరణిలో ముందుకు సాగిన ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మరో మ్యాచ్లో పింక్ పాంథర్స్, యు ముంబా జట్లు తుదికంటా పోరాడాయి. జైపూర్ తరఫున రెజా అత్యధికంగా 6 పాయింట్లు సాధించగా... యు ముంబా తరఫున సోమ్బీర్ 7 పాయింట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో ఇరుజట్లు డిఫెన్స్లో దుమ్మురేపాయి. తాజా సీజన్లో ఇప్పటి వరకు 16 మ్యాచ్లాడిన యు ముంబా 54 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. పింక్ పాంథర్స్ 49 పాయింట్లతోఆరో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్తో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ ఓటమి
నోయిడా: స్టార్ రెయిడర్ విజయ్ 17 పాయింట్లతో పోరాడినా... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్కు పరాజయం తప్పలేదు. లీగ్లో భాగంగా శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 28–41 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. విజయ్ ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్ (12 పాయింట్లు), అర్జున్ దేశ్వాల్ (11 పాయింట్లు) సత్తా చాటారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ పింక్ పాంథర్స్ 22 రెయిడ్ పాయింట్లు సాధించింది. ట్యాక్లింగ్లో పింక్ పాంథర్స్ 12 పాయింట్లు సాధించగా... టైటాన్స్ 7 ట్యాక్లింగ్ పాయింట్లకే పరిమితమైంది. టైటాన్స్ మూడు సార్లు ఆలౌట్ కావడంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 6 పాయింట్లు దక్కాయి.తాజా సీజన్లో 15 మ్యాచ్లాడి 9 విజయాలు, 6 పరాజయాలతో 48 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టైటాన్స్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... జైపూర్ పింక్ పాంథర్స్ (46 పాయింట్లు) పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో పట్నా పైరెట్స్ 54–29 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. పట్నా పైరెట్స్ తరఫున దేవాంక్ 17 పాయింట్లు, అయాన్ 13 పాయింట్లతో విజృంభించగా... బుల్స్ తరఫున జై భగవాన్ 9 పాయింట్లు, ప్రదీప్ నర్వాల్ 8 పాయింట్లు సాధించారు. 25 పాయింట్ల తేడాతో నెగ్గిన పట్నా జట్టు పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
Pro Kabaddi 2024: అర్జున్ అదరహో
నోయిడా: స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో విజృంభించడంతో... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ ఏడో విజయం నమోదు చేసుకుంది. లీగ్లో భాగంగా సోమవారం జరిగిన పోరులో పింక్ పాంథర్స్ 37–23 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్పై విజయం సాధించింది. జైపూర్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడితే... పుణేరి కేవలం రెయిడింగ్లోనే సత్తా చాటింది. ఈ మ్యాచ్లో పింక్ పాంథర్స్ 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... పల్టన్ 19 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. డిఫెన్స్లో జైపూర్ 10 పాయింట్లు కొల్లగొట్టగా... పుణేరి 3 పాయింట్లకే పరిమితమైంది. జైపూర్ తరఫున అర్జున్ విజృంభించగా.. అతడికి నీరజ్ నర్వాల్ నుంచి సహకారం లభించింది. పుణేరి పల్టన్ తరఫున పంకజ్, మోహిత్ గోయట్ చెరో 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 13 మ్యాచ్లాడి 7 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు ఖతాలో వేసుకున్న జైపూర్ ఐదో స్థానానికి చేరింది. 42 పాయింట్లతో పుణేరి పల్టన్ నాలుగో స్థానంలో ఉంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో యు ముంబా 34–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. యు ముంబా తరఫున మన్జీత్ (8 పాయింట్లు), అజిత్ చవాన్ (7 పాయింట్లు) రాణించగా... బెంగళూరు తరఫున సుశీల్ (8 పాయింట్లు), ప్రదీప్ నర్వాల్ (6 పాయింట్లు) సత్తాచాటారు. 13 మ్యాచ్ల్లో 8 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘టై’తో 45 పాయింట్లతో నిలిచిన యు ముంబా పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 14 మ్యాచ్ల్లో 12వ పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు బుల్స్ 16 పాయింట్లతో పట్టికలో అట్టడుగున ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
దబంగ్ ఢిల్లీ దూకుడు
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో దబంగ్ ఢిల్లీ ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 35–21 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం సాధించింది. దబంగ్ ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ అశు మలిక్ 9 పాయింట్లతో సత్తా చాటగా.. యోగేశ్ దహియా 5 పాయింట్లు సాధించాడు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో పోరాడినా అతడికి సహచరుల నుంచి సరైన తోడ్పాటు లభించలేదు. లీగ్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన దబంగ్ ఢిల్లీ 6 విజయాలు, 5 పరాజయాలు, 2 ‘టై’లతో 40 పాయింట్లు ఖాతాలో వేసుకొని మూడో స్థానానికి చేరింది. జైపూర్ పింక్ పాంథర్స్ పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 40–24 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. యూపీ యోధాస్ రెయిడర్ భవానీ రాజ్పుత్ 10 పాయింట్లతో విజృంభించగా... డిఫెన్స్లో హితేశ్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. తమిళ్ తలైవాస్ తరఫున విశాల్ చాహల్, నితీశ్ కుమార్ చెరో ఆరు పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 5 విజయం నమోదు చేసుకున్న యూపీ యోధాస్ 33 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరగా... గత ఐదు మ్యాచ్ల్లో నాలుగో పరాజయం మూటగట్టుకున్న తమిళ్ తలైవాస్ 28 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా శనివారం గుజరాత్ జెయింట్స్తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటకు), జైపూర్ పింక్ పాంథర్స్తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
ఉత్కంఠ పోరులో జైపూర్దే పైచేయి
హైదరాబాద్, :ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో రెండు ఓటములు, ఒక టై తర్వాత మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఆరంభం నుంచి ఉత్కంఠగా సాగుతూ ఆధిపత్యం చేతులు మారిన పోరులో చివర్లో అద్భుతంగా ఆడిన జైపూర్... యూపీ యోధాస్కు చెక్ పెట్టి లీగ్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్లో పింక్ పాంథర్స్ జట్టు 33–30 స్కోరుతో యూపీ యోధాస్పై గెలిచింది. జైపూర్ జట్టులో రెయిడర్ నీరజ్ నర్వాల్ తొమ్మిది పాయింట్లతో మెరిశాడు. కెప్టెన్, మరో స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ ఐదు పాయింట్లతో రాణించాడు.ఈ క్రమంలో పీకేఎల్లో 1000 రెయిడ్ పాయింట్ల మైలురాయి చేరుకున్నాడు. యోధాస్ తరఫున ఆల్రౌండర్ భరత్ ఏడు, హితేశ్, సుమిత్ చెరో ఐదు పాయింట్లు రాబట్టినా తమ జట్టుకు వరుసగా మూడో ఓటమి తప్పించలేకపోయారు.హోరాహోరీ పోరుజైపూర్, యూపీ మధ్య ఆట ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్టు నడిచింది. ఇరు జట్లూ బలమైన డిఫెన్స్ ను ప్రదర్శించాయి. దాంతో ఆటలో ఆధిపత్యం కోసం శ్రమించాయి. బోనస్ ద్వారా అర్జున్ జైపూర్కు తొలి పాయింట్ అదించగా.. గగన్ యూపీ యోధాస్ ఖాతా తెరిచాడు. యూపీ డిఫెండర్లు రెండుసార్లు అర్జున్ను ట్యాకిల్ చేయగా.. రితిక్, భవానీ రాజ్పుత్ తెచ్చిన రైడ్ పాయింట్లతో ఆ జట్టు 6–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, జైపూర్ వెంటనే పుంజుకొని 6–6తో స్కోరు సమం చేసింది. ఇరు జట్లూ ఎక్కడా తగ్గకపోవడంతో స్కోరు బోర్డు 8–8, 11–11, 15–15తో సమంగా నడిచింది. తొలి అర్ధభాగానికి ముందు యూపీ జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలినా.. అర్జున్ను సూపర్ ట్యాకిల్ చేసి 17–15తో స్వల్ప ఆధిక్యంతో విరామానికి వెళ్లింది.జైపూర్ జోరురెండో అర్ధభాగంలో యూపీ బలమైన డిఫెన్స్ను ప్రదర్శించింది. విరామం నుంచి వచ్చిన వెంటవెంటనే రెండు సూపర్ ట్యాకిల్స్తో నీరజ్, అర్జున్ను నిలువరించి 21–17తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. కానీ, జైపూర్ వెనక్కు తగ్గలేదు. ఆ జట్టు డిఫెండర్లు కూడా పుంజుకున్నారు. యోధాస్ కెప్టెన్ సురేందర్ను ట్యాకిల్ చేయడంతో పాటు కోర్టులో మిగిలిన సుమిత్ను నిలువరించిన పింక్ పాంథర్స్ 32వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 22–22తో స్కోరు సమం చేసింది. ఈ దశలో జైపూర్ కెప్టెన్ అర్జున్తో పాటు ఆ జట్టు మరో స్టార్ రెయిడర్ నీరజ్ను బెంచ్ మీదకు పంపించిన యూపీ 25–22తో తిరిగి ఆధిక్యం అందుకుంది. అయితే, చివరి పది నిమిషాల్లో జైపూర్ జోరు పెంచింది. నీరజ్ వరుస రెయిడ్ పాయింట్లు రాబట్టగా.. డిఫెండర్లు కూడా ఆకట్టుకోవడంతో 36వ నిమిషంలో ప్రత్యర్థిని మరోసారి ఆలౌట్ చేసి 31–28తో మళ్లీ పైచేయి సాధించింది. ఆఖరి నిమిషాల్లో యూపీ యోధాస్ పుంజుకునే ప్రయత్నం చేసినా ఆధిక్యాన్ని కాపాడుకున్న జైపూర్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. -
PKL 11: యూ ముంబా మెరుపు విజయం.. మాజీ చాంపియన్కు షాక్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదకొండో సీజన్లో యూ ముంబా రెండో విజయం నమోదు చేసింది. జైపూర్ పింక్ పాంథర్స్పై 39-37తో గెలుపొందింది. గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో గురువారం మాజీ చాంపియన్లు యు ముంబా- జైపూర్ పింక్ పాంథర్స్ తలపడ్డాయి.ఈ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో యూ ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ (14 పాయింట్లు) సూపర్ టెన్ షోతో అదరగొట్టాడు. మరోవైపు.. పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్ (12 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆట తొలి పది నిమిషాల వరకు ఏ జట్టుకు స్పష్టమైన ఆధిక్యం లభించలేదు.ఫస్టాఫ్ చివర్లో యూ ముంబా ముందంజఇటు జైపూర్, అటు యూ ముంబా రెయిడర్లు, డిఫెండర్లు వరుసగా పాయింట్లు సాధించారు. ఆట మొదలైన పది నిమిషాల అనంతరం 9-9తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. అయితే, ఫస్టాఫ్ చివర్లో యూ ముంబా ముందంజ వేసింది. జైపూర్ పింక్ పాంథర్స్ను ఆలౌట్ చేసి విలువైన పాయింట్లు ఖాతాలో వేసుకుంది.ప్రథమార్థం ముగిసే సరికి యూ ముంబా 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా.. రెయిడింగ్లో ఇరు జట్లు పదేసి పాయింట్లు సాధించగా.. ట్యాకిల్స్లో యూ ముంబా ఐదు, జైపూర్ ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. కానీ అదనపు పాయింట్లు యూ ముంబాను ఆధిక్యంలో నిలబెట్టాయి.ద్వితీయార్థం మరింత ఉత్కంఠఇక ఇరుజట్ల మధ్య ద్వితీయార్థం ఆట మరింత ఉత్కంఠ రేపింది. యూ ముంబా ముందంజలో కొనసాగినా.. జైపూర్ పింక్ పాంథర్స్ పట్టు వదల్లేదు. ఆఖరు వరకు యూ ముంబాను తిప్పలు పెట్టింది. మరో మూడు నిమిషాల ఆట మిగిలి ఉండగా నీరజ్ నర్వాల్ సూపర్ రెయిడ్తో 32-32తో జైపూర్ పింక్ పాంథర్స్.. యూ ముంబా స్కోరును సమం చేసింది.కానీ ఆ తర్వాతి రెయిడ్లోనే రోహిత్ రాఘవ్ సూపర్ రెయిడ్తో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో యూ ముంబా మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు వరకు ఆధిక్యం నిలుపుకున్న యూ ముంబా మెరుపు విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన జైపూర్కు ఇది రెండో ఓటమి.చదవండి: హర్యానా స్టీలర్స్ హ్యాట్రిక్ విజయం -
PKL 11: హర్యానా స్టీలర్స్ గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్ తొలి విజయం నమోదు చేసింది. గత సీజన్ ఫైనలిస్ట్ హర్యానా స్టీలర్స్కు తొలి మ్యాచ్లో చుక్కెదురైనా.. రెండో మ్యాచ్లో గొప్పగా పుంజుకుంది. వరుస విజయాల ఊపుమీదున్న జైపూర్ పింక్ పాంథర్స్ను 37-25తో చిత్తు చేసి సీజన్లో తొలి విక్టరీ సాధించింది. కూతలో, పట్టులో హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించటంతో పింక్ పాంథర్స్పై ఆ జట్టు 12 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెయిడర్లు వినయ్ (10), నవీన్ (6), శివం (4).. డిఫెండర్లు రాహుల్ (3), మహ్మద్రెజా (2) సూపర్ షోతో మెరిశారు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున రెయిడర్ అభిజిత్ మాలిక్ (6) ఒక్కడే ఆకట్టుకున్నాడు. రెజా (2), అర్జున్ (3), శ్రీకాంత్ (2) నిరాశపరిచారు.స్టీలర్స్ షో : తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసిన గత సీజన్ రన్నరప్ హర్యానా స్టీలర్స్.. రెండో మ్యాచ్లో పుంజుకుంది. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్ను నిలువరించి.. స్టీలర్స్ షో చేసింది. తొలి 20 నిమిషాల ఆటలోనే ఆధిపత్యం చూపించిన హర్యానా స్టీలర్స్ విజయానికి గట్టి పునాది వేసుకుంది. రెయిడింగ్, ట్యాక్లింగ్లో దుమ్మురేపిన స్టీలర్స్ ప్రథమార్థంలో 20-11తో తొమ్మిది పాయింట్ల ఆధిక్యం సాధించింది. రెయిడర్ వినయ్ సూపర్ టెన్తో చెలరేగగా.. నవీన్ సైతం అదరగొట్టాడు. డిఫెన్స్లో రాహుల్, మహ్మద్రెజా ఆకట్టుకున్నారు.మరోవైపు జైపూర్ పింక్ పాంథర్స్ సమిష్టిగా రాణించటంలో విఫలమైంది. ఇటు కూతలో, అటు పట్టులో తేలిపోయింది. ప్రథమార్థంలో 11 పాయింట్లు సాధించిన పింక్ పాంథర్స్ ద్వితీయార్థంలో ఆ మాత్రం ప్రదర్శన సైతం చేయలేకపోయింది. ఆల్రౌండ్ షోతో చెలరేగిన హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తొలి విజయం సాధించారు. ఈ సీజన్లో మూడు మ్యాచుల ఆడిన పింక్ పాంథర్స్కు ఇది తొలి పరాజయం. -
తెలుగు టైటాన్స్కు రెండో ఓటమి
హైదరాబాద్, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జైపూర్ 52–22 తేడాతో తెలుగు టైటాన్స్ను ఓడించింది. జైపూర్ జట్టులో అర్జున్ తో పాటు అభిజీత్ మాలిక్ (8) కూడా ఆకట్టుకున్నాడు. ఆతిథ్య టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ (7 ), విజయ్ మాలిక్ ( 5), ఆశీష్ నర్వాల్ (5) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో డిఫెన్స్లో పూర్తిగా తేలిపోయిన టైటాన్స్ నాలుగుసార్లు ఆలౌటైంది.ఇరు జట్ల మధ్య ఆరంభం నుంచి ఆట హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగం మొదటి పది నిమిషాల్లో తెలుగు టైటాన్స్ మెప్పించగా.. చివరి పది నిమిషాల్లో జైపూర్ పింక్ పాంథర్స్ పైచేయా సాధించింది. తన తొలి రైడ్లోనే టచ్ పాయింట్తో కెప్టెన్ పవన్ సెహ్రావత్ తెలుగు టైటాన్స్ ఖాతా తెరిచాడు. ఆ వెంటనే అర్జున్ దేశ్వాల్ జైపూర్కు తొలి పాయింట్ అందించాడు. రెండు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లాయి. 6–6తో స్కోరు సమంగా నిలిచిన దశలో అర్జున్ను ట్యాకిల్ చేసిన టైటాన్స్.. పవన్ వరుస రైడ్ పాయింట్లతో 9–6తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో పవన్ను ఔట్ చేయడంతో పాటు వరుసగా మూడు పాయింట్లు రాబట్టిన జైపూర్ 9–9తో స్కోరు సమం చేసింది. అయితే, 18వ నిమిషంలో జైపూర్ అభిజీత్ చేసిన సూపర్ రైడ్ ఆటను మలుపు తిప్పింది. బోనస్తో పాటు అంకిత్, పవన్, క్రిషన్లను ఔట్ చేసిన అభిజీత్ ఏకంగా నాలుగు పాయింట్లు తీసుకొచ్చాడు. ఆ వెంటనే అర్జున్ కోర్టులో మిగిలిన ఇద్దరు డిఫెండర్ల పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో టైటాన్స్ను తొలిసారి ఆలౌట్ చేసిన పింక్ పాంథర్స్ 18–13తో ఐదు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది.రెండో భాగంలో జైపూర్ విజృంభించగా.. తెలుగు జట్టూ పూర్తిగా డీలా పడింది. విరామం తర్వాత అర్జున్ జైపూర్కు మరో రైడ్ పాయింట్ అందించగా, విజయ్ మాలిక్ జైపూర్ ఆటగాడు రెజాను టచ్ చేసి వచ్చాడు. కానీ, తన తర్వాతి రైడ్లో అర్జున్.. విజయ్, సాగర్ను ఔట్ చేసి జట్టుకు మరో రెండు పాయింట్లు తెచ్చి పెట్టడంతో జైపూర్ తన ఆధిక్యాన్ని 21–14కి పెంచుకుంది. ఆపై ఇరు జట్ల డూ ఆర్ డై రైడ్స్లో ఇటు పవన్, అటు అర్జున్ సక్సెస్ అయ్యారు.ఈ క్రమంలో అర్జున్ సూపర్ టెన్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు కెప్టెన్లు వరుస రైడ్స్ చేయగా.. ఇందులో అర్జున్ పైచేయి సాధించాడు. అర్జున్ వరుసగా రెండు డబుల్ రైడ్స్తో సత్తా చాటగా.. పవన్ను అంకుష్ ట్యాకిల్ చేశాడు. విజయ్ మాలిక్ను కూడా ట్యాకిల్ చేసిన పింక్ పాంథర్స్ జట్టు టైటాన్స్ను రెండోసారి ఆలౌట్ చేసి 31–17తో విజయం ఖాయం చేసుకుంది. చివరి పది నిమిషాల్లో టైటాన్స్ మరింత నిరాశ పరిచింది. సెహ్రావత్ సహా రైడర్లు ప్రత్యర్థికి దొరికిపోగా.. డిఫెండర్లు సైతం చేతులెత్తేశారు. దాంతో మరో రెండుసార్లు ఆలౌటైన తెలుగు జట్టు 21–49తో వెనుకబడింది. మరోవైపు అర్జున్ సూపర్ రైడింగ్తో జైపూర్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
బెంగాల్ వారియర్స్పై పింక్ పాంథర్స్ ఉత్కంఠ విజయం
హైదరాబాద్: కెప్టెన్, స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ను జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఉత్కంఠ విజయంతో ఆరంభించింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జైపూర్ 39–34తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. అర్జున్తో పాటు రైడర్ అభిజీత్ మాలిక్ (7 పాయింట్లు) జైపూర్ విజయంలో కీలకంగా నిలిచాడు. బెంగాల్ జట్టులో నితిన్ ధాంకర్ (13) సూపర్ టెన్ సాధించగా, మణిందర్ సింగ్ (8), కెప్టెన్ ఫజెల్ అత్రాచలి (6) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో జైపూర్ తన ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసింది. ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్లో చివరకు బెంగాల్పై జైపూర్ పైచేయి సాధించింది. అర్జున్ దేశ్వాల్ను ట్యాకిల్ చేసిన నితేష్ కుమార్ జైపూర్కు తొలి పాయింట్ అందించగా.. వికాష్ ఖండోలా తన రైడ్లో నితేష్ను టచ్ చేసి బెంగాల్ ఖాతా తెరిచాడు. మరోసారి రైడ్కు వచ్చిన అర్జున్ను ఫజెల్ అత్రాచలి ట్యాకిల్ చేయగా.. మణిందర్ సింగ్ వరుసగా రెండు బోన్ పాయింట్లు తేవడంతో బెంగాల్ 5–2తో ఆరంభం ఆధిక్యం అందుకుంది. ఈ దశలో అర్జున్ దేశ్వాల్ ఒక్కసారిగా జోరు పెంచాడు.వరుసగా సక్సెస్ఫుల్ రైడ్లతో పాయింట్లు రాబట్టి 9–8తో పింక్ పాంథర్స్ను తొలిసారి ఆధిక్యంలోకి తెచ్చాడు. అతని దెబ్బకు బెంగాల్ కోర్టులో నితిన్ ధాంకర్ ఒక్కడే మిగిలిపోయాడు. నితిన్ను కూడా ట్యాకిల్ చేసి 11వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసిన జైపూర్ 12–9తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇక్కడి నుంచి ఇరు జట్లూ పోటాపోటీగా ఆడాయి. సుర్జీత్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చిన నితిన్ సూపర్ రైడ్ చేయడంతో బెంగాల్ 13–15తో ప్రత్యర్థిని అందుకునే ప్రయత్నం చేసింది. కానీ, మరోవైపు అర్జున్ తన జోరు కొనసాగిస్తూ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు. జట్టును 21–15తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే, విరామానికి ముందు ఫజల్ అత్రాచలి సూపర్ ట్యాకిల్తో అర్జున్ను మరోసారి నిలువరించాడు. దాంతో తొలి అర్ధభాగాన్ని జైపూర్ 21–18తో మూడు పాయింట్ల ఆధిక్యంతో ముగించింది.రెండో భాగంలో బెంగాల్ డిఫెన్స్లో మెరుగైంది. ఆ జట్టు కెప్టెన్ ఫజల్ అత్రాచలి వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్తో సత్తా చాటడంతో 23–24తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ, ఫజెల్ పోరాటం బెంగాల్ను మరో ఆలౌట్ ప్రమాదం నుంచి తప్పించలేపోయింది. 31వ నిమిషంలో బెంగాల్ను రెండోసారి ఆలౌట్ చేసిన జైపూర్ 29–25తో నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించుకుంది. కోర్టుపైకి పూర్తి జట్టు వచ్చిన తర్వాత బెంగాల్ పుంజుకుంది. రైడర్లు మణిందర్, నితిన్ తెలివిగా ఆడుతూ వరుసగా పాయింట్లు తీసుకొచ్చారు. అభిజీత్ మాలిక్ను ఔట్ చేసి నితిన్ సూపర్10 పూర్తి చేసుకోగా.. బెంగాల్ 30–32తో ముందుకొచ్చింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా నితిన్.. అర్జున్, లక్కీ శర్మను ఔట్ చేసి రెండు పాయింట్లు రాబట్టడంతో 34–35తో మ్యాచ్లో ఉత్కంఠ రేగింది. కానీ, మరోసారి రైడ్కు వచ్చిన నితిన్ సూపర్ ట్యాకిల్ చేసిన జైపూర్ విజయం సొంతం చేసుకుంది. -
PKL 10: ‘టాప్’ పుణెరి పల్టన్.. ప్లే ఆఫ్స్ సమరానికి సై
Pro Kabaddi League- పంచ్కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరి పల్టన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బుధవారంతో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. పుణేరి పల్టన్ 40–38తో యూపీ యోధాస్పై గెలిచి ఓవరాల్గా 96 పాయింట్లుతో టాప్ ర్యాంక్లో నిలిచింది. A comeback of the 𝚑̶𝚒̶𝚐̶𝚑̶𝚎̶𝚜̶𝚝̶ 𝐏𝐚𝐥𝐭𝐚𝐧 order 💪 Aslam & Co. turned things around in style against Yoddhas to confirm their No. 1️⃣ spot 🫡#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL10 #PKL #HarSaansMeinKabaddi #PUNvUP #PuneriPaltan #UPYoddhas pic.twitter.com/wOG3cEARlu — ProKabaddi (@ProKabaddi) February 21, 2024 హైదరాబాద్లో మిగిలిన మ్యాచ్లు మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 53–39తో హరియాణా స్టీలర్స్ను ఓడించింది. పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్ టాప్–6లో నిలిచి ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించాయి. ఈనెల 26 నుంచి మార్చి 1 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్లే ఆఫ్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ తాజా సీజన్లోనూ గత వైఫల్యాలు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. League stage ✅ Playoffs ⏳ Here’s what the points table looks like after the last league-stage game of #PKLSeason10 🤩#ProKabaddi #HarSaansMeinKabaddi #ProKabaddiLeague #PKL #PKL10 #PUNvUP #HSvBLR pic.twitter.com/KVfiBs14cS — ProKabaddi (@ProKabaddi) February 21, 2024 -
Pro Kabaddi League: సెమీస్లో పింక్ పాంథర్స్
Pro Kabaddi League 10-కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. యూపీ యోధాస్తో జరిగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్ 67–30తో గెలిచింది. జైపూర్ ప్లేయర్ అర్జున్ 20 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో పింక్ పాంథర్స్ 82 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి రాగా... పుణేరి పల్టన్ 81 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మిగతా మ్యాచ్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లు టాప్–2లో నిలవనున్నాయి. దాంతో ఈ రెండు జట్లకు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 46–34తో యు ముంబాను ఓడించింది. చదవండి: Paris olympics: బ్రెజిల్కు బిగ్ షాక్.. పారిస్ ఒలింపిక్స్కు అర్జెంటీనా -
‘టాప్’లోకి జైపూర్ పింక్ పాంథర్స్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్ 27–22తో దబంగ్ ఢిల్లీని ఓడించింది. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్లో పింక్ పాంథర్స్కిది 13వ విజయం కావడం విశేషం. ప్రస్తుతం పింక్ పాంథర్స్ 77 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి వచ్చింది. పుణేరి పల్టన్ 76 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 40–31తో బెంగళూరు బుల్స్పై గెలిచింది. నేడు విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో గుజరాత్ జెయింట్స్; హరియాణా స్టీలర్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
PKL10: మనోళ్లు అట్టడుగున.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా పాంథర్స్
Pro Kabaddi League- పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందిన తొలి జట్టుగా డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–27తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. ఈ టోర్నీలో పింక్ పాంథర్స్కిది 12వ విజయం కావడం విశేషం. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో పింక్ పాంథర్స్ 71 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. తలైవాస్తో మ్యాచ్లో పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు. అట్టడుగున తెలుగు టైటాన్స్ పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 29–29తో ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్; గుజరాత్ జెయింట్స్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. ఈ జట్ల సంగతి ఇలా ఉంటే.. తెలుగు టైటాన్స్కు మాత్రం ఈ సీజన్ కూడా కలిసిరాలేదు. ఆడిన పదిహేడింట కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. Panthers first team through to the #PKLSeason10 playoffs 💥🤩 After some fiery action on the mat 🔥 Here’s how the standings look like after the final day of the Patna leg ⚡#ProKabaddiLeague #ProKabaddi #PKL #HarSaansMeinKabaddi #PATvBLR #JPPvCHE pic.twitter.com/t3zYwuCwl0 — ProKabaddi (@ProKabaddi) January 31, 2024 -
PKL 2023-24: పుణేరీ పల్టన్కు షాక్
జైపూర్: సొంతగడ్డపై జైపూర్ పింక్ పాంథర్స్ వరుసగా రెండో విజయంతో సత్తా చాటింది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 36–34 స్కోరుతో పుణేరీ పల్టన్ను ఓడించింది. జైపూర్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో చెలరేగాడు. పుణేరీ ఆటగాళ్ళలో కెప్టెన్ అస్లామ్ ముస్తఫా 8 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో పాంథర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఓడినా పుణేరీ పల్టన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సీజన్లో పల్టన్ 10 విజయాలు సాధించి, కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఓడింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. -
PKL: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. పదకొండో పరాజయం
Pro Kabaddi League Telugu Titans 11th Defeat- జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. జైపూర్ పింక్ పాంథర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 35–38తో పోరాడి ఓడిపోయింది. ఈ లీగ్లో టైటాన్స్కిది 11వ ఓటమి కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లు స్కోరు చేయగా... సందీప్ ధుల్, రాబిన్ 5 పాయింట్ల చొప్పున సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 14 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 37–17తో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. పుణేరి పల్టన్ కెప్టెన్ అస్లమ్ ముస్తఫా 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో పుణేరి పల్టన్; యూపీ యోధాస్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. చదవండి: Ind vs Eng: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు భారత్ జట్టు ప్రకటన -
PKL 2023: తలైవాస్పై పాంథర్స్ గెలుపు
Pro Kabaddi League 2023- చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్లో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఢిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్పాంథర్స్ 25–24తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. అర్జున్ దేశ్వాల్ (7 పాయింట్లు), రెజా మిర్బగెరి (5), సునీల్ కుమార్ (4), అజిత్ (3) రాణించారు. The Pink Panthers' 𝗿𝗲𝘇-son to 𝔹𝔼𝕃𝕀𝔼𝕍𝔼 🩷#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL #HarSaansMeinKabaddi #CHEvJPP #TamilThalaivas #JaipurPinkPanthers pic.twitter.com/jCmyGWIsui — ProKabaddi (@ProKabaddi) December 23, 2023 తలైవాస్ తరఫున హిమాన్షు నర్వాల్ 8 పాయింట్లు సాధించాడు. తద్వారా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది డేగా నిలిచాడు. ఇక తలైవాస్పై తాజా విజయంతో జైపూర్ పింక్పాంథర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు.. శనివారం జరిగిన రెండో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 38–30తో యూపీ యోధాస్పై విజయం సాధించింది. గుజరాత్ విజయంలో రెయిడర్ రాకేశ్ (14) కీలకపాత్ర పోషించాడు. Powerful Parteek with a Giant tackle 🤜🤛#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL #HarSaansMeinKabaddi #GGvUP #GujaratGiants #UPYoddhas pic.twitter.com/My5I0MfTXS — ProKabaddi (@ProKabaddi) December 23, 2023 బంగ్లా చేతిలో కివీస్ చిత్తు నేపియర్: న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను ఇప్పటికే చేజార్చుకున్న బంగ్లాదేశ్కు ఊరట విజయం దక్కింది. శనివారం జరిగిన చివరి వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 31.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాపై ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. యంగ్ (26) టాప్ స్కోరర్ కాగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తన్జీమ్ హసన్ (3/14), సౌమ్య సర్కార్, షరీఫుల్ తలా 3 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లా 15.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (51 నాటౌట్), అనాముల్ హక్ (37) రాణించారు. కివీస్ గడ్డపై బంగ్లాదేశ్కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన న్యూజిలాండ్ 2–1తో సిరీస్ సొంతం చేసుకుంది. -
జైపూర్ పింక్పాంథర్స్ గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ రెండో విజయం నమోదు చేసింది. పట్నా పైరేట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 29–28తో గెలిచింది. జైపూర్ తరఫున అజిత్ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేశాడు. -
PKL 2023: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ గెలుపు బోణీ
Pro Kabaddi League 2023- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తొలి విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 35–32తో గెలిచింది. విరామ సమయానికి 12–20తో వెనుకబడి ఉన్న జైపూర్ జట్టు రెండో అర్ధభాగంలో పుంజుకుంది. రెయిడర్ అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 15 పాయింట్లు స్కోరు చేసి జైపూర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఈ సీజన్లో జైపూర్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడగా.. ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు. మరోవైపు.. గుజరాత్ జెయింట్స్ ఐదింట మూడు గెలిచి 17 పాయింట్లతో ప్రస్తుతం టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. 2️⃣4️⃣-carat magical raid ft. Sonu 😍#ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #JPPvGG #JaipurPinkPanthers #GujaratGiants pic.twitter.com/vDrssOgxDi — ProKabaddi (@ProKabaddi) December 11, 2023 బెంగళూరు బుల్స్ చేతిలో యూపీ యోధాస్ ఓటమి ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 38–36తో యూపీ యోధాస్ను ఓడించి ఈ సీజన్లో ఐదో మ్యాచ్లో తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరు తరఫున వికాశ్, భరత్ 11 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. అదే విధంగా... మంగళవారం జరిగే మ్యాచ్లో పట్నా పైరేట్స్తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. Announcing the yuddh in his style ⚔️ Pardeep Narwal for you 💪#ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvUP #BengaluruBulls #UPYoddhas pic.twitter.com/HrUJXMKK3W — ProKabaddi (@ProKabaddi) December 11, 2023 -
Pro Kabaddi League 2023: డిఫెండింగ్ ఛాంపియన్కు షాక్
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో గత సీజన్ రన్నరప్ పుణేరి పల్టన్ సంచలనంతో బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పుణేరి పల్టన్ 37–33 పాయింట్ల తేడాతో గెలిచింది. తద్వారా గత సీజన్ ఫైనల్లో జైపూర్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. పుణేరి పల్టన్ జట్టు తరఫున కెప్టెన్ అస్లమ్ ముస్తఫా ఆల్రౌండ్ ప్రదర్శనతో పది పాయింట్లు సాధించాడు. రెయిడర్ మోహిత్ గోయట్ ఎనిమిది పాయింట్లతో... మొహమ్మద్ రెజా ఐదు పాయింట్లతో రాణించారు. జైపూర్ జట్టు తరఫున అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా తన జట్టును గెలిపించలేకపోయాడు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 32–30తో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. బెంగాల్ తరఫున రెయిడర్లు భరత్ (6 పాయింట్లు), నీరజ్ నర్వాల్ (5 పాయింట్లు), విశాల్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. బెంగళూరు జట్టు కెపె్టన్ మణీందర్ సింగ్ 11 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. -
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9 విజేత జైపూర్ పింక్ పాంథర్స్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్-9 ఛాంపియన్స్గా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. శనివారం పుణేరీ పల్టన్స్తో జరిగిన ఫైనల్లో జైపూర్ 33-29తో విజయం సాధించి విజేతగా నిలిచింది. మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 13 రైడ్ పాయింట్లతో పాటు 15 టాకిల్ పాయింట్లు సాధించింది. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసిన జైపూర్ పింక్ పాంథర్స్ స్పష్టమైన ఆధిక్యం సాధించి ఛాంపియన్స్గా అవతరించింది. ఇక పీకేఎల్ తొలి సీజన్లో విజేతగా అవరతరించిన జైపూర్ పింక్ పాంథర్స్ ఎనిమిది సీజన్ల తర్వాత రెండోసారి ఛాంపియన్స్గా నిలిచింది. ఇక ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో పట్నా పైరేట్స్ తర్వాత రెండోసారి చాంపియన్గా నిలిచిన రెండో జట్టుగా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. ఇక పట్నా పైరేట్స్ అత్యధికంగా మూడుసార్లు ఛాంపియన్స్గా నిలవడం విశేషం. 🏆 🏆 🏆 🏆 🏆 🏆 Jaipur 🏆 🏆 Pink 🏆 🏆 Panthers 🏆 🏆 🏆 🏆 🏆 🏆 JAIPUR PINK PANTHERS ARE CROWNED CHAMPIONS OF SEASON 9 🙌#JPPvPUN #vivoProKabaddi #FantasticPanga #vivoPKL2022Final #JaipurPinkPanthers #vivoProKabaddi2022Final #Champions pic.twitter.com/h2Fa7VeI24 — ProKabaddi (@ProKabaddi) December 17, 2022 -
PKL 2022: ఫైనల్కు దూసుకెళ్లిన పింక్ పాంథర్స్.. తుది పోరులో పుణేతో ఢీ
ముంబై: సుదీర్ఘంగా సాగుతోన్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఫైనల్ మజిలీకి చేరింది. జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సంపాదించాయి. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో పింక్పాంథర్స్ 49–29తో బెంగళూరు బుల్స్పై అలవోక విజయం సాధించింది. జైపూర్ తరఫున అజిత్ (13 పాయింట్లు), సాహుల్ కుమార్ (10) రాణించారు. బెంగళూరు జట్టులో భరత్ 7, వికాస కండోల 5, నీరజ్ నర్వాల్, సౌరభ్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో సెమీఫైనల్లో పుణేరి పల్టన్ 39–37తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. రెయిడర్ పంకజ్ మోహితే (16) అదరగొట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన పంకజ్ 11 సార్లు పాయింట్లు తెచ్చిపెట్టాడు. శనివారం జైపూర్తో పుణేరి పల్టన్ అమీతుమీ తేల్చుకుంటుంది. చదవండి: BBL 2022: ఔట్ అనుకుని వెళ్లిపోయాడు.. అంతలోనే అదృష్టం! ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే? -
PKL 2022: సెమీస్ చేరిన నాలుగు జట్లు ఇవే.. ఫైనల్ ఎప్పుడంటే!
Pro Kabaddi League 2022- Semi Finals: ప్రొ కబడ్డీ లీగ్-2022లో భాగంగా మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ యూపీ యోధాస్ను ఓడించింది. ట్రై బ్రేక్(36-36) మ్యాచ్లో 6-4 తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక మరో ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్.. దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. 56- 24 తేడాతో ఢిల్లీని మట్టికరిపించి సెమీస్కు చేరుకుంది. కాగా అంతకుముందు జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్ సెమీ ఫైనల్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాటి(డిసెంబరు 15) తొలి సెమీస్ మ్యాచ్లో జైపూర్తో... బెంగళూరు తలపడనుంది. అదే విధంగా రెండో మ్యాచ్లో పుణెరి పల్టన్తో తమిళ్ తలైవాస్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లలో విజేతగా నిలిచిన జట్లు డిసెంబరు 17న టైటిల్ పోరుకు సిద్దంకానున్నాయి. చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ షాక్.. Lionel Messi: ఫైనల్లో అర్జెంటీనా.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ! వారెవ్వా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో -
PKL 2022: సెమీస్లో జైపూర్, పుణె.. పట్నాకు పరాభవం!
Pro Kabaddi League 2022- సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ల్లో పుణేరి పల్టన్ 44–30తో పట్నా పైరేట్స్పై, జైపూర్ పింక్ పాంథర్స్ 44–30తో హరియాణా స్టీలర్స్పై గెలిచాయి. మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్న పుణేరి, జైపూర్ జట్లు 79 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మిగతా జట్లు తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలిచినా పుణేరి, జైపూర్ జట్లను దాటే అవకాశం లేదు. కాగా టాప్–6లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్ చేరుకుంటాయి. మిగతా రెండు సెమీఫైనల్ బెర్త్ల కోసం నాలుగు జట్లు ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2 మ్యాచ్ల్లో తలపడతాయి. చదవండి: FIFA WC 2022: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! IND Vs Ban ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్ The 🔝 2⃣ teams in the #vivoProKabaddi Season 9 league stage are now just 2⃣ steps away from getting their hands on the 🏆#FantasticPanga #JaipurPinkPanthers #PuneriPaltan pic.twitter.com/27Gg62sKMB — ProKabaddi (@ProKabaddi) December 5, 2022 -
జైపూర్పై తలైవాస్ గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో తలైవాస్ 38–27 స్కోరుతో జైపూర్ పింక్పాంథర్స్పై గెలుపొందింది. తమిళ్ జట్టు రెయిడర్లు నరేందర్ (13 పాయింట్లు), అజింక్యా పవార్ (6 పాయింట్లు) అదరగొట్టారు. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. హరియాణా స్టీలర్స్, పుణేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన పోరు 27–27తో టైగా ముగిసింది. హరియాణా జట్టులో మన్జీత్ (8), మీతు శర్మ (8) రాణించారు. పుణేరి జట్టులో లమోహిత్ గోయత్ 17 సార్లు కూతకు వెళ్లి 11 పాయింట్లు సాధించాడు. మూడో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 34–29తో యూపీ యోధాస్ను ఓడించింది. పైరేట్స్లో సచిన్ (11), రోహిత్ (7) చక్కని ప్రదర్శన కనబరచగా, యోధాస్ జట్టులో స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ (12) రాణించాడు. చదవండి: T20 WC 2022: 'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా బెస్ట్ బ్యాటర్' -
PKL 2022: 16వ పరాజయం.. మీరు ఆడడం దండగ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టుకు 16వ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 35–54 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. తెలుగు టైటాన్స్ తరఫున ఆడుతున్న తెలంగాణ ప్లేయర్ గల్లా రాజు రెడ్డి అద్భుత రెయిడింగ్తో ఆకట్టుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన రాజు తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ లీగ్లో ఇప్పటివరకు 21 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక మ్యాచ్లో నెగ్గి, నాలుగు మ్యాచ్లను ‘టై’ చేసుకొని 16 మ్యాచ్ల్లో ఓడి 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 52–21తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు తమ 11వ మ్యాచ్లో ఎట్టకేలకు తొలి గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 35–34తో జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ ఎనిమిది పాయింట్లు... మరో రెయిడర్ ఆదర్శ్ తొమ్మిది పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ 13 పాయిం ట్లు స్కోరు చేశాడు. టైటాన్స్ ప్రస్తుతం 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 37–30తో పుణేరి పల్టన్పై గెలిచింది. -
Pro Kabaddi League: 3 పరాజయాల తర్వాత ఎట్టకేలకు..
బెంగళూరు: వరుసగా మూడు పరాజయాల తర్వాత జైపూర్ పింక్పాంథర్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మళ్లీ విజయం రుచి చూసింది. పుణేరి పల్టన్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్పాంథర్స్ 31–26తో గెలిచింది. జైపూర్ తరఫున రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. ఈ లీగ్లో జైపూర్, హరియాణా జట్లకు ఇది మూడో విజయం కావడం గమనార్హం. శనివారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ; యు ముంబాతో తెలుగు టైటాన్స్; గుజరాత్ జెయింట్స్తో పట్నా పైరేట్స్ తలపడతాయి. చదవండి: MS Dhoni: పాక్ పేసర్కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
ప్రొ కబడ్డీ లీగ్లో బెంగళూరు జోరు.. జైపూర్ పై గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన పోరులో బుల్స్ 38–31తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. ఏడు మ్యాచ్లాడిన బెంగళూరుకు ఇది ఐదో విజయం. బుల్స్ తరఫున కెప్టెన్ పవన్ షెరావత్ (18 పాయింట్లు) రాణించాడు. జైపూర్ జట్టులో అర్జున్ 13 పాయింట్లు చేశాడు. పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 30–30 స్కోరుతో టై అయ్యింది. నేడు జరిగే లీగ్ మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్తో పుణేరి పల్టన్ తలపడతాయి. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్... ఇక ఆ సిరీస్ కూడా కష్టమే! -
జైపూర్పై యు ముంబా గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో గురువారం జరిగిన మ్యాచ్లో యు ముంబా 37–28తో జైపూర్ పింక్ పాంథర్స్పై నెగ్గింది. యు ముంబా తరఫున అజిత్ కుమార్ 11 పాయింట్లు, జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 42–28తో హరియాణా స్టీలర్స్పై ఘనవిజయం సాధించింది. పవన్ కుమార్ 22 పాయింట్లతో మెరిశాడు. విజేతలు మాల్విక, మిథున్ సాక్షి, హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిథున్ మంజునాథ్, మాల్విక బన్సొద్ విజేతలుగా నిలిచారు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో గురువారం ముగిసిన టోర్నీలో రెండో సీడ్ మాల్విక మహిళల సింగిల్స్ టైటిల్ను చేజిక్కించుకోగా, పురుషుల టైటిల్ను ఎనిమిదో సీడ్ మిథున్ దక్కించుకున్నాడు. ఫైనల్లో మాల్విక 21–15, 21–9తో టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్కు షాకిచ్చింది. మిథున్ 21–15, 21–4తో ఆదిత్య జోషిపై గెలుపొందాడు. మహిళల డబుల్స్ తుది పోరులో సిమ్రన్ సింగ్–ఖుషీ గుప్తా జోడీ 21–16, 21–13తో తెలంగాణకు చెందిన వెన్నెల–శ్రియాన్షి వాలిశెట్టి జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో రవికృష్ణ–శంకర్ ప్రసాద్ ద్వయం 21–9, 21–12తో కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్–సంజన సంతోష్ జోడి విజేతగా నిలిచింది. విజేతలకు టాప్ షట్లర్ సైనా నెహ్వాల్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ బహుమతులు అందజేశారు. చదవండి: IND Vs SA: భారత్తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
ప్లే ఆఫ్స్కు యూపీ యోధ
గ్రేటర్ నోయిడా: ప్రస్తుత కబడ్డీ సీజన్ ప్లే ఆఫ్స్కు యూపీ యోధ అర్హత సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్కు పోటీ పడుతున్న జైపూర్ పింక్ పాంథర్స్ ఆశలు ఆవిరయ్యాయి. శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ 50–33తో దబంగ్ ఢిల్లీపై ఘన విజయం సాధించింది. మోను (11 పాయింట్లు), శ్రీకాంత్ (9 పాయింట్లు) రాణించడంతో యూపీ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 39–33తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై నెగ్గింది. -
టైటాన్స్ను గెలిపించిన సిద్ధార్థ్
జైపూర్: తెలుగు టైటాన్స్ను సిద్ధార్థ్ దేశాయ్ గెలిపించాడు. ఏకంగా 22 పాయింట్లతో చెలరేగిన అతను జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 51–31తో జైపూర్ పింక్ పాంథర్స్ను చిత్తు చేసింది. సిద్ధార్థ్కు తోడు రజ్నీశ్ దలాల్ సూపర్ టెన్ (11 పాయింట్లు), ట్యాక్లింగ్లో ఫర్హాద్ మిలాఘర్దాన్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 35–33తో యు ముంబాపై గెలుపొందింది. పవన్ షెరావత్ 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేటి మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో యూపీ యోధ; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
యు ముంబా సిక్సర్...
బెంగళూరు: రైడర్ అభిషేక్ సింగ్ (13 పాయింట్లు), డిఫెండర్ ఫజల్ అత్రాచలి (6 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో యు ముంబా జట్టు జయాపజయాలను సమం చేసింది. స్థానిక కంఠీరవ స్టేడియంలో శనివారం మ్యాచ్లో యు ముంబా 47–21తో జైపూర్ పింక్ పాంథర్స్ను చిత్తుగా ఓడించి ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన ముంబా 6 మ్యాచ్ల్లో గెలిచి మరో ఆరింటిలో ఓడినట్లయింది. అభిషేక్ సింగ్ 18 సార్లు రైడింగ్కు వెళ్లి 10 సార్లు సఫలమయ్యాడు. మరో 7 పర్యాయాలు పాయింట్లేమీ తీసుకురాకుండా, ఒకసారి మాత్రం ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోయాడు. మరో రైడర్ అర్జున్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. హరేంద్ర ఐదుగురిని పట్టేసి ఐదు పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లలో రైడింగ్లో నితిన్ రావల్ (5 పాయింట్లు), ట్యాకిల్లో అమిత్ హుడా (3 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 32–23తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. విజేత జట్టులో సౌరభ్ (8 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) రాణించారు. బెంగళూరు జట్టులో సచిన్, జీబీ మోరే చెరో 5 పాయింట్లు సాధించారు. నేడు యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్తో తమిళ్ తలైవాస్ ఆడతాయి. -
జైపూర్ విజయాల బాట
అహ్మదాబాద్: జైపూర్ పింక్ పాంథర్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. తమ చివరి మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిన పింక్ పాంథర్స్ ఆ షాక్ నుంచి త్వరగానే తేరుకున్నట్లు కనిపించింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 33–25తో పుణేరి పల్టన్ను ఓడించింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ నివాస్ హుడా మరో సూపర్ ‘టెన్’తో చెలరేగాడు. పుణే తరఫున పంకజ్ మోహిత్ 8 పాయింట్లతో రాణించాడు. ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జైపూర్... ఎక్కడా తడబాటుకు గురికాలేదు. తమ రైడింగ్తో ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదిస్తూ... అలాగే పుణే రైడర్లను పట్టేస్తూ దూసుకెళ్లింది. ఇదే జోరులో పుణేని ఆలౌట్ చేసి 17–11తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. రెండో అర్ధ భాగంలోనూ దూకుడును కొనసాగించిన జైపూర్ సీజన్లో 5 విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నేటి మ్యాచ్ల్లో యూ ముంబాతో పట్నా పైరేట్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
జైపూర్ జోరుకు బ్రేక్
పట్నా: వరుస విజయాలతో ఊపుమీదున్న జైపూర్ పింక్ పాంథర్స్ను దబంగ్ ఢిల్లీ నిలువరించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 35–24తో జైపూర్ పింక్ పాంథర్స్కు షాక్ ఇచ్చింది. నవీన్ కుమార్ (12 పాయింట్లు), చంద్రన్ రంజిత్లు (10 పాయింట్లు) ఢిల్లీకి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో నాలుగో విజయాన్ని అందించారు. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా విశేషంగా రాణించినా అతనికి సహచరుల నుంచి మద్దతు లభించలేదు. రెండో మ్యాచ్లో పుణేరి పల్టన్ 33–31తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్పై గెలిచింది. గిరీష్ (7 పాయింట్లు), పవన్ (6 పాయింట్లు)లు రాణించి పుణేని గట్టెక్కించారు. మ్యాచ్లకు నేడు విశ్రాంతి దినం. రేపు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధతో తమిళ్ తలైవాస్; పట్నా పైరేట్స్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
జైపూర్ హ్యాట్రిక్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 37–21తో హరియాణా స్టీలర్స్ను ఓడించి ఈ లీగ్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. దీపక్ హుడా మరోసారి సూపర్ ‘టెన్’ (మొత్తం 14 పాయింట్లు)తో చెలరేగడంతో హరియాణా చేతులెత్తేసింది. మరోవైపు హరియాణా స్టార్ రైడర్ నవీన్ కేవలం 3 పాయింట్లతో నిరాశపరిచాడు. రైడింగ్, డిఫెన్స్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జైపూర్ పాయింట్ల పట్టికలో ‘టాప్’కు చేరింది. ఖాతా తెరిచిన యూపీ యోధ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన యూపీ యోధ జట్టు ఖాతా తెరిచింది. యు ముంబాతో జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 27–23తో గెలిచింది. సొంత ప్రేక్షకుల మధ్య ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. యూపీ యోధ తరఫున మోను, సుమిత్లు చెరో ఆరు పాయింట్లతో రాణించారు. నేడు జరిగే మ్యాచ్లో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్తో దబంగ్ ఢిల్లీ తలపడతుంది. -
గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్
ముంబై : బెంగాల్ వారియర్స్ విజయం ముంగిట బోల్తాపడింది. యూపీ యోధపై భారీ విజయంతో ఊపు మీదున్న బెంగాల్కు జైపూర్ పింక్ పాంథర్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రొ కబడ్డీ సీజన్ 7లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్ 27-25 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో బెంగాల్ నాలుగు పాయింట్లతో లీడింగ్లో ఉంది. కనీసం ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నా బెంగాల్ విజయం సాధించేదే. కానీ జైపూర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన.. బెంగాల్ ఆటగాళ్ల తొందరపాటుతో గెలుపు సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జైపూర్ విజయంలో సారథి దీపక్ హుడా, డిఫెండర్ సందీప్ దుల్లు కీలకపాత్ర పోషించారు. మ్యాచ్ను ఘనంగా ఆరంభించిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టును తొలి నాలుగు నిమిషాలు పాయింట్ల ఖాతాను తెరవనివ్వలేదు. దీంతో 0-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రపంజన్(7), మణిందర్ సింగ్(6), బల్దేవ్ సింగ్(6)లు రాణించడంతో తొలి అర్ద భాగం ముగిసే సరికి బెంగాల్ 14-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్దభాగంలోనూ బెంగాల్ ఆటగాళ్లు ఆచితూచి ఆడారు. అయితే చివర్లో తడబడటంతో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. జైపూర్ ఆటగాళ్లు సందీప్ దుల్(8), దీపక్ హుడా(6), దీపక్ నర్వాల్(4) కీలక సమయంలో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఓవరాల్గా జైపూర్ 12 రైడ్, 10 టాకిల్ పాయింట్లు సాధించగా.. బెంగాల్ 13 రైడ్, 11 టాకిల్ పాయింట్లను సాధించింది. అయితే బెంగాల్ను ఓ సారి ఆలౌట్ చేయడం, మూడు ఎక్సట్రా పాయింట్లు సాధించడం జైపూర్కు కలిసొచ్చింది. -
జైపూర్ పింక్ పాంథర్స్ పంజా
సాక్షి, హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ మాజీ చాంపియన్స్ జైపూర్ పింక్ పాంథర్స్ ఏడో సీజన్ను ఘనవిజయంతో ప్రారంభించింది. ఆరంభ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ను ఓడించి దూకుడు మీదున్న యు ముంబా ఆటలు జైపూర్ పింక్ పాంథర్స్ ముందు సాగలేదు. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్ 42–23 తేడాతో యు ముంబాను ఓడించింది. జైపూర్ జట్టు 25 రైడ్ పాయింట్లు, 11 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా... యు ముంబా 18 రైడ్ పాయింట్లు, 5 టాకిల్ పాయింట్లతో పాంథర్స్ను అందుకోలేకపోయింది. పాంథర్స్ తరపున దీపక్ హుడా 11 పాయింట్లతో మెరిశాడు. అతనికి నితిన్ (7 పాయింట్లు), దీపక్ (6 పాయింట్లు), అమిత్ హుడా (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు. యు ముంబా తరపున అభిషేక్ (7 పాయింట్లు), డాంగ్ జీన్ లీ (6 పాయింట్లు) పర్వాలేదనిపించారు. దడదడలాడించిన దీపక్... ఆట ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించిన పాంథర్స్ ఏ దశలోనూ యు ముంబాకు కోలుకునే అవకాశాన్నివ్వలేదు. ముఖ్యంగా దీపక్ హుడా తన రైడ్లతో ప్రత్యర్థిని దడదడలాడించాడు. తన తొలి రెండు రైడ్లలో మూడు పాయింట్లు సాధించి జైపూర్కు మంచి ఆరంభాన్నిచ్చాడు. ఖాతా తెరవడానికే 4 నిమిషాల సమయం తీసుకున్న యు ముంబా ఏ దశలోనూ జైపూర్ డిఫెన్స్ను ఛేదించలేకపోయింది. మొదటి అర్ధ భాగం ముగిసే సరికి జైపూర్ 22–9 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. రెండో భాగంలోనూ పింక్ పాంథర్స్ ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసిన పాంథర్స్ ఒక్క సారి కూడా ఆలౌట్ కాలేదు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ జట్టు 34–24తో పుణేరి పల్టన్పై గెలుపొందింది. హరియాణా జట్టు స్టార్ రైడర్ నవీన్ 14 పాయింట్లతో ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాడు. మంగళవారం మ్యాచ్లకు విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
యు ముంబా చిత్తుచిత్తుగా
హైదరాబాద్ : ప్రొ కబడ్డీ సీజన్-7లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన మ్యాచ్లో యు ముంబా చిత్తయింది. తెలుగు టైటాన్స్పై విజయంతో ఊపుమీదున్న యూ ముంబా జట్టుకు జైపూర్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. సోమవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యు ముంబా 23-42 తేడాతో జైపూర్ చేతిలో చిత్తుగా ఓడింది. తొలి రైడ్లోనే దీపక్ హుడా రెండు పాయింట్లతో జైపూర్కు శుభారంభాన్ని అందించాడు. అక్కడి నుంచి జైపూర్ అటాకింగ్ గేమ్ ఆడి ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి 22-9తో జైపూర్ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యు ముంబా ఆటగాళ్లు ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు. ఫజల్ అత్రచెలీతో సహా అందరూ విపలమయ్యారు. జైపూర్ స్టార్ రైడర్స్ దీపక్ హుడా 11 పాయింట్లతో రెచ్చిపోగా.. నితిన్ రావల్ 7 పాయింట్లతో, దీపక్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. యు ముంబా రైడర్ అభిషేక్ సింగ్ ఒక్కడే 7 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. -
జైపూర్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ ‘డ్రా’
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 37–37తో ‘డ్రా’గా ముగిసింది. ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. తొలి సగం ముగిసే సరికి దబంగ్ ఢిల్లీ 18–17తో నిలిచింది. జైపూర్ తరఫున సెల్వమణి 11, దీపక్ హుడా 8 పాయింట్లు సాధించగా... ఢిల్లీ తరఫున చంద్రన్ రంజిత్ 11, పవన్ 9 పాయింట్లు చేశారు. శుక్రవారం నుంచి పోటీలు కోల్కతా వేదికగా జరుగనున్నాయి. నేటి మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో తమిళ్ తలైవాస్, పుణేరీ పల్టన్స్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
జైపూర్ ఐదో గెలుపు
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ పాంథర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. జోన్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–23తో పుణేరి పల్టన్పై గెలిచింది. రైడింగ్లో ఇరు జట్లు సత్తా చాటినా... ట్యాక్లింగ్లో అదరగొట్టిన జైపూర్ను విజయం వరించింది. పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా, సునీల్ చెరో 8 పాయింట్లు సాధించారు. పుణేరి పల్టన్ తరఫున జీబీ మోరే, సందీప్ నర్వాల్ ఐదేసి పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 28–21తో తమిళ్ తలైవాస్ గెలిచింది. నేటి మ్యాచ్ల్లో యూపీ యోధాతో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్తో యు ముంబా తలపడనున్నాయి. -
టైటాన్స్ గెలుపు బాట
సాక్షి, విశాఖపట్నం: ఎట్టకేలకు తెలుగు టైటాన్స్కు ఓ గెలుపు. ప్రొ కబడ్డీ లీగ్లో వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓటమి పాలైన టైటాన్స్... సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన రెండో మ్యాచ్లో విజయం సాధించింది. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 36–26తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు పోరాడటంతో టైటాన్స్ 17–13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలో రైడింగ్తో పాటు ట్యాక్లింగ్లోనూ రాణించి గెలుపును అందుకుంది. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ రాహుల్ చౌదరి, నీలేశ్ చెరో 8 పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్లో అనిల్ కుమార్ (4 పాయింట్లు) రాణించాడు. పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా 10, అజింక్యా పవార్ 6, సందీప్ ధుల్ 5 పాయింట్లు స్కోర్ చేశారు. సబ్స్టిట్యూట్గా బరిలో దిగిన తెలుగు ప్లేయర్ గంగాధరి మల్లేశ్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్లో యు ముంబా 31–20తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో జైపూర్ పింక్ పాంథర్స్, హరియాణా స్టీలర్స్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
దబంగ్ ఢిల్లీ ఘనవిజయం
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ విజయం సాధించింది. జోన్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 48–35తో జైపూర్ పింక్ పాంథర్స్ను చిత్తుచేసింది. రైడింగ్తో పాటు ట్యాక్లింగ్లోనూ ఆకట్టుకున్న ఢిల్లీ గెలుపొందగా... కేవలం రైడింగ్నే నమ్ముకున్న జైపూర్ చతికిలపడింది. ఢిల్లీ తరఫున మిరాజ్ షేక్ 15 రైడ్ పాయింట్లతో విజృంభించగా... నవీన్ కుమార్, చంద్రన్ రంజిత్ చెరో 9 పాయింట్లతో అతనికి చక్కటి సహకారం అందించారు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా 20 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 29–10తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన ఢిల్లీ ఆ తర్వాత ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ విజయం సొంతం చేసుకుంది. పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 35–35తో డ్రాగా ముగిసింది. నేడు జరిగే మ్యాచ్లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడనుంది. -
యూపీ యోధాపై తమిళ్ తలైవాస్ గెలుపు
గ్రేటర్ నోయిడా: రైడింగ్లో అజయ్ ఠాకూర్, సుఖేశ్ హెగ్డే... ట్యాక్లింగ్లో మన్జీత్ చిల్లర్, అమిత్ హుడా చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్ ఆర్ సీజన్లో తమిళ్ తలైవాస్ మూడో విజయం నమోదు చేసింది. జోన్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 46–24తో యూపీ యోధాపై విజయం సాధించింది. అజయ్ సుఖేశ్ చెరో 9 రైడ్ పాయింట్లు ... మన్జీత్ 8, అమిత్ 6 ట్యాకిల్ పాయింట్లు సాధించారు. మ్యాచ్ ఆరంభం నుంచి తలైవాస్ దూకుడుగా ఆడటంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 26–11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలోనూ అధిపత్యం కొనసాగిస్తూ సునాయాస విజయం సొంతం చేసుకుంది. యూపీ యోధా తరఫున ప్రశాంత్ కుమార్ రాయ్ 7 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 36–25తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. నేటి మ్యాచ్ల్లో యు ముంబాతో పుణేరీ పల్టన్, యూపీ యోధాతో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. -
పట్నా పైరేట్స్ విజయం
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన పట్నా పైరేట్స్ మూడో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పట్నా 41–30తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలిచింది. కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 11, మన్జీత్ 10 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్లో వికాస్ కాలె (5 పాయింట్లు) సత్తా చాటడంతో పట్నా పైరేట్స్ సునాయాసంగా గెలుపొందింది. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున దీపక్ 7 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో సునీల్ (3 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 36–25తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్తో యు ముంబా తలపడనున్నాయి. -
యు ముంబా చేతిలో జైపూర్ ఓటమి
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యు ముంబా జట్టు రెండో మ్యాచ్లో బోణీ కొట్టింది. బుధవారం జరిగిన పోరులో యు ముంబా జట్టు 39–32తో జైపూర్ పింక్పాంథర్స్ను కంగుతినిపించింది. యు ముంబా రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ (13 పాయింట్లు) అదరగొట్టాడు. రోహిత్ బలియన్ 7 పాయింట్లు సాధించాడు. పింక్పాంథర్స్ జట్టులో నితిన్ (8) రాణించాడు. అనూప్ 4, మోహిత్, సందీప్ ధుల్, అమిత్ తలా 3 పాయింట్లు చేశారు. ఈ మ్యాచ్ను జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ సతీమణి ఐశ్వర్యరాయ్ ఆసక్తిగా తిలకించారు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ లీగ్లో శుభారంభం చేసిం ది. 48–37 స్కోరుతో తమిళ్ తలైవాస్ను ఓడించింది. నేడు యూపీ యోధతో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
ఢిల్లీపై జైపూర్ పింక్ పాంథర్స్ గెలుపు
రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో జైపూర్ పింక్పాంథర్స్ 36–25 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించగా... పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 37–37తో టై అయ్యింది. -
టైటాన్స్కు షాక్
వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో ఓటమనేదే లేని తెలుగు టైటాన్స్ కీలక పోరులో చతికిలపడింది. సొంత గడ్డపై పూర్తి స్థాయిలో ప్రేక్షకుల మద్దతు లభించినా మరోసారి సెమీఫైనల్లోనే చిత్తయ్యింది. ప్రథమార్ధంలో తెగువ చూపించినా ఆ తర్వాత పేలవ ఆటతీరుతో అభిమానులను నిరాశపరిచింది. అటు పెద్దగా స్టార్ ఆటగాళ్లు లేకున్నా సమష్టి ఆటతీరుతో రాణించిన జైపూర్ పింక్ పాంథర్స్ రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరో సెమీస్లో పట్నా జట్టు పుణెరిపై గెలిచింది. * సెమీస్లో జైపూర్ చేతిలో ఓటమి * ప్రొ కబడ్డీ లీగ్ సాక్షి, హైదరాబాద్: సొంత గడ్డపై తెలుగు టైటాన్స్కు షాక్ తగిలింది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో సెమీస్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన టైటాన్స్ 24-34 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో మట్టికరిచింది. తొలి సీజన్లో విజేతగా నిలిచిన జైపూర్ ఫైనల్కు చేరడం ఇది రెండోసారి. టైటాన్స్ నుంచి రాహుల్ చౌదరి 9, నీలేశ్ 6 రైడింగ్ పాయింట్లు సాధించగా జైపూర్ తరఫున కెప్టెన్ జస్వీర్ సింగ్ 7 రైడింగ్, 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జైపూర్ జట్టు పట్నా పైరేట్స్తో ఢీకొంటుంది. మూడో స్థానం కోసం జరిగే పోరులో తెలుగు టైటాన్స్, పుణెరి పల్టన్తో ఆడుతుంది. మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు కొదమసింహాల్లా తలపడడంతో పాయింట్ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకుండా పోయింది. దీంతో 18వ నిమిషం వరకు కూడా స్కోరు 8-8తో సమానంగానే ఉంది. ఈ దశలో టైటాన్స్కు నీలేష్ ఓ పాయింట్ తేగా వెంటనే జైపూర్కు అజయ్ కుమార్ రెండు పాయింట్లు తేవడంతో 10-9తో పైచేయి సాధించింది. ఆ తర్వాత రాహుల్ విజయవంతమైన రైడ్తో జట్టు ప్రథమార్ధాన్ని 11-10స్వల్పఆధిక్యంతో ముగించింది. కానీ ద్వితీయార్ధంలో టైటాన్స్ ఆట పూర్తిగా గతి తప్పింది. దీంతో జైపూర్ రెచ్చిపోయింది. జస్వీర్ సింగ్ సూపర్ రైడింగ్తో అదరగొట్టాడు. దీంతో వరుసగా పాయింట్లు సాధిస్తూ టైటాన్స్ను ఆలౌట్ చేయడంతో జైపూర్ 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఒక్క పాయిం ట్నూ కోల్పోకుండా టైటాన్స్ను మరోసారి ఆలౌట్ చేయడంతో స్కోరు 26-14కు పెరిగింది. 33వ నిమిషంలో రాహుల్ వరుసగా తన రెండు రైడింగ్లలో రెండేసి చొప్పున 4 పాయింట్లు సాధించాడు. 34వ నిమిషంలో జైపూర్ సూపర్ ట్యాకిల్లో రాహుల్ను అవుట్ చేసి రెండు పాయింట్లు రాబట్టింది. చివరి రెండు నిమిషాల్లో వ్యత్యాసం పది పాయింట్లు తేడా ఉండడంతో టైటాన్స్ చేసేదేమీ లేకుండా పోయింది. పట్నా వరుసగా రెండోసారి: డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ వరుసగా రెండోసారి ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఈ జట్టు 37-33 తేడాతో పుణెరి పల్టన్పై నెగ్గింది. పట్నా నుంచి పర్దీప్ నర్వాల్ 8, రాజేశ్ 6 రైడింగ్ పాయింట్లతో రాణించగా కుల్దీప్ 5 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పుణెరిలో దీపక్ హుడా 9 పాయింట్లు సాధించాడు. తొలి పది నిమిషాలపాటు మ్యాచ్ 6-6 పాయింట్లతో పోటాపోటీగా సాగింది. ఈ దశలో పర్మోద్ నర్వాల్ మూడు పాయింట్లు తేవడంతో పుణెరి ఆధిక్యంలోకి వెళ్లినా మరో ఆరు నిమిషాల వరకు పట్నా హవా సాగింది. వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి 15-9తో పుంజుకుంది. ఇదే జోరుతో తొలి అర్ధభాగాన్ని 16-13తో ముగించింది. అయితే ద్వితీయార్ధంలో పుణెరి మెరుగ్గా ఆడింది. 32వ నిమిషంలో పట్నాను ఆలౌట్ చేయడంతో పుణెరి 25-22తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యం దాదాపు చివరి వరకు కాపాడుకున్నా ఆ తర్వాత మాత్రం చేజార్చుకుంది. 37వ నిమిషంలో రాజేశ్ మొండల్ రెండు పాయింట్లు తేవడంతో పట్నా మ్యాచ్ను 29-29తో సమం చేసింది. ఇక పర్దీప్ నర్వాల్ సూపర్ రైడ్తో దూసుకెళ్లిన పట్నా మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. -
తెలుగు టైటాన్స్ జోరు కొనసాగేనా?
హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్-4లో అంచనాలు మించి రాణించిన జట్టు తెలుగు టైటాన్స్. వరుస విజయాలతో దుమ్మురేపిన టైటాన్స్ ఇప్పుడు టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలించింది. ఈ సీజన్లో తొలి మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలై టోర్నీలో వెనుకబడిన తెలుగు టైటాన్స్ .. ఆ తరువాత అధ్బుతమైన ఆట తీరుతో చెలరేగిపోయింది. ఈ టోర్నీలో ఎనిమిది విజయాలను కైవసం చేసుకున్న తెలుగు టైటాన్స్.. . రెండు మ్యాచ్లను టై చేసుకుని సెమీస్ బరిలో నిలిచింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ తో పాటు, పాట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టాన్లు సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి.. తొలి సెమీస్లో పట్నా పైరేట్స్తో పుణేరి పల్టాన్ తలపడుతుండగా, జైపూర్ పింక్ పాంథర్స్తో తెలుగు టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచ్లూ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం రాత్రి గం.8.00ల.కు ఆరంభం కానున్నాయి. ఇప్పటివరకూ ప్రొ కబడ్డీ సీజన్ లో టైటిల్ ను కైవసం చేసుకోలేని తెలుగు టైటాన్స్ ఈసారి ఆ లక్ష్యం దిశగా సాగుతోంది. ప్రొ కబడ్డీ-2 సీజన్ లో భాగంగా 2015లో ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్ కు చేరిన టైటాన్స్.. గత సీజన్లో చివర్లో చతికిలబడి ఐదో స్థానానికే పరిమితమైంది. అయితే ఈ సీజన్ ఆరంభంలో టైటాన్స్ పై పెద్దగా అంచనాలు లేవు. కొంతమంది కీలక ఆటగాళ్లు వేరే జట్లుకు మారడంతో టైటాన్స్ సెమీస్ కు చేరడం కష్టంగానే కనిపించింది. కాగా, కెప్టెన్ రాహుల్ చౌదరి, సందీప్ నర్వాల్, సందీప్ ధుల్లు విశేషంగా రాణించడంతో టైటాన్స్ సులభంగానే సెమీస్ కు చేరుకుంది. ఓవరాల్ ప్రొ కబడ్డీలో 400కు పైగా రైడింగ్ పాయింట్లు సాధించి రికార్డు సృష్టించిన రాహుల్.. ఈ సీజన్లో 123 రైడింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అత్యుత్తమ రైడర్ గా కొనసాగుతున్నాడు. మరోసారి రాణించి తన జట్టును తొలిసారి ఫైనల్ కు చేర్చాలనే పట్టుదలతో రాహుల్ ఉన్నాడు. మరోవైపు తొలి సీజన్ లో టైటిల్ సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్.. ఈ సీజన్ లో ఎనిమిది విజయాలతో సెమీస్ కు చేరింది. అయితే లీగ్ దశలో తలో మ్యాచ్లో గెలిచిన ఇరు జట్లు సెమీస్లో మరోసారి తమ సత్తా నిరూపించుకునేందుకు సన్నద్ధమయ్యాయి.. ప్రొ కబడ్డీ టైటిల్ ను రెండోసారి తన ఖాతాలో వేసుకోవాలని జైపూర్ భావిస్తుండగా, తొలిసారి టైటిల్ ను గెలిచి తీరాలని టైటాన్స్ పట్టుదలగా ఉంది. దీంతో ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనబడుతోంది. -
జైపూర్ ‘సిక్సర్’
కోల్కతా: అటాకింగ్లో దూకుడు చూపెట్టిన జైపూర్ పింక్ పాంథర్స్... ప్రొ కబడ్డీ లీగ్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో 33-27తో పుణేరి పల్టన్పై విజయం సాధించింది. అమిత్ హుడా (3), రన్ సింగ్ (2)లు డిఫెన్స్లో సత్తా చాటితే... జస్వీర్ సింగ్ (7) రైడింగ్లో చెలరేగిపోయాడు. ఫలితంగా పుణేను రెండుసార్లు ఆలౌట్ చేశారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 33-27తో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది. దీంతో 8 విజయాలతో 41 పాయింట్లతో టాప్లో నిలిచింది. పట్నా తరఫున ప్రదీప్ (9), ఫజల్ (7), సుర్జీత్ (6), రాజేశ్ (3), ధర్మరాజ్ (3)లు రాణించారు. మోను గోయట్ (9), కున్ లీ (7), అమిత్ (4), సుర్జీత్ నర్వాల్ (3) వారియర్స్కు పాయింట్లు అందించారు. సోమవారం జరిగే ఏకైక మ్యాచ్లో బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
పుణేపై నెగ్గిన జైపూర్
కోల్కతా: తొలిసీజన్ విజేత జైపూర్ పింక్ పాంథర్స్ ప్రొకబడ్డీ లీగ్లో ఆరో విజయం తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం పుణేరి పల్టన్తో జరిగిన మ్యాచ్లో 33-27తో జయకేతనం ఎగరవేసింది. మ్యాచ్ 14వ నిమిషంలో పుణేను ఆలౌట్ చేసిన జైపూర్ 12-7తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత జోరును కొనసాగించి తొలి అర్ధభాగం ముగిసేసరికి 17-9తో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలో మరోసారి పుణేను ఆలౌట్చేసి 25-14కు ఆధిక్యం పెంచుకుంది. ఆ తర్వాత పుణే పుంజుకున్నా.. జైపూర్ మాత్రం తన జోరుమాత్రం తగ్గించలేదు. దాంతో విజయం సొంతం చేసుకుంది. మ్యాచ్లో పుణే ఆటగాళ్లు దీపక్ నివాస్ హుడా, అజయ్ ఠాకూర్ తొమ్మిదేసి పాయింట్లతో రాణించగా.. జైపూర్ ఆటగాళ్లు రాజేష్ నర్వాల్, జస్వీర్ సింగ్ ఏడేసి పాయింట్లతో సత్తాచాటారు. -
బెంగాల్ సంచలన విజయం
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో సొంతగడ్డపై తొలి మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ సంచలన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఈ జట్టు 32-25 తేడాతో పటిష్ట జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. బెంగాల్ విజయంలో జంగ్ కున్ లీ 12 రైడింగ్ పాయింట్లతో కీలకంగా వ్యవహరిం చాడు. ఈ సీజన్లో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో బెంగాల్కు ఇది కేవలం రెండో విజయం. జైపూర్కు వరుసగా ఇది రెండో పరాజయం. ఆరంభంలో 13వ నిమిషంలో ఇరు జట్ల స్కోరు 10-10తో సమానంగా ఉన్న దశలో లీ ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో ఐదు పాయింట్ల ఆధిక్యం లభించింది. తొలి అర్ధ భాగాన్ని 18-13తో ముగించిన బెంగాల్ ఆతర్వాత కూడా జైపూర్ను ఇబ్బంది పెట్టింది. డిఫెండర్ నీలేష్ షిండే నాలుగు ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. జైపూర్ నుంచి అజయ్ కుమార్ 11 రైడింగ్ పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్లో డిఫెండింగ్ చాంప్ పట్నా పైరేట్స్ 34-24 తేడాతో యు ముంబాను ఓడించింది. దీంతో 36 పాయింట్లతో జైపూర్ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ప్రొ కబడ్డీలో నేడు పుణెరి పల్టాన్ X జైపూర్ పింక్ పాంథర్స్ రాత్రి 8 గంటల నుంచి బెంగాల్ వారియర్స్ X పట్నా పైరేట్స్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం -
యు ముంబా జోరు
జైపూర్: డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా ప్రొ కబడ్డీ లీగ్లో తమ జోరును కొనసాగిస్తోంది. లీగ్ ఆరంభంలో కాస్త తడబడ్డ యు ముంబా ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో యు ముంబా 30-17 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. తద్వారా ఈ లీగ్లో వరుసగా ఐదో విజయాన్ని, ఓవరాల్గా ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ మొదలైన తొలి క్షణం నుంచే ముంబా జట్టు తమ పట్టు బిగించింది. ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి 10-2తో ముందంజ వేసి తమ ఆధిక్యాన్ని ఎనిమిది పాయింట్లకు పెంచుకుంది. విరామ సమయానికి 17-6తో ఆధిక్యంలో ఉన్న ముంబా జట్టు చివరి నిమిషం వరకు తమ జోరును కొనసాగించి వారియర్స్కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. ముంబా జట్టులో రిషాంక్, ఫాజిల్ ఆరేసి పాయింట్లు సాధించగా... అనూప్ కుమార్ ఐదు పాయింట్లు సంపాదించాడు. బెంగాల్ జట్టులో జాంగ్ కున్ లీ ఒక్కడే కాస్త రాణించి నాలుగు పాయింట్లు స్కోరు చేశాడు. పట్నా చేతిలో జైపూర్ చిత్తు సొంత వేదికపై మ్యాచ్లను జైపూర్ పింక్ పాంథర్స్ హ్యాట్రిక్ పరాజయాలతో ముగించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 47-24 తేడాతో జైపూర్ను చిత్తుగా ఓడించింది. ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో జైపూర్ ఒక్కటి మాత్రమే నెగ్గింది. లీగ్లో టేబుల్ టాపర్గా ఉన్న పట్నా ఆటగాళ్ల దూకుడుకు జైపూర్ బెంబేలెత్తింది. వీరి ఖాతా తెరవడానికి ముందే పట్నా 10 పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం 5-27తో వెనుకబడిన జైపూర్ చివర్లో కాస్త పుంజుకుంది. స్కోరు 9-42గా ఉన్న దశలో రాజేశ్ నర్వాల్ (10 పాయింట్లు) రాణించడంతో చివరకు ఓమాదిరి స్కోరైనా అందుకోగలిగింది. పట్నా నుంచి రోహిత్ కుమార్ 13 పాయింట్లు సాధించాడు. -
తెలుగు టైటాన్స్ విజయం
ప్రొ కబడ్డీ లీగ్ పుణే: చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 27-25 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. ఇది టైటాన్స్కు నాలుగో విజయం. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభంలో జైపూర్ ఆటగాళ్లు జోరు కనబరిచారు. ఆట చివరి 2 నిమిషాల వరకు కూడా జైపూర్ 23-18తో స్పష్టమైన ఆధిక్యంలోనే ఉంది. అయితే 38వ నిమిషంలో టైటాన్ తరఫున సబ్ స్టిట్యూట్గా బరిలోకి దిగిన ప్రశాంత్ కుమార్ రాయ్ అద్భుతమే చేశాడు. వచ్చీ రాగానే రైడ్కు వెళ్లిన తను 2 పాయింట్లు సాధించి స్కోరును 23-20కి చేర్చాడు. ఆ తర్వాత మెరాజ్ షేక్ స్కోరును సమం చేశాడు. ఈ తరుణంలో జైపూర్ మెరుగ్గా ఆడి 25-24తో ఆధిక్యం సాధించింది. అయితే 41వ నిమిషంలో చివరి రైడ్కు వెళ్లిన ప్రశాంత్ రాయ్ ప్రత్యర్థి కోర్టులో ఉన్న ఏకైక ఆటగాడిని అవుట్ చేయడంతో ఆలౌట్ ద్వారా మూడు పాయింట్లు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. మెరాజ్ షేక్ మొత్తం ఏడు రైడ్, నాలుగు టాకిల్ పాయింట్లు సాధించాడు. జైపూర్లో సోను నర్వాల్ 5 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో యు ముంబా 29-27తో పుణెరి పల్టన్ను ఓడించింది. -
ప్రొ కబడ్డీ సెమీస్లో పట్నా పైరేట్స్
పుణే : ప్రొ కబడ్డీ లీగ్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఈసారి లీగ్ దశతోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 26-24తో జైపూర్పై నెగ్గి సెమీస్కు చేరింది. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఇరు జట్లు బరిలోకి దిగిన ఈ మ్యాచ్లో పట్నా వ్యూహాత్మకంగా ఆడి గెలిచింది. యు ముంబా, టైటాన్స్, బుల్స్ ఇప్పటికే సెమీస్కు చేరాయి. ఈ సీజన్లోని ఆఖరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు 31-30తో పుణేపై గెలిచింది. సెమీస్లో ఎవరితో ఎవరు ఆగస్టు 21 (శుక్రవారం) యు ముంబా x పట్నా పైరేట్స్ తెలుగు టైటాన్స్ x బెంగళూరు బుల్స్ -
పుణేరి పల్టన్ పై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్-2 లో భాగంగా పుణేరి పల్టన్ తో జరిగిన మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో 31-18 తేడాతో పుణేరి పల్టన్పై గెలిచింది. తొలి అర్ధభాగంలో 16-8 తో ఆధిక్యంలో ఉన్న జైపూర్ ద్వితియార్ధంలో తమ జోరు తగ్గినా గెలుపు అవకాశాలను ఏ దశలోనూ కోల్పోలేదు. ద్వితియార్ధం చివరి నిమిషాల్లో వరుస పాయింట్లు గెలుస్తూ 31-18 తేడాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జైపూర్ ఆటగాడు రాజేష్ నర్వాల్ 6 పాయింట్లు తీసుకొచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్ జోరును పింక్ పాంథర్స్ ఈ మ్యాచ్లోనూ కొనసాగించింది. గత మ్యాచ్లో 51-21 భారీ తేడాతో దబాంగ్ ఢిల్లీపై గెలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో అదే భారీ గెలుపు. సీజన్ ఆరంభంలో తడబాటుకు గురైన డిఫెండింగ్ చాంపియన్లు క్రమంగా జోరందుకున్నారు. వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. -
తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై
ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత 40 నిమిషాల సమయంలో ఇరు జట్లు 39 పాయింట్లే సాధించడంతో మ్యాచ్ టై అయినట్లు ప్రకటించారు. తొలి అర్ధభాగంలో 20-12తో ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్ రెండో అర్ధభాగంలో తమ జోరును కొనసాగించలేక పోయింది. జైపూర్ అటగాళ్లు తమ దాడిని ఉదృతం చేయడంతో రెండు జట్లను విజయం దోబుచులాడింది. మ్యాచ్ చివరి సెకన్ వరకూ ఉత్కంఠ నెలకొన్న ఏ జట్టూ విజయాన్ని సాధించలేకపోయింది. సొంత స్టేడియంలో ఆడుతున్నప్పటికీ విజయాన్ని సాధించలేక పోవడంతో అభిమానులు నిరాశ చెందారు. -
జైపూర్కు రెండో విజయం
పట్నా: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్కు ప్రొ కబడ్డీ లీగ్ తాజా సీజన్లో రెండో విజయం దక్కింది. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్లు ఆడినా పెద్దగా ఆకట్టుకోని జైపూర్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్లో పూర్తి స్థాయిలో రెచ్చిపోయింది. ఫలితంగా పుణేరి పల్టన్స్పై 35-29 తేడాతో నెగ్గింది. సోను నర్వాల్ 8, జస్వీర్ సింగ్, రాజేశ్ నర్వాల్ ఎనిమిదేసి రైడ్ పాయింట్లు సాధించారు. జైపూర్ రెండు సార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఇరు జట్లు సమానంగా చెరి 20 రైడ్ పాయింట్లు సాధించాయి. పుణే కెప్టెన్ ప్రవీణ్ నివాలే 9 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. ప్రారంభం నుంచే జైపూర్ జోరును ప్రదర్శించడంతో తొలి అర్ధ భాగంలో 19-13తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా ఇదే ఆధిపత్యాన్ని చూపెట్టి పుణెను ఓడించింది. పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్ మధ్య హోరాహోరీగా జరిగిన మరో మ్యాచ్ 20-20తో ‘డ్రా’గా ముగిసింది. సోమవారం మ్యాచ్లు లేవు. మంగళవారం హైదరాబాద్ అంచె పోటీలు ప్రారంభమవుతాయి.