Lyca Productions
-
అజిత్ మూవీకి షాక్.. కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో ప్రత్యక్షం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి అనే సరికొత్త యాక్షన్-థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఒక పక్కా అభిమానులు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మరోపక్క పైరసీ కేటుగాళ్లు చిత్ర బృందానికి షాకిచ్చారు. విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్టింట్లో అప్లోడ్ చేసేశారు. దీంతో నిర్మాతలతో పాటు అజిత్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొద్ది గంటల్లోనే నెట్టింట ప్రత్యక్షం..అయితే ఈ సినిమాను కూడా పైరసీ భూతం వదల్లేదు. విదాముయార్చి థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే నెట్టింట దర్శనమిచ్చింది. కొన్ని పైరసీ వెబ్ సైట్స్లో ఈ సినిమా కనిపించింది. దాదాపు నాలుగైదు వెబ్సైట్స్లో విదాముయార్తి ఫుల్ మూవీని అప్లోడ్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని.. టికెట్ కొని సినిమా చూడమని వేడుకుంటున్నారు. సినిమా రిలీజ్కు ముందే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసినప్పటికీ పైరసీదారులు అస్సలు పట్టించుకోలేదు.కలెక్షన్లపై తీవ్ర ప్రభావం..విదాముయార్చి పైరసీ బారిన పడడంతో మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రం కావడంతో నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మాణ సంస్థ ముందే విజ్ఞప్తి చేసిన పైరసీకి గురి కావడంతో అజిత్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. భారీ అంచనాలతో రికార్డ్ వసూళ్లు సాధిస్తుందనుకున్న విదాముయార్చికి పైరసీ భూతం అడ్డంకిగా మారింది. కాగా.. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కాసాండ్రా కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ మూవీని పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు.Every effort counts! 💪 Say NO to piracy and watch VIDAAMUYARCHI only in theatres! 🤩FEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @akarjunofficial… pic.twitter.com/WigarpFJ34— Lyca Productions (@LycaProductions) February 5, 2025 -
ఇండియన్–3 సినిమాపై శంకర్ ప్రకటన
నటుడు కమలహాసన్(Kamal Haasan), శంకర్(S. Shankar) కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ఇండియన్.. ఏఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 1996లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. 26 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్గా ఇండియన్–2 రూపొందింది. అదే దర్శకుడు, నటుడు నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఇకపోతే దర్శకుడు శంకర్ తొలిసారిగా తెలుగులో రామ్చరణ్ కథానాయకుడుగా తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. బడ్జెట్లో బ్రహ్మాండంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సక్సెస్ఫుల్గా ప్రదర్శించబడుతోంది. దీంతో దర్శకుడు శంకర్ మరో చిత్రం ఏంటన్న విషయంపై జరుగుతున్న చర్చకు ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇండియన్–3 (Indian 3) చిత్రంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసి ఆరు నెలల్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా తన దర్శకత్వంలో వేల్పారి అనే చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చెప్పారు. మదురై ఎంపీ ఎస్ వెంకటేశన్ రాసిన రచించిన నవల ఆధారంగా కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీన్ని మూడు భాగాలుగా రూపొందించనున్నట్లు చెప్పారు.బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఇండియన్-2గత ఏడాదిలో విడుదలైన ఇండియన్ 2 మూవీ భారతీయ సినీ చరిత్రలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజైన ఈ చిత్రం 73 కోట్ల (నెట్) వరకు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కమల్హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. తెలుగులో కూడా భారతీయుడు 2 మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఫుల్ థియేట్రికల్ రన్లో పదమూడు కోట్లు మాత్రమే కలెక్షన్స్ అందుకుంది. సుమారు రూ. 12 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొంది. -
తమిళనాడులో 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ
సౌత్ ఇండియాలో ఈ సారి సంక్రాంతికి సినీ సంబరాలు గ్యారెంటీ అనిపిస్తోంది. టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కూడా బరిలోకి చాలా చిత్రాలు ఉన్నా యి. తెలుగులో డాకు మహరాజ్, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు టాప్లో ఉన్నాయి. కానీ, తమిళ్లో నటుడు అజిత్, త్రిష జంటగా నటించిన 'విడాముయర్చి' ప్రధానంగా రేసులో ఉంది. ఈ చిత్రం పొంగల్కు తెరపైకి రానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర విడుదలను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది నటుడు అజిత్ అభిమానులను నిరాశ పరచే విషయమే అవుతుంది.కాగా విడాముయర్చి చిత్రం వాయిదా పడటంతో కొత్తగా మరిన్ని చిత్రాలు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అజిత్ సినిమా వాయిదాతో ఇప్పుడు రామ్ చరణ్ చిత్రానికి మరిన్ని థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంది. పొంగల్ రేసులో తమిళ పెద్ద హీరోలు ఎవరూ లేకపోవడంతో శంకర్, రామ్ చరణ్లు అక్కడ గేమ్ ఛేంజర్స్గా నివలనున్నారు. అయితే, ఈ సంక్రాంతి బరిలో నటుడు జయంరవి, నిత్యామీనన్ జంటగా నటించిన 'కాదలిక్క నేనమిలై' చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. అదే విధంగా సంచలన దర్శకుడు బాలా తెరకె క్కించిన వణంగాన్ చిత్రం ఈ నెల 10న తెరపైకి రానుంది. నటుడు అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సురేశ్కామాక్షీ భారీ ఎత్తున నిర్మించారు.ఇకపోతే వీటంన్నిటిలో భారీ బడ్జెట్ సినిమాగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్పైనే కోలీవుడ్ అభిమానులు ఉన్నారు. సంక్రాంతి బరి నుంచి అజిత్ నటించిన విడాముయర్చి తప్పుకోవడంతో రామ్చరణ్ గేమ్ ఛేంజర్కు భారీ ప్లస్ అవుతుందని చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే సంక్రాంతి చిత్రాల్లో ఈ రెండు చిత్రాలపైనే భారీ అంచనాలు ఇప్పటి వరకు ఉన్నాయి. చివరి క్షణంలో అజిత్ తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్కు కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్తో కోలీవుడ్ సినీ అభిమానులకు చరణ్ దగ్గరయ్యాడు. ఇప్పుడు అక్కడ పెద్ద సినిమాలు లేవు కాబట్టి గేమ్ ఛేంజర్కు భారీ ఓపెనింగ్స్ ఉండే ఛాన్స్ ఉంది. -
విజయ్ కుమారుడి డైరెక్షన్లో టాలీవుడ్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిలా యాక్టర్ కాకుండా డైరెక్టర్గా మారిన విషయం తెలిసిందే. ఆయన డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమాలో టాలీవుడ్ హీరోకు అవకాశం దక్కింది. విజయ్ అభిమానులు కూడా జేసన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో తెరెక్కిస్తుంది.జాసన్ సంజయ్ తన డెబ్యూ మూవీని ఇప్పటికే అఫీషియల్గా ప్రకటించారు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్కు ఛాన్స్ దక్కినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారని సమాచారం. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ప్రధాన హీరో, హీరోయిన్లు ఎవరనేది తెలియాల్సి ఉంది.ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాత సుభాస్కరన్ మాట్లాడుతూ.. 'జాసన్ సంజయ్ దర్శకత్వంలో లైకాలో చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. అతను మాకు కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. సినిమా ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు కథలో ఉన్నాయి. తమిళ చిత్రసీమలో పాపులర్ అవుతున్న పలువురు నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నాం. ఇప్పటికే వారితో చర్చలు కూడా జరుగుతున్నాయి.' అని ఆయన అన్నారు.ఈ క్రమంలో జేసన్ సంజయ్ మొదటి సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తారని మొదట వార్తలు వచ్చాయి. అయితే, ఈ బిగ్ ప్రాజెక్ట్లో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించడం దాదాపు ఖాయమైందని సమాచారం. కొన్ని నెలల క్రితం విడుదలైన 'రాయన్' చిత్రంతో ఆయన ఇప్పుడు ట్రెండ్లో ఉన్నారు. అందులోని ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సందీప్ కిషన్కు ఇలా ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు. -
రజినీకాంత్ లేటేస్ట్ మూవీ .. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్స్టార్, తలైవా రజినీకాంత్ ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. వచ్చేనెల 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండండతో మేకర్స్ దూకుడు పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మనసిలాయో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. తాజాగా రిలీజైన లిరికల్ సాంగ్ తలైవా ఫ్యాన్స్ను ఓ ఊపు ఊపేస్తోంది.తలైవా కోసం తప్పుకున్న కంగువా..తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ దసరాకు ఊహించని విధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రేసులోకి రావడంతో కంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంగువా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఓ ఈవెంట్లో సూర్య అధికారికంగా ప్రకటించారు. -
వారికి హెచ్చరిక.. లైకా ప్రొడక్షన్స్ పేరుతో మోసాలు
సోషల్ మీడియా ప్రపంచంలో చాలా జాగ్రత్తగా మెలగాలి లేదంటే కేటుగాళ్ల చేతికి దొరికిపోతారు. ముఖ్యంగా చాలామంది సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారిని ట్రాప్లోకి లాగి నిండా ముంచేస్తారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ పేరుతో మోసం చేయడానికి మోసగాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి విషయాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను పోలీసు శాఖ హెచ్చరిస్తూనే ఉంది. తాజాగా లైకా ప్రొడక్షన్స్ పేరుతో అనేక అనధికారిక కాస్టింగ్ కాల్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.కోలీవుడ్లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మాత సుభాస్కరన్ నిర్మించారు. లైకా ప్రొడక్షన్స్ పేరుతో అనధికారికంగా కొందరు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి సినిమా ఛాన్స్లు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయని ఆ సంస్థ గుర్తించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు లైకా తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించనున్న సినిమాల కోసం ఏవైనా కాస్టింగ్ కాల్లు లేదా ఆడిషన్లు ఉంటే తమ ధృవీకరించబడిన సోషల్ మీడియా పేజీల ద్వారా మాత్రమే అధికారికంగా ప్రకటించబడతాయని తెలిపింది. సోషల్ మీడియాలో అనధికారికంగా ఇలా ఫేక్ కాస్టింగ్ కాల్స్ల ట్రాప్లో చిక్కుకోకూడదని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. తమ సంస్థ పేరుతో కాస్టింగ్ కాల్లు లేదా ఆడిషన్లు నిర్వహించే అనధికార వ్యక్తులు, ఏజెన్సీలపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లైకా ప్రొడక్షన్ హెచ్చరించింది. ఇలాంటి వారి సమాచారం మీ దృష్టికి వస్తే సమాచారం ఇవ్వండి అంటూ కోరింది. View this post on Instagram A post shared by Lyca Productions (@lycaproductions) -
ఇది మూవీ షూటింగ్ కాదు, సరిగ్గా ఆన్సరివ్వు: విశాల్పై మండిపడ్డ కోర్టు
చెన్నై: కోలీవుడ్ హీరో విశాల్పై న్యాయస్థానం మండిపడింది. విశాల్కు, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. తాను ఖాళీ కాగితంపై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే తెలియదన్నాడు. అతడి వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు. సరిగ్గా బదులివ్వండి అని గద్దించి అడిగారు.కాగా విశాల్.. ఫైనాన్షియర్ అన్బచెలియన్ దగ్గర తీసుకున్న రూ.21.29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ చెల్లించింది. అందుకుగానూ ఆ డబ్బు తిరిగిచ్చేవరకు విశాల్ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్.. వీరమె వాగై చూడమ్ అనే సినిమా హక్కుల్ని లైకాకు బదులు వేరే సంస్థకు విక్రయించాడు. దీంతో రెండేళ్లక్రితం లైకా సంస్థ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.చదవండి: కోట్లు ఇచ్చినా బిగ్బాస్కు వెళ్లనన్న బ్యూటీ.. వెనక్కు తగ్గిందా? -
'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!
'భారతీయుడు 2' నిన్న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శుక్రవారం నాడు బాగానే ఆక్యుపెన్సీలు కనిపించాయి. తమిళంలో ఇలా కూడా కనిపించలేదు. అయితే సినిమా మరీ అంత కాకపోయినా ఓ మాదిరి అంచనాలతో బరిలో నిలిచింది. కానీ కనీసం అంటే కనీస వసూళ్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. అయితే సినిమాకు ఇలా అవుతుందని కమల్ ముందే పసిగట్టాడా అని సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: భారతీయుడు 2 కలెక్షన్స్.. తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయలంటే?)1996లో వచ్చిన 'భారతీయుడు'.. అప్పట్లో తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సెన్సేషన్ సృష్టించింది. దీనికి సీక్వెల్ తీయాలని చాలా ఏళ్ల క్రితమే అనుకున్నారు. కాకపోతే షూటింగ్లో ప్రమాదం, కరోనా వల్ల లేట్ అయిపోయింది. ఎలాగోలా పూర్తి చేసి తాజాగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. సీక్వెల్ ఒకటే అనుకున్నది కాస్త రెండు భాగాలైంది. ఇప్పుడు రెండో భాగం రిలీజ్ చేయగా, ఆరు నెలల తర్వాత మూడో భాగాన్ని విడుదల చేయనున్నారు.'భారతీయుడు 2' ఫలితాన్ని కమల్ హాసన్ ముందే పసిగట్టేశాడో ఏమో గానీ రిలీజ్కి ముందే తనకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో నిర్మాణ సంస్థ లైకా రెండు భాగాలకు తలో రూ.75 కోట్ల చెప్పున మొత్తంగా రూ.150 కోట్లు ఇచ్చిందట. మిగతా నటీనటులకు మాత్రం ఒక్క మూవీకి అన్నట్లే పారితోషికంగా ఇచ్చారు. ఇక ప్రాజెక్టులో డైరెక్టర్ శంకర్ కూడా భాగస్వామినే. కాబట్టి అతడికి కూడా నష్టాలు గ్యారంటీ. ఓవరాల్గా 'భారతీయుడు 2' వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది కమల్ మాత్రమే అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్బాస్ భోలే షావలి) -
లక్కీ హీరోయిన్కు భారీగా ఛాన్స్లు .. పెళ్లికి ఫుల్స్టాప్
ఆదితిశంకర్కు అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అయిన ఈమె వైద్య విద్య చదివి సినిమాపై మక్కువతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. అలా కార్తీ సరసన దుర్మార్ చిత్రంలో కథానాయకిగా పరిచయమైన అదితి శంకర్ తొలి చిత్రంలోనే గాయనిగా కూడా తనను పరిచయం చేసుకున్నారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన నటించిన మావీరన్ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. దీంతో అదితి శంకర్ లక్కీ హీరోయిన్ అనే ముద్రను వేసుకున్నారు. ఎప్పుడు చలాకీగా ఉండే ఈమె తరచూ స్పెషల్గా తీయించుకున్న తన గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లను అలరిస్తూ వుంటారు. ప్రస్తుతం విష్ణువర్దన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆకాష్ మురళీకి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ సక్సెస్ఫుల్ బాటలో పయనిస్తున్న అదితిశంకర్ నటనకు స్వస్తి పలికి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఆ మధ్య ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది. త్వరలో సూర్య నటించనున్న నూతన చిత్రంలో ఆయనకు జంటగా అదితి శంకర్ నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు ఈ బ్యూటీని మరో లక్కీచాన్స్ వరించింది అన్నది తాజా సమాచారం. చేసింది రెండు చిత్రాలు అయినా ఈమెకు హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దీనిని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నట్లు సమాచారం. -
సంక్రాంతి నుంచి తప్పుకున్న 'లాల్ సలాం'.. కారణం ఇదేనా?
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 'లాల్ సలామ్' 2024 సంక్రాంతి బరిలో ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. కానీ సమయం దగ్గర పడుతున్నా లాల్ సలాం సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. దీనికి ప్రధాన కారణం రజనీకాంత్ ఇందులో అతిథి పాత్రలో కనిపించడమే అని చెప్పవచ్చు. తాజాగా సంక్రాంతి రేసు నుంచి లాల్ సలాం చిత్రాన్ని తప్పిస్తున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి చాలా వరకు భారీ సినిమాలు ఉన్నాయి. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివ కార్తికేయన్ 'అయలాన్' చిత్రాలు కోలీవుడ్లో రెడీగా ఉన్నాయి. అంతే కాకుండా జైలర్ సినిమాతో తెలుగులో కూడా రజనీ మార్కెట్ భారీగానే పెరిగింది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి గుంటూరు కారం, ఈగల్, నా సామిరంగా,సైంధవ్, హనుమాన్ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. దీంతో తెలుగు స్ట్రెయిట్ సినిమాలకే థియేటర్లు సరిపోవని పరిస్థితి టాలీవుడ్లో ఉంది. ఇలాంటి టైమ్లో మరో మూడు తమిళ సినిమాలు అంటే థియెటర్ల కొరత ఏర్పడటం జరుగుతుందని లాల్ సలాం టీమ్ ఆలోచిస్తుందట. దీంతో లాల్ సలాం వెనక్కు తగ్గడమే మేలని వారు భావించారట. భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో తేడా వస్తే బిజినెస్పై ప్రభావం పడుతుందని భావించిన మేకర్స్ ఫైనల్గా పొంగల్ నుంచి డ్రాప్ కావడమే బెటర్ అని నిర్ణయించుకున్నారట. కొద్దిరోజుల పాటు లాల్ సలాం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలకు కూడా తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం. విక్రమ్ తంగలాన్ సినిమా కూడా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. జనవరి 26 విడుదల చేస్తామని చెప్పిన తంగలాన్ మేకర్స్ మరోసారి వాయిదా వేశారు. కాబట్టి 2024 జనవరి 26న లాల్ సలాం వచ్చే అవకాశం ఉంది. -
ఆనందం ఉప్పొంగుతోంది
రజనీకాంత్ పట్ట లేనంత ఆనందంలో ఉన్నారు. అందుకే ‘‘నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది’’ అని ట్వీట్ చేశారాయన. ఈ ఆనందానికి కారణం అమితాబ్ బచ్చన్తో 33 ఏళ్ల తర్వాత రజనీ స్క్రీన్ షేర్ చేసుకోవడమే. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘అంథా కానూన్ (1983), గిరఫ్తార్ (1985), హమ్’ (1991) చిత్రాల్లో నటించారు. ఇన్నేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ మళ్లీ కుదింరింది. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోనే అమితాబ్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా అమితాబ్తో తాను ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘‘లైకా ప్రొడక్షన్స్లో నేను చేస్తున్న నా 170వ సినిమాలో నా గురువు, గొప్ప నటుడు శ్రీ అమితాబ్ బచ్చన్తో మళ్లీ కలిసి నటిస్తున్నాను. నా హృదయం ఉప్పొంగుతోంది’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. -
రజనీకాంత్ 170 ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
రజనీకాంత్ 'తలైవార్ 170' చిత్రం నేడు అధికారికంగా పూజా కార్యక్రమం జరిగింది. లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక కథాచిత్రానికి 'జై భీమ్' చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నటించనున్న ఇతర కళాకారుల గురించి చిత్ర నిర్మాణ సంస్థ వరుసగా ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటికే ఇందులో టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానా నటి మంజు వారియర్, దసరా విజయన్, రిత్విక సింగ్ తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. (ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్) బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్, మలయాళ స్టార్ నటుడు ఫాహత్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రజనీకాంత్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బుధవారం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. అందులో భాగంగా నటుడు రజనీకాంత్ మంగళవారమే చైన్నె నుంచి తిరువంతపురం బయలుదేరిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పూజలో పాల్గొని మీడియాతో ముచ్చటించారు. ఆయన నటించే 170వ చిత్రం గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇది మంచి సందేశంతో కూడిన ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదనీ, త్వరలోనే పేరును వెల్లడించనున్నట్లు చెప్పారు. తాను ఇంతకు ముందు నటించిన జైలర్ చిత్రం ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. అదేవిధంగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన లాల్ సలామ్ చిత్రం కూడా ఊహించిన దానికంటేబ్రహ్మాండంగా వచ్చిందని పేర్కొన్నారు. Lights ☀️ Camera 📽️ Clap 🎬 & ACTION 💥 With our Superstar @rajinikanth 🌟 and the stellar cast of #Thalaivar170🕴🏼 the team is all fired up and ready to roll! 📽️ Hope you all enjoyed the #ThalaivarFeast 🍛 Now it's time for some action! We'll come up with more updates as the… pic.twitter.com/gPUXsPmvEQ — Lyca Productions (@LycaProductions) October 4, 2023 -
పాన్ ఇండియా ప్రాజెక్ట్లోకి రానా.. అఫిషియల్ సినిమా ప్రకటన
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ‘జైభీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అని చెప్పవచ్చు ఆ సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కింది. చాలా రోజుల తర్వాత ఒక యథార్థ సంఘటన ఆధారంగా రజనీకాంత్తో సినిమా అనేసరికి పాన్ ఇండియా రేంజ్లో అంచనాలను పెంచేశాయి. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) అంతే కాకుండా ఖర్చుకు ఎలాంటి బార్డర్స్ పెట్టకోని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది. తత్కాలికంగా ఈ సినిమాకు 'తలైవర్ 170' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. తాజాగా ఈ ప్రాజెక్ట్లోకి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భాగం అవుతున్నట్ల ప్రకటన వచ్చేసింది. దీనిని అఫిషియల్గా లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. బాహుబలి సినిమాలో విలన్గా రానా పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు పొందాడు. మరి తలైవార్ ప్రాజెక్ట్లో ఆయన రోల్ ఎంటి అనేది ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాకు దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్తో పాటు మలయాళ నటి మంజు వారియర్ ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తున్నట్లు సమాచారం. Welcoming the dapper & supercool talent 😎 Mr. Rana Daggubati ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten even more charismatic 🌟 with the addition of the dashing @RanaDaggubati 🎬🤗✌🏻@rajinikanth @tjgnan @anirudhofficial @ManjuWarrier4 @officialdushara… pic.twitter.com/XhnDpm27CH — Lyca Productions (@LycaProductions) October 3, 2023 -
పాన్ ఇండియాపై కన్నేసిన స్టార్ ప్రొడ్యూసర్
లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు ఇప్పటికే అడుగులు వేశారు. అతను రజనీకాంత్తో 2.0, విక్రమ్ పొన్నియన్ సెల్వన్ 1 & 2 వంటి అనేక బ్లాక్బస్టర్ చిత్రాలను నిర్మించారు. పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజీ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత, సుభాస్కరన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్లతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్లను తెరకెక్కించేదుకు ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నుంచి త్వరలో వస్తున్న పాన్-ఇండియన్ సినిమా కమల్ హాసన్ ఇండియన్ 2. చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి అయింది. దీనికి ఎస్ శంకర్ డైరెక్ట్ చేశారు. మరోవైపు, రజనీకాంత్ నటించిన లాల్ సలామ్, తలైవర్ 170 కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్నాయి. కోలీవుడ్లో భారీ విజయాలతో లైకా ప్రొడక్షన్స్కు మంచి గుర్తింపు ఉంది. దీంతో తాజాగా మాలీవుడ్లో తన ఫేట్ను పరీక్షించడానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: ఎయిర్పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే లూసిఫర్-2 చిత్రాన్ని ప్రకటించింది. ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాన్-ఇండియన్ ప్రాజెక్ట్గా విడుదల కానుంది. సుభాస్కరన్ త్వరలో బాలీవుడ్, టాలీవుడ్లో కూడా సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రణాళికలను కూడా ఆయన ప్రారంభించారట. మరో రెండు రోజుల్లో తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది. -
లూసిఫర్ సీక్వెల్ రెడీ.. మాలీవుడ్లో లైకా ప్రొడక్షన్స్ ప్లాన్
కోలీవుడ్లో చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకు కేరాఫ్గా మారిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షనన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇప్పుడు మాలీవుడ్లోకి అడుగు పెట్టారు. కంప్లీట్ యాక్టర్గా పేరుగాంచిన మోహన్లాల్ బహుభాషా నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా కథానాయకుడిగా నటిస్తూ మాలీవుడ్లో (మలయాళం) అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఈయన ఒకరు. (ఇదీ చదవండి: వాళ్లు అయితే నా దుస్తులు తొలగించేవారు.. ఊసరవెల్లి బ్యూటీ కామెంట్లు) 350 చిత్రాలకు పైగా చేసిన మోహన్ లాల్ ఈమధ్య నటించిన చిత్రం లూసిఫర్. దీనికి మరో మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించి అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. లూసిఫర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా దానికి సీక్వెల్గా లూసిఫర్ 2 చిత్రం రూపొందుతోంది. ఇది కూడా మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్లో కాంబినేషన్లోనే తెరకెక్కడం విశేషం. కాగా విచిత్రాన్ని ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరంబలూర్తో కలిసి లైకా ప్రొడక్షనన్స్ సుభాస్కరన్ నిర్మిస్తుండడం మరో విశేషం. దీని గురించి లైకా ఫిలిమ్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ దైవ దేశంగా భావించే మలయాళ చిత్ర పరిశ్రమంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. అంకితభావంతో పనిచేసే కళాకారులు సహజత్వంతో కూడిన సంస్కృతికి అద్దం పట్టే చిత్రాలను రూపొందించే మలయాళ చిత్ర పరిశ్రమలో లూసిఫర్ 2 చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని తాము పొందామని చెప్పారు. ఈ చిత్త పరిశ్రమ అభివృద్ధిని, ఈ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ధ్యేయంగా పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం పదికాలాలపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని సుభాస్కరన్ పేర్కొన్నారు. -
లైకా ప్రొడక్షన్స్ మరో భారీ డీల్.. ఆ సినిమా హక్కులు సొంతం!
కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో నటి మాళవిక మోహన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాతర కార్యక్రమాలను ముమ్మరంగా జరుపుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో ధనుష్ గెటప్ చాలా భిన్నంగా ఉండడం.. ట్రైలర్ ఇటీవలే విడుదలై విశేష స్పందన పొందడంతో కెప్టెన్ మిల్లర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా త్వరలో ఆడియో రిలీజ్తో పాటు మరిన్నీ విషయాలను చిత్ర నిర్మాతలు వెల్లడించనున్నట్లు సమాచారం. అదే విధంగా కెప్టెన్ మిల్లర్ చిత్రంపై వ్యాపార వర్గాల్లో చాలా క్రేజ్ ఉంది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ విడుదల హక్కులను లైకా ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. లైకా ప్రొడక్షన్స్ పలు భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరో పక్క ఇతర చిత్రాలను సైతం విడుదల చేస్తోంది. అలా ఇటీవల అజిత్ హీరోగా నటించిన తుణివు(తెగింపు) చిత్రాన్ని విదేశాలలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసింది. తాజాగా ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్ర విదేశీ విడుదల హక్కులను పొందడం మరో విశేషం. ఈ విషయాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ మంగళవారం అధికారికంగా మీడియాకు వెల్లడించింది. This December 15, is gonna be blast 💥 in theatres! We are happy in acquiring the OVERSEAS THEATRICAL RIGHTS 🌍📽️ of #CaptainMiller 🪃 Captain Miller Overseas release by @LycaProductions Subaskaran 🤗✨@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash… pic.twitter.com/7JtDzXLANm — Lyca Productions (@LycaProductions) September 26, 2023 -
ఆస్తి వివరాలు కోర్టుకు సమర్పించిన విశాల్
హీరో విశాల్ తన ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను కోర్టులో సమర్పించారు. దీనికి సంబంధించిన వివరాలను చూస్తే నటుడు విశాల్ ఫైనాన్షియర్ అన్బచెలియన్ వద్ద తీసుకున్న రూ.21.29 కోట్ల రుణాన్న లైకా సంస్థ చెల్లించింది. అందుకు గానూ విశాల్ నిర్మించే చిత్రాల హక్కులను తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే విశాల్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన వీరమే వాగై చుడుమ్ చిత్ర విడుదల హక్కులను లైకాకు బదులుగా వేరే సంస్థకు విక్రయించారు. దీంతో లైకా సంస్థ చైన్నె హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై చైన్నె హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానంలో పలు మార్లు విచారణ జరిగింది. గత 12వ తేదీన ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఉషా విశాల్ను తన స్థిరాస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించించారు. కానీ ఈ ఆదేశాలను పాటించకపోవడంతో గత 19వ తేదీన జరిగిన విచారణ సమయంలో దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా ఈ కేసు సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టుకు అందించారు. అందులో స్టాండర్డ్ చార్టెడ్, ఐడిబీఐ, యాక్సెస్, హెచ్ డీ ఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల్లోని తన ఖాతాల వివరాలను పొందుపరిచారు. అయితే ఆ వివరాలు పూర్తిగా లేకపోవడంతో రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా లైకా సంస్థను ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
కోర్టులో గెలిచిన విశాల్.. చెప్పిన టైమ్కే 'మార్క్ ఆంటోని'
హీరో విశాల్కు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. 'మార్క్ ఆంటోని' విడుదల మీద కొన్నిరోజుల క్రితం మద్రాస్ కోర్టు స్టే విధించింది. కానీ తాజాగా ఆ కేసులో విశాల్ తరపున తీర్పు పాజిటివ్గా వచ్చింది. దీంతో సినిమా రిలీజ్కి లైన్ క్లియర్ అయినట్లే. సెప్టెంబర్ 15న గ్రాండ్గా విశాల్ మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ కాబోతోంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!) ఏంటి గొడవ? గతంలో ఓ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దగ్గర దాదాపు రూ.20 కోట్ల మేర అప్పు చేశాడు. అది తిరిగి చెల్లించే విషయంలో ఆలస్యమైంది. ఈ క్రమంలోనే లైకా ప్రొడక్షన్స్.. విశాల్ తమకు రూ.15 కోట్లు చెల్లించాలని, అప్పటివరకు 'మార్క్ ఆంటోని' రిలీజ్ ఆపాలని పిటిషన్ వేసింది. కానీ ఇప్పుడది విశాల్కి పాజిటివ్గా వచ్చింది. 'మార్క్ ఆంటోని విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది' అని హీరో విశాల్ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. దీంతో విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయని అందరికీ అర్థమైపోయింది. 'మార్క్ ఆంటోని'లో ఎస్.జే.సూర్య కీ రోల్ చేశాడు. రీతూ వర్మ హీరోయిన్. సునీల్, సెల్వ రాఘవన్, అభినయ, కింగ్ స్లే, మహేంద్రన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు
నటుడు విశాల్కు ఒక హిట్ అవసరం ఎంతైనా ఉంది. ఆయన సమీపకాలంలోని చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. కాగా తాజాగా 'మార్క్ ఆంటోనీ' చిత్రంతో రావడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా నటించారు. విశాల్, ఎస్జే.సూర్య ఇద్దరు ద్విపాత్రాభినయం చేయడం విశేషం. మార్క్ఆంటోనీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో తమిళం, తెలుగు హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇలాంటి సమయంలో సినిమా విడుదలను ఆపేయాలని మద్రాసు కోర్టు తీర్పు వెల్లడించింది. ఏం జరిగిందంటే నటుడు విశాల్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో అన్బుచెజియన్కు చెందిన గోపురం ఫిల్మ్స్ నుంచి రూ. 21.29 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆయన విఫలం కావడంతో విశాల్ను నమ్మి ఆ రుణాన్ని లైకా ప్రొడక్షన్ చెల్లించింది. ఈ విషయంలో, విశాల్, లైకా మధ్య ఒప్పందం ప్రకారం, మొత్తం రుణం తిరిగి చెల్లించే వరకు విశాల్ ఫిల్మ్ కంపెనీకి చెందిన అన్ని చిత్రాల హక్కులను లైకాకు ఇస్తామని హామీ ఇచ్చారు. (ఇదీ చదవండి: శివాజీతో చేతులు కలిపిన షకీలా, అర్ధరాత్రి డ్రామాలు.. ఆగమైన కంటెస్టెంట్లు) ఈ స్థితిలో రుణం చెల్లించకుండా గ్యారెంటీని ఉల్లంఘించి ‘వీరమే వాగై చూడుమ్’ (సామాన్యుడు) సినిమా విడుదలపై నిషేధం విధించాలని లైకా సంస్థ మద్రాసు హైకోర్టులో గతంలో కేసు వేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు విశాల్కు పలు సూచనలు ఇచ్చింది. హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట 15 కోట్ల రూపాయలను శాశ్వత డిపాజిట్గా బ్యాంకులో డిపాజిట్ చేసి ఆస్తుల వివరాలను సమర్పించాలని నటుడు విశాల్ను ఆదేశించింది. దీంతో సింగిల్ జడ్జి ఆదేశాలపై ద్విసభ్య ధర్మాసనంలో విశాల్ అప్పీల్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్ను విచారించి, విశాల్ కోర్టుకు రూ.15 కోట్లు చెల్లించాలన్న ఆదేశాలను సమర్థించింది. చెల్లించని పక్షంలో, సింగిల్ జడ్జి ముందు ఈ కేసులో తీర్పు వెలువడే వరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రాలను థియేటర్లలో లేదా OTT సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధించి అప్పీల్ కేసును ముగించారు. (ఇదీ చదవండి: అట్లీ, షారుఖ్పై నయనతార అసంతృప్తి.. నిజమెంత?) ఇదిలా ఉంటే, విశాల్ చిత్రం 'మార్క్ ఆంటోని' సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ కేసు ఈరోజు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆశా ముందు విచారణకు వచ్చింది. అప్పట్లో కేసును విచారించిన న్యాయమూర్తి హైకోర్టు ఆదేశాల మేరకు రూ.15 కోట్లు డిపాజిట్ కాకపోవడంతో విశాల్ కొత్త సినిమాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే 'మార్క్ ఆంటోనీ' సినిమా ట్రైలర్ ఇంటర్నెట్లో విడుదలై మిలియన్ వ్యూస్ను దాటడం గమనార్హం. రెండు గంటల 30 నిమిషాలు నిడివి కలిగిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. -
డైరెక్టర్గా హీరో విజయ్ తనయుడు
తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సుభాస్కరన్ మాట్లాడుతూ– ‘‘కొత్త ఆలోచనలతో ఉండే యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ అవుతారని మా నమ్మకం. జాసన్ సంజయ్ విజయ్ చెప్పిన యూనిట్ పాయింట్ మాకు నచ్చింది. సంజయ్ లండన్లో స్క్రీన్ రైటింగ్లో బీఏ (హానర్స్), టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ప్రోడక్షన్ డిప్లామా పూర్తి చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు’’ అన్నారు. ‘‘లైకాప్రోడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నా ఫస్ట్ మూవీ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జాసన్ సంజయ్ విజయ్ -
డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు
దళపతి విజయ్ని తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిందే ఏం లేదు. పలు డబ్బింగ్ సినిమాలతో, సోషల్ మీడియాలో ట్రోల్స్తో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాడు. అయితే ఇతడికి 23 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడు హీరో అవుతాడనుకుని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు డైరెక్టర్గా తొలి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తమిళ హీరో దళపతి విజయ్కి ఇద్దరు పిల్లలు. అందులో కొడుకు జేసన్ సంజయ్ పెద్దోడు. ప్రస్తుతం అతడికి 23 ఏళ్లు. అయితే తండ్రిలానే హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలారోజుల నుంచి టాక్ నడుస్తోంది. 'ఉప్పెన' తమిళ రీమేక్తో నటుడిగా మారతాడని అప్పట్లో తెగ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ.. జేసన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో 'వెట్టైకారన్' సినిమాలో విజయ్-జేసన్ కలిసి నటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) తమిళంలో పలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. జేసన్ సంజయ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తోంది. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ మేటర్ కాస్త బయటపడింది. విజయ్ హీరోగా నటించిన 'లియో' త్వరలో రిలీజ్ కానుంది. దీని తర్వాత వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తారు. అనంతరం సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి, రాజకీయాల్లోకి వెళ్లిపోతారని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇతడి వారసుడిగా జేసన్ వస్తాడని ఫ్యాన్స్ అనుకుంటే.. ఇప్పుడు డైరెక్టర్ గా మారి షాకిచ్చాడు. బహుశా భవిష్యత్తులో ఏమైనా హీరో అవుతాడేమో చూడాలి. (ఇదీ చదవండి: యూట్యూబర్ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి) View this post on Instagram A post shared by Lyca Productions (@lycaproductions) -
'2018' డైరెక్టర్ నెక్స్ట్ మూవీలో రష్మిక?
హీరోయిన్ రష్మికా మందన్న హీరో విక్రమ్కి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ‘2018’ అనే చిత్రం తెరకెక్కించారు డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్. ఈ సినిమా మలయాళంలో అద్భుత విజయాన్ని సాధించి బాక్సాఫీస్ కొత్త రికార్డులను సృష్టించింది. కాగా జూడ్ ఆంథోనీ జోసెఫ్ తన తర్వాతి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ లో చేయనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ హీరోగా నటిస్తారని, భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాత సుభాస్కరన్ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్ గా రష్మికా మందన్న, మాళవిక మోహనన్స్ పేర్లు వినిపించాయి. అయితే రష్మికా మందన్న ఫైనల్ అయ్యారని, అతి త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. విక్రమ్– రష్మిక జోడీ అధికారికంగా ఓకే అయితే... కార్తీ ‘సుల్తాన్ ’, విజయ్ ‘వారిసు’ చిత్రాల తర్వాత రష్మికా మందన్న నటించనున్న మూడో తమిళ సినిమా ఇదే అవుతుంది. -
చంద్రముఖి–2 అభిమానులకు అప్డేట్ ఇచ్చిన మేకర్స్
సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన సూపర్హిట్ చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్గా చంద్రముఖి–2 రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీమీనన్, సృష్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇటీవలే నటుడు లారెన్స్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పి పూర్తి చేశారు. కాగా శనివారం నుంచి ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమ కూర్చడం ప్రారంభించారని యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా త్వరలోనే చంద్రముఖి –2 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి తెలిపారు. అంతకుముందే వచ్చే నెలలో చిత్రంలోని సింగిల్ సాంగ్ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 19న పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది. -
తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్కు రెడీ
మిల్కీబ్యూటీ తమన్న తాజాగా మరోసారి 'అజిత్'తో రొమాన్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సామాజకమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'వీరం' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా అజిత్ నటించిన 'తుణివు' తెలుగులో తెగింపు చిత్రం విడుదలై చాలా కాలం అవుతోంది. ఈ చిత్రంతో పాటు తెరపైకి వచ్చిన విజయ్ చిత్రం వారిసు తరువాత ఆయన నటిస్తున్న 'లియో' చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అలాంటిది అజిత్ తాజా చిత్రం మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికి 'విడాముయిర్చి' అనే టైటిల్ను ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందుగా నయనతార భర్త 'విఘ్నేశ్ శివన్' దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరిగాయి. అయితే ఈ చిత్రం నుంచి ఆయనను తొలగించి దర్శకుడు మగిళ్ తిరుమేణిని ఎంపిక చేశారు. దీంతో చిత్రం మే నెలలో ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తాజాగా ఆగస్ట్లో విడాముయిర్చి సెట్స్పైకి వెళ్లడం ఖాయం అనే టాక్ వినిసిస్తోంది. కాగా ఇందులో నటి త్రిష నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: ఆ సీన్లు లేకుండా చేస్తారా.. నాకు మీరే న్యాయం చేయండి: విజయ్ ఆంటోని) అయితే చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతుండటంతో ప్రస్తుతం విజయ్కు జంటగా లియో చిత్రాన్ని పూర్తి చేసిన త్రిషకు తెలుగు, మలయాళం భాషల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఆమె మలయాళంలో నటుడు 'టోవినో థామస్'కు జంటగా ఐడెంటీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. దీంతో అజిత్ సరనస నటించే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే నటి తమన్న ప్రస్తుతం రజనీకాంత్ సరసన 'జైలర్' చిత్రంలో నటించి పూర్తి చేశారు.కాగా ఇందులోని 'కావాలయా అనే పాట'ను ఇటీవల చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఆ పాటలో తమన్న కవ్వింపు డాన్స్ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. అంతే కాదు ఈ పాట ఈ మిల్కీబ్యూటీకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనేది తాజా సమాచారం. అందులో ఒకటి అజిత్ సరసన నటించే విడాముయిర్చి అని టాక్. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ప్రశాంత్ నిల్ మాదిరే మరో డైరెక్టర్ని టార్గెట్ చేసిన సౌత్ నిర్మాతలు
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉంటే అవకాశాలు కూడా వారి వెంట పడటం కొత్తేమీ కాదు. ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలను ఇతర భాషల్లో మళ్లీ నిర్మించడం, సక్సెస్ఫుల్ హీరోయిన్లకు ఇతర భాషల్లో అవకాశాలు కల్పించడం, ఒక భాషలో సక్సెస్ సాదించిన దర్శకులతో ఇతర భాష నిర్మాతలు కూడా చిత్రాలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. తాజాగా సౌత్ ఇండియా నిర్మాతల దృష్టి మలయాళ దర్శకులపై పడిందనే చెప్పాలి. (ఇదీ చదవండి: Trisha Krishnan : మళ్లీ ఒక రౌండ్ కొడుతున్న త్రిష...) అలా కేజీఎఫ్తో ప్రశాంత్ నిల్తో టాలీవుడ్ నిర్మాతలు వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధం అయ్యా రు. ఇక ఇటీవల విడుదలైన మలయాళం చిత్రం '2018' అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది 2018 లో కేరళలో తుపాన్ ప్రభావానికి గురైన ఘటనను ఆవిష్కరించిన చిత్రం. దీనిని దర్శకుడు 'జూడ్ ఆంథోనీ జోసెఫ్' అద్భుతంగా తెరకెక్కించారు. హృదయ విదారకరమైన తుపాన్ బాధితుల కష్టాలను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. అలా విమర్శకులు సైతం ప్రశంసలు వర్షం కురిపించిన ఈయనపై ఇతర ఇండస్ట్రీలకి చెందిన నిర్మాతల దృష్టి పడింది. ఆయనతో సినిమాలు నిర్మించే అవకాశాన్ని కోలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పొందడం విశేషం. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి ఎప్పుడు ముందు ఉండే ఈ సంస్థ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ –2 చిత్రంతో పాటు.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలాం' చిత్రాన్ని ఈ సంస్థ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?) తదుపరి అజిత్ హీరోగా ఒక చిత్రాన్ని, రజనీకాంత్ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. కాగా తాజాగా 2018 చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు లైకా ప్రొడక్షన్స్ నిర్వాహకుడు జీకేఎం తమిళ్ కుమరన్ ను కలిసి చర్చలు జరిపారు. దీంతో ఈ కాంబినేషన్లో ఎలాంటి చిత్రం వస్తుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. -
విశాల్పై కేసును కొట్టివేసిన కోర్టు
కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వివాదంలో విశాల్కు నేడు స్వల్ప ఊరట లభించింది. తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని లైకా సంస్థ 2022లో మద్రాసు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ కేసుపై రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్ను గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అంత వరకు విశాల్ నిర్మించిన చిత్రాలను థియేటర్, ఓటీటీలలో విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!) తాజాగా కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని, తమకు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన రూ. 15 కోట్లును ఇవ్వకుండానే పలు సినిమాలను నిర్మించారని, కోర్టు ధిక్కార కేసును లైకా దాఖలు చేసింది. ఈ కేసు ఈరోజు జడ్జి ఎస్.సెలాందర్ ముందు విచారణకు వచ్చింది. తమ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలను నిర్మించలేదని విశాల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపి, తగిన ఆధారాలు చూపించారు. విశాల్ సినిమాలు నిర్మించినట్లు లైకా ప్రొడక్షన్స్ ఆధారాలు చూపించలేక పోయింది. దీంతో కేసును కోర్టు కొట్టి వేసింది. లైకా ప్రధాన కేసును జూన్ 26న విచారిస్తామని చెప్పి వాయిదా వేసింది. (ఇదీ చదవండి: ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను) -
లైకా ప్రొడక్షన్స్పై ఈడీ దాడులు.. దాదాపు ఎనిమిది చోట్ల ఒకేసారి!
భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్పై ఈడీ సోదాలు చేస్తోంది. చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు. (ఇది చదవండి: లైకా ఖాతాలో.. అరుణ్ విజయ్ చిత్రం) చెన్నైలో లైకా ప్రొడక్షన్స్కు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో ఆస్తులపై ఈడీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ప్రొడక్షన్ హౌస్లో అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై లైకా ప్రతినిధులు ఎలాంటి అధికారికి ప్రకటన చేయలేదు. ఈడీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్) తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థగా పేరుంది. రజినీకాంత్ రోబో'2.0', మణిరత్నం'పొన్నియిన్ సెల్వన్ 1', 'పొన్నియిన్ సెల్వన్ 2'తో సహా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. గతంలో రజనీకాంత్ 'దర్బార్' చిత్రాన్ని కూాడా తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయనతో 'లాల్ సలామ్' చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా.. హిందీలో జాన్వీ కపూర్ నటించిన 'గుడ్ లక్ జెర్రీ' (2022), అక్షయ్ కుమార్ యొక్క 'రామ్ సేతు' (2022) చిత్రాలను నిర్మించింది. కాగా.. ఇటీవలే టాలీవుడ్లోనూ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ED conducts raids at LYCA Productions in Chennai. More details awaited: Sources pic.twitter.com/lZOX7pE9ks — ANI (@ANI) May 16, 2023 -
విశాల్కు హైకోర్టు షాక్.. రూ. 15 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం
స్టార్ హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. రూ. 15 కోట్ల రూపాయలు శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. అలా చేయని పక్షంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కాకుండ నిషేధం విధించింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కేసులో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కాగా గతంలో విశాల్ ఓ తన నిర్మాణ సంస్థ(ఫలిం ఫ్యాక్టరి) కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ వద్ద రూ. 21. 29 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ ఫైనాన్షియర్కు తిరిగి చెల్లించింది. అయితే, తమకు రుణం చెల్లించేంత వరకు విశాల్ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇచ్చేలా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ - లైకా ప్రొడక్షన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘిస్తూ తన చిత్రం ‘వీరమే వాగై సూడుం’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ స్పెషల్ కోర్టు దీంతో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి స్పెషల్ కోర్టు రిజిస్ట్రార్ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలో విశాల్ నేరుగా కోర్టుకు హాజరై.. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం వల్లే రుణం చెల్లించలేకపోయాయని, పైగా తనకు ఒకే రోజున రూ.18 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో విశాల్ ఆస్తుల వివరాలను ప్రమాణ పత్రంలో సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టులో అప్పీల్ చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపి.. గతంలో రూ.15 కోట్లను విశాల్ చెల్లించాలంటూ సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. పైగా ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే చిత్రాలు థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీలులేదని ధర్మాసనం ఆదేశించింది. -
భారీ అంచనాలతో వస్తున్న 'మిషన్: చాప్టర్1'
కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్, అమీ జాక్సన్ నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘మిషన్: చాప్టర్ 1’. ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ వరుస సక్సెస్లను సొంతం చేసుకుంటున్న లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో 2.0, పొన్నియిన్ సెల్వన్, ఇండియన్ 2 వంటి చిత్రాలు సహా ఎన్నో భారీ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కేవలం 70 రోజుల్లో లండన్, చెన్నై సహా పలు లొకేషన్స్లో శరవేగంగా చిత్రీకరించటం గొప్ప విశేషం. తాజాగా ‘మిషన్: చాప్టర్ 1’ సినిమాను విశ్లేషించి ఒక పరిమితమైన హద్దులని లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని లైకా టీమ్ భావిస్తోంది. దీంతో లైకా సంస్థ ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రాన్ని నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో, థియేట్రికల్ రిలీజ్కి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. చాలా గ్యాప్ తర్వాత.. 2.0లో నటించి అలరించిన ముద్దుగుమ్మ అమీ జాక్సన్ ఈ చిత్రంతో సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంరక్షించే ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటి నిమిషా సజయన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషించారు. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సినిమా కోసం లండన్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖర్చుతో ఓ జైలు సెట్ వేశారు. -
నిర్మాతల సంఘానికి లైకా ప్రొడక్షన్స్ అధినేత భారీ విరాళం
భారీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇటీవల మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థతో కలిసి పొన్నియిన్ సెల్వన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రాన్ని ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్– 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. వీటితో పాటు మరిన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా మణిరత్నం దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం లైకా ప్రొడక్షన్స్ సంస్థ తరపున తమిళ నిర్మాతల సంఘానికి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ చెక్కును లైకా సంస్థ అధినేత సుభాస్కరన్ నిర్మాతల సంఘం అధ్యక్షుడు మురళి రామస్వామికి అందించారు. -
ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సలాం'. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హోలీ రోజున ప్రారంభమైంది. ఈ చిత్రంలో సూపర్స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. 'విభిన్నమైన సినిమాలు నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ముందుంటుంది. అందులో భాగంగా లాల్ సలాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ పవర్ఫుల్ పాత్ర ఉంది. అందుకే సూపర్స్టార్ రజినీకాంత్గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయన ఈ రోల్లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు.'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. Lights 💡 Camera 🎥 🎬 Action 😎✨#LalSalaam 🫡 Shoot starts today! 😌 Happy #HOLI everyone! 💫 🎬 @ash_rajinikanth 🎶 @arrahman 🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl 🤝 @gkmtamilkumaran 🪙 @LycaProductions #Subaskaran pic.twitter.com/SHYXxnGYod — Lyca Productions (@LycaProductions) March 7, 2023 -
అఫీషియల్: రజనీకాంత్ 170 చిత్రం అప్డేట్, ఆ సక్సెస్ఫుల్ డైరెక్టర్తో..
ఫలితాలతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 70 ఏళ్లలో కూడా యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న ఆయన నెక్ట్స్ తన కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న లాల్ సలామ్లో ఆయన గెస్ట్ రోల్ చేయబోతున్నారు. మార్చి 7న సెట్స్పైకి రానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే బ్యానర్ నుంచి తలైవా 170వ చిత్రం రాబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రోజు(మార్చి 2న) లైకా సంస్థ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ సుభాకరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తలైవా ఫ్యన్స్కి లైకా ప్రొడక్షన్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. తలైవా 170వ చిత్రాన్ని తమ బ్యానర్లోనే నిర్మించబోతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా ఇదే బ్యానర్లో రజనీ రోబో 2.0, దర్భార్ చిత్రాలు రూపొందాయి. ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 సినిమా తెరకెక్కిబోతుంది. గతంలో ఆయన సూర్య జై భీమ్తో సంచలన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో రజనీ 170 చిత్రాన్ని ఆయన ఏ రేంజ్లో ప్లాన్ చేశారనేది ఆసక్తిని సంతరించుకుంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. We are feeling honoured to announce our next association with “Superstar” @rajinikanth 🌟 for #Thalaivar170 🤗 Directed by critically acclaimed @tjgnan 🎬 Music by the sensational “Rockstar” @anirudhofficial 🎸 🤝 @gkmtamilkumaran 🪙 @LycaProductions #Subaskaran#தலைவர்170 🤗 pic.twitter.com/DYg3aSeAi5 — Lyca Productions (@LycaProductions) March 2, 2023 -
తండ్రీ, కుమారుల అనుబంధమే 'తురువిన్ కురల్'
ప్రస్తుతం వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్. భారీ చిత్రాలతో పాటు, వైవిధ్యభరిత కథాంశంతో కూడిన చిన్న చిత్రాలను ఈ సంస్థ నిర్మించడం విశేషం. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇటీవలే దర్శకుడు మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి చారిత్రక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్ను నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సీక్వెల్ను ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. మరికొన్ని చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి తురువిన్ కురల్. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 24వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో నటుడు అరుళ్ నిధి కథానాయకుడుగా నటించారు. హరీష్ ప్రభు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి ఆత్మిక కథానాయకిగా నటించిన ఇందులో దర్శకుడు భారతీయ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిందని దర్శకుడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. చిత్ర షూటింగ్ను చెన్నై, పాండిచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. ఇది తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో అరుళ్ నిధి బధిరుడు(చెవిటి)పాత్రను పోషించడం విశేషం అన్నారు. చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, సింటో పోదుతాస్ ఛాయాగ్రహణం సమకూర్చారు. Presenting the Title & 1st look poster of our Production#24 #ThiruvinKural 📢⚕️ Starring the promising @arulnithitamil @offBharathiraja & @im_aathmika 🌟 Directed By @harishprabhu_ns 🎬 Music By @SamCSmusic 🎶 DOP @sintopoduthas 🎥 Editing @thecutsmaker ✂️🎞️ 🤝 @gkmtamilkumaran pic.twitter.com/aTzr2cbDtD — Lyca Productions (@LycaProductions) February 16, 2023 -
Dada: లైకా సంస్థ తిరస్కరించిన కథే!
తమిళ సినిమా: ఒలింపియా మూవీస్ పతాకంపై అంబేత్ కుమార్ నిర్మించిన చిత్రం డాడా. కవిన్, అపర్ణ దాస్ జంటగా నటించారు. కె.భాగ్యరాజ్, ఐశ్వర్య, గణేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గణేష్ కే బాబు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. నేటితరం యువత ప్రేమ నేపథ్యంలో రూపొందింది. ఈ నెల 10వ తేదీ విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలో థాంక్స్ గివింగ్ నిర్వహించారు. కవిన్ మాట్లాడుతూ.. ఇది తన 12 ఏళ్ల కల అని పేర్కొన్నారు. చిత్ర యూనిట్ సమష్టి శ్రమకు దక్కిన విజయంగా పేర్కొన్నారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన నిర్మాత అంబేత్ కుమార్ను జీవితాంతం మరిచిపోనని దర్శకుడు గణేష్ కె బాబు పేర్కొన్నారు. నిర్మాత అంబేత్ కుమార్ మాట్లాడుతూ.. తాను అనుకోకుండా నిర్మాతగా మారి మనంకొత్తి పరవై, జిప్సీ చిత్రాలు చేశానన్నారు. చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు డాడా చిత్రం చేసినట్లు చెప్పారు. ముందు తాను వేరే కథ అనుకుని కవిన్ను వినమని చెప్పానన్నారు. అయితే ఆయన తన వద్ద ఒక కథ ఉంది.. మీరు విని బాగుంటే చేద్దామని చెప్పారన్నారు. అలా ఈ చిత్రం తెరరూపం దాల్చిందని చెప్పారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు, విడుదల చేసిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. విషయం ఏంటంటే ఈ చిత్ర కథను ముందు లైకా సంస్థ తిరస్కరించిందని, ఇప్పుడు అదే సంస్థ ఈ చిత్ర దర్శకుడికి అవకాశం కల్పించిందని చెప్పారు. -
రజినీకాంత్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
సూపర్స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్కు భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్తో రెండు సినిమాలకు సూపర్స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్స్కు సంబంధించిన పూజా కార్యక్రమాలు వచ్చేనెల 5న చెన్నైలో జరగనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది నిర్మాణ సంస్థ. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. జైలర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తాజాగా రెండు కొత్త ప్రాజెక్ట్లకు సంతకం చేశారు. ఇవాళ లైకా ప్రొడక్షన్స్ అధినేత తమిళకుమారన్, ఛైర్మన్ సుభాస్కరన్, బ్యానర్ డిప్యూటీ ఛైర్మన్ ప్రేం శివసామితో రజనీకాంత్ ఉన్న ఫోటోనూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీలో కన్నడ నటుడు శివ రాజ్కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. #Thalaivar @rajinikanth Signed two films with LYCA PRODUCTIONS ,Pooja For the Both films will happen on NOV 5 in Chennai! 🤩🔥 Thalaivar #Rajinikanth with Lyca Chairman #Subaskaran , Lyca Head #Tamilkumaran & Deputy chairman #Premsivasamy! ⭐@LycaProductions pic.twitter.com/wWtuECgyjc — BA Raju's Team (@baraju_SuperHit) October 28, 2022 -
మణిరత్నం కల సాకారమవడానికి కారణం బాహుబలినే!
దేశంలో ఎంతమంది దర్శకులున్నా వారిలో కొందరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి నుంచి సినిమా వస్తుందంటే చాలు అందరూ కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. అలాంటి దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించారు. వెయ్యి ఏళ్లు వెనక్కి వెళ్లి చోళ రాజుల చరిత్రను తెరపై చూపించాడు. అందుకే ఆ వైబ్రేషన్ వరల్డ్ వైడ్ గా కనిపిస్తోంది. మణిరత్నం మేకింగ్పై డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి మనమూ పొన్నియిన్ సెల్వన్ లోకాన్ని ఓసారి చుట్టి వద్దాం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ పాన్ ఇండియా ట్రెండ్కు ప్రాణం పోసింది. ఏ సినిమా తీసినా, ఎంత పెట్టి తీసినా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని బాహుబలి సిరీస్ నిరూపించింది. ఆ ధైర్యంతోనే మణిరత్నం తన కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ను పట్టాలెక్కించారు. మణిరత్నం 40 ఏళ్ల కల సాకారం అయిందంటే అందుకు కారణం మన బాహుబలి సినిమానే! ఒక సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసి కోట్లు కొల్లగొట్టవచ్చు అని ఈ సినిమాతో నిరూపితమైంది. అందుకే 5 భాగాలుగా ఉన్న పెద్ద నవల పొన్నియిన్ సెల్వన్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మణిరత్నం. మొదటి భాగం ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. రెండవ భాగం సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత విడుదల చేస్తారట. తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన నవల పొన్నియిన్ సెల్వన్. 1899 నుంచి ఈ నవల ప్రాచుర్యంలో ఉంది. కల్కి మ్యాగజీన్లో ఈ నవలను ప్రచురిస్తూ వచ్చారు. అంతకు ముందు వచ్చిన ది చోళాస్, హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్, పల్లవాస్ ఆఫ్ కంచి పుస్తకాలను ఆధారంగా చేసుకుని పొన్నియిన్ సెల్వన్ నవలను రాసుకొచ్చారు కల్కి కృష్ణమూర్తి. 1958 నుంచే పొన్నియిన్ సెల్వన్ నవలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1980లో, 2000 సంవత్సరంలో, ఆ తర్వాత 2010లో పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించాలనుకున్నాడు మణిరత్నం. మొదట ఈ భారీ చిత్రాన్ని రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ కాంబినేషన్లో ప్లాన్ చేశాడు, కానీ కుదరలేదు. ఆ తర్వాత విజయ్, మహేశ్బాబు కాంబినేషన్లో తెరకెక్కించాలనుకున్నాడు. బడ్జెట్ ఇష్యూస్తో ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది 2018లో మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ పొన్నియిన్ సెల్వన్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 240 ఏళ్లుగా కోలీవుడ్ ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు మణిరత్నం తెరకెక్కిస్తున్నారని తెలిసి తమిళనాట ఆనందం వెల్లివిరిసింది. ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ లో వీరుడిగా నటించాల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పుడు మిగతా హీరోలు లీడ్ రోల్స్ తీసుకోవడంతో కనీసం ఒక చిన్న పాత్రైనా ఇవ్వండి అని అడిగారట. సినిమాలో పెరియ పజువెట్టరాయర్ పాత్ర చేస్తానని అడిగితే రజనీకాంత్కు ఉన్న ఇమేజ్కు ఆ పాత్ర సరితూగదని వద్దన్నారట. సినిమాలో ఇదే పాత్రను శరత్ కుమార్ చేసారు. గతంలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించి ఉంటే కనుక, ప్రస్తుతం కార్తి చేసిన పాత్రను రజనీకాంత్ చేసి ఉండేవారట. అలాగే జయం రవి చేసిన పాత్రను కమల్ హాసన్, విక్రమ్ కనిపించిన పాత్రను విజయ్ కాంత్తో చేయించాలి అనుకున్నారు. ఐశ్వర్యారాయ్ పాత్రలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖను, త్రిష క్యారెక్టర్ లో శ్రీదేవిని, ముందుగా అనుకున్నారట. ఏది ఏమైనా పొన్నియన్ సెల్వన్ కోసం రజనీ, కమల్ చేతులు కలిపి ఉంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేకంగా నిలిచిపోయేది. ప్రతీ మేకర్కు ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే అందుకు సరైన టైమ్ రావాలి. ఆ టైమ్ కోసం 40 ఏళ్లు ఎదురు చూశారు మణిరత్నం. సుహాసినితో పెళ్లికి ముందు నుంచే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ కు సంబంధించిన బుక్స్ బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నారంటే మీరు ఆశ్చర్యపోకమానరు. ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేసింది. ఆ విషయాన్ని మొదటి భాగం క్లైమాక్స్లో రివీల్ చేశాడు దర్శకుడు మణిరత్నం. ఒక పాత్ర నెగిటివ్ మరొకటి పాజిటివ్. రెండో భాగంలో ఐశ్వర్యారాయ్ పాజిటివ్ క్యారెక్టర్ కు సంబంధించిన స్టోరీని రివీల్ చేయబోతున్నారు. పొన్నియిన్ లో భాగం అయ్యేందుకు ఐశ్వర్య రూ.10 కోట్లు పారితోషికం తీసుకుందట. విక్రమ్ రూ.15 కోట్లు, జయం రవి రూ.8 కోట్లు, కార్తి రూ.5 కోట్లు, త్రిష రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్నారట. రియల్ లొకేషన్స్ షూటింగ్స్కు ప్రాధ్యానతనిచ్చారు మణిరత్నం. అందుకే ఇంత భారీ చిత్రాన్ని పక్కా ప్రణాళికతో కేవలం 150 రోజుల్లో రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగలిగారు. రెండు భాగాలకు కలసి 300 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం మణిరత్నం రెహమాన్ను బాలి తీసుకువెళ్లి అక్కడ ట్యూన్స్ కంపోజ్ చేయించారట. వెయ్యేళ్ల కాలం నాటి ట్యూన్స్ ఎలా ఉండేవో అలా కావాలన్నారట. చదవండి: గాడ్ ఫాదర్తో మరోసారి ఆ విషయం రుజువైంది చిరంజీవి ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? -
సూపర్ స్పీడ్ మీద ఉన్న సూపర్ స్టార్.. మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్
యాభై ఏళ్ల కెరీర్లో రజనీకాంత్ నూటయాభై చిత్రాలకు పైగా చేశారు. ప్రస్తుతం 169 చిత్రంగా ‘జైలర్’లో నటిస్తున్నారు. ఏడు పదుల వయసులో ఉన్న సూపర్ స్టార్ సూపర్ స్పీడ్ మీద ఉన్నారు. ‘జైలర్’లో నటిస్తూనే మరో రెండు చిత్రాలు అంగీకరించారట. ఆ విశేషాల్లోకి వస్తే... రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘జైలర్’. ఆగస్ట్లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. రజనీ ఫస్ట్ లుక్ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీ స్టయిలిష్ జైలర్గా కనిపించనున్నారని లుక్ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరో మూడు నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఈలోపు తన రెండు కొత్త చిత్రాల షూటింగ్స్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారట రజనీకాంత్. అయితే ఈ రెండు చిత్రాలను ఒకే సంస్థ నిర్మించనుండటం విశేషం. లైకాతో మళ్లీ... రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన ‘2.0’ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ రజనీతో ‘దర్బార్’ కూడా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో రజనీకి, లైకాకి మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే రజనీతో మరో రెండు సినిమాలు నిర్మించాలనుకుని సూపర్ స్టార్తో ఒప్పందం కుదుర్చుకుందట లైకా సంస్థ. ఇటీవల మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ని లైకా సంస్థనే విడుదల చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రజనీ ఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. లైకా సంస్థకు రజనీ చేయనున్న చిత్రాల దర్శకులు కూడా దాదాపు ఖరారయినట్లే. ఒకరు సిబి చక్రవర్తి, మరొకరు దేసింగు పెరియస్వామి. యువదర్శకులతో... తొలి చిత్రం ‘డాన్’ (2022)తో సూపర్ హిట్ డైరెక్టర్ అనిపించుకున్నారు సిబి చక్రవర్తి. ఈ యువదర్శకుడికి రజనీ చాన్స్ ఇవ్వడం విశేషం. ఇక మరో దర్శకుడు దేసింగు పెరియస్వామి కూడా యువ దర్శకుడే. ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’ (2020) వంటి హిట్ చిత్రంతో పెరియస్వామి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా రిలీజైంది. పెరియస్వామికి కూడా రజనీ చాన్స్ ఇచ్చారట. ఇలా ఒకే బేనర్లో ఇద్దరు అప్కమింగ్ డైరెక్టర్లతో రజనీ చేయనున్న చిత్రాల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
'ఆస్తుల వివరాలు సమర్పించండి'.. హీరో విశాల్కు కోర్టు ఆదేశాలు
తమిళసినిమా: లైకా ప్రొడక్షన్స్కు అప్పు చెల్లింపుల కేసులో నటుడు విశాల్కు మద్రాస్ హైకోర్టు మరింత గడువు ఇస్తూ సరైన పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. వివరాలు.. విశాల్ తమకు రూ.21.29 కోట్లు అప్పు చెల్లించాల్సి ఉందంటూ లైకా ప్రొడక్షన్స్ చెన్నై హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా విశాల్కు సమన్లు జారీ చేసింది. దీంతో ఇటీవల కోర్టుకు హాజరైన విశాల్ తన చిత్ర నిర్మాణ సంస్థ ఒకే రోజు రూ.18 కోట్లు నష్టపోవడంతో లైకా సంస్థకు అప్పు చెల్లించలేకపోయానని తెలిపారు. అయితే తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలన్న ఉద్దేశ్యం లేదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి, సెప్టెంబర్ 9 లోపు ఆస్తుల వివరాలను వెల్లడించాలని విశాల్ను ఆదేశించారు. ఈ కేసు విచారణ శుక్రవారం మరోసారి న్యాయమూర్తి ఎం.సుందర్ సమక్షంలో విచారణకు వచ్చింది. విశాల్ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫు న్యాయవాది హాజరై ప్రమాణ పత్రం కోర్టులో సమర్పించడానికి మరింత గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి మరో రెండు వారాలు గడువు ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. -
40 ఏళ్లు అయినా గుండెలో నుంచి పోవట్లేదు: మణిరత్నం
తమిళ సినిమా దర్శకుడు మణిరత్నం ఏ తరహా కథా చిత్రాన్ని తెరకెక్కించినా అందులో తన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. పలువురు సినీ దిగ్గజాలు చేయడానికి ఆసక్తి కనబరచి చేయలేకపోయిన అసాధారణ చిత్రం పొన్నియన్ సెల్వన్ను ఒక మహా యజ్ఞంలా భావించి పూర్తి చేశారు. అత్యధిక పాఠకుల మనసులను దోచుకున్న చారిత్రక నవల ఇది. రాజరాజ చోళన్ నేపథ్యంతో విక్రమ్, కార్తీ, జయం రవి, శరత్కుమార్, ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్ ప్రభు వంటి భారీ తారాగణంతో మణిరత్నం చిత్రంగా చెక్కారు. లైకా ప్రొడక్షన్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్, రవివర్మ ఛాయాగ్రహణంను అందించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన చిత్రంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి చెన్నైలో నిర్వహించారు. ఇందులో కార్తీ మాట్లాడుతూ.. ఈ తరానికి చెందిన వారికి పుస్తకాలు చదవడానికి సమయం ఉండటం లేదన్నారు. 10 నిమిషాలు వీడియోలు చూడటంతో సరిపెట్టుకుంటున్నారని, అయితే అందరూ చరిత్ర నవలను చదవాలన్నారు. మణిరత్నం ఐదు భాగాలతో కూడిన నవలను చిత్రంగా మలిచారని పేర్కొన్నారు. పొన్నియన్ సెల్వన్ చిత్రం ఆయన మనకు అందిస్తున్న కానుకగా పేర్కొన్నారు. రాజరాజ చోళన్ తమిళ భాషను, దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఇప్పుడు మణిరత్నం ఈ చిత్రం ద్వారా పని చేస్తున్నారని త్రిష అన్నారు. మణిరత్నం గారు ఫోన్ చేసి పొన్నియన్ సెల్వన్ పాత్రను నువ్వే చేస్తున్నావని చెప్పారని, ఈ వేదిక కంటే అప్పుడు ఆయన చెప్పిన మాటే ఒళ్లు పులకరింపచేస్తోందని నటుడు జయం రవి పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా తన బాస్ మణిరత్నం అని, ప్రతి ఒక్కరిలోని ప్రతిభను ఎలా బయటకు తీసుకురావాలన్నది ఆయన నుంచే నేర్చుకున్నానని ఏఆర్ రెహ్మాన్ అన్నారు. ఈ చిత్ర సంగీతం కోసం పలు ప్రాంతాలు తిరిగి పరిశోధనలు నిర్వహించినట్లు చెప్పారు. తాను కళాశాల దశలోనే పొన్నియన్ సెల్వన్ నవల చదివానని, 40 ఏళ్లకు పైగా అయినా అది గుండెల్లోంచి తొలగిపోలేదని మణిరత్నం చెప్పారు. మక్కల్ తిలకం ఎంజీఆర్ నటించాల్సిన చిత్రం ఇదని, నాడోడి మన్నన్ చిత్రం తరువాత ఈ చిత్రం చేయాలని ప్రయత్నించారని, అది జరగలేదని గుర్తు చేశారు. అప్పుడు ఎందుకు కుదరలేదో ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. ఆయన తమ కోసం వదలి వెళ్లారన్నారు. ఆ తరువాత కూడా చాలా మంది ప్రయత్నించారని, తాను మూడు సార్లు ప్రయత్నించానన్నారు. 1980 నుంచి ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికి సాధ్యం అయ్యిందని మణిరత్నం తెలిపారు. చదవండి: పవిత్రా లోకేశ్ నా భార్యే: సుచేంద్రప్రసాద్ నా దృష్టిలో లక్ అంటే అదే : తమన్నా -
వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్పై అధికారిక ప్రకటన
Raghava Lawrence Chandramukhi 2 Lyca Productions Official Announcement: సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయన తార కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రం 'చంద్రముఖి'. 2005లో వచ్చిన ఈ మూవీకి పి. వాసు దర్శకత్వం వహించారు. కామెడీ, హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఎంతో బాగుంటుందని సగటు ప్రేక్షకుడు కోరుకున్నాడు. అందుకు తగినట్లుగానే ఈ ఆల్టైమ్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరో, హీరోయిన్లు ఎవరు అనే అంశంపై స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. 'చంద్రముఖి' సినిమా విడుదలై సుమారు 17 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' అధికారికంగా తెలిపింది. అయితే ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 'కాంచన' మూవీ సిరీస్లతో హారర్, కామెడీ అందించడంలో దిట్టగా లారెన్స్ నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ 'చంద్రముఖి 2'లో మేయిన్ రోల్లో లారెన్స్ నటించనున్నాడు. మొదటి సినిమాను డైరెక్ట్ చేసిన పి. వాసు ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. చంద్రముఖిలో తనదైన కామెడీని పండించిన వడివేలు ఈ సీక్వెల్లో అలరించనున్నాడు. అలాగే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించునున్నారు. ఆర్డీ రాజశేఖర్ కెమెరామేన్గా బాధ్యలు చెపట్టగా, తోట తరణి ఆర్ట్ వర్క్ను చూసుకోనున్నారు. Elated to announce 🤩 our next Big project #Chandramukhi2 🗝️✨ Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎 Directed by #PVasu 🎬 Music by @mmkeeravaani 🎶 Cinematography by @RDRajasekar 🎥 Art by #ThottaTharani 🎨 PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/NU76VxLrjH — Lyca Productions (@LycaProductions) June 14, 2022 అయితే 'చంద్రముఖి' సినిమాను శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించగా 'చంద్రముఖి 2'ను నిర్మించే బాధ్యతను మాత్రం 'లైకా ప్రొడక్షన్స్' తీసుకుంది. అయితే ఈ మార్పుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా, ఇది బహుభాషా చిత్రంగా ఉంటుందా ? లేదా తమిళంలో మాత్రమే విడుదల చేస్తారా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉంటే చంద్రముఖి తర్వాత వెంకటేశ్, పి. వాసు కాంబినేషన్లో 'నాగవల్లి' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రముఖి సినిమాకు ఇదే సీక్వెల్గా ప్రచారం జరిగింది. కాకపోతే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ఇప్పుడు పక్కా స్క్రిప్ట్తో చంద్రముఖి 2ను రూపొందించనున్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. Positive Vibes ✨ & Happy Faces 😇 all around #Chandramukhi2 🗝️✨ Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎 Directed by #PVasu 🎬 Music by @mmkeeravaani 🎶 Cinematography by @RDRajasekar 🎥 Art by #ThottaTharani 🎨 PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/pf57zgJ7xC — Lyca Productions (@LycaProductions) June 14, 2022 -
అలా చేయాలంటే మేము బయటకు వెళ్లాలి: కమల్ హాసన్
Kamal Haasan About Shankar Indian 2 Says We Cant Sit With One Movie: నాలుగేళ్ల తర్వాత లోకనాయకుడు (ఉలగ నాయగన్) కమల్ హాసన్ వెండితెరపై సందడి చేశాడు. తాజాగా ఆయన నటించిన 'విక్రమ్: హిట్ లిస్ట్' మూవీ అదిరిపోయే రెస్పాన్స్తో దూసుకుపోతోంది. సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న కమల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో 'భారతీయుడు 2' (ఇండియన్ 2) గురించి మాట్లాడారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'భారతీయుడు 2' సినిమాపై కమల్ స్పందనను యాంకర్ కోరగా ఈ వ్యాఖ్యలు చేశాడు. భారతీయుడు 2 సినిమా ఆగిపోలేదు. తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అయితే కరోనా, సెట్లో ప్రమాదం ఇలా రకరకాల కారణాలతో సినిమా చిత్రీకరణ ప్రారంభం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా షూటింగ్ కంటిన్యూ చేశాం. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా వాళ్లతో ఇప్పటికే మాట్లాడాం. వాళ్లు కూడా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇంకో 40 శాతం షూటింగ్ మిగిలి ఉంది. అది కూడా త్వరలోనే చేస్తాం. ఎందుకంటే ఒక చిత్రంపైనే పదేళ్లు పని చేయలేం కదా. రాజ్ కమల్ ఫిల్మ్స్ అని నాకొక నిర్మాణ సంస్థ ఉంది. అలాగే శంకర్కి ఎస్. ప్రొడక్షన్స్ ఉంది. ఈ రెండు చాలా పెద్ద సంస్థలు. ఈ రెండింటిని మేమే పోషించాలి. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాలి. అని కమల్ హాసన్ పేర్కొన్నారు. చదవండి: కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ.. కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
హైకోర్టులో హీరో విశాల్కు చుక్కెదురు, రూ. 15 కోట్ల డిపాజిట్కు ఆదేశం
Madras High Court Shocks Hero Vishal: హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్కు కోర్టులో చుక్కెదురైంది. ఈ రుణం కేసులో విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం విశాల్కు కోర్టు మూడు వారాల గుడువును ఇచ్చింది. హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును ఈ గడువులో లోపల డిపాజిట్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. చదవండి: సమంత హాట్ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్ కాగా తమ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని విశాల్ దిక్కరించారంటూ లైకా ప్రొడక్షన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న రూ. 15 కోట్లు చెల్లించకుండా అతడు కొత్త సినిమా రిలీజ్ చేయకుడదు. కానీ విశాల్ తమ డబ్బు తిరిగి చెల్లించకుండానే కొత్త మూవీ వీరమే వాగౌ సుడుం విడుదల చేసేందుకు సిద్దమయ్యాడని, అంతేకాదు తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.21.69 కోట్ల రుణాన్ని రికవరీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లైకా ప్రొడక్షన్ హౌస్ పిటిషన్ దాఖలు చేసింది. చదవండి: ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఈ పిటిషన్పై విచారణ చెప్పట్టిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని విశాల్ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే లైకా ప్రొడక్షన్స్కు ప్రతివాది రూ. 21.29 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అగ్రిమెంట్లో ప్రాథమికంగా వెల్లడించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే విశాల్ మొదట రూ. 12 కోట్లు తీసుకున్నారని, తర్వాత రూ. 3 కోట్లు తీసుకున్నారని, కాబట్టి రూ. 21.29 కోట్ల వడ్డి సరైనది కాదని విశాల్ తరపు న్యాయవాది వాదించారు. -
అల్లు అర్జున్కు పెరిగిన డిమాండ్.. 100 కోట్ల పారితోషికం ?
'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ మారిపోయింది. టాలీవుడ్తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అల్లు అర్జున్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో నార్త్లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా మారాడు. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ 'ది రూల్' సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బన్నీ తర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటా అని ఆసక్తి నెలకొంది. అయితే తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్కు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం అట్లీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు భోగట్టా. అయితే ఈ చర్చలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ లైకా ప్రొడక్షన్ బన్నీకి రూ. 100 కోట్ల పారితోషికం ఆఫర్ చేసి అల్లు అర్జున్ ఒప్పుకుంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నిలుస్తాడు. ప్రభాస్ కూడా తన సినిమాలకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా ఇలా ఉంటే అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతారలతో 'లయన్' సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్'తో పాటు వేణు శ్రీరామ్తో ఒక సినిమా, కొరటాల శివతో రివేంజ్ డ్రామా మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ఏఆర్ మురుగదాస్, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీనులతో కూడా సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
ప్రభాస్ తర్వాత స్థానంలో అల్లు అర్జున్.. దేనిలో అంటే ?
Allu Arjun High Remuneration For Lyca Productions Movie After Prabhas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ 'పుష్ప: ది రైజ్' సినిమా తర్వాత మరో మలుపు తిరిగింది. టాలీవుడ్తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అల్లు అర్జున్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో నార్త్లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. బాలీవుడ్లో రూ. 75 కోట్ల కలెక్షన్సు రాబట్టి హిందీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు పుష్ప రాజు. ముఖ్యంగా సినిమాలోని బన్నీ యాక్టింగ్కు విమర్శకులు, ప్రేక్షకలోకం ఫిదా అయింది. అల్లు అర్జున్ మొదటి చిత్రం గంగోత్రి తర్వాత ఇదే సుకుమార్ డైరెక్షన్లో ఆర్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. తర్వాత విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్న బన్నీ యాక్టింగ్, డ్యాన్సింగ్లో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. (చదవండి: హెల్మెట్తో 'పుష్ప'రాజ్.. పోలీసుల అవగాహన) వీటన్నింటితో పోలిస్తే పుష్పతో పాన్ ఇండియా స్టార్గా మారాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్పై ఫోకస్ పెట్టనున్నాడు అల్లు అర్జున్. 'పుష్ప: ది రూల్' షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి ప్రారంభం కానుంది. దీని తర్వాత బన్నీ ఏం మూవీ చేస్తాడనేది హాట్ టాపిక్గా మారింది. పుష్పకు వచ్చిన క్రేజ్ చూసి పలువురు నిర్మాతలు బన్నీకి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నారట. అయితే పుష్ప తొలి భాగానికి అల్లు అర్జున్ రూ. 50 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ప్రముఖ దక్షిణాది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బన్నీతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఆ సినిమా కోసం బన్నీకి ఏకంగా రూ. 75 కోట్లు ఇచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (చదవండి: 'పుష్ప'రాజ్కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు) ఇదే నిజమైతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకునే స్టార్గా అల్లు అర్జున్ రికార్డ్ కొట్టినట్టే. ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రాలకు ప్రభాస్ రూ. 100 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. టాలీవుడ్లో ప్రభాస్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకునే వారిలో ఇప్పటివరకు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, తర్వాత బన్నీ ఉండేవారు. ఇప్పుడు ఈ లైకా ప్రొడక్షన్స్తో సినిమా నిజమైతే ప్రభాస్ తర్వాతి స్థానం అల్లు అర్జున్దే అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా హలచల్ చేస్తోంది. (చదవండి: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్లో శ్రీవల్లి హుక్ స్టెప్పు) -
Official: ‘పుష్ప’ తమిళ్ రైట్స్ను సొంతం చేసుకున్న లైకా ప్రొడక్షన్స్
Allu Arjun Pushpa Tamil Distribution Rights: క్రియేటివ్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1.. ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు కన్నడలోనే విడుదల చేస్తున్నారు. ఇక పుష్పను హిందీలో గోల్డ్ మైన్స్ కంపెనీ విడుదల చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించగా... తమిళంలో లైకా ప్రోడక్షన్స్ భారీగా విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. మరో విషయమేంటంటే దర్శక ధీరుడు తాజా తెరక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ను కూడా తమిళంలో విడుదల చేయనున్నారు. దీనిని విడుదల చేసేందుకు లైకా ప్రొడక్షన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ పుష్ప కంటే ముందే జరిగింది. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ దీంతో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను లైకా ప్రొడక్షన్ తమిళంలో విడుదల చేసి క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఇదిలా ఉంటే పుష్ప మూవీలో యలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్గ నటిస్తుండగా ప్రముఖ యాంకర్ అనయసూయ . దాక్షాయనిగా అలరించినుంది. ఇక నటుడు సునీల్ను మంగలం శ్రీనుగా ఇటీవల మేకర్స్ పరిచయం చేశారు. మరోవైపు ఈ సినిమాలో ఓ భారీ మాస్ సాంగ్ను చిత్రీకరించనున్నారట. ఇందులో బన్నీ 1000 మంది డాన్సర్లతో కలిసి షూట్లో పాల్గొననున్నాడని సమాచారం. చదవండి: 46 ఏళ్లకు తల్లైన స్టార్ హీరోయిన్, కవలలకు జననం #PushpaTheRise keeps getting huge with time 🤘 Grand release in Tamil Nadu by the prestigious @LycaProductions 💥💥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/eOmXYcwb4Y — Pushpa (@PushpaMovie) November 17, 2021 -
రెండు భాగాలుగా మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’
ప్రముఖ దర్శకులు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ పతాకాలపై సుభాస్కరన్, మణిరత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు సోమవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష, శోభితా ధూలిపాళ్ల, ఐశ్వర్యా లక్ష్మీ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. The golden era comes to life! #PonniyinSelvan #PS1 #ManiRatnam @MadrasTalkies_ pic.twitter.com/RHbwDoMv22 — Lyca Productions (@LycaProductions) July 19, 2021 -
లైకా ప్రొడక్షన్స్ కొత్త సినిమా.. హీరోయిన్గా ప్రముఖ నటి
చెన్నై: లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ యువ నటుడు అధర్వ మురళి కథానాయకుడిగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సంస్థ నిర్మిస్తున్న 22వ చిత్రం ఇది. రాజ్కిరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.సర్గుణం కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి రాధిక శరత్కుమార్, ఆర్.కె.సురేష్, జై ప్రకాష్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. కథానాయికగా ఓ ప్రముఖ నటి నటించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సహజత్వంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ను తిరువయ్యారు పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా ఒకే షెడ్యూల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని, లోకనాథన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
ఫెఫ్సీకి లైకా ప్రొడక్షన్స్ భారీ విరాళం
తమిళసినిమా: కరోనా రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి కారణంగా పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారీగా ఉంది. లాక్డౌన్ వళ్ల వేలాది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ కష్ట సమయంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు హీరోలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. దక్షిణాదికి చెందిన సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కు లైకా ప్రొడక్షన్స్ రూ.కోటి విరాళాన్ని అందించింది. సంస్థ ప్రధాన కార్యదర్శి తమిళ కుమరన్, సంస్థ డైరక్టర్ రాజా సుందరం నిరుదన్, గౌరవ్ ఛ్చరా, సుబ్బునారాయణన్ స్థానిక వడపళనిలో సమాఖ్య అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణికి సోమవారం చెక్కును అందజేశారు. -
డైరెక్టర్ శంకర్కు లైకా సంస్థ షాక్!
సాక్షి, చెన్నై: దర్శకుడు శంకర్తో అమీ తుమి తేల్చుకోవడానికి లైకా సంస్థ సిద్ధమైనట్టు సమాచారం. ఈ సంస్థ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్–2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2018లో చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. చిత్రం షూటింగ్ ఆలస్యానికి లైకా సంస్థనేనని దర్శకుడు శంకర్ కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. కేసు విచారణలో ఉంది. దర్శకుడు శంకర్ తెలుగులో రామ్చరణ్ హీరోగా ఒకటి, హిందీలో రణబీర్సింగ్తో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో లైకా సంస్థ తమ చిత్రా న్ని పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ను తెలుగులో చిత్రం చేయడానికి అనుమ తించరాదని తెలుగు ఫిలిం ఛాంబర్కు, హిందీ ఫిలిం ఛాంబర్కు కూడా లేఖలు రాసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
Indian 2: కమల్ హాసన్ మధ్యవర్తిత్వం?
‘ఇండియన్ 2’ చిత్రీకరణ విషయంలో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఈ చిత్ర దర్శకుడు శంకర్లకు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్ 2’ని పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకూడదని లైకా ప్రతినిధులు అంటుంటే, షూటింగ్కు సరైన సదుపాయాలు కల్పించకుండా, నా తర్వాతి ప్రాజెక్ట్స్ను నియంత్రించే హక్కు లైకా వారికి లేదని శంకర్ అంటున్నారు. ఈ వివాదంపై కోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. అయితే లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు, దర్శకుడు శంకర్ కూర్చుని చర్చించుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు ఇటీవల ఓ సందర్భంలో సూచించింది కూడా. ఇప్పుడు ఈ బాధ్యతను ‘ఇండియన్ 2’ సినిమాలో హీరోగా నటిస్తున్న కమల్హాసన్ తీసుకుని వారధిలా ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేసే ఆలోచనలో ఉన్నారట. లైకా ప్రొడక్షన్స్, శంకర్తో ముందు విడిగా మాట్లాడి, ఆ తర్వాత ఇరు పక్షాల మధ్య ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమల్హాసన్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. కమల్ జోక్యంతోనైనా శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య నడుస్తున్న వివాదం కొలిక్కి వస్తుందా? సమస్య పరిష్కారం అయి, షూటింగ్ మొదలవుతుందా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. 1996లో దర్శకుడు శంకర్, హీరో కమల్హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’)కి సీక్వెల్గా ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ప్రీత్, బాబీ సింహా ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. చదవండి: ఆ రిస్క్ చేయను: హీరోయిన్ ప్రణీత -
వివాదం.. డైరెక్టర్ శంకర్ స్పందన కోసం చూస్తున్నాం
దర్శకుడు శంకర్ను చుట్టుముట్టిన వివాదాలు ఇప్పుడు తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్. ‘ఇండియన్ 2’ నిర్మాణం, ‘అన్నియన్’ రీమేక్ చిత్రాల విషయంలో ఆయన వివాదాలు ఎదుర్కొంటున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ మరో సినిమాను డైరెక్ట్ చేయకూడదని మద్రాస్ హైకోర్టులో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కేసు వేసిన సంగతి తెలిసిందే. రామ్చరణ్ హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు శంకర్ ప్రకటించిన తర్వాత కోర్టుని ఆశ్రయించింది లైకా. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ సినిమా విషయంలో కోర్టు జోక్యంతో సానుకూలత ఏర్పడదని, రెండు పక్షాలవారు ఆలోచించుకుని ఓ సానుకూల నిర్ణయానికి రావాలని కేసుని విచారించిన కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ తమిళ నటుడు వివేక్ హఠాన్మరణం కూడా ‘ఇండియన్ 2’ని ఇరుకుల్లో పడేసింది. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదు. సినిమా పూర్తి చేయాలంటే వివేక్ ఉన్న సీన్స్ను మళ్లీ మరో నటుడితో చిత్రీకరించాలని శంకర్ పేర్కొన్నారు. కాగా.. కమల్హాసన్తో ఓ సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నది వివేక్ కల. ఆ కల పూర్తి స్థాయిలో నిజం కాకుండానే వివేక్ మరణించడం బాధాకరమని ఆయన ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. మరి.. ‘ఇండియన్ 2’, ‘అన్నియన్’ చిత్రాల వివాదాలకు ఎలా తెరపడనుందో చూడాలి. శంకర్ స్పందన కోసం చూస్తున్నాం! – సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్ ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) సినిమా రీమేక్ రైట్స్ గురించి ఈ చిత్రదర్శకుడు శంకర్, చిత్రనిర్మాత రవిచంద్రన్ల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేయనున్నట్లు ఇటీవల శంకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాతగా ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ తనవే అని ఆస్కార్ రవిచంద్రన్, దర్శకుడిగా రీమేక్ హక్కులు తనవేనని శంకర్ ఎవరికివారు బహిరంగ లేఖలను విడుదల చేశారు. తాజాగా శంకర్పై సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్లో ఫిర్యాదు చేశారు నిర్మాత రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్ మా సంస్థ సభ్యుడు. ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ విషయంలో ఆయన శంకర్పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మేం శంకర్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. మామూలుగా అయితే రీమేక్ రైట్స్ నిర్మాతలకే ఉంటాయి. ఒక నిర్మాత నిర్మించిన సినిమాను వేరే నిర్మాతతో రీమేక్ చేయాలన్నప్పుడు ఆ దర్శకుడు సదరు నిర్మాతకు కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి కేసులు గతంలో కొన్ని ఉన్నాయి. కానీ ‘అన్నియన్’ సినిమా విడుదలై చాలా రోజులయింది కాబట్టి ఈ విషయంపై ప్రస్తుతం నేనేం కామెంట్ చేయలేను’’ అని సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్కి చెందిన రవి కొట్టాక్కర పేర్కొన్నారు. -
‘ఇండియన్ -2’ వివాదం: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘ఇండియన్ -2’ వివాదంలో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్కు మద్రాసు హైకోర్టు సూచించింది. కోర్డు జోక్యంతో వివాదంలో సానుకూలత ఏర్పడదని వ్యాఖ్యానించింది. లైకా ప్రొడక్షన్లో రూపొందితున్న ఇండియన్ 2 ప్రాజెక్టును మధ్యలోనే ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేస్తుండడంతో శంకర్పై నిర్మాణ సంస్థ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మద్రాసు హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా లైకా ప్రోడక్షన్స్ తమ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది మార్చికే ‘ఇండియన్-2’ షూటింగ్ పూర్తి చేస్తామని శంకర్ హామీ ఇచ్చారని, ఆసల్యం చేయడంతో భారీగా నష్టపోయామని కోర్టుకు విన్నవించింది. ఇతర చిత్రాలు చేపట్టకుండా శంకర్పై ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరింది. నటుడు వివేక్ మృతి చెందడంతో ఈ సీన్లన్నీ మళ్లీ తీయాలని శంకర్ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తమ జోక్యంలో సమస్యకు పరిష్కారం కాదని, ఇరు పక్షాలు కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనంతరం విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. 1996లో కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ ’కు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరగడం, కమల్ హాసన్ మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్ 2’కు బ్రేక్ పడింది. -
ఇండియన్ 2: దర్శకుడు శంకర్కు ఊరట
చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు శంకర్కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించడంపై స్టే విధించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. నటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇండియన్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఆరంభం నుంచి పలు అవరోధాలను ఎదుర్కొంటోంది. కరోనాకు ముందే ఇండియన్ 2 చిత్రం నిలిచిపోయింది. దీంతో శంకర్ ఇతర చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైకా సంస్థ శంకర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తమ సంస్థ ఇండియన్ 2 చిత్రం నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి రూ.150 కోట్ల బడ్జెట్తో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అయితే ఇప్పటికే రూ.236 కోట్లు అయ్యిందని తెలిపారు. ఇప్పటికీ 80 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని పేర్కొన్నారు. శంకర్కు రూ. 40 కోట్లు పారితోషకం చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అందులో రూ. 14 కోట్లు అడ్వాన్గా చెల్లించామన్నారు. అయితే తమ చిత్రాన్ని పూర్తి చేసే వరకు శంకర్ ఇతర చిత్రాలకు పని చేయకుండా ఆయనపై నిషేధించాలని కోరారు. ఈ కేసు గురువారం న్యాయమూర్తి పీటీ.ఆషా సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించరాదంటూ శంకర్పై నిషేధం వధించలేమని పేర్కొన్నారు. శంకర్ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: డైరెక్టర్ శంకర్పై నిర్మాతల కేసు! -
డైరెక్టర్ శంకర్పై నిర్మాతల కేసు!
‘ఇండియన్ 2’ షూటింగ్ను దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈ సినిమా శంకర్ కెరీర్ను ఇబ్బందిపెడుతూనే ఉంది. గత ఏడాది ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగి, నలుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్కు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత సినిమా మళ్ళీ సెట్స్పైకి వెళ్లలేదు. ఈలోపు ‘ఇండియన్ 2’లో హీరోగా నటిస్తున్న కమల్హాసన్ రాజకీయంగా బిజీ అయిపోయారు. ఇటు శంకర్ కూడా రామ్చరణ్తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేసేందుకు కథ రెడీ చేసుకున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దర్శకుడు శంకర్కు షాక్ ఇచ్చింది. ‘ఇండియన్ 2’ను పూర్తి చేయకుండా శంకర్ మరో ప్రాజెక్ట్కు డైరెక్టర్గా వ్యవహరించకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ,మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ‘‘ఇండియన్ 2’ బడ్జెట్ రూ. 236 కోట్లనుకున్నాం. ఇప్పటి వరకు చేసిన షూటింగ్కు రూ. 180 కోట్లు ఖర్చు అయ్యాయి. లాగే శంకర్కు మేం ఇస్తామన్న 40 కోట్ల పారితోషికంలో ఆల్రెడీ 14 కోట్లు చెల్లించాం. మిగిలిన 26 కోట్ల రూపాయలను కూడా కోర్టు సమక్షంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని లైకా ప్రొడక్షన్స్ తమ పిటిషన్ లో పేర్కొందని కోలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. అయితే దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య తలెత్తిన ఈ వివాదం ఎలాంటి పరిష్కారంతో ముగుస్తుందనే చర్చ ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. 1996లో కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ ’కు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. -
రామ్ చరణ్-శంకర్ సినిమాకు ‘లైకా’ బ్రేక్..
మెగా పవర్ స్టార్ రామ్చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ ఓ భారీ ప్రాజెక్ట్ సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో చెర్రీ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడటం చకచకా అయిపోయాయి. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్పైకి వెళుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ మూవీ ఇప్పట్లో సెట్స్పై వచ్చేల కనిపించడం లేదు. కాగా శంకర్ ఇప్పటికే కమల్ హాసన్తో ‘ఇండియా 2’ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 25 ఏళ్ల క్రితం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన భారతీయుడు సీక్వెల్గా శంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం జరగడం, ఈ ప్రమాదంలో కొంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ వ్యవహరం కోర్టు దాకా వెళ్లింది. దీంతో ఈ మూవీ మేకర్స్ నష్టపరిహారాలు చెల్లించడం కూడా జరిగింది. ఆ షాక్లో ఉండిపోయిన డైరెక్టర్ మళ్లీ ఈ మూవీ రీ-షెడ్యూల్కు ప్లాన్ చేయడం లేదు. ఇందులో కథానాయికగా చేస్తున్న కాజల్ అగర్వాల్ సైతం ఈ మూవీ నుంచి తనకు ఎలాంటి అప్డేట్ రాలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇక ‘ఇండియా 2’ షూటింగ్ కొనసాగుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ‘ఇండియా 2’ను పక్కన పెట్టి శంకర్ చరణ్ మూవీ ప్లాన్ చేస్తుండటంతో లైకా ప్రొడక్షన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. తాము కేటాయించిన 230 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇప్పటి వరకు రూ. 180 కోట్లు ఖర్చు పెట్టించిన డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పూర్తి చేయకుండానే వేరే కొత్త ప్రాజెక్ట్కు వెళ్లడం సరికాదని కోర్టుకు తెలిపింది. దీంతో ఈ వ్యవహరం కాస్తా ముదిరెలా కనిపిస్తోంది. యాక్సిడెంట్ తర్వాత శంకర్ ‘ఇండియా 2’ గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాకపోవడం, హీరో కమల్ హాసన్ ఏమో రాజకీయాల్లో బిజీ అయిపోవడం ఇదంత చూస్తుంటే శంకర్ ఇబ్బందుల్లో పడేసేలా ఉంది. చదవండి: మహేశ్ బాబు నిర్మాతగా మరో క్రేజీ ప్రాజెక్ట్ శంకర్-రామ్ చరణ్ కాంబో; ఊహించని స్క్రిప్ట్ -
‘ఆర్ఆర్ఆర్ ’హవా.. రికార్డు రేటుకి తమిళ్ రైట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడం, స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.. ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్ని భారీగా జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం చేస్తూ బుధవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. ఆర్ఆర్ఆర్ మూవీ తమిళనాడు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడెక్షన్స్ ట్విటర్ ద్వారా తెలియజేసింది. ‘బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ తమిళనాడు థియేట్రికల్ హక్కులను దక్కించుకుంచుకున్నామని ప్రకటించడం ఎంతో గర్వంగా ఉంది’అంటూ లైకా ప్రొడక్షన్స్ ట్విట్ చేసింది. అయితే ఈ థియేట్రికల్స్ రైట్స్ను పొందడం కోసం లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.45 కోట్ల భారీ ధరకు తమిళనాడు థియేట్రికల్స్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇంత మొత్తంలో చెల్లించడం పెద్ద ఆశ్యర్యకరమైన విషయమేమి కాదు. , రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2’ తమిళనాడులో సుమారు రూ.78 కోట్ల షేర్ వసూలు చేసింది. అందుకే లైకా ప్రొడక్షన్స్ రూ. 45 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్పై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి రూ.45 కోట్లు వసూలు కావడం పెద్ద కష్టమేమీకాదు. We are delighted and proud to announce📢 The Tamil Nadu theatrical rights of THE BIGGEST PAN INDIA FILM #RRRMovie is acquired by us...🔥🌊@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @thondankani @RRRMovie @DVVMovies #RRR pic.twitter.com/ASZsLLVdNT — Lyca Productions (@LycaProductions) February 17, 2021 -
దర్బార్ : మూవీ రివ్యూ
టైటిల్: దర్బార్ జానర్: యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, యోగిబాబు, సునీల్ శెట్టి, సంగీతం: అనిరుద్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్ బ్యానర్: లైకా ప్రొడక్షన్ సూపర్స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సంబరాలను ప్రారంభించాడు. దర్బార్ సినిమాతో బాక్సాఫీస్ బరిలో పందెంకోడిలా దూకాడు. ఇది డబ్బింగ్ సినిమా అయినా.. తెలుగులో రజనీకాంత్కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో స్టార్ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ‘దర్బార్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు రజనీ సరసన నయనతార నటిస్తుండటం.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లో ఆదిత్య అరుణాచలంగా రజనీ తనదైన లుక్స్తో మెస్మరైజ్ చేయడం సినిమాపై అంచనాలను పెంచింది. సంక్రాంత్రి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు ‘దర్బార్’ ఏమేరకు ప్రేక్షకుల మెప్పించిందో తెలుసుకుందాం పదండి... కథ: ముంబై పోలీసు కమిషనర్ అయిన ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్స్టర్లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్ సభ్యులను కూడా బెదిరిస్తాడు. ఏదైనా పని చేపడితే.. దానిని కంప్లీట్గా క్లీన్ చేసే వరకు వదిలిపెట్టని ఆదిత్య అరుణాచలం ముంబైలో డ్రగ్స్, హ్యుమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్లను ఏరివేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రాను అరెస్టు చేస్తాడు. ఆదిత్య అరుణాచలం వ్యూహాలతో అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్ హతమవ్వాల్సి వస్తోంది. దీంతో డ్రగ్లార్డ్, మొబ్స్టర్ అయిన హరిచోప్రా (సునీల్ శెట్టి) ప్రతీకారానికి తెగబడతాడు. ఆదిత్య కూతురితోపాటు విక్కీని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.. నటీనటులు: దక్షిణాది వెండితెరపై ఇప్పటికీ తిరుగులేని సూపర్స్టార్ రజనీకాంత్. ఆయనకు వయస్సు పెరుగుతున్నా.. రోజురోజుకు స్టామినా మాత్రం తగ్గడం లేదు. తనదైన స్టైల్, గ్లామర్, యాక్టింగ్, పంచ్ డైలాగులతో రజనీ ఇప్పటికీ వెండితెరమీద ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘దర్బార్’ కూడా పూర్తిగా రజనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. ముంబై పోలీసు కమిషనర్గా రజనీ లుక్, స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్తో అదరహో అనిపిస్తాయి. పోలీసు కమిషనర్గా రౌడీ మూకలను రప్ఫాడిస్తూనే.. ఇటు నయనతారతో మనస్సు గెలిచేందుకు ప్రయత్నించే పాత్రలో రజనీ అదరగొట్టాడు. తన ఏజ్కు తగ్గట్టు నడి వయస్సు పాత్ర పోషించిన రజనీ.. నయనతారతో మాట్లాడేందుకు, ఆమె ప్రేమ గెలిచేందుకు పడే పాట్లు ప్రేక్షకులను నవిస్తాయి. ఇక, హీరోయిన్గా నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇది ప్రధానంగా తండ్రీ-కూతురు మధ్య సెంటిమెంట్ కథ. తండ్రిగా రజనీ, కూతురిగా నివేదా థామస్ తెరపై అద్భుతంగా ఒదిగిపోయారు. స్నేహితుల్లా ఉండే తండ్రీ-కూతురు మధ్య సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. సెంకడాఫ్లో ఇద్దరి పాత్రలు, అభినయం ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. ఇక, విలన్గా సునిల్ శెట్టి ఓ మోస్తరుగా నటించాడు. రజనీ స్థాయికి తగ్గ విలన్ అయితే కాదు. యోగిబాబు కామెడీ అంతంతమాత్రమే ఉండగా.. ముంబై నేపథ్యం కావడంతో ఎక్కువశాతం నటులు కొత్తవాళ్లు, బాలీవుడ్ వాళ్లు సినిమాలో కనిపిస్తారు. విశ్లేషణ: రజనీకాంత్ను మరోసారి తెరమీద పోలీసు ఆఫీసర్గా చూపిస్తూ మురగదాస్ తీసుకొచ్చిన ‘దర్బార్’ సినిమాలో కథ అంత బలంగా కనిపించదు. ఇలాంటి రివేంజ్ డ్రామా కథలతో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే అది కచ్చితంగా రజనీకాంత్. ప్రతి ఫ్రేములోనూ రజనీని స్టైలిష్గా చూపించడంలో, రజనీ స్టైల్స్, మ్యానరిజమ్స్ ఉపయోగించుకోవడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ, కథ కొత్తది కాకపోవడం, క్లైమాక్స్ రోటిన్గా ఉండటంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొంత బోర్ కొట్టవచ్చు. ఇక, సెకండాఫ్లో కథ కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా బాగున్నా.. క్లైమాక్స్ రోటిన్గానే అనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా సీన్లను అనిరుద్ ఓ రేంజ్కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లో వచ్చే ఫైట్ సీన్లో ఫైట్ స్టైలిష్గా ఉండటంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్బ్గా అనిపిస్తుంది. అయితే, డబ్బింగ్ సినిమా కావడంతో పాటలు చాలావరకు రణగొణధ్వనుల్లా అనిపిస్తాయి. ఇక, సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా నిర్మాణ విలువలూ రిచ్గా ఉన్నాయి. మొత్తానికీ ఈ సినిమా రజనీ ఫ్యాన్స్కు పండుగే అని చెప్పవచ్చు. బలాలు రజనీకాంత్ స్టైలిష్ లుక్, మ్యానరిజమ్ కూతురిగా నివేదా థామస్ నటన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బలహీనతలు రజనీ స్థాయికి తగ్గట్టు కథ బలంగా లేకపోవడం ఒకింత రోటిన్ కథ కావడం, రోటిన్ క్లైమాక్స్ - శ్రీకాంత్ కాంటేకర్ -
‘ఫుల్ యాక్షన్ ట్రైలర్కు సిద్దంగా ఉండండి’
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్లో అలరించనుండటంతో ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అంతేకాకుండా విభిన్న కథలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల ఎక్స్పర్ట్గా పేరుగాంచిన మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటం ఈ సినిమాకు డబుల్ ప్లస్ కానుంది. కాగా ఇప్పటికే విడుదలైన రజనీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, పాటలు సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లాయి. తాజాగా రజనీ ఫ్యాన్స్కు హుషారు కలిగించే వార్తను ‘దర్బార్’టీమ్ ప్రకటించింది. ‘దర్బార్’మూవీ ట్రైలర్ను డిసెంబర్ 16(సోమవారం) సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘హలో ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు చిత్ర ట్రైలర్ విడుదల కాబోతుంది. దర్బార్ యాక్షన్ ట్రైలర్తో ఎంజాయ్ చేయడానికి సిద్దంగా ఉండండి’అంటూ మురుగదాస్ ట్వీట్ చేశాడు. షూటింగ్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అంతేకాకుండా మూవీ ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహిస్తున్నాయి సినిమా యూనిట్. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా నివేదా థామస్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. -
‘అనుమతి లేకుండా ‘ఇండియన్ 2’ మొదలెట్టారు’
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా తరపున నిర్మాత కరుణామూర్తిపై రూ.110 కోట్ల మోసానికి పడినట్లు గురువారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విజయ్ నటించిన కత్తి చిత్రం ద్వారా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన సంస్థ లైకా. ఆ తరువాత 2.ఓ తదితర చిత్రాలను ఈ సంస్థలో నిర్మించారు. కాగా ఈ సంస్థలో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న కరుణామూర్తి, ఆయన సన్నిహితుడు భాను కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సంస్థ 2013లో చిత్ర నిర్మాణం చేపట్టిందన్నారు. అందుకు వృత్తిపరంగా ఆలోచనపరుడు అవసరం కావడంతో కె.కరుణామూర్తిని తమ సంస్థకు సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. బ్రిటీష్ పౌరసత్వం కలిగిన శ్రీలంక తమిళుడు, ఇండియన్ సినిమా నిర్మాత అయిన కరుణామూర్తి గత 27 ఏళ్లుగా అనుభవం కలిగిన వ్యక్తి అనీ, ఆయనకు ఆర్థిక పరమైన విషయాల్లో భాను అనే వ్యక్తి సహయకుడిగా ఉన్నాడని తెలిపారు. కథలను వినడం, నిర్మాణ ప్రణాళికల చేయడం, చిత్ర నిర్వహణ వంటి విషయాలకు కరుణామూర్తిని లైకా సంస్థకు నియమించినట్లు తెలిపారు. దీంతో చిత్ర నిర్మాణానికి సంబంధించిన అన్ని అధికారాలు ఆయన చేతిలోనే ఉన్నాయన్నారు. నటీనటులకు పారితోషికాలు నిర్ణయించడంలోనూ ప్రధాన పాత్రను వహించారని తెలిపారు. ఆయన నిర్ణయాల మేరకే డబ్బు ఇచ్చే వారమన్నారు. అలా సినిమాల వ్యాపారం, మార్కెటింగ్, ఆర్థిక లావా దేవీలు అన్నీ తన గుప్పెట్లోకి తీసుకున్నారని చెప్పారు. అలా అతని అనుచరుడు భానునే లైకా సంస్థలో కార్మికులను నియమించాడని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కార్మికులు వ్యహరించేలా చేసుకున్నాడని చెప్పారు. అనుమతులు లేకుండానే...ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు, ఎమన్ చిత్రాల థియేటర్ల హక్కులను, శాటిలైట్ హక్కులను తన ఐన్గరన్ ఇంటర్నేషనల్ ఫిలింస్ తరపునే రూ. 95 కోట్లకు కరుణామూర్తి విక్రయించారన్నారు. అయితే ఇందులో కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఇచ్చి సంస్థను మోసం చేశారని ఆరోపించారు. అలా మూడు చిత్రాలకు గానూ రూ.90 కోట్లకు మోసానికి పాల్పడ్డారన్నారు. అలా థియేటర్ల హక్కులు, శాటిలైట్ హక్కులు అంటూ తమ సంస్థకు రూ.100 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందన్నారు. కొన్నేళ్ల విచారణ తరువాత ఈ మోసాన్ని తాము గ్రహించామని తెలిపారు. ఇదే కాకుండా తమ అనుమతి లేకుండా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ రూ. 25 కోట్ల నిధిని ఇచ్చారని ఆరోపించారు. అయితే ఆ డబ్బును తిరిగి ఇప్పించడం తన బాధ్యత అని చెప్పిన కరుణామూర్తి ఇప్పటి వరకూ చర్యలు చేపట్టాలేదన్నారు. తమ అనుమతి లేకుండా ఇండియన్– 2 చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించి ఆ తరువాత నిలిపేశారని తద్వారా రూ.13 కోట్లు నష్టం కలిగిందన్నారు. -
‘పది నెలలైనా పారితోషికం రాలేదు’
చెన్నై : సౌత్ సినిమాలను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించే ప్రముఖ సబ్టైటిలిస్ట్ రేఖ్స్ రజనీ-అక్షయ్ కుమార్ మూవీ 2.ఓ నిర్మాతలపై ఫైర్ అయ్యారు. ఈ సినిమాకు తనకు రావాలల్సిన బకాయిలను నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తనకు ఇంకా చెల్లించలేదని ఆరోపించారు. పది నెలలు గడిచినా బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2.ఓ తెలుగు, తమిళ్ వెర్షన్కు తాను సబ్టైటిల్ వర్క్ చేసినా తనకు ఇంకా పేమెంట్ అందలేదని ఆమె ట్విటర్లో తన ఆవేదన వెళ్లగకక్కారు. సినిమా గత ఏడాది నవంబర్లో విడుదల కాగా తనకు రావాల్సిన మొత్తం సెటిల్ చేసేందుకు నిర్మాతలకు పదినెలల సమయం ఇచ్చినా ఫలితం లేకపోయిందని, తాను పలుమార్లు వారికి మెసేజ్లు, మెయిల్, కాల్స్ చేసినా స్పందన లేదని వాపోయారు. సినిమాలకు వెన్నెముక వంటి సబ్టైటిల్స్ పనులు చేసేవారి శ్రమకు ఫలితం అందడం లేదని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో తనతో వర్క్ చేయించుకునే నిర్మాతలకు తమ పరిస్ధితి తెలియాలనే ఉద్దేశంతోనే తాను ట్వీట్ చేస్తున్నానని చెప్పారు. 2.ఓ మూవీకే కాకుండా కమల్ హాసన్, గౌతమ్ మీనన్, నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ల నుంచి కూడా తనకు బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. కాగా లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి ఆమె ఆరోపణలను తోసిపుచ్చారు. తాము అందరికీ సకాలంలో చెల్లింపులు జరిపామని, ఎవరికీ బకాయి లేమని స్పష్టం చేశారు. రికార్డులు పరిశీలించి ఆమెకు చెల్లింపులు జరిపిన విషయం నిర్ధారించాలని ఎగ్జిక్యూటివ్ నిర్మాత కోరారని చెప్పారు. తన పనికి డబ్బు చెల్లించలేదని ఆరోపించడం ఆమెకు అలవాటని లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
ఆ చిత్రానికి వెంటాడుతున్న సమస్యలు
చెన్నై: కాలం బలీయమైనదని నమ్మక తప్పదు. అందుకే ముహూర్త బలం ఉండాలంటారు. తాజాగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రానికి సమస్యలు వెంటాడుతున్నాయనే టాక్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. మల్టీస్టారర్ చిత్రాలు చేయడంలో మణిరత్నం సిద్ధహస్తుడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటి దళపతి, ఇరువర్ వంటి మల్టీస్టారర్ చిత్రాలను ఆయన సునాయాసంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. అంతేకాదు ఇటీవల అరవిందస్వామి, విజయ్సేతుపతి, శింబు, అరుణ్పాండియన్, జ్యోతిక, ఐశ్వర్యరాజేశ్, జయసుధ, ప్రకాశ్రాజ్ వంటి ప్రముఖ తారలతో సెక్క సివంద వానం చిత్రాన్ని చేసి విజయాన్ని అందుకున్నారు. అయితే మరో మల్టీస్టారర్ చిత్ర నిర్మాణమే ఆయన్ని వెక్కిరిస్తోందనే చెప్పాలి. అదే పొన్నియిన్ సెల్వన్. నిజానికి ఈ చిత్రం ఎంజీఆర్, కమలహాసన్ వంటి వారినే ఊరించి వదిలేసింది. ఇక మణిరత్నం సెక్క సివంత వానం చిత్రానికి ముందే పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని చేయాలని సంకల్పించారు. అందులో ఇళయదళపతి విజయ్, టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు, బాలీవుడ్ సౌందర్యవతి ఐశ్వర్యరాజేశ్ వంటి మల్టీ స్టారర్స్తో తెరకెక్కించే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అయితే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ను తెరకెక్కించడంపై తన పట్టును ఏ మాత్రం పడలించలేదు. సెక్క సివంద వానం చిత్ర విజయంతో మళ్లీ పొన్నియిన్ సెల్వన్ చిత్ర నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ సారి తన ప్రయత్నానికి ఎవరూ అడ్డుకోలేరని భావించారు. ఇందులోనూ జయంరవి, కార్తీ, బాలీవుడ్ బిగ్బీ అమితాబ్బచ్చన్, అందాలరాశి ఐశ్వర్యరాయ్, కీర్తీసురేశ్, అమలాపాల్ వంటి మల్టీస్టార్స్తో పాటు అదనంగా నయనతారను కూడా నటింపజేయాలని భావించారు. అయితే నయనతార కాల్షీట్స్ లేకపోవడంతో ఆమె పాత్రకు మరో అగ్రనటి అనుష్కను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను కట్టనున్నారు. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి అనే ప్రచారం జరుగుతోంది. ఇక షూటింగ్ ప్రారంభించడమే తరువాయి అని, సెప్టెంబర్లో పొన్నియిన్ సెల్వన్ సెట్ పైకి వెళ్లనుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ చిత్రానికి మళ్లీ మరో సమస్య వచ్చి పడినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా సంస్థ నిర్మించడానికి ముందుకు వచ్చింది. కాగా ఇప్పుడా సంస్థ ఆ ప్రయత్నాన్ని విరమించుకుందనే ప్రచారం సాగుతోంది. కారణం చిత్ర బడ్జెటేనని టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉండగా, పొన్నియిన్ సెల్వన్ చిత్రం మాత్రం మణిరత్నంను బాగా ఇబ్బంది పెడుతోందని మాత్రం చెప్పవచ్చు. అయితే చిత్రం కాకపోయినా, మణిరత్నం తాజా చిత్రం మల్టీస్టారర్గానే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. -
వినోదాల విందుగా పన్నికుట్టి
తమిళసినిమా: రజనీకాంత్తో 2.ఓ వంటి భారీ బ్రహ్మాండ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత శుభాష్కరన్ తాజాగా నిర్మిస్తున్న వినోదాత్మక కథా చిత్రం పన్నికుట్టి. కిరుమి చిత్రం ఫేమ్ అనే చరణ్ మురుగయ్యా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు కరుణాకరన్, యోగిబాబు, సింగంపులి, దిండుగళ్ లియోని, టీపీ.గజేంద్రన్, లక్ష్మీప్రియ, రామర్, పళయ జోక్ తంగదురై ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఆండవన్ కట్టళై, 49ఓ, క్రిరుమి చిత్రాల సంగీత దర్శకుడు కే దీనికి సంగీత బాణీలను కడుతున్నారు. సతీశ్ మురుగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇప్పుడు నటుడు యోగిబాబు క్రేజే వేరు. ప్రతి చిత్రంలోనూ ఇతను ఏదో ఒక పాత్రలో కనిపించాల్సిందే. అంతే కాదు ఇటీవల హీరో తరహా పాత్రల్లోనూ నటించేస్తున్నాడు. అదే విధంగా నటుడు కరుణాకరన్ అన్ని తరహా పాత్రల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పన్నికుట్టి చిత్రంతో ప్రేక్షకులకు వినోదాల విందు అందించబోతున్నారు. పన్ని కుట్టి అంటే పందిపిల్ల అని అర్థం. ఈ చిత్రం దాని చుట్టూ తిరుగుతుందని సమాచారం. -
‘నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శంకర్’
రోబో, ఐ, 2.ఓ లాంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది దర్శకుడు శంకర్. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఈ గ్రేట్ డైరెక్టర్ ఇటీవల కమర్షియల్ విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. వరుసగా నన్బన్ (3 ఇడియట్స్ రీమేక్), ఐ, 2.ఓ సినిమాలు నిర్మాతలకు నష్టాలు మిగల్చటంతో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న భారతీయుడు 2కు ఇబ్బందులు తప్పటం లేదు. దేశంలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 2.ఓ సినిమాకు దాదాపు 100 కోట్ల నష్టం వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లోనే శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2ను తెరకెక్కిస్తున్నారు. దీంతో నిర్మాతలు శంకర్కు బడ్జెట్ పరంగా కండిషన్స్ పెడుతున్నారట. ఈ విషయంలోనే శంకర్కు నిర్మాతలకు మధ్య దూరం పెరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. శంకర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ తగ్గించేది లేదని, అవసరమైతే నిర్మాతలను మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతానికి భారతీయుడు 2 షూటింగ్ ఆపేశారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
‘లైకా’ చేతికి ‘అత్తారింటికి దారేది’!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ టాలీవుడ్లో ట్రెండ్సెట్ చేసింది. అప్పటివరకు ఉన్న రికార్డులన్నంటిని బద్దలు కొట్టింది. సినిమా విడుదలకు ముందే పైరసీలో బయటకు వచ్చినా.. కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకెళ్లింది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ఈ సినిమా నిరూపించింది. పవన్ నటన, త్రివిక్రమ్ మాటలు ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళ్లో రీమేక్ కాబోతోంది. ఈ మూవీ తమిళ్ రైట్స్ లైకా చేతికి వచ్చినట్లు.. అందుకు త్రివిక్రమ్కు ధన్యవాదాలు అంటూ ఈ సంస్థ ట్విటర్లో పేర్కొంది. తమిళ్ వెర్షన్కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. We are very happy to announce that we have acquired the Tamil Remake Rights of the Mega Telugu Blockbuster #AttarintikiDaredi ! More exciting updates on this Coming Up! Big Thank You to #TrivikramGaru — Lyca Productions (@LycaProductions) July 30, 2018 -
హైదరాబాద్లో ‘కాలా’ ఈవెంట్
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. సూపర్స్టార్ సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే రజనీ గత సినిమా కబాలి దెబ్బ కాలాపై పడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కబాలి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే.. సూపర్స్టార్ సినిమాకు ఉండాల్సిన హడావిడి ‘కాలా’కు లేదని అభిమానులు ఫీలవుతున్నారు. కాలా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించినా పాటలు అభిమానులను అలరించేలా లేవన్న టాక్ వినిపిస్తోంది. రజనీకి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమిళ ఇండస్ట్రీ తరువాత రజనీకి టాలీవుడ్ అతి పెద్ద మార్కెట్. కానీ ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమా సందడి కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు అభిమానులకు కాస్త ఊరట కలిగించే వార్తను ప్రకటించింది చిత్రయూనిట్. మే 29న కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. హైదరాబాద్లోని నోవాటెల్లో సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభవుతుందని తెలిపారు. నానా పటేకర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కబాలి ఫేం పా. రంజిత్ దర్శకత్వం వహించారు. తలైవాకు జోడిగా హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు. ‘కాలా’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
మణికి తోడుగా లైకా
చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. భారీ తారాగణంతో మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి చివరి వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్ లాంటి సౌత్ టాప్ స్టార్స్ నటిస్తున్నారు. ఇంతటి భారీ చిత్రాన్ని మణిరత్నంతో కలిసి నిర్మించేందుకు భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ముందుకు వచ్చింది. మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్ మణిరత్నం తదుపరి చిత్రాన్ని నిర్మించనుంది. వరుసగా భారీ చిత్రాలను రూపొందిస్తున్న లైకా సంస్థ మణిరత్నంతో కలవటంతో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మణి స్టైల్ లో రూపొందనున్న ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి అందిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. -
రజనీ కోసం లైకాను వదిలేశాడు..!
ఇటీవల రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్ తన కార్యచరణ ప్రారంభించారు. ఇప్పటికే ఆయనకు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలనుంచి కూడా పెద్ద ఎత్తున మద్దుతు లభిస్తోంది. లారెన్స్ లాంటి రజనీ అభిమానులు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించగా.. ఇప్పుడు మరో వ్యక్తి రజనీ తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థకు క్రియేటివ్ హెడ్గా పనిచేసిన రాజు మహాలింగం, లైకాకు రాజీనామా చేసి రజనీ పొలిటికల్ పార్టీ కోసం పనిచేయనున్నట్టుగా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ రజనీ హీరోగా తెరకెక్కిస్తున్న ‘2 .ఓ’ సినిమాకు రాజు మహాలింగం పనిచేశారు. ఈ సినిమా సమయంలో రజనీ ఆలోచనలకు ఆకర్షితుడైన మహాలింగం రజనీతో కలిసి నడిచేందుకు అంగీకరించారు. “A New REVOLUTION -A New POLITICAL WILL- A NEW YEAR ”- awaits for the people of TAMIL NADU!!! pic.twitter.com/5lJyDnir5i — Raju Mahalingam (@rajumahalingam) 31 December 2017 -
రోబో 2.0 విడుదల అప్పుడే
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 2.0. గతంలో ఇదే కాంబినేషన్ లో ఘనవిజయం సాధించిన రోబో కు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ మరోసారి రోబోగా దర్శనమివ్వనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈచిత్రం విడుదలపై లైకా ప్రొడక్షన్స్ తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. సినిమా విడుదలపై వస్తున్న రూమర్లకు చెక్పెడుతూ విడుదలకు సంబంధించి ఓ ప్రకటన చేసింది. 2018 ఏప్రిల్ నెలలో చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీఎత్తున విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్లో ప్రకటించింది. రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా అలరించనున్నాడు. Official Press Release: "2.0" - to hit screens on April 2018#2Point0 #April2018 pic.twitter.com/fql98ZXWVY — Lyca Productions (@LycaProductions) December 2, 2017 -
'కత్తి' హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్లపై పరువునష్టం దావా!
మదురై: వివాదాల నడుమ ఇటీవల విడుదలై తమిళనాడులో ఘన విజయం సాధించిన 'కత్తి' చిత్రం ఇప్పుడు మరో సమస్యలో చిక్కుకుంది. ఈ సినిమా హీరో విజయ్తోపాటు దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్పై స్థానిక కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. ఈ సినిమాలో కోర్టులో విచారణ జరుగుతున్న 2జీ స్పెక్ట్రమ్ కేసును ప్రస్తావించినందుకు ఈ కేసు దాఖలైంది. ఈ కేసుపై ఓవైపు ఢిల్లీ కోర్టులో విచారణ జరుగుతుండగా, ఈ వ్యవహారంలో అవినీతి జరిగినట్లుగా నిర్ధారిస్తూ ఈ సినిమాలో ఓ డైలాగ్ను పెట్టారు. ఐపీసీ సెక్షన్ 500 (పరువుకు నష్టం కలిగించడం) కింద ఈ వ్యాఖ్య చేయడం నేరమని ఆర్. రామసుబ్రమణియన్ అనే న్యాయవాది మదురైలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. ఇటువంటి డైలాగ్లు దేశానికి రావాల్సిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)పై ప్రభావం చూపుతాయన్నది ఆయన వాదన. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది. **