-
బాలీవుడ్ స్టార్ సతీమణి సీమంతం.. సెలబ్రేషన్స్ చూశారా? (ఫోటోలు)
-
చెఫ్గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!
వృత్తీరీత్యా చెఫ్గా పదిమందికి భోజనం పెట్టిన ఆమె విధి శాపమో లేక కర్మఫలమో గానీ కడుపు నిండా తినడం కష్టమయ్యే అరుదైన వ్యాధి బారిన పడింది. కనీసం గుప్పెడు మెతుకులు నోట్లో పెట్టుకోవాలంటే అల్లాడిపోయేది. నిజానికి కేన్సర్ నుంచి బయటపడేందుకు చేయించుకున్న శస్త్ర చికిత్స ఆమె పాలిట మృత్యువుగా మారింది. చివరికి ఆ వ్యాధితో పోరాడుతూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ నటాషా దిద్దీ(50) వృత్తి రీత్యా చెఫ్. రకరకాల వంటకాలతో కస్టమర్లను అలరించేది. ఏమోందో ఏమో గానీ 2019లో కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆమె కడుపులో కణుతులు వేగంగా అభివృద్ధి చెందాయి. దీంతో వైద్యులు ఆ కేన్సర్ మొత్త వ్యాపించకుండా ఉడేలా మొత్తం కడుపు భాగానే తొలగించారు. ఆమె పొట్ట భాగం లేకపోవడంతో ఆహారాన్ని జీర్ణించుకోవడం ఆనేది సమస్యత్మకంగా మారింది. ఆ క్షణం నుంచే ఆమె జీవితం మరింత నరకప్రాయంగా మారిపోయింది. వైద్యులు చిన్న మీల్స్ తినమని సూచించినా..అది తినడమే మహానరకంగా ఉండేది నటాషాకి. అలా ఆమె ప్రాణాలతో పోరాడుతూ మార్చి 24న తుదిశ్వాస విడిచింది. ఆమె పలు ఇంటర్యూల్లో తాను డంపింగ్ సిండ్రోమ్తో పోరాడుతున్నట్లు తెలిపింది. దీని కారణంగా కడుపులోని ఆహరం స్పీడ్గా కదిలి జీర్ణంకాకమునుపే ప్రేగుల్లోకి వెళ్లిపోతుంది. దీని దుష్ప్రభావం కారణంగా అలసట, చెమటలు పట్డడం, విపరీతంగా ఆవులించడం వంటి సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని వాపోయింది కూడా. డంపింగ్ సిండ్రోమ్ అంటే.. కడుపులో జీర్ణక్రియం సక్రమమైన పద్ధతిలో జరగుతుంది. అలాకాకుండా అనియంత్రంగా కడుపులో పడ్డ ఆహారం వేగంగా కదిలితే దాన్ని 'గ్యాస్ట్రిక్ చలనశీలత' అంటారు. ఆహారం కండరాలు, నరాలు, హార్మోన్లు సంకేతాలతో నెమ్మదిగా ఖాళీ అవుతుంది. అలాగాకుండా అనియంత్రంగా త్వరితగతిన తిన్న ఆహారం పోట్టలో ఖాళీ అయిపోతుందంటే.. ఇక్కడ పైలోరిక్ వాల్వ్ తెరుచుకుని కడుపులోని ఆహారం బయటకు పోతుందని అర్థం. అంటే..ఇది చిన్న ప్రేగు తక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంతో తలెత్తే సమస్య ఇది. మాములుగా అయితే చిన్నప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేసేలోపు మిగతా అవయవాలు ఆహారం నెమ్మదిగా కదిలేలా సర్దుబాటు చేసుకుంటాయి. అప్పుడు అది చక్కగా వంటబడుతుంది. మనకు హాయిగా ఉంటుంది. అలాగాకుండా ఆహారం వేగంగా కదిలితే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అర్థం. ఎవరు బాధపడతారంటే.. కడుపుకి సంబంధించిన శస్త్ర చికిత్స కారణంగా ఈ డంపింగ్ సిండ్రోమ్ లక్షణాలను అభివృద్ధి చేస్తారు. గ్యాస్ట్రెక్టమీ లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వంటి కడుపులోని పెద్ద భాగాలను తొలగించే లేదా బైపాస్ శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులలో కూడా ఇది సాధారణం. నిజానికి ఈ డంపింగ్ సిండ్రోమ్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ..ఒక్కోసారి కొన్ని కేసుల్లో తీవ్రమై..బరువు తగ్గి, పోషకాహార లోపాలను ఎదుర్కొనవల్సి వస్తుంది. దీన్ని స్వీయ సంరక్షణతో నయం చేసుకోవచ్చు. చాలామందికి తేలికపాటి లక్షణాలే ఉండి క్రమేణ తగ్గుముఖం పడతాయి. కొందరిలో మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే.. వాంతులు అవుతున్నాయి అతిసారం ఉదరం మరియు తీవ్రమైన తిమ్మిరిలో నొప్పి ఉబ్బరం డిజ్జి అక్షరములు హృదయ స్పందన రేటును వేగవంతం చేయడం బలహీనత అలసట చల్లని చెమటలు ముఖం ఎర్రబడుతోంది మెదడు అలిసిపోవడం ఆకలి (చదవండి: ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..) -
స్టార్ హీరో భార్యకు ప్రెగ్నెన్సీ.. విష్ చేసిన సమంత!
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా కనిపించింది. డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్ ప్రస్తుతం స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా వరుణ్ ధావన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య బేబీ బంప్తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు. కాగా.. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మనీష్ పాల్ కాబోయే తల్లిదండ్రులను అభినందించారు. వరుణ్ ధావన్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో కనిపించనున్నారు. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో సమంతతో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్కు రాజ్,డీకే దర్శకత్వం వహించనున్నారు. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
భార్యకు స్పెషల్గా విష్ చేసిన స్టార్ హీరో.. ఫోటో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అతనికి జోడీగా నటించింది. ఈ ఏడాది సిటాడెల్-2తో పాటు కోలీవుడ్లో మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా దలాల్ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వరుణ్, నటాషా దలాల్ జనవరి 24, 2021న అలీబాగ్లో జరిగిన వివాహా వేడుకలకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ జంట వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు స్పెషల్ విషెస్ చెప్పారు బాలీవుడ్ హీరో. పెళ్లికి ముందు తనకు ప్రపోజ్ చేసిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. హ్యాపీ త్రీ బేబీ అంటూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర ఏళ్ల క్రితం మార్క్ ఆంథోనీ పాట ప్లే అయినప్పుడు ప్రపోజ్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. గతేడాది వరుణ్ నటించిన బవాల్ నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
పెళ్లయిన 18 ఏళ్లకు విడాకులు తీసుకుంటున్న బాలీవుడ్ జంట!
పెళ్లి-విడాకులు సర్వసాధారణమైపోయాయి. మరీ ముఖ్యంగా చిత్రపరిశ్రమలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ జంట విడాకుల దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్- నటాషా మాద్వానీ విడిపోయినట్లు ఓ ప్రచారం నెట్టింట వైరల్గా మారింది. నటుడు ఫర్దీన్ ఖాన్ ప్రముఖ నటి ముంతాజ్ కూతురు నటాషాను 2005 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి దియాని ఇసబెల్లా ఖాన్(10) అనే కూతురు, అజారియస్ ఫర్దీన్ ఖాన్(6) అనే కుమారుడు ఉన్నారు. సుమారు ఏడాదికాలంగా దంపతులిద్దరూ విడివిడిగానే జీవనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకోలేని క్రమంలో విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే గతేడాది ప్రారంభంలో ఓ ఇంటర్వ్యూలో ఫర్దీన్ ఖాన్ మాట్లాడుతూ.. '2011లో మేము లండన్ షిఫ్ట్ అయ్యాం. సంతాన సమస్యలు ఉండటంతో అక్కడ ఓ డాక్టర్ను సంప్రదించాం. ఐవీఎఫ్(ఇన్వెట్రో ఫర్టిలైజేషన్) ద్వారా నటాషా గర్భంలో కవలలు ప్రవేశించారు. కానీ ఆరో నెలలోనే వారిద్దరూ కడుపులోనే ప్రాణాలు వదిలారు. త్వరలో ఇద్దరు పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ఆడించబోతున్నామన్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న మాకు ఈ వార్త అశనిపాతంలా తాకింది. నటాషా ఎంతగానో కుమిలిపోయింది. తర్వాత మాకు పాప పుట్టింది. అప్పుడు మా ఆనందం అంతా ఇంతా కాదు. కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత పాప మా జీవితాల్లోకి రావడంతో మా మనసంతా తేలికయిపోయింది' అని ఫర్దీన్ చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఫర్దీన్ త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విస్ఫట్ సినిమాతో పాటు నో ఎంట్రీ సీక్వెల్లో అతడు నటించనున్నట్లు గాసిప్ వినిపిస్తోంది. ఆయన చివరిసారిగా 2010లో వచ్చిన దుల్హా మిల్ గయా సినిమాలో కనిపించాడు. చదవండి: రాఘవ లారెన్స్ సినిమా ఆడిషన్స్కు వెళ్తే డైరెక్టర్ అలా చేయమని బలవంతం!: నటి ప్రియుడి కోసం పేరు మార్చుకున్న జ్యోతి రాయ్? జగతి మేడమ్ రెండో పెళ్లి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తోడేళ్ళను తరిమే రోజు!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement