natasha
-
రూ.750 కోట్ల ఇంట్లో నివాసం.. బిలియనీర్తో వివాహం: ఎవరో గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
ఇల్లు ఇంద్రభవనం.. కుబేరుడిలాంటి భర్త: ఎవరీ ఫ్యాషన్ ఐకాన్?
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదర్ పూనావాలా భార్య 'నటాషా పూనావాలా' (Natasha Poonawalla) గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషించడం మాత్రమే కాకుండా.. అనేక సామాజిక, దాతృత్వ కార్యక్రమాలు చేసే ముఖ్యమైన వ్యక్తులలో ఒకరుగా ప్రసిద్ధి పొందారు.నటాషా పూనావాలా.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తూ.. వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి సారిస్తూనే, విల్లో పూనావల్లా ఫౌండేషన్కు అధ్యక్షత వహిస్తున్నారు.పూణేలో జననం1981 నవంబర్ 26న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన నటాషా.. పాఠశాల విద్యను పూణేలోని సెయింట్ మేరీస్ స్కూల్లో, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందింది.750 కోట్ల భవనంనటాషా 2006లో అదర్ పూనావాలాను వివాహం చేసుకుంది. ఈ జంటకు సైరస్, డారియస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు సుమారు 750 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం లింకన్ హౌస్లో నివాసం ఉంటున్నారు. ఈ భవనం యూరోపియన్ స్టైల్లో ఉంది. దీనిని అదర్ పూనావాలా తండ్రి 2015లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది సుమారు 247 ఎకరాలలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?నటాషా వ్యాపారం.. దాతృత్వం రెండింటిలోనూ కీలక వ్యక్తిగా స్థిరపడింది. ఆమె నాయకత్వంలో, SII ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారులలో ఒకటిగా మారింది. ఇక ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ.. నిరుపేద వర్గాల కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ మొదలైనవాటిని అందిస్తోంది. నటాషా భర్త నికర విలువ రూ. 1 లక్ష కోట్ల కంటే ఎక్కువ. -
సెలబ్రిటీల దీపావళి ముచ్చట్లు.. భయం లేకపోవడమే వెలుగు..!
జీవితం వెలుగుతుంది. జీవితం వెలుతురు సందర్భాలను తీసుకొస్తుంది. జీవితం ఎప్పుడూ నిరాశ, నిçస్పృహలనే చీకట్ల మీదకు ఆశ, ఆవేశం అనే వెలుతురు కిరణాలు పంపుతూనే ఉంటుంది. చీకటి వెలుగుల ఈ రంగేళిని సరి సమంగా స్వీకరించి ముందుకు సాగమని చెబుతుంది దీపావళి. వెలుతురును వరస కట్టుకోమని పెద్ద పెద్ద చప్పుళ్లతో అరిచి చెప్పే పండుగ ఇది. ఈ సందర్భంగా సెలబ్రిటీల వెలుతురు ముచ్చట్లు...నా జీవితంలో వెలుగులు నింపిన సంఘటన నేను మిస్ ఇండియా కిరీటం గెలవడం. మా నాన్నగారు మాకు దూరమైన తర్వాత ఇది జరిగింది. నా కంటే ఎక్కువగా మా కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురైన క్షణాలు అవి. ఇలా మా జీవితాల్లో వెలుగులు నిండిన ఈ సమ యాన్ని నేను మర్చిపోలేను. నాన్నగారు ఆర్మీలో పని చేసేవారు. దీపావళి పండక్కి ఆయన ఇంటికి వచ్చేవారు. అందువల్ల ఇంట్లో పండగ సందడి భలేగా ఉండేది. ఫ్రెండ్స్, బంధువులు అందరూ వచ్చేవారు. ఆయన లేకపోయినా ఆ ఆనవాయితీని కొనసాగేలా చూస్తున్నాను. మా హర్యాణలో దీపావళికి గాలిపటాలు ఎగరేస్తాం. వీధుల్లో పిల్లల ఆటపాటలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అందరూ కలుస్తారు నియమంగా. ఇక షాపింగ్ చేయడం, నచ్చిన ఫుడ్ తినడం, దీపావళి వెలుగుల్లో సరదాగా గడపడం... ప్రతిసారి లాగే ఈసారి కూడా దీపాళికి ప్లాన్ చేశాను.ఇప్పుడే కాదు.. నా చిన్నప్పటి నుంచీ నేను క్రాకర్స్ కాల్చను. కానీ ఎవరైనా క్రాకర్స్ కాల్చుతుంటే దూరంగా నిల్చుని చూస్తూ ఆనందిస్తుంటాను. చీకటి, వెలుగులు ఉన్నట్లే... మన జీవితాల్లో కూడా ఎత్తుపల్లాలు, మంచి చెడులు ఉంటూనే ఉంటాయి. అయితే మనం కంట్రోల్ చేయలేని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది ముఖ్యం. మన బౌండరీస్పై మనకు ఓ అవగాహన ఉండాలి. ప్రతి విషయంలోనూ సానుకూలంగానే ఆలోచించాలి. ఇలా ఉండటం సులభమని నేను చెప్పడం లేదు. కానీ ఉండగలగాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా బాల్యంలో ప్రతి ఏడాది దీపాళికి మా అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్ళం. దాదాపు ఇరవైమంది కుటుంబ సభ్యులం కలిసి ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అందుకే దీపావళి అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నతనంలో క్రాకర్స్ కాల్చడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మా తాతగారు దీపాళికి పెద్దస్థాయిలో లక్ష్మీపూజ ఘనంగా జరిపేవారు. అప్పట్లో క్రాకర్స్ కొనిచ్చేవారు. పిల్లలు క్రాకర్స్ బాక్స్లను కలిసి కాల్చేవారు. ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్ళు. బాగుండేది. కానీ పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని ఇప్పుడు కాల్చడం లేదు. అయితే ఒకసారి పండక్కు వెళ్లి కాలని లక్ష్మీబాంబులను ఏరుకుని, వాటిని విప్పి అందులోని పొడిని ఓ పేపర్లో ఉంచి, ఆ పేపర్ చివరన వెలిగించాను. నా అంతట నేనే ఓ లక్ష్మీబాంబును తయారు చేసుకుంటున్నానని ఫీలైపోయాను. కానీ దురదృష్టవశాత్తు నా రెండు వేళ్లు కాలిపోయాయి. మా అమ్మకు తెలిస్తే కోప్పడుతుందని తెలియకుండా దాచాను. కానీ అమ్మ గమనించి మందలించింది. ఈ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే పిల్లలందరికీ చెబుతున్నా... క్రాకర్స్ కాల్చేప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీరు కాల్చే క్రాకర్స్పై మీకు అవగాహన లేకపోతే దూరంగా ఉండండి. అత్యుత్సాహం చూపకండి. నేను సరదాగా చేసిన పిచ్చిపనిలాంటివి చేయకండి. కొన్ని కారణాల వల్ల గడిచిన రెండు సంవత్సరాలు నేను దీపాళిని మా అమ్మమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అందుకే ఈ ఏడాది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంటి వాతావరణంలో నేను పెరిగింది తక్కువ. బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. కాలేజీ కూడా అంతే. ఒంటరిగా ట్రావెల్ చేస్తుంటాను. సమాజంలో ఎలా మెలగాలో నాకు నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మీపై మీరు భరోసా ఉంచండి. ధైర్యంగా ఉండండి. నైతిక బాధ్యతతో ఉండండి. అప్పుడు క్లిష్టపరిస్థితులను నెగ్గుకు రావొచ్చు మీరు. నమ్మిన దానిపట్ల ధైర్యంగా నిలబడుతూ తలెత్తుకు జీవించండి. నా అనుభవాల నుంచి నేను నేర్చుకున్న సంగతులు ఇవి. భయం లేకపోవడమే వెలుగని నేను భావిస్తుంటాను. (చదవండి: మన ముంగిళ్లలో వెలుగు పూలు) -
బాయ్ఫ్రెండ్తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య!
ఇటీవలే భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న నటి, మోడల్ నటాసా స్టాంకోవిచ్ ప్రస్తుతం ముంబయిలో చిల్ అవుతోంది. విడాకుల తర్వాత సెర్బియా వెళ్లిపోయిన నటాషా దాదాపు రెండు నెలల తర్వాత ఇండియాకు వచ్చింది. అయితే ఆమెతో పాటు బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఇలాక్ కూడా ఉన్నారు. వీరిద్దరు కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. అంతకుముందే తాను ముంబయికి వచ్చిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన కుమారుడు అగస్త్యతో పాటు ఇండియాక వచ్చినట్లు తెలిపింది. ఇటీవల తన కొడుకు పుట్టినరోజును సెర్బియాలో తన కుటుంబం, బంధుమిత్రులతో కలిసి జరుపుకుంది. బర్త్ డేకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.కాగా.. నటాసా స్టాంకోవిచ్ మొదట యాడ్స్లో నటించడం ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ప్రకాష్ ఝా తెరకెక్కించిన సత్యాగ్రహం మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్లో మెరిసింది. అంతేకాకుండా డిష్కియావూన్, యాక్షన్ జాక్సన్, 7 అవర్స్ టు గో, జీరో వంటి చిత్రాల్లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అగస్త్యను హార్దిక్ ఇంటికి పంపిన నటాషా.. ఫొటో వైరల్!
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో జట్టులోకి వచ్చే అవకాశం లేదు. మరో నెల రోజుల పాటు అతడికి విశ్రాంతి లభించనుంది. దీంతో విరామ సమయాన్ని పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ మనోల్లాసం పొందుతున్నాడు హార్దిక్. ఇక ఇప్పుడు కుమారుడు అగస్త్య కూడా తన దగ్గరికి వచ్చేయడంతో మరింత ఖుషీ ఖుషీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది.తల్లితో సెర్బియా వెళ్లిన అగస్త్యకాగా హార్దిక్ పాండ్యా ఇటీవలే తన భార్య, సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సామరస్యపూర్వకంగానే తాము విడిపోతున్నామని.. అగస్త్యకు తల్లిదండ్రులుగా మాత్రం కొనసాగుతామని ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం కుమారుడిని తీసుకుని నటాషా పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే, తాజాగా అగస్త్య తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. సెర్బియా నుంచి ఈ చిన్నారి ముంబైకి చేరుకున్నాడు. హార్దిక్ వదిన, క్రికెటర్ కృనాల్ పాండ్యా భార్య పాంఖురి శర్మ షేర్ చేసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. తన కుమారుడు కవిర్తో కలిసి అగస్త్యకు కథలు చెప్తున్నానంటూ పాంఖురి ఇన్స్టాలో స్టోరీ షేర్ చేసింది.కెరీర్ పరంగానూ ఒడిదొడుకులుకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా... జట్టును చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం అతడే సారథి అవుతాడని విశ్లేషకులు భావించారు. అయితే అనూహ్యం అతడిని వైస్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించింది బీసీసీఐ. శ్రీలంక పర్యటన -2024 సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ప్రకటించడంతో పాటు.. శుబ్మన్ గిల్ను అతడికి డిప్యూటీగా నియమించింది. ఫిట్నెస్ కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో హార్దిక్ పాండ్యా కేవలం వన్డే, టీ20లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు ఆటకు దూరమయ్యాడు. ఇక రోహిత్ సేన సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడనుండగా.. అక్టోబరు 6 నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. -
ప్రేమంటే నమ్మకం: హార్దిక్ మాజీ భార్య నటాషా పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత విరామం తీసుకున్న ఈ ఆల్రౌండర్ సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. తనకు తాను సమయం కేటాయించుకుని ప్రకృతి అందాల్లో సేద తీరుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు.సింగర్తో ప్రేమలో?ఈ క్రమంలో పాండ్యా ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫొటోల్లోని లొకేషన్.. బ్రిటిష్ సింగర్, నటి జాస్మిన్ వాలియా దిగిన ఫొటోల లొకేషన్ ఒకేలా ఉండటంతో వీరిద్దరు కలిసే అక్కడకు వెళ్లారనే వదంతులు వ్యాపించాయి. దీంతో హార్దిక్ మరోసారి ప్రేమలో పడ్డాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ప్రేమను నిర్వచిస్తూ పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది.ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు‘‘ప్రేమకు సహనం ఎక్కువ. ప్రేమ దయగలది. ప్రేమలో ద్వేషం, అసూయ ఉండవు. గొప్పలు చెప్పుకోవడాలూ ఉండవు. ఇతరులను కించపరచడం, స్వార్థపూరితంగా వ్యవహరించడం ప్రేమకు తెలియదు. ప్రేమ తప్పొప్పులను లెక్కకడుతూ కోపం ప్రదర్శించదు. ప్రేమంటే నిజం.. నమ్మకం.. ఆశ.. రక్షణ.. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు’’ అంటూ నటాషా స్టాంకోవిక్ ఉద్వేగపూరిత వాక్యాలు షేర్ చేసింది.అందుకే విడాకులు?అయితే, ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి చేసిందేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి పట్ల నటాషాకు ఇంకా ప్రేమ ఉందని.. కానీ అతడే దానిని నిలబెట్టుకోలేకపోయాడని.. ఏదేమైనా ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా హార్దిక్కు నచ్చినట్లుగా మారడానికి నటాషా ఎంతో ప్రయత్నించిందని.. అయితే, అతడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విడాకులు తీసుకుందని ఇటీవల ఆమె సన్నిహితవర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. హార్దిక్తో విడిపోయిన తర్వాత నటాషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా సెర్బియాకు చెందిన నటాషా మోడల్గా కెరీర్ ఆరంభించింది. బాలీవుడ్లోనూ అడుగుపెట్టిన ఆమె ఓ పార్టీలో హార్దిక్ను కలిసింది. స్నేహం కాస్తా ప్రేమగా మారగా పెళ్లిపీటలెక్కారు. అధికారికంగా ప్రకటించిఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించే హార్దిక్- నటాషా కొన్నాళ్ల క్రితం తాము విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, అగస్త్యకు మాత్రం తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇక విడాకుల తర్వాత కొడుకును తీసుకుని నటాషా సెర్బియాకు వెళ్లిపోయింది. అయితే, ఈ మాజీ జంట ఇన్స్టాలో తాము కలిసి ఉన్న, తమ పెళ్లి ఫొటోలు డిలీట్ చేయకపోవడం గమనార్హం.చదవండి: టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన -
చీటర్.. అలాంటి వాళ్లతో జాగ్రత్త! హార్దిక్ పాండ్యాను ఉద్దేశించేనా?
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఆటకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటూ క్రికెట్ నుంచి దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. సాగరతీరాన.. స్విమ్మింగ్పూల్ ఒడ్డున సేద తీరుతూ.. నీలాకాశాన్ని వీక్షిస్తున్న దృశ్యాలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ‘చీటర్’ అన్న పోస్టుకు లైక్ కొట్టడం నెట్టింట చర్చకు దారితీసింది.నటాషాపై విమర్శలుకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పూర్తిగా విఫలమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్నాడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ భార్య నటాషా హార్దిక్తో లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు రాగా.. కొన్నిరోజులు తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చింది.తమ దారులు వేరయ్యానని.. తాము విడాకులు తీసుకున్నామని హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ సంయుక్త అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హార్దిక్ అభిమానులు నటాషాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ పేరు, డబ్బు ఉపయోగించుకునేందుకే అతడి జీవితంలోకి వచ్చిందని.. భరణం రూపంలోనూ పెద్ద మొత్తమే తీసుకుందని ఇష్టారీతిన కామెంట్లు చేశారు.ఇక కుమారుడు అగస్త్యను తీసుకుని పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిన నటాషా.. అతడితో ట్రిప్నకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ వాటికి హార్ట్ సింబల్ జోడిస్తూ లైక్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటాషాను మర్చిపోలేకపోతున్నాడని.. ఆమె వల్ల హార్దిక్ పాండ్యా చాలా బాధపడుతున్నాడంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై నటాషా పరోక్షంగా స్పందించింది.చీటర్.. ఆ పోస్టులకు నటాషా లైక్‘‘చీటర్.. శారీరకంగా, మానసికంగా హింసించే వాళ్లతో బంధం కొనసాగిస్తే ఇలాగే ఉంటుంది.. కొంతమంది తామే సమస్యను సృష్టించి మళ్లీ వారే బాధితులుగా నటిస్తారు.. అందుకు ఇదే ఉదాహరణ... ఇతరుల ముందు మిమ్మల్ని తప్పుగా చూపించేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బంధాల గురించి చర్చిస్తున్న ఇన్స్టా వీడియోలకు నటాషా స్టాంకోవిక్ లైక్ కొట్టింది. ఇందుకు స్పందించిన నెటిజన్లలో మెజారిటీ మంది నటాషాకు మద్దతుగా నిలుస్తున్నారు. హార్దిక్ ఫ్యాన్స్ అని చెప్పుకొనే వాళ్లు ఇప్పటికైనా నటాషాను వేధించడం మానాలని హితవు పలుకుతున్నారు.కాగా ప్రపంచకప్-2024 తర్వాత హార్దిక్ పాండ్యా శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, వన్డే సిరీస్కు మాత్రం అతడు ఎంపికకాలేదు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సిరీస్కు అతడు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీలంక టూర్లో 3-0తో టీ20 సిరీస్ క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్ను 0-2తో ఆతిథ్య శ్రీలంకకు కోల్పోయింది. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
మాటల్లో వర్ణించలేను.. లవ్ యూ: హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. లంకతో టీ20 సిరీస్ జట్టుకు ఎంపికైన అతడు తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రెండో టీ20లో మాత్రం అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు.. తొమ్మిది బంతుల్లోనే 22 పరుగులు చేసి దుమ్ములేపాడు.ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించి టీమిండియా లంకపై టీ20 సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ వరల్డ్కప్ చాంపియన్. ఈ క్రమంలో మంగళవారం నాటి నామమాత్రపు టీ20కి పాండ్యా సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈరోజు(జూలై 30)కు హార్దిక్ పాండ్యా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి కుమారుడు అగస్త్య పుట్టినరోజు నేడు.ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవుఈ నేపథ్యంలో తన ముద్దుల కుమారుడితో ఉన్న వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. ‘‘నేను ఇలా ముందుకు సాగుతున్నానంటే అందుకు కారణం నువ్వే. నా పార్ట్నర్ ఇన్ క్రైమ్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆగూ..! నీపై నాకున్న ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవు’’ అంటూ ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు. అగస్త్యను ఎంతగానో మిస్సవుతున్నానని చెప్పకనే చెప్పాడు.ముక్కలైన బంధంకాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ను హార్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏకంగా మూడుసార్లు పెళ్లి చేసుకుంది. అయితే, కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించి హార్దిక్ పాండ్యా- నటాషా అధికారిక ప్రకటన విడుదల చేశారు.కుమారుడిపై ప్రేమఅనంతరం కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియాలోని తన పుట్టింటికి వెళ్లిపోగా.. హార్దిక్ పాండ్యా టీమిండియాతో పాటు శ్రీలంకలో ఉన్నాడు. ఇక అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత.. స్వదేశానికి వచ్చిన అనంతరం అగస్త్యతో కలిసి తన ఇంట్లో సంబరాలు చేసుకున్నాడు హార్దిక్. ఇక ఇటీవల అగస్త్యతో కలిసి నటాషా విహారయాత్రకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ పాండ్యా హార్ట్ సింబల్స్తో తన ప్రేమను తెలిపాడు. చదవండి: Ind vs SL ODIs: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?
అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, స్టైల్కి ఐకాన్ అయిన నటాషా పూనావాల ఎప్పటికప్పుడూ సరికొత్త ఫ్యాషన్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె స్వతహాగానే ఫ్యాషన్గా ఉంటుంది ఆమె ఆహార్యం. ఆమె ఎప్పటికప్పుడూ ట్రెండ్ని సెట్ చేసే సరికొత్త డిజైనర్ వర్ దుస్తులతో తుళ్లక్కుమంది. అలానే ఈసారి ఫ్రాన్స్లో జరిగిన సమ్మర్ గాలా 2024 కోసం క్రిస్టల్స్తో అలంకరించిన గౌనుని ధరించింది. ఈ గాలా ఈవెంట్లో నటాషా ధరించిన మార్టిన్ గ్లాస్ ఆకృతి పర్సు హైలెట్గా నిలిచింది. ఈ పర్సు వోడ్కా, జిన్, కాక్టెయిల్ వంటి జ్యూస్లనే సర్వ్ చేసే మార్టిన్ గ్లాస్ ఆకృతిలో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఈ పర్సు ఎక్కువగా ఆకర్షించింది. అంతేగాదు సోషల్ మీడియాలో సైతం అందుకు సంబంధించిన ఫోటోల్లో కనిపించిన ఈ పర్సే అందరి దృష్టిని అట్రాక్ట్ చేసింది. ఇక్కడ నటాషా ముగ్ధమనోహరంగా ఉండేలా ట్రాన్స్పరేంట్ క్రిస్టల్ గౌనులో మెరిసిపోయింది. అందుకు తగ్గట్లు చేతికి ధరించిన పర్సు ఎవర్ గ్రీన్గా ఉంది. అంతేగాదు ఈ మార్టిన్ గాజు ఆకృతి పర్సుని క్రిస్టల్స్తో అలంకరించడంతో నటాషా దివి నుంచి భువి వచ్చిన దేవకన్యలా ధగ ధగ మెరిసిపోయింది. ఈ పర్సు ఓపెనింగ్ అద్దం మాదిరిగా ఉంటుంది. జుడిత్ లీబర్ బ్రాండ్కి చెందిన ఈ పర్సు ధర ఏకంగా రూ. 4.85 లక్షలు పైనే ఉంటుందట. నటాషా ఎప్పుడూ డిఫెరెంట్ ఫ్యాషన్ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ సారి ఆమె ధరించి గ్లాస్ ఆకృతి పర్సు అందరి మనసులను దోచుకుంది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులను ఈ పర్సు ఎంతగానో ఆకట్టుకుంది. అంతా వాటే ఏ స్టైలిష్ పర్సు అని ప్రశంసిస్తున్నారు కూడా. ఎవరీ నటాషా?భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అదార్ పూనావాలా భార్యే నటాషా పూనావాలా. ఆమె అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 2023 నాటికి, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విలువ రూ. 1.92 లక్షల కోట్లుగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అంతేగాదు ఆమె సైరస్ పూనావల్ల గ్రూప్లోని వివిధ కంపెనీల కోసం సృజనాత్మకతతో కూడిన వ్యాపార వ్యూహాలతో లాభాల బాట పట్టించడంలో నటాషా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె తన అత్తగారి గౌరవార్థం 2012లో స్థాపించబడిన కుటుంబ ఫౌండేషన్ అయిన విల్లో పూనావల్లా ఫౌండేషన్కు చైర్పర్సన్గా కూడా పనిచేస్తుంది. అలాగే భారతదేశం కోసం బ్రిటీష్ ఆసియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్కు చైర్పర్సన్గా వ్యవహరిస్తోంది. పైగా బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్కు ఇండియా అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యురాలు కూడా.(చదవండి: హీరోయిన్ కత్రినా అనుసరించే రెండుపూటల భోజనం, షట్పావళి డైట్ ప్లాన్ అంటే..?) -
అలా అయితేనే వన్డేల్లో రీ ఎంట్రీ.. హార్దిక్కు బీసీసీఐ కండిషన్!
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అతడికి కాలం కలిసిరావడం లేదు.భార్య నటాషా స్టాంకోవిక్తో విడాకులు తీసుకున్నట్లు హార్దిక్ ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, కుమారుడు అగస్త్య విషయంలో మాత్రం ఇద్దరం సమానంగా బాధ్యత వహిస్తామని.. కో పేరెంటింగ్ చేస్తామని వెల్లడించాడు.కానీ సంయుక్త విడాకుల ప్రకటన అనంతరం నటాషా అగస్త్యను తీసుకుని తన పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిపోయింది. ముంబై ఎయిర్పోర్టు నుంచి అక్కడికి బయల్దేరుతున్న సమయంలో అగస్త్య ఏడుస్తూ కనిపించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఏడ్చేసిన అగస్త్య!తండ్రిని విడిచి వెళ్లేందుకు సిద్ధంగా లేకపోయినా.. తల్లి బలవంతం చేయడంతోనే అగస్త్య ఆమెతో వెళ్లినట్లుగా ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో హార్దిక్ సైతం తీవ్రమైన బాధతో కుంగిపోతున్నట్లు సమాచారం.వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు.. టీమిండియాలోనూ కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్గా సత్తా చాటిన ఈ ఆల్రౌండర్ను బీసీసీఐ పక్కనపెట్టింది.చేజారిన కెప్టెన్సీకొత్త కోచ్ గౌతం గంభీర్ హయాంలో సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టు కెప్టెన్గా ఎంపిక చేసింది. శ్రీలంక పర్యటన నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్గా సూర్యను ప్రకటించి హార్దిక్ పాండ్యాను కేవలం ఆటగాడిగా పేర్కొంది.అయితే, ఈ టూర్లో భాగంగా వన్డే సిరీస్ కూడా జరుగనుంది. కానీ జట్టులో హార్దిక్కు చోటు ఇవ్వలేదు సెలక్టర్లు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతం గంభీర్ వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మూడు ఫార్మాట్లలో ఆడాలికాగా కోచ్గా ప్రయాణం మొదలుపెట్టకముందే.. గంభీర్ తన వైఖరేంటో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఫిట్గా ఉండే ఆటగాళ్లు కచ్చితంగా మూడు ఫార్మాట్లు ఆడాలని పేర్కొన్నాడు.గాయాల భయంతో ఆటకు దూరంగా ఉంటే తనకు నచ్చదని పేర్కొన్నాడు. హార్దిక్ విషయానికొస్తే.. ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ తరచూ గాయాల బారిన పడుతూ ఉంటాడన్న విషయం తెలిసిందే.అందుకే ఇప్పటికే అతడు టెస్టు ఫార్మాట్కు దూరంగా ఉంటున్నాడు. కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. ఇక వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడిన తర్వాత అతడికి మళ్లీ వన్డే ఆడే అవకాశం రాలేదు.దేశవాళీ క్రికెట్ ఆడితేనే రీఎంట్రీఐపీఎల్-2024లో ఫిట్నెస్ నిరూపించుకోవడం ద్వారా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని గంభీర్ హార్దిక్కు కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విజయ్ హజారే ట్రోఫీ(వన్డే)లో ఆడి.. బౌలింగ్లోనూ ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే యాభై ఓవర్ల ఫార్మాట్లో పునరాగమనం చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ కూడా చెప్పిందిదేఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘వన్డేల్లో హార్దిక్ పూర్తి కోటా బౌలింగ్ చేస్తే చూడాలని ఉందని గంభీర్ అతడికి ఫోన్ కాల్ ద్వారా తెలిపాడు’’ అని హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాయి.ఇక శ్రీలంక టూర్కు జట్ల ప్రకటన సమయంలో బీసీసీఐ సైతం దేశవాళీ క్రికెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్కు అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకత ఉందని.. దేశీ టోర్నీల్లో పాల్గొన్నాలన్న నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. చదవండి: ICC: టీమిండియా మ్యాచ్లు అన్నీ లాహోర్లోనే?! -
#Hardhikpandya: అయ్యో హార్దిక్.. నీకే ఎందుకిలా! నీకు మేము ఉన్నాము
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు ప్రొఫెషనల్గాను హార్దిక్ గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలకడంతో భారత తదుపురి టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అంతా భావించారు.కానీ బీసీసీఐ మాత్రం పాండ్యాకు ఊహించని షాకిచ్చింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీమిండియా టీ20 కెప్టెన్గా పాండ్యాను కాదని స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ను నియమించింది. శ్రీలంకతో టీ20 సిరీస్కు భారత జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.అయితే శ్రీలంక పర్యటనకు జట్టు ప్రకటించిన కొద్ది సేపటికే హార్దిక్ మరో బాంబు పేల్చాడు. గత కొన్ని నెలలగా తమ వైవాహిక జీవితానికి సంబంధించి వస్తున్న రూమర్స్ను హార్దిక్ పాండ్యా, అతడి భార్య నటాషా స్టాంకోవిచ్ నిజం చేశారు. హార్దిక్ పాండ్య- నటాషా తామిద్దరూ విడిపోతున్నట్లు ఉమ్మడి ప్రకటన ద్వారా తెలియజేశారు. "మా 4 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాము. మేము కలిసిండేందుకు అన్ని విధాల ప్రయత్నం చేశాము. కానీ విడిపోవడమే ఉత్తమమని మేమిద్దరం భావించాము. పరస్పర గౌరవం, ఆనందంతో కలిసి ఒక కుటంబంగా ఎదిగిన తర్వాత విడిపోవడం నిజంగా కష్టమే. కానీ ఈ కఠినమైన నిర్ణయం తీసుకొక తప్పట్లలేదు. మా ఇద్దరి జీవితాల్లోనూ అగస్త్య భాగంగా ఉంటాడు. అగస్త్యకు కో పెరెంట్గా మేము కొనసాగుతాం. అతని ఆనందం కోసం మేం ఏమైనా చేస్తాం. ఈ క్లిష్టమైన సమయంలో మాకు మీ మద్దతు కావాలి. మా గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని ప్రకటనలో హార్దిక్, నటాషా పేర్కొన్నారు. అయితే ఈ క్టిష్టసమయంలో హార్దిక్కు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. కమాన్ హార్దిక్.. నీకు మేము ఉన్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. మరి కొందరు అయ్యో హార్దిక్.. నీకేందుకు ఇన్ని కష్టాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఐపీఎల్-2024 సమయంలోనూ పాండ్యా దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పాండ్యా అటు సారథిగా, ఇటు ఆటగాడిగా విఫలయ్యాడు. దీంతో పాండ్యాను దారుణంగా ట్రోలు చేశారు. అయితే టీ20 వరల్డ్కప్-2024లో పాండ్యా దుమ్ములేపడంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. తిట్టిన నోళ్లే అతడిని ప్రశించాయి. Stay strong 🥺💔 #HardikPandya pic.twitter.com/aByDFMkRqH— rj facts (@rj_rr1) July 18, 2024 -
నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... స్టార్ ప్లేయర్ అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించాడు. తన భార్య నటాషా స్టన్కోవిచ్తో వివాహ బంధం ముగిసినట్లు అతను అధికారికంగా ప్రకటించాడు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. వీరిద్దరికి 2020లో వివాహం కాగా...అగస్త్య అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. సెర్బియాకు చెందిన స్టన్కోవిచ్ మోడలింగ్, సినిమాల్లో నటిస్తూ ముంబైలో స్థిరపడిన సమయంలో పాండ్యాతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. గత కొంత కాలంగా పాండ్యా, స్టన్కోవిచ్ మధ్య విభేదాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇద్దరూ దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. మరోవైపు విడాకుల తర్వాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని, అతని కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటామని పాండ్యా స్పష్టం చేశాడు. -
మిస్టరీ గర్ల్తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ అమ్మాయితో అతడు సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్.. ‘‘ప్రతీదీ ప్రేమకు అర్హమైందే.. కానీ.. దేవుడిపై ఎప్పుడూ నమ్మకం మాత్రం వదులుకోకూడదు’’ అంటూ నర్మగర్భపూరిత పోస్ట్ చేయడం గమనార్హం.ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శల పాలయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో సారథిగా వచ్చినందుకు సొంత జట్టు అభిమానులే అతడిని అవమానకరంగా ట్రోల్ చేశారు.టీ20 ప్రపంచకప్-2024 హీరోగాఅందుకు తగ్గట్లే ముంబై ఇండియన్స్ పద్నాలుగింట కేవలం నాలుగే గెలవడంతో హార్దిక్ కెప్టెన్సీ తీరుపై మాజీ క్రికెటర్లు సైతం పెదవి విరిచారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు అతడు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో బీసీసీఐ అతడికి అవకాశం ఇవ్వగా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. టీమిండియాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించి విమర్శించిన వారే ప్రశంసించేలా సత్తా చాటాడు.కెరీర్ పరంగా కోలుకున్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం హార్దిక్ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నటాషా స్టాంకోవిక్తో అతడికి విభేదాలు తలెత్తాయని వార్తలు రాగా.. వీరిద్దరు దూరదూరంగా ఉండటం ఇందుకు బలాన్నిచ్చింది.అంతేకాదు.. వరల్డ్కప్ విజయం సెలబ్రేట్ చేసుకునే సమయంలో తమ కుమారుడు అగస్త్యను మాత్రమే నటాషా హార్దిక్ దగ్గరికి పంపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విడాకులు నిజమేనన్న వార్తలు గుప్పుమన్నాయి.ఆ మిస్టరీ గర్ల్ ఎవరు?ఇలాంటి తరుణంలో ఓ అమ్మాయి హార్దిక్ పాండ్యాతో పాటు అతడి కుటుంబంతో సన్నిహితంగా మెదిలిన దృశ్యాలు వైరల్గా మారాయి. ఆ మిస్టరీ గర్ల్ ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఆమె మరెవరో కాదు.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్ట్ ప్రాచీ సోలంకి. హార్దిక్ పాండ్యా ఇంటికి వచ్చిన ఆమెను బొట్టుపెట్టి ఆహ్వానించారు. ఈ క్రమంలో హార్దిక్తో పాటు అతడి అన్న, టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా- పాంఖురి శర్మ దంపతులతో ప్రాచీ ఫొటోలు దిగింది.వరల్డ్కప్ హీరోను కలిసానని.. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఫొటోలు, వీడియోలను ప్రాచీ షేర్ చేసింది. దీంతో నటాషా స్థానంలోకి రాబోయే అమ్మాయి.. కాబోయే వదిన అంటూ హార్దిక్ అభిమానులు తోచినవిధంగా కామెంట్లు చేస్తున్నారు.మరికొందరేమో ఒక్క ఫొటోతో ఆ అమ్మాయిపై లేనిపోని వదంతులు సృష్టించడం సరికాదని హితవు పలుకుతున్నారు. నిజంగానే ప్రాచీ హార్దిక్ ఫ్యాన్గర్ల్ మాత్రమేనా.. లేదంటే అతడి కుటుంబంతో అంతకుమించిన అనుబంధం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే, ప్రాచీతో హార్దిక్ ఫొటోలు వైరల్ అయిన తరుణంలో నటాషా పైవిధంగా పోస్ట్ పెట్టడం గమనార్హం.చదవండి: KKR: ద్రవిడ్ కాదు.. కోల్కతా కొత్త మెంటార్గా దిగ్గజ బ్యాటర్? View this post on Instagram A post shared by Prachi Solanki (@ps_29) -
అతడికి మాత్రమే ఆ అర్హత.. గౌతం గంభీర్ భార్య నటాషా పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
విడాకులు నిజమే అనేలా హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన జోష్లో ఉన్న భారత క్రికెటర్లు ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించారు. కుటుంబాలతో సరదాగా సమయం గడుపుతున్నారు.ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని సహా పలువురు క్రికెటర్లు అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట నెలకొన్న పెళ్లి సందడిలో భాగమయ్యారు.VIDEO | Anant Ambani-Radhika Merchant's sangeet ceremony: Former India cricketer Zaheer Khan and his wife Sagarika Ghatge arrive at Nita Mukesh Ambani Cultural Centre in BKC, Mumbai for the sangeet ceremony. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/W8h0FDcBDB— Press Trust of India (@PTI_News) July 5, 2024 భార్యలతో ఆ క్రికెటర్లునీతా- ముఖేశ్ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్లో తళుక్కుమన్నారు. రోహిత్, ధోని, హార్దిక్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, జహీర్ ఖాన్, ఇషాన్ కిషన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.ధోని, సూర్య, జహీర్, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా తమ భార్యలతో కలిసి ఈ ఈవెంట్లో సందడి చేయగా.. హార్దిక్ పాండ్యా మాత్రం ఒంటరిగా వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.#WATCH | Cricketers Hardik Pandya, Krunal Pandya and Ishan Kishan arrive at Jio World Centre in Mumbai to attend Anant Ambani and Radhika Merchant's 'Sangeet ceremony' pic.twitter.com/bLy33tmZB8— ANI (@ANI) July 5, 2024 కాగా హార్దిక్- నటాషా మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీశాంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ ఇలా ఒంటరిగా అంబానీ ఇంట సంగీత్కు హాజరుకావడం వీటికి మరింత బలాన్నిచ్చింది.అదే సమయంలో అతడి సతీమణి నటాషా స్టాంకోవిక్ తమ కుమారుడు అగస్త్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని.. ఇందుకు ఎల్లప్పుడూ తాను అన్నింటికి కృతజ్ఞురాలిగా ఉంటానంటూ వేదాంత ధోరణిలో క్యాప్షన్ జతచేసింది.విడాకులు నిజమేనన్న వార్తలు ఈ నేపథ్యంలో హార్దిక్- నటాషా విడాకులు నిజమేనన్న వార్తలు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది.అంబానీల యాజమాన్యంలోని ఈ జట్టు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం అద్భుతంగా రాణించిన హార్దిక్.. టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో.. విమర్శలు- ప్రశంసల సమయంలో హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి నటాషా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. ఇప్పుడిలా హార్దిక్ అంబానీ ఇంట వేడుకలకు ఒక్కడే హాజరుకావడంతో విభేదాలు నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.VIDEO | Anant Ambani-Radhika Merchant's sangeet ceremony: Indian cricketer KL Rahul arrives at Nita Mukesh Ambani Cultural Centre in BKC, Mumbai for the sangeet ceremony. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/es5B8zIfNJ— Press Trust of India (@PTI_News) July 5, 2024 -
Hardik- Natasa: హార్దిక్ పాండ్యాతో విడాకులు: ట్విస్ట్ ఇచ్చిన నటాషా!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరగుతున్న విషయం తెలిసిందే. భార్య నటాషా స్టాంకోవిక్తో అతడికి విభేదాలు తలెత్తాయని.. విడాకులే తరువాయి అంటూ వదంతులు వ్యాపించాయి.ఇప్పటికే నటాషా కోర్టు మెట్లు ఎక్కారని.. విడాకుల కోసం దరఖాస్తు చేయడమే కాకుండా.. భరణంగా హార్దిక్ ఆస్తిలో 70 శాతం పొందనున్నారనే వార్తలు వినిపించాయి. నటాషా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పాండ్యా ఇంటిపేరును తొలగించడం.. వారి పెళ్లి ఫొటోలు కనిపించకుండా పోవడమే ఇందుకు కారణమని గాసిప్రాయుళ్లు ప్రచారం చేశారు.అయితే, తాజాగా నటాషా ట్విస్ట్ ఇచ్చారంటూ మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. తమ పెళ్లి ఫొటోలను ఆమె తిరిగి ఇన్స్టా ఖాతాలో పునరుద్ధారించారని దాని సారాంశం. నిజానికి విడాకుల రూమర్ల తర్వాత కూడా హార్దిక్ పాండ్యా అకౌంట్లో వారి పెళ్లి ఫొటోలు దర్శనమిచ్చాయి. అయితే, తాజాగా నటాషా కూడా వాటిని రీస్టోర్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఏదేమైనా ఇంతగా వార్తల్లో నానుతున్నా ఇటు హార్దిక్ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ విడాకుల అంశం ఖండించనూ లేదు. అలాగని అంగీకరించనూలేదు. అయితే, తాజాగా నటాషా తమ వివాహ బంధం పదిలంగా ఉందని చాటేలా ఫొటోలు రీస్టోర్ చేయడం విశేషం.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా- నటాషాలపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘సానుభూతి కోసం భలే డ్రామాలు ఆడారు. బాగానే వర్కౌట్ అయింది’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పాండ్యాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్పై వేటు పడటాన్ని జీర్ణించుకోలేక స్టేడియం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హార్దిక్ను ట్రోల్ చేశారు హిట్మ్యాన్ ఫ్యాన్స్. ఇక అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలవడంతో ట్రోలింగ్ తారస్థాయికి చేరింది.ఈ నేపథ్యంలో విడాకుల అంశం తెరమీదకు రాగా.. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుండటంతో సానుభూతి పొందేందుకు హార్దిక్- నటాషా జోడీ నాటకాలాడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సెర్బియా మోడల్ నటాషాను పెళ్లాడిన హార్దిక్ పాండ్యాకు కుమారుడు అగస్త్య సంతానం. ప్రస్తుతం హార్దిక్ టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్నాడు. -
ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా ఉద్వేగం
‘‘ఏదేమైనా యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత మనం అక్కడే ఉండి పోరాడాలి. ఒక్కోసారి జీవితం మనల్ని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది.అయితే, నేను మాత్రం ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఆటను వదిలిపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. ఒకవేళ యుద్ధ రంగంలో వెన్నుచూపితే మనం అనుకున్న ఫలితాలు రాబట్టలేం కదా!ఇక్కడ కూడా అంతే.. ఆట ద్వారా మనమేం పొందాలనుకుంటున్నామో.. వాటిని సాధించాలంటే కాస్త ఓపికగా ఎదురుచూడాలి. ఒక్కోసారి అది చాలా కష్టంగా ఉంటుందన్న మాట వాస్తవం.అయితే, నేను ఎప్పుటికప్పుడు మా మనసుని తేలిక చేసుకుంటాను. అంతకు ముందు ఎలా ఉన్నానో.. క్లిష్ట పరిస్థితుల్లోనూ అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను.జీవితంలో మంచి రోజులు, గడ్డు పరిస్థితులు.. వస్తూ పోతూ ఉంటాయి. నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. వాటిని దాటుకుని విజయవంతంగా ముందడుగు వేశాను.నిజానికి నేను సక్సెస్ను అంత సీరియస్గా తీసుకోను. నేను బాగా ఆడిన రోజును మర్చిపోతాను. అదే విధంగా.. చేదు అనుభవాలను కూడా!అలా అని పరిస్థితుల నుంచి పారిపోను. ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాను. ఏదో ఒకరోజు వాటి నుంచి బయటపడతాను. ఆట, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ.. కఠిన శ్రమకోరుస్తూ ముందుసాగితే తప్పకుండా ఫలితం ఉంటుంది.అలాగే ఎల్లప్పుడూ చిరునవ్వును మాత్రం వీడకూడదు’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ మధ్యలోనే గాయపడిన పాండ్యా మిగతా మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే.విమర్శల వర్షంఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ బరోడా క్రికెటర్.. ముంబై కెప్టెన్గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. అయితే, రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా రావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు అతడిపై ఆగ్రహం వెళ్లగక్కారు.స్టేడియంలో, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడ్డారు. ఇక కెప్టెన్గానూ హార్దిక్ విఫలం కావడంపై అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిపోయింది.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైన వేళ.. బీసీసీఐ సెలక్టర్లు హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచి ఏకంగా వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 1న బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 40 పరుగులతో అజేయంగా నిలిచి ఈ పేస్ ఆల్రౌండర్.. తదుపరి ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తాను ఫుల్ ఫామ్లోకి వచ్చినట్లేనని పాండ్యా సంకేతాలు ఇచ్చాడు.భార్యతో విభేదాలు.. విడాకులంటూ ప్రచారంకాగా ఐపీఎల్-2024లో చెత్త ప్రదర్శన ద్వారా విమర్శలపాలైన హార్దిక్ పాండ్యా.. వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. భార్య నటాషా స్టాంకోవిక్తో అతడికి విభేదాలు తలెత్తాయని.. ఈ క్రమంలో ఆమె విడాకులకు అప్లై చేసిందనే ప్రచారం జరుగుతోంది.అంతేకాదు భరణంగా హార్దిక్ పాండ్యా ఆస్తిలో డెబ్బై శాతం వాటా కూడా నటాషాకు లభించనుందని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. కాగా సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.ఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడిపోతున్నారనే వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి. ఇక వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో పైవిధంగా ఉద్వేగ పూరితంగా మాట్లాడటం గమనార్హం.చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ -
ఈ స్టన్నింగ్ బ్యూటీ.. టీమిండియా స్టార్ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుతో చేరాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం సహచర ఆటగాళ్లతో కలిసి అమెరికాలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కాగా ఈ స్టార్ ఆల్రౌండర్ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఐపీఎల్-2024 సీజన్లో పగ్గాలు చేపట్టిన పాండ్యాకు ఏదీ కలిసి రాలేదు. రోహిత్ శర్మపై మేనేజ్మెంట్ వేటు వేసి అతడి స్థానంలో పాండ్యాను తీసుకువచ్చినందుకు సొంత జట్టు అభిమానులే జీర్ణించుకోలేకపోయారు.అడుగడుగునా హార్దిక్ పాండ్యా, ముంబై యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా చెత్త కెప్టెన్సీతో విమర్శలు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్.. పదో స్థానంతో ఈ సీజన్ను ముగించింది.ఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతడి భార్య నటాషా స్టాంకోవిక్తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 ముగియగానే హార్దిక్ పాండ్యా ఒంటరిగానే లండన్కు వెళ్లి సెలవులను గడిపినట్లు సమాచారం. అనంతరం.. అమెరికాకు వచ్చిన టీమిండియాతో అతడు చేరినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్ షురూ చేసిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇందులో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మెగా టోర్నీ కోసం న్యూయార్క్లో రావడం ఎగ్జైటింగ్గా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఎండ కూడా బాగా కాస్తోంది’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. ‘‘జాతీయ జట్టు తరఫున విధుల్లో ఇలా’’ అంటూ తన ఫొటోలను హార్దిక్ పాండ్యా ఇన్స్టాలో షేర్ చేశాడు. నటాషాతో విడాకుల ప్రచారం ఊపందుకున్న తర్వాత ఈ పేస్ ఆల్రౌండర్ తొలిసారిగా ఇలా తన ఒక్కడి ఫొటోలు షేర్ చేయడం విశేషం.చదవండి: T20 WC: ఓపెనర్గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!📍 New YorkBright weather ☀️, good vibes 🤗 and some foot volley ⚽️Soham Desai, Strength & Conditioning Coach gives a glimpse of #TeamIndia's light running session 👌👌#T20WorldCup pic.twitter.com/QXWldwL3qu— BCCI (@BCCI) May 29, 2024 View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్లో నటాషా(ఫొటోలు)
-
హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితం గురించి వదంతులు పుట్టుకొస్తున్నాయి. భార్య నటాషా స్టాంకోవిక్తో హార్దిక్కు విభేదాలు తలెత్తాయని.. వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.నటాషా తన సోషల్ మీడియా ఖాతాలలో పాండ్యా ఇంటి పేరును తొలగించిందని.. తద్వారా తాము విడిపోయామని పరోక్షంగా హింటిచ్చిందని ‘రెడిట్’ పోస్ట్ ద్వారా నెటిజన్లు ఓ అంచనాకు వచ్చారు.హార్దిక్ పాండ్యాను ఎంకరేజ్ చేసేందుకు ఐపీఎల్-2024 మ్యాచ్లకు నటాషా రాలేదని.. అతడితో కలిసి ఉన్న ఫొటోలు కూడా పోస్ట్ చేయడం లేదంటూ ఇందుకు కారణాలు వెతికే ప్రయత్నం చేశారు.వదంతులు మాత్రమేనంటూఅయితే, ఇవన్ని వట్టి పుకార్లేనని హార్దిక్ పాండ్యా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్గా నియమితుడైన తర్వాత హార్దిక్ పాండ్యా దారుణమైన ట్రోలింగ్కు గురైన విషయం తెలిసిందే.పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో అతడిపై విమర్శలు మరింత పదునెక్కాయి. ఈ నేపథ్యంలో.. ఆ ప్రభావం భార్య నటాషా, కుమారుడు అగస్త్యపై పడకుండా ఉండేందుకు పాండ్యానే స్వయంగా తనతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయవద్దని భార్యకు సూచించినట్లు తెలుస్తోంది.అయితే.. ఇన్నాళ్లూ విభేదాలంటూ వార్తలు రాగా..ఈసారి గాసిప్ రాయుళ్లు మరో ముందుడుగు వేశారు. హార్దిక్ పాండ్యా తీరు నచ్చని నటాషా.. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.భరణం కింద ఆస్తిలో 70 శాతంఈ క్రమంలో భరణం కింద హార్దిక్ పాండ్యా ఆస్తి(స్పోర్ట్స్కీడా నివేదిక ప్రకారం సుమారు రూ. 91 కోట్లు)లో 70 శాతం మేర(దాదాపు 63 కోట్లు) ఇవ్వాలని కోరిందని.. ఇందుకు అతడు కూడా సుముఖంగానే ఉన్నట్లు నెట్టింట రూమర్లు సృష్టిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇటు హార్దిక్ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.మరోవైపు.. ఇటీవల నటాషా నుదిటిన బొట్టుతో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తూ.. ‘‘అతడి ప్రేమ వల్లే ఇలా’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో అభిమానులు పాండ్యాను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ చేసిందని భావిస్తున్నారు.సోషల్ మీడియాలో విష్ చేయని హార్దిక్.. ఒంటరిగానే రీచార్జ్ అవుతున్నట్లుగాఅయితే, వాలంటైన్స్ డే తర్వాత.. నటాషా పుట్టినరోజున సైతం హార్దిక్పాండ్యా ఆమెకు విష్ చేస్తూ పోస్ట్ పెట్టకపోవడం గమనార్హం. కేవలం కొడుకుతో ఉన్న ఫొటోలు మాత్రమే ఇటీవల పోస్ట్ చేసిన హార్దిక్.. శుక్రవారం మరో ఫొటోతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రీచార్జ్ అవుతున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఇందులో నటాషా గానీ, అగస్త్య గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తదుపరి ఐసీసీ ఈవెంట్లోమామూలుగా అయితే, ఆట నుంచి విరామం దొరకగానే హార్దిక్ పాండ్యా తన భార్య, కుమారుడితోనే ఎక్కువ సమయం గడుపుతాడు. హార్దిక్- నటాషాలలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వదంతులకు చెక్ పడదు. కాగా హార్దిక్ సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి 2020లో పెళ్లాడాడు. పెళ్లికి ముందే తల్లిదండ్రులైన వీరు గతేడాది ఘనంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా తదుపరి జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024కు సిద్ధం కానున్నాడు. చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వార్తలు.. ట్రెండింగ్లో నటాషా (ఫొటోలు)
-
భార్యతో హార్దిక్కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు గత కొద్ది నెలలుగా ఏదీ కలిసి రావడం లేదు. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన ఈ బరోడా క్రికెటర్.. మళ్లీ ఐపీఎల్-2024 సీజన్తో పునరాగమనం చేశాడు.చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకుని క్యాష్ రిచ్ లీగ్ బరిలో నిలిచాడు. కష్టకాలంలో తనపై నమ్మకం ఉంచి.. కెప్టెన్సీ అనుభవం లేకున్నా పగ్గాలు అప్పగించిన గుజరాత్ టైటాన్స్ను వీడి తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు.స్టేడియంలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ఈ క్రమంలో ముంబై యాజమాన్యం రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించింది. అప్పటి నుంచి హార్దిక్ కష్టాలు మొదలయ్యాయి. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ను కాదని పాండ్యాను కెప్టెన్ చేయడంతో అభిమానులు ముంబై యాజమాన్యంపై ఫైర్ అయ్యారు.స్టేడియంలో, సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇక ఆట తీరుతోనైనా అభిమానుల మనసు గెలవాలని హార్దిక్ పాండ్యా భావించగా.. ఆ ఆశ కూడా నెరవేరలేదు. చెత్త కెప్టెన్సీ కారణంగా ముంబై ఈ సీజన్లో దారుణంగా విఫలమైంది.చెత్త కెప్టెన్సీ వల్ల అట్టడుగున ముంబైలీగ్ దశలో ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆల్రౌండర్గానూ పాండ్యా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులోనూ హార్దిక్ పాండ్యా స్థానం ప్రశ్నార్థకం కాగా.. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అదృష్టవశాత్తూ సెలక్టర్లు అతడిని మెగా టోర్నీకి ఎంపిక చేశారు.భార్య నటాషాతో హార్దిక్కు విభేదాలు?ఇక కెరీర్ విషయం ఇలా ఉంటే.. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త తెరమీదకు వచ్చింది. భార్య నటాషా స్టాంకోవిక్తో హార్దిక్ బంధం బీటలు వారిందనేది దాని సారాంశం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నటాషా గత కొన్ని రోజులుగా హార్దిక్తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయకపోవడమే ఇందుకు కారణం అన్నట్లుగా ‘రెడిట్’ ఓ పోస్ట్ పెట్టింది.ఈ క్రమంలో కొంత మంది హార్దిక్- నటాషా విడిపోనున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే, వారి అభిమానులు మాత్రం ఇవన్నీ వట్టి వదంతులే అని కొట్టి పారేస్తున్నారు. హార్దిక్, అతడి కుటుంబంతో నటాషా దిగిన ఫొటోలు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో అలాగే ఉండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.మరి ఎందుకు ఇలా?ముంబై కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యాపై సోషల్మీడియాలో కొంత మంది పనిగట్టుకుని మరీ విద్వేష విషం చిమ్మిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనైన పాండ్యా.. ఈ ప్రభావం తన భార్యాబిడ్డపై కూడా పడుతుందేమోనని భయపడినట్లు సమాచారం.ఆ భయం వల్లే హార్దిక్ వద్దన్నాడు!అందుకే నటాషాను కొద్ది కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని.. ముఖ్యంగా తనతో ఉన్న ఫొటోలు షేర్ చేయవద్దని స్వయంగా చెప్పినట్లు అభిమానులు భావిస్తున్నారు. అందుకే నటాషా స్టేడియానికి కూడా రావడం మానేసిందని.. కుమారుడు అగస్త్యను కూడా బయటకు తీసుకురావడం లేదని తెలుస్తోంది.అతడి ప్రేమ వల్లే ఈ మెరుపుఇక నుదుటిన బొట్టుతో బుధవారం ఓ ఫొటో షేర్ చేసిన నటాషా.. ‘‘అతడి ప్రేమ వల్లే ఈ మెరుపు’’ అంటూ ఫొటోను షేర్ చేసింది. దీంతో హార్దిక్- నటాషా మధ్య విభేదాలు అంటూ వస్తున్న ఊహాగానాలను ఆమె పటాపంచలు చేసినట్లయింది. కాగా నటాషా ఈ మధ్యకాలంలో పెట్టిన ప్రతీ పోస్టుకు హార్దిక్సోదరుడు కృనాల్ పాండ్యా, వదిన పాంఖురి శర్మ లైకులు కొట్టడం గమనార్హం.చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే! -
బాలీవుడ్ స్టార్ సతీమణి సీమంతం.. సెలబ్రేషన్స్ చూశారా? (ఫోటోలు)
-
చెఫ్గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!
వృత్తీరీత్యా చెఫ్గా పదిమందికి భోజనం పెట్టిన ఆమె విధి శాపమో లేక కర్మఫలమో గానీ కడుపు నిండా తినడం కష్టమయ్యే అరుదైన వ్యాధి బారిన పడింది. కనీసం గుప్పెడు మెతుకులు నోట్లో పెట్టుకోవాలంటే అల్లాడిపోయేది. నిజానికి కేన్సర్ నుంచి బయటపడేందుకు చేయించుకున్న శస్త్ర చికిత్స ఆమె పాలిట మృత్యువుగా మారింది. చివరికి ఆ వ్యాధితో పోరాడుతూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ నటాషా దిద్దీ(50) వృత్తి రీత్యా చెఫ్. రకరకాల వంటకాలతో కస్టమర్లను అలరించేది. ఏమోందో ఏమో గానీ 2019లో కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆమె కడుపులో కణుతులు వేగంగా అభివృద్ధి చెందాయి. దీంతో వైద్యులు ఆ కేన్సర్ మొత్త వ్యాపించకుండా ఉడేలా మొత్తం కడుపు భాగానే తొలగించారు. ఆమె పొట్ట భాగం లేకపోవడంతో ఆహారాన్ని జీర్ణించుకోవడం ఆనేది సమస్యత్మకంగా మారింది. ఆ క్షణం నుంచే ఆమె జీవితం మరింత నరకప్రాయంగా మారిపోయింది. వైద్యులు చిన్న మీల్స్ తినమని సూచించినా..అది తినడమే మహానరకంగా ఉండేది నటాషాకి. అలా ఆమె ప్రాణాలతో పోరాడుతూ మార్చి 24న తుదిశ్వాస విడిచింది. ఆమె పలు ఇంటర్యూల్లో తాను డంపింగ్ సిండ్రోమ్తో పోరాడుతున్నట్లు తెలిపింది. దీని కారణంగా కడుపులోని ఆహరం స్పీడ్గా కదిలి జీర్ణంకాకమునుపే ప్రేగుల్లోకి వెళ్లిపోతుంది. దీని దుష్ప్రభావం కారణంగా అలసట, చెమటలు పట్డడం, విపరీతంగా ఆవులించడం వంటి సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని వాపోయింది కూడా. డంపింగ్ సిండ్రోమ్ అంటే.. కడుపులో జీర్ణక్రియం సక్రమమైన పద్ధతిలో జరగుతుంది. అలాకాకుండా అనియంత్రంగా కడుపులో పడ్డ ఆహారం వేగంగా కదిలితే దాన్ని 'గ్యాస్ట్రిక్ చలనశీలత' అంటారు. ఆహారం కండరాలు, నరాలు, హార్మోన్లు సంకేతాలతో నెమ్మదిగా ఖాళీ అవుతుంది. అలాగాకుండా అనియంత్రంగా త్వరితగతిన తిన్న ఆహారం పోట్టలో ఖాళీ అయిపోతుందంటే.. ఇక్కడ పైలోరిక్ వాల్వ్ తెరుచుకుని కడుపులోని ఆహారం బయటకు పోతుందని అర్థం. అంటే..ఇది చిన్న ప్రేగు తక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంతో తలెత్తే సమస్య ఇది. మాములుగా అయితే చిన్నప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేసేలోపు మిగతా అవయవాలు ఆహారం నెమ్మదిగా కదిలేలా సర్దుబాటు చేసుకుంటాయి. అప్పుడు అది చక్కగా వంటబడుతుంది. మనకు హాయిగా ఉంటుంది. అలాగాకుండా ఆహారం వేగంగా కదిలితే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అర్థం. ఎవరు బాధపడతారంటే.. కడుపుకి సంబంధించిన శస్త్ర చికిత్స కారణంగా ఈ డంపింగ్ సిండ్రోమ్ లక్షణాలను అభివృద్ధి చేస్తారు. గ్యాస్ట్రెక్టమీ లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వంటి కడుపులోని పెద్ద భాగాలను తొలగించే లేదా బైపాస్ శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులలో కూడా ఇది సాధారణం. నిజానికి ఈ డంపింగ్ సిండ్రోమ్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ..ఒక్కోసారి కొన్ని కేసుల్లో తీవ్రమై..బరువు తగ్గి, పోషకాహార లోపాలను ఎదుర్కొనవల్సి వస్తుంది. దీన్ని స్వీయ సంరక్షణతో నయం చేసుకోవచ్చు. చాలామందికి తేలికపాటి లక్షణాలే ఉండి క్రమేణ తగ్గుముఖం పడతాయి. కొందరిలో మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే.. వాంతులు అవుతున్నాయి అతిసారం ఉదరం మరియు తీవ్రమైన తిమ్మిరిలో నొప్పి ఉబ్బరం డిజ్జి అక్షరములు హృదయ స్పందన రేటును వేగవంతం చేయడం బలహీనత అలసట చల్లని చెమటలు ముఖం ఎర్రబడుతోంది మెదడు అలిసిపోవడం ఆకలి (చదవండి: ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..) -
స్టార్ హీరో భార్యకు ప్రెగ్నెన్సీ.. విష్ చేసిన సమంత!
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా కనిపించింది. డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్ ప్రస్తుతం స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా వరుణ్ ధావన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య బేబీ బంప్తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు. కాగా.. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మనీష్ పాల్ కాబోయే తల్లిదండ్రులను అభినందించారు. వరుణ్ ధావన్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో కనిపించనున్నారు. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో సమంతతో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్కు రాజ్,డీకే దర్శకత్వం వహించనున్నారు. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
భార్యకు స్పెషల్గా విష్ చేసిన స్టార్ హీరో.. ఫోటో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అతనికి జోడీగా నటించింది. ఈ ఏడాది సిటాడెల్-2తో పాటు కోలీవుడ్లో మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా దలాల్ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వరుణ్, నటాషా దలాల్ జనవరి 24, 2021న అలీబాగ్లో జరిగిన వివాహా వేడుకలకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ జంట వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు స్పెషల్ విషెస్ చెప్పారు బాలీవుడ్ హీరో. పెళ్లికి ముందు తనకు ప్రపోజ్ చేసిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. హ్యాపీ త్రీ బేబీ అంటూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర ఏళ్ల క్రితం మార్క్ ఆంథోనీ పాట ప్లే అయినప్పుడు ప్రపోజ్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. గతేడాది వరుణ్ నటించిన బవాల్ నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
పెళ్లయిన 18 ఏళ్లకు విడాకులు తీసుకుంటున్న బాలీవుడ్ జంట!
పెళ్లి-విడాకులు సర్వసాధారణమైపోయాయి. మరీ ముఖ్యంగా చిత్రపరిశ్రమలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ జంట విడాకుల దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్- నటాషా మాద్వానీ విడిపోయినట్లు ఓ ప్రచారం నెట్టింట వైరల్గా మారింది. నటుడు ఫర్దీన్ ఖాన్ ప్రముఖ నటి ముంతాజ్ కూతురు నటాషాను 2005 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి దియాని ఇసబెల్లా ఖాన్(10) అనే కూతురు, అజారియస్ ఫర్దీన్ ఖాన్(6) అనే కుమారుడు ఉన్నారు. సుమారు ఏడాదికాలంగా దంపతులిద్దరూ విడివిడిగానే జీవనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకోలేని క్రమంలో విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే గతేడాది ప్రారంభంలో ఓ ఇంటర్వ్యూలో ఫర్దీన్ ఖాన్ మాట్లాడుతూ.. '2011లో మేము లండన్ షిఫ్ట్ అయ్యాం. సంతాన సమస్యలు ఉండటంతో అక్కడ ఓ డాక్టర్ను సంప్రదించాం. ఐవీఎఫ్(ఇన్వెట్రో ఫర్టిలైజేషన్) ద్వారా నటాషా గర్భంలో కవలలు ప్రవేశించారు. కానీ ఆరో నెలలోనే వారిద్దరూ కడుపులోనే ప్రాణాలు వదిలారు. త్వరలో ఇద్దరు పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ఆడించబోతున్నామన్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న మాకు ఈ వార్త అశనిపాతంలా తాకింది. నటాషా ఎంతగానో కుమిలిపోయింది. తర్వాత మాకు పాప పుట్టింది. అప్పుడు మా ఆనందం అంతా ఇంతా కాదు. కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత పాప మా జీవితాల్లోకి రావడంతో మా మనసంతా తేలికయిపోయింది' అని ఫర్దీన్ చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఫర్దీన్ త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విస్ఫట్ సినిమాతో పాటు నో ఎంట్రీ సీక్వెల్లో అతడు నటించనున్నట్లు గాసిప్ వినిపిస్తోంది. ఆయన చివరిసారిగా 2010లో వచ్చిన దుల్హా మిల్ గయా సినిమాలో కనిపించాడు. చదవండి: రాఘవ లారెన్స్ సినిమా ఆడిషన్స్కు వెళ్తే డైరెక్టర్ అలా చేయమని బలవంతం!: నటి ప్రియుడి కోసం పేరు మార్చుకున్న జ్యోతి రాయ్? జగతి మేడమ్ రెండో పెళ్లి -
భార్యతో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్! మరీ..
Hardik Pandya And Natasa Stankovic: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘‘మీ పద్ధతి బాగాలేదు.. అందరి ముందు ఇలాంటివి అవసరమా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా ఫైనల్ రిజర్వ్ డే జరుగగా.. అహ్మదాబాద్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవాలనుకున్న గుజరాత్ టైటాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక తుదిపోరులో టైటాన్స్ను ఓడించిన ధోని సేన ఐదోసారి చాంపియన్గా నిలిచి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. క్యాష్రిచ్ లీగ్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యాకు కావాల్సినంత విరామ సమయం దొరికింది. ఇంగ్లండ్లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు రోహిత్ సేన లండన్కు వెళ్లగా.. ఈ ఆల్రౌండర్కు రెస్ట్ లభించింది. దీంతో తన సమయాన్నంతా కుటుంబానికే కేటాయించాడు. ఇందులో భాగంగా భార్య నటాషా స్టాంకోవిక్, కుమారుడు అగస్త్యతో కలిసి థాయ్లాండ్ ట్రిప్నకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటాషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా ఆమె పంచుకున్న చిత్రాలే పాండ్యా దంపతులపై నెటిజన్ల ట్రోలింగ్కు కారణమయ్యాయి. హార్దిక్- నటాషా అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలపై కొంతమంది ఆకతాయిలు విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు?’’ అంటూ ముఖ్యంగా నటాషా డ్రెస్సింగ్ను తప్పుపడుతున్నారు. అయితే, పాండ్యా అభిమానులు మాత్రం.. ‘‘వాళ్లు భార్యాభర్తలు. ఎలా ఉంటే మీకేంటి? నటాషా వేసుకున్న డ్రెస్పై మీ అభ్యంతరాలేమిటి? పని చూసుకోండి’’ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. కాగా జూలై 12 నుంచి మొదలుకానున్న వెస్టిండీస్ టూర్తో హార్దిక్ పాండ్యా మళ్లీ బిజీ కానున్నాడు. ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ వారసుడు, భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు! అసలు రహానే ఏం చేశాడని ఆ బాధ్యతలు? మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే.. View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__) -
థాయ్లాండ్లో ఎంజాయ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్
Hardik Pandya and Natasa Stankovic Holiday: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా హాలీడే మూడ్లో ఉన్నాడు. ఐపీఎల్-2023 తర్వాత దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు. ఈ క్రమంలో భార్య నటాషా, కొడుకు అగస్త్యతో కలిసి థాయ్లాండ్లో వాలిపోయాడు. ఫుకెట్లో కుటుంబంతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నాడు. భార్యా, కొడుకుతో స్విమ్మింగ్పూల్లో జలకాలాడుతూ సేదతీరుతున్నాడు. నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏనుగులకు అరటిపండ్లు తినిపిస్తూ ఈ ముగ్గురూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలను హార్దిక్ భార్య నటాషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అగస్త్య ఏనుగులకు అరటిపండ్లు తినిపిస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. రన్నరప్తో సరి కాగా ఐపీఎల్-2023లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుకుంది. అయితే, అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ధోని సేన ఐదోసారి చాంపియన్గా అవతరించగా... వరుసగా రెండోసారి విజేతగా నిలవాలనుకున్న టైటాన్స్కు నిరాశే మిగిలింది. విండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ సారథిగా! ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లో తలపడింది. దీంతో ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదితరులు ఇంగ్లండ్కు వెళ్లగా.. హార్దిక్ పాండ్యాకు కావాల్సినంత విశ్రాంతి లభించింది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన రోహిత్ సేన.. జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం హార్దిక్ పాండ్యా మరోసారి మైదానంలో దిగనున్నాడు. విండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్కు పాండ్యా సారథ్యం వహించే అవకాశం ఉంది. చదవండి: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__) -
Yoga Day: యోగా.. కొత్త కొత్తగా
యోగా నిపుణులు, సాధకులు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో తమ ఉనికిని కొత్తగా చాటుతున్నారు. వారి నిజాయితీ, స్ఫూర్తిదాయకమైన వారి మాటలు, ఉత్సాహం ఆకర్షణీయంగా మార్చే సుగుణాన్ని కళ్లకు కడుతున్నాయి. యోగా ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను రెండింటినీ అద్భుతంగా మారుస్తుంది. రోజువారి జీవనంలో యోగా ఒక భాగం అవడానికి ఇన్ఫ్లుయెన్సర్లు మరిన్ని హంగులు అద్దుతున్నారు. శాస్త్రీయ యోగాభ్యాసం ద్వారా వేగవంతమైన ఆధునిక యుగానికి తమను తాము గొప్ప స్ఫూర్తిగా మార్చుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి ఎంతోమంది మహిళలు యోగా పాఠాలు చెబుతూ సోషల్ మీడియాలో కనిపిస్తారు. వారి నుంచి ఎంతో ప్రేరణను పొందవచ్చు. ఈ రోజు నుంచే యోగాను దైనందిన జీవనంలో భాగం చేసుకోవచ్చు. ప్రపంచస్థాయి ప్రభావం శిల్పా శెట్టి భారతదేశంలో అత్యంత ప్రభావ వంతమైన ఫిట్నెస్ ఐకాన్స్, యోగా ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరుగా నిలిచింది శిల్ప. ఐదుపదులకు చేరువలో ఉన్న శిల్ప యోగా కోసం చాలా కాలం శిక్షణ పొందారు. తీరైన శరీరాకృతిని పొందడానికి, దైనందిన జీవనంలో వ్యాయామాన్ని చేర్చడానికి ఫిట్నెస్ ఫిల్మ్లు రూపొందించింది. యోగాకు సంబంధించిన డీవీడీలను కూడా రిలీజ్ చేసింది. కొన్ని జీవన శైలి మార్పులు మనలో ఎలాంటి పెద్ద మార్పులను తీసుకువస్తాయో చూపించడానికి సోషల్మీడియాను ఉపయోగిస్తుంది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్కి 3 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో భారతీయ యోగానుప్రోత్సహించడంలో శిల్ప చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆమె వ్యాయామం చేసే విధానం, తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం గృహిణులకు స్ఫూర్తినిస్తుంది. యోగా సౌందర్యం దీపికా మెహతా రోజును యోగాసనాలతో కొత్తగా ్రపారంభించాలనే ఆలోచనను దీపికా మెహతా కళ్లకు కడుతుంది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా యోగా లో కళా దృష్టి ఉంటుందని చూపుతుంది. ‘రెండు దశాబ్దాల క్రితం మరణం అనుభవాన్ని చవిచూశానని, యోగా పునర్జీవితాన్ని ఇచ్చింద’ని చెబుతుంది. రాక్ క్లైంబింగ్ ప్రమాదం తర్వాత ఆమె ఇకపై నడవలేదని వైద్యులు అంచనా వేశారు. యోగా ట్రైనర్, అష్టాంగ యోగా స్పెషలిస్ట్ అయిన దీపికా యూ ట్యూబ్ ఛానెల్ కి దాదాపు 4 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె చూపే యోగా ప్రతిభ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు యోగా గురూగా మారింది. లోపాలను సరిదిద్దుతూ... సునయన రేఖీ యోగా హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్గా సునైనా రేఖీ తనను తాను కొత్తగా ఎప్పుడూ పరిచయం చేసుకుంటూనే ఉంటుంది. భారతదేశంలోని అత్యంత పేరొందిన యోగా ట్రైనర్లలలో సునయన ఒకరు. రిషీకేశ్లో యోగా సాధన చేసిన సునయన ఇప్పుడు ముంబైలోని అనేక ప్రసిద్ధ యోగా స్టూడియోలలో నిపుణురాలిగా శిక్షణ ఇస్తోంది. సాధనకు బలమైన పునాదిని ఏర్పరచడానికి, గాయాలను మాన్పడానికి నిపుణులైన పర్యవేక్షణ అవసరమని సునయన వీడియోలు నిరూపిస్తాయి. యోగా సాధనలో చిన్న చిన్న లోపాలు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయో కూడా వివరిస్తుంది. మనస్సు, శరీరం, ఆత్మపై యోగా వల్ల కలిగే మంచి ప్రయోజనాల గురించి వివరిస్తుంది. నిరాశకు దూరం నటాషా నృత్యకారిణి, ఫొటోగ్రాఫర్, యోగా సాధకురాలు నటాషా నోయల్. యూ ట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచే కాదు సోల్ఫుల్ హ్యాపీనెస్ బ్లాగ్ ద్వారా తన యోగానుభవాలను తెలియజేస్తుంది. మాట్లాడుతుంది. తత్త్వశాస్త్రాన్ని సాధన చేసే నటాషా ‘మీ మానసిక దృఢత్వమే మీ లక్ష్యం. మిగతావన్నీ అప్రధానం’ అని చెబుతుంది. తన బాల్యంలో జరిగిన విషాదకర సంఘటనల నుంచి తేరుకొని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. కండరాల బలాన్ని పునర్నిర్మించే ప్రయత్నంలో ఆమె యోగా సాధకురాలిగా మారింది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్కు సుమారు ఏడు లక్షల ముప్పై వేల మంది సభ్యులు ఉన్నారు. నిరాశ, ఆందోళన, బాడీ షేమింగ్ గురించి చర్చించడానికి ఆమె తన సోషల్మీడియా ΄్లాట్ఫారమ్ను ఉపయోగిస్తుంది. యోగా ద్వారా సెల్ఫ్ గ్రోత్, చికిత్స గురించి మరీ మరీ చెబుతుంది. ప్రతిరోజూ మరింత బలంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని సూచనలు ఇస్తుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కష్టపడి పని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో అందుకు తనే ఉదాహరణగా చూపుతుంది. యోగాసిని రాధికా బోస్ అనేక పేరొందిన కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం రాధికా బోస్కు ఉంది. అయితే, ఆమె తన ఆరోగ్యకరమైన జీవనాన్ని సూచించడానికి మాత్రం సోషల్మీడియానే ప్రధాన వేదికగా ఎంచుకుంటుంది. రాధిక సూచించే అంశాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్లలో ఆమె యోగసాధన గురించి ప్రచురించాయి. ‘మీడియా, ప్రకటనలలో గ్లాస్ సీలింగ్ను ఛేదించడానికి మహిళలు గొప్ప పురోగతిని సాధించారు. అయితే మనం ఇంకా పితృస్వామ్యంలో జీవిస్తున్నాం, అన్నింటినీ దాటుకొని చాలా దూరం ప్రయాణించాల్సింది మనమే’ అని నమ్మకంగా చెబుతుంది. యోగా, వ్యాయామ జీవనశైలితో పాటు ఇతర ఆరోగ్య మార్గదర్శకాలను అందిస్తుంది. 9 సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ, నిపుణురాలిగా తన ప్రతిభను చాటుతోంది. -
రూ. లక్ష ఇవ్వాల్సిందే! అక్కడుంది హార్దిక్ కదా! 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి మరీ..
Hardik Pandya Wedding Unseen Video: పెళ్లంటే సందళ్లు.. ఆటపాటలు.. వదినామరదళ్లు- బావాబామ్మర్దుల సరదాలు.. వధూవరులు, వారి కుటుంబాలను దగ్గర చేసేందుకు ఆడే చిలిపి ఆటలు.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్, భవిష్యత్ కెప్టెన్గా ఎదుగుతున్న హార్దిక్ పాండ్యా వివాహ వేడుకలో ఇలాంటి సన్నివేశాలెన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా అందులోని వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్తో వెలుగులోకి వచ్చిన పాండ్యా అనతికాలంలోనే భారత పేస్ ఆల్రౌండర్గా ఎదిగాడు. సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించిన అతడు.. 2020లో ఆమెను పెళ్లాడాడు. అప్పటికే నటాషా గర్భవతి కాగా.. వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 14న హిందూ, క్రిస్టియన్ వివాహ పద్ధతిలో కొడుకు అగస్త్య సమక్షంలో అంగరంగా వైభవంగా హార్దిక్- నటాషాలు మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో భాగంగా హార్దిక్ పాండ్యా వదిన, నటాషా తోటికోడలు ఫాంకురి శర్మ(కృనాల్ పాండ్యా భార్య) .. ‘‘జూతా చురాయి(పాదరక్షలు దాచిపెట్టడం)’’ పేరిట మరిదిని ఆటపట్టించింది. అడిగినంత డబ్బు కానుకగా ఇస్తేనే బూట్లు ఇస్తానంటూ మెలిక పెట్టింది. ఈ సందర్భంగా లక్ష రూపాయలు ఇవ్వాలని హార్దిక్ను డిమాండ్ చేసింది. అయితే, ఇందుకు స్పందించిన హార్దిక్.. లక్ష కాదు ఏకంగా ఐదు లక్షలు ఇస్తానంటూ వదినమ్మను ఖుషీ చేశాడు. వెంటనే డబ్బును ఫాంకురి అకౌంట్కు బదిలీ చేయాలంటూ తమ వాళ్లకు చెప్పాడు. అయినప్పటికీ.. ఫాంకురి ఆటపట్టించడం మానలేదు. డబ్బు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాతే షూస్ ఇస్తానని చెప్పింది. అలా సరదాగా సాగిన ఈ వేడకకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2023లో తమ జట్టును ఫైనల్కు చేర్చాడు. కానీ ఆఖరి మెట్టుపై చెన్నై సూపర్కింగ్స్ చేతిలో ఓటమిపాలు కావడంతో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ ఈసారి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. హార్దిక్ ప్రస్తుతం వెస్టిండీస్తో సిరీస్కు సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్గా.. ఒక్కడే కాదు! Ameeri ho to aisi ho. Hardik Pandya jitna ameer hona hai life me pic.twitter.com/qyHvfkxFWq — CS Rishabh (Professor) (@ProfesorSahab) June 18, 2023 -
పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో? ట్వీట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ ధావన్ భార్య నటాషాతో విడిపోనున్నట్లు ఓ ట్వీట్ వైరల్గా మారింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను వరున్ 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఏ పార్టీ, ఫంక్షన్స్ జరిగినా ఇద్దరూ కలిసే హాజరవుతుంటారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో విడాకులు తీసుకునేందుకు డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అయితే సినీ సెలబ్రిటీల గురించి సెన్సేషనల్ కామెంట్స్తో వార్తల్లో నిలిచే ఉమైర్సంధు ఇప్పుడు కూడా ప్రబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నాడని, ఇందులో నిజం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. Everything is not “ Ok ” between #VarunDhawan & his wife #NatashaDalal. Separation is on the way !! pic.twitter.com/J5sCXpYnNX — Umair Sandhu (@UmairSandu) May 24, 2023 -
ఎంత అందంగా ఉన్నారో! హార్దిక్ పాండ్యా- నటాషా మెహందీ ఫొటోలు వైరల్
Hardik Pandya Natasa Stankovic Viral Pics: అందమైన ఫొటోలతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ‘‘పెయింటెడ్ ఇన్’’ లవ్ అంటూ భార్య, కుమారుడితో ఉన్న దృశ్యాలు పంచుకున్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టు.. వాలంటైన్స్ డే సందర్భంగా సతీమణి నటాషా స్టాంకోవిక్కు మర్చిపోలేని బహుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రాజస్తాన్లోని ఉదయ్పూర్ కోటలో రెండేసి సంప్రదాయ పద్ధతుల్లో మరోసారి భార్యను వివాహమాడాడు హార్దిక్. తమ మూడేళ్ల కుమారుడు అగస్త్య సహా బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆమెతో మరోసారి పెళ్లి ప్రమాణాలు చదివాడు. ఈ క్రమంలో ఇప్పటికే వైట్వెడ్డింగ్ థీమ్ సహా నటాషాతో కలిసి ఏడడుగులు నడిచిన ఫొటోలను పంచుకున్నాడు ఈ స్టార్ ఆల్రౌండర్. తాజాగా మెహందీ, హల్దీ(పసుపు) ఫంక్షన్ ఫొటోలు షేర్ చేయగా అవి కూడా వైరల్ అవుతున్నాయి. గులాబీ, తెలుపు రంగుల మేళవింపుతో కూడిన కుర్తా పైజామాలో హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్యతో కలిసి ట్విన్నింగ్ చేయగా.. నటాషా పసుపు వర్ణం ప్రధానంగా ఉన్న మల్టీకలర్ డ్రెస్లో మెరిసిపోయింది. ఈ ఫొటోలకు గంటలోపే మిలియన్కు పైగా లైకులు వచ్చాయి. అందమైన జంట అంటూ తోటి క్రీడాకారులు, అభిమానులు హార్దిక్ పాండ్యా దంపతులను మరోసారి విష్ చేస్తున్నారు. అమ్మానాన్నలతో క్యూట్ అగస్త్య.. కలకాలం వర్థిల్లు అంటూ వీరి కుమారుడిని ఆశీర్వదిస్తున్నారు. ముచ్చటైన కుటుంబం అని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా సెర్బియా మోడల్, నటి నటాషాను ప్రేమించిన హార్దిక్ పాండ్యా 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి కుమారుడు జన్మించాడు. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా వీరి వివాహం జరగడంతో మూడేళ్ల తర్వాత ఇలా గ్రాండ్గా ప్లాన్ చేశాడు హార్దిక్. గతేడాది కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకున్న ఈ ఆల్రౌండర్ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా తన భార్య కలను నెరవేర్చాడు. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్తో తిరిగి జట్టుతో కలవనున్న హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత ఐపీఎల్-2023తో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా మరింత బిజీ కానున్నాడు. చదవండి: ind Vs Aus: స్వదేశానికి పయనం.. అవమానించారు కాబట్టే అంటున్న గిల్క్రిస్ట్!! Ind Vs Aus: చెత్త బ్యాటింగ్.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్ -
హార్దిక్ పాండ్యా- నటాషా : ముచ్చటగా మూడోసారి పెళ్లి (ఫొటోలు)
-
భార్య నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్
Hardik Pandya- Natasa Stankovic Hindu Wedding New Images: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ దంపతులు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. మూడేళ్ల క్రితం అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్న ఈ ప్రేమజంట.. ఈ వాలంటైన్స్ డేన రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజస్తాన్లోని ఉదయ్పూర్ కోటలో హార్దిక్- నటాషా పెళ్లి కన్నులపండువగా జరిగింది. తమ కుమారుడు అగస్త్యతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరు మరోసారి పెళ్లి చేసుకున్నారు. తొలుత భార్య విశ్వాసాలకు అనుగుణంగా ‘వైట్ థీమ్ వెడ్డింగ్’ ఏర్పాటు చేసిన హార్దిక్ పాండ్యా.. తర్వాత హిందూ సంప్రదాయ పద్ధతిలోనూ ఆమెను వివాహమాడాడు. క్రిస్టియన్ వివాహ పద్ధతిలో నటాషా పొడవాటి అందమైన తెల్లటి గౌన్ ధరించగా.. రెండో పద్ధతిలో బంగారు- ఎరుపు వర్ణాలు కలగలసిన లెహాంగాలో మెరిసిపోయింది. ఇక పెళ్లికి ఎరుపు రంగు చీరకట్టుకుని అందమైన ఆభరణాలు ధరించి అచ్చమైన భారతీయ వనితలా కనిపించింది. PC: Hardik Pandya Instagram తొలుత ఉంగరాలు మార్చుకుని మరోసారి పెళ్లి ప్రమాణాలు చదివిన ఈ జంట.. తర్వాత అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచి ముచ్చటగా మూడోసారి పెళ్లాడారు. హార్దిక్ పాండ్యా తన భార్య నుదుటిన సింధూరం దిద్ది మురిసిపోయాడు. PC: Hardik Pandya Instagram ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు హార్దిక్- నటాషా దంపతులు. ‘‘ఇప్పుడు.. ఎల్లప్పుడూ’’ అంటూ హార్ట్ సింబల్ ఎమోజీతో తమ ప్రేమబంధం శాశ్వతం అంటూ క్యాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్గా మారాయి. PC: Hardik Pandya Instagram (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా గుజరాత్కు చెందిన క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు.. సెర్బియా మోడల్, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో 2020లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. నటాషా గర్భం దాల్చిన తర్వాత అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు. PC: Hardik Pandya Instagram వీరికి కుమారుడు అగస్త్య జన్మించాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 తాత్కాలిక కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా.. త్వరలోనే పూర్తిస్థాయిలో భారత జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో అతడు గుజరాత్ టైటాన్స్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..! IND Vs AUS 2nd Test Prediction: సూర్య స్థానంలో అయ్యర్.. గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు -
రెండోసారి పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్
Hardik Pandya- Natasa Stankovic Marriage: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. తన భార్య నటాషా స్టాంకోవిక్ను రెండోసారి వివాహమడాడు. రాజస్తాన్లోని ఉదయ్పూర్ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమికుల దినోత్సవాన(ఫిబ్రవరి 14) హార్దిక్- నటాషాలు తమ కుమారుడు అగస్త్య, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 2020 జనవరి 1న నటాషా వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేసిన హార్దిక్ పాండ్యా.. లాక్డౌన్లో సమయంలో అత్యంత సన్నిహితుల నడుమ ఆమెను పెళ్లాడాడు. వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు. ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు భార్యకు ఈ మేరకు వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చాడు హార్దిక్. ఇక నటాషా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ... తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. మూడేళ్ల క్రితం చేసిన పెళ్లి ప్రమాణాలను మరోసారి గుర్తుచేసుకున్నామని.. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరగడం సంతోషంగా ఉందంటూ ఉద్వేగానికి లోనైంది. చదవండి: Nick Vujicic- Kanae Miyahara: ‘పరిపూర్ణతే’ అర్హతా? వాళ్లది నిజమైన ప్రేమ.. నలుగురు పిల్లలతో ముచ్చటగా.. Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి..
Hardik Pandya- Natasa Stankovic Love Story: అమ్మానాన్న.. తోబుట్టువులు మినహా.. జీవితంలో అచ్చంగా తమకు మాత్రమే సొంతమైన వ్యక్తి ఒకరు కచ్చితంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడనడంలో సందేహం లేదు. ఎలాంటి దాపరికాలు, అరమరికలు లేకుండా సదరు వ్యక్తి ముందు మాత్రమే తమ మనసులోని భావాలు వ్యక్తీకరించగలుగుతారు. బాధైనా, సంతోషమైనా వాళ్లతోనే పంచుకోవడానికే ఇష్టపడతారు. తాము పూర్తిగా నమ్మిన వ్యక్తి.. తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఆ వ్యక్తే జీవిత భాగస్వామిగా లభిస్తే.. చెప్పేదేముంది! ఎగిరి గంతేయడం సహజం. మనసుకు నచ్చితే చాలు.. ‘‘మనవాళ్లా’’, ‘‘పరాయి వాళ్లా’’ అని అస్సలు ఆలోచించరు. ‘‘ప్రణయంలోనూ.. ప్రణయంతోనే.. పరిచయమడిగే మనసూ.. అది నువ్వనీ.. నీకే తెలుసూ..’’ అంటూ సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే వారితో ముడిపడిపోతారు. ప్రేమతో జీవితాంతం కట్టిపడేసేలా బంధాన్ని బలపరచుకుంటారు. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా- సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ ఈ కోవకు చెందినవాళ్లే! సాధారణ మధ్య తరగతి కుటుంబం హార్దిక్- నటాషా విభిన్న ధ్రువాలకు చెందిన వాళ్లు. గుజరాత్లోని సూరత్లో 1993 అక్టోబరు 11న జన్మించాడు హార్దిక్. అతడి తండ్రి హిమాన్షు పాండ్యా కార్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. అయితే, కుమారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కుటుంబంతో సహా వడోదరకు ఫిష్ట్ అయ్యారు. కొడుకులు కృనాల్, హార్దిక్కు క్రికెట్లో మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోన్ ఏజెంట్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. తండ్రి ప్రోత్సాహంతో అన్న కృనాల్తో కలిసి కిరణ్ మోరే అకాడమీలో చేరిన హార్దిక్.. అక్కడే తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. అయితే, అప్పటికే ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ ఆటను వదల్లేదు. ఆటంటే ప్రాణం తొమ్మిదో తరగతిలోనే హార్దిక్ స్కూల్కు వెళ్లడం మానేసి పూర్తిగా క్రికెట్పైనే దృష్టి పెట్టాడు. జూనియర్ లెవల్లో రాణిస్తూ.. క్లబ్ క్రికెట్లో సత్తా చాటాడు. నిజానికి 18వ ఏట వరకు లెగ్ స్పిన్నర్గా ఉన్న హార్దిక్ పాండ్యా.. బరోడా కోచ్ సనత్ కుమార్ సూచనతో ఫాస్ట్ బౌలర్గా మారాడు. దేశవాళీ క్రికెట్లో బరోడా జట్టుకు ఆడిన హార్దిక్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ దృష్టిలో పడటంతో అతడి తలరాత ఒక్కసారిగా మారిపోయింది. 2015 నుంచి 2021 వరకు అదే జట్టుతో కొనసాగిన హార్దిక్.. ఆర్థికంగానూ, టీమిండియా క్రికెటర్గానూ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. భావి కెప్టెన్గా రేసులో ముందుకు దూసుకుపోతున్నాడు. ‘ప్లే బాయ్’ ఇమేజ్ అయితే, కొన్నిసార్లు తన ఆటిట్యూడ్ వల్ల హార్దిక్ తీవ్రంగా విమర్శలపాలయ్యాడు. తోటి క్రికెటర్ కేఎల్ రాహుల్తో కలిసి.. 2019లో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న హార్దిక్.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కొన్నాళ్లు నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడు నటాషాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అప్పటికే ఎంతోమంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన హార్ది్క్ పాండ్యా.. నటాషానూ మధ్యలోనే వదిలేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెర్బియా నుంచి వచ్చి బాలీవుడ్లో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటాషాకు ఇవన్నీ అవసరమా అంటూ పెదవి విరుపులు. అయితే, ఎవరెన్ని మాటలు అన్నా నటాషా వెనుకడుగు వేయలేదు.. హార్దిక్ను నమ్మిన నటాషా ఓ పార్టీలో తనకు పరిచయమైన హార్దిక్ను హార్దిక్లానే చూసింది. తన కంటే వయసులో దాదాపు ఏడాది చిన్నవాడైన అతడి వ్యక్తిత్వాన్ని ప్రేమించింది. ఆమె నమ్మకాన్ని హార్దిక్ వమ్ముచేయలేదు. 2020 జనవరిలో నటాషా చేతి వేలికి ఉంగరాన్ని తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ముచ్చటైన కుటుంబం మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ గోముగా అడిగాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందే మనసిచ్చిన నెచ్చెలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అదే ఏడాది మేలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి పెళ్లి జరిగింది. కొన్ని నెలల్లోనే వీరి దాంపత్యానికి గుర్తుగా కుమారుడు అగస్త్య జన్మించాడు. వీరిది ఇప్పుడు ముగ్గురితో కూడిన ముచ్చటైన కుటుంబం. మరోసారి తన ‘రాణి’తో నిజమైన ప్రేమకు విధి కూడా సహకరిస్తుంది అంటారు. ఇలా రెండు వేర్వేరు దేశాల్లో జన్మించి.. విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన హార్దిక్- నటాషా.. ప్రేమకు హద్దులు ఉండవని మరోసారి నిరూపించారు. పరిస్థితుల దృష్ట్యా అప్పుడు వేడుకగా పెళ్లిచేసుకోలేకపోయామనే లోటును తీర్చుకునేందుకు రెండోసారి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న ఈ జంట మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయనుంది. తమ కుమారుడు అగస్త్య, కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో హార్దిక్, నటాషాను వివాహమాడనున్నాడు. రాజస్థాన్ కోటలో తన ‘హృదయపు పట్టపురాణి’ని మనువాడి మరో చిరకాల జ్ఞాపకాన్ని మిగిల్చబోతున్నాడు. భార్య విశ్వాసాలకు గౌరవమిస్తూ ‘వైట్ థీమ్ వెడ్డింగ్’కు ఏర్పాట్లు చేయించి మరోసారి ఆమె మనసు గెలుచుకున్నాడు. వాలంటైన్స్డే-2023 సందర్భంగా ప్రేమ పక్షులు.. సారీ సారీ ప్రేమతో ముడిపడిన దంపతులు.. మరోసారి పెళ్లిచేసుకోబోతున్న అగస్త్య అమ్మానాన్న హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్కు శుభాకాంక్షలు!! చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! -
నటితో హార్దిక్ పాండ్యా పెళ్లి.. మూడేళ్ల తర్వాత!
హార్దిక్ పాండ్యా క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. తక్కువ కాలంలోనే టీమిండియాకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అయితే హార్దిక్ పాండ్యా ఇప్పటికే నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈ జంట మరోసారి పెళ్లికి సిద్ధమైంది. అదేంటి ఇప్పటికే పెళ్లయిన జంటకు మరోసారి పెళ్లేంటీ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేసేయండి. రాజస్థాన్లోని ఉదయపూర్లో ఫిబ్రవరి 13 నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం హార్దిక్, నటాషా ఇప్పటికే ఉదయ్పూర్ చేరుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున ఉదయపూర్లో ఈ జంట మరోసారి వివాహం చేసుకోనుంది. ఈనెల 13 నుంచి 16 వరకు హల్దీ, మెహెందీ, సంగీత్ లాంటి కార్యక్రమాలతో వెడ్డింగ్ వైభవంగా జరగనుంది. పెళ్లయిన మూడేళ్లకు మరోసారి ఈ జంట వివాహం చేసుకోవడం విశేషం. కాగా.. జనవరి 1, 2020న దుబాయ్లో నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్, నటాషా.. మే 31, 2020న సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జూలై 2020లో వారి బాబు జన్మించారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమ కుమారుడి ఫోటోలు, వీడియోలను పంచుకుంటారు. నటాషా 2013 చిత్రం సత్యాగ్రహ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత యాక్షన్ జాక్సన్ (2014), ఫుక్రే రిటర్న్స్ (2017) వంటి చిత్రాలలో నటించింది. ఆమె బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో కూడా కనిపించింది. ఆ తర్వాత బాద్షా బ్లాక్ బస్టర్ ట్రాక్ డీజే వాలీ బాబు సినిమాలోనూ కనిపించింది. View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__) -
మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటీనటుల అరెస్ట్
మోడలింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటుడితో పాటు మరో నటిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపూర్ అశ్విన్, నటాషా కపూర్ను అరెస్ట్ చేశారు. చైల్డ్ మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాస్మో పాలిటన్ మోడలింగ్ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఓ వ్యాపార వేత్త నుంచి రూ.20 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తల పిల్లలే నిందితుల లక్ష్యంగా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన బాలీవుడ్ నటీనటుల నుంచి ఎన్ని రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
స్విమ్మింగ్ పూల్లో అగస్త్యతో హార్ధిక్ పాండ్యా ..
టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్య, అతని ముద్దుల కొడుకు అగస్త్యతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. హార్ధిక్, నటాషా దంపతులకు అగస్త్య గతేడాది మే 30న జన్మించాడు. నాటి నుంచి అగస్త్యకు సంబంధించిన ప్రతి ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా, హార్ధిక్ పాండ్యా అతని కొడుకు అగస్త్యతో కలిసి స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటున్న చిత్రాన్ని అతని భార్య నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. స్విమ్మింగ్పూల్లో అగస్త్య తొలిసారిగా అంటూ క్యాప్షన్ను జోడించింది. ఈ ఫోటోతో పాటు వీరి కుటుంబానికి సంబంధించిన మరో మూడు ఫోటోలను అమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, పాండ్యా గతేడాది ఐపీఎల్ సీజన్ తరువాత జరిగిన ఆసీస్ పర్యటనలో చివరి సారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: ఐదుకు పడిపోయిన విరాట్ టెస్ట్ ర్యాంకింగ్ View this post on Instagram A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఎట్టకేలకు తన ప్రేయసి నటాషా దలాల్ను వివాహమాడారు. జనవరి 24న(ఆదివారం) ముంబైలోని మాన్సన్ హౌస్ రిసార్ట్లో హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అతి కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లి ఫోటోలను వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తాజాగా పెళ్లిలో హల్దీ వేడుకకు చెందిన ఫోటోలను వరుణ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. హల్దీ జరిగింది కదా అనే క్యాప్షన్తో పోస్టు చేసిన ఈ ఫోటోలో వరుణ్ పసుపు పూసుకొని కండల వీరుడిలా ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. చదవండి: కొన్ని గంటల్లో పెళ్లి.. హీరో కారుకు ప్రమాదం ఇక వరుణ్ ధావన్- నటాషాలకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. నటాషాకు ధావన్ మూడు సార్లు ప్రపోజ్ చేయగా, తను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఒప్పుకుందట. వరుణ్ బాలీవుడ్లోకి అడుగుపెట్టే దాకా వీరి ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. అయితే తరువాత ఇద్దరు కలిసి పార్టీలు, డిన్నర్లకు వెళ్లడంతో కెమెరా కంటికి చిక్కారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ 2019 వరుణ్ పుట్టినరోజు సందర్భంగా పప్రియురాలితో కలిసిన ఫోటోను షేర్ చేయడంతో అధికారికంగా తేలిపోయింది. కాగా గతేడాదే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ కరోనా కరోనా వాయిదా పడింది. ఇక వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ బాలీవుడ్లో సీనియర్ దర్శకుడు. ఇటీవల వరుణ్తో కూలీ నెం 1 అనే సినిమా తెరకెక్కించారు. చదవండి: భర్త ప్రేమ సందేశం: నిహారిక భావోద్వేగం View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ పెళ్ళి ఫోటోలు..
-
కొన్ని గంటల్లో పెళ్లి.. హీరో కారుకు ప్రమాదం
ముంబై : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కారు శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. వరుణ్ పెళ్లి సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో పాల్గొని వివాహ వేదిక దగ్గరకు తిరిగెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్న ప్రమాదం కావటంతో కారులో ఉన్న వారెవరికీ గాయాలు కాలేదు. కాగా, గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న వరుణ్ ధావన్ పెళ్లి ఆదివారం జరగనుంది. మరికొన్ని గంటల్లో ప్రియురాలు నటాషా దలాల్తో వరుణ్ కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. అలీభాగ్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాల వారు హోటల్కు చేరుకున్నారు. శనివారం జరిగిన మెహందీ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్యే ఈ వివాహ వేడుక జరగనుంది. చదవండి : ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’ -
హీరో వరుణ్ పెళ్లి: ఇదే ఆఖరిది!
ముంబై: మొత్తానికి వాయిదాలు పడుతూ వచ్చిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి ఎట్టకేలకు నేడు(ఆదివారం) జరగబోతోంది. నెచ్చెలి నటాషా దళాల్ చేయి పట్టుకుని ఆమెతో ఏడడుగులు నడవబోతున్నాడు. వీరి దాంపత్య జీవితానికి శుభారంభం పలికేందుకు అలీభాగ్లోని ద మాన్షన్ హౌస్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు శషాంక్ ఖైతన్, మనీష్ మల్హోత్రా, జోవా మొరానీ, డాలీ సిధ్వానీ(రితేష్ సిద్వానీ భార్య) శనివారమే పెళ్లి మండపానికి చేరుకున్నారు. తాజాగా ఈ పెళ్లి గురించి వరుణ్ అంకుల్, నటుడు అనిల్ ధావన్ మాట్లాడుతూ.. "మేమంతా చాలా ఎగ్జైట్గా ఉన్నాం. ఎందుకంటే మా కుటుంబంలో ఇదే చివరి పెళ్లి. వరుణ్ పెద్దన్నయ్య రోహిత్కు ఇదివరకే పెళ్లైంది. నా పిల్లలకు, అందులో నా పెద్దకొడుకు సంతానానికి కూడా పెళ్లిళ్లైపోయాయి. అంటే వరుణ్ జెనరేషన్లో ఇదే ఆఖరి పెళ్లి" అని చెప్పుకొచ్చారు. కాగా గతంలో కూడా వరుణ్ పెళ్లి డేటును సైతం ఈయనే లీక్ చేశారు. జనవరి 24న వరుణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని, ఆ సమయం కోసం వేచి చూస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..) ఇక వరుణ్ పెళ్లి సందడి విషయానికొస్తే.. శనివారం సంగీత్, మెహందీ వేడుకలు జరగ్గా కరణ్ జోహార్తో కలిసి అలియా భట్, జాన్వీకపూర్, అర్జున్ కపూర్ చిందులేశారు. ఈ సంబరాలను రెట్టింపు చేసేందుకు నేడు సల్మాన్ఖాన్, షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, సాజిద్ నదియాద్వాలా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు ఈ వివాహానికి విచ్చేయనున్నారట. ఇదిలా వుంటే కొత్త పెళ్లికొడుకు వరుణ్ చివరిసారిగా తన స్నేహితులతో బ్యాచిలర్ పార్టీ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: సమ్మర్లో బ్యూటిఫుల్ ‘లవ్స్టోరీ’) -
షాకిచ్చిన హీరో.. ఈ నెల 24న పెళ్లి?!
పది రోజుల క్రితమే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన వివాహం గురించి స్పందించారు. అన్ని బాగుంటే ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సడెన్గా ఈ నెల 24న పెళ్లి ముహుర్తం ఖరారయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల ద్వారా తెలిసింది ఏంటంటే.. ‘‘ఈ నెల 24 ఆదివారం నాడు అలీబాగ్లో వరుణ్ ధావన్ వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇక ఈ నెల 22 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి’’ అని న్యూస్ ఏజెన్సీ పీటీఐకి వెల్లడించారు. ఇక పెళ్లి కుమార్తె ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు వరుణ్ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ నటాశా దలాలే. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..) ఇక వీరిద్దరు గతేడాది మార్చిలోనే వివాహం చేసుకోవాలని భావించారట. కానీ కోవిడ్-19, లాక్డౌన్ కారణంగా వివాహాన్ని ఈ ఏడాదికి వాయిదా వేశారట. మొత్తానికి 2021 వరుణ్ ధావన్ వివాహంతో ప్రారంభం అవుతుంది. ఇక ఎంతమంది వీరి బాటలో నడుస్తారో చూడాలి. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుణ్ ‘జగ్ జగ్ జీయో’ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ కపూర్, నీతూ కపూర్, కియారా అద్వానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
కాలం కలిసొస్తే ఈ ఏడాదే పెళ్లి: హీరో
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి గురించి రెండేళ్ల నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. రేపో మాపో లేదా వచ్చే నెలలో వివాహం జరుగుతుంటూ ఊరిస్తూనే ఉన్నారు. ఎలాగో తన ప్రేయసి నటాషా దలాల్ ఉండనే ఉంది కాబట్టి బయట అడుగు పెడితే చాలు పెళ్లెప్పుడు అన్న ప్రశ్న బాణంలా దూసుకొస్తోంది. దీంతో వరుణ్ తన పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెడతారనే విషయాన్ని వెల్లడించారు. రెండేళ్ల నుంచి ప్రతి ఒక్కరూ నా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రపంచమంతా ఇప్పుడు గందరగోళంగా ఉంది. కాస్త పరిస్థితులు చక్కబడి కాలం కలిసొస్తే తప్పకుండా ఈ ఏడాదే నటాషాతో ఏడడుగులు వేస్తాను అని చెప్పుకొచ్చారు. (చదవండి: రికార్డుల మోత మోగిస్తున్న కేజీఎఫ్ 2 టీజర్) ఇక వరుణ్ తాజాగా నటించిన చిత్రం కూలీ నెం.1లో హీరోయిన్ సారా అలీఖాన్ను ప్రేమలో పడేయడానికి ఆయన చాలా వేషాలే వేశారట. అయితే రియల్ లైఫ్లో కూడా నటాషాను ప్రేమకు ఒప్పించడానికి ముప్పుతిప్పలు పడ్డారట. మూడు, నాలుగు సార్లు నటాషా అతడి ప్రపోజల్ను రిజెక్ట్ చేసిందట. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా నటాషాను ప్రేమలో పడేసి దాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లుతున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్ మాత్రమే కాదు.. అటు రణ్బీర్-అలియా జంట కూడా ఇదివరకే వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టాల్సి ఉంది. కానీ సడన్గా వచ్చిన కరోనా మహమ్మారి వల్ల వారు కూడా లవ్ బర్డ్స్గానే ఉండిపోయారు. అయితే ఎలాగైనా త్వరలోనే పెళ్లిపీటలెక్కుతామని చెప్పారు. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..) -
3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..
ఓ అమ్మాయిని ప్రేమలో పడేయటం అంత వీజీ కాదంటున్నారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ చేసినా పట్టువదలని విక్రమార్కుడిలా నటాశా దలాల్ను ప్రేమలో పడేశానని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం కరీనా కపూర్ నిర్వహిస్తున్న రేడియో షో ‘వాట్ ఉమెన్ వాంట్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రేమ సంగతులు చెప్పుకొచ్చారు.‘‘ నేను తనని మొట్టమొదటి సారి ఆరవ తరగతిలో చూశాను. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయినట్లుగా అనిపించింది. కానీ, మేము అప్పటినుంచి ప్రేమించుకోవటం లేదు. ( నర్స్ నం.1) ఇంటర్ వరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాము. ఆ తర్వాత నేను తనకు ప్రపోజ్ చేశాను. ఆమె నన్ను మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ చేసింది. కానీ, నేను నమ్మకాన్ని కోల్పోలేదు’’ అని అన్నాడు. వరుణ్ ధావన్ తాజా చిత్రం ‘కూలీ నెం.1’. తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సారా అలీఖాన్ కథానాయిక. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా విడుదల కానుంది. -
నటషా పోస్ట్: హార్ధిక్ పాండ్యా 2.o
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా ఆతడి కాబోయే భార్య, నటి నటసా స్టాంకోవిక్ తరచూ వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. గత జులైలో ఈ జంటకు పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి వారి కుమారుడు ఆగస్త్యకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తుంటూరు ఈ జంట. తాజాగా నటషా తన కుమారుడు ఆగస్త్యతో ఆడుకుంటున్న వీడియోను సోమవారం షేర్ చేశారు. ఇందులో ఆగస్త్యతో నటషా మాట్లాడుతూ ఉండే తన ముక్కపై పదే పదే కొడుతున్న వీడియోను రెడ్ హర్ట్ ఎమోజీ క్యాప్షన్తో పంచుకున్నారు. (చదవండి: రెండు నెలల అగస్త్యుడు: నటషా) View this post on Instagram ❤️ A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Oct 25, 2020 at 5:14am PDT ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఆగస్త్య చాలా ముద్దుగా ఉన్నాడు’,‘హార్ధిక్ పాండ్యా 2.o’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నటషా-హార్ధిక్ పాండ్యాలు ఈ ఏడాది జనవరిలో దుబాయ్లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ జంటకు జులై 30న ఆగస్త్య జన్మించాడు. ఇటీవల ఆగస్త్యకు రెండు నెలల నిండాయి అంటూ ఈ జంట వారి ముద్దుల తనయుడు ఫొటోలను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: నటాషా, అగస్త్య ఫోటో షేర్ చేసిన పాండ్యా) -
రెండు నెలల అగస్త్యుడు: నటషా
టిమిండియా ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా కుమారుడు అగస్త్యాకు బుధవారం(సెప్టెంబర్ 30)తో రెండు నెలలు నిండాయి. అగస్త్యాకు రెండులు నెలలు నిండిన సందర్భంగా అతడి తల్లి, హార్థిక్ భార్య నటసా తన కుమారుడి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ‘రెండు నెలల అగస్త్యుడు’ అనే క్యాప్షన్తో నటషా పోస్టు చేశారు. అదే ఐపీఎల్ నేపథ్యంలో దుబాయ్లో ఉన్న హార్థిక్ కూడా తన ముద్దుల తనయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ముంబై ఇండియన్ జెర్సీపై (హ్యాపీ 2 మంథ్స్ అగస్త్యా’ అని రాసి ఉన్న షాట్ ఫొటోను పోస్టు చేశాడు. (చదవండి: నటాషా, అగస్త్య ఫోటో షేర్ చేసిన పాండ్యా) దీనికి ‘నా కుమారుడికి రెండు నెలలు’ అంటూ తన పోస్టును పంచుకున్నాడు. కాగా జులై 30న హార్థిక్ తాను తండ్రినయ్యాను అంటూ సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నటషా పోస్టుకు టిమిండియా బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్తో పాటు టిమిండియా ఆటగాళ్లంతా అగస్త్యకు ఎమోజీలతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ఐపీఎల్ 2020కి హార్థిక్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఆడిన 3 మ్యాచ్లో రెండు పరాజయం పొందింది. View this post on Instagram #2months 💙 Agastya 💙 A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Sep 30, 2020 at 6:06am PDT -
నటాషా, అగస్త్య ఫోటో షేర్ చేసిన పాండ్యా
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, భార్య నటాషా స్టాంకోవిచ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ పలు ఆసక్తికరమైన అంశాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్యూట్ జంట జూలై 30న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన తన కుమారుడికి అగస్త్య అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని హార్ధిక్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. (కెరీర్లో ఇలాంటి గాయాలు సహజమే : హార్దిక్) ప్రస్తుతం ఐపీఎల్ ప్రారంభం కావడంతో హార్ధిక్ దుబాయ్ పయనమయ్యాడు. పాండ్యా ముంబై ఇండియన్స్ టీంలో ఆడుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ముంబై ఇండియన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ను హార్ధిక్ భార్య నటాసా, బేబీబాయ్ టీవీలో తిలకిస్తున్న ఫోటోను హార్ధిక్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ముంబై ఇండియన్స్ను ఉత్సాహపరిస్తున్న ఈ ఫోటోలో నటాసా, అగస్త్యా ముంబై ఇండియన్స్ టీ షర్టులు ధరించి టీవీలో ఐపీఎల్ చూస్తున్నారు. కాగా.. పాండ్యా ఈ పోస్ట్కి క్వీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్.. కోల్కత్తాపై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ విజయం సాధించడం హర్ధిక్కు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది. (పాండ్యా, నటాషా ఫోటోను తొలగించిన ఇన్స్టాగ్రామ్) -
పాండ్యా, నటాషా ఫోటోను తొలగించిన ఇన్స్టాగ్రామ్
ముంబై: క్రికెటర్ హార్దిక్ పాండ్యా ముద్దు పెట్టుకున్న ఒక చిత్రాన్ని డాన్సర్- నటి నటాషా స్టాంకోవిక్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రం తమ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది అంటూ ఇన్స్టాగ్రామ్ తొలగించింది. మంగళవారం నటాషా అదే చిత్రాన్ని స్కీన్షాట్ తీసి మళ్లీ పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోను ఈసారి ఇన్స్టాగ్రామ్ తొలగించలేదు. మొదటిసారి షేర్ చేసిన చిత్రం స్థానంలో ఫోటో స్థానంలో ‘మీ చిత్రం ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ మార్గదర్శకాలకు విరుద్దంగా ఉంది కాబట్టి మీ పోస్ట్ను తొలగించాల్సి వచ్చింది’ అనే మెసేజ్ కనిపిస్తోంది. మొదట పెట్టిన ఫోటోకు మిస్సింగ్ యూ హర్దిక్ పాండ్యా అనే కాప్షన్ పెట్టగా, రెండవసారి పెట్టిన పోస్ట్కు నటాషా ఏ శీర్షికను జోడించలేదు. ఇక ఆ ఫోటోకు హాహా ఐ లవ్ యూ అని హర్దిక్ పాండ్యా కామెంట్ పెట్టాడు. హార్ధిక్పాండ్యా, నటాషాకు ఇటీవల ఒక బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. వారిద్దరికి జూలై నెలలో దుబాయ్లో నిశ్చితార్థం జరిగింది. ఇక తను తండ్రిగా తన కొడుకుతో ఎంజాయ్ చేస్తున్నానని అందుకు సంబంధించిన అనేక విషయాలను పాండ్యా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. క్రికెట్ విషయానికి వస్తే సెప్టెంబర్లో దుబాయ్లో జరగనున్న ఐపీఎల్లో హార్ధిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. చదవండి: ఖేల్ రత్నకు రోహిత్ శర్మ నామినేట్ -
గుజరాత్ ఆస్పత్రిలో హార్దిక్ సెలబ్రేషన్స్
గాంధీ నగర్: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రేయసి నటాషా జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ప్రపంచంలోకి తమ కొడుకును తీసుకువచ్చినందుకు ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ హార్దిక్ దంపతులు వేడుక చేసుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టుగా జూనియర్ హార్దిక్ ముంబైలో జన్మించలేదు. గుజరాత్లోని ఆనంద్లో ఆకాంక్ష ఆసుపత్రిలో పుట్టాడు. సురక్షితంగా అతడిని తమ చేతుల్లో పట్టిన వైద్యులకు హార్దిక్ దంపతులు ధన్యవావాదాలు తెలుపుతూనే, తమ జీవితాల్లోకి అడుగు పెట్టిన బుడ్డోడికి స్వాగతం పలుకుతూ అదే ఆసుపత్రిలో సెలబ్రేట్ చేసుకున్నారు. (తండ్రైన హార్దిక్ పాండ్యా..) వైద్యుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. ఈ మేరకు పలు ఫొటోలను హార్దిక్ ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. కాగా దుబాయ్లోని యాచ్లో హార్దిక్.. నటాషాకు తన ప్రేమ విషయం వెల్లడించారు. ఆమె ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఏడాది జనవరిలో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. కాగా బాలీవుడ్ నటిగా రాణిస్తోన్న నటాషా 'బిగ్బాస్ 8' రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఆమె చివరిసారిగా టీవీ నటుడు ఏలీ గోనీతో కలిసి 'నాచ్ బలియే 9' డ్యాన్స్ షోలో పాల్గొన్నారు. (నా గులాబీకి గులాబీలు: హార్దిక్) View this post on Instagram Special thanks to Akanksha hospital in Anand! Last one week you guys made sure we have our home away from home! @niketunited @drmolinapatel @dr.nayanapatel you guys are absolute gems 🙏🏾❤️ Bringing my baby in this world! Will be grateful forever 🙏🏾 A post shared by Hardik Pandya (@hardikpandya93) on Aug 5, 2020 at 2:38am PDT -
నా గులాబీకి గులాబీలు: హార్దిక్
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రి అయ్యాడు. గత గురవార హార్దిక్ భార్య నటాషా స్టాన్కోవిచ్ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే తన కొడుకు ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో భార్య నటాషాతో పాటు ఉన్న ఫోటోను షేర్ చేశాడు హార్దిక్. గులాబీ బోకేను బెడ్పై ఉంచి భార్యను ఆలింగనం చేసుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అదే సమయంలో భార్యను పొగడ్తలతో ముంచెత్తుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘ నా గులాబీకి గులాబీలు.. నేను ఎప్పటికీ గుర్తిండిపోయే ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన నీకు(నటాషా) ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ జోడించాడు.(బెయిర్స్టో ధనాధన్ ఇన్నింగ్స్) తాను తండ్రి అయిన విషయాన్ని హార్దిక్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘మేము కుమారుడితో ఆశీర్వదించబడ్డాము’ అని హార్దిక్ తండ్రి అయిన విషయాన్ని వెల్లడించాడు. ఆపై శనివారం కుమారుడి ఫోటోను కూడా హార్దిక్ పోస్ట్ చేశాడు. తన కొడుకును చూసుకుని మురిసిపోతూ ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. హార్దిక్, నటాషా జోడి ఈ ఏడాది జనవరి 1న తమ నిశ్చితార్థం జరిగినట్టు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 31న తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని తెలియజేశారు.(వద్దు సార్.. జట్టును నాశనం చేస్తాడు!) View this post on Instagram Roses for my rose 🌹 Thank you for giving me the best gift ever 🙏🏾❤️ A post shared by Hardik Pandya (@hardikpandya93) on Aug 2, 2020 at 7:52am PDT -
కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేసిన హార్దిక్
ముంబై : భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, తన గర్ల్ఫ్రెండ్, సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్కు ఇటీవల పండంటి బాబు జన్మించిన విషయం తెలిసిందే. కుమారుడి చేతిని పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని హార్థిక్ పాండ్యా స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తాజాగా తన చిన్నారి కొడుకును ప్రేమతో చేతుల్లోకి తీసుకొని ఆనందంగా చూస్తున్న ఫోటోను శనివారం అభిమానులతో పంచుకున్నాడు. ‘దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం’ అంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో హార్దిక్కు ప్రముఖులు, క్రికెటర్స్, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనేకమంది హార్దిక్ పోస్టుకు లైకులు, కామెంట్లు చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారింది. (తండ్రైన హార్దిక్ పాండ్యా..) The blessing from God 🙏🏾❤️ pic.twitter.com/xqcmbVIUIr — hardik pandya (@hardikpandya7) August 1, 2020 కాగా జనవరి 1న నటాషాతో నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్.. మే 31న తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి నటాషా, తనకు చెందిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. అయితే పెళ్లి కాకుండానే తండ్రి అయిన భారత క్రికెటర్పై కొంత మంది మండిపడ్డారు. అయినప్పటికీ హార్దిక్ దీనిపై స్పందించలేదు. ఇదిలా ఉండగా నటాషాతో ప్రేమ గురించి హార్దిక్ పాండ్యా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఒక పార్టీలో అర్ధరాత్రి సమయంలో నేను టోపీ, చైన్, వాచ్తో కనిపించడాన్ని చూసిన నటాషా.. ఈ వింత మనిషి ఎవరని అనుకుందట. నేను ఎవరో అప్పటి వరకూ నటాషాకి తెలియదు. తనతో మాట్లాడిన తర్వాతే.. ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. ఆ వెంటనే డేటింగ్, ఎంగేజ్మెంట్ జరిగిపోయాయి. అని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. ('ఎన్ని వైరస్లు వచ్చినా మేం భయపడం') -
తండ్రైన హార్దిక్ పాండ్యా..
ముంబై : భారత క్రికెట్ జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయ్యాడు. అతనికి కాబోయే భార్య నటాషా స్టాన్కోవిచ్ గురువారం పండంటి బాబుకు జన్మనించారు. ఈ విషయాన్ని హార్దిక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, కృనాల్ పాండ్యా, సారా టెండూల్కర్, సోనాల్ చౌహాన్.. సహా పలువురు ప్రముఖులు కూడా హార్దిక్, నటాషా జంటకు కంగ్రాట్స్ తెలిపారు. మరోవైపు అభిమానులు జూనియర్ హార్దిక్ వచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు. (నటాషా.. అంత గ్లో ఎలా వచ్చింది?) హార్దిక్, నటాషా జోడి ఈ ఏడాది జనవరి 1న తమ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 31న తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తమ కుటుంబంలోకి మూడో వ్యక్తి రాక కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. తమ జీవితంలో ఈ కొత్త దశ ఎంతో థ్రిల్లింగ్గా ఉందన్నారు. ఈ సమయంలో అభిమానుల ఆశీస్సులు, ప్రేమ కావాలని కోరారు. (ధోనిపై ఒత్తిడి ఎంత ఉందో అప్పుడే తెలిసింది) -
హార్ధిక్ పాండ్యా-నటాషా ఫోటోలు
-
నటాషా.. అంత గ్లో ఎలా వచ్చింది?
ముంబై: భారత క్రికెట్ జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. తన కాబోయే భార్య నటాషా స్టాన్కోవిచ్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందనే విషయాన్ని ఇటీవల హార్దిక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కాగా, తాజాగా నటాషాతో ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ప్రేయసి నటాషాను పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రధానంగా నటాషా ముఖంలో వచ్చే మెరుపును ఉద్దేశించి హార్దిక్ కామెంట్ చేశాడు. ఏయ్ నటాషా.. ‘ నీ ముఖంలో గ్లోకు కారణం ఏమిటి. అది ఎక్కడ నుంచి వస్తుంది’ అని ప్రశ్నించాడు. దానికి నటాషా ఒక క్యూట్ సమాధానం ఇచ్చారు. ఇక్కడ క్రెడిట్ అంతా హార్దిక్ పాండ్యాకే ఇచ్చారు నటాషా. ‘ నీ ప్రేమ.. వాత్సల్యమే నా ముఖం వచ్చిన గ్లోకు కారణం’ అని తెలివిగా రిప్లై ఇచ్చారు. (‘రైజర్స్’తోనే నేర్చుకున్నా... ) గత నెలలో తాను తండ్రిని కాబోతున్నాననే విషయాన్ని హార్దిక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది’ అని హార్దిక్ పేర్కొన్నాడు. కాకపోతే వీరు పెళ్లి చేసుకున్నారో లేదా అనేది మాత్రం సస్పెన్స్. గుజరాత్కు చెందిన 26 ఏళ్ల హార్దిక్ పాండ్యా 2016లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టి20 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది సెప్టెంబర్లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్ ‘ఎ’ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, చివరి నిమిషంలో హార్దిక్ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు ఎంపికైనా అది కరోనా వైరస్ కారణంగా జరగలేదు. కాగా, హార్దిక్ తన ఫిట్నెస్ను నిరూపించుకునే క్రమంలో రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్ టీ20 కప్లో రిలయన్స్-1 తరఫున ఆడిన హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బీపీసీఎల్తో జరిగిన మ్యాచ్లో 39 బంతుల్లో సెంచరీ సాధించిన హార్దిక్.. ఓవరాల్గా 55 బంతుల్లో 20 సిక్స్లు, ఆరు ఫోర్లతో 158 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. దాంతో టీ20 ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత రికార్డు నమోదు చేసిన భారత క్రికెటర్గా హార్దిక్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు కాగ్తో జరిగిన మ్యాచ్లో కూడా బ్యాట్కు పనిచెప్పాడు. ఇక్కడ కూడా 39 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్స్లు, 8 ఫోర్లు ఉండటం విశేషం. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాతో జరిగిన తన రీఎంట్రీ ఆరంభపు మ్యాచ్లో 25 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్స్లతో 38 పరుగులు సాధించి సత్తా చాటాడు. (‘నల్లవారిని’ నిరోధించేందుకే...) -
నటాషా సీమంతం ఫొటో వైరల్!
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తనకు కాబోయే భార్య నటాషా స్టాన్కోవిచ్ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుందనే శుభవార్తను అభిమానులతో పంచుకున్న నాటి నుంచి.. వరుసగా ఫొటోలు షేర్ చేస్తున్నాడు ఈ స్టార్ క్రికెటర్. ఇక తాజాగా నటాషా కూడా ఓ అందమైన ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘‘మమ్మీ టు బీ’’అనే అక్షరాలున్న వైట్ కలర్ థీమ్ డెకరేషన్ చూస్తుంటే.. నటాషా బేబీ షవర్ నిర్వహించినట్లు తెలుస్తోంది. హార్దిక్, నటాషాలతో పాటు ఫొటోలో ఉన్న మూడు కుక్క పిల్లలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముచ్చటైన కుటుంబం మీది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.(అప్పుడే డేటింగ్ మొదలు : హార్దిక్) కాగా ఈ ఏడాది ప్రారంభంలో సెర్బియా మోడల్ నటాషాతో పాండ్యా ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఈ జంట ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఇద్దరూ మెడలో పూలమాలలతో ఉన్న ఫొటోను షేర్ చేయడంతో వాళ్లిద్దరి పెళ్లి జరిగిపోయిందని అభిమానులు భావిస్తున్నారు. అయితే పాండ్యా ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక 26 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టి20 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా వెన్ను నొప్పికి శస్త్రచికిత్స తర్వాత టెస్టు క్రికెట్ ఆడటం తనకు సవాలేనని.. పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టుకు తన అవసరమున్నందున సుదీర్ఘ ఫార్మాట్ కోసం తాపత్రయపడి ప్రమాదం కొనితెచ్చుకోనని హార్దిక్ ఇటీవల వెల్లడించాడు. View this post on Instagram 🌍 ❤️ A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Jun 8, 2020 at 7:34am PDT -
అప్పుడే డేటింగ్ మొదలు : హార్దిక్
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తనకు కాబోయే భార్య నటాషా స్టాన్కోవిచ్ల ప్రేమ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ఇప్పటికే తన ప్రేయసి తల్లి కాబోతుందంటూ షాకింగ్ విషయాన్ని పంచుకున్న పాండ్యా వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే రహస్యాన్ని క్రిక్బజ్ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు. తనుకు తానుగా నటాషాతో మాట్లాడే వరకు తాను ఎవరో కూడా ఆమెకు తెలీదని హర్ధిక్ చెప్పాడు. ఆమెతో మొదట తానే మాటలు కలిపానని, ఆ తరువాత ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం, డేటింగ్ వరకు తీసుకెళ్లిందని ప్రేమ రహస్యం గుట్టు విప్పాడు. అయితే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నెత్తిన టోపీ, మెడలో చైన్, వాచ్తో కనిపించడాన్ని చూసి.. ఈ వింత మనిషి ఎవరు? అని నటాషా అనుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. (తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా) ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అనుబంధ మరింత పెరగడంతో డిసెంబర్ 31న తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు హర్ధిక్ వెల్లడించారు. అయితే ఒక్క రోజు ముందు రాత్రి ఆ విషయాన్ని సోదరుడు కృనాల్ పాండ్యాతో పంచుకున్నట్లు తెలిపాడు. నటాషా విషయంలో తన కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని, తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులంతా గౌరవించారని పాండ్యా చెప్పుకొచ్చాడు. -
నా ప్రేయసి ప్రెగ్నెంట్ : హర్దిక్
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిమానులకు శుభవార్తను తెలిపాడు. తన ప్రేయసి నటాషా స్టాన్కోవిచ్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు నటాషాతో దిగిన తాజా ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆదివారం సాయంత్రం పోస్ట్ చేశాడు. తనతో జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందున్నా అని, ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్ నటాషా స్టాన్కోవిచ్ను హార్దిక్ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్లో వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నారు. ఇక హర్దిక్ పోస్ట్కు స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రీతో పలువురు క్రికెటర్లు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. -
నటాషా హిందీకి సిగ్గుపడిన హార్ధిక్ పాండ్యా!
భారత క్రికెటర్ హార్ధిక్ పాండ్యా లాక్డౌన్ నేపథ్యంలో తన కాబోయే భార్య నటాషా స్టాన్వికోవిచ్తో కలిసి ఇంట్లో సరదాగా గడుపుతూ.. సందడి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఈ జంట తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నటాషాకు హిందీ నేర్పిస్తున్న హార్ధిక్ పాండ్యా ఓ సరదా వీడియోను మంగళవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ‘బేబీ.. నేను నీకు ఏమౌతాను’ అని అడగ్గా దానికి నటషా వచ్చిరాని హిందీలో సమాధానం ఇచ్చింది. ఇక నటాషా సమాధానంతో హార్ధిక్ సిగ్గుపడుతున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (‘ఆసక్తికర చర్చ మొదలెట్టి.. ముగించేశాడు’) View this post on Instagram @hardikpandya93 blood💥💯#hardikpandya #nature #nature #naturalhairstyles #naturephotography #photo #photographer #photography #photooftheday #photoshoot #photographylovers #photoshop A post shared by hardikpandya_93 🔵 (@hardikpandya_93_blood) on Apr 12, 2020 at 7:15pm PDT కాగా ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలో భాగంగా దుబాయ్ వెళ్లిన ఈ ఆల్రౌండర్ అక్కడే సెర్బియా నటి నటాషాను నిశ్చితార్థం చేసుకున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సెలబ్రిటీలకు విరామ సమయం దొరికేసరికి ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న ఫొటోలను, వీడియోలను తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. (‘జోమాటో మాదిరిగా ఎందుకు పనికి రానన్నారు’) -
నిశ్చితార్థం గురించి మాకు తెలీదు: పాండ్యా తండ్రి
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి, మోడల్ నటాషా స్టాన్కోవిచ్ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్ వెళ్లిన ఈ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. తన నిశ్చితార్థం గురించి హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫొటోలు పోస్ట్ చేశాడు. వీరిద్దరికీ సంబంధించిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యువ జంటకు ధోని, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అజయ్ జడేజా వంటి వారు శుభాకాంక్షలు తెలిపారు. (సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం) ఈ విషయం ఫ్యాన్స్తో పాటు పాండ్యా తల్లిదండ్రులను సైతం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా పలు ఆసక్తికరమైన విషాయాలను మీడియాతో పంచుకున్నారు. ‘పాండ్యా, నటాషా నిశ్చితార్థం చేసుకుంటారని మాకు అస్సలు తెలీదు. నిశ్చితార్థం అయిన తరువాత విషయం తెలిసింది. అయితే వారిద్దరూ ప్రేమలో ఉన్నారన్న విషయం మాత్రం మాకు ముందే తెలుసు. నూతన సంవత్సర వేడుకలకు దుబాయ్ వెళ్తున్నారన్న సమాచారం మాకు ఉంది. నటాషా చాలా మంచి అమ్మాయి. వాళ్ల కుటుంబ సభ్యులతో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఆమెను మేం కలిశాం. వారిద్దరి పెళ్లి ఎప్పుడు చేయాలో ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే మంచి ముహూర్తం పెడతాం’ అని పేర్కొన్నారు. -
హార్దిక్కు కాబోయే భార్య గురించి..
ముంబై: సెర్బియా నటి నటాషా స్టాన్వికోవిచ్ మంచి మనిషి అని హార్దిక్ పాండ్యా మాజీ ప్రియురాలు, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వసి రౌతేలా అన్నారు. నటాషాను ఒక్కసారి మాత్రమే ముఖాముఖి కలిశానని ఆమె వెల్లడించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్లో మంగళవారం మోడల్ నటాషా స్టాన్కోవిచ్, పాండ్యా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఊర్వశి రౌతేలా ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పాగల్పంటి సినిమా ప్రమోషన్లో ఒకసారి నటాషాను కలిశానని, ఆ సమయంలో తామిద్దరం వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోలేదని ఊర్వశి రౌతేలా వెల్లడించారు. నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్, నటాషా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు చెప్పారు. అంతేకాదు వారిద్దరికీ అవసరమైనప్పుడు ఎటువంటి సాయం కావాలన్నా చేయడానికి సిద్ధం ఉన్నానని భరోసాయిచ్చారు. హార్దిక్, నటాషాలకు క్రికెటర్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నటాషా మాజీ ప్రియుడు, టీవీ నటుడు అలై గోని కూడా హార్ట్సింబల్ను (ఎమోజీ) పోస్ట్ చేసి విషెస్ చెప్పాడు. హార్దిక్, నటాషా పెళ్లెప్పుడనేది ఇంకా ప్రకటించలేదు. -
ఈ మూడు ముక్కల్లో ఎక్కడైనా లవ్ ఉందా?!
విడిపోడానికి ఒప్పందం చేసుకుని పెళ్లికి సిద్ధమైన దొంగముఖంలా హార్ధిక్ పాండ్యా మీక్కనిపిస్తే కనుకఈ ఏడాది మీరు మరి కాస్త మంచి మనసుతో మనుషుల్నిఅర్థం చేసుకోడానికి ప్రయత్నించడం అవసరమేమో! జనవరి1న జరిగిన హార్ధిక్, నటాషాల నిశ్చితార్థం వీడియో,ఫొటోలు హార్ధిక్ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే కనిపించడంమీ అనుమానానికి మొదటి కారణం అయి వుండొచ్చు.అతడి ప్రియురాలైన నటాషా తన ఇన్స్టాగ్రామ్లోవాటిని ఎందుకు పోస్ట్ చేయలేదని శంకించడం మాని..ఒకసారి మళ్లీ ఆ వీడియోను తిలకించండి. పూలు, బెలూన్లు, గిటార్ ప్రణయ గీతాలాపనలతో అలంకృతమై ఉన్న స్పీడ్బోటు (యాట్) అరేబియన్ జలాల మీద తేలియాడుతుండగా.. నటాషా వేలికి రింగును తొడిగాడు హార్ధిక్. రింగు తొడుగుతుండగా, తొడిగేముందు, తొడిగిన తర్వాత హార్ధిక్ పట్టలేని సంతోషాన్ని మీరు ఎన్నిసార్లయినా ఈ వీడియోలో చూడవలసిందే. హార్ధిక్ వయసు 26. నటాషా వయసు 27. కొత్తగా పెళ్లయిన కోడె వయసు జంట.. కొన్నాళ్ల వరకైనా నిదురే పోరాదంట. (ఇలా అని.. ‘జీవనజ్యోతి’ సినిమాలో శోభన్బాబు పాడతాడు). ఇంకా ప్రేమ జంటే కనుక, నిశ్చితార్థం అయినా, వివాహ మహోత్సవానికి ముహూర్తం ఫిక్స్ కాలేదు కనుక.. ఎవరి నిద్ర వాళ్లు పోవలసిందే. ‘మైయ్ తేరా, తూ మేరా జానే, సారా హిందూస్థాన్’ అన్నాడు హార్ధిక్ ఇన్స్టాగ్రామ్లో.. నటాషా పక్కన తనున్న ఫొటోను షేర్ చేస్తూ. నటాషా ఎడమ చేతి గోళ్లకున్న ఎర్ర రంగు, ఆమె కుడి చేతి వేళ్లకు షాంపేయ్ గ్లాస్.. ఇవే బ్రైట్గా ఉన్నాయి ఆ ఫ్రేమ్ మొత్తం మీద. హార్ధిక్ ఏమైనట్లు మరి! ఫొటోలో ఉన్నా తన లోకంలో తను ఉన్నాడు. ఎక్కడుంది తన లోకం? ఇంకెక్కడా.. నటాషాలోనే. ముందు మీరు ప్రతిదాన్నీ సందేహించడం మానండి. వీళ్లిద్దరే కాదు ‘యాట్’లో ఉన్నది. ఫ్రెండ్స్, హార్ధిక్ కుటుంబ సభ్యులు ఒకరిద్దరు ఉన్నారు. నటాషా వైపు పెద్దగా ఎవరూ రాలేదు. రాలేదో, వచ్చేంత టైమ్ని ఈ ప్రేమికుడు ఇవ్వలేదో! వీడియో మొత్తం మీద కనిపిస్తున్నవి హార్ధిక్ విలాసాలు, ఉల్లాసాలే! హత్తుకుంటాడు. ముద్దు పెట్టుకుంటాడు. రెండు వేళ్లెత్తి చూపమంటాడు. నటాషా చిన్న స్మైల్ మాత్రం ఇస్తోంది. అతడు చెప్పినట్టల్లా చేస్తుంది. అమ్మాయి కదా.. ఆ మాత్రం బిడియం ఉండటం కూడా పెళ్లి కళే. పెళ్లి సరే.. వీళ్లిద్దరి ప్రేమకళ ఇన్నాళ్లూ ఎక్కడా కనిపించలేదే! హార్ధిక్ అంటూనే ఉన్నాడు.. ‘నటాషా మై లవ్, నటాషా మై లైఫ్’ అని. ఎవర్నమ్ముతారు? నటాషా నమ్మిందేమో. ‘కాఫీ విత్ కరణ్’ షోలో హార్ధిక్ చేసిన ‘షో’ చూసినవాళ్లెవరూ, విన్నవాళ్లెవరూ అతడికి పిల్ల దొరుకుతుందంటే, పెళ్లవుతుందంటే నమ్మరు. ఇదిగో.. పోయిన ఏడాది ఇదే జనవరిలోనే పెద్ద కాంట్రావర్సీ! ‘షో’ జనవరి ఆరున ప్రసారం అయింది. హార్ధిక్ అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. జనవరి పదమూడున బిసిసిఐ నుంచి అతడికి ఫోన్ వెళ్లింది. ‘ఇక ఆడింది చాలు, వెనక్కి వచ్చేయ్’ మని! ఆట నుంచి సస్పెండ్ అయ్యాడు. ట్విట్టర్లో చెంపలు వేసుకున్నా క్రికెట్ కంట్రోల్ బోర్డు కరుణించలేదు. ఎలా కరుణిస్తుంది? నా అంత మగాడు లేడని కరణ్ షోలో చొక్కా బటన్లు విప్పుకున్నాట్లుగా.. ఒళ్లు తెలీకుండా డప్పాలు కొట్టుకుంటేను హార్ధిక్. నేనిన్ని సిక్సర్లు కొట్టాను, నేనన్ని వికెట్ల లేపాను అని చెప్పుకుంటే ‘ఓహ్.. గ్రేట్’ అనుకునేవాళ్లు మళ్లొకసారి. ఇంతమంది అమ్మాయిల్ని పైకి లేపాను, అంతమంది అమ్మాయిల్ని పడగొట్టాను. పడగొట్టి, పైకి లేపి ఇంటికొచ్చి మా డాడీకి కూడా చెప్పాను అన్నాడు. షో హోస్ట్ కరణ్ ఒకటే నవ్వు. ఆ నవ్వు చూసి హార్ధిక్ మళ్లీ రెచ్చిపోవడం. అమ్మాయిలంటే బొమ్మలే అన్నట్లు మాట్లాడాడాడు. ఈ హిస్టరీ అంతా ఇప్పుడు తవ్వడం పెళ్లి చెడగొట్టడమే. పెళ్లి చెడిపోతే బాగుండునని అనుకోవడమే. హార్ధిక్ మారాడేమో! ప్రేమకు మార్చే శక్తి లేకున్నా.. పెళ్లికి ఉంటుంది. ఇప్పటికే మార్చేసిందో, పెళ్లి తర్వాత ఎలా మార్చేస్తాను కదా అనుకుందో నషాటా నవ్వును తప్ప మాటను పెదవి దాటనివ్వడం లేదు. ఇంతవరకు ఒక్కసారిగా కూడా ‘ఐ లవ్ హిమ్’ అని ఆమె బయట పడలేదు. అక్టోబర్ 11న హార్ధిక్ బర్త్డే అయింది. అప్పుడు కూడా ఆమె.. క్రికెటర్గా అతడి గొప్పతనం గురించి మాట్లాడింది తప్ప గొప్ప ప్రియతముడు అని ఎక్కడా అనలేదు. హార్ధిక్ బర్త్డేకే ఆమె ఇచ్చిన స్పెషల్ మెసేజ్ ఎలా ఉందో చూడండి!! ‘‘నా ఆప్తమిత్రుడికి. శక్తిమంతుడికి, అత్యంత అందమైన మనసుగలవాడికి... ఈ ఏడాది ఎన్నో ఎత్తుపల్లాలు చూశావు. గొప్పవింకా చాలా జరుగుతాయి నీ జీవితంలో. అన్నీ గొప్పవి కాకున్నా అవి నిన్ను మానసికంగా బలాఢ్యుడిని చేస్తాయి.’’ ఈ మూడు ముక్కల్లో ఎక్కడైనా లవ్ ఉందా?! అయినా ఆడవాళ్ల ప్రేమ పైకి కనిపించదని అంటారు. హార్ధిక్ అదృష్టవంతుడనే అనుకోవాలి. విరాట్ కోహ్లీ కూడా ‘కంగ్రాట్స్ హార్ధిక్’ అనేశాడు. అమ్మాయి లక్షణంగా ఉంది. అబ్బాయిలో ఏవైనా అవలక్షణాలుంటే వాటిని పోగొట్టేలానూ ఉంది. మంచి విషయమే. మంచిది నాయనా. మంచిది తల్లీ. చల్లగా సంతోషంగా ఉండండి. ఎవరీ అమ్మాయి? సెర్బియా అమ్మాయి. పూర్తి పేరు నటాషా స్టాంకోవిక్. నటనలో కెరీర్ని మలుచుకునేందుకు 2012లో ఇండియా వచ్చింది. మొదట ఫిలిప్స్, క్యాడ్బరీ, టెట్లీ, జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులకు మోడల్గా చేసింది. ‘సత్యాగ్రహ’ ఆమె తొలి సినిమా. ఇప్పటి వరకు మొత్తం పది సినిమాలు. రెండు టెలివిజన్ షోలు, ఒక వెబ్ సిరీస్, మూడు మ్యూజిక్ వీడియోలు. ఇదీ ఆమె కెరీర్. వీళ్లిద్దరి మధ్య (నటాషా, హార్ధిక్) ప్రేమ ఎప్పుడు అంకురించిందనేది ఇప్పటికీ రహస్యమే. ముంబైలో ఉంటున్న హార్ధిక్ తల్లి దండ్రులకు కూడా మొన్న దీపావళికే ఈ సంగతి తెలిసింది. ఇంటికి తీసుకెళ్లి నటాషాను పరిచయం చేశాడు హార్ధిక్. హార్థిక్ పాండ్యా వరుడిది.. సారీ, గురుడిది గుజరాత్. సూరత్లో పుట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెటర్. ఆల్ రౌండర్. రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మన్. టీ ట్వంటీలు, వన్డేలు, టెస్ట్ మ్యాచ్లు చాలా ఉన్నాయి కెరీర్లో. ఉన్న చోట ఉండడు. ఒకడే ఉండడు. చుట్టూ ఫ్రెండ్స్. నటాషా హార్ధిక్ను ఎంతగా అభిమానిస్తుందో అతడి అభిమానుల్నీ అంతగా రెస్పెక్ట్ చేస్తుంది. ఇక హార్ధిక్ తల్లిదండ్రుల్ని ఎలా చూసుకుంటుందో చెప్పాలా?! -
'మా క్రేజీ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం'
నూతన సంవత్సరం రోజున టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా హార్దిక్, నటాషాలు దుబాయ్లో స్పీడ్ బోట్లో విహరిస్తూ నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను పాండ్యా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా నిశ్చితార్థంపై ట్విటర్లో స్పందించాడు. ' మొదట హార్దిక్, నటాషాలకు నా బిగ్ కంగ్రాట్స్. నటాషా మీకు మా కుటుంబంలోకి స్వాగతం. నటాషా నీవు మా క్రేజీ ఫ్యామిలీతో కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ టూ మ్యాడ్నెస్.. లవ్ బోత్ ఆఫ్ యూ గాయ్స్' అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కృనాల్ దంపతులతో పాటు హార్దిక్, నటాషాలున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేశాడు. అంతకుముందు కోహ్లి దంపతులు, ధోని దంపతులు, టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, ఇషాన్ కిషన్ తదితర ఆటగాళ్లు హార్దిక్, నటాషాలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పితో బాధపడుతూ బంగ్లాదేశ్, వెస్టిండీస్లతో జరిగిన వన్డే, టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. రానున్న శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లకు కూడా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఎంపిక చేయలేదు. కానీ న్యూజిలాండ్ టూర్లో ఆడనున్న ఇండియా-ఏకు మాత్రం హార్దిక్ పాండ్యా పేరును బీసీసీఐ ప్రకటించింది. (చదవండి : సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం) Big, big, congratulations @hardikpandya7 and Natasa ❤🤗 Natasa, we're so happy to have you join our crazy fam ❤ Welcome to the madness!! Love both of you guys 🤗 pic.twitter.com/iKFAbqyl42 — Krunal Pandya (@krunalpandya24) January 2, 2020 -
పాండ్యా, నటాషా నిశ్చితార్థం.. మాజీ ప్రియుడి స్పందన
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా సెర్బియా నటి, మోడల్ నటాషా స్టాన్కోవిచ్ త్వరలోనే వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్లో మంగళవారం వీరిద్దరు తమ రింగ్స్ మార్చుకున్నారు. అనంతరం నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘నా మెరుపుతీగతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాను’ అని హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫొటోలు పోస్ట్ చేశాడు. వీరిద్దరికీ సంబంధించిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నటాషా మాజీ ప్రియుడు, టీవీ నటుడు అలై గోని స్పందించాడు. వీరిద్దరికి హార్ట్సింబల్ను (ఎమోజీ) బహుమతిగా పోస్ట్ చేశాడు. ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా కేవలం హార్ట్ సింబల్ను మాత్రమే షేర్ చేశాడు. గతంలో కొంతకాలం నటాషా, గోని ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. (నటాషాతో హార్దిక్ పాండ్యా ఎంగేజ్మెంట్) ఈ యువ జంటకు ధోని, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అజయ్ జడేజా వంటి వారు శుభాకాంక్షలు తెలిపారు. స్వతహాగా మంచి డాన్సర్ అయిన నటాషా.. ‘సత్యాగ్రహ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బిగ్ బాస్ 8 లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే వీరి వివాహం జరుగనుంది. -
వాటే సర్ప్రైజ్ హార్దిక్: కోహ్లి
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా- ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి నటాషా స్టాన్కోవిచ్ల జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. దీనిలో భాగంగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఎటువంటి ఆర్భాటం లేకుండా జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్లో మంగళవారం స్పీడ్ బోట్లో విహరిస్తూ వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘నా మెరుపుతీగతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాను’ అని హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నటాషాతో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు పోస్ట్ చేశాడు. కాగా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే వీరు నిశ్చితార్థం చేసుకోవడంతో ఇది ఫ్యాన్స్తో పాటు క్రికెటర్లకు సైతం కాస్త ఆశ్చర్చం కల్గించింది. హార్దిక్-నటాషాల నిశ్చితార్థం జరగడంతో పలువురు క్రికెటర్లు విషెస్ తెలియజేశారు. టీమిండియా కెప్టెన్ కోహ్లి ‘వాటే సర్ప్రైజ్ హార్దిక్’ అంటూ అభినందనలు తెలిపాడు. కంగ్రాట్స్ హార్దిక్. వాటే ప్లెజెంట్ సర్ప్రైజ్. మీ భవిష్యత్తు మరింత బాగుండాలి’ అంటూ విష్ చేశాడు. ఇక టీమిండియా ఓపెనర్, హార్దిక్కు అత్యంత సన్నిహితుడు కేఎల్ రాహుల్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్, లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లు అభినందించారు. మరొకవైపు బాలీవుడ్ స్టార్స్ సునీల్ శెట్టి, అతియా శెట్టి, సోనల్ చౌహాన్లు కూడా హార్దిక్కు విషెస్ తెలిపారు.(ఇక్కడ చదవండి: నటాషాతో హార్దిక్ పాండ్యా ఎంగేజ్మెంట్) గత సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత వెన్ను నొప్పితో హార్దిక్ ఆటకు దూరమయ్యాడు. లండన్లో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టిన హార్దిక్.. పునరాగమనం కోసం వెయిట్ చేస్తున్నాడు. స్టాన్కోవిచ్తో హార్దిక్ ప్రేమాయణం నడుపుతున్నాడనే విషయం ఇటీవలే వెలుగు చూసింది. వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారనే వార్త గత ఏడాది నవంబర్ నెలలో మీడియా సర్కిల్స్లో చక్కర్లు కొట్టింది. గతంలో చాలామంది అమ్మాయిలతో తన ఎఫైర్లను డేటింగ్ వరేకే పరిమితం చేసిన హార్దిక్.. నటాషాత ప్రేమాయణాన్ని సీరియస్గానే తీసుకున్నాడు.. ఈ ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరికీ పరిచయం కూడా చేశాడు. నటాషాను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టే వారి వ్యవహారం ఇంటివరకూ వచ్చిందనే టాక్ను నిజం చేసి చూపించాడు హార్దిక్. -
నటాషాతో హార్దిక్ పాండ్యా ఎంగేజ్మెంట్
-
ప్రేయసితో హార్దిక్ పాండ్యా ఎంగేజ్మెంట్
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు, సెర్బియా మోడల్ నటాషాతో పెళ్లికి సిద్ధమయ్యాడు. నూతన సంవత్సరం తొలిరోజే తన ప్రేయసి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఎంగేజ్మెంట్ రింగ్తో ఫొటోలకు ఫోజులిస్తున్న నటాషాను హత్తుకున్న ఫొటోను షేర్ చేసిన హార్దిక్... ‘ నేను నీ వాడిని. నువ్వు నా దానివి ప్రియా’ అంటూ పాట రూపంలో తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. ఇక నటాషా సైతం హార్దిక్ తనకు రింగ్తో ప్రపోజ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి.. ‘ ఎల్లప్పుడూ అవుననే చెబుతాను’ అంటూ క్యాప్షన్ జతచేశారు. దీని ప్రకారం ఈ ప్రేమ జంట సముద్రంలో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హార్దిక్- నటాషా జంటకు లక్షల్లో లైకులు వచ్చిపడుతున్నాయి. క్షణాల్లోనే హార్దిక్ పాండ్యా పోస్టు వైరల్గా మారింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సహా పలువురు టీమిండియా క్రికెటర్లు హార్దిక్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గతంలో చాలామంది అమ్మాయిలతో హార్దిక్ డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నటాషాతో మాత్రం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడని.. తనతో వివాహ బంధానికి సిద్ధమయ్యాడంటూ అతడి సన్నిహితులు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం హార్దిక్.. ఎంగేజ్మెంట్తో నూతన సంవత్సరాన్ని ప్రారంభించి మధురానుభూతులను సొంతం చేసుకున్నాడు. ఇక నటాషా విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ముంబైలో నివాసముంటున్నారు. ఐటం గర్ల్గా తొలుత బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నటాషా.. షారుక్ ఖాన్, అనుష్క నటించిన ‘జీరో’ సినిమాలో ఓ పాత్ర కూడా పోషించారు. అదే విధంగా... హిందీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ రియాలిటీ టీవీ షో ‘నచ్ బలియే’లోనూ పోటీపడ్డారు. ఆ సమయంలో నటాషాకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా హార్దిక్ గతంలో విజ్ఞప్తి చేసిన విషయం అతడి అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇక నటాషాను హార్దిక్ గతంలోనే తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని.. వీరి ప్రేమకు వారు అంగీకారం తెలిపారంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా గాయంతో జట్టుకు దూరమైన పాండ్యా ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. -
ఓ తండ్రిగా ఇంతకన్నా ఏం కావాలి?!
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్టు సమాచారం. సినిమాలతో బిజీగా ఉండే వరుణ్ వీలు చిక్కినప్పుడల్లా.. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్తో కలిసి పార్టీలకు, పబ్లకు, డిన్నర్లకు వెళ్తాడన్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ-టౌన్ కోడైకూసింది. అయితే ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి కామెంట్ చేయని వరుణ్.. కాఫీ విత్ కరణ్ షోలో తొలిసారిగా స్పందించాడు. వచ్చే ఏడాది పెళ్లి..! ‘అవును.. నేను తనతో ఉన్నాను. ఇకపై ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే తను స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మహిళ. సమస్యల గురించి గళం వినిపించగల ధీశాలి. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. అందుకే తనకు జీవిత భాగస్వామిగా మారి.. తన పక్కన నిలబడాలనుకుంటున్నాను. తన విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలనుకుంటున్నా. అదే విధంగా తను కూడా నా గురించి ఇలాగే ఆలోచిస్తుంది. అన్నివేళలా నాకు తోడుగా ఉంటుంది’ అని నటాషాతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ జంట బంధం గురించి వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ కూడా సానుకూలంగా స్పందించాడు. ‘ వచ్చే ఏడాది మా అబ్బాయి వివాహం జరిగే అవకాశం ఉంది. వరుణ్-నటాషాల రిలేషన్షిప్పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అంతకన్నా ఎక్కువ సంతోషంగా కూడా ఉంది. ఒక తండ్రిగా నాకు ఇంతకన్నా ఏం కావాలి’అని పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే వరుణ్ ధావన్ వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నాడంటూ అభిమానులు సంబరపడుతున్నారు. కాగా వరుణ్ -అలియా భట్ జంటగా నటించిన ‘కళంక్’ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. -
ప్రియురాలి చావుకొచ్చిన అభిమానం..!
సాక్షి, న్యూ ఢిల్లీ: అభిమానం వెర్రిగంగలెత్తితే ఇలాగే ఉంటుందేమో.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కనికరించనందుకు అతని ప్రేయసిని చంపుతానంటూ ఓ మహిళాభిమాని బెదిరింపులకు దిగింది. వరుణ్ ధావన్ని కలిసేందుకు అతని ఇంటిముందు చాలాసేపు ఓ అభిమాని వేచి చూసింది. ‘కళంక్’ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న వరుణ్ ఇంటికి కాస్త ఆలస్యంగా రావడమే కాక.. అలిసిపోయి ఉన్నానని, కలవటం కుదరదని చెప్పాడు. ఇదేమీ పట్టించుకోని సదరు అభిమాని వరుణ్ని కలవాల్సిందేనని పట్టుబట్టింది. కుదరదని చెప్పటంతో వరుణ్ ప్రేయసి నటాషా దలాల్ను చంపుతానని వీరంగం సృష్టించింది. వరుణ్ ఇంటి వద్ద ఆమెను పంపించడానికి హీరో సిబ్బంది విశ్వ ప్రయత్నం చేసినా దాదాపు 45 నిమిషాలపాటు ఆమె రచ్చ చేయడంతో పోలీసులను పిలిపించక తప్పలేదు! -
అవును.. లవ్లో ఉన్నారు
జంటగా పార్టీలకు, ఫంక్షన్లకు వెళుతున్నారు కానీ తమ మధ్య ఉన్నది ప్రేమ అని మాత్రం ఇన్నాళ్లు బయటకు చెప్పలేదు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్. ‘కాఫీ విత్ కరణ్’ అనే షోలో భాగంగా నటాషాను లవ్ చేస్తున్నట్లు వరుణ్ ఒప్పుకున్నారు. ‘‘నటాషాతో నేను డేటింగ్లో ఉన్నాను. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నటాషా సాధారణమైన అమ్మాయి. ఆమె గురించిన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం నాకు ఇష్టం లేదు. ఆమె బాధపడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాదే’’ అని చెప్పుకొచ్చారు వరుణ్. ఈ ఏడాది 31వ∙వసంతంలోకి అడుగు పెట్టిన వరుణ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని ఊహించవచ్చు. ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’ సినిమాతో బిజీగా ఉన్నారాయన. సంజయ్దత్, మాధురీ దిక్షీత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఇక నో సీక్రెట్
తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ నటాషా దలాల్తో వరుణ్ ధావన్ లవ్లో ఉన్నారని ఎప్పట్నుంచో బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. వరుణ్, నటాషా కెమెరా కంట పడకుండా అప్పుడప్పుడు రెస్టారెంట్స్, థియేటర్స్కు సీక్రెట్గా వెళుతున్నారని కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు సీక్రెట్ మీటింగ్స్కి ఫుల్స్టాప్ పెట్టిందీ జంట. సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా రిసెప్షన్ వేడుకకు వీరిద్దరూ జోడీగా హాజరయ్యారు. దీంతో ఇక నో సీక్రెట్స్ అని చెప్పకనే చెప్పారు వరుణ్ అండ్ నటాషా. ఇలా జంటగా నలుగురికీ కనిపించడంతో వరుణ్, నటాషా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబో తున్నారన్న కొత్త రాగం బాలీవుడ్లో మొద లైంది. రీసెంట్గా తాను హీరోగా నటించిన ‘అక్టోబర్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈ ఏడాదిలో వివాహం చేసుకుంటానేమోనని వరుణ్ చెప్పడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ‘కళంక్’ సినిమాలో నటిస్తున్నారు వరుణ్«. ఈ సినిమాలో న్యూ లుక్ కోసం ఆయన స్పెషల్ వర్కౌట్స్ చేస్తున్నారు. -
గంభీర్ ఇంట మహాలక్ష్మీ..
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇంట మరో మహాలక్ష్మీ అడుగుపెట్టింది. గంభీర్-నటాష దంపతులకు మరో పండంటి పాప జన్మించిది. ఈ విషయాన్ని గంభీర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన పెద్ద కూతురు ఆజీన్ తన చెల్లిని ఎత్తుకున్న ఫోటోకు క్యాప్షన్గా ‘మముల్ని దీవించేందుకు మా కుటుంబంలోకి మరో యువరాణి అడుగుపెట్టింది. ఆమె రాకతో మా జీవితంలో వెలుగులు నిండాయి. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువరాణికి స్వాగతం’ అని గంభీర్ పేర్కొన్నాడు. అయితే కోహ్లీతో సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు గంభీర్కు శుభాకాంక్షలు తెలిపారు. An angel blessing our family, An angel brightening our lives, Welcome to the world, little angel! ❤ pic.twitter.com/nrJ0hhuX9Y — Gautam Gambhir (@GautamGambhir) 21 June 2017 -
ఒబామా కూతురు పేరు నటాషా అని తెలిసి....
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామా చిన్న కూతురు సాశా ఒబామా శనివారం నాడు తన 16వ పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నారు. ఇది పెద్ద వార్త కాలేదుగానీ సాశా ఫస్ట్ నేమ్ నటాషా అని తెలిసి తాను ఏడాది క్రితం అమితాశ్చర్యానికి గురయ్యానని ఆశ్లే సీ ఫోర్డ్ ట్వీట్ చేయడం పెద్ద దుమారమే లేపింది. వేలాది మంది నటాషా పేరును షేర్ చేసుకున్నారు. వారంతా తమదైన శైలిలో స్పందించారు. ‘సాశా పేరు నటాషా అని తెలియని ఓ అబద్ధాల ప్రపంచంలో మనం ఇంతకాలం బతుకుతున్నామైతే’ అని కొందరు స్పందించగా, అమెరికా అధ్యక్షుల వెనక రష్యా కుట్ర ఉందడానికి నటాషా పేరే సాక్ష్యమని కొందరు వ్యాఖ్యానించారు. నటాషా అనే పేరు రష్యన్లు ఎక్కువ మంది పెట్టుకుంటారని, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం వెనక రష్యా కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. సాశా అసలు పేరు నటాషా అయితే ఒబామా పెద్ద కూతురు మాలియా అసలు పేరు చెల్సియానా? అంటు కొందరు ట్విట్టర్లో ప్రశ్నించారు. మరికొందరు మారియా అసలు పేరు బోరిస్ అంటూ ఖాయం చేశారు. సాశా పూర్తి పేరు సాశా అకా నటాషా ఒబామా. ఆమె పూర్తి పేరు ఎప్పుడూ ప్రస్తావనకు రాకపోవడంతో అందరికి నటాషా పేరు తెలిసి ఉండకపోవచ్చు. కానీ మార్తాస్ వైన్యార్డ్ దీవిలోని ఓ రిస్టారెంట్లో గత వేసవిలో సాశా పనిచేసినప్పుడు ఆమె పూర్తిపేరును మొదటిసారి పేర్కొన్నారు.