Rahul Ravindran
-
రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషాద వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి నాన్న అంటూ రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని రాహుల్ రవీంద్రన్కు అండగా నిలుస్తున్నారు.ఈ విషాద సమయంలో తాను దర్శకత్వం వహించిన చి.ల.సౌ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. 'చి లా సౌ చిత్రానికి నేను ఓ లైన్ రాశాను..అది ఇప్పుడు చాలా భిన్నంగా అనిపిస్తోంది.. నాన్న ఉన్నారులే.. అన్ని చూస్కుంటారు.. అనే మాటకి విలువ నాన్నను కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది'.. నాకు ఈరోజు అర్థమైంది. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.. మాటల్లో వివరించలేని భావాలను మనకు అందిస్తుంది.. థ్యాంక్యూ నాన్న.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా' అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.కాగా..నటుడిగా మాత్రమే కాదు డైరెక్టర్గా రాహుల్ రవీంద్రన్ పలు చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో పలు సినిమాల్లోనూ నటించారు. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను రాహుల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్మయి సైతం తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23) -
సమంత పోస్ట్పై వివాదం.. మద్దతుగా నిలిచిన నటుడు!
ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్ సమంత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న భామ.. ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అలాగే ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి సామ్ నెట్టింట సలహాలు ఇస్తోంది. అయితే ఇటీవల సమంత చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.అయితే సామ్ సలహాను ప్రముఖ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా "ది లివర్ డాక్" తప్పుపట్టారు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదని హెచ్చరించారు. ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతను చెప్పాడు. ఆరోగ్యం పట్ల సమంత ఒక నిరక్షరాస్యురాలని ఆయన అన్నాడు. ఇలాంటి సలహాలు ఇస్తున్న సమంతను జైళ్లో పెట్టాలని ఆయన కామెంట్ చేశాడు. అయితే సమంత కూడా దీనిపై స్పందించింది. ఓ సుదీర్ఘమైన లేఖను రాసుకొచ్చింది.తాజాగా ఈ విషయంపై నటుడు రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. సామ్కు మద్దతుగా ట్విటర్లో పోస్ట్ చేశాడు. సమంత ట్యాగ్ చేసిన డాక్టర్ని మీరు డిబేట్కి ఆహ్వానించి ఉంటే బాగుండేందని అన్నారు. మనలో చాలా మందిలాగే సైన్స్ నిరక్షరాస్యురాలనడంలో సందేహం లేదు.. కానీ ఆమె చికిత్స తీసుకునే ముందు దాని గురించి కచ్చితమైన పరిశోధనలు చేసే వ్యక్తి అని తెలిపారు. అంతే కాదు సమంతకు అర్హత కలిగిన వైద్యుడే ఈ చికిత్సను సూచించాడని.. అందుకే ఆమె దానిని సిఫార్సు చేసిందని ట్విటర్లో రాసుకొచ్చారు. రాహుల్ తన ట్వీట్లో రాస్తూ..'మనకు అందరిలాగే ఏది సరైందో తెలియదు. అర్హత కలిగిన వైద్యులే భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు అనిపించినప్పుడు.. మనం ఇలాంటి సలహాలపైనే ఆధారపడతాం. ఇలాంటి థెరపీని ఆమె తీసుకుంటున్నది తప్ప.. నాకు దాని గురించి ఎలాంటి విషయాలు తెలియవు. ఒకవేళ ఆమెకు అది మంచిది కాకపోతే... నేనే తనను హెచ్చరిస్తా. నేను కూడా దయగల చాలా మంది వైద్యులను చూశా. చికిత్స అవసరమయ్యే పేషంట్కు ఇది ఎంత అవసరమో తెలుసు. ' పోస్ట్ చేశారు.ఒక వైద్యుడిగా ఈ సమాచారాన్ని బయటపెట్టడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ.. తోటి వైద్యుడితో డిబేట్ పెట్టి ఉంటే బాగుండేది. మీరు ప్రజలకు సలహాలు సూచించే వైద్యులు అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. అంతే కాదు దాని ప్రభావం గురించి కథనాలను ప్రచురించాలి. కోవిడ్ వ్యాక్సిన్ల నుంచి సైన్స్పై ఆధారపడిన ప్రత్యామ్నాయ చికిత్సల వరకు... సైంటిఫిక్ కమ్యూనిటీలో భిన్నభిప్రాయాలు ఉంటే... మనం ఎవరిని నమ్మాలి?' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయంలో సమంతకు రాహుల్ రవీంద్రన్ మద్దతుగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. Dear Doctor, it would have been really nice if you had invited the Doctor she had tagged in her same post to a debate and engaged with him. We would have all learned a lot from it. Would have helped us make up our minds about this alternate therapy. She is science illiterate like… https://t.co/UpUYnL7VlJ— Rahul Ravindran (@23_rahulr) July 5, 2024 -
మన అభిరుచులు వేరు.. కానీ శత్రువులం కాదు: రాహుల్ రవీంద్రన్
నటుడు, సింగర్ భర్త రాహుల్ రవీంద్రన్ పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ చాలా చిత్రాల్లో నటించారు. చివరిసారిగా గతేడాది ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ అతనికి జంటగా నటించింది. అయితే 2014లో రాహుల్.. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ రవీంద్రన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. తన భార్య చిన్మయి ఉద్దేశించి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.రాహుల్ ట్వీట్లో రాస్తూ..'మనం రాజకీయంగా, మిగతా వాటిలోనూ భిన్నంగా ఉండొచ్చు. మీ విలువలు, వ్యవస్థ ప్రమాదకరమని నేను చెప్పొచ్చు. కానీ నా విషయంలోనూ మీరు కూడా అలాగే భావిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నేను వందశాతం కరెక్ట్ అని చెప్పడాన్ని ఖండిస్తున్నా. నేను ద్వేషించే సినిమాలు మీరు ఇష్టపడొచ్చు. నేను ఇష్టపడే టీమ్స్ను మీరు ట్రోల్ చేయొచ్చు. మనం భిన్నమైన అభిరుచులు, వ్యక్తిత్వం కలిగి ఉండొచ్చు. మనం కాలానుగుణంగా మారొచ్చు లేదా మారకపోవచ్చు. కానీ నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని వాగ్దానం చేస్తున్నా. ఏదైనా సరే మీతో చర్చిస్తానని మాటిస్తున్నా. అంతేకాదు మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడనని ప్రామిస్ చేస్తున్నా' అని రాసుకొచ్చారు. అంతే కాకుండా మనం ఏదో ఒక సందర్భంలో ఆమోదయోగ్యం కాని విధంగా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ దాని చుట్టూ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. ఆ సమయంలో మీ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటానని మాటిస్తున్నా. నాకు ఆసక్తి లేని వాటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను. నేను ఏదైనా జడ్జ్ చేస్తే ఆ విషయాన్ని నా వద్దే ఉంచుకుంటా. అంతేకానీ ఇతరులతో పంచుకోను. ఒకవేళ ఏదైనా తప్పు చేసినట్లు అనిపించినా ఆ విషయాన్ని ఓపెన్గానే చెబుతా. నేను నిన్ను ప్రేమించలేకపోయినా సరే.. ద్వేషించే ఉద్దేశం లేదు. మన మధ్య రిలేషన్ అనే వారధిని నిర్మించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా. నేను ఏంటనేది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. బహుశా ఏదో ఒక రోజు మనం మారొచ్చేమో. మనిద్దరం భిన్నమైన వ్యక్తులం కావొచ్చు. కానీ.. మనం శత్రువులుగా ఉండవలసిన అవసరం లేదు. అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇది చూసిన చిన్మయి శ్రీపాద రిప్లా కూడా ఇచ్చింది. హలో .. బుద్ధ భగవాన్.. నేను వందశాతం అలాంటివారినే ప్రశ్నిస్తా.. అంతే కాదు.. ఎల్లప్పుడు ఉత్తమమైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తా అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. You and I… we may be different. Politically, you might be the other end of the spectrum. I might find your values and belief system problematic… dangerous even. But I understand that you might feel the same way about mine. And I refuse to assume with certainty that I am…— Rahul Ravindran (@23_rahulr) May 31, 2024 -
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో టాలీవుడ్ హీరో
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ తెలిపింది. దీంతో టీమ్ఇండియాకు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా..? లేదా కొత్త కోచ్ వస్తారా..? అనేదానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందుకు అర్హతలు, బాధ్యతలను వెల్లడిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో తమ వివరాలు నింపాలని తెలిపింది.ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ అందరికీ అందుబాటులో వెబ్సైట్ను బీసీసీ ఉంచింది. దీంతో చాలామంది నెటిజన్లు సరదాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్స్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో బీసీసీఐకి ఇబ్బందులు తప్పడంలేదు.అయితే, టాలీవుడ్ హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కానీ, తన దరఖాస్తును బీసీసీఐ రిజక్ట్ చేసిందని ఆయన తెలిపారు. అయితే ఈ అప్లికేషన్ను నింపడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ క్రమంలో తనకు చాలా సరదాగా అనిపించిందని ఆయన అన్నారు. ' నేను ఒకసారైనా టీమ్ఇండియాకు హెడ్ కోచ్గా ఉండాలనుకుంటున్నాను.' అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. I thought it’d be fun to just fill up the form and submit it for the heck of it. Thought I could tell my kids someday that “you know, I was in the running to be Head Coach of Team India once.” But… ☹️☹️ pic.twitter.com/b54ochsyhQ— Rahul Ravindran (@23_rahulr) May 15, 2024 -
Chinmayi Sripada And Rahul Ravindran: సింగర్ చిన్మయి శ్రీపాద వివాహ వార్షికోత్సవం.. అరుదైన ఫోటోలు
-
రష్మిక మందాన్నా ‘‘ది గర్ల్ ఫ్రెండ్’ మొదలైంది!
రష్మికా మందన్నా ప్రధాన ప్రాత్రలో నటించనున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాత సాయి రాజేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమకథతో తెరకెక్కనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కనిపించగా.. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రత్యేక పాత్రలో కనిపించింది. అయితే ఈ మూవీలోని ఓ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రబృందాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. సినిమాలోని గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ డైలాగ్పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు. ఆ ఒక్క డైలాగ్తో ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు. ఈ ట్వీట్కు అనసూయ రిప్ కూడా ఇచ్చింది. రాహుల్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ చిత్రంలో ఒక్క డైలాగ్తో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఒక్క వారంలోనే మెసేజ్ అందరికీ చేరేలా చేశారు. మీడియా ద్వారా అయితే దాదాపు 10 ఏళ్లు పట్టేది. మాస్ మసాల సినిమాలో ఇలాంటి గొప్ప అంశాన్ని పెట్టినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు. బాలకృష్ణ వల్లే ఇది సాధ్యమైంది. అత్యంత ప్రభావవంతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బాలయ్య పక్కన శ్రీలీల చూడటం అద్భుతంగా అనిపించింది.' అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ట్వీట్కు అనసూయం సైతం స్పందించింది. ఈ సినిమా గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరంటూ రిప్లై ఇచ్చింది. The good touch-bad touch scene in #BhagavantKesari will achieve in a week what other mediums will take 10 years. Thank you for bringing this topic to mass masala cinema @AnilRavipudi garu and NBK garu🙌🏽🙌🏽 Communicated in such a simple and yet highly effective manner like only NBK… — Rahul Ravindran (@23_rahulr) October 23, 2023 -
ఆ కిక్కే వేరు రా!
‘‘నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నానంటే, దానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ అక్కర్లేదు రా..! నేను చాలు..! ట్వంటీఫోర్ హవర్స్ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది.. నాది అని చెప్పుకోవడానికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే.. ప్చ్.. ఆ కిక్కే వేరు రా..!’’ అనే డైలాగ్స్తో కూడిన వాయిస్ ఓవర్తో మొదలవుతుంది ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా మోషన్ పోస్టర్. హీరోయిన్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మించనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ ప్రపంచం ప్రేమకథలతో నిండిపోయి ఉంది. కానీ ఈ ప్రేమ కథల్లో ఇప్పటివరకు ఎవరూ వినని, చూడనవి కూడా ఉన్నాయి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం అలాంటిదే’’ అని ట్వీట్ చేశారు రష్మికా మందన్నా. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
సింగర్ చిన్మయిపై ట్రోల్స్ మొదటిసారి స్పందించిన రాహుల్
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై ట్రోల్స్ ఆపేయండని ఆమె భర్త నటుడు రాహుల్ వవీంద్రన్ తొలిసారి విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. మీటూ ఉద్యమం సమయంలో కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తు వంటి వారి ప్రవర్తనపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆతనిపై చిన్మయి లైంగిక ఆరోపణలు కూడా చేసింది. వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని పెద్ద పోరాటమే చేసింది. దీంతో ఆమె కోలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా బహిష్కరణ ఎదుర్కొంది. తాజాగా మళ్లీ నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తూ.. రాహుల్ ఖాతాను ట్యాగ్ చేయడంతో ఆయన ఒక నోట్ విడుదుల చేశారు. (ఇదీ చదవండి: అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి) 'చిన్మయిని ఒక సెలబ్రిటీగా చూడకండి. సమాజంలోని సమస్యలపై ఆమె చేసే పోరాటాన్ని చూడండి. ఆమే చేస్తున్న పనిని మెచ్చుకోకపోయిన అర్ధం చేసుకునేందకు ప్రయత్నం చేయండి. ముందుగా ఒక్కసారి ఆమె చెప్పేది వినండి ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం. ఆమె అందరితో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిలా, ఒక అక్కలా ఉంటుంది. ఆమె ప్రేమకు లిమిట్స్ ఉండవు. ఎవరికైన సమస్య వస్తే మరో కోణంలో చూడటం ఉండాలి. అప్పుడే విషయం అర్ధం అవుతుంది.' అని ఆయన నోట్లో తెలిపారు. రాహుల్ పోస్ట్పై తన అభిమానులు మద్దతుగా నిలవగా మరికొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు పెట్టారు. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) -
అతన్నే జీవితాంతం ప్రేమిస్తా
-
'నువ్వు ఐరన్ ఉమెన్వి.. ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాడుతునే ఉంటావు'
సినిమాల్లో నటిస్తున్నా, లేకపోయినా కొందరి క్రేజ్ ప్రజల్లో ఏ మాత్రం తగ్గదు. అలాంటి వారిలో నటి సమంత ఒకరు. నటిగా పరిచయం కాకముందు పాకెట్ మనీ కోసం పెళ్లి రిసెప్షన్లు, ఫంక్షన్లు తదితర సేవలు అందించారు. కథానాయకిగా పరిచయం అయిన తరువాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. తెలుగులో గౌతమ్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేశావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్తో బృందావనం చిత్రంలో నటించే అవకాశం వరించడం.. అది ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా స్టార్ అంతస్తుకు చేరుకున్నారు. అలా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ నటుల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్గా ఎదిగారు. ది ప్యామిలీమ్యాన్–2 వెబ్ సిరీస్ జాతీయస్థాయిలో ఈమెకు క్రేజ్ తీసుకొచ్చింది. అలాంటి సమంత అనూహ్యంగా మయోసిటీస్ అనే అరుదైన వ్యాధికి గురవడం అందరికి షాక్కు గురి చేసింది. ప్రస్తుతం ఆమె ఈ వ్యాధితో గట్టిగా ఫైట్ చేస్తున్నారు. దీంతో సమంతకు పలువురు ధైర్యం చెబుతున్నారు. కాగా నటుడు రాహుల్ రవీంద్రన్ సమంతకు మంచి స్నేహితుడు. చదవండి: (Pooja Hegde: చిన్ననాటి కల నెరవేరింది) ఈయన సమంత గురించి తన ట్విట్టర్లో ‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు పోరాడుతునే ఉంటావు ఇంకా ఇంకా పోరాడుతునే ఉంటావు.. ఎందుకంటే నువ్వు ఐరన్ ఉమెన్వి. నిన్ను ఏది ఓడించలేదు. కష్టాలు బాధించకుండా నిన్ను ఇంకా శక్తివంతంగా మారుస్తాయని’’ పేర్కొన్నారు. అందుకు సమంత బదులిస్తూ ధన్యవాదాలు రాహుల్. నాలాగే బయట ఎవరైనా పోరాడుతుంటే వారికి నేను ఇదే చెబుతాను. పోరాడుతునే ఉండండి మీరు ఇంకా బలంగా తయారవుతారు. ధృఢంగా కష్టాలను ఎదుర్కోండి అని పేర్కొన్నారు. కాగా సమంత త్వరగా కోలుకోవాలని ఆమెతో పాటు ఖుషి చిత్ర యూనిట్ కూడా బలంగా కోరుకుంటోంది. ఆమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. కాగా సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం చిత్రం 2023లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
సమంతకు క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ పంపిన హీరో.. ఎమోషనల్ అయిన సామ్
సమంత ప్రస్తుతం మయోసైటిస్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చిన సామ్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. ఇప్పుడైతే కొత్త సినిమాలేవీ సైన్ చేయట్లేదట. కానీ వీలైనంత త్వరగా ఖుషీ సినిమా మాత్రం పూర్తి చేయాలని భావిస్తుందట. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సమంతకు హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఓ పవర్ఫుల్ మెసేజ్ ఉన్న ఓ స్పెషల్ గిఫ్ట్ను పంపాడు. అందులో ఏముందంటే.. ''చీకటితో కూడిన సొరంగం..వెలుతురు ఆనవాళ్లు కూడా లేవు. అడుగులు భారంగా మారినా శక్తినంతా కూడదీసుకుని ముందుకు సాగుతావు. భయాలు, సందేహాలు పక్కనపెట్టి సోల్జర్లా మారతావు. ఎందుకంటే నువ్వొక ఉక్కు మనిషివి. ఈ విజయం నీ జన్మహక్కు. ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండొచ్చు కానీ, త్వరలోనే అది ప్రకాశిస్తుంది. నువ్వొక యోధురాలివి, నిన్ను ఏదీ ఓడించలేదు. ఇలాంటివి నిన్ను ఇంకా బలపడేలా చేస్తాయని, ఎప్పటికీ బలంగా ఉండేలా చేస్తాయి'' అంటూ స్ట్రాంగ్ మెసేజ్తో కూడిన ఫలకాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసి ఎమోషనల్ అయిన సమంత థ్యాంక్యూ అంటూ ఈ ఫోటోను షేర్చేసింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఆ నటుడి డైరెక్షన్లో సమంత నెక్ట్స్ మూవీ?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యశోద మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశోద చిత్రం మంచి విజయం సాధించింది. బక్సాఫీసు వద్ద ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. సరోగసి నేఫథ్యంలో వచ్చిన ఈసినిమాలో తన నటన, యాక్షన్ సీక్వెన్స్లో అలరించింది. దీంతో ఆమె తదుపరి చిత్రాలపై ఆసక్తి నెలకొంది. నెక్ట్ సమంత ఎవరి డైరెక్షన్లో చేయనుంది, ఎవరికి ఒకే చెప్పనుందనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆమె ఓ నటుడు దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం! స్టార్ హీరోయిన్ సమంత నటుడు డైరెక్షన్లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సమంతకు ఓ స్టోరీ లైన్ వినిపిండాడట. అది ఆమెకు బాగా నచ్చిందని, దీంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే మొదట రాహుల్ ఈ కథను రష్మికకు వినిపించాడట, ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చేయలేనని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత సమంత కోసం ఈ స్క్రీప్ట్ మర్పులు చేసి ఆమెకు స్టోరీ చెప్పగా సమంత ఒకే చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం సమంత ఖుషి సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేమకథా రూపొందుతున్న ఈచిత్రంలో సామ్ విజయ్తో జతకట్టింది. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు -
'గర్భం దాల్చిన మూడ్నెళ్లకే అబార్షన్'...సింగర్ చిన్మయి ఎమోషనల్
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఇటీవలే పండంటి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పిల్లల పేర్లు కూడా రివీల్ చేశారు. 2014లో నటుడు రాహుల్ని పెళ్లాడిన చిన్మయి ఇటీవలె ట్విన్స్కు జన్మనిచ్చి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అయితే తాజాగా చిన్మయి తన ప్రెగ్నెన్సీ స్టోరీని నెటిజన్లతో పంచుకుంది. తన స్వంత యూట్యూబ్ ఛానల్లో ఈ మేరకు వీడియోను షేర్ చేసింది. 'నేను, రాహుల్ ఎప్పటినుంచో తల్లిదండ్రులు కావాలనుకున్నాం. 2020లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో అంతా అయోమయ పరిస్థితి. ప్రపంచమంతా తలకిందులయ్యింది. మా డాక్టర్ కూడా బయట ఏం జరుగుతుంతో తెలియదు.. ఇంతకాలం వెయిట్ చేశారు కదా ఇంకాస్త సమయం ఓపిక పట్టండి అని చెప్పింది. సెకండ్ వేవ్ అయిపోయాక నేను గర్బవతిని అయ్యాను. కానీ మూడు నెలలకే గర్భస్రావం(అబార్షన్)అయ్యింది. దీంతో చాలా బాధపడ్డాను. మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ తర్వాత కొన్నిరోజులకు ఇన్స్టాగ్రామ్లో ట్రెడిషనల్ చైనీస్ మెడికల్ డాక్టర్ ఎమిలీ నాకు పరిచయం అయ్యింది. తన సలహాతో నా డైట్, ఎక్సర్సైజ్ అన్నీ పాటించాను. అవి దాదాపు మన ఇండియన్ ఆయుర్వేదిక్ పద్దతులే. ఇక కొంతకాలానికి నేను మళ్లీ గర్భం దాల్చాను. కవలలకు జన్మనిచ్చాను. 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను' అంటూ చిన్మయి తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. -
పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి
ప్రమఖ సింగర్ చిన్మయి శ్రీపాద తల్లయ్యారు. ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరి పిల్లల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు. ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పేరు పెట్టినట్లు తెలియజేశారు. చిన్మయి, రాహుల్ తల్లిదండ్రులు కావడంపై నెటిజన్స్, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, రాహుల్, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేశారు. ఇక రాహుల్ విషయానికొస్తే.. ‘అందాల రాక్షసి’చిత్రంతో టాలీవుడ్కి పరిచమయ్యాడు. హీరోగానే కాకుండా సహాయనటుడిగాను పలు సినిమాల్లో నటించాడు. నాని ‘శ్యామ్ సింగరాయ్’లో రాహుల్ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. దర్శకత్వం దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ‘చి..ల..సౌ’ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించి, తొలి ప్రయత్నంలో విజయం సాధించాడు. Driptah and Sharvas The new and forever center of our Universe. ❤️ @rahulr_23 pic.twitter.com/XIJIAiAdqx — Chinmayi Sripaada (@Chinmayi) June 21, 2022 -
వెండితెరపై సందడి చేయబోతున్న రియల్ కపుల్
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ గాయనీ చిన్మయి సందడి చేయబోతున్నారు. ఈ రోజు(సెప్టెంబర్ 10) ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ తన ఫస్ట్లుక్ను విడుదల చేశారు. చదవండి: ‘ఆ రెండు సినిమాలు తీయకపోతే నా జీవితానికి అర్థం లేదు’ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిన్మయికి విషెస్ కూడా తెలిపారు. అలాగే ఈ సినిమాలో ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరూ కీలక పాత్రలు పోషించనున్నారట. అయితే జంటగానా, వీడిగానా అనేది క్లారిటీ లేదు. కానీ ఈ రీయల్ కపుల్ మాత్రం రీల్పై తొలిసారిగా సందడి చేయడం విశేషం. దీంతో వారి ఫ్యాన్స్ వారి పాత్రలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇంతకాలం తెరవెనక తన గొంతులో ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఆకట్టుకున్న చిన్మయి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ మూవీతో తెరపై అలరించబోతున్నారు. కాగా చిన్మయి స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెబుతున్న విషయం తెలిసిందే. చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్ Wishing star singer @Chinmayi a very happy birthday - Team #MEB Also, Makes her Big-Screen Debut with #MostEligibleBachelor #AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official #MEBOnOct8th pic.twitter.com/FiluWbzbTj — BA Raju's Team (@baraju_SuperHit) September 10, 2021 -
మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న డైరెక్టర్
రెండేళ్ల గ్యాప్ తర్వాత ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దర్శక–నటుడు రాహుల్ రవీంద్రన్ . మలయాళంలో ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ’ సినిమా తమిళ రీమేక్లో రాహుల్ హీరోగా నటించనున్నారు. ఇందులో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ . కన్నడ దర్శకుడు. ‘‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమాను చూశాను. సూపర్గా ఉంది. ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. అన్ని భాషల్లోనూ ఈ సినిమాను తీయాలి. మణిరత్నంగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పటి నుంచే నా భార్య (గాయని, అనువాద కళాకారిణి చిన్మయి)కి కన్నడ తెలుసు. 2012లో వచ్చిన నా తమిళ సినిమా ‘విన్ మీన్ గళ్’ స్క్రీనింగ్ టైమ్లో కన్నన్ గారిని నేను కలిశాను. అప్పుడు నాతో ఓ సినిమా చేయాలని ఉందని చెప్పారు. ఇప్పుడు ఆయన ఈ సినిమాతో వచ్చి నన్ను సంప్రదించినప్పుడు సర్ప్రైజింగ్గా అనిపించింది. ఐశ్వర్యా రాజేష్లాంటి అద్భుతమైన నటితో నటించడం ఓ చాలెంజ్’’ అని పేర్కొన్నారు రాహుల్ రవీంద్రన్ . కొత్తగా పెళ్లయిన దంపతుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అత్తింటికి తగ్గట్టు ఒదిగిపోవడానికి ఓ అమ్మాయి ఎలాంటి కష్టాలు పడుతుందనేది ప్రధానాంశం. మలయాళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. -
‘మా పెళ్లి ఇప్పుడే జరగడం లేదు’
ముందు నుంచీ చెప్పినట్లుగానే తాను ఇండస్ట్రీయేతర వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నానని బాలీవుడ్ నటి నీతి టేలర్ అన్నారు. హిందీ సీరియళ్లతో పాటు తెలుగు తెరపై తళుక్కుమన్న నీతి ఎంగేజ్మెంట్ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. భారత ఆర్మీ కెప్టెన్ పరీక్షిత్ బవాను ఆమె వివాహమాడనున్నారు. ఈ క్రమంలో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నీతి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వెబ్సైట్తో మాట్లాడిన నీతి ప్రేమకథ గురించి చెప్పుకొచ్చారు. ‘స్కూలు రోజుల నుంచే పరీక్షిత్ పరిచయం. అప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం. చాలా కాలం దూరంగా ఉన్న మేము కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా మళ్లీ కలుసుకున్నాం. అప్పటి నుంచి మా మధ్య సంభాషణ పెరిగింది. ఆ క్రమంలో తను రత్నంలాంటి వాడని తెలుసుకున్నాను. ఢిల్లీకి వెళ్లి తనను కలిశాను. మా అమ్మానాన్న కూడా తనను కలిసి మాట్లాడారు. ఇరు కుటుంబాలు మా బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రతీ విషయంలో మా ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటే. ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని చేసుకుంటానని గతంలో చెప్పాను. ఇప్పుడదే నిజమైంది. తను ఆర్మీ కెప్టెన్. అయితే మా పెళ్లి ఇప్పుడే జరగబోవడం లేదు. పరీక్షిత్ తన ఉద్యోగం రీత్యా వివిధ ప్రదేశాలకు వెళ్తుంటాడు. నేనేమో ముంబైలో ఉన్నాను. బహుశా వచ్చే ఏడాది మా వివాహం జరుగుతుంది’ అని నీతి తనకు కాబోయే భర్త వివరాలు తెలిపారు. కాగా ఇష్క్బాజ్, గులాల్ వంటి హిట్ హిందీ సీరియళ్లలో నటిస్తున్న నీతి... టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తనీశ్ హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి పుస్తకం సినిమాలోనూ ఆమె హీరోయిన్గా నటించారు. View this post on Instagram Aithey aa❤️ @parikshitbawa #partitayles 📸- @theglamweddingofficial Outfit- @kalkifashion Jewellery - @anmoljewellers Mu- @mahima.mua A post shared by Nititay💜 (@nititaylor) on Aug 14, 2019 at 5:26am PDT -
సినిమా కోసమే కాల్చాను!
సినిమా ఇండస్ట్రీ మారుతోంది. విభిన్నమైన సినిమాలు వస్తున్నాయి. సినిమాను సినిమాలా చూసే ఆలోచనాధోరణి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘మన్మథుడు 2’ సినిమాలో సిగరెట్ కాల్చింది నేను కాదు.. అవంతిక (ఈ సినిమాలో రకుల్ పాత్ర పేరు). సిగరెట్ కాల్చడం అవంతికకు ఉన్న అలవాటు. సినిమాలో కూడా ఇవి రెండు మూడు షాట్స్ మాత్రమే ఉంటాయి. నా నిజజీవితంలో నేను సిగరెట్ కాల్చను. అయినా హీరోలు కాల్చితే ఏ ప్రాబ్లమూ ఉండదు. అదే సినిమాలో హీరోయిన్ సిగరెట్ కాల్చితే అదో పెద్ద టాపిక్. సినిమాలో ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే క్యాషన్ కూడా వేస్తుంటాం కదా’’ అన్నారు రకుల్ప్రీత్ సింగ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా రకుల్ చెప్పిన విశేషాలు. ► అల్లరి, చిలిపితనం, కోపం, బాధ ఇలా అన్నిరకాల భావోద్వేగాలతో నేను చేసిన అవంతిక పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. నా కెరీర్లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర. అవంతికకు కొన్ని పంచ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆడియన్స్కు తను తప్పకుండా నచ్చుతుంది. ► నాగార్జున సార్ మంచి కో–స్టార్. హీరోయిజమ్ అని కాకుండా కథలోని హీరో పాత్రకు తగ్గట్లు నటించారు. ఓ పాట చిత్రీకరణ కోసం మేం స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు నాకు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ వద్దు.. యూనిట్ మెంబర్స్కు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో నాకూ అలాగే ఏర్పాటు చేయండి అన్నారు. అందుకే ఆయన కింగ్ అనిపించింది. లక్ష్మీగారు, ‘వెన్నెల’ కిశోర్ ఇలా అందరి పాత్రలు కథలో భాగంగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. హ్యాపీ హ్యాపీగా ఈ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేశాను. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అనిపించింది. ► రాహుల్ రవీంద్రన్ నాకు ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమా నుంచే తెలుసు. చాలా ప్రతిభ ఉన్న రైటర్. యాక్టర్ కూడా. రాహుల్ను నేను బడే భయ్యా అని పిలుస్తాను. సెట్లో ఎప్పుడూ ఒక పాజిటివ్ వైబ్తోనే ఉంటాడు. బౌండ్ స్క్రిప్ట్ ముందే ఇవ్వడం వల్ల ఏ టెన్షన్ లేకుండా షూటింగ్ చేయగలిగాను. రాహుల్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిలసౌ’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశా. కానీ ‘చిలసౌ’ లోని అంజలి పాత్రకు ‘మన్మథుడు 2’ లోని అవంతిక పాత్రకు పోలిక పెట్టలేం. ► నేను హిందీలో చేసిన ‘దేదే ప్యార్ దే’ సినిమాకు, ‘మన్మథుడు 2’ చిత్రకథకు సంబంధం లేదు. ఉన్న కామన్ పాయింట్ ఒకటే... అతని కన్నా కాస్త తక్కువ వయసున్న అమ్మాయి హీరో లైఫ్లోకి వస్తుంది. ‘దేదే ప్యార్ దే’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారన్న వార్త నేను విన్నాను. అయితే రీమేక్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. అయినా చేసిన పాత్రనే మళ్లీ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. సేమ్ రోల్ అయితే ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతారు. నాకు పెద్ద కిక్ ఉండదు. ► సినిమాలో అవంతిక పాత్రకు వివాహం జరుగుతుందా? లేక లివింగ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ను ప్రస్తావించామా? అనే అంశాలను ఇప్పుడు చెప్పలేను. సినిమా చూసి ఆడియన్స్ తెలుసుకోవాల్సిందే. ఇక లివింగ్ రిలేషన్షిప్ గురించి నా అభిప్రాయం చెప్పడానికి నేను ఏ రిలేషన్లోనూ లేను (నవ్వుతూ). పెళ్లి విధానంపై నాకు మంచి నమ్మకం ఉంది. ► నాగార్జునగారి ‘మన్మథుడు’ (2002) సినిమా చూశాను. ‘మన్మథుడు 2’ ఓ ఫ్రెంచ్ సినిమాకు తెలుగు రీమేక్. అయితే ఆ ఫ్రెంచ్ సినిమాను నేను చూడలేదు. ఒకవేళ చూస్తే మనకు తెలియకుండానే ఏదో ఒక సందర్భంలో ఆ సినిమాలోని హీరోయిన్లా చేయడానికి ట్రై చేస్తానేమో అని డౌట్. ► ‘దే దే ప్యార్ దే’లో అజయ్ దేవగన్, ‘మన్మథుడు 2’లో నాగార్జునగారు ఇలా సీనియర్ యాక్టర్స్తోనే నేను సినిమాలు చేస్తున్నాను కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో క్రిమినల్ లాయర్గా చేస్తున్నాను. ‘ఇండియన్ 2’ లో సిద్ధార్థ్ సరసన నటిస్తున్నాను. సినిమా కథ, అందులోని నా పాత్రే ఇంపార్టెంట్ నాకు. ఏవేవో ఆలోచించి మంచి పాత్రలను వదులుకోవాలనుకోను. హిందీలో మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అనౌన్స్ చేస్తాను. -
‘మనం’ సీక్వెల్పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా మనం. ఈ సినిమా లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కూడా కావటంతో ఈ సినిమా ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. అయితే చాలా రోజులు మనం సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. మరోసారి అక్కినేని కుటుంబ కథానాయకులంతా కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ గట్టిగా వినిపించింది. ప్రస్తుతం మన్మథుడు 2 సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మనం సీక్వెల్ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాహుల్ స్పందించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తాను మన్మథుడు 2 పనుల్లో బిజీగా ఉన్నట్టుగా చెప్పిన రాహుల్ ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని చెప్పారు. అంటే ప్రస్తుతానికి మనం సీక్వెల్కు సంబంధించి ఎలాంటి ఆలోచన లేనట్టే అని తెలుస్తోంది. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన మన్మథుడు 2 ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, రావూ రమేష్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘బిగ్బాస్’లా టాస్క్లు ఇచ్చిన నాగ్!
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత నాగార్జున దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో ఓ ప్రాంక్ వీడియో చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న రాహుల్ను ఓ రెస్టారెంట్కు పంపించి రకరకాల టాస్క్లతో ఇబ్బంది పెట్టాడు. ఈ ఆదివారం నుంచి ప్రసారం కానున్న బిగ్బాస్ రియాలిటీ షోకో హోస్ట్గా వ్యవహరించనున్న నాగ్, రాహుల్లో రియల్ లైఫ్లోనే అలాంటి టాస్క్లు చేయించాడు. నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్లు అతిథి పాత్రల్లో అలరించనున్నారు. వెన్నెల కిశోర్, లక్ష్మీ, రావూ రమేష్, ఝాన్సీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
నువ్వు నీతులు చెప్పకు..!
సాక్షి, హైదరాబాద్: అవంతిక పాత్రలో సిగరెట్ తాగింది రకుల్ ప్రీత్ సింగ్ అయితే విమర్శలపాలవుతోంది మాత్రం గాయని చిన్మయి శ్రీపాద. కొన్ని రోజులుగా వేధింపులపై పోరాడుతున్న చిన్మయి.. మన్మథుడు 2 సినిమాలోని రకుల్ పాత్రకు సంబంధించిన టీజర్ను షేర్ చేయగా నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సిగరెట్ సీన్కు అర్థం ఏంటంటూ ఆమెను పలువురు ప్రశ్నిస్తున్నారు. మీ భర్త చేస్తే ఒప్పు, మిగతావారు చేస్తే మాత్రం తప్పా? అంటూ నిలదీస్తున్నారు. ఈ విమర్శలకు కారణం లేకపోలేదు. మొన్నటివరకు కబీర్ సింగ్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగను ‘సినిమా తీసే పద్దతి ఇదేనా? ఆడవారిని అలా చూపించొచ్చా’ అంటూ దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేసింది చిన్మయి. ఇప్పుడేమో చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ తన సినిమాలో హీరోయిన్తో సిగరెట్ తాగించాడు. అంతేకాక బోల్డ్ డైలాగ్స్ కూడా చెప్పించడంతో నెటిజన్లు చిన్మయికి చుక్కలు చూపిస్తున్నారు. ఇల్లు చక్కబెట్టుకోలేదు కానీ, అందరికీ నీతులు చెబుతోంది అంటూ చిన్మయిపై విరుచుకుపడుతున్నారు. చి.ల.సౌ. చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అవంతిక పాత్రలో రకుల్ ప్రీత్ నటిస్తోంది. జూలై 9న విడుదలైన టీజర్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ గోడకు ఏటవాలుగా నిలబడి గుప్పుగుప్పుమంటూ సిగరెట్ పొగను గాల్లోకి వదలడం, హీరో నాగార్జునతో ఆమె డైలాగులు చర్చకు దారితీశాయి. కొందరేమో టీజర్ అద్భుతంగా వచ్చిందంటూ ప్రశంసిస్తుంటే, మరికొందరేమో రకుల్ సిగరెట్ తాగే సీన్ను తప్పు పడుతున్నారు. ఎటొచ్చీ రాహుల్, చిన్మయిలకు మాత్రం ట్రోల్స్ తప్పట్లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. -
‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. 2002లో రిలీజ్ అయిన మన్మథుడు సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఫ్రెంచ్ సినిమా ఫ్రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. 2006లో రిలీజ్ అయిన ఫ్రెంచ్ మూవీ ‘ప్రీట్-మోయి టా మెయిన్’ లైన్తోనే మన్మథుడు 2ను తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో 43 ఏళ్ల వ్యక్తిని కుటుంబం సభ్యులు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంటారు. అతను మాత్రం ప్రేమ, పెళ్లి లాంటి కమిట్మెంట్స్ ఏవీ లేకుండా అమ్మాయిలతో సరదాగా గడిపేస్తుంటాడు. మన్మథుడు 2 టీజర్ లోనూ ఇదే కాన్సెప్ట్ కనిపించటంతో ఈ సినిమా రీమేక్గా ప్రచారానికి మరింత బలం చేకూరినట్టైంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మనసులు దోచే మన్మథుడు
నాగార్జున కింగ్ ఆఫ్ హార్ట్స్గా మారారట. మరి ఎవరెవరి మనసులు దోచుకున్నారో తెలియాలంటే టైమ్ పడుతుంది. నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘మన్మథుడు’ సీక్వెల్గా ‘మన్మథుడు 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రకుల్ ప్రీత్సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో సమంత, కీర్తీసురేశ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్ర టీజర్ను రేపు(గురువారం) రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: ఎం.సుకుమార్. -
ద్యుతీ యూఆర్ ట్రూ చాంపియన్: తెలుగు డైరెక్టర్
హైదరాబాద్ : అమ్మాయితో సహజీవనం చేస్తున్నాని ప్రకటించిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్పై టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రశంసలు కురిపించాడు. ద్యుతీ చంద్పై ప్రముఖ స్పోర్ట్స్ చానెల్ రాసిన కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్.. ద్యుతీని కొనియాడాడు. అయితే మూడు రోజుల క్రితమే తన రిలేషన్ గురించి ద్యుతీ బాహటంగా ప్రకటించినప్పటికీ.. మూడేళ్ల క్రితమే ఈ విషయాన్ని తమకు తెలిపినట్లు సదరు స్పోర్ట్స్ చానెల్ పేర్కొంది. ప్రేమకు జెండర్తో పనిలేదని, మనసులు కలిస్తే చాలని 2016లోనే ద్యుతీ చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది. అప్పటికి భారత్లో స్వలింగ సంపర్కం నేరమని, అయినా తన సహచర్యం గురించి తెలిపిందని ప్రస్తావించింది. ఆమె తన ఆట కోసం ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా వివరించింది. ఈ కథనానికి ముగ్ధుడైన రాహుల్.. ట్విటర్ వేదికగా ద్యుతీని ఆకాశానికెత్తాడు. ఈ కథనం చాలా స్పూర్తిదాయకంగా ఉందని, ఆమె తనకు ఎదురైన సమస్యలను అధిగమించి పోటీలో నిలవడం గొప్ప విషయమని, ‘ద్యుతీ యూ ఆర్ ట్రూ చాంపియన్’ అంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రాహుల్.. కింగ్ నాగర్జున హీరోగా మన్మథుడు-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 2002లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ఇది సీక్వెల్ అని తెలిసిందే. ఇక ద్యుతీ సహజీవనాన్ని ఆమె కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ద్యుతీ తల్లి, సోదరి మీడియా వేదికగా ఆమెను తప్పుబడుతూ కెరీర్ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్యుతీ మాత్రం ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, తన ప్రియురాలితో బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. If you’re reading something today.. let it be this. Very very inspiring. Imagine all that this girl has had to go through before the tender age of 23. And yet she found the resolve to step out and compete. Uncommon courage. You’re a true champion @DuteeChand 🙏🏽🙏🏽🙏🏽 https://t.co/xmZuICXzM1 — Rahul Ravindran (@23_rahulr) May 22, 2019 -
రకూల్
పోర్చుగల్లో షూటింగ్కు అంతా అనువుగా ఉన్నప్పటికీ ‘మన్మథుడు 2’ టీమ్లో మాత్రం హాట్ హాట్ వాతావరణం ఉందని, అందుకు కథానాయిక రకుల్ప్రీత్సింగే కారణమనే వార్తలు రెండు రోజులుగా నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని తెలిసింది. అంత కూల్గానే సాగుతోందట. నాగార్జున హీరోగా ‘చి..ల..సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాగ్ సరసన రకుల్ర్ పీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే రకుల్ నటన పట్ల టీమ్ సంతృప్తిగా లేదనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై రాహుల్ రవీంద్రన్ కూడా స్పందించారు. ‘‘ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదు. అవి కేవలం పుకార్లు మాత్రమే. పోర్చుగల్ షెడ్యూల్ స్టార్ట్ అయిన తొలి రోజు నుంచే రకుల్ మా టీమ్తో ఉన్నారు. ఆమె మంచి ప్రతిభాశాలి. అద్భుతంగా నటిస్తోంది. టీమ్ అందరం హ్యాపీగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. సో.. ర‘కూల్’ అన్నమాట. ఇక్కడ ఇన్సెట్లో ఉన్న నాగార్జున ఫొటోను రాహుల్ రవీంద్రన్ షేర్ చేసి, ‘ఈ ఒక్క సీన్ మీ కోసమే’ అని ట్వీట్ చేశారు. 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ‘మన్మథుడు 2’ సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. -
ఈ ఒక్క సీన్ మాత్రం మీకోసమే!
బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూ.. ఇక్కడ మల్టీస్టారర్లకు ఓకే చెప్తూ.. సోలోగానూ సినిమాలు ఫుల్ ఫామ్లో ఉన్నారు కింగ్ నాగార్జున. ఇటీవలె దేవదాస్తో పలకరించిన నాగ్.. అటు బాలీవుడ్లో ‘బ్రహ్మాస్త్ర’లో ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. నాగ్ ప్రస్తుతం ‘మన్మథుడు2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘చి.ల.సౌ’తో డైరెక్టర్గా మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ రవీంద్రన్.. మన్మథుడు2ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్లో షూటింగ్ జరుపుకుంటొంది చిత్ర యూనిట్. నాగ్కు సంబంధించిన ఓ షాట్ను రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ట్విటర్లో నాగ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఫిట్నెస్లో ఈ మనిషి.. అంటూ దండం పెడుతూ.. కింగ్ ఫ్యాన్స్.. ఈ ఒక్క సీన్ మాత్రం మీకోసమే అని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో సమంత ఓ ముఖ్యపాత్రను పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. This man.... pah! Fitness goals! 🙏🏽🙏🏽🙏🏽 King fans... ee okka scene maatram mee kosame💛 pic.twitter.com/6Gg3Rfo9G3 — Rahul Ravindran (@23_rahulr) April 18, 2019 -
రకుల్ను పొగిడేస్తున్న దర్శకుడు!
రకుల్ ప్రీత్ సింగ్ ఎంత స్పీడ్గా స్టార్ హీరోయిన్ అనిపించుకుందో.. అంతే స్పీడ్గా ఫేడవుట్ అయిన భామల లిస్ట్లోకి వెళ్లింది. బాలీవుడ్లో అదృష్టం కలిసి రాకపోయినా.. అక్కడ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక కోలీవుడ్లో కూడా రకుల్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం రకుల్ మన్మధుడు2లో నటిస్తోంది. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో కింగ్ నాగార్జునతో మన్మధుడు2 చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని కొట్టేశాడు. ఈ మూవీ షూటింగ్ పోర్చుగల్లో జరుగుతోంది. రకుల్పై ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రకుల్లో నమ్మలేనటువంటి ప్రతిభ ఉందంటూ పొగడ్తల వర్షం కురిపించాడు దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జునకు, ‘వెన్నెల’ కిశోర్కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా స్క్రిప్ట్, డైలాగ్స్ను రెడీ చేశారట రాహుల్ రవీంద్రన్. రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. Contrary to some rumours, Rakul has been shooting with us from day one of the Portuguese schedule. We have all been gushing non-stop about how stunning she’s looking and thanking our lucky stars that we got her. What an incredible talent she is💛💛💛 Love to all😊😊😊 — Rahul Ravindran (@23_rahulr) April 18, 2019 -
‘వైరముత్తును పెళ్లి చేసుకో; ఐడియా బాగుంది’
పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని.. ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు బాధితులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపిస్తున్నారు. 18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అంతేకాదు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... ‘ దీనికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు వైరముత్తును పెళ్లి చేసుకో. గత కొన్ని రోజులుగా నువ్వు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. స్టుపిడ్ నీకేం పనిలేదా. ఎప్పుడూ ఆయన(వైరముత్తు) గురించే మాట్లాడతావు. నువ్వు బీజేపీ వ్యక్తివని మాకు తెలుసు’ అంటూ ద్వేషపూరిత కామెంట్ చేశాడు. ఇందుకు స్పందించిన చిన్మయి... ‘ మీ ఐడియా చాలా బాగుంది. కానీ నాకు నచ్చలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా తనకు అండగా నిలుస్తూ భర్త రాహుల్ రవీంద్రన్ గతంలో రాసిన లేఖను ట్వీట్ చేశారు. ‘ పనికిలేని వాళ్లంతా నా టైమ్లైన్లో చెత్త రాస్తున్నారు. నా భార్య కారణంగా మీకేదో ఇబ్బంది కలుగుతోందని అర్థమవుతోంది. ఎందుకంటే తనో ప్రత్యేకమైన వ్యక్తి. మాట్లాడే ధైర్యం కలది. మగ అహంకారం చూపి తనను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రపంచం మారుతోందన్న విషయాన్ని మీరు అంగీకరించరు. సమానత్వం వచ్చేదాకా తనలాంటి గొంతులు మరింతగా హోరు పెంచుతాయి. ప్రేమించే, జాగ్రత్తగా చూసుకునే, నిస్వార్థంగా ఇతరుల కోసం జీవించే మహిళను నేను భార్యగా పొందాను. మీరు కూడా మీ వ్యక్తిత్వానికి తగిన భార్యను వెతుక్కోండి. ఆమె లాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లు మీలాంటి సంకుచిత వ్యక్తులను ఎంచుకుంటారా అనేదే కాస్త సందేహంగా ఉంది’ అంటూ రాహుల్ రవీంద్రన్ తన భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ‘నా భర్త స్ట్రాంగెస్ట్’ అని చిన్మయి ఈ లేఖను మరోసారి ట్విటర్లో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయిపై విషం చిమ్మిన నెటిజన్ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. ‘బాధితులకు ఎంత మంచి సలహా ఇచ్చావురా నాయనా. అలాంటి వాళ్లు మనింట్లో ఉన్నా కూడా ఇలాగే చెప్పాలి. ఎంతైనా నువ్వు గ్రేట్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. What an idea. Sorry not interested. https://t.co/DsURMwT9b6 — Chinmayi Sripaada (@Chinmayi) April 15, 2019 ❤️❤️❤️❤️❤️💪🏻💪🏻💪🏻💪🏻 My husband strongest. https://t.co/EEAJzSHopn — Chinmayi Sripaada (@Chinmayi) October 17, 2018 -
పోర్చుగల్ ప్రయాణం
మన్మథుడి బంధువులు పోర్చుగల్లో ఉన్నారు. వారిని కలవడానికి త్వరలో అక్కడికి వెళ్లబోతున్నారు నాగార్జున. ఈపాటికే అర్థమై ఉంటుంది.. ఇది ‘మన్మథుడు 2’ సినిమా గురించి అని. నాగార్జున హీరోగా ‘చి.ల.సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం టీమ్ పోర్చుగల్ ప్రయాణమవనున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ వచ్చే వారం ఆరంభం అవుతుందని సమాచారం. పోర్చుగల్లో సెటిల్ అయిన తన బంధువులను కలవడానికి హీరో వెళతాడట. అలాగే ఈ సినిమాలో నాగార్జునకు, ‘వెన్నెల’ కిశోర్కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా స్క్రిప్ట్, డైలాగ్స్ను రెడీ చేశారట రాహుల్ రవీంద్రన్. రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. -
‘మన్మథుడు 2’ ఫ్యామిలీతో కింగ్
కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఈ సినిమా షూటింగ్ గత వారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ తో కలిసి నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించి ఓ ఇంట్రస్టింట్ అప్డేట్ ఇచ్చారు నాగార్జున. చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సెల్ఫీ దిగిన నాగ్ ఆసెల్పీని తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశారు. ‘నేను నా మన్మథుడు 2 ఫ్యామిలీ!!! లవింగ్ ఇట్’ అని కామెంట్ చేశారు. ఈ సెల్ఫీలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్, సీనియర్ నటి లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ తదితరులున్నారు. ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
దర్శకుడిగా మారనున్న హీరో
టాలీవుడ్ నటులుగా సక్సెస్ సాధించి దర్శకులుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్ తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకులుగా మారి సత్తా చాటారు. వీరిలో వెన్నెల కిశోర్ సక్సెస్ కాలేకపోయినా అవసరాల, రాహుల రవీంద్రన్లు విజయం సాదించారు. తాజాగా ఈ లిస్ట్లో మరో హీరో చేరేందుకు రెడీ అవుతున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది..? సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్సేన్ మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు గతంలో ఓ షార్ట్ఫిలింస్కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ‘అంగమలై డైరీస్’ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు విశ్వక్సేన్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకనట వెలువడనుంది. -
మన్మథుడు ఈజ్ బ్యాక్!
దర్శకునిగా తొలి సినిమా ‘చి.ల.సౌ’ రిలీజ్ కాకముందే అన్నపూర్ణలాంటి బిగ్ బ్యానర్లో సినిమా చేసే ఛాన్స్ను దక్కించుకున్నారు రాహుల్ రవీంద్రన్. అటు నటుడిగానూ సక్సెస్ఫుల్ కెరీర్ను లీడ్ చేస్తున్నారు. రాహుల్ దర్శకత్వం వహించిన ‘చిలసౌ’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కింగ్ నాగార్జునను డైరెక్ట్ చేయబోతున్నారు రాహుల్. ఇందుకోసం ఆయన ఓ రొమాంటిక్ కథను కూడా రెడీ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2002లో నాగ్ నటించిన ‘మన్మథుడు’ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ‘మన్మథుడు 2’ అనే టైటిల్ని అక్కినేని కాంపౌండ్ రిజిస్టర్ చేయించిందనే వార్త వినిపిస్తోంది. ఈ టైటిల్ నాగార్జున– రాహుల్ రవీంద్రన్ సినిమాకేనా? అంటే వెయింట్ అండ్ సీ అంటున్నారట టీమ్. మరోవైపు రెండేళ్ల క్రితం నాగార్జున హీరోగా కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జోరందుకుందట. -
‘యు టర్న్’కు డేట్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ సమంత ఓ డిఫరెంట్ రోల్ నటిస్తున్న సినిమా యు టర్న్. కన్నడలో సూపర్ హిట్ అయిన యు టర్న్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన యు టర్న్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు, తమిళభాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యువ నటుడు రాహుల్ రవీంద్రన్, సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పూర్ణ చంద్ర తేజస్వి సంగీతమందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్ బ్యానర్స్ పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్నారు. -
కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా
‘‘యు టర్న్’ టీమ్ అంతా ఫ్రెండ్సే. ఓ ఫ్యామిలీలాగా కలిసిపోయి ఈ సినిమా చేశాం. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ‘లూసియా’ సినిమాతో దర్శకుడు పవన్కుమార్కి పెద్ద ఫ్యాన్ అయ్యాను’’ అని సమంత అన్నారు. ఆమె లీడ్ రోల్లో, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను శుక్రవారం విడుదల చేశారు. సమంత మాట్లాడుతూ – ‘‘అందరం సిన్సియర్గా చేసిన ప్రయత్నం ‘యు టర్న్’. నిర్మాతలు కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా. కానీ, వాళ్లు చక్కగా డీల్ చేశారు. మా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘సమంత మంచి నటే కాదు.. మంచి మనిషి కూడా. నా చిత్రాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన చిత్రమిది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘ఒకప్పుడు సమంతకు, ఇప్పటి సమంతకు చాలా తేడా కనపడుతోంది. నటిగా ఇంకా ఎదిగింది’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘ఇంత మంచి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ జర్నీ చాలా విషయాలను నేర్పింది. సమంతగారు మంచి నటి. ఆవిడతో పనిచేయడం హ్యాపీ’’ అన్నారు పవన్కుమార్. -
అంజలి మరో యాంగిల్
క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘చి ల సౌ’ మంచి టాక్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమాతో రుహాని శర్మ హీరోయిన్గా పరిచయం అయ్యారు. అంజలి పాత్రలో తొలి సినిమాతోనే నటిగా ఫుల్ మార్క్స్ సాధించిన ఈ బ్యూటీ ఆడియన్స్ను హోమ్లీ లుక్లో ఫిదా చేశారు. సినిమా అంతా ఒకే రోజులో జరిగే కథ కావటంతో లుక్ పరంగా రుహానికి వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కలేదు. క్యారెక్టర్ పరంగా మిడిల్ క్లాస్ అమ్మాయిగా చుడిదార్లో పద్దతిగా కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ నుంచి బయటపడేందుకు రుహాని శర్మ ఓ హాట్ ఫొటో షూట్ చేశారు. తనలో గ్లామర్ యాంగిల్ కూడా ఉందని హింట్ ఇచ్చారు. మరీ ఈ ఫొటోషూట్తో రుహాని ఇమేజ్ మారుతుందేమో చూడాలి. -
‘చి.ల.సౌ.’ మూవీ రివ్యూ
టైటిల్ : చి.ల.సౌ. జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిశోర్, రోహిణి, అను హసన్, సంజయ్ స్వరూప్ సంగీతం : ప్రశాంత్ విహారి దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్ నిర్మాత : అక్కినేని నాగార్జున, జస్వంత్ నాడిపల్లి, భరత్ కుమార్ అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ తరువాత నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా ‘చి.ల.సౌ.’ సినిమాను తెరకెక్కించాడు రాహుల్. సెన్సిబుల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా నచ్చటంతో అన్నపూర్ణ బ్యానర్పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను రిలీజ్ చేశారు. నాగ్ను అంతగా మెప్పించిన అంశాలు చి.ల.సౌ.లో ఏమున్నాయి..? ఈ సినిమాతో సుశాంత్ హిట్ ట్రాక్లోకి వచ్చాడా..? దర్శకుడిగా తొలి ప్రయత్నంలో రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడా..? కథ ; ఐదేళ్ల వరకు పెళ్లే వద్దని పట్టుపట్టి కూర్చున్న అర్జున్ (సుశాంత్)ని ఎలాగైన పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటారు అమ్మానాన్నలు (అను హసన్, సంజయ్ స్వరూప్). ఇంట్లో పోరు సరిపోలేదన్నట్టుగా తన బెస్ట్ ఫ్రెండ్ సుజిత్ (వెన్నెల కిశోర్) కూడా అర్జున్ను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతుంటాడు. వీళ్ల పోరు పడలేక ఓ అమ్మాయితో పెళ్లిచూపులుకు ఒప్పుకుంటాడు అర్జున్. రొటీన్ పెళ్లి చూపులు లా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసిన పేరెంట్స్.. (సాక్షి రివ్యూస్) అర్జున్ను ఒక్కడినే ఇంట్లో ఉంచి అమ్మాయి వస్తుంది మాట్లాడమని చెప్తారు. అంజలి (రుహాని శర్మ) ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో కుటుంబానికి తానే పెద్ద దిక్కు అవుతుంది. అంజలిని చూసిన అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడా..? లేక తన మాట ప్రకారం ఐదేళ్ల వరకు పెళ్లి వాయిదా వేశాడా..? అసలు వాళ్ల పెళ్లి చూపులు ఎలా జరిగింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; చెప్పుకోవటానికి చాలా మంది నటులు ఉన్న హీరో హీరోయిన్లు తప్ప మిగత అన్ని పాత్రలు దాదాపు అతిథి పాత్రలే. సినిమా అంతా అర్జున్, అంజలిల చుట్టూనే తిరుగుతుంది. అర్జున్ పాత్రలో సుశాంత్ సహజంగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ప్రేమకథ కావటంతో డ్యాన్స్లు, ఫైట్లు చేసే ఛాన్స్ రాలేదు. నటన పరంగా మాత్రం ఫుల్ మార్క్ సాధించాడు సుశాంత్. హీరోయిన్ గా పరిచయం అయిన రుహాని శర్మ తొలి సినిమాతోనే సూపర్బ్ అనిపించింది. (సాక్షి రివ్యూస్) అర్జున్ మీద ఇష్టమున్నా కుటుంబ బాధ్యతల కారణంగా అవుననలేక, కాదనలేక మదన పడే పాత్రలో మంచి నటన కనబరిచింది. అందం, అభినయం రెండింటితోనూ మెప్పించింది. వెన్నెల కిశోర్ తన మార్క్ కామెడీ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్తో నవ్వించాడు. హీరోయిన్ తల్లిగా రోహిణి, హీరో తల్లి దండ్రులుగా అను హసన్, సంజయ్ స్వరూప్, ఇతర పాత్రల్లో విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాహుల్ రవీంద్రన్. రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా పెళ్లిచూపులతో మొదలయ్యే ప్రేమకథతో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగానే కాదు రచయితగానూ మంచి మార్కులు సాధించాడు. టేకింగ్లోనూ కొత్త దనం చూపించాడు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక్క పూటలో జరిగే సంఘటనలు నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. (సాక్షి రివ్యూస్)ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిశోర్, సుశాంత్ల కాంబినేషన్లో వచ్చే కొన్ని సీన్స్ బోరింగ్గా అనిపిస్తాయి. పెళ్లిచూపులు సీన్ మొదలైన తరువాత కథనం ఇంట్రస్టింగ్ మారుతుంది. సినిమాకు సినిమాటోగ్రఫి మరో ప్రధాన బలం. షూటింగ్ పెద్దగా లోకేషన్లు లేకపోయినా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం లీడ్ యాక్టర్స్ నటన కామెడీ మైనస్ పాయింట్స్ : ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని బోరింగ్ సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘చి ల సౌ’ ప్రెస్మీట్
-
ప్రతి ఒక్కడికీ కత్రినాకైఫ్ కావాలి.. కానీ!
హైదరాబాద్ : ‘ప్రతి ఒక్కడికీ కత్రినా కైఫ్ కావాలి.. కానీ ఎవ్వడూ రణ్బీర్లా ఉండడు’ అంటూ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ పోస్ట్ చేశారు. అదేంటీ రకుల్ను ఎవరైనా హర్ట్ చేశారా అనుకుంటున్నారా. అదేం లేదండీ.. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘చి ల సౌ’ మూవీ ప్రమోషన్లో భాగంగా నటి రకుల్ ఓ డైలాగ్ను డబ్స్మాష్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో రకుల్ పోస్ట్ చేసిన ఆ డబ్స్మాష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిలీజ్కు ముందే మూవీ చూడాలని ఉందా! హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ‘చి ల సౌ’ సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ‘ఇక్కడ నా ఫెవరెట్ డైలాగ్ ఉంది. అమ్మాయిలు ఏమంటారు. మీరు విడుదలకు ముందే ఆ చిత్రాన్ని చూడాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డబ్స్మాష్ వీడియోలను FunWithChiLaSow హ్యాష్ ట్యాగ్తో షేర్ చేయండి. మూవీ యూనిట్తో కలిసి సినిమా చూసే చాన్స్ రావచ్చు’ అంటూ తన ఇన్స్ట్రాగ్రామ్లో రకుల్ చేసిన పోస్టుకు భారీగా స్పందన వస్తోంది. అయితే కొందరు మాత్రం రకుల్ మీరు గతంలోలాగ చబ్బీగా లేరు.. డైటింగ్ తగ్గించి మళ్లీ బొద్దుగా తయారవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు. సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘చి ల సౌ’.. ఈ మూవీ ద్వారా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుశాంత్కు జోడీగా రుహాని శర్మ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై మూవీ యూనిట్ ధీమాగా ఉంది. Here’s a dubsmash of my current fav dialogue. Totally love it ! 😂❤️ what say girls ?? cant wait to watch #ChiLaSow...If you wanna watch the the film before release with the team.. send your dubsmashes with #FunWithChiLaSow and you could win a chance:) @AnnapurnaStdios @SiruniCineCorp @iamSushanthA @iRuhaniSharma @rahulr_23 @23_rahulr A post shared by Rakul Singh (@rakulpreet) on Jul 18, 2018 at 2:11am PDT -
వరుసగా రెండు సినిమాల్లో చై - సామ్
అక్కినేని కోడలు సమంత పెళ్లి తరువాత కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. వరుస సినిమాతో నటిగా బిజీ అవుతున్నారు. ఇప్పటికే యు టర్న్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత, మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో చై -సామ్ జంటగా నటించనున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాలోనూ ఈ జంట కనువిందు చేయనుందట. రిలీజ్కు రెడీ అవుతున్న ‘చి ల సౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న రాహుల్ రవీంద్రన్ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఉంటుందని ప్రకటించిన రాహుల్.. నాగచైతన్య, సమంత కాంబినేషన్లో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
సమంత చేతుల మీదుగా ‘చిలసౌ’..?
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుశాంత్. కాళిదాసు సినిమాతో వెండితెరకు పరిచయమై సక్సెస్ సాధించారు. ఆ తరువాత ఆయన కెరీర్లో ‘కరెంట్’ సినిమా మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ మూవీ విజయం సాధించలేదు. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్కు చిలసౌ సినిమాతో విజయం వరించబోతున్నట్లే కనిపిస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్కు మంచి ఆదరణ లభించింది. ఈ టీజర్కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మూవీపై హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు జూలై 11న సాయంత్రం ఆరు గంటలకు పెళ్లి కూతురు (రుహాని శర్మ)కు సంబంధించిన టీజర్ను సమంత విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూలై 27న విడుదల కానుంది. -
‘చి ల సౌ’ రిలీజ్ డేట్ ఫిక్స్
సుశాంత్ హీరోగా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చి ల సౌ’.. హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు హీరో సుశాంత్ తెలిపారు. -
బిగ్ బ్యానర్లో సెకండ్ ఛాన్స్
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన యువ నటుడు రాహుల్ రవీంద్రన్. తొలి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయాడు. ఒకటి రెండు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్లో కనిపించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు రాహుల్. ఈ సినిమా సెట్స్మీద ఉండగానే మరో సినిమాకు ఓకె చెప్పాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ప్రస్టీజియస్ బ్యానర్లో దర్శకుడిగా తన రెండో సినిమా తెరకెక్కనుందట వెల్లడించారు రాహుల్. నటీనటులు సాంకేతిక నిపుణులను ఫైనల్ చేయాల్సి ఉందని తెలిపారు. Here’s the other news am soooper happy to share with you all:) I have signed with @AnnapurnaStdios for my second directorial:) Will be an absolute honour and I will work hard to make it count:) Cast and other details yet to be finalised. — Rahul Ravindran (@23_rahulr) 6 July 2018 -
మహానటిలా సమంత..!
మహానటి సినిమాలో సావిత్రి పరిచయ సన్నివేశానికి అద్భుతమైన స్పందన వచ్చింది. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా గ్లిజరిన్ లేకుండానే సావిత్రి ఒక కంటి నుంచి కన్నీరు కార్చినట్టుగా తెరకెక్కించిన ఈ సన్నివేశానికి థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. అయితే ఇలాంటి సంఘటనే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యు టర్న్’ సినిమా సెట్లో జరిగింది. ఈ విషయాన్ని నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు యాక్షన్ చెప్పగానే ఎలాంటి గ్లిజరిన్ లేకుండానే సమంత కన్నీళ్లు కార్చేసిందట. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన రాహుల్ ట్విటర్లో తన అనుభవాన్ని వివరించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన యు టర్న్ సినిమా తెలుగులో సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు వర్షన్ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. Our director just has to call action and this girl @Samanthaprabhu2 can sob her heart out on cue... and how! No glycerin nothing. Sammo... cut! 😄😄🙌🏽🙌🏽 #UTurn — Rahul Ravindran (@23_rahulr) 23 May 2018 -
నీకొచ్చింది జ్వరం.. క్యాన్సర్ కాదు
సాక్షి, హైదరాబాద్: వరుసగా సినిమాలు చేస్తున్నా అక్కినేని యంగ్ హీరో సుశాంత్కు సక్సెస్ రేటు మాత్రం అంతగా లేదు. ఈ తరుణంగా అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీసిన చిత్రంలో సుశాంత్ హీరోగా నటించాడు. అదే చి.ల.సౌ. ఈ చిత్ర టీజర్ను దగ్గుబాటి రానా కాసేపటిక్రితం విడుదల చేశాడు. సల్మాన్ ఖాన్ అభిమాని, ఆంజనేయస్వామి భక్తుడైన ఓ యువకుడు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ, అతని తల్లి మాత్రం పెళ్లి చేసుకోవాలంటూ అతన్ని ఒత్తిడి చేస్తుంటుంది. ఆంజనేయుడి ముందు కొడుకు మనసు మార్చాలని తల్లి వేడుకోవటం, నీకొచ్చింది జ్వరం.. కాన్సర్ కాదని హీరో తన తల్లితో చెప్పే డైలాగులు. మొత్తానికి ఎంటర్టైనింగ్గా ఫస్ట్ టీజర్ను కట్ చేశారు. సుశాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ నవ్వులు పంచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో రుహని శర్మ హీరోయిన్గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. మేకర్లు త్వరలోనే ‘చి.ల.సౌ.’ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. -
చి.ల.సౌ. టీజర్ విడుదల
-
సుశాంత్కు రానా సహాయం!
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుశాంత్. కరెంట్ సినిమాతో విజయాన్ని సాధించినా, ఈ మధ్యకాలంలో సరైన హిట్ రాలేదు. సుశాంత్ చివరగా ‘ఆటాడుకుందాం రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం సుశాంత్, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో చి.ల.సౌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పొస్టర్ను ఈ మధ్యే రిలీజ్ చేశారు. మే 7న టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్ను లాంచ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. హీరోగా ఉన్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. -
‘చి.ల.సౌ’ ఫస్ట్లుక్ రిలీజ్
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ తొలిసారిగా దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘చి.ల.సౌ’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా నటిస్తున్నాడు. రుహని శర్మ హీరోయిన్గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా రేపు (మార్చి 18న) రిలీజ్ చేయాలని భావించారు. కానీ, అభిమానులకు ఉగాది కానుకగా ఒకరోజు ముందుగానే ఫస్ట్ లుక్ లాంచ్ పోస్టర్ను విడుదల చేసింది మూవీ యూనిట్. నిర్మాతలు త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. -
ఫిబ్రవరి 23న ‘హైదరాబాద్ లవ్ స్టోరి’
త్వరలో చి..ల..సౌ సినిమాతో దర్శకుడిగా మారుతున్న రాహుల్ రవీంద్రన్ హీరోగానూ ఆసక్తికర చిత్రాలు చేస్తున్నారు. రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ’హైదరాబాద్ లవ్ స్టోరి’ ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్కు రెడీ అవుతోంది. జియా, రావు రమేష్, సూర్య, సనలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకత్వం వహించారు. ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొడుమగుల్లలు సంయుక్తంగా నిర్మిస్తుండగా సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చిందని సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
'దృష్టి 'ట్రైలర్ విడుదల
-
భారతం నుంచి బాహుబలి దాకా...
భారతం నుంచి బాహుబలి దాకా అన్ని అమ్మాయిల గురించే జరిగాయి అన్న డైలాగ్తో ‘దృష్టి’ సినిమా ట్రైలర్ విడుదలైంది. అందాల రాక్షసి ఫేం రాహుల్ రవీంద్రన్ హీరోగా, పావని హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్తోనే ప్రేక్షకులను థ్రిల్కు గురిచేసింది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఫోటోగ్రఫీ అంటే ఇష్టముండే వ్యక్తి పాత్రలో రాహుల్ నటించాడు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో సీనియర్ నటుడు సత్యప్రకాశ్, కమెడియన్గా వెన్నెలకిశోర్ పాత్రలకు ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది . దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను థ్రిల్లర్, యాక్షన్, కామెడీగా మలిచారు . సంగీతం : నరేశ్ కుమారన్, ఎడిటర్ : ఎస్ బి ఉద్దవ్, ఫోటోగ్రఫి : పి.బాలరెడ్డి, నిర్మాత : మోహన్. -
హౌరా బ్రిడ్జ్ వచ్చేస్తోంది....
హౌరా బ్రిడ్జ్ రావడమేంటీ...? మనమే దాని దగ్గరకు వెళ్లి చూడాలి కదా అని అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదండీ. అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ నటిస్తున్న ‘హౌరాబ్రిడ్జ్’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. హౌరాబ్రిడ్జ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇద్దరు ప్రేమికులను ఈ హౌరాబ్రిడ్జ్ కలుపుతుందేమో? అందుకే ఈ సినిమాకు ‘కనెక్టింగ్ లవ్’ అనే ట్యాగ్లైన్ పెట్టారు. ఈ సినిమాలో రాహుల్ సరసన చాందిని, మనాలీ రాథోడ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. రాహుల్ ప్రస్తుతం దృష్టి, శోభన్బాబు, హౌరాబ్రిడ్జ్ సినిమాలలో నటుడిగా బిజీగా ఉన్నారు. హౌరాబ్రిడ్జ్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు రేవన్ యాదు(బూచమ్మ బూచోడు ఫేం) దర్శకత్వం వహిస్తున్నారు. జనవరిలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం.త్వరలోనే చిత్రయూనిట్ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనుంది.సుశాంత్ హీరోగా రాహుల్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ‘చి ల సౌ’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. -
'దృష్టి' మూవీ స్టిల్స్
-
ఆసక్తికరంగా 'చిll లll సౌll'
అందాల రాక్షసి, అలా ఎలా, శ్రీమంతుడు లాంటి చిత్రాల్లో నటుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా సినిమాను ఎనౌన్స్ చేసిన రాహుల్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి బుధవారం సినిమాను ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరించారు. వివాహ వేదిక మీద ఉన్న చిll లll సౌll అనే అక్షరాలనే దేవతలు ఆశీర్వదిస్తున్నట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సిరుని సినిమా కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను భరత్ కుమార్ మలసాల, హరి పులిజలలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం మందిస్తున్నారు. సుశాంత్ సరసన రుహాణి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. Since we have an auspicious title for our film... we decided to announce it with an auspicious poster:) So here goes... #ChiLaSow pic.twitter.com/qUCs37irB2 — Rahul Ravindran (@23_rahulr) 11 October 2017 Wow! So much positivity! Just got done with our pooja. Thanks a million everyone. Ever grateful 😊🙏🏽 — Rahul Ravindran (@23_rahulr) 11 October 2017 -
దృష్టి ఎవరి పైన?
‘అందాల రాక్షసి, అలా ఎలా?’ సినిమాల ఫేమ్ రాహుల్ రవీంద్రన్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎమ్స్క్వేర్ పతాకంపై మోహన్ నిర్మించిన సినిమా ‘దృష్టి’. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథకు తగ్గ పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది. ‘దృష్టి’ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రాహుల్ను ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో ప్రీ–రిలీజ్ ఈవెంట్ నిర్వహించి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. పావనీ గంగిరెడ్డి హీరోయిన్గా, ‘వెన్నెల’ కిశోర్, సత్య ప్రకాశ్, రవి వర్మ, ప్రమోదిని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రీనివాస్ మోతుకూరి, కథ: బి. భానుకిరణ్, కూర్పు: ఉద్ధవ్ ఎస్.బి., కెమెరా: పి. బాలరెడ్డి, సంగీతం: నరేశ్ కుమారన్. -
సమంత 'దృష్టి' పడింది..!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖనటుడు, సింగర్ చిన్మయి భర్త, రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా అరంగేట్రం చోయబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా సినిమా ప్రారంభించబోతున్న రాహుల్ హీరోగానూ కొనసాగుతున్నాడు. రాహుల్ లీడ్ రోల్ లో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ సమంత ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది. మరోవైపు సమంత అద్భుత నటనకు, చిన్మయి డబ్బింగ్ పూవుకు తావిలా వుంటుందనేది జగమెరిగిన సత్యం. అందుకే రాహుల్కు కొత్త ప్రాజెక్టుకు ఆమె ఇంత సపోర్ట్ చేస్తున్నారనీ, తన గొంతుతో ఎనలేని కీర్తిని, గుర్తింపును తెచ్చిపెట్టిన చిన్మయి శ్రీప్రాదకు కృతజ్ఞతగానే సమంత దీనికి ఒప్పుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా దర్శకుడిగా తొలి సినిమా తీయబోతున్నానని రాహుల్ రవీంద్రన్ ప్రకటించారు. తన చిన్ననాటి కల నెరవేరబోతోందని.. ఈ సినిమాకు హీరో సుశాంత్ అని కూడా క్లారిటీ ఇచ్చారు. సిరుని సీనా కార్పొరేషన్ ప్రొడ్యూస్ చేయబోతోందని, అక్టోబర్ చివర్లోకానీ, నవంబరులో కాని షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు రాహుల్ వెల్లడించారు. అలాగే ఈ కొత్త ప్రాజెక్ట్లో వెన్నెల కిషోర్, విద్యారామన్ ను కూడా అలరించనున్నారు. Wishing my good friend @23_rahulr the very best on his new film #Dhrushti directed by @RamAbbaraju . Super cool poster pic.twitter.com/Af1D8ENjvt — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 7 September 2017 Super happy to tell you all that @Samanthaprabhu2 will release the title and first look posters of my next film tomorrow on twitter:) — Rahul Ravindran (@23_rahulr) September 6, 2017 -
హీరో రాహుల్ దర్శకత్వంలో సుశాంత్
‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’, ‘గాలిపటం’ తదితర చిత్రాల్లో హీరోగా, మహేశ్బాబు ‘శ్రీమంతుడు’లో కీలక పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారనున్నారు. సుశాంత్ హీరోగా సిరిని సినీ కార్పొరేషన్ నిర్మాణంలో ఈ సిన్మా తెరకెక్కనుందని రాహుల్ తెలిపారు. ‘‘చిన్ననాటి కలలను నిజం చేసుకునేందుకు దర్శకత్వంలో తొలి అడుగులు వేయబోతున్నాను. అక్టోబర్ లేదా నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘లవ్లీ స్క్రిప్ట్తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నా’’ అని సుశాంత్ ట్వీటారు. -
డైరెక్టర్గా మరో నటుడు
ప్రముఖనటుడు, సింగర్ చిన్మయి భర్త, రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా అరంగేట్రం చోయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ ట్విట్టర ద్వారా ప్రకటించారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఈ సంతోషాన్ని పంచుకున్నారు. దర్శకుడిగా తొలి సినిమా తీయబోతున్నానని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు. తన చిన్ననాటి కల నెరవేరబోతోందని.. ఆ వైపుగా తన తొలి అడుగులు పడుతున్నాయంటూ ట్వీట్ చేశారు. అలాగే ఈ సినిమాకు హీరో సుశాంత్ అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సరికొత్త ప్రాజెక్ట్ను సిరుని సీనా కార్పొరేషన్ ప్రొడ్యూస్ చేయబోతోందన్నారు. అంతేకాదండోయ్ హీరోయిన్ కోసం వెదుకుతున్నట్టు కూడా రివీల్ చేశారు. అక్టోబర్ చివర్లోకానీ, నవంబరులో కాని షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు వెల్లడించారు. అటు సుశాంత్ కూడా తన తదుపరి చిత్రంపై ట్వీట్ చేస్తూ తాను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నటించనున్నట్టు తెలిపారు. ఈ సినిమా స్క్రిప్ట్ లవ్లీగా ఉందనీ, తనకు అభిమానుల మద్దతును కావాలని పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ ప్రకటనతో ట్విట్టర్ లో సందడి నెలకొంది. రాహుల్ భార్య, ప్రముఖ గాయని చిన్నయి శ్రీపాద, దర్శకుడు అడవి శేషు, నటుడు వెన్నెల కిషోర్ తదితరులు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు. దీంతోపాటు నటులు వెన్నెల కిశోర్, విద్యారామన్ కూడా ఓ ఆసక్తికరమైన వీడియోను కూడా పోస్ట్చేశారు. దీనిపై రాహుల్ పాజిటివ్గా స్పందించారు. దీంతో ఈ కొత్త ప్రాజెక్ట్లో వీరిద్దరి బెర్త్లు కూడా కనఫాం అయినట్టే. Taking baby steps towards fulfilling a childhood dream:) My next project will be my directorial debut:) @iamSushanthA plays the male lead... — Rahul Ravindran (@23_rahulr) September 2, 2017 All the best @23_rahulr n @iamSushanthA .. - yours lovingly@VidyuRaman -
ఈ కామర్స్ సైట్కు హీరో పంచ్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ కు పంచ్ ఇచ్చాడు. ఇటీవల ఈ సైట్ ప్రకటించిన ఓ సేల్ కు సంబంధించి ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పై రాహుల్ స్పందించిన తీరు ఆకట్టుకుంది. ఐశ్వర్యారాయ్ పరిగెడుతున్న వీడియోను పోస్ట్ చేసి స్నాప్ డీల్, ఆ వీడియోకు 'మీరు ఎంత షాపింగ్ చేశారో మీ భర్తకు తెలిసే లోపే డోర్ దగ్గరకు పరిగెత్తండి' అనే కామెంట్ ను జోడించింది. ఈ ట్వీట్ పై స్పందించిన రాహుల్ రవీంద్రన్ 'గత ఏడాది నా సంపాదన కన్నా.. నా భార్య సంపాదనే ఎక్కువ.. తన ఆన్ లైన్ షాపింగ్ తన సంపాదన తోనే చేస్తోంది. కాబట్టి పరిగెత్తాల్సిన అవసరం లేదు' అంటూ ట్వీట్ చేశాడు. రాహుల్ ట్వీట్ పై స్పందించిన ఆయన భార్య ఇలాంటి భర్తనే ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది అంటూ ట్వీట్ చేసింది. రాహుల్ కామెంట్ చేసిన తరువాత స్నాప్ డీల్ తన ట్వీట్ ను తొలగించింది. 👇🏼👇🏼 This is the kinda man one should be with, ladies. I hope you (and your parents) choose well. Happy Independence Day. — Chinmayi Sripaada (@Chinmayi) 15 August 2017 -
మానవీయ విలువలకు వారధి
రాహుల్ రవీంద్రన్ హీరోగా రేవన్ యాదు దర్శకత్వంలో ఎమ్.వి. స్టూడియోస్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘హౌరా బ్రిడ్జ్’. చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ హీరోయిన్లు. హైదరాబాద్లో ప్రచార చిత్రాలను విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – ‘‘హ్యూమన్ రిలేషన్స్కి ఈ కథ బ్రిడ్జ్గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ ఏంటి? అనేది ఇప్పుడే చెప్పను. ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు. రేవన్ యాదు మాట్లాడుతూ – ‘‘ఓ వంతెన (బ్రిడ్జ్) నేపథ్యంలో జరిగే ఆసక్తికరమైన కథ ఇది. వచ్చే నెల మొదటి వారంలో టీజర్, రెండో వారంలో ఆడియో, నెలాఖరున సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: విజయ్ మిశ్రా, సంగీతం: శేఖర్ చంద్ర. -
వెరైటీ ప్రేమకథ
రాహుల్ రవీంద్రన్ హీరోగా ‘రామసక్కనోడు’ అనే ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. నిత్యాశెట్టి, తరుణిక కథానాయికలు. రాథోడ్ ఎం.దర్శకత్వంలో అమ్మానాన్న ఫిలింస్ పతాకంపై మణీంద్రన్ ఎం. నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ పాత్రికేయులు వినాయకరావు కెమేరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక డిఫరెంట్ లవ్స్టోరీ. ఆర్నెల్లు స్క్రిప్ట్ వర్క్ చేశాం. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు వినోదంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘నేను గతంలో చేసిన చిత్రాలకంటే ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. కథ విని వెంటనే ఓకే చెప్పేశా. నా కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ప్రశ్నాత్ తాత. -
వినోదాత్మకంగా...
‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ కథా నాయకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. రాథోడ్ దర్శకత్వంలో అమ్మా నాన్న ఫిలిమ్స్ పతాకంపై మణీంద్రన్ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలూ ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతాం. హీరోయిన్స్, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అని తెలిపారు. ‘‘కథ నచ్చడంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నాం. మా బ్యానర్లో మంచి చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: జవహర్ రెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్, సహ నిర్మాత: ప్రశ్నాత్ తాత. -
టైగర్ మూవీ రివ్యూ
చిత్రం - టైగర్, తారాగణం - సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్, మాటలు - అబ్బూరి రవి, సంగీతం - ఎస్.ఎస్. థమన్, పాటలు - భాస్కరభట్ల, అనంత్శ్రీరామ్, ఎడిటింగ్ - ఛోటా కె. ప్రసాద్, కెమేరా - ఛోటా కె. నాయుడు, సమర్పణ - 'ఠాగూర్' మధు, నిర్మాత - ఎన్.వి. ప్రసాద్, కథ, స్క్రీన్ప్లే - దర్శకత్వం - వి.ఐ. ఆనంద్ ...................................... ఈ మధ్య కాలంలో హీరోయిన్ లేని హీరో పాత్రను చూసి ఎన్నాళ్ళయింది? సినిమాలో మూడు, నాలుగే తప్ప అంతకు మించి పాటలే లేకపోవడమనేది సగటు తెలుగు సినిమాలో సాధ్యమై ఎన్నేళ్ళయింది? ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి కోసం హీరో వెళ్ళి వెళ్ళి విలన్ ఇంట్లోనే చేరి, కథను కంచికి చేర్చడమనే సగటు తెలుగు సినిమా ఫార్ములాకు దూరంగా కమర్షియల్ సినిమా చూసి ఎన్ని రోజులైంది? బహుశా, అందుకే కావచ్చు... 'టైగర్' కాస్తంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. కథేమిటంటే... అనాథాశ్రమంలో కొన్నేళ్ళు కలిసి పెరిగినప్పటి స్నేహాన్ని మర్చిపోకుండా, ఆ స్నేహితుడి కోసం కష్టాల్లో సుఖాల్లో అండగా నిలిచిన 'టైగర్' అనే కథానాయకుడి కథ ఇది. చిన్నప్పుడు టైగర్ (సందీప్ కిషన్), విష్ణు (రాహుల్ రవీంద్రన్) గోదావరి ఒడ్డున రాజమండ్రిలో అనాథాశ్రమంలో పెరిగిన అనాథలు. పిల్లల్లేని దంపతులు (దర్శక - నటుడు కాశీవిశ్వనాథ్ జంట) విష్ణును తీసుకెళ్ళి పెంచుకుంటారు. పెద్దయిన విష్ణు విశాఖపట్నంలో కాలేజీ చదువు రోజుల్లోనే కాశీలోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన గంగ (‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్ కపూర్) అనే అమ్మాయితో అనూహ్యంగా ప్రేమలో పడతాడు. చాలాకాలం దూరంగా ఉన్న హీరో, హీరో ఫ్రెండ్ మళ్ళీ కలుస్తారు. అయితే, ఫ్రెండ్ ప్రేమ వ్యవహారంలో తలదూర్చిన హీరో మాట పడాల్సి వస్తుంది. వాళ్ళకు దూరం కావాల్సి వస్తుంది. అలాంటి టైమ్లో కాశీలో పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకున్న హీరో ఫ్రెండ్ జంట ఆపదలో ఇరుక్కుంటుంది. ఫ్రెండ్తో మాటలు కూడా లేని హీరోకు ఆ సంగతి తెలిసిందా? తెలిస్తే ఏమైంది? లాంటివన్నీ మిగతా సినిమా. ఎలా నటించారంటే... 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' తో ఆ మధ్య మంచి విజయం సాధించిన సందీప్ కిషన్ ఈ చిత్రంలో కాస్తంత భిన్నమైన ట్రీట్మెంట్ ఉన్న కథానాయక పాత్రను ఎంచుకున్నారు. తనకు అలవాటైన పద్ధతిలో పాత్రను చేసుకుంటూ వెళ్ళారు. కొన్నిసార్లు ఇతర హీరోలనూ గుర్తుతెచ్చారు. ఈ పాత్రకు తగ్గట్లు తన శారీరక భాషను మరికొంత తీర్చిదిద్దుకొని, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఉంటే, సన్నివేశాలు ఇంకా పండేవేమో అనిపించేలా చేశారు. హీరోకు బెస్ట్ ఫ్రెండ్గా రాహుల్ రవీంద్రన్ పాత్ర, నటన మేక్ బిలీవబుల్గా ఉన్నాయి. సీరత్ కపూర్ది కథలో ముఖ్యపాత్రే కాకపోతే, అభినయానికి అంత ఆస్కారమున్న పాత్ర కాదు. ఉన్నంతలో ఆమె బాగానే చేసిందని చెప్పుకోవాలి. 'సాప్ట్వేరులు అంతే' అని మాటిమాటికీ అనే పాత్రధారి, అలాగే కాలేజీ ఈవెంట్ దగ్గర కాసేపు సప్తగిరి, మరికొందరు నటులు కాసేపు నవ్విస్తారు. ఇక, సినిమా సెకండాఫ్లో ఆసుపత్రి మార్చ్యురీ దగ్గర 'తాగుబోతు' రమేశ్ షరా మామూలుగా తాగుతూనే ఎంట్రీ ఇస్తారు. ఆసుపత్రి చీఫ్ డాక్టర్గా సెకండాఫ్లో ఒక సీన్లో సీనియర్ దర్శకుడు ధవళసత్యం కనిపిస్తారు. హీరో ఫ్రెండ్ మీద జరిగే హత్యాప్రయత్నం సీన్, అలాగే హీరోతో అతని ఫ్రెండ్ ఘర్షణ పడి, అసహ్యించుకొనే సీన్ బాగున్నాయి. సాంకేతిక విభాగాల పనితీరేమిటంటే... తెరపై మనిషి కనిపించకపోయినా, ఈ సినిమాకు మరో పెద్ద హీరో - కెమేరామన్ ఛోటా కె. నాయుడు. ఆయన తన అద్భుతమైన కెమేరా పనితనంతో తెర నిండుగా కనువిందు చేశాడు. ఎప్పుడూ చూసే గోదావరి రైలు బిడ్జ్ దగ్గర నుంచి రాజమండ్రి అందాలు, ప్రసిద్ధమైన దేవీ చౌక్ లాంటి ప్రాంతాల లాంటివన్నీ ఏదో ఫారిన్ లొకేషన్ అనిపించేలా ఏరియల్ షాట్స్తో అదురుపుట్టించారు. అలాగే, కాశీలోని గంగానదిలో పడవ మీద వెళుతుంటే పక్షులు ఎగురుతూ వెళ్ళే దృశ్యం, దీపాలున్న పడవలతో నైట్ ఎఫెక్ట్ ఘట్టం, సంధ్యవేళ సాగే కాశీలోని గంగా హారతి దృశ్యాలు, సినిమా మొదట్లో వచ్చే ఛేజ్ లాంటివన్నీ పనితనమున్న ఛాయాగ్రహణమంటే ఏమిటో మరోసారి చూపెడతాయి. థమన్ సంగీతం బాగానే ఉంది. ఎడిటింగ్ కత్తెరకు మంచి పదును పెట్టడంతో, నిడివి తక్కువై, సినిమా మొదలైనంత వేగంగానే ముగిసీపోతుంది. 'నా దృష్టిలో దేవుడి సృష్టిలో గొప్పవాళ్ళు అమ్మానాన్న' లాంటి అబ్బూరి రవి డైలాగ్స్ ప్రత్యేకించి బాగున్నాయి. ఎలా ఉందంటే... ఈ సినిమాలో డీల్ చేసిన అంశాలూ - సమకాలీనమైనవే. కులాలు, మతాలు వేర్వేరనే కారణంతో ప్రేమలో ఉన్న కన్నబిడ్డల్ని సైతం కడతేర్చడానికి వెనుకాడక 'పరువు హత్యలు' (ఆనర్ కిల్లింగ్స్) చేయడం మన సమాజంలో ఇటీవల ఎక్కువవుతున్న విషయం. దీన్ని నేపథ్యంలో తీసుకొని, ఫ్రెండ్షిప్ కోసం నిలబడే పాజిటివ్ లక్షణాలున్న కథానాయకుడి చుట్టూ తిరిగే కథగా 'టైగర్'ను అల్లుకున్నారు. (నిజం చెప్పాలంటే, తింగరితనం, తేడాగా మాట్లాడడం లాంటివే హీరోయిజమ్ చలామణీ అవడం ఎక్కువయ్యాక, ఈ మాత్రం పాజిటివ్ క్వాలిటీ చూపెడుతున్న నాయక పాత్రలు తక్కువే). కథా స్థలం కాశీయా, కాకినాడా అన్న తేడా లేకుండా, పాత్రలన్నీ తెలుగులోనే మాట్లాడినట్లు చూపించామంటూ సినిమా మొదట్లోనే ఒక గమనిక టైటిల్ వేశారు. అలా వెసులుబాటు తీసుకోవడం, ఆ మాటేదో ముందే చెప్పేయడం బాగున్నా - ఏదో ఒకటీ, అరా డైలాగ్స్ అయితే బాగుండేది. కానీ, కాశీలో ఉత్తర హిందుస్థానీ కట్టూబొట్టూతో ఉన్న పాత్రలు కూడా 'వాణ్ణి వేసేయండ్రా' అంటూ మన ముఠాకక్షల సినిమాల్లోని పాత్రలలాగా మాట్లాడడం జీర్ణించుకోలేం. విజువల్కీ, ఆడియోకీ లంకె కుదరక ఆడియన్స్ను పైకి చెప్పలేని అసౌకర్యమేదో పీడిస్తుంది. అలాగే, హీరో ఇంట్రడక్షన్లో కాకుండా, తరువాతెప్పుడో 'టైగర్...' అంటూ అసందర్భంగా వచ్చిన టైటిల్ సాంగ్ ఒక్కటే కొంత అసందర్భంగా, పానకంలో పుడకలా అనిపిస్తుంది. 1989 నాటి కథ అని టైటిల్ వేసి మరీ అప్పటికే గోదావరి మీద రెండు రైలు వంతెనలున్నట్లు ఆ దృశ్యం చూపించారు (నిజానికి, ఇప్పటి ఆర్చ్ టైప్ రెండో రైలు వంతెన ప్రారంభమైంది 1997లో). అలాగే, హీరోకు అతని ఫ్రెండ్ పరిస్థితి గురించి ఫోన్ చేసిన వ్యక్తి తాలూకు హత్య జరిగితే, హీరో నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం, 'యాక్సిడెంట్ కేస్ సార్' అని నర్సు అంటుంటే హీరో కొత్తగా వింటున్నట్లు చూడడం - లాంటి చిన్న చిన్న లోటుపాట్లున్నాయి. అలాంటి చిన్నా చితకా లోపాలను పక్కనపెడితే, గతంలో ‘హృదయం ఎక్కడున్నది?’ సినిమా తీసిన తమిళ దర్శకుడు వి.ఐ. ఆనంద్ చేసిన ఈ మరో ప్రయత్నం బాగుంది. ప్రాణప్రదంగా ప్రేమించుకున్న ఇద్దరు స్నేహితులనే మామూలు కథను కూడా స్క్రీన్ప్లే టెక్నిక్తో చాలా ఆసక్తికరంగా మలిచారు. సినిమాను విలక్షణంగా ప్రారంభించి, రాహుల్ రవీంద్రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చెప్పిస్తూ, దాన్ని ప్రస్తుతానికి ముడివేసిన తీరు బాగుంది. కేవలం రెండు గంటల నిడివే ఉన్న ఈ సినిమా ఫస్టాఫ్ చాలా చకచకా నడుస్తుంది. సెకండాఫ్లో కొంత వేగం తగ్గి, చివరలో ఉపన్యాసాలు వచ్చాయి. సినిమాటిక్ ముగింపు ఇచ్చారు. అయినా సరే, మొత్తం మీద ప్రేక్షకుడు సినిమాకు పాస్ మార్కులు వేసేస్తాడు. అదే ఈ వారం రిలీజైన నాలుగైదు సినిమాల మధ్యలో ‘టైగర్’కు ఉన్న పెద్ద ఎడ్వాంటేజ్. పదే పదే చూడాలని అనిపించకపోయినా, ఒకసారి చూడడానికి మాత్రం 'టైగర్' రెండుగంటల పాటు ఏసీ థియేటర్లో టైమ్పాస్ ముంత కింది పప్పు! - రెంటాల జయదేవ -
మరిచిపోలేని అనుభవం!
‘‘ ‘అలా ఎలా’ సినిమా హిట్తో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే జాగ్రత్తగా స్క్రిప్ట్లు ఎంపిక చేసుకుంటున్న టైమ్లో ‘టైగర్’ కథ చెప్పారు ఈ చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్. ఇందులో హీరోకు తగ్గ పాత్ర నాది’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘టైగర్’ చిత్రంలో సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ కలిసి నటించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... ‘‘ఇద్దరు ప్రాణస్నేహితులు, ఓ అమ్మాయి మధ్య సాగే సినిమా ఇది. ఇందులో నా పాత్ర పేరు విష్ణు. స్నేహం, ప్రేమ కోసం ఏదైనా చేసే పాత్ర నాది. ఈ సినిమా గురించి మొదట సందీప్ కిషన్ నాతో చెప్పాడు. కథ వినగానే ఓకే చెప్పేశాను. అలాగే కెమెరామ్యాన్ ఛోటా కె నాయుడుతో వర్క్ చేయడం మరచిపోలేని అనుభవం. ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నా. మహేశ్బాబు నా ఫేవరెట్ హీరో. ఆయనే నన్ను ఆ సినిమాకు రికమెండ్ చేశారట. ఆ విషయం దర్శకుడు కొరటాల శివ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇవి కాక ‘సెగ’ డెరైక్టర్ అంజన తెరకెక్కిస్తున్న తమిళ చిత్రంలోనూ నటిస్తున్నా. ఆ సినిమాను తెలుగులో విడుదల చేస్తేనే ఒప్పుకుంటానని చెప్పాను. ఎందుకంటే, ప్రస్తుతం నా దృష్టి అంతా తెలుగు సినిమాల మీదే’’ అన్నారు. -
ఫ్రెండా? లవరా?
‘నీకు కుడి కన్ను కావాలా? ఎడమ కన్ను కావాలా?’ అని ఎవరైనా అడిగితే.. ఏం చెప్పగలం? ఆ కుర్రాడి పరిస్థితి కూడా అంతే. ప్రియురాలా? స్నేహితుడా? తేల్చుకోవాల్సి వచ్చింది. కానీ, ఇద్దరూ కావాలి. ఏం చేస్తాడు? ఈ ఇద్దరి కారణంగా ఆ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘టైగర్’. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. సందీప్ కిషన్ కెరీర్ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రమిదని ‘ఠాగూర్’ మధు అంటున్నారు. అందరూ చూడదగ్గ మంచి మాస్ మూవీ ఇదని, అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు. సందీప్ కిషన్ పాత్ర చాలా ఎనర్జిటిక్గా ఉంటుందని, అద్భుతంగా చేశాడని, ప్రేమ, స్నేహం, యాక్షన్ తదితర అంశాలతో రూపొందిన పూర్తి స్థాయి కమర్షియల్ మూవీ ఇదని ఎన్వీ ప్రసాద్ తెలిపారు. -
స్నేహమేరా జీవితం!
ఆ యువకుడికి తన స్నేహితుడంటే ప్రాణం. అనుకోకుండా ఆ స్నేహితునికి కష్టం ఎదురైంది. అప్పుడతను తన స్నేహితుణ్ణి ఎలా కాపాడుకున్నాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘టైగర్’. సందీప్కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్యతారలుగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వి.ఐ. ఆనంద్ దర్శకుడు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. స్నేహం, ప్రేమ, యాక్షన్ - ఇలాంటి విభిన్న అంశాల సమాహారమే ఈ చిత్రం. సందీప్ కిషన్ కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం ఇది’’ అని సమర్పకులు ‘ఠాగూర్’ మధు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె నాయుడు, మాటలు: అబ్బూరి రవి, లైన్ ప్రొడ్యూసర్:జి. నాగేశ్వరరావు. -
గత వేసవిలో ఇద్దరం స్కాట్లాండ్ వెళ్లాం
‘అందాల రాక్షసి’ చిత్రంతో యువతకు కనెక్ట్ అయిన హీరో రాహుల్ రవీంద్రన్. క్యూట్గా యూత్ హృదయాలను దోచుకున్న యువ నటుడు. తన చిన్నతనంలో వేసవి సెలవుల్లో చేసిన అల్లరిని, గడిపిన క్షణాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నేను పుట్టింది చెన్నైలో. స్కూలింగ్, కాలేజీ కూడా అక్కడే చేశాను. వేసవి సెలవులను ఒక సంవత్సరం అమ్మ తరపు కజిన్స్ ఇంట్లో, మరో సంవత్సరం నాన్న తరపున కజిన్స్ ఇంటికి వెళ్లి సరదాగా గడిపేవాడిని. మా పెద్దమ్మ జంషడ్పూర్లో ఉండేది. అక్కడి ప్రదేశాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. పెదనాన్న టాటా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసేవారు. పెద్ద బంగ్లా, లైబ్రరీ, ఆటస్థలం ఉండేవి అక్కడ కజిన్స్తో ఫుల్గా ఎంజాయ్ చేసేవాడిని. పుస్తకాల్లో ఉన్న కామిక్ క్యారెక్టర్స్ని నిజ జీవితంలో ఉన్న అనుకొని వాటిని అనుకరిస్తూ ఉండేవాడిని. నాకు ఇంగ్లిష్, హిస్టరీ పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం. వేసవి సెలవుల్లోనే తదుపరి సంవత్సర పుస్తకాలను ముందుగానే అందించేవారు. నేను మాత్రం హిస్టరీ, ఇంగ్లిష్ పుస్తకాలను పూర్తిగా చదివేసేవాడిని. అందుకనేమో కొన్ని సార్లు ఆ రెండు సబ్జెక్ట్సే పాసయ్యేవాడిని. ఎనిమిదవ తరగతి నుంచి చెన్నైలో ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగాక ఎండను కూడా లెక్కచేయకుండా క్రికెట్, టెన్నిస్, ఫుట్బాట్ ఆటలు ఆడేవాళ్లం. పేరెంట్స్, రిలేటివ్స్ ఎంత తిడితే అంత ఎక్కువసేవు ఆటలతో గడిపేవాళ్లం. సినిమాల్లోకి వచ్చాక నేను చిన్నతనంలో చేసిన పనుల వల్ల కావచ్చు వేసవి రోజుల్లోనే ఎక్కువ షూటింగ్స్ వచ్చాయి. మండుటెండల్లో సినిమా షూటింగ్స్తో వేసవి రోజులు గడిచిపోయాయి. పెళ్లయ్యాక సింగర్ చిన్మయితో గత వేసవి సెలవులకు స్కాట్లాండ్ వెళ్లాం. ఈ సంవత్సరం వియాత్నాం గానీ కంబోడియా వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ వేసవిలో షూటింగ్స్ బాగానే ఉన్నా కొద్దిగా గ్యాప్ ఇస్తున్నా’.. అని నవ్వుతూ చెప్పారు. -
ప్రియురాలా? స్నేహితుడా?
ఒకవైపు ప్రియురాలు.. మరోవైపు స్నేహితుడు.. ఈ ఇద్దరూ ఆ కుర్రాడికి రెండు కళ్లులాంటివాళ్లు. ఈ ఇద్దరిలో ఎవరు కావాలి? అనడిగితే.. తేల్చుకోలేడు. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరు? ఏం చేస్తాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘టైగర్’. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, పూర్తి స్థాయి మాస్ పాత్రలో సందీప్ కిషన్ నటించిన చిత్రం ఇది. స్నేహితుడి పాత్రలో రాహుల్ రవీంద్రన్, ప్రేయసిగా సీరత్ కపూర్ నటించిన ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తమన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోందనీ, సందీప్ది చాలా ఎనర్జిటిక్ కారెక్టర్ అనీ ఎన్వీ ప్రసాద్ తెలిపారు. సందీప్ కెరీర్ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రమిదనీ, వారణాసి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రేమ, స్నేహం, యాక్షన్ ఉంటాయనీ ‘ఠాగూర్’ మధు చెప్పారు. -
ఫీల్గుడ్ లవ్స్టోరీ
‘‘సినిమా నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వినోదంతోపాటు సందేశం ఉన్న చిత్రాలు వస్తే బాగుంటుంది. ఈ చిత్రం టైటిల్ బాగుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా హీరో హీరోయిన్లుగా రాజ్ సత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘హైదరాబాద్ లవ్స్టోరీ’. ఎస్. పద్మజ సమర్పణలో ఎస్.ఎన్. రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించి, ఎంపీ జితేందర్రెడ్డికి ఇచ్చారు. ప్రచార చిత్రాలను నిర్మాత దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ వేడుకలో భీమినేని శ్రీనివాసరావు, వీఎన్ ఆదిత్య, జితేంద్ర, సందీప్ కిషన్, నవీన్చంద్ర, మనాలి రాధోడ్, దీక్షా పంత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘హైదరాబాద్ చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. లవ్, ఎంటర్టైన్మెంట్ సమాహారంతో సాగుతుంది’’ అన్నారు. ఇది ఫీల్గుడ్ లవ్స్టోరీ అని దర్శకుడు తెలిపారు. సునీల్ మంచి పాటలిచ్చారని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. -
నగరమే ప్రేమ నేపథ్యం
ప్రతి మనిషికీ ఓ ప్రేమ కథ ఉంటుంది. ఈ ప్రేమకు డబ్బు, చదువు, ఉద్యోగం - ఇలా ఏదైనా నేపథ్యం కావచ్చు. కానీ తమ సినిమాలో ప్రేమకు హైదరాబాద్ నగరమే నేపథ్యంగా నిలిచిందని దర్శకుడు రాజ్సత్య చెబుతున్నారు. రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా కాంబినేషన్లో పద్మజ. ఎస్ సమర్పణలో ఎస్.ఎన్. రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘హైదరాబాద్ లవ్స్టోరీ’. రొమాన్స్, ఫ్యాంటసీ, ఎమోషన్స్తో ఆద్యంతం ఈ చిత్రం ఆసక్తికరంగా రూపొందుతోందని, ఈ నెల 10న పాటలను, ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నింటి, సహనిర్మాత: ఎస్. శ్రీలక్ష్మి. -
దీనికి సీక్వెల్ చేస్తాం!
రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, శానీ సోలోమన్, ఖుషి, హెబ్బా పటేల్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘అలా ఎలా?’. అనీష్ కృష్ణ దర్శకత్వంలో అశోక్ వర్ధన్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘అందాల రాక్షసి’ తర్వాత తనకు అంత మంచి పేరు తెచ్చిన సినిమా ఇదేనని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఇదే టీమ్తో ఈ సినిమాకుసీక్వెల్ చేయాలనుకుంటున్నామనీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో షూటింగ్ మొదలుపెడతామనీ దర్శకుడు చెప్పారు. చిత్ర బృందంలో పలువురు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. -
అలా ఏలా మూవీ పోస్టర్స్
-
అలా ఏలా మూవీ స్టిల్స్
-
సినిమా రివ్యూ: గాలిపటం
నటీనటలు: ఆది, క్రిస్టినా అఖీవా, ఎరికా ఫెర్నాండెజ్, రాహుల్ రవీంద్రన్, పోసాని, హేమ, ప్రగతి, సప్తగిరి తదితరులు సినిమాటోగ్రఫి: కే.బుజ్జి సంగీతం: భీమ్స్ సెసిరోలియో కథ, స్క్రీన్ ప్లే: సంపత్ నంది నిర్మాతలు: సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయకుమార్ వట్టికూటి దర్శకత్వం: నవీన్ గాంధీ ప్లస్ పాయింట్స్: డైలాగ్స్ ఫోటోగ్రఫి మైనస్ పాయింట్స్: కథ, కథనం దర్శకుడిగా టాలీవుడ్ లో సుపరిచితులైన సంపతి నంది నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'గాలిపటం'. రొమాంటిక్ లవ్ స్టోరికి 'పవనిజం' అనే ఎక్స్ ట్రా కోటింగ్ ఇచ్చి ప్రేక్షకుల్లో గాలిపటంపై అంచనాలు పెంచడంలో 'సంపత్ నంది' సఫలమయ్యారు. తన మార్కు డైలాగ్స్ తో యూత్ కు కనెక్ట్ అయ్యేలా నిర్మించామనే ప్రచారంతో ముందుకు వచ్చిన 'గాలి పటం' ప్రేక్షకుల అంచనాల మేరకు ఎగిరిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే! కార్తీక్(ఆది), స్వాతి(ఎరికా ఫెర్నాండెజ్) కొత్తగా పెళ్లై.. ఒకే కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వ్యక్తిగత విభేదాల కారణంగా పెళ్లైన ఏడాదిలోపే స్నేహపూరితమైన వాతావరణంలో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే కార్తీక్ కు పరిణిత (క్రిస్టినా) అమ్మాయితో ప్రేమ వ్యవహారం, స్వాతి జీవితంలో ఆరవ్ రెడ్డి (రాహుల్)తో అఫైర్ ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదనుకుని మాజీ ప్రియురాలితో కార్తీక్, ప్రియుడితో స్వాతి జీవించాలనుకుంటారు. ప్రేమను కాదని పెద్దలు కుదిర్చిన పెళ్లిని కార్తీక్ ఎందుకు చేసుకున్నాడు? అఫైర్ వదులుకుని స్వాతి కార్తీక్ ను ఎందుకు పెళ్లి చేసుకుంది? చివరకు ఆరవ్, స్వాతి, కార్తీక్, పరిణితలు ఒక్కటవుతారా? లేక స్వాతి, కార్తీక్ లే కలిసి ఉండాలని కోరుకుంటారా అనే ప్రశ్నలకు దర్శకుడు నవీన్ గాంధీతో కలిసి సంపత్ నంది ఇచ్చిన సమాధానమే 'గాలిపటం'. సమీక్ష: ప్రస్తుత సాఫ్ట్ వేర్ యుగంలో యువతీ, యువకుల తీరుతెన్నులను ప్రధాన అంశంగా చేసుకుని ప్రేమ, పెళ్లి అంశాలను జోడించి అల్లుకున్న కథకు సామాజిక అంశాలను అక్కడ జొప్పించడమే కాకుండా వినోదాత్మకంగా చెప్పాలని సంపత్ నంది, నవీన్ గాంధీ చేసిన ప్రయత్నం కొంత సపలమైందని చెప్పవచ్చు. అయితే గాలిపటం చిత్రంలో డైలాగ్స్ పై పెట్టినంత దృష్టి.. కథ, కథనాలపై మరికొంత కేర్ తీసుకుని ఉంటే సంపత్ నందికి మరింత భిన్నమైన ఫలితం లభించి ఉండేది. డైలాగ్స్ అక్కడ బ్రహ్మండంగా పేలాయి. కాని కొన్ని కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని డైలాగ్స్ ఓవర్ టేక్ చేసి ఇదేం గోలరా అనే ఫిలింగ్ కలుగుతుంది. కొన్ని సామాజిక అంశాలను తెరపై చూపించడానికి ఎంచుకున్న పద్దతి కరెక్ట్ కాదనిపించినా.. కమర్షియల్ అంశాలను మేళవించి.. చివరికి మంచి అంశాన్ని ప్రేక్షకులకు చేరవేశాడనే విషయం బోధపడుతుంది. బామ్మల సీన్ల కన్విన్స్ చేయడానికి కొంత ఇబ్బంది ఉన్నా, భార్గవి దంపతుల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు కథను బాలెన్స్ గా ముందుకు తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే క్లైమాక్స్ పాయింట్ ను చెప్పడానికి మధ్యలో వినోదం పేరుతో కొన్ని సీన్లను హడావిడిగా చేర్చినట్టు అనిపిస్తుంది. అయితే తాను ఎంచుకున్న ముగింపుకు చేరవేయడానికి జోడించిన ట్విస్టులు అంతగా మెప్పించలేకపోవడం ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఏదిఏమైనా తాను అల్లుకున్న పాయింట్ తో ఆది, క్రిస్టినా, ఎరికాల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఆదికి ముఖ్యంగా కొంత నటనకు స్కోప్ ఉన్న పాత్రే లభించింది. రాహుల్ కు పెద్దగా ఉపయోగపడని, కెరీర్ కు తోడ్పాడనందించని పాత్రే దక్కింది. క్రిస్టినా, ఎరికాలు గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఇక మిగితా క్యారెక్టర్లు పర్వాలేదనిపించే రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రానికి కే.బుజ్జి అందించిన సినిమాటోగ్రఫి, భీమ్స్ సంగీతం అదనపు ఆకర్షణ. సంపత్ నంది టీమ్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. చివరగా యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నా... ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించడంపైనా 'గాలిపటం' విజయం ఆధారపడిఉంది. ట్యాగ్: తక్కువ వ్యాలిడిటితో ఎక్కువ రీఛార్జ్ -
లవ్.. రొమాన్స్.. కామెడీ...
రాహుల్ రవీంద్రన్, ‘వెన్నెల’ కిశోర్, షాని సాల్మన్, భానుశ్రీ మెహ్రా, ఖుషి, హెభా పటేల్ ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం-‘అలా ఎలా?’. అనీష్ కృష్ణ దర్శకత్వంలో అశోకా క్రియేషన్స్ పతాకంపై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘లవ్.. రొమాన్స్.. కామెడీ.. ఈ మూడు అంశాల నేపథ్యంలో విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కేరళ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన పాటలు వినడానికి, చూడ్డానికి బావుంటాయి. ఈ నెల మూడోవారంలో పాటలను, వచ్చే నెల తొలి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్. -
గాయని చిన్మయి వివాహ రిసెప్షన్
ప్రముఖ యువ గాయని చిన్మయి, నటుడు రాహుల్ రవీంద్రన్ల వివాహ రిసెప్షన్ బుధవారం ఉదయం చెన్నైలో ఘనంగా జరిగింది. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో పలు పాటలు పాడి బహుభాషా గాయనిగా పేరు తెచ్చుకున్న చిన్మయి, యువ నటుడు రాహుల్ రవీంద్రన్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల సమ్మతంతో వీరి వివాహం సోమవారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో నిడారంబరంగా సాగింది. బుధవారం జరిగిన వివాహ రిసెప్షన్కు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నటుడు విజయ్, కుటుంబం, కార్తీ, మిర్చి శివ, వివేక్, గాయని పి.సుశీల, దర్శకుడు గౌతమ్ మీనన్, ధరణి, గీత రచయిత వైరముత్తు తదితర ప్రముఖులు ఉండడం విశేషం. -
రాహుల్, చిన్మయి ఒక్కటయ్యారు!
వర్ధమాన నటుడు రాహుల్ రవీంద్రన్ తో గాయని చిన్మయి శ్రీపాద వివాహం సోమవారం చెన్నైలో దక్షిణ భారత సాంప్రదాయ పద్దతిలో జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా రాహుల్, చిన్మయిలు ప్రేమించుకుంటున్నారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. తమిళంలో వణక్కం చెన్నై, తెలుగులో అందాల రాక్షసి చిత్రాలతో రాహుల్ గుర్తింపు తెచ్చుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన చిన్మయి.. సమంత, సమీరారెడ్డి, కాజల్ అగర్వాల్, నీతూ చంద్రలకు గాత్రదానం చేశారు. చెన్నై ఎక్స్ ప్రెస్ లో 'తిత్లీ', మస్త మగన్ '2 స్టేట్స్' చిత్రంలోని పాటలు చిన్మయికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. -
‘నేనేం చిన్నపిల్లనా?’
రాహుల్, తన్వి వ్యాస్ జంటగా పి. సునీల్కుమార్రెడ్డి దర్శకత్వంలో డా. డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా?’. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న వెంకటేష్ సీడీని ఆవిష్కరించి, రామానాయుడు, రానాకి ఇచ్చారు.