Shai Hope
-
పూరన్ సిక్సర్ల సునామీ.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. హోప్ సెంచరీ వృధా
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ బోణీ కొట్టింది. దుబాయ్ క్యాపిటల్స్తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (52 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (29 బంతుల్లో 59; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నికోలస్ పూరన్ అర డజను సిక్సర్లతో సునామీ సృష్టించాడు. ముంబై ఇన్నింగ్స్లో పోలార్డ్ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ వసీం (18) రెండంకెల స్కోర్లు చేశారు. క్యాపిటల్స్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓలీ స్టోన్ 2, చమీరా ఓ వికెట్ దక్కించుకున్నారు.హోప్ సెంచరీ వృధాఛేదనలో క్యాపిటల్స్ ఓపెనర్ షాయ్ హోప్ (59 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. హోప్కు మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. బెన్ డంక్ (10), బ్రాండన్ మెక్ముల్లెన్ (16), గుల్బదిన్ నైబ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సికందర్ రజా (6), దుసన్ షనక (0) విఫలమయ్యారు. క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూఖీ, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్కిల్, అల్లా ఘజన్ఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. క్యాపిటల్స్ చేసిన స్కోర్లో హోప్ ఒక్కడే మూడొంతులు చేయడం విశేషం. 161 పరుగుల్లో హోప్ 101 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు, ఎక్స్ట్రాల రూపంలో 60 పరుగులు వచ్చాయి. -
చెలరేగిన జేడన్ సీల్స్.. దంచికొట్టిన కింగ్.. విండీస్దే సిరీస్
బంగ్లాదేశ్తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు విండీస్ పర్యటనకు వచ్చింది.ఈ క్రమంలో తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. మొదటి టెస్టులో వెస్టిండీస్ 201 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టులో ఊహించని రీతిలో పుంజుకున్న బంగ్లా 101 పరుగుల తేడాతో విండీస్ను కంగుతినిపించింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ముగిసింది.అనంతరం.. సెయింట్ కిట్స్ వేదికగా వన్డే సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్లో ఆతిథ్య విండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే జోరులో మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలోనూ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన వెస్టిండీస్.. బంగ్లాను 227 పరుగులకు ఆలౌట్ చేసింది.స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళబంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ తాంజిద్ హసన్(46) ఫర్వాలేదనిపించగా.. వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా అర్ధ శతకం(62)తో మెరిశాడు. వీరికి తోడు అనూహ్యంగా టెయిలెండర్ తంజీమ్ హసన్ సకీబ్ 45 పరుగులతో రాణించాడు. స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళ.. ఈ బౌలర్ బ్యాట్ ఝులిపించి నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.చెలరేగిన జేడన్ సీల్స్.. దంచికొట్టిన కింగ్ఇక విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. గుడకేశ్ మోటీ రెండు, మిండ్లే, రొమారియో షెఫర్డ్, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 36.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 76 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్స్ల సాయంతో 82 పరుగులు సాధించాడు.మరో ఓపెనర్ ఎవిన్ లూయీస్ 49 రన్స్ చేయగా.. వన్డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక కెప్టెన్ షాయీ హోప్(17)తో కలిసి షెర్ఫానే రూథర్ఫర్డ్(24 ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు నష్టయి 230 పరుగులు చేసిన వెస్టిండీస్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. విండీస్ పేసర్ జేడన్ సీల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్- విండీస్ మధ్య గురువారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.చదవండి: SMT 2024: షమీ మళ్లీ మాయ చేస్తాడా?.. నేటి నుంచే ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్స్ పోరు -
విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్కు తప్పని ఓటమి
ఇంగ్లండ్తో నాలుగో టీ20లో వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లిష్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి క్లీన్స్వీప్ గండం నుంచి బయటపడింది. కాగా స్వదేశంలో విండీస్.. బట్లర్ బృందంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది.ఇప్పటికే సిరీస్ ఇంగ్లండ్ కైవసంఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్లలో గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సెయింట్ లూయీస్ వేదికగా ఆదివారం తెల్లవారుజామున నాలుగో టీ20 జరిగింది. డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. సాల్ట్ 35 బంతుల్లోనే 55 (5 ఫోర్లు, 4 సిక్స్లు), జాక్స్ 12 బంతుల్లోనే 25 (ఒక ఫోర్ 2 సిక్సర్లు) పరుగులు చేశారు. మిగతా వాళ్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (23 బంతుల్లో 38) రాణించగా.. జాకోబ్ బెతెల్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుమొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న బెతెల్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో సామ్ కర్రాన్ ధనాధన్ ఇన్నింగ్స్(13 బంతుల్లో 24)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ ఓపెనర్ల ఊచకోత.. విండీస్ ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆది నుంచే దుమ్ములేపింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షాయీ హోప్ సుడిగాలి ఇన్నింగ్స్తో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ లూయీస్ సిక్సర్ల వర్షం కురిపించగా.. హోప్ బౌండరీలతో పరుగులు రాబట్టాడు.Smashed💥...platform set for the #MenInMaroon#TheRivalry | #WIvENG pic.twitter.com/KHgwBGcYbJ— Windies Cricket (@windiescricket) November 16, 2024 మెరుపు అర్ధ శతకాలులూయీస్ మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా... హోప్ 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 రన్స్ స్కోరు చేశాడు. వీరిద్దరి మెరుపు అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రోవ్మన్ పావెల్(23 బంతుల్లో 38), షెర్ఫానే రూథర్ఫర్డ్(17 బంతుల్లో 29 నాటౌట్)కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు.How good was @shaidhope tonight?🏏🌟#TheRivalry | #WIvENG pic.twitter.com/MkfP5wE7U7— Windies Cricket (@windiescricket) November 16, 2024 19 ఓవర్లలోనేఫలితంగా 19 ఓవర్లలోనే వెస్టిండీస్ టార్గెట్ను పూర్తి చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు, జాన్ టర్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో ధనాధన్ హాఫ్ సెంచరీతో అలరించిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వన్డే సిరీస్ విండీస్దేకాగా తొలుత ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను 2-1తో గెలిచిన వెస్టిండీస్.. టీ20 సిరీస్ను మాత్రం కోల్పోయింది. అయితే, వైట్వాష్ గండం నుంచి తప్పించుకుని పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున(ఉదయం 1.20 నిమిషాలకు) ఐదో టీ20 జరుగనుంది.చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
కెప్టెన్తో గొడవ.. జోసెఫ్నకు బిగ్ షాకిచ్చిన విండీస్ క్రికెట్
వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్నకు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాకిచ్చింది. అతడిపై రెండు మ్యాచ్ల నిషేధం వెస్టిండీస్ క్రికెట్ విధించింది. దీంతో స్వదేశంలో ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు జోషఫ్ దూరం కానున్నాడు. బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి వన్డేలో జోసెఫ్ బోర్డు విధానాలు, క్రమశిక్షణ ఉల్లఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.అసలేం జరిగిందంటే?బుధవారం(నవంబర్ 6) ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి వన్డేలో జోసెఫ్ తమ కెప్టెన్ షాయ్ హోప్తో వాగ్వాదానికి దిగాడు. జోషఫ్ వేసిన నాలుగో ఓవర్లో ఇంగ్లండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను హోప్ సెట్ చేశాడు. కానీ ఈ ఫీల్డింగ్ సెటప్ జోసెఫ్నకు నచ్చలేదు.దీంతో హోప్తో జోసెఫ్ గొడవ పడ్డాడు. అతడితో వాగ్వాదం చేస్తేనే ఓవర్ను కొనసాగించాడు. ఆ ఓవర్లో కాక్స్ను ఔట్ చేసిన జోసెఫ్నకు కనీసం సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. అయితే తన ఓవర్ను పూర్తి చేసిన అనంతరం తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోసెఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై వెస్టిండీస్ క్రికెట్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.సారీ చెప్పిన జోషఫ్ఇక ఈ మ్యాచ్ అనంతరం తన తప్పును తెలుసుకున్న జోసెఫ్ కెప్టెన్ హోప్తో పాటు జట్టు మేనెజ్మెంట్కు క్షమాపణలు తెలిపాడు. ‘‘ఏదేమైనప్పటికీ ఆఖరి వన్డేలో నేను కొంచెం మితిమీరి ప్రవర్తించాను. ఇప్పటికే కెప్టెన్ షాయ్ హోప్, నా సహచరులు ,మేనేజ్మెంట్కు నేను వ్యక్తిగతంగా సారీ చెప్పాను. వెస్టిండీస్ అభిమానులకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని ఓ ప్రకటనలో జోసెఫ్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్-విండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ నవంబర్ 9న జరగనున్న తొలి మ్యాచ్తో ప్రారంభం కానుంది. -
WI Vs ENG: కెప్టెన్తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్
బ్రిడ్జ్టౌన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయ భేరి మ్రోగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్ కెప్టెన్ షాయ్ హోప్తో విభేదాల కారణంగా మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి డగౌట్కు వెళ్లిపోయాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.అసలేం జరిగిందంటే?ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోప్ తొలుత ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్హనించాడు. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు మంచి ఆరంభం దక్కలేదు. 3 ఓవర్లోనే విల్ జాక్స్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఫస్ట్డౌన్లో యువ ఆటగాడు జోర్డాన్ కాక్స్ క్రీజులోకి వచ్చాడు. కాక్స్కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను విండీస్ కెప్టెన్ సెట్ చేశాడు. అయితే ఈ ఫీల్డ్ ప్లేస్మెంట్ నాలుగో ఓవర్ వేసేందుకు వచ్చిన జోషఫ్కు నచ్చలేదు. దీంతో హోప్తో జోషఫ్ వాగ్వాదానికి దిగాడు. అతడితో గొడవ పడుతూనే ఓవర్ను జోషఫ్ కొనసాగించాడు.ఆ ఓవర్లో నాలుగో బంతికి కాక్స్ను జోషఫ్ ఔట్ చేశాడు. జోషఫ్ వికెట్ సాధించినప్పటకి కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. సహచర ఆటగాళ్లు తన దగ్గరకి వచ్చినప్పటకి జోషఫ్ మాత్రం సీరియస్గా హోప్తో తన వాగ్వాదాన్ని కొనసాగించాడు.అంతటితో ఆగని జోషఫ్ తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోషఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా?Gets angry! 😡Bowls a wicket maiden 👊Leaves 🤯An eventful start to the game for Alzarri Joseph! 😬#WIvENGonFanCode pic.twitter.com/2OXbk0VxWt— FanCode (@FanCode) November 6, 2024 -
రాణించిన హోప్, హెట్మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ మొదలవుతాయి. ప్లే ఆఫ్స్ నాలుగు బెర్త్లు ఇదివరకే ఖరారైపోయినప్పటికీ.. ఏ జట్టు ఏ స్థానంలో ఉంటున్నది రేపటి మ్యాచ్తో తేలనుంది.లీగ్లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 28) గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అమెజాన్ వారియర్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.రాణించిన హోప్, హోట్మైర్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (31 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్మైర్ (30 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (26), ఆజమ్ ఖాన్ (26), రొమారియో షెపర్డ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.సరిపోని డుప్లెసిస్ మెరుపులుఅనంతరం 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమతమైంది. డుప్లెసిస్ (59 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) లూసియా కింగ్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి అల్జరీ జోసఫ్ (21 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడంతో లూసియా కింగ్స్ గమ్యాన్ని చేరుకోలేకపోయింది. డుప్లెసిస్ మెరుపులు సరిపోలేదు. వారియర్స్ బౌలర్లలో మోటీ, మొయిన్, తాహిర్ తలో రెండు వికెట్లు తీసి లూసియా కింగ్స్ను దెబ్బకొట్టారు.చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్ను చిత్తు చేసిన శ్రీలంక.. -
మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్, హెట్మైర్
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో భాగంగా బార్బడోస్ రాయల్స్తో ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మ్యాచ్లో గయానా అమెజాన్ వారియర్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (37 బంతుల్లో 71; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్మైర్ (34 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆజమ్ ఖాన్ 17 బంతుల్లో 26 పరుగులు.. రొమారియో షెపర్డ్ 13 బంతుల్లో 23 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో తీక్షణ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్, కేశవ్ మహారాజ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసి 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డేవిడ్ మిల్లర్ (34 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. క్వింటన్ డికాక్ ఓ మోస్తరు స్కోర్ (35) చేశాడు. వీరిద్దరు మినహా రాయల్స్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. గడకేశ్ మోటీ 3, మొయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్ తలో 2, ప్రిటోరియస్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్లో సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్, ట్రిన్బాగో నైట్రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: విరాట్ కోహ్లి మరో 35 పరుగులు చేస్తే.. -
సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్.. సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేసిన వెస్టిండీస్
సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ డక్వర్త్ లూయిస్ పద్ధతిన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్ను అక్కడితో ఆపేశారు. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టాక డక్వర్త్ లూయిస్ పద్ధతిన విండీస్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ధారించారు. 116 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం 9.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.రాణించిన షెపర్డ్తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రికెల్టన్ (27), మార్క్రమ్ (20), ట్రిస్టన్ స్టబ్స్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి రాణించాడు. అకీల్ హొసేన్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రీజా హెండ్రిక్స్ దుబారాగా బంతులు వేస్ట్ చేశాడు. హెండ్రిక్స్ 20 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖర్లో స్టబ్స్ వేగంగా పరుగులు చేయడంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్కును దాటగలిగింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ తన కోటా రెండు ఓవర్లలో ఓ మెయిడిన్ వేశాడు.సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్109 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. నికోలస్ పూరన్ (13 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (24 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), షిమ్రోన్ హెట్మైర్ (17 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లలో పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సిరీస్లో అతను 205.17 స్ట్రయిక్రేట్తో 12 సిక్సర్లు బాదాడు. -
టీ20 వరల్డ్కప్లో సిక్సర్ల సునామీ.. మనోళ్లు ఒక్కరూ లేరు!
అమెరికాతో మ్యాచ్లో వెస్టిండీస్ ఓపెనర్ షాయీ హోప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు.కేవలం 39 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్స్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అమెరికాతో మ్యాచ్లో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించాడు.ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్ అంటే పూనకం వచ్చినట్లుగా బ్యాట్తో రెచ్చిపోయే విండీస్ వీరుల జాబితాలో చేరాడు.ఇక బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అద్బుత బౌలింగ్తో ఆకట్టుకున్న విండీస్ స్పిన్నర్ రోస్టన్ చేజ్(3/19) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ బ్యాటర్ల సిక్సర్ల హవాఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 11.. ఇంగ్లండ్ మీద👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 10.. సౌతాఫ్రికా మీద👉ఆరోన్ జోన్స్(అమెరికా)- 10.. కెనడా మీద👉రిలీ రొసోవ్(సౌతాఫ్రికా)-8.. బంగ్లాదేశ్ మీద👉నికోలస్ పూరన్(వెస్టిండీస్)-8.. అఫ్గనిస్తాన్ మీద👉షాయీ హోప్(వెస్టిండీస్)-8.. అమెరికా మీద..టీ20 వరల్డ్కప్లో ఒక ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు👉నికోలసన్ పూరన్(వెస్టిండీస్)- 17(2024 ఇప్పటి వరకు)👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 16(2012)👉మార్లన్ సామ్యూల్స్- 15(2012)👉షేన్ వాట్సన్- 15(2012). చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి! View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC: విండీస్ ఓపెనర్ విధ్వంసం.. అమెరికా చిత్తు
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి జయభేరి మోగించింది. సొంతగడ్డపై జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లలో.. గ్రూప్-2లో భాగమైన వెస్టిండీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.ఈ క్రమంలో శనివారం నాటి తమ రెండో మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేసిన కరేబియన్ జట్టు.. అమెరికాకు చుక్కలు చూపించింది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా టాస్ గెలిచిన వెస్టిండీస్.. అమెరికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.చెలరేగిన బౌలర్లుఅయితే, విండీస్ పేసర్లు, స్పిన్నర్లు విజృంభించడంతో అమెరికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లలో స్టీవెన్ టేలర్(2) పూర్తిగా నిరాశపరచగా.. ఆండ్రీస్ గౌస్ 29 పరుగులతో రాణించాడు. వన్డౌన్ బ్యాటర్ ఎన్ఆర్ కుమార్ 20 రన్స్తో ఫర్వాలేదనిపించాడు.మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసి అమెరికా ఆలౌట్ అయింది.వెస్టిండీస్ బౌలర్లలో పేసర్లు ఆండ్రీ రసెల్ మూడు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ చేజ్(3/19) పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా.. గుడకేశ్ మోటికి ఒక వికెట్ దక్కింది.ఆకాశమే హద్దుగా ఇక లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ షాయీ హోప్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫక్షర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 15, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. షాయీ హోప్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.విండీస్ సెమీస్ ఆశలు సజీవంషాయీ హోప్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేవలం 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ నెట్ రన్రేటు(+1.814)ను భారీగా పెంచుకుంది. గ్రూప్-2 టాపర్ సౌతాఫ్రికా(4 పాయింట్లు, నెట్ రన్టేరు +0.625), ఇంగ్లండ్(2 పాయింట్లు, నెట్ రన్రేటు +0.412)ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. మరోవైపు.. అమెరికా ఆడిన రెండింట ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... View this post on Instagram A post shared by ICC (@icc) -
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. పంత్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65), ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్ ఇన్నింగ్స్లో పదహారో ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్కు వచ్చాడు. అతడి బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద షాయీ హోప్ క్యాచ్ పట్టగా ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్ జిందాల్ సైతం అవుట్ అంటూ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్ రాయల్స్ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
ఆకాశమే హద్దుగా అరంగేట్ర బౌలర్.. కేవలం 17 పరుగులిచ్చి..
వెస్టిండీస్తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అరంగేట్ర బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు యువ పేసర్లు లాన్స్ మోరిస్, జేవియర్ బార్ట్లెట్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు జేవియర్ ఆది నుంచే చుక్కలు చూపించాడు. తొలుత ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్(1), అలిక్ అథనాజే(5)ల పనిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కెప్టెన్ షాయీ హోప్(12) రూపంలో మరో కీలక వికెట్ దక్కించుకున్నాడు. జేవియర్ దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కకావిలమైన వేళ వన్డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 88 పరుగులతో సత్తా చాటాడు. అతడికి తోడుగా రోస్టర్ చేస్ కూడా అర్ధ శతకం(59)తో మెరిశాడు. మిగతా వాళ్లలో ఒక్కరుకూడా చెప్పుకోగదగ్గ స్కోరు చేయలేదు. జేవియర్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. సీన్ అబాట్, కామెరాన్గ్రీన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఆడం జంపాకు ఒక వికెట్ దక్కగా.. అబాట్ కేసీ కార్టీని రనౌట్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 231 పరుగులు చేసి విండీస్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు కరేబియన్ పేసర్ మాథ్యూ ఫోర్డ్ ఆదిలోనే షాకిచ్చాడు. అతడి బౌలింగ్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాట్ ఝులిపించాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏకంగా 65 పరుగులు రాబట్టాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 77, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ విధించిన 232 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్లో జేవియర్ బార్ట్లెట్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 4న సిడ్నీలో రెండో వన్డే జరుగనుంది. -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 2-1తో విండీస్ కైవసం చేసుకుంది. కాగా కరేబియన్ దీవుల్లో ఇంగ్లీష్ జట్టుపై విండీస్ వన్డే సిరీస్ను సొంతం చేసుకోవడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. విండీస్ చివరగా తమ స్వదేశంలో 1998లో ఇంగ్లండ్పై వన్డే సిరీస్ విజయం సాధించింది. తాజా విజయంతో 24 ఏళ్ల నిరీక్షణకు వెస్టిండీస్ తెరదించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మూడో వన్డేను 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(71) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే, జోషఫ్య తలా 3 వికెట్లు పడగొట్టగా.. షెపెర్డ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం విండీస్ టార్గెట్ను డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 188గా నిర్ణయించారు. 188 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరేబియన్ బ్యాటర్లలో ఆథనాజ్(45), కార్టీ(50) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ 3 వికెట్లు.. అటిక్కినిసన్ 2, ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్కు మ్యాన్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. -
రాణించిన కర్రన్, బట్లర్.. విండీస్పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది. -
ఇంగ్లండ్పై శతక్కొట్టిన విండీస్ కెప్టెన్.. ఇదంతా ధోని వల్లే అంటూ!
West Indies vs England, 1st ODI: ఇంగ్లండ్తో తొలి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ శతకంతో అదరగొట్టి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. ఆంటిగ్వా వేదికగా ఆదివారం జరిగిన వన్డేలో మొత్తంగా 83 బంతులు ఎదుర్కొన్న షాయీ హోప్.. 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 109 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తద్వారా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో విండీస్కు 1-0 ఆధిక్యం అందించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం తన అద్బుత ఇన్నింగ్స్ గురించి షాయీ హోప్ మాట్లాడుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రెడిట్ ఇచ్చాడు. ‘‘నా సెంచరీ జట్టు విజయానికి కారణమైనందుకు సంతోషిస్తున్నా. మేము మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. కొన్నాళ్ల క్రితం నేను ఎంఎస్ ధోనితో మాట్లాడాను. అనుకున్న దాని కంటే ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించమని చెప్పాడు. కీలక సమయంలో వికెట్ కాపాడుకోవడం ముఖ్యమన్నాడు. ఈరోజు అలాగే ఆడాను. షెఫర్డ్ కూడా అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. విజయంతో సిరీస్ను ఆరంభించడం సంతోషం. తదుపరి మ్యాచ్లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తున్నాం’’ అని షాయి హోప్ పేర్కొన్నాడు. క్యాచ్లు డ్రాప్ చేయడం వంటి తప్పులు రిపీట్ చేయకుండా జాగ్రత్తపడతామని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ విధించిన 326 పరుగుల లక్ష్యాన్ని 48.5 ఓవర్లలోనే ఛేదించింది. సిక్సర్తో విండీస్ విజయాన్ని ఖరారు చేసిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ షాయి హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: T20: గిల్కు ఇకపై గట్టి పోటీ.. వరల్డ్కప్లో ఆడాలంటే! Scenes in Antigua after the win!🇦🇬#WIvENG #WIHomeforChristmas pic.twitter.com/H68vzqu0Yo — Windies Cricket (@windiescricket) December 3, 2023 -
WI VS ENG 1st ODI: విరాట్ రికార్డును సమం చేసిన షాయ్ హోప్
విండీస్ వన్డే జట్టు సారధి షాయ్ హోప్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా (114 ఇన్నింగ్స్లో) 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్, వివ్ రిచర్డ్స్లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి వన్డేల్లో అజేయ మెరుపు శతకంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడిన హోప్ ఈ ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉంది. బాబర్ కేవలం 97 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. బాబర్ తర్వాత ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా ఉన్నాడు. ఆమ్లా 101 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ను సాధించాడు. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. షాయ్ హోప్ సూపర్ సెంచరీతో విండీస్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాల్ట్ (45), క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) పర్వాలేదనిపించగా.. విండీస్ ఇన్నింగ్స్లో హోప్తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49), బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్మైర్ (32) రాణించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్టు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్తో పాటు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
WI VS ENG 1st ODI: శతక్కొట్టిన హోప్.. విండీస్ రికార్డు విజయం
వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తమ రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి మ్యాచ్లో విండీస్ 326 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. వన్డే క్రికెట్లో విండీస్ అత్యుత్తమ లక్ష్యఛేదన రికార్డు 328 పరుగులుగా ఉంది. 2019లో ఐర్లాండ్పై విండీస్ ఈ ఫీట్ను (47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. 2023 వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించలేకపోయిన విండీస్కు తదనంతరం దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రాణించిన బ్రూక్.. మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్తో (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును దాటగలిగింది. బ్రూక్తో పాటు ఫిలిప్ సాల్ట్ (45), జాక్ క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్ (3) నిరాశపరిచాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, గుడకేశ్ మోటీ, ఒషేన్ థామస్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, యానిక్ కారియా చెరో వికెట్ దక్కించుకున్నారు. శతక్కొట్టిన హోప్.. 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. షాయ్ హోప్ శతక్కొట్టడంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) 48.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హోప్తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49) రాణించగా.. బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్మైర్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్, లివింగ్స్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్లు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్తో పాటు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
వెస్టిండీస్ కెప్టెన్ విధ్వంసకర సెంచరీ.. 9 ఫోర్లు, 8 సిక్స్లతో! వీడియో వైరల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో వెస్టిండీస్ వన్డే కెప్టెన్, గయానా అమెజాన్ వారియర్స్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్లో భాగంగా సోమవారం ఉదయం బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గయానా బ్యాటర్ షాయ్ హోప్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను హోప్ అందుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను హోప్ ఊచకోత కోశాడు. ముఖ్యంగా గయానా ఇన్నింగ్స్లో 10 ఓవర్ వేసిన రహ్కీమ్ కార్న్వాల్ బౌలింగ్లో హోప్ ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఆ ఓవర్లో 4 సిక్స్లు, రెండు ఫోర్లతో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో హోప్ 9ఫోర్లు, 8 సిక్స్లతో 106 పరుగులు చేశాడు. హోప్ అద్బుత సెంచరీ ఫలితంగా గయానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బార్బడోస్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది. దీంతో 88 పరుగుల తేడాతో గయానా అమెజాన్ వారియర్స్ ఘన విజయం సాధించింది. బార్బడోస్ రాయల్స్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ క్లార్క్(54) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. గయానా బౌలర్లలో కెప్టెన్ ఇమ్రాన్ తహీర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మోటీ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: నాకు ఒక మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు: రోహిత్ శర్మ RIDICULOUS SCENES!!! Shai Hope hits Rahkeem Cornwall for 32 in the over to reach his first CPL 💯 🙌 - A clear winner for Republic Bank Play of the Day#CPL23 #GAWvBR#CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/NCYi5OZerX — CPL T20 (@CPL) September 18, 2023 -
టాస్ గెలిచిన విండీస్.. ప్రయోగాలు వదలని టీమిండియా
టీమిండియా, వెస్టిండీస్ల మధ్య ట్రినిడాడ్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఓటమి పాలైన టీమిండియా ప్రయోగాలను కొనసాగించింది. రెండో వన్డేకు దూరంగా ఉన్న రోహిత్, కోహ్లిలకు జట్టు మేనేజ్మెంట్ ఈ మ్యాచ్కు కూడా విశ్రాంతినిచ్చింది. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కీలకమైన మూడో వన్డేలో బరిలోకి దిగనుంది. అయితే టీమిండియా ఈ మ్యాచ్కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో జైదేవ్ ఉనాద్కట్.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు. ఇక విండీస్ మాత్రం సేమ్ జట్టుతోనే బరిలోకి దిగింది. తొలి రెండు వన్డేల్లో చెరొకటి గెలిచి 1-1తో సమంగా ఉన్న విండీస్, టీమిండియాల్లో మూడో వన్డే ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెండో వన్డేలో ఓడినా ప్రయోగాలు ఆపని టీమిండియా మూడో వన్డేలో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంటుందా అన్నది చూడాలి. భారత్(ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్(కెప్టెన్/వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్ చదవండి: హెచ్సీఏ నిర్వాకం.. జట్టులో అవకాశమిస్తామంటూ లక్ష వసూలు నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు! -
90 పరుగుల వద్ద తొలి వికెట్.. 181 పరుగులకు ఆలౌట్.. చిత్రంగా విండీస్ మాత్రం!
West Indies vs India, 2nd ODI- ICC ODI WC 2023- బ్రిడ్జ్టౌన్: స్వదేశంలో త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్నకు ముందు కరీబియన్ పర్యటనకు వచ్చిన భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచేంత వరకు బాగానే ఉంది. కానీ మెగా టోర్నీ సన్నాహాకమైన కీలక వన్డే సిరీస్లో టీమిండియా ఆట ఏమాత్రం బాగోలేదు. తొలి వన్డేలో అర్థంలేని ప్రయోగాలను రెండో వన్డేలోనూ చేసింది. మొదటి మ్యాచ్లో గెలిచేందుకు కష్టపడింది. కానీ రెండో మ్యాచ్లో టీమిండియా ఎంత కష్టపడినా నెగ్గలేకపోయింది. తమ కెరీర్లో ఆఖరి వన్డే ప్రపంచకప్ అనుకుంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు ప్రతీ మ్యాచ్ కీలకం కాగా... వీళ్లిద్దరు విశ్రాంతి పేరిట దూరమైన వైనం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. అందుకేనేమో మెగా ఈవెంట్కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు చేతిలో టీమిండియా అపహాస్యం కావాల్సి వచ్చింది. ఇషాన్ ఒక్కడే భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విండీస్ చేతిలో పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) మాత్రమే బాగా ఆడారు. టీమిండియా పసలేని బౌలింగ్పై.. తర్వాత పసలేని బౌలింగ్పై సులువైన లక్ష్యాన్ని వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ షై హోప్ (80 బంతుల్లో 63 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కీసీ కార్టీ (65 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు) విండీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్నకు వికెట్ దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే వన్డే మంగళవారం(ఆగష్టు 1) టరోబాలో జరుగుతుంది. శార్దుల్ రాణించినా... భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ తన పేస్తో నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో జోరుమీదున్న ఓపెనర్లు మేయర్స్ (28 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు), బ్రాండన్ కింగ్ (23 బంతుల్లో 15; 3 ఫోర్లు)లను అవుట్ చేశాడు. కాసేపటికే వన్డౌన్లో వచి్చన అతనెజ్ (6)కూ శార్దుల్ క్రీజులో నిలిచే అవకాశమివ్వలేదు. 72 పరుగులకే టాపార్డర్ వికెట్లన్నీ పడ్డాయి. 90 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయి.. చిత్రంగా విండీస్ మాత్రం వంద పరుగుల్లోపు మరో వికెట్ హెట్మైర్ (9) రూపంలో పడింది. కుల్దీప్నకు ఈ వికెట్ దక్కింది. 17 ఓవర్లలో విండీస్ స్కోరు 91/4. ఈ దశలో భారత్కు గెలిచే అవకాశం కనిపించింది. కానీ కెపె్టన్ షై హోప్, కార్టీతో కలిసి ప్రత్యర్థి జట్టుకు ఆ చాన్సు ఇవ్వకుండా క్రీజ్లో పాతుకుపోయాడు. ఈ క్రమంలో హోప్ 70 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా... ఇద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్కు 91 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ విచిత్రమేంటంటే... భారత్ 90 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయి 181 పరుగులకు ఆలౌటైంది. కానీ అదే విండీస్ 91 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయాక మళ్లీ వికెట్నే చేజార్చుకోలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: 181; వెస్టిండీస్ ఇన్నింగ్స్: బ్రాండన్ కింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 15; మేయర్స్ (సి) ఉమ్రాన్ (బి) శార్దుల్ 36; అతనెజ్ (సి) ఇషాన్ (బి) శార్దుల్ 6; షై హోప్ (నాటౌట్) 63; హెట్మైర్ (బి) కుల్దీప్ 9; కార్టీ (నాటౌట్) 48; ఎక్స్ట్రాలు 5; మొత్తం (36.4 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–53, 2–54, 3–72, 4–91. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 6.4–0–38–0, ముకేశ్ 3–0–17–0, ఉమ్రాన్ మాలిక్ 3–0–27–0, శార్దుల్ ఠాకూర్ 8–0–42–3, కుల్దీప్ యాదవ్ 8–0–30–1, జడేజా 6–0–24–0, అక్షర్ పటేల్ 2–1–4–0. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! మ్యాచ్ ఓడిపోతేనే! ఆసియా కప్ తర్వాత ఇద్దరూ అవుట్? 4 Overs. 16 Runs. 3 Wickets! Shardul Thakur's first spell 🔥 from yesterday 😮#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/iQU260e4TI — FanCode (@FanCode) July 30, 2023 -
మేం కసితో ఆడాం.. నాకు ముందే తెలుసు! తర్వాతి మ్యాచ్ కూడా: హోప్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు చానాళ్ల తర్వాత అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బార్బోడస్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో భారత్ను కట్టడిచేసిన కరేబియన్లు.. అనంతరం బ్యాటింగ్లో కూడా సత్తా చాటారు. తొలుత టీమిండియా.. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ 40.5 ఓర్లలోనే 181 పరుగులకు కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (55), శుబ్మన్ గిల్(34) రాణించారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, గుడకేశ్ మోతీ తలా మూడు వికెట్లు సాధించారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్. 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ(48) పరుగులతో రాణించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ స్పందించాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని అతడు కొనియాడాడు. "మనం ఫిప్టీలు, సెంచరీలు చేసినా జట్టు విజయం సాధించకపోతే సంతృప్తి ఉండదు. కానీ ఈ మ్యాచ్లో నా ఫిప్టీతో పాటు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా భారత్ వంటి క్వాలిటీ బౌలింగ్ ఎటాక్ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఈ మ్యాచ్లో మా బాయ్స్ అద్భుతంగా రాణించారు. మేము పూర్తి కసితో ఆడాం. మేము ఒక యూనిట్గా రాణిస్తే ఫలితం మాకు అనుకూలంగా ఉంటుందని నాకు ముందే తెలుసు. ఈ విన్నింగ్ క్రెడిట్ బౌలర్లకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం మా ఖాతాలో ఒక్క విజయం ఉంది. మేము సిరీస్ సొంతం చేసుకోవాలంటే ఆఖరి మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. చివరి మ్యాచ్లో గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో హోప్ పేర్కొన్నాడు. చదవండి: #Stuart Broad: ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు -
Ind vs WI: కెప్టెన్గా హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ అవుట్
West Indies vs India, 2nd ODI: బార్బడోస్ వేదికగా టీమిండియా రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన విండీస్ సారథి షాయీ హోప్... తొలుత భారత జట్టును బ్యాటింగ్కు ఆహ్వానిస్తున్నట్లు తెలిపాడు. బౌలింగ్లో రాణించి టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. రోమన్ పావెల్, డ్రేక్స్ స్థానంలో అల్జారీ జోసెఫ్, కార్టీ తుది జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు. రోహిత్, కోహ్లి లేకుండానే రెండో వన్డేలో స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. రోహిత్, కోహ్లి స్థానాల్లో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చినట్లు పాండ్యా తెలిపాడు. 1-0తో ఆధిక్యంలో.. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడే నిమిత్తం టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో తొలి సిరీస్లో విండీస్తో తలపడ్డ రోహిత్ సేన 1-0తో ట్రోఫీ గెలిచింది. మలి టెస్టులోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావించగా వర్షం అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసిపోయింది. ఈ క్రమంలో జూలై 27న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగగా.. టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక బార్బడోస్లో తొలి వన్డేలో జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్కు రెండో మ్యాచ్లో అవకాశం వచ్చింది. తుది జట్లు టీమిండియా శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. వెస్టిండీస్ బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలీక్ అథనాజ్, షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, కీసీ కార్టీ, రొమారియో షెఫర్డ్, యాన్నిక్ కరియా, గుడకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్. చదవండి: బీటెక్ చదివిన టీమిండియా స్టార్.. ధోని, కోహ్లిలతో పాటు! ఆస్తి 100 కోట్లు! -
టాస్ గెలిచిన టీమిండియా.. ఇషాన్ కిషన్ వైపే మొగ్గు
వెస్టిండీస్తో మొదలైన తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్తో ముగిసిన టెస్టు సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్గా ఈ వన్డే సిరీస్ని ఉపయోగించుకోనుంది. కాగా తుది జట్టు ఎలా ఉండబోతుందో ముందే అంచనాకు వచ్చినప్పటికి వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్లలో ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్వైపే మొగ్గుచూపాడు. ఇటీవలే ముగిసిన రెండో టెస్టులో ఇషాన్ కిషన్ ఫిఫ్టీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే ఇషాన్కు అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్తో బరిలోకి దిగింది. రెండో టెస్టులో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్ వన్డేల్లో అరంగేట్రం చేయనుండగా.. ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్లు పేస్ విభాగాన్ని నడిపించనుండగా.. వీరికి తోడుగా ఆల్రౌండర్ హార్దిక్ ఉన్నాడు. ఇక స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకోగా జడేజా మరో స్పిన్నర్గా ఉన్నాడు. టెస్టు సిరీస్ ఓడినప్పటికి వెస్టిండీస్ వన్డే జట్టు మాత్రం కాస్త సీనియర్లతో నిండిఉంది. ఇటీవలే వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో రాణించిన కెప్టెన్ షెయ్ హోప్ సహా కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, డొమినిక్ డ్రేక్స్ , షిమ్రోన్ హెట్మైర్, రోవ్మెన్ పావెల్లు జట్టులో ఉన్నారు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ India vs West Indies, 1st ODI: India Opt To Field vs West Indies, Mukesh Kumar To Debut#INDvsWI #ODIs #BCCI #Cricket #debu pic.twitter.com/pTx9hbPji4 — Smart Locus (@SmartLocusIN) July 27, 2023 చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్! ఘాటు రిప్లైతో నోరు మూయించాడు! Japan Open 2023: క్వార్టర్స్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి -
అప్పుడలా జరిగింది.. ఇప్పుడు వేరు! మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం: విండీస్ కెప్టెన్
West Indies vs India, 1st ODI: టీమిండియాతో వన్డే సిరీస్తో తిరిగి ఫామ్లోకి వస్తామని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టులో ఉన్న లోపాలు సరిచేసుకుని, సమస్యలు అధిగమించి ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా రెండుసార్లు వన్డే వరల్డ్కప్ చాంపియన్ అయిన విండీస్ ఈసారి మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. టాప్-8లో నేరుగా అడుగుపెట్టలేకపోయిన షాయీ హోప్ బృందం.. జింబాబ్వే వేదికగా జరిగిన క్వాలిఫయర్స్ ఆడింది. ఈ క్రమంలో యూఎస్ఏ, యూఏఈ, నేపాల్ వంటి పసికూనలపై గెలిచిన విండీస్.. జింబాబ్వేతో మ్యాచ్లో ఓడి పరాజయాల ఖాతా తెరిచింది. ఘోర పరాభవం అనంతరం.. వర్షం కారణంగా నెదర్లాండ్స్తో మ్యాచ్ టై కావడం.. ఆపై సూపర్ ఓవర్లో ఓటమి, ఆ తర్వాత స్కాట్లాండ్ చేతిలో చిత్తైన నేపథ్యంలో టాప్-2లో నిలవాలన్న వెస్టిండీస్ ఆశలకు గండిపడింది. ఆపై ఒమన్పై గెలిచినా ఫలితం లేకుండా పోయింది. శ్రీలంక, నెదర్లాండ్స్ టాప్-10లో అడుగుపెట్టగా.. విండీస్ ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో ఘోర పరాభవం తర్వాత పటిష్ట టీమిండియాతో సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా గురువారం (జూలై 27)న మొదటి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన విండీస్ సారథి షాయీ హోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం ‘‘తిరిగి పుంజుకోవడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నాం. వైవిధ్యమైన వన్డే ఫార్మాట్లో మా నైపుణ్యాలు ప్రదర్శించి.. మేం చేయగలమో ప్రపంచానికి చూపించే మరో అవకాశం దొరికింది. జింబాబ్వేలో జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలా అయితే విజయం మాదే లోపాలు సరిచేసుకుని మళ్లీ కొత్తగా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నాం. ప్రతిసారి అందరికీ గెలిచే అవకాశం రాకపోవచ్చు. అయితే, లక్ష్యాన్ని చేరుకునేందుకు మనం చేసే ప్రయత్నాల్లో మాత్రం లోపం ఉండకూడదు. అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది’’ అని షాయీ హోప్ సానుకూల దృక్పథంతో మాట్లాడాడు. అతడు తిరిగి రావడం సంతోషం ఇక షిమ్రన్ హెట్మెయిర్ జట్టులోకి తిరిగి రావడంపై స్పందిస్తూ.. ‘‘బౌలర్లపై విరుచుపడుతూ దూకుడగా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. ఏ క్షణంలోనైనా మ్యాచ్ను ఒంటిచేత్తో మలుపు తిప్పగలడు. మా జట్టులో ఉన్న నిజమైన ఇంపాక్ట్ ప్లేయర్ అతడు. హెట్మెయిర్ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది’’అని షాయీ హోప్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్గా షాయీ హోప్నకు స్వదేశంలో తొలి వన్డే ఇది. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
రెండు ప్రపంచకప్లలో ఎదురేలేని గెలుపు! కానీ ఇప్పుడు.. విండీస్ దుస్థితికి కారణాలివే
వెస్టిండీస్... ప్రపంచ క్రికెట్ను శాసించిన జట్టు. కరీబియన్ బౌలింగ్ అంటేనే బ్యాటర్లు బెంబేలెత్తేవారు. తొలి రెండు ప్రపంచకప్ (1975, 1979) టోర్నీలను ఎదురేలేకుండా గెలుచుకుంది. మూడో ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచింది. అయితే ఇది గతం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జట్టు ఇప్పుడు భారత్కు రావడం లేదన్నది వర్తమానం. అంటే వన్డే ప్రపంచకప్కు కరీబియన్ జట్టు దూరమైంది. క్వాలిఫయింగ్ దశలోనే ఇంటికెళ్లనుంది. ఇది విండీస్ అభిమానులకే కాదు... క్రికెట్ విశ్లేషకులకు పెద్ద షాక్! ICC Cricket World Cup Qualifiers 2023- హరారే: వెస్టిండీస్ ప్రపంచకప్ ముచ్చట జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయర్స్లోనే ముగిసిపోయింది. వన్డే మెగా టోరీ్నలో ఆడే అర్హత కోల్పోయింది. ‘సూపర్ సిక్స్’ దశలో స్కాట్లాండ్ చేతిలో పరాభవంతో కరీబియన్ జట్టు ని్రష్కమణ అధికారికంగా ఖరారైంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్లో స్కాట్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విండీస్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్లో బ్రాండన్ కింగ్ (22 బంతుల్లో 22; 5 ఫోర్లు) రెండు పదుల స్కోరు చేస్తే మిగతా ఇద్దరు చార్లెస్ (0), బ్రూక్స్ (0) ఖాతానే తెరువలేదు. కెప్టెన్ షై హోప్ (13), కైల్ మేయర్స్ (5) చెత్తగానే ఆడారు. 60 పరుగులకే టాప్–5 వికెట్లను కోల్పోయిన విండీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో నికోలస్ పూరన్ (43 బంతుల్లో 21; 2 ఫోర్లు) పెద్దగా మెప్పించలేదు. తలరాతను తలకిందులు చేశాడు షెఫర్డ్ (43 బంతుల్లో 36; 5 ఫోర్లు)తో కలిసిన హోల్డర్ (79 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఏడో వికెట్కు 77 పరుగులు జోడించి ఆదుకున్నాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మెక్ములెన్ 3, క్రిస్ సోల్, మార్క్వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలిచింది. ఓపెన్ మాథ్యూ క్రాస్ (107 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు), మెక్ములెన్ (106 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్కు 125 పరుగులు జోడించి విండీస్ ‘కప్’ రాతను కాలరాశారు. కరీబియన్కు ఎందుకీ దుస్థితి? జింబాబ్వేకు వచి్చన వెస్టిండీస్ జట్టులోని సభ్యుల్లో ప్రపంచకప్కు అర్హత సాధించాలి... భారత్కు వెళ్లాలి అన్న కసి, పట్టుదల కనిపించనే లేదు. అవే ఉంటే ఫీల్డింగ్ ఇంత ఘోరంగా చేయరు. బౌలింగ్ ఎంత పేలవం అంటే... నెదర్లాండ్స్తో కీలకమైన సూపర్ ఓవర్లో బౌండరీలు దాటే ఆరు బంతులు (4, 6, 4, 6, 6, 4; హోల్డర్ బౌలర్) వేయరు. నిలకడేలేని బ్యాటింగ్తో ఆడరు. ఇలా అన్ని రంగాల్లో చెత్త ప్రదర్శన వల్లే రెండుసార్లు ‘విజేత’ తాజా ‘అనర్హత’ అయ్యింది. ఇప్పుడు మిగతా ‘సూపర్ సిక్స్’ దశలో ఒమన్, శ్రీలంకలతో ఆడి ఇంటికెళ్లిపోవడమే మిగిలింది. వెస్టిండీస్ అంటేనే ఒకప్పుడు అరివీర భయంకర బౌలర్లు, దంచికొట్టే బ్యాటింగ్ ఆజానుబాహులు గుర్తొచ్చేవారు. కానీ ప్రస్తుతం నామమాత్రంగా జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు... ఫ్రాంచైజీ లీగ్ల్లో మాత్రం మెరిపించే వీరులు కనబడుతున్నారు. విండీస్ బోర్డు కుమ్ములాటలు, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులపై తరచూ పేచీలతో స్టార్ ఆటగాళ్లంతా టీమ్ స్పిరిట్ మరిచి వ్యక్తిగతంగా కలిసొచ్చే టి20 లీగ్లపై కష్టపడటం నేర్చారు. దీంతో అసలైన సంప్రదాయ క్రికెట్ (టెస్టు), పరిమిత ఓవర్ల ఆట (వన్డే)లను పట్టించుకోవడం మానేశారు. జట్టుగా పట్టుదలతో ఆడటం అనే దాన్నే మర్చిపోయారు. ఇప్పుడు కరీబియన్ ఆటగాళ్లంతా ఐసీసీ తయారు చేసిన భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)ను పూర్తి చేస్తున్నారు. కానీ విండీస్ భవిష్యత్తుకు అవసరమైన షెడ్యూల్ను ఎప్పుడో పక్కన బెట్టేశారు. అందువల్లే వెస్టిండీస్ జట్టుకు ఈ దుస్థితి దాపురించింది. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్ -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్
ICC Cricket World Cup Qualifiers 2023- Scotland Beat West Indies by 7 wkts: ‘‘ఆది నుంచే మా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. ఈ టోర్నీ సవాలుతో కూడుకున్నదని తెలుసు. నిజానికి ఈ మ్యాచ్లో మేము టాస్ గెలిస్తే బాగుండేది. ఇలాంటి పిచ్ మీద ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగే ఎంచుకుంటాడు. ఆ విషయంలో మాకేదీ కలిసిరాలేదు. క్యాచ్లు వదిలేయడాలు, మిస్ఫీల్డింగ్ తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆటలో ఇవన్నీ సహజమే! కానీ ప్రతిసారీ వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టలేము కదా! ఆటలో ఇవన్నీ సహజమే! వాస్తవానికి టోర్నీ ఆరంభానికి ముందే.. స్వదేశంలోనే మేము పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సింది. సరైన సన్నాహకాలు లేకుండా నేరుగా వెళ్లి గొప్పగా ఆడాలంటే అన్నివేళలా కుదరకపోవచ్చు. గెలవాలనే పట్టుదల, కసి మిగిలిన మ్యాచ్లలో గెలిచైనా మా అభిమానులకు కాస్త వినోదం పంచుతాం. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువ లేదు. కానీ నిలకడగా ఆడలేకపోవడమే మా కొంపముంచింది. స్కాట్లాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా వాళ్ల బౌలర్లు మెరుగ్గా రాణించారు. గెలవాలనే పట్టుదల, కసి వారిలో కనిపించాయి. మేము వాళ్లను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. తిరిగి వెళ్లిన తర్వాత డారెన్ సామీతో కలిసి మా జట్టులోని లోపాలను సరిచేసుకోవడంపై దృష్టి సారిస్తాం’’ అని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. స్కాట్లాండ్ చేతిలో ఓడి రెండుసార్లు చాంపియన్ అయిన విండీస్ జట్టు వన్డే వరల్డ్కప్-2023లో క్వాలిఫయర్స్లోనే ఇంటిబాట పట్టింది. జింబాబ్వేలో జరిగిన సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్తో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్కప్ రేసు నుంచి అవుట్ తద్వారా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2023లో అడుగుపెట్టే అర్హత కోల్పోయింది. మాజీ చాంపియన్ ఇలా అవమానకరరీతిలో నిష్క్రమించడం అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తోంది. మా ఓటమికి ప్రధాన కారణం అదే ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విండీస్ సారథి షాయీ హోప్ మాట్లాడుతూ.. టాస్ ఓడిపోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. హరారేలో శనివారం నాటి మ్యాచ్లో తాము తొలుత బ్యాటింగ్ చేయాల్సి రావడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఓటమికి పరోక్షంగా టాస్ ఓడటమే కారణమని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో స్కాట్లాండ్ బౌలర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించిన హోప్.. తమ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. టోర్నీ మొత్తం తమకు నిరాశనే మిగిల్చిందని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా సూపర్ సిక్సెస్లో విండీస్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. జూలై 5న ఒమన్, జూలై 7న శ్రీలంకతో వెస్టిండీస్ తలపడాల్సి ఉంది. ఈ రెండు నామమాత్రపు మ్యాచ్లలో గెలిచైనా గౌరవప్రదంగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని కరేబియన్ జట్టు భావిస్తోంది. స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు: టాస్: స్కాట్లాండ్- బౌలింగ్ వెస్టిండీస్- 181 (43.5) స్కాట్లాండ్- 185/3 (43.3) విజేత: ఏడు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాండన్ మెక్ములెన్ (3 వికెట్లు, 69 పరుగులు). చదవండి: పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే! పసికూన చేతిలో చిత్తు! వరల్డ్కప్ నుంచి అధికారికంగా అవుట్ -
డేంజర్ జోన్లో విండీస్.. వరల్డ్కప్కు క్వాలిఫై అవుతుందా?
రెండుసార్లు ప్రపంచకప్ విజేత.. అరవీర భయంకరమైన బౌలర్లు.. అదే స్థాయిలో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడిన బ్యాటర్లు.. నాలుగు దశాబ్దాల పాటు క్రికెట్ను శాసించిన వైనం. ఇప్పుడు అదంతా గతం. తాజాగా వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించడం కోసం వరల్డ్కప్ క్వాలిఫయర్ పోరులో ఆడాల్సిన దుస్థితి వెస్టిండీస్కు ఎదురైంది. అయితే శనివారం జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదే ఓటమి ఆ జట్టును డేంజర్ జోన్లో పడేసింది. క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా లీగ్ దశలో సాధించిన విజయాల ఆధారంగా వచ్చే పాయింట్లు సూపర్ సిక్స్లో లెక్కిస్తారు. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్లు అయిపోయే సరికి టాప్ 2లో ఉన్న జట్లు భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి. ఇక మ్యాచ్లో విండీస్ ఓడినప్పటికి సూపర్ సిక్స్ దశకు చేరుకున్నా రెండు పాయింట్లు మాత్రం కోల్పోయింది. ఇది సూపర్సిక్స్ దశలో ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. లీగ్లో వెస్టిండీస్ తన చివరి మ్యాచ్ను నెదర్లాండ్స్తో ఆడుతుంది. ఒకవేళ మ్యాచ్లో గెలిస్తే గ్రూప్-ఏ నుంచి టాప్-2గా అడుగుపెడుతుంది. ఇక జింబాబ్వే తన ఆఖరి పోరులో అమెరికాను ఎదుర్కొంటుంది. ఏదైనా సంచలనం నమోదైతే తప్ప జింబాబ్వే గ్రూప్ టాపర్గా సూపర్ సిక్స్ దశకు చేరుకుంటుంది. ఎందుకంటే జింబాబ్వే గ్రూప్ టాపర్గా ఉంటుంది కాబట్టి విండీస్ సూపర్ సిక్స్ దశలో అన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించడంలో విఫలమవుతుంది. చదవండి: 'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై గొడవపడ్డ భారత్, నేపాల్ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా! -
సెంచరీలతో కదం తొక్కిన హోప్, పూరన్.. విండీస్ ఖాతాలో భారీ విజయం
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్తో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్లో విండీస్ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కి విండీస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జత కలిసిన హోప్, పూరన్ జోడీ నాలుగో వికెట్కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాని జోడించి తమ జట్టు భారీ స్కోర్ చేయడానికి బాటలు వేశారు. ఆఖర్లో రోవ్మన్ పావెల్ (29), జేసన్ హోల్డర్ (16 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్ (10-0-34-3), అల్జరీ జోసఫ్ (10-0-45-2), కీమో పాల్ (10-1-63-2), అకీల్ హొస్సేన్ (10-1-49-2), కైల్ మేయర్స్ (6.4-0-37-1) ధాటికి 49.4 ఓవర్లలో 238 పరుగులకే అలౌటై ఓటమిపాలైంది. నేపాల్ ఇన్నింగ్స్లో ఆరిఫ్ షేక్ (63) అర్ధసెంచరీ సాధించగా.. గుల్సన్ ఝా (42), రోహిత్ పౌడెల్ (30), ఆసిఫ్ షేక్ (28), కరణ్ (28), దీపేంద్ర సింగ్ (23) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో గెలుపుతో విండీస్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింటిలో ఓటమిపాలైన నేపాల్ నాలుగో స్థానానికి పడిపోయింది.గ్రూప్-ఏలో ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో యూఎస్ఏను మట్టికరిపించిన నెదర్లాండ్స్ మూడో ప్లేస్కు చేరుకోగా.. ఆడిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించిన జాంబాబ్వే.. విండీస్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఓటమిపాలైన యూఎస్ఏ ఐదో స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఒమన్ (2 మ్యాచ్ల్లో 2 విజయాలు) టాప్లో ఉండగా.. శ్రీలంక (2), స్కాట్లాండ్ (2), ఐర్లాండ్ (0), యూఏఈ (0) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ఫైనల్కు చేరే రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. -
నయా రన్ మెషీన్ షాయ్ హోప్.. దిగ్గజాల సరసన చోటు
వెస్టిండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ అత్యంత అరుదైన జాబితాలో చేరాడు. వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2023లో భాగంగా నేపాల్తో ఇవాళ (జూన్ 22) జరుగుతున్న మ్యాచ్లో శతక్కొట్టం (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ద్వారా విరాట్ కోహ్లి, మైఖేల్ బెవాన్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, జో రూట్ లాంటి దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. నేపాల్తో మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా హోప్ మరోసారి వన్డేల్లో 50కిపైగా యావరేజ్ సాధించాడు. కనీసం 100 వన్డేలు ఆడి 50 అంతకంటే ఎక్కువ సగటు కలిగిన క్రికెటర్ల జాబితాలో పైన పేర్కొన్న దిగ్గజాలు మాత్రమే ఉన్నారు. హోప్ 110 మ్యాచ్ల్లో 105 ఇన్నింగ్స్లు ఆడి 50.26 సగటున 4674 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ అందరికంటే ఎక్కువగా 274 వన్డేల్లో 57.3 సగటున 12898 పరుగులు చేశాడు. విరాట్ తర్వాత ఆసీస్ మాజీ ఆల్రౌండర్ మైఖేల్ బెవాన్ (232 వన్డేల్లో 53.6 సగటున 6912 పరుగులు) అత్యధిక సగటు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ (228 వన్డేల్లో 53.5 సగటున 9577 పరుగులు), ఎంఎస్ ధోని (350 మ్యాచ్ల్లో 50.6 సగటున 10773 పరుగులు), జో రూట్ (158 వన్డేల్లో 50 సగటున 6207 పరుగులు) ఉన్నారు. తాజాగా హోప్ వీరి సరసన చేరాడు. నేపాల్తో మ్యాచ్లో సెంచరీ కొట్టడం ద్వారా హోప్ వన్డేల్లో తన 15వ శతకాన్ని నమోదు చేశాడు. 2019 వన్డే వరల్డ్కప్ తర్వాత ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్ల్లో 2153 పరుగులు), హోప్ అత్యధిక సెంచరీలు (9), అత్యధిక హాఫ్ సెంచరీలు (18) చేసిన రెండో బ్యాటర్గా హోప్ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవలికాలంలో హోప్ ప్రదర్శన చూసాక ఇతన్ని అందరూ నయా రన్ మెషీన్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే, నేపాల్తో మ్యాచ్లో హోప్తో పాటు నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో నేపాల్ తడబడుతుంది. 44 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. -
విండీస్ బ్యాటర్ల శతకాల మోత.. పూరన్ ఊచకోత
CWC Qualifiers 2023 WI VS NEP: వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్తో ఇవాళ (జూన్ 22) జరుగుతున్న మ్యాచ్లో విండీస్ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో భీకర ఫామ్ను కొనసాగిస్తూ కెరీర్లో 15వ శతకాన్ని నమోదు చేయగా.. టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) నేపాల్ బౌలర్లను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకాన్ని బాదాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్కు ముందు యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో అతి కష్టం మీద 39 పరుగుల తేడాతో విజయం సాధించిన విండీస్.. పాయింట్ల పట్టికలో (గ్రూప్-ఏ) జింబాబ్వే తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-బిలో ఆడిన 2 మ్యాచ్ల్లో గెలుపొందిన ఒమన్ టాపర్గా, శ్రీలంక, స్కాట్లాండ్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. 2019 వరల్డ్కప్ తర్వాత హోప్ను మించినోడే లేడు.. విండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ వన్డేల్లో భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. 2019 వన్డే వరల్డ్కప్ తర్వాత అతను పట్టపగ్గాలు లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో హోప్ ఏకంగా 9 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాది, అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్ల్లో 2153 పరుగులు) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హోప్కు కాస్త దగ్గరగా వచ్చిన బ్యాటర్ ఎవరైనా ఉన్నాడంటే అది బాబర్ ఆజమ్ అని చెప్పాలి. బాబర్ 28 ఇన్నింగ్స్ల్లో 1876 పరుగులు చేసి హోప్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. -
కోహ్లి, బాబర్ ఆజమ్లను మించిపోయిన వెస్టిండీస్ కెప్టెన్
వెస్టిండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ గత కొంతకాలంగా భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో (2019-2023) అతను వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్లను సైతం అధిగమించాడు. 2019 వన్డే వరల్డ్కప్ నుంచి నిన్నటి వరల్డ్కప్-2023 క్వాలిఫయర్స్ మ్యాచ్ల వరకు తీసుకుంటే.. హోప్ 46 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 2021 పరుగులు చేశాడు. కోహ్లి, బాబర్ ఆజమ్లు సైతం ఈ మధ్యకాలంలో అన్ని పరుగులు చేయలేదు. కోహ్లి 37 ఇన్నింగ్స్ల్లో 1612 పరుగులు చేస్తే.. బాబర్ ఆజమ్ 28 ఇన్నింగ్స్ల్లో 1876 పరుగులు చేశాడు. 2019-2023 జూన్ మధ్యకాలంలో హోప్ తర్వాత బాబర్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. వీరి తర్వాత పపువా న్యూ గినియా బ్యాటర్ అస్సద్ వాలా (47 ఇన్నింగ్స్ల్లో 1620 పరుగులు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో, నమీబియా క్రికెటర్ గెర్హార్డ్ ఎరాస్మస్ (38 ఇన్నింగ్స్ల్లో 1577 పరుగులు) ఐదో స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే, వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నిన్న (జూన్ 18) యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో షాయ్ హోప్ (54) సహా జాన్సన్ ఛార్లెస్ (66), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించడంతో విండీస్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వీరంతా రాణించడంతో 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో యూఎస్ఏ 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకంతో పోరాడి విండీస్కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయ లేదు. అతనికి ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) సహకరించారు. విండీస్ బౌలర్లలో కైల్ మేయర్స్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు, జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, వన్డే వరల్డ్కప్లో బెర్తు కోసం విండీస్.. మరో 9 జట్లతో కలిసి వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో తలపడుతున్న విషయం తెలిసిందే. -
పసికూనపై విండీస్ ప్రతాపం.. శతక్కొట్టిన కింగ్
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం యూఏఈలో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు షార్జా వేదికగా నిన్న (జూన్ 4) జరిగిన తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించి, సిరీస్కు శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. విండీస్ 35.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్రాండన్ కింగ్ సూపర్ శతకం (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి విండీస్ను గెలిపించాడు. అతనికి షామార్ బ్రూక్స్ (58 బంతుల్లో 44; 5 ఫోర్లు) జత కలిశాడు. యూఏఈ ఇన్నింగ్స్లో అలీ నసీర్ (58), అరవింద్ (40) రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 3, డొమినిక్ డ్రేక్స్, ఓడియన్ స్మిత్, కారియా తలో 2 వికెట్లు, రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్ 6న షార్జాలోనే జరుగనుంది. చదవండి: గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం అలా.. చివరికి పరువు పాయే..! -
WC Qualifier 2023: జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్
భారత్ వేదికగా జరగననున్న వన్డే ప్రపంచకప్-2023కు వెస్టిండీస్ జట్టు నేరుగా అర్హత సాధించకపోయిన సంగతి తెలిసిందే. జూన్లో జింబాబ్వే వేదికగా జరగనున్న వరల్డ్కప్ క్వాలిఫియర్ మ్యాచ్ల్లో వెస్టిండీస్ ఆడనుంది. ఈ క్రమంలో క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు బ్రాండెన్ కింగ్ సారధ్యం వహించనుండగా.. వైస్ కెప్టెన్గా రోవ్మన్ పావెల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా దాదాపు ఏడాది తర్వాత ఆ జట్టు ఆల్రౌండర్ కీమో పాల్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు జింబాబ్వేతో టెస్టు సిరీస్లో ఆకట్టుకున్న స్పిన్నర్ గుడాకేష్ మోటీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఈ జట్టులో విధ్వంసకర ఆటగాడు షెమ్రాన్ హెట్మైర్కు చోటు దక్కపోవడం గమానార్హం. ఇక వరల్డ్కప్ క్వాలిఫియర్ జట్టుతో పాటు యూఏఈతో వన్డే సిరీస్కు కూడా జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు ఐపీఎల్-2023లో భాగంగా ఉన్న విండీస్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ సిరీస్ ఆరంభసమయానికి ఐపీఎల్ పూర్తి అయినప్పటికీ.. తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని విండీస్ సెలక్టర్లు నిర్ణయించారు. ఈ సిరీస్ జూన్ 5 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్ యూఏఈ వన్డేలకు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, డొమినిక్ డ్రేక్స్, కావెం హాడ్జ్, అకీమ్ జోర్డాన్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రేమోన్ రీఫెర్, ఓడియన్ స్మిత్, డెవాన్ థామస్ -
విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు
సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ షెయ్ హోప్ (115 బంతుల్లో 128 పరుగులు, 5 ఫోర్లు, ఏడు సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. రోవ్మన్ పావెల్ 46, బ్రాండన్ కింగ్ 30, కైల్ మేయర్స్ 36 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో గెరాల్డ్ కొట్జే మూడు వికెట్లు పడగొట్టగా.. ఫొర్టున్, షంసీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 41.4 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బవుమా(118 బంతుల్లో 144 పరుగులు) తన కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు.. డికాక్(48 పరుగులు) మినహా బవుమాకు సహకరించేవారు కరువయ్యారు. టోని డి జార్జీ 27 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అకిల్ హొసెన్, అల్జారీ జోసెఫ్లు చెరో మూడు వికెట్లు తీయగా.. ఓడెన్ స్మిత్, యానిక్ కారియా, కైల్ మేయర్స్ తలా ఒక వికెట్ తీశారు. తొలి వన్డే వర్షార్పణం కావడంతో రెండో వన్డేలో గెలిచిన విండీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక చివరిదైన మూడో వన్డే మార్చి 21న(మంగళవారం) జరగనుంది. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న షెయ్ హోప్ను ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది. చదవండి: 36 బంతుల్లో 99 పరుగులు; ఒక్క పరుగు చేసుంటే చరిత్రలో -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! నాలుగేళ్ల తర్వాత బౌలర్ రీఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ఇప్పటికే తమ జట్టును ప్రకటించిన క్రికెట్ వెస్టిండీస్.. తాజాగా వన్డే, టీ20 సిరీస్లకు కూడా రెండు వేర్వేరు జట్టులను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్లో ప్రోటీస్తో విండీస్ తలపడనుంది. ఫిబ్రవరి 28 నుంచి జరగనున్న తొలి టెస్టుతో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. అదే విధంగా మార్చి 16న విండీస్-ప్రోటీస్ మధ్య జరగనున్న తొలి వన్డేతో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుకానుంది. ఇక వన్డేల్లో షాయ్ హోప్ తొలిసారిగా విండీస్ జట్టుకు నాయకత్వం వహించనుండగా.. రోవ్మన్ పావెల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు టీ20ల్లో కరీబియన్ జట్టుకు పావెల్ సారథ్యం వహిచంనుండగా.. అతడికి డిప్యూటీగా కైల్ మేయర్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇది ఇలా ఉండగా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియేల్ తిరిగి విండీస్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 34 ఏళ్ల గాబ్రియేల్ గతేడాది ఆఖరిలో జరిగిన సూపర్-50 వన్డే కప్లో గాబ్రియేల్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. గాబ్రియేల్ చివరగా 2019 వన్డే ప్రపంచకప్లో విండీస్ తరపున ఆడాడు. వెస్టిండీస్ వన్డే జట్టు షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్ వెస్టిండీస్ టీ20జట్టు రోవ్మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసిన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్కాయ్, నికోలస్ పూరన్, రేమాన్ రీఫర్, రొమారియో షెపర్డ్ చదవండి: IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు! -
వెస్టిండీస్ టీ20 కెప్టెన్గా విధ్వంసకర వీరుడు..
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టు పరిమిత ఓవర్ల కొత్త కెప్టెన్లను గురువారం ప్రకటించింది. వన్డేలకు సారథిగా సీనియర్ ఆటగాడు షాయ్ హోప్ ఎంపికవ్వగా.. టీ20లకు విధ్వంసకర ఆల్రౌండర్ రోవ్మన్ పావెల్ నియమితుడయ్యాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ నికోలస్ పూరన్ విండీస్ వైట్ బాల్ కెప్టెన్సీకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో వీరిద్దరూ బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చి 16 నుంచి దక్షిణాఫ్రికాతో జరగున్న వన్డే, టీ20 సిరీస్లతో సారథిలగా వీళ్ల ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా 2019 నుంచి విండీస్ వన్డే జట్టుకు హోప్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 104 వన్డే మ్యాచ్లు ఆడిన అతడు 48.08 సగటుతో 4308 పరుగులు చేశాడు. అదే విధంగా రోవ్మన్ పావెల్ కూడా విండీస్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20ల్లో కెప్టెన్గా అతడికి అపారమైన అనుభవం ఉంది. గత ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను సొంతం చేసుకున్న జమైకా తల్లావాస్కు పావెల్ సారథిగా వ్యవహరించాడు. అదే విధంగా అతడు కెప్టెన్గా జమైకా స్కార్పియన్స్కు యునైటెడ్ సూపర్50 కప్ టైటిల్ను కూడా అందించాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా విండీస్ రెండు టెస్టులు,మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లో అతిథ్య జట్టుతో తలపడనుంది. చదవండి: T20 WC: టీ20 ప్రపంచకప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. బంగ్లా క్రికెటర్తో 🚨BREAKING NEWS🚨 CWI announces new captains for White-Ball formats. Read More⬇️ https://t.co/Bmw7qILA9p pic.twitter.com/suNk7ndqKE — Windies Cricket (@windiescricket) February 15, 2023 -
విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. -
బంగ్లా ప్రీమియర్ లీగ్లో మెరుపులు.. విధ్వంసం సృష్టించిన హోప్, తమీమ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ లీగ్లో భారత్ మినహాయించి ప్రపంచ దేశాల క్రికెటర్లు పాల్గొంటూ, సత్తా చాటుతున్నారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. ఇవాళ (జనవరి 31) కొమిల్లా విక్టోరియన్స్తో జరిగిన మ్యాచ్లో ఖుల్నా టైగర్స్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యా ఛేదనకు దిగిన కొమిల్లా విక్టోరియన్స్ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (29 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్ముదులుపుతున్నారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ స్కోర్ 11 ఓవర్లకే 107కి చేరింది. ఈ జట్టు గెలవాంటే 54 బంతుల్లో మరో 104 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
CPL 2022: డుప్లెసిస్ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్లో నాలుగోది! కానీ పాపం..
Caribbean Premier League 2022 - Faf Du Plessis 4th T20 Century: కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్తో మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 103 పరుగులు చేశాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో తన నాలుగో శతకాన్ని నమోదు చేశాడు ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు. అయితే, గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటర్లు రాణించడంతో.. భారీ స్కోరు చేసినా సెయింట్ లూసియా కింగ్స్కు ఓటమి తప్పలేదు. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. Century for Faf!! Faf’s superb 103 runs from 59 balls earns him the @Dream11 MVP for match 27!! #CPL22 #GAWvSLK #CricketPlayedLouder #Dream11 #BiggestPartyInSport pic.twitter.com/R5Rkal9UCW — CPL T20 (@CPL) September 23, 2022 టాస్ గెలిచి.. భారీ స్కోరు చేసి Guyana Amazon Warriors vs Saint Lucia Kings: గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్గా బరిలోకి దిగి సెంచరీ సాధించాడు. అయితే, మిగతా ఆటగాళ్లలో వన్డౌన్ బ్యాటర్ డిక్విల్లా(36 పరుగులు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కింగ్స్ జట్టు 194 పరుగులు చేసింది. అర్ధ శతకాలతో మెరిసి.. సమిష్టి కృషితో.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ జట్టుకు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(26 బంతుల్లో 52 పరగులు), చంద్రపాల్ హేమ్రాజ్ (29 పరుగులు) శుభారంభం అందించారు. ఇక వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్ 30 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చినా షకీబ్ అల్ హసన్ మాత్రం డకౌట్గా వెనుదిరిగి నిరాశపరిచాడు. అయితే, ఆఖర్లో వారియర్స్ కెప్టెన్ షిమ్రన్ హెట్మెయిర్ 36 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపాడు. ఆఖరి ఓవర్ రెండో బంతికి ఒక పరుగు తీసి రొమారియో షెఫర్డ్ లాంఛనం పూర్తి చేశాడు. ఇలా 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు పోయి వారియర్స్ లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక విలువైన ఇన్నింగ్స్ ఆడిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్.. 16 ఇన్నింగ్స్లో 468 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతడి అత్యధిక స్కోరు 96. What an innings!!! Faf brings up his 4th T20 century in emphatic style as this evenings @fun88eng Magic Moment. #CPL22 #GAWvSLK #CricketPlayedLouder #Fun88 #BiggestPartyInSport pic.twitter.com/eBZpOUusyM — CPL T20 (@CPL) September 23, 2022 -
వన్డేల్లో వెస్టిండీస్ ఓపెనర్ అరుదైన ఫీట్.. నాలుగో ఆటగాడిగా..!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ షై హోప్ అరుదైన ఘనత సాధించాడు. తన వన్డే కెరీర్లో 100వ మ్యాచ్ ఆడిన హోప్ సెంచరీతో మెరిశాడు. తద్వారా 100వ మ్యాచ్లో సెంచరీ సాధించిన 10 ఆటగాడిగా హోప్ నిలిచాడు. గతంలో గార్డన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్), క్రిస్ కెయిన్స్ (న్యూజిలాండ్), మొహమ్మద్ యూసుఫ్ (పాక్), సంగక్కర (శ్రీలంక), క్రిస్ గేల్ (వెస్టిండీస్) ట్రెస్కోథిక్ (ఇంగ్లండ్), రాంనరేశ్ శర్వాణ్ (వెస్టిండీస్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), శిఖర్ ధావన్ (భారత్) ఈ ఘనత సాధించారు. అదే విధంగా ఈ అరుదైన రికార్డు సాధించిన నాలుగో విండీస్ ఆటగాడిగా హోప్ రికార్డులకెక్కాడు. ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టాస్: విండీస్- బ్యాటింగ్ వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు) సెంచరీతో చెలరేగిన షై హోప్(115 పరుగులు) భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు) విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (64 పరుగులు, ఒక్క వికెట్) అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డేల్లో ప్రపంచ రికార్డు.. -
వెస్టిండీస్ ఓపెనర్ వన్డేల్లో అరుదైన ఫీట్.. మూడో ఆటగాడిగా..!
వెస్టిండీస్ ఓపెనర్ షాయ్ హోప్ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్తో కలిసి వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు. రిచర్డ్స్ 88 ఇన్నింగ్స్లలో ఈ మైలు రాయిని అందుకోగా.. హోప్ కూడా 88 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనత సాధించాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన హోప్(127) ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2016 విండీస్ తరపున అరంగేట్రం చేసిన హోప్.. ఇప్పటి వరకు 88 ఇన్నింగ్స్లలో 4026 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా ఈ ఘనతను 81 ఇన్నింగ్స్లలో సాధించి తొలి స్థానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 82 రెండు ఇన్నింగ్స్లలో సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: గర్ల్ఫ్రెండ్ను దారుణ హత్య చేసిన ఫుట్బాలర్ -
సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు
వెస్టిండీస్తో రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్(49 పరుగులు) అనవసరంగా రనౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్తో సమన్వయలోపం అనుకుందామనుకున్నా పొరపాటే అవుతుంది. ఎందుకంటే రాహుల్ కాల్కు సూర్య సరిగ్గానే స్పందించాడు. కానీ రెండో పరుగు కోసం వెళ్లిన రాహుల్ రెండు సెకన్లు ఆగిపోయాడు. ఎందుకో ఆగాడో తెలియదు కానీ.. ఆ రెండు సెకన్లు అతని కొంప ముంచింది. కేవలం ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలా కీలక భాగస్వామ్యానికి తెరపడింది. చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. ప్రతిష్టాత్మక వన్డేలో కోహ్లి చెత్త ప్రదర్శన వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. టీమిండియా ఇన్నింగ్స్ గాడిన పడింది అనుకున్న సమయంలో రాహుల్ రనౌట్ అవ్వడం బాధ కలిగించింది. కీమర్ రోచ్ బౌలింగ్లో ఇన్నింగ్స్ 29వ ఓవర్ నాలుగో బంతిని కేఎల్ రాహుల్ స్వేర్లెగ్ దిశగా ఆడాడు. సింగిల్ ఈజీగా వస్తుంది.. కానీ రాహుల్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. సూర్య కూడా వేగంగా స్పందించడంతో రాహుల్ పరిగెత్తాడు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత కొన్ని సెకన్ల పాటు నిలబడిపోయాడు. అంతే అకియెల్ హొసేన్ వేసిన బంతిని అందుకున్న కీపర్ హోప్ వికెట్లను గిరాటేశాడు. దీంతో రాహుల్ సూర్యను చూస్తూ ఏంటిది అనుకుంటూ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: 'గుర్తుపెట్టుకోండి నా కూతురు పేరు'.. 2016 టి20 వరల్డ్కప్ హీరో KL Rahul Run Out 💔#INDvWI #KLRahul #ViratKholi pic.twitter.com/qcwkQohdko — Saqlain Khan (@Saqlainejaz56) February 9, 2022 -
వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం.. సిరీస్ ఇక కష్టమే!
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో మరోసారి కరోనా కలకలం రేపింది. ఆ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు, ఇద్దరు కోచింగ్ స్టాప్ కరోనా బారిన పడినట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. "మరో ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది" అని వెస్టిండీస్ క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. ఆ జట్టు వికెట్ కీపర్ షాయ్ హోప్,జస్టిన్ గ్రీవ్స్, అకేల్ హోసేన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. కాగా అంతకుముందు రోస్టన్ చేజ్, కైల్ మేయర్స్,షెల్డన్ కాట్రెల్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను అతిథ్య పాకిస్తాన్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా అఖరి టీ20 గురువారం(డిసెంబర్16)న జరగనుంది. అయితే కొవిడ్ కేసులు నమోదు కావడంతో ఈ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతే కాకుండా త్వరలో జరగనున్న వన్డే సిరీస్పై ఈ ప్రభావం ఉండనుంది. ఇక ఆటగాళ్లు బయోబబుల్లో ఉన్నప్పటికీ కేసులు నమోదు కావడం అందరనీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చదవండి: కోహ్లికే కాదు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కపిల్దేవ్ సంచలన వాఖ్యలు -
దుమ్మురేపిన బ్రావో.. విండీస్దే సిరీస్
నార్త్ సౌండ్: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. హసరంగ (80 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్లు), యాషెన్ బండార (55 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం విండీస్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసి గెలిచింది. ఐదేళ్ల తర్వాత డారెన్ బ్రావో (102; 5 ఫోర్లు, 4 సిక్స్లు) వన్డేల్లో మరో సెంచరీ సాధించాడు. షై హోప్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ (53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రావో... షై హోప్తో మూడో వికెట్కు 109 పరుగులు, పొలార్డ్తో ఐదో వికెట్కు 80 పరుగులు జోడించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ షై హోప్ వరుసగా ఆరు ఇన్నింగ్స్లలో కనీసం అర్ధ సెంచరీ చేసిన పదో క్రికెటర్గా, విండీస్ నుంచి గార్డన్ గ్రీనిడ్జ్, క్రిస్ గేల్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా గుర్తింపు పొందాడు. చదవండి: టీమిండియాకు జరిమానా.. కోవిడ్ తర్వాత మూడోసారి -
హోప్పై వేటు వేశారు
సెయింట్ జాన్స్ (అంటిగ్వా): న్యూజిలాండ్తో వచ్చే నెలలో మొదలయ్యే టి20, టెస్టు సిరీస్లకు వెస్టిండీస్ జట్లను ప్రకటించింది. టెస్టు జట్టులోకి డారెన్ బ్రేవో, హెట్మైర్, కీమో పాల్ పునరాగమనం చేయగా... బ్యాట్స్మన్ షై హోప్ ఉద్వాసనకు గురయ్యాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతోన్న హోప్ను సెలక్టర్లు పక్కన పెట్టారు. టెస్టు జట్టుకు సారథిగా జేసన్ హోల్డర్ వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్ ఆండ్రూ ఫ్లెచర్ 2018 తర్వాత తొలిసారి టి20 జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం. కరోనా నేపథ్యంలో తాము న్యూజిలాండ్ పర్యటనలో పాల్గొనలేమని ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్, ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, ఎవిన్ లూయిస్లు విండీస్ బోర్డుకు తెలియజేయడంతో వారిని పరిగణనలోకి తీసుకోలేదు. టి20 జట్టుకు కీరన్ పొలార్డ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. వెస్టిండీస్... న్యూజిలాండ్ పర్యటనను టి20 సిరీస్తో ఆరంభించనుంది. నవంబర్ 27, 29, 30వ తేదీల్లో మూడు టి20లను ఆడనున్న కరీబియన్ జట్టు... డిసెంబర్ 3–7, 11–15 మధ్య రెండు టెస్టు మ్యాచ్ల్లో కివీస్తో తలపడనుంది. -
ఏడేళ్ల బాలిక క్రికెట్ బ్యాట్కు పని చెప్పింది
-
7 ఏళ్లకే బ్యాటింగ్ ఇరగదీస్తోంది..
ముంబై: భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలో క్రికెట్ను మతంలా భావిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. క్రికెట్ క్రీడలో ఆటగాళ్లు రాణిస్తే ఆకాశానికెత్తేసే అభిమానులు.. అదే క్రికెటర్ల నుంచి పేలవమైన ఆటను చూడాల్సి వస్తే ఇక భరించలేరు.తమ నోటికి ఏ స్థాయిలో పని చెబుతారో తెలియని విషయం కాదు. భారత్లో గల్లీ క్రికెట్ బాగా ఫేమస్. ఖాళీ దొరికితే చాలు క్రికెట్ బ్యాట్ పుచ్చుకుని గల్లీల్లో క్రికెట్ ఆడేస్తూ ఉంటారు. అది ఇళ్లా.. లేక వీధా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. (ఇప్పట్లో క్రికెట్ కష్టమే) కొన్ని నెలల క్రితం రెండేళ్ల బుడతడు ఇంట్లోనే అచ్చమైన క్రికెట్ షాట్లతో మైమరించిన సంగతి తెలిసిందే.ఇంటినే క్రికెట్ స్టేడియంగా చేసుకుని కవర్ డ్రైవ్, లాఫ్టెడ్, ఆన్ డ్రైవ్ షాట్లతో సచిన్ను గుర్తు చేసేశాడు. ఇప్పుడు ఏడేళ్ల బాలిక క్రికెట్ బ్యాట్కు పని చెప్పింది. కచ్చితమైన ఫుట్వర్క్తో షాట్లను బాదేసింది. బంతుల్ని ఆడే క్రమంలో తన టైమింగ్ ఇరగదీసింది. భారత్కు చెందిన ఈ బాలిక పేరు పారీ శర్మ. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్తో పాటు వెస్టిండీస్ స్టార్ ఆటగాడు షాయ్ హోప్ కూడా ముగ్దుడయ్యాడు. ‘ ప్యారీ శర్మ బ్యాటింగ్ స్కిల్స్ అమోఘం. ఇంతటి చిన్న వయసులో కచ్చితమైన ఫుట్వర్క్ అసాధారణ విషయం. ఈ వీడియోలో ఏడేళ్ల పారీ శర్మ పాదాలను పాదరసంలా కదుపుతోంది’ అని ట్వీట్ చేయగా, ‘ నేను పారీలా ఆడుతూ పెరిగాను’ అని షాయ్ హోప్ ట్వీట్ చేశాడు. (కపిల్ దేవ్ గుండు.. ఆమే కారణం!) -
చిన్నారి ఫుట్వర్క్కు ఫిదా అవ్వాల్సిందే
-
చిన్నారి ఫుట్వర్క్కు ఫిదా అవ్వాల్సిందే
లండన్ : 'వయసులో చిన్నదానిలా కనిపిస్తున్నా.. ఫుట్వర్క్లో మాత్రం నీకు నువ్వే సాటి.. పరిశర్మ 'అంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, విండీస్ ఆటగాడు షాయ్ హోప్ లు పేర్కొన్నారు. ఇంతకీ పరి శర్మ ఎవరు .. వీరిద్దరు ఆమెను ఎందుకు పొగుడుతున్నరనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం. ఇండియాకు చెందిన పరి శర్మ వయసు ఏడేళ్లే అయినా క్రికెట్ శిక్షణలో మాత్రం రాటు దేలిందనే చెప్పాలి. ప్రాక్టీస్లో భాగంగా కచ్చితమైన ఫుట్వర్క్తో షాట్లు ఆడుతూ అందరి చేత శెభాష్ అనిపించుకుంటుంది. ('మ్యాచ్లు లేకపోవడంతో బోర్గా ఫీలవుతున్నా') తాజాగా పరిశర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనూ మైకేల్ వాన్ ట్విటర్లో షేర్ చేశాడు. 'వీడియోను ఒకసారి చూడండి.. ఏడేళ్ల పరి శర్మ ఫుట్వర్క్కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక పరిపూర్ణమైన షాట్లను ఆడడానికి మందు ఫుట్ వర్క్ ఎంతో అవసరం. ఆ విషయంలో పరిశర్మను ఎవరు అందుకోలేరు' అంటూ పేర్కొన్నాడు. ఇదే వీడియోనూ షాయ్ హోప్ కూడా షేర్ చేస్తూ..' నీ ఫుట్వర్క్కు జోహార్లు.. నేను పెద్దయ్యాక పరిశర్మ లాగే ఉండాలనుకున్నా' అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. పరి శర్మ ఫుట్వర్క్, బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉన్నాయి.. ఏదో ఒకరోజు క్రికెట్లో మంచి పేరు తెచ్చుకుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
26 ఏళ్ల రికార్డును మిస్ చేసుకున్నాడు..
కటక్: వెస్టిండీస్ ఓపెనర్ షాయ్ హోప్ ఒక చారిత్రక రికార్డును మిస్ చేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో వెస్టిండీస్ తరఫున అత్యధిక వన్డే పరుగులు సాధించే రికార్డును షాయ్ హోప్ స్వల్ప దూరంలో కోల్పోయాడు. విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా 1993లో 1349 పరుగులు సాధించాడు. అది ఇప్పటివరకూ విండీస్ తరఫున వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో సాధించిన అత్యధిక పరుగుల రికార్డు. దాన్ని హోప్ జస్ట్లో మిస్ అయ్యాడు. భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో హోప్ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఫలితంగా ఈ క్యాలెండర్ ఇయర్లో 1345 పరుగులు సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగులు సాధించిన జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానంలో ఉన్నాడు. భారత్తో రెండో వన్డేలో కోహ్లిని దాటేసిన హోప్.. ఓవరాల్గా విండీస్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే పరుగుల్ని నమోదు చేయడంలో విఫలమయ్యాడు. లారా రికార్డుకు నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. విండీస్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన జాబితాలో లారా, హోప్ల తర్వాత డేస్మాండ్ హేన్స్(1232పరుగులు-1985లో), వివ్ రిచర్డ్స్(1231పరుగులు-1985), క్రిస్ గేల్(1217 పరుగులు- 2006)లు వరుస స్థానాల్లో ఉన్నారు. -
షాయ్ హోప్ సరికొత్త రికార్డు
కటక్: వెస్టిండీస్ ఓపెనర్ షాయ్ హోప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో మూడు వేల పరుగులు సాధించడం ద్వారా నయా రికార్డును లిఖించాడు. టీమిండియాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో హోప్ 35 పరుగుల వద్ద ఉండగా మూడు వేల వన్డే పరుగుల మార్కును అందుకున్నాడు. ఫలితంగా వేగవంతంగా ఈ ఫీట్ను సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. హోప్కు ఇది 67వ వన్డే ఇన్నింగ్స్. ఫలితంగా బాబర్ అజామ్ను హోప్ అధిగమించాడు. పాకిస్తాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ 68 ఇన్నింగ్స్ల్లో మూడు వేల పరుగుల్ని సాధిస్తే.. హోప్ ఒక ఇన్నింగ్స్ ముందుగానే ఆ మార్కును చేరాడు. కాగా, వన్డే ఫార్మాట్లో వేగవంతంగా మూడు వేల పరుగులు సాధించిన వారిలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా(57 ఇన్నింగ్స్లు) ముందున్నాడు. ఆ తర్వాత స్థానాన్ని హోప్ ఆక్రమించగా, అజామ్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇక వెస్టిండీస్ తరఫున వన్డేల్లో మూడు వేల పరుగులు సాధించిన 12వ ఆటగాడిగా హోప్ నిలిచాడు. ఈ మ్యాచ్కు ముందు మూడు వేల వన్డే పరుగులకు 35 పరుగుల దూరంలో ఉన్న హోప్.. దాన్ని సునాయాసంగానే అందుకున్నాడు. షమీ బౌలింగ్లో రెండో వికెట్గా.. భారత్తో మూడో వన్డేలో హోప్ రెండో వికెట్గా ఔటయ్యాడు. మహ్మద్ షమీ వేసిన 20 ఓవర్ రెండో బంతికి బౌల్డ్ అయ్యాడు. 42 వ్యక్తిగత పరుగుల స్కోరు వద్ద ఉండగా షమీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన హోప్ బౌల్డ్గా నిష్క్రమించాడు. అంతకుముందు ఎవిన్ లూయిస్(21) తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా వేసిన తన తొలి ఓవర్లో లూయిస్ ఔటయ్యాడు.15 ఓవర్ ఆఖరి బంతికి నవదీప్ షైనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వెస్టిండీస 24 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. -
షాయ్ హోప్పై నో ఇంట్రెస్ట్..!
కోల్కతా: వెస్టిండీస్ స్టార్ ఆటగాడు షాయ్ హోప్ను ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. హోప్ కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా అతనిపై బిడ్ వేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో సభ్యుడైన హోప్ విశేషంగా రాణిస్తున్నాడు. దాంతో ఐపీఎల్ వేలంలో తాను భారీ ధర పలుకుతాననే నమ్మకంతో హోప్ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వేలంపై తాను పెద్దగా దృష్టి సారించలేదంటూ కూడా వెల్లడించాడు. అది తనకు సెకండరీ అంటూ ప్రకటించాడు. ఇక దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్ స్టెయిన్ను సైతం కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.. స్టెయిన్ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా అతనిపై బిడ్ వేయలేదు. దాంతో స్టెయిన్కు నిరాశ తప్పలేదు. ఇక భారత ఆటగాడు మోహిత్ శర్మ కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా వేలంలో ఫ్రాంచైజీలను ఎట్రాక్ట్ చేయలేకపోయాడు. శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ పెరీరా కూడా అమ్ముడు పోలేదు. వేలం చివర్లో ఒకవేళ ఫ్రాంఛైజీలకు ఆటగాళ్లు అవసరమైన వారి వద్ద అందుకు తగ్గ నగుదు అందుబాటులో ఉంటేనే వీరు అమ్ముడుపోయే అవకాశం ఉంది. -
గోల్డెన్ డక్ అయ్యే చాన్స్ను మిస్ చేశారు..
విశాఖ: టీమిండియా ఫీల్డింగ్లో మరోసారి వైఫల్యం కనిపించింది. వెస్టిండీస్తో ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా మూడు టీ20ల సిరీస్లు పలు క్యాచ్లను వదిలేసిన టీమిండియా.. వన్డే సిరీస్లో కూడా అదే రిపీట్ చేస్తోంది. తొలి వన్డేలో హెట్మెయిర్ ఇచ్చిన క్యాచ్ను శ్రేయస్ అయ్యర్ జారవిడవడంతో మనవాళ్లు అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఆ క్యాచ్ వదిలేసిన తర్వాత హెట్మెయిర్ విధ్వంసర సృష్టించి మ్యాచ్ను వన్సైడ్గా మార్చేశాడు. కాగా, రెండో వన్డేలో కూడా టీమిండియా ఆదిలోనే ఒక క్యాచ్ను నేలపాలు చేసింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో రెండు బంతుల్ని లూయిస్ ఆడాడు. రెండో బంతికి బై రూపంలో పరుగు రావడంతో క్రీజ్లో కి షాయ్ హోప్ వచ్చాడు. హోప్ ఆడిన తొలి బంతే ఎడ్జ్ తీసుకుని స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ చేతుల్లో పడింది. అయితే ఆ సునాయసమైన క్యాచ్ను రాహుల్ విడిచిపెట్టాడు. దాంతో హోప్ను గోల్డెన్ డక్గా పంపే చాన్స్ను టీమిండియా మిస్ చేసుకుంది. తొలి వన్డేలో హోప్ సెంచరీ సాధించి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంచితే, ఆసియాలో ఆడిన గత ఆరు వన్డే ఇన్నింగ్స్ల్లో హోప్ విశేషంగా రాణించాడు. ఆసియాలో వరుసగా హోప్ నమోదు చేసిన ఇన్నింగ్స్ లు 146 నాటౌట్, 108నాటౌట్, 77నాటౌట్, 43, 109 నాటౌట్, 102నాటౌట్లుగా ఉన్నాయి.(ఇక్కడ చదవండి: ఇరగదీసిన టీమిండియా.. విండీస్కు భారీ లక్ష్యం) ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(159; 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్ రాహుల్(102; 104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు)ల సెంచరీలకు జతగా, శ్రేయస్ అయ్యర్(53;32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్ పంత్(39; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు)లు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ భారీ స్కోరు చేసింది. -
ఆ రికార్డును బ్రేక్ చేయడమే టార్గెట్!
విశాఖపట్నం: వచ్చే సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా డిసెంబర్ 19(గురువారం)వ తేదీన కోల్కతాలో వేలం జరుగనున్న తరుణంలో వందల సంఖ్యలో క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. అయితే తనకు ఐపీఎల్ వేలం బెంగ లేదంటున్నాడు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ షాయ్ హోప్. తమ జట్టులో చాలా మంది క్రికెటర్లకు ఐపీఎల్ వేలం అనేది మైండ్లో ఉంటుందేమో కానీ, తనకు మాత్రం అది సెకండరీ అని స్పష్టం చేశాడు. ఐపీఎల్ వేలం కోసం తానేమీ నిద్రలేని రాత్రులు గడపడం లేదంటూ చమత్కరించాడు. అదే సమయంలో ఒక రికార్డుపై మాత్రం ఫోకస్ చేసినట్లు సూచనప్రాయంగా హోప్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగుల జాబితాలో కోహ్లి(1292), రోహిత్ శర్మ(1268)లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, హోప్(1225) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దాంతో కోహ్లి, రోహిత్ల రికార్డులపై కన్నేసినట్లు ముసిముసిగా నవ్వుతూ పేర్కొన్నాడు. తనకు ఎదురైన ప్రశ్నకు సంబంధించి హోప్ ఇలా పేర్కొన్నాడు. ‘కచ్చితంగా ఐపీఎల్ వేలానికి సంబంధించిన టెన్షన్ చాలా మందికి ఉంటుంది. కానీ నాకైతే లేదు. నాకు భారత్తో సిరీసే ముఖ్యమైనది. ఇక్కడ పరుగులు చేయడమే నా ముందున్న టార్గెట్. ఈ క్రమంలోనే కోహ్లి, రోహిత్ల రికార్డులను కూడా బ్రేక్ చేయాలని ఉంది. వారి రికార్డును బ్రేక్ చేయాలంటే వారిద్దర్నీ తొందరగా పెవిలియన్కు పంపమని మా బౌలర్లను అడగాలి(నవ్వుతూ). ఆ ఇద్దర్నీ సాధ్యమైనంత త్వరగా ఔట్ చేస్తే ఇక నేను రేసులోకి వస్తా. ఒకవేళ నేను పరుగులు సాధిస్తే టాప్లోకి వస్తా. నేను 50 ఓవర్ల పాటు క్రీజ్లో ఉండాలని అనుకోను. ఒకవేళ నేను 50 యాభై ఓవర్లు ఆడేస్తే మా ప్లేయర్లకు మరో 50 ఓవర్లు కావాలి కదా. నేను సాధారణంగా భారీ స్కోరు సాధించడంపైనే దృష్టి పెడతా. ఒక బ్యాట్స్మన్గా దేశం కోసం ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యతిస్తా’ అని హోప్ పేర్కొన్నాడు. భారత్తో జరిగిన తొలి వన్డేలో హోప్ సెంచరీ సాధించి విండీస్ విజయానికి సహకరించాడు. -
‘గేల్.. నిన్ను మిస్సవుతాం’
లీడ్స్: వరల్డ్కప్ పరంగా చూస్తే క్రిస్ గేల్ ఇదే చివరిది. దానిలో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్ జరిగిన మ్యాచ్లో గేల్ తన చివరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడేశాడు. తన చివరి మెగా టోర్నీలో గేల్ విఫలమయ్యాడనే చెప్పాలి. అఫ్గానిస్తాన్తో తన ఆఖరి వరల్డ్కప్ మ్యాచ్ ఆడిన గేల్ 7 పరుగులే చేసి తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. తొలుత వరల్డ్కప్ తర్వాత తన రిటైర్మెంట్ ఉంటుందని ప్రకటించిన గేల్.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. భారత్తో సిరీస్ ఆడిన తర్వాతే తన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతానంటూ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో గేల్ వీడ్కోలు అంశానికి సంబంధించి సహచర ఆటగాడు షాయ్ హోప్ మాట్లాడుతూ.. క్రికెట్కు గేల్ వీడ్కోలు చెప్పిన రోజును ఒక దుర్దినంగా అభివర్ణించాడు. ‘ గేల్ రిటైర్మెంట్ ప్రకటించిన క్షణం క్రికెట్లో ఒక దుర్దినంగా మిగిలి పోతుంది. యావత్ ప్రపంచం నిన్ను కచ్చితంగా మిస్పవుతుంది’ అని పేర్కొన్నాడు.అసలు గేల్ నుంచి దేన్ని ప్రధానంగా కోల్పోతారని హోప్ను ప్రశ్నించగా.. ‘అతను పెట్టుకునే వింత వింత సన్ గ్లాసెస్ను మిస్సవుతాం’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. అదే సమయంలో గేల్ ఒక అసాధారణ ఆటగాడని, అతని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామన్నాడు హోప్. వచ్చే నెల్లో భారత్తో సిరీస్ ఆడిన తర్వాత తన రిటైర్మెంట్ ఉంటుందని గేల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వదేశంలో భారత్తో జరుగనున్న వన్డే సిరీస్తో పాటు టెస్టు సిరీస్లో కూడా ఆడతానని గేల్ తెలిపాడు. -
విండీస్.. విజయంతోనే ఇంటికి
లీడ్స్ : ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న ప్రపంచకప్లో వెస్టిండీస్ ప్రస్థానం విజయంతోనే ముగిసింది. గురువారం హెడింగ్లీ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో విండీస్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరేబియన్ జట్టు నిర్దేశించిన 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ నిర్ణీత ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది. అఫ్గాన్ ఆటగాళ్లలో ఇక్రామ్ అలీ(86; 93 బంతుల్లో, 8ఫోర్లు), రెహ్మత్ షా(62; 78 బంతుల్లో 10ఫోర్లు)అర్దసెంచరీలతో రాణించారు. అస్గర్ అఫ్గాన్(40), నజీబుల్లా(31) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో బ్రాత్వైట్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కీమర్ రోచ్ మూడు వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించడంలో సహకరించిన షాయ్ హోప్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఛేదనలో అఫ్గాన్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్, సారథి గుల్బాదిన్ నైబ్(5) తీవ్రంగా నిరాశ పరిచాడు. అనంతరం మరో ఓపెనర్ రెహ్మత్ షా ఇక్రామ్ అలీతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం రెహ్మాత్ను బ్రాత్వైట్ ఔట్ చేసి విండీస్కు బ్రేక్ ఇస్తాడు. అనంతర వచ్చిన బ్యాట్స్మెన్ మెరుపు వేగంతో ఆడకపోవడంతో పాటు.. క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. భారీ స్కోర్ కావడం.. చివర్లో విండీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ ఓటమి చవిచూసింది. అంతకుముందు బ్యాట్స్మెన్ షాయ్ హోప్(77; 92బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు), లూయిస్ (58; 78బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు), పూరన్(58; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలకు తోడు హెట్మైర్(39: 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), హోల్డర్(45; 34 బంతుల్లో ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులు మెరిపించడంతో ఆఫ్గానిస్తాన్తో మ్యాచ్లో విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో దవ్లత్ రెండు వికెట్లు పడగొట్టగా, షిర్జాద్, నబి, రషీద్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్చ్.. గేల్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్కు శుభారంభం దక్కలేదు. కెరీర్లో చివరి వరల్డ్కప్ ఆడుతున్న కరేబియన్ వీరుడు క్రిస్ గేల్ (7) నిరాశపర్చాడు. దవ్లత్ బౌలింగ్లో వికెట్ కీపర్ ఇక్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత నుంచి లూయిస్–హోప్ జోడీ రెండో వికెట్కు 88 పరుగులు జతచేసింది. లూయిస్ను ఔట్ చేయడం ద్వారా ఈ జోడీని రషీద్ ఖాన్ విడదీశాడు. ఆ తర్వాత హెట్మైర్తో కలసి హోప్ మరో ఉపయుక్త భాగస్వామ్యం(65) నెలకొల్పాడు. వీరిద్దరూ స్వల్పవ్యవధిలో ఔట్ కావడంతో విండీస్ స్కోరు కాసేపు మందగించింది. అయితే, ఆఖర్లో పూరన్–హోల్డర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో బ్రాత్వైట్ (14 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో విండీస్ స్కోరు 300 దాటింది. -
షాయ్ హోప్ అరుదైన ఘనత
మాంచెస్టర్: వెస్టిండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్ తరఫున ఒక వరల్డ్కప్లో అత్యధిక క్యాచ్లు పట్టిన కీపర్గా గుర్తింపు పొందాడు. ప్రస్తుత వరల్డ్కప్లో షాయ్ హోప్ పట్టిన క్యాచ్లు 15 కాగా, అంతకుముందు జెఫ్ డజన్ ఈ ఫీట్ సాధించాడు. 1983లో జెఫ్ డజన్ ఆ రికార్డు నమోదు చేయగా, ఇప్పుడు అతని సరసన హోప్ నిలిచాడు. గురువారం భారత్తో జరుగుతున్న మ్యాచ్లో షాయ్ హోప్ నాలుగు క్యాచ్లు అందుకున్నాడు. రోహిత్ శర్మ, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, మహ్మద్ షమీల క్యాచ్లును హోప్ పట్టడంతో అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. ఒక వరల్డ్కప్లో విండీస్ తరఫున అత్యధిక కీపర్ క్యాచ్లు పట్టిన వారిలో షాయ్ హోప్-జెఫ్ డజన్ల తర్వాత స్థానాల్లో రిడ్లీ జాకబ్స్(14 క్యాచ్లు-1999 వరల్డ్కప్), దినేశ్ రామ్దిన్(13 క్యాచ్లు-2007, 2015ల్లో)లు ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి ఏడు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(72; 82 బంతుల్లో 8 ఫోర్లు), కేఎల్ రాహుల్(48; 64 బంతుల్లో 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా(46; 38 బంతుల్లో 5 ఫోర్లు), ఎంఎస్ ధోని(56 నాటౌట్; 61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు))లు రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. -
ఒకటి, రెండు.. ధోని సేఫ్
మాంచెస్టర్ : ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ తడబడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. సారథి విరాట్ కోహ్లి మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ధోని ఇన్నింగ్స్ చక్కదిద్దే యత్రం చేస్తున్నాడు. అయితే ఆరంభంలోనే ధోని ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. విండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ చెత్త కీపింగ్తో అవుటయ్యే ప్రమాదం నుంచి ధోని తప్పించుకున్నాడు. స్పిన్నర్ ఫబియన్ అలెన్ వేసిన 34 ఓవర్ తొలి బంతిని ధోని ముందుకచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్కు దూరంగా వెళ్లిన బంతి కీపర్ చేతుల్లో పడింది. అయితే తొలి ప్రయత్నంలో స్టంపౌట్ చేయడంలో హోప్ విఫలమయ్యాడు. అయితే ఔట్ అని ఫిక్స్ అయిన ధోని లేట్గా స్పందించాడు. దీంతో హోప్కు మరో అవకాశం లభించింది. అప్పటికీ స్టంపౌట్ చేయడంలో హోప్ విఫలమయ్యాడు. వెంటనే తేరుకున్న ధోని క్రీజులోకి తిరిగొచ్చాడు. దీంతో ఒక్కసారిగా టీమిండియా ఫ్యాన్స్తో పాటు ధోని ఊపిరిపీల్చుకున్నాడు. అయితే ఇదే సమయంలో హోప్ విసిరిన త్రో మిస్ కావడంతో బై రూపంలో టీమిండియాకు ఒక పరుగు కూడా లభించడం విశేషం. ఎంతో ఫన్నీగా ఉన్న ఈ వీడియో నెట్టింట్లో తెగహల్చల్ చేస్తోంది. ఇక అఫ్గానిస్తాన్ మ్యాచ్లో ధోని స్టంపౌట్ అయిన విషయం తెలిసిందే. -
ధోనిని స్టంపౌట్ చేద్దామనుకుంటే..
-
చెలరేగిన షై హోప్
సిల్హెట్ (బంగ్లాదేశ్): వెస్టిండీస్ ఓపెనర్ షై హోప్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) బంగ్లాదేశ్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో సోమవారం ఇక్కడ జరిగిన తొలి టి20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 129 పరుగులు చేసి ఆలౌటైంది. పేసర్ షెల్డన్ కాట్రెల్ (4/28) ధాటికి విలవిల్లాడిన ఆతిథ్య జట్టును కెప్టెన్ షకీబుల్ హసన్ (43 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్లు) ఆదుకున్నాడు. తర్వాత 130 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం 10.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. హోప్ ప్రతాపంతో విండీస్ 3.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. 98 పరుగుల వద్ద హోప్ నిష్క్రమించాక... మిగతా లాంఛనాన్ని నికోలస్ పూరన్ (23 నాటౌట్), కీమో పాల్ (14 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) అంతే వేగంతో పూర్తి చేశారు. దీంతో సగం ఓవర్లు (9.1) మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది. రెండో టి20 గురువారం ఢాకాలో జరుగుతుంది. -
వెస్టిండీస్ మరో చెత్త రికార్డు
కోల్కతా: ఇటీవల భారత్తో జరిగిన చివరివన్డేలో 104 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును నమోదు చేసిన వెస్టిండీస్ మరో అపప్రథన మూటగట్టుకుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో విండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులే చేసింది. ఫలితంగా టీ20ల్లో భారత్పై అత్యల్ప స్కోరును నమోదు చేసి చెత్త రికార్డును సొంతం చేసుకుంది. 2014లో భారత్పై 129 పరుగులు చేసిన విండీస్.. తాజాగా దాన్ని సవరించింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించి సిరీస్లో శుభారంభం చేసింది. అంతకముందు భారత్తో జరిగిన ఐదో వన్డేల సిరీస్లో భాగంగా ఆఖరి వన్డేలో విండీస్ ఘోరంగా వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. ఏ ఒక్క ఆటగాడు కనీసం పోరాడటంలో విఫలం కావడంతో విండీస్ 104 పరుగులకే ఆలౌటైంది. తద్వారా వన్డే ఫార్మాట్లో భారత్పై అత్యల్ప స్కోరును నమోదు చేసిన అపప్రథను విండీస్ సొంతం చేసుకుంది. ఇది భారత్పై వన్డేల్లో విండీస్కు అత్యల్ప స్కోరుగా నమోదైంది. ఆ వన్డే జరిగిన నాలుగు రోజుల వ్యవధిలోనే విండీస్ మరోసారి తడ‘బ్యాటు’కు గురై చెత్త రికార్డును మూటగట్టుకోవడం గమనార్హం. ఇక్కడ చదవండి: ఆ వికెట్ కోసం కృనాల్ పట్టుబట్టాడు: రోహిత్ డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు! ఆపసోపాలతో... ఐదు వికెట్లతో... -
డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు!
కోల్కతా : వెస్టిండీస్తో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆపసోపాలతో గట్టెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. టాస్ గెలిచిన భారత సారథి రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ వరుసగా వికెట్లను కోల్పోయింది. అయితే బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో హెట్మైర్తో సమన్వయ లోపం కారణంగా షై హోప్ రనౌటయ్యాడు. హోప్ ఆడిన షాట్ను ఫార్వార్డ్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ అందుకున్నాడు. (చదవండి: ఆపసోపాలతో... ఐదు వికెట్లతో...) కానీ అతను విసిరిన త్రో కీపర్ పైనుంచి వెళ్లిపోయినా పక్కనే ఉన్న మనీశ్ పాండే దానిని చక్కగా అందుకున్నాడు. దీంతో అయోమయానికి గురైన బ్యాట్స్మెన్ ఒకేవైపుకు పరుగెత్తారు. అనంతరం పాండే సునాయాసంగా రనౌట్ చేయడంతో హోప్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఘటనతో మైదానంలో నవ్వులు పూసాయి. ఇక నెటిజన్లైతే దీనికి సంబంధించిన ఫొటోలపై వింత క్యాఫ్షన్స్ ఇస్తూ విండీస్ ఆటగాళ్లను ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘ఈ రేస్ హెట్మైర్ గెలిచాడోచ్.!, డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు’అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. (చదవండి: పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్!) వీడియో కోసం క్లిక్ ఇక్కడ చేయండి Cricket pitch or a race track? #INDvWI pic.twitter.com/riepUJQEBm — Prasenjit Dey (@CricPrasen) 4 November 2018 HETMEYR WINS THE RACE....#INDvWI #Cricket pic.twitter.com/eC8VW8x7rK — 🅗 🅐 🅡 🅘 🅣 (@imharit) 4 November 2018 Dude it's cricket!! 100 metres sprint can follow. #INDvWI pic.twitter.com/iZmuplxKz5 — Ankur Nigam (@ankurnigam) 4 November 2018 ఇక ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అలెన్ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ (3/13), కృనాల్ పాండ్యా (1/15) ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం భారత్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ముందుండి జట్టును విజయం దిశగా నడిపించాడు. మూడు టీ20ల సిరీస్లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రేపు లక్నోలో రెండో మ్యాచ్ జరుగునుంది. -
మలింగా తర్వాత ఉమేశ్..!
విశాఖపట్నం: వెస్టిండీస్తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ డబ్బైకి పైగా పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన ఉమేశ్ యాదవ్ వికెట్ మాత్రమే తీసి 78 పరుగుల్ని సమర్పించుకున్నాడు. ఫలితంగా వన్డే ఇన్నింగ్స్ల్లో అత్యధిసార్లు 70కి పైగా పరుగులిచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఉమేశ్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇక్కడ శ్రీలంక పేసర్ లసిత్ మలింగా తొలి స్థానంలో ఉండగా, ఉమేశ్ రెండో స్థానంలో నిలిచాడు. మలింగా 17 సార్లు డబ్భైకి పైగా పరుగుల్ని ఇవ్వగా, ఉమేశ్ 12సార్లు డబ్భై అంతకంటే పరుగుల్ని సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషిద్(11) మూడో స్థానంలో ఉన్నాడు. షై హోప్ సరికొత్త రికార్డు విండీస్ ఆటగాడు షై హోప్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. లక్ష్య ఛేదనలో భాగంగా టైగా ముగిసిన మ్యాచ్ల్లో అజేయంగా అత్యధిక వ్యక్తిపరుగులు సాధించిన జాబితాలో షై హోప్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయ్యిద్ అన్వర్(103 నాటౌట్) ఉన్న రికార్డును హోప్ బ్రేక్ చేశాడు. 1995లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అన్వర్ అజేయంగా శతకం సాధించగా, ఆ మ్యాచ్ టైగా ముగిసింది.