Shar
-
శతప్రయోగ విజయసీమ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం ఉదయం జరిపిన నూరవ రాకెట్ ప్రయోగంతో చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఎగసిన భూ సమకాలిక ఉపగ్రహ ప్రయోగవాహక నౌక (జీఎస్ఎల్వీ–ఎఫ్15) ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని విజయ వంతంగా నిర్ణీత కక్ష్య అయిన జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ – జీటీఓలోకి చేర్చింది. ఈ కొత్త ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం నిర్విఘ్నంగా సాగడం శాస్త్రవేత్తల్లో ఆనందం పెంచింది. రోదసిలో చేరిన ఈ తాజా శాటిలైట్తో మన ‘నావిక్’ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్)లో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. దీని వల్ల మన దేశంతో పాటు మన పొరుగు దేశాలకూ మొబైల్ ఫోన్లలో జీపీఎస్ సహా అనేక సేవల్లో కచ్చితత్వం పెరగనుంది. ఇతర దేశాలన్నీ అమెరికా తాలూకు జీపీఎస్పై ఆధారపడితే, భారత్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్లో సొంత కాళ్ళపై నిలబడేందుకు చేస్తున్న ఈ కృషి సగటు భారతీయుడి ఛాతీ ఉప్పొంగే క్షణం. సైకిళ్ళు, ఎడ్లబండ్లపై రాకెట్ విడిభాగాలను తరలించిన కాలం నుంచి ఇటీవలే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించే (డాకింగ్ చేసే) స్థాయికి ఇస్రో చేరడం చిరకాలం చెప్పుకోవా ల్సిన స్ఫూర్తిగాథ. విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధవన్ లాంటి దిగ్గజాల తొలి అడుగులతో ఆరంభించి, ఆపైన కలామ్ లాంటి వారి మేధను వినియోగించుకొని అయిదు దశాబ్దాల పైగా సాగించిన ప్రస్థానం చిరస్మరణీయం. 1962లో అణుశక్తి విభాగం కింద ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ ద్వారా ఇస్రోకు బీజం పడింది. చంద్రుడి మీదకు అమెరికా మానవుణ్ణి పంపిన 1969లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రో స్థాపన జరిగింది. 1972లో ప్రత్యేకంగా అంతరిక్ష శాఖ ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేక రాకెట్లకు పురుడు పోయడమే కాక, ఇతర దేశాల ఉపగ్రహ ప్రయోగాలలోనూ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగింది. మన ఇస్రో 1979 ఆగస్ట్ 10న తొలిసారిగా ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్ఎల్వీ–3 ఈ10) ద్వారా ప్రయోగాత్మకంగా రోహిణీ టెక్నాలజీ పేలోడ్ను నింగిలోకి పంపిన క్షణాలు ఆ తరంలో చాలామందికి ఇప్పటికీ గుర్తే. అప్పట్లో ఇస్రోతో పనిచేస్తున్న అబ్దుల్ కలామే ఆ ప్రయోగానికి డైరెక్టర్. సదరు ప్రయోగం పాక్షికంగానే విజయం సాధించింది కానీ, ఆ తర్వాత కాలగతిలో అంతరిక్ష ప్రయోగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఆరితేరాం. అంకెల్లో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఇస్రో 548 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 120 టన్నుల పేలోడ్ను నింగిలోకి పంపింది. అందులో 433 విదేశీ ఉపగ్రహాలకు చెందిన 23 టన్నులూ ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో షార్ కేంద్రం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైంది. మూడు చంద్రయాన్లు, ఒక మార్స్ ఆర్బిటర్ ప్రయోగం, ఆదిత్య ఎల్1 ప్రయోగం లాంటివి గణనీయమైనవి. కక్ష్యలో పరిభ్రమించే వ్యోమనౌకను భూవాతావరణంలోకి ప్రవేశింపజేసి... భూమి పైకి క్షేమంగా తెచ్చి రికవరీ చేసే ‘స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం’ (ఎస్ఆర్ఈ), అలాగే ఒకే రాకెట్తో 104 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వగైరా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇస్రో ప్రయోగించినవాటిల్లో కమ్యూనికేషన్ శాటిలైట్లు, భూ పరిశీలన ఉపగ్రహాలు, మార్గనిర్దేశక (నావిగేషనల్), ప్రయోగాత్మక శాటిలైట్లు అనేకం. ఆ వివరాలు సగర్వంగా తోస్తాయి. రానున్న రోజుల్లోనూ మరిన్ని చారిత్రక ఘట్టాలకు ఇస్రో చోదకశక్తి కానుంది. గగన్యాన్లో భాగంగా మానవరహిత జి1 ప్రయోగం తొలిసారి చేయనున్నారు. అలాగే, నెక్స్›్ట జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ), చంద్రయాన్, శుక్రయాన్ జరగనున్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సైతం వేదికగా నిలిచి, అంతరిక్ష వాణిజ్యంలో తగిన వాటా కోసం ప్రయత్నిస్తున్న ఇస్రో మరో రెండేళ్ళలో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ను నిర్మించనుండడం విశేషం. అలాగే, తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండో ఉపగ్రహ ప్రయోగ కాంప్లెక్స్ సైతం సిద్ధమవుతోంది. భారీ పేలోడ్ లను రోదసిలోకి తీసుకెళ్ళగలిగే ఎన్జీఎల్వీల రూపకల్పనకూ, మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికీ దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుంది. అంత మొత్తం వెచ్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన, ప్రయోగ రంగానికి ఇది పెద్ద ఊతం. ఇవన్నీ ప్రైవేట్ రంగ రోదసీ ప్రయోగాల్లో ఇస్రో సింహభాగం దక్కించుకోవడానికి ఉపకరిస్తాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించినప్పుడు స్వశక్తితో దేశీయంగా బుడిబుడి అడుగులతో మొదలుపెట్టిన భారత్ దాదాపు అయిదు పదుల ఏళ్ళలో శత రోదసీ ప్రయోగాలు సాగించింది. రానున్న అయిదేళ్ళలోనే రెండో శతం పూర్తి చేసి, మొత్తం 200 ప్రయోగాల మైలురాయికి చేరుకోవడానికి ఉరకలు వేస్తోంది. ఇన్నేళ్ళుగా మన అంతరిక్ష పరిశోధ కులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చూపుతున్న అచంచలమైన నిబద్ధత, అంకితభావానికి మచ్చుతునక ఈ ఇస్రో విజయగీతిక. విశ్వవేదికపై అగ్రరాజ్యాల సరసన అంతరిక్షంలో భారత్ సూపర్ పవర్గా ఎదిగిందనడానికీ ఇది ప్రతీక. అనేక ఆర్థిక, సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ సృజనాత్మకంగా ఆలోచించి, పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మలుచుకొంటే గణనీయ విజయాలు సాధ్యమే అనడానికి ఇదే తిరుగులేని రుజువు. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం నుంచి ఆ మధ్య మంగళ్యాన్ వరకు ప్రతిసారీ తక్కువ ఖర్చుతో, అంచనాలకు అందని విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల ఘనతకు భవిష్యత్తులోనూ ఆకాశమే హద్దు. -
డాకింగ్ సక్సెస్
సూళ్లూరుపేట/ సాక్షి బెంగళూరు: సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఇస్రో కలను సాకారం చేసేలా స్పేడెక్స్ జంట ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ (డాకింగ్) విజయవంతమైంది. దీంతో ప్రపంచంలో డాకింగ్ సాంకేతికతను సాధించిన నాలుగోదేశంగా భారత్ అవతరించింది. అత్యంత క్లిష్టమైన డాకింగ్ను పూర్తిచేసి ఇస్రో మరోసారి తన సత్తా చాటింది. దీంతో నూతన సంవత్సరంలో ఇస్రో విజయాల బోణీ కొట్టింది. ఇంతకాలం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమైన ఈ ఫీట్ను సాధించి ఇస్రో తన కీర్తికిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. ఈ మిషన్ లో పాలు పంచుకున్న సిబ్బందికి నా శుభాకాంక్షలు. భారత భవిష్యత్ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఈ డాకింగ్ తొలిమెట్టు’’ అని మోదీ హర్షం వ్యక్తం చేశారు.𝗦𝗽𝗮𝗗𝗲𝗫 𝗠𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗨𝗽𝗱𝗮𝘁𝗲:Following the docking, ISRO has successfully managed both satellites as a combined unit. In the upcoming days, ISRO will proceed with undocking and power transfer evaluations.#SPADEX #ISRO pic.twitter.com/tMmCcF5opG— ISRO InSight (@ISROSight) January 16, 2025గురువారం ఉదయం 9 గంటలకు చేజర్ (ఎస్డీఎక్స్01), టార్గెట్ (ఎస్డీఎక్స్02) అనే జంట ఉపగ్రహాలను అనుసంధానించామని, డాకింగ్ తర్వాత వీటిని ఒకే ఉపగ్రహంగా కంట్రోల్ చేస్తు న్నాం. త్వరలో మళ్లీ వీటిని దూరంగా విడగొడతాం. వీటి మధ్య ఇంధన, విద్యుత్ సరఫరా వ్యవస్థల బదిలీని పరీక్షిస్తాం’’ అని ఇస్రో గురువారం ప్రకటించింది. ‘‘ అంతరిక్ష చరిత్రతో భారత్ తన పేరును ‘డాకింగ్’చేసింది. స్పేడెక్స్ మిషన్ ద్వారా చరిత్రాత్మక స్థాయిలో డాకింగ్ విజయవంతమైంది. ఈ చిరస్మరణీయ క్షణానికి సాక్షిగా నిలిచినందుకు గర్విస్తున్నాం’’ అని ఇస్రో ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టింది. ఇస్రో తన డాకింగ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ‘‘అద్భుత ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఈ మిషSpaDeX Docking Update:🌟Docking SuccessSpacecraft docking successfully completed! A historic moment.Let’s walk through the SpaDeX docking process:Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…— ISRO (@isro) January 16, 2025వైఫల్యాల నుంచి విజయం దాకాగత ఏడాది డిసెంబర్ 30వ తేదీన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ– సీ60) రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్(స్పేడెక్స్) మిషన్ను చేపట్టారు. ఇందులోభాగంగా చెరో 220 కేజీల బరువైన చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను ప్రయోగించిన 15 నిమిషాల తర్వాత 475 కిలోమీటర్ల పొడవైన వేర్వేరు వృత్తాకార కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. తర్వాత వాటిని నెమ్మదిగా ఒకే కక్ష్యలోకి తీసుకొచ్చారు. వాటిని అనుసంధానించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. కానీ వేగాల్లో సారూప్యత లేకపోవడంతో డాకింగ్ సాధ్యంకాలేదు. చివరిసారిగా జనవరి 12వ తేదీన ఒకే కక్ష్యలో కేవలం 15 మీటర్ల సమీపానికి తీసుకొచ్చారు. తర్వాత దూరాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ మూడు మీటర్ల సమీపానికి తీసుకొచ్చారు. అయితే భూమ్మీది కమాండ్ సెంటర్ నుంచి స్పష్టంగా వీక్షించేందుకు సరిపడా వెలుతురు లేక, అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా డాకింగ్ను నిలిపేసి మళ్లీ వాటిని సురక్షిత దూరాలకు పంపేశారు. ఎట్టకేలకు గురువారం ఉదయం 9 గంటలకు అంతరిక్షంలో అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రెండు ఉపగ్రహాలను అత్యంత కచ్చితత్వంతో ఒకదానికొకటి జోడించేందుకు మళ్లీ డాకింగ్కు ప్రయత్నించారు. టార్గెట్ ఉపగ్రహం నుంచి 15 మీటర్ల దూరంలో ఉన్న చేజర్ ఉపగ్రహాన్ని తొలుత అత్యంత జాగ్రత్తగా 3 మీటర్ల సమీపానికి తెచ్చారు. లేజర్ రేంజ్ ఫైండర్, డాకింగ్ సెన్సార్లను ఉపయోగించి ఎట్టకేలకు చేజర్ ఉపగ్రహాన్ని టార్గెట్ ఉపగ్రహంతో డాకింగ్ చేశారు. భవిష్యత్తులో నిర్వహించబోయే చంద్రయాన్–4, గగన్యాన్ ప్రయోగాలకు కూడా ఈ డాకింగ్ సాంకేతికత దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన స్పేడెక్స్ ప్రయోగం బృందానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ అభినందనలు తెలియజేశారు.Dr. V. Narayanan, Secretary DOS, Chairman Space Commission and Chairman ISRO, congratulated the team ISRO.#SPADEX #ISRO pic.twitter.com/WlPL8GRzNu— ISRO (@isro) January 16, 2025 ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయ డం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు అద్భుతమైన మైలురాయిని సాధించారు. ఈ విజయంతో భవిష్యత్లో భారత్ చేపట్టే ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమాలకు కీలకమైన ముందడుగు పడింది. ఈ సందర్భంగా ఇస్రోకు అభినందనలు’ అంటూ గురువారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. Congratulations to our scientists at @isro and the entire space fraternity for the successful demonstration of space docking of satellites. It is a significant stepping stone for India’s ambitious space missions in the years to come.— Narendra Modi (@narendramodi) January 16, 2025 -
వచ్చేనెల్లో షార్ నుంచి రెండు ప్రయోగాలు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశో«ధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్లో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి రెండు పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలను చేపట్టనున్నది. డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59, 24న పీఎస్ఎల్వీ సీ60 రెండో రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. షార్లోని మొదటి ప్రయోగ వేదికకు సంబం«ధించి మొబైల్ సరీ్వస్ టవర్ (ఎంఎస్టీ)లో పీఎస్ఎల్వీ సీ59, పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ బిల్డింగ్లో పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ అనుసంధానం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముందుగా డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా–3 అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న తరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు. డిసెంబర్ 24న పీఎస్ఎల్వీ సీ60 ద్వారా రిశాట్–1బి అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఎల్వీఎం3–ఎం4 రాకెట్కు ఎలక్ట్రికల్ పరీక్షలు పూర్తి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): స్థానిక సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2.35 గంటలకు నిర్వహించనున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సంబంధించి ఎల్వీఎం3–ఎం4 రాకెట్కు శుక్రవారం ఎలక్ట్రికల్ పరీక్షలను పూర్తిచేశారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అదేవిధంగా ఇది గ్రహాంతర ప్రయోగం కావడంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని అంశాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు రోజూ అనేక రకాల పరీక్షలు చేసిన తర్వాత ప్రయోగాన్ని నిర్వహిస్తారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఈ నెల 14న చంద్రయాన్–3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆసక్తిగలవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని షార్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సందర్శకులు శుక్రవారం నుంచే https://lvg. shar.gov.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి పేరు, పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఆధార్ కార్డు, కోవిడ్ పరీక్ష సర్టిఫికెట్ కూడా ఉండాలని పేర్కొన్నారు. -
14న చంద్రయాన్–3 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): కీలకమైన చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఈ నెల 14న చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) గురువారం తెలిపింది. మొదటగా ఈ నెల 12న అని ప్రకటించింది. ఆ తర్వాత 13కు వాయిదా వేసింది. తాజాగా, 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగం ఉంటుందని షార్ వర్గాలు ప్రకటించాయి. స్వల్ప సాంకేతిక లోపాలను సరిచేసుకోవడంతో పాటు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే సమయంలోనే ప్రయోగిస్తారనే వాదన కూడా ఉంది. 2019లో చంద్రయాన్–2ను కూడా జులై 15న ప్రయోగించారు. షార్లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం పూర్తి చేసి గురువారం ఉదయాన్నే వ్యాబ్ నుంచి ప్రయోగవేదికకు అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ను 4 దశల్లో ప్రయోగిస్తే అదే జీఎస్ఎల్వీ రాకెట్ను మాత్రం 3 దశల్లోనే ప్రయోగిస్తారు. పీఎస్ఎల్వీ కంటే జీఎస్ఎల్వీ–మార్క్–2 రాకెట్ కొంచెం బరువు ఎక్కువ, 2 వేల కిలోలు బరువున్న ఉపగ్రహాలు తీసుకెళుతుంది. అదే ఎల్వీఎం మార్క్–3 అత్యంత శక్తివంతమై రాకెట్. ప్రెంచి గయానా కౌరు అంతరిక్ష కేంద్రం రూపొందించి ఏరియన్–5 రాకెట్ తరహాలో వుంటుంది. మూడు వేలు కిలోల నుంచి 6 వేలు కిలోల బరువైన ఉపగ్రహాలను సునాయాసంగా రోదసీలోకి తీసుకెళ్లగలుగుతుంది. ఈ రాకెట్కు అత్యంత శక్తివంతమైన రెండు స్ట్రాపాన్ బూస్టర్లు వుంటాయి. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్లో 200 టన్నుల ఘన ఇంధనం వుంటుంది. మొదటిదశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో వున్న 400 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశను పూర్తి చేస్తారు. 110 టన్నుల ద్రవ ఇం««ధనంతో (ఎల్–110)తో రెండోదశను, 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం (సీ–25)తో మూడోదశతో ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఈ రాకెట్ను రూపకల్పన చేశారు. ప్రయోగానికి ముందు తుది విడత మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని 11న నిర్వహించనున్నారు. అనంతరం ప్రయోగ సమయాన్ని, కౌంట్డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఈనెల 14న ప్రయోగమని తెలిపారు. ఎల్వీఎం3–ఎం4 రాకెట్ ప్రయోగసమయంలో 640 టన్నులు బరువు కలిగి వుంటుంది. 3,900 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్–3 ఉçపగ్రహాన్ని నింగివైపు మోసుకెళ్లనుంది. చంద్రయాన్–3 ఉపగ్రహంలో 2,148 కిలోలు బరువు కలిగిన ప్రపోల్షన్ మా డ్యూల్, 1,752 కిలోలు బరువు కలిగిన ల్యాండర్, 26 కిలోలు బరువు కలిగిన రోవర్లను అమర్చి పంపుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి 60 శాతం పనుల వరకు దేశంలోని 120 ప్రయివేట్ పరిశ్రమల సహకారం తీసుకున్నారు. -
28న జీఎస్ఎల్వీ–ఎఫ్12 కౌంట్డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 10.42 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్12) ప్రయోగించేందుకు ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్డౌన్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ప్రయోగానికి 27.30 గంటల ముందు కౌంట్డౌన్ నిర్వహిస్తారు. అయితే శనివారం ఎంఆర్ఆర్ సమావేశం, లాబ్ సమావేశం అనంతరం కౌంట్డౌన్ సమయం, ప్రయోగ సమయం అధికారికంగా ప్రకటించనున్నారు. శుక్రవారం షార్లోని బ్రహ్మప్రకాష్ హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించారు. రాకెట్లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేసి ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించిన అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి అప్పగించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరోమారు ల్యాబ్ సమావేశం నిర్వహించారు. జీఎస్ఎల్వీ ఎప్12 రాకెట్కు సంబంధించి లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. 26 గంటల కౌంట్డౌన్ అనంతరం సోమవారం 10.42 గంటలకు 2,232 కిలోలు బరువు కలిగిన నావిక్–01 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ రాకెట్ నింగి వైపుకు దూసుకెళ్లేందుకు షార్లోని రెండో ప్రయోగ వేదికపై సిద్ధంగా వుంది. కలాం స్ఫూర్తితో శాస్త్రవేత్తలుగా ఎదగాలి మిసైల్మ్యాన్ ఏపీజే అబ్దుల్కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ పిలుపునిచ్చారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రంలోని బ్రహ్మప్రకాష్ హాలులో దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన ఈ ఏడాది పదో తరగతిలోకి వెళ్లనున్న విద్యార్థులు 56 మందిని ఎంపిక చేసి యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో భాగంగా యువికా–2023 కార్యక్రమానికి ఆహ్వానించి తీసుకొచ్చారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్తో వర్చువల్ పద్ధతిలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సుమా రు గంటకు పైగా సమాధానాలు ఇచ్చి వారిని ఉత్తేజ పరిచారు. అనంతరం చైర్మన్ ఎస్.సోమనాథ్ మా ట్లాడుతూ ఈ తరం విద్యార్థులు ఎంతో తెలివైన వారని, వారిలో దాగివున్న సృజనాత్మకతను బయటకు తీస్తే మంచి పౌరులుగా తయారవుతారని తెలిపారు. నేటి తరం విద్యార్థులు స్పేస్ టెక్నాలజీ వైపు రాకుండా ఇతర రంగాలవైపు మొగ్గు చూపుతు న్న నేపథ్యంలో వారిని స్పేస్ సైన్స్ వైపు మళ్లించేందుకు యువ విజ్ఞాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామ ని చెప్పారు. రాకెట్లు, ఉపగ్రహాలు, ఆర్బిట్లు అనే వి మేథమేటిక్స్తో ఎక్కువగా ముడిపడి ఉంటా యని అన్నారు. అందుకే మేథమేటిక్స్లో మంచి ప్రావీ ణ్యం ఉంటే ఇస్రో శాస్త్రవేత్తలుగా రావడానికి ఎంతో వీలుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, షార్ కంట్రోలర్ శ్రీని వాసులురెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ ఆర్.వెంకట్రా మన్, గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పీఎస్ఎల్వీ సీ54’కు కౌంట్డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్డౌన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25.30 గంటల కౌంట్డౌన్ కొనసాగాక శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్వీ సీ54 రాకెట్ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం షార్లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో తుది విడతగా రాకెట్కు తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ చేపట్టారు. అనంతరం కౌంట్డౌన్ సమయాన్ని శుక్రవారం ఉదయం 10.26 గంటలకు, ప్రయోగ సమయాన్ని శనివారం ఉదయం 11.56 గంటలకని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగం ద్వారా తొమ్మిది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో ఇస్రోకు చెందిన ఈఓఎస్–06 ఉపగ్రహంతో పాటు ఎనిమిది ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది. శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమయ్యాక రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో 56వ ప్రయోగం. పీఎస్ఎల్వీ ఎక్స్ల్ వెర్షన్లో 24వ ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రానికి చేరుకోనున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం బెంగళూరు అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి శ్రీహరికోటకు చేరుకోనున్నారు. పీఎస్ఎల్వీ సీ54 రాకెట్కు ఆయన మరోమారు తనిఖీలు నిర్వహించి కౌంట్డౌన్ను స్వయంగా పర్యవేక్షిస్తారు. -
పీఎస్ఎల్వీ– సీ53 ప్రయోగానికి ‘షార్’ సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలో రెండో ప్రయోగానికి సిద్ధమవుతోంది. కరోనా పూర్తిగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రయోగాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో పీఎస్ఎల్వీ–సీ53 ప్రయోగం ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ ప్రయోగంలో ఈవోఎస్ (అకా ఓషన్శాట్–3) అనే ఉపగ్రహంతో పాటు మరో 5 చిన్న ఉపగ్రహాలను పంపనున్నారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగాన్ని మార్చి 15న ప్రయోగాత్మకంగా నిర్వహించి నిర్థారించుకున్న తరువాత మార్చి 25 నుంచి 31 లోపు ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని కూడా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
Chandrayaan-2: జాబిల్లిని ముద్దాడి రెండేళ్లు
సూళ్లూరుపేట: చందమామ రహస్యాలు, గుట్టుమట్లను విప్పడమే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. చంద్రయాన్–2ను ప్రయోగించి రెండేళ్లు పూర్తయ్యాయి. 2019లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్–2ను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం బెంగళూరులో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చంద్రయాన్–2లో భాగంగా మొదట ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి చంద్రుడి వైపు సుమారు కోటి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్య సమీపానికి చేరుకుంది. సెప్టెంబర్ 6న ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జాబిల్లి రహస్యాలను తెలుసుకోవడానికి వీలుగా మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను అమర్చి పంపారు. శాటిలైట్.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను చంద్రుడిపై సురక్షితంగా జారవిడిచింది. అయితే చివరి రెండు నిమిషాల్లో ఆందోళన నెలకొంది. ల్యాండర్ చంద్రుడిపై దిగే క్రమంలో దాని ఉపరితలాన్ని ఢీకొనడంతో రోవర్ కనిపించకుండా పోయింది. దీంతో ల్యాండర్, రోవర్ల నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ దేశాల సాయం తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. జాబిల్లిపై పలు పరిశోధనలు చేస్తూ ఛాయాచిత్రాలను అందించడంలో విజయవంతంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు పరిభ్రమించి అద్భుతమైన సమాచారాన్ని భూమికి చేరవేసింది. చంద్రుడిపై తేమ ఉనికి.. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇస్రో సోమవారం నుంచి రెండు రోజులపాటు బెంగళూరులో లూనార్ సైన్స్ వర్క్షాప్ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం మాట్లాడుతూ.. చంద్రయాన్–2లో ఐదు ఉపకరణాలు ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ రెండేళ్లలో ఆర్బిటర్ పంపిన సమాచారాన్ని మీడియాకు వివరించారు. కొన్ని రోజుల క్రితం చంద్రుడి ఉపరితలంపై హైడ్రాక్సిల్ నీటి అణువులను ఆర్బిటర్ కనుగొందన్నారు. ఈ సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. చంద్రుడిపై తేమ ఉనికి ఉన్నట్టుగా కూడా తెలుస్తోందన్నారు. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా పరిభ్రమిస్తూ ఎప్పటికప్పుడు డేటాను ఇస్తోందని తెలిపారు. ఆర్బిటర్తోపాటు ఐదు పేలోడ్స్.. వాటి పనులివే.. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసింది. ఆర్బిటర్.. చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇందులో అమర్చిన లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్.. చంద్రుడి ఉపరితలంపై ప్రధాన మూలకాలను మ్యాపింగ్ చేస్తుంది. ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్.. చంద్రుడిపై నీరు, మంచు వంటి వాటి ఉనికిని శోధిస్తుంది. ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్.. చంద్రుడిపై ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని అందజేస్తుంది. టెరియన్ మ్యాపింగ్ కెమెరా.. చంద్రుడిపై ఖనిజాల అధ్యయనానికి అవసరమైన త్రీడీ మ్యాప్లను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. కొనసాగింపుగా చంద్రయాన్–2 అతి తక్కువ ఖర్చుతో ఇస్రో 2008లో తొలిసారిగా చంద్రయాన్–1 ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి కక్ష్యలో ఉపగ్రహాన్ని తిప్పి పరిశోధనలు చేసింది. చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసేలా రూపొందించగా సాంకేతిక లోపంతో పది నెలలు మాత్రమే పనిచేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి చరిత్ర సృష్టించింది. దీనికి కొనసాగింపుగా చంద్రయాన్–2ను ప్రయోగించారు. -
జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలమయ్యింది. మూడో దశలో రాకెట్ గతి తప్పింది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్(జీఎస్ఎల్వీ ఎఫ్–10) ప్రయోగించేందుకు బుధవారం వేకువజామున 3.43 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించారు. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ను ప్రయోగించారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య రావడంతో ప్రయోగం విఫలమయ్యింది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్–03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ఉపయోగించాల్సి వుంది. ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (6 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (158 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ షార్ట్ వేవ్–ఇన్ఫ్రారెడ్ (256 బాండ్స్) పేలోడ్స్గా అమర్చారు. ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపించేవిధంగా రూపొందించారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలమైంది. -
ఏప్రిల్ 18న నింగిలోకి జీఐశాట్–1
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐశాట్–1) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. గత ఏడాది నుంచి పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ శాటిలైట్ ప్రయోగాన్ని ఆదివారం (28వ తేదీ) నిర్వహించాల్సి ఉంది. అయితే మరోమారు వాయిదా వేసుకుని, ఏప్రిల్ 18న నిర్వహిస్తామని బెంగళూరులోని అంతరిక్ష కేంద్రం ప్రధాన కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటించారు. ఉపగ్రహంలో చిన్నపాటి సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగా వాయిదా వేశామని పేర్కొన్నారు. అనేక సార్లు వాయిదా.. షార్ ప్రణాళిక ప్రకారం ఈ ఉపగ్రహ ప్రయోగం 2020 జనవరి 15న నిర్వహించాల్సి ఉండగా, సాంకేతిక పరమైన కారణాలతో 2020 ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. సాంకేతిక లోపాలను సరిచేసే క్రమంలో ఫిబ్రవరి 25కు, తర్వాత మార్చి 5కు ప్రయోగాన్ని రెండు సార్లు వాయిదా వేశారు. 2020 మార్చి 5న కౌంట్డౌన్ ప్రక్రియను కూడా ప్రారంభించిన తరువాత ప్రయోగాన్ని నిలిపివేసి, వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా లాక్డౌన్ కారణంగా సుదీర్ఘకాలం వాయిదా పడింది. తిరిగి ఈ ఏడాదిలో రెండో ప్రయోగంగా దీనిని చేపట్టగా మళ్లీ వాయిదా పడటం విశేషం. ఇస్రో చరిత్రలో ఇదో నూతన అధ్యాయం జీఎస్ఎల్వీ ఎఫ్–10 (జీఎస్ఎల్వీ మార్క్–2) రాకెట్ ద్వారా 2,100 కిలోల బరువు కలిగిన సరికొత్త రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూర పరిశీలనా ఉపగ్రహం) ‘జీఐశాట్–1’ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ను భూమికి 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో వున్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. మొట్ట మొదటిసారిగా జీఐశాట్–1ను భూస్థిర కక్ష్యలోకి పంపిస్తుండటం విశేషం. -
అర్ధసెంచరీకి అడుగు దూరంలో..
సాక్షి, సూళ్లూరుపేట: షార్ కేంద్రం నుంచి ఇప్పటి వరకూ చేసిన ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ రాకెట్దే అగ్రతాంబూలం. 74 ప్రయోగాల్లో 49 పీఎస్ఎల్వీ రాకెట్లే ఉన్నాయి. 1993 సెప్టెంబర్ 20న తొలిసారిగా పీఎస్ఎల్వీ డీ–1, 2017 ఆగస్ట్ 31న ప్రయోగించింది. 27ఏళ్ల ముందు మొదలైన విజయపరంపర కొనసాగుతోంది. 49 ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలమయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) రాకెట్ బహుళ ప్రయోజనకారిగా మారి ఇస్రో చరిత్ర, గతినే మార్చేసింది. పీఎస్ఎల్వీ రాకెట్ ఇస్రోకు నమ్మకమైన బ్రహ్మాస్త్రంలా తయారైంది. బుధవారం ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్తో పీఎస్ఎల్వీ సిరీస్ అర్ధసెంచరీని పూర్తి చేసుకోనుంది. ఇస్రోకు దేశీయంగానే కాకుండా వాణిజ్యపరమైన ప్రయోగాల్లోనూ అగ్రస్థానంలో వెలుగొందుతూ బహుళ ప్రయోజనకారిగా దోహదపడుతోంది. దేశీయంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలతో పాటు అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్తూ ఆదాయ గనిగా మారింది. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకే సారి పది ఉపగ్రహాలు, మళ్లీ 20 ఉపగ్రహాలు, ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్ఎల్వీకే సొంతం. ఇప్పటివరకు 49 పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 310 విదేశీ ఉపగ్రహాలు, 46 స్వదేశీ ఉపగ్రహాలు, దేశంలోని పలు యూనివర్సిటీలకు 10 స్టూడెంట్ ఉపగ్రహాలను పంపించి ఇస్రో ప్రగతికి బాటలు వేస్తోంది. కంటికి రెప్పలా.. దేశీయ అవసరాల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భూమిని అన్ని రకాలుగా పరిశోధన చేసే రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను (రిశాట్) ప్రయోగిస్తోంది. దేశ భద్రతకు సంబంధించి కంటికిరెప్పలా కాపాడుతోంది. సరిహద్దులో జరిగే చొరబాట్లను పసిగడుతోంది. ఇప్పటివరకు రెండు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు మూడోసారి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ – 48 రాకెట్ ద్వారా రిశాట్ – 2బీఆర్1 అనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపగ్రహ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్ను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. 2012 ఏప్రిల్ 20 పీఎస్ఎల్వీ సీ – 19 రాకెట్ ద్వారా రిశాట్ – 2 అనే ఉపగ్రహాన్ని పంపించారు. దీని కాలపరిమితి పూర్తవడంతో ఈ ఏడాది మే 22న పీఎస్ఎల్వీ సీ 4–6 రాకెట్ ద్వారా రిశాట్ – 3బీ అనే ఉపగ్రహాన్ని పంపించారు. ఈ ఉపగ్రహాల్లో అమర్చిన పేలోడ్స్ భూమ్మీద 20 గీ 30 సెంటీమీటర్ల వ్యాసార్థంలో మాత్రమే ఛాయా చిత్రాలు తీసేవి. సీ – 48లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఎక్స్బాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ భూమ్మీద జరిగే మార్పులను 10 సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఉండే చిన్నవాటినైనా సరే అత్యంత నాణ్యమైన చిత్రాలను పంపించే సామర్థ్యం కలిగి ఉంది. దేశ సరిహద్దుల్లో జరిగే అక్రమ చొరబాట్లు, పంటల విస్తీర్ణం, సాగువిస్తీర్ణం, అడవులను పరిశోధించడమే కాకుండా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనైనా అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాలు తీసి పంపిస్తుంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్ భూమికి 576 కిలోమీటర్ల ఎత్తు నుంచి దేశానికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. రాత్రీ పగలు అనే తేడా లేకుండా అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాలు తీసే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంది. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు రోదసీలో ఉండి పనిచేస్తుంది. భవిష్యత్తులో రి«శాట్ ఉపగ్రహాలను పెంచుకునే దిశగా ఇస్రో అడుగులేస్తోంది. -
రేపు సా.3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ–48 ప్రయోగం
-
నేడు పీఎస్ఎల్వీ సీ–48కి కౌంట్డౌన్
సూళ్లూరుపేట : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ‘షార్’ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ–48కు మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించేందుకు ఇక్కడి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం ఉ.9.30 గంటలకు ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఉపగ్రహం లాంచ్ రిహార్సల్ను సోమవారం ఉ.6 గంటలకు విజయవంతంగా నిర్వహించారు. అయితే, కౌంట్డౌన్ సమయంలో మార్పుచేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం సాయంత్రం ‘షార్’కు విచ్చేయనున్నారు. ముందుగా ఆయన తిరుమల, శ్రీకాళహస్తిలలో దర్శనాలు చేసుకున్న అనంతరం చెంగాళమ్మ ఆలయం వద్ద పూజలు చేయడానికి వస్తారని షార్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం ప్రయోగించబోయే పీఎస్ఎల్వీ సీ–48 ప్రయోగంతో పీఎస్ఎల్వీ సిరీస్ అర్ధ సెంచరీ పూర్తిచేసుకోనుంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఇప్పటిదాకా 49 పీఎస్ఎల్వీ ప్రయోగాలు చేయగా వీటిలో రెండు మాత్రమే విఫలమయ్యాయి. -
ఇస్రో విజయ విహారం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి జయ కేతనం ఎగురవేసింది. విజయాల పరంపరను కొనసాగిస్తూ షార్ నుంచి 74వ ప్రయోగాన్ని బుధవారం విజయవంతంగా ముగించింది. నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ ద్వారా 1625 కిలోలు బరువు కలిగిన కార్టోశాట్–3 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. 14 ఉపగ్రహాలను భూమికి 509 కిలోమీటర్లు ఎత్తులోని వృత్తాకార సూర్యానువర్తన ధ్రువకక్ష్య (సర్క్యులర్ సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో వివిధ దశల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగ విజయంతో ఈ ఏడాది అయిదు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్లయింది. ప్రయోగానంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ బృందాన్ని ఆలింగనం చేసుకోగా, శాస్త్రవేత్తలు తమ సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. వచ్చే మార్చిలోపే 13 మిషన్ల ప్రయోగం 2020 ఏడాది మార్చి 31లోపు 13 మిషన్లను ప్రయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. ఇందులో ఆరు లాంచింగ్ వెహికల్స్, 7 ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు. రాబోయే నాలుగు నెలలు ఇస్రో కుటుంబం తీరికలేకుండా పనిచేయాల్సి ఉంటుందన్నారు. షార్ నుంచి 74 ప్రయోగాలు చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ను 49సార్లు ప్రయోగించగా 47సార్లు సక్సెస్ అయ్యింది. పీఎస్ ఎల్వీ ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో 21 ప్రయోగమిది. ఈ ఏడాది 5వ ప్రయోగం కావడం విశేషం. కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్లో ఈ ప్రయోగం తొమ్మిదవది. మనదేశ ఖ్యాతి మరింత పైకి: జగన్ సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భూతల మ్యాపింగ్, ఛాయాచిత్రాలను మరింత అత్యాధునికంగా తీసి సమాచారాన్ని పంపే ఈ ఉపగ్రహాల ప్రయోగంతో ప్రపంచంలోనే మన దేశ ఖ్యాతిని శాస్త్రవేత్తలు అగ్రభాగాన నిలిపారని జగన్ ప్రశంసించారు. ఈ ప్రయోగాలను విజయవంతం చేయడం ద్వారా ఇస్రో మరో మైలురాయిని చేరుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కేసీఆర్ అభినందనలు.. సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అభినందించారు. భారతీయ శాస్త్రవేత్తల నైపుణ్యం, కృషికి ప్రస్తుత విజయం తార్కాణంగా నిలుస్తుందన్నారు. దేశీయ అవసరాలకే కార్టోశాట్–3 దేశీయ బౌగోళిక అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్ సిరీస్ ఉపగ్రహ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. కార్టోశాట్ సిరీస్లో ఇప్పటికే ఎనిమిది ఉపగ్రహాలను పంపించగా, ఇది తొమ్మిదవది. కార్టోశాట్–3 థర్డ్ జనరేషన్ ఉపగ్రహం కావడం విశేషం. గతంలో ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహాల కంటే ఈ ఉపగ్రహం అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన ప్రాంకోమాటిక్ మల్టీ స్ప్రెక్ట్రరల్ కెమెరాలు అత్యంత శక్తిమంతమైనవి. దీనిద్వారా పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్లు తయారు చేయడం, విపత్తులను విస్తృతిని అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. ప్రత్యేకించి నిఘాలో సైనిక అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతోంది. ఈ ఉపగ్రహం అయిదేళ్లుపాటు సేవలు అందిస్తుంది. -
మహిళా శక్తి @ చంద్రయాన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్టు సమాచారం. అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తామేమీ తక్కువ కాదన్నట్టుగా చంద్రయాన్–2 ప్రయోగంలో 30 శాతం మంది మహిళలు ఎంతో కృషి చేశారు. త్రీ–ఇన్–ఒన్గా భావిస్తున్న చంద్రయాన్–2 ప్రాజెక్టులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పని చేసి ల్యాండర్, రోవర్ను రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం కూడా ఉంది. ఇందులో కొంతమందిని మాత్రమే ఇక్కడ ఉదహరిస్తున్నాము. భారతదేశానికి ఎంతో తలమానికంగా నిలిచే ఈ ప్రయోగంలో మహిళా శాస్త్రవేత్తల కృషి దాగి ఉండడం విశేషం. ఇస్రోలో 30 మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా ఈ ప్రయోగంలో రీతూ కరిథల్ మిషన్ డైరెక్టర్గా, ఎం.వనిత ప్రాజెక్టు డైరెక్టర్గా అత్యంత కీలకంగా ఉన్నారు. బాలు శ్రీ దేశాయ్, డాక్టర్ సీత, కె.కల్పన, టెస్సీ థామస్, డాక్టర్ నేహ సటక్ అనే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములై మహిళాశక్తిని నిరూపించారు. ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ రీతూ.. చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్గా వ్యవహరించిన రీతూ కరిథల్ ‘‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’’గా ఇస్రోలో అందరూ పిలుస్తుంటారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలో కూడా ఈమె డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్గా పనిచేశారు. ఈమె 2007లో మాజీ రాష్ట్రపతి, అణుపరీక్షల నిపుణులు డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డును కూడా అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్లో అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఉపగ్రహాల తయారీలో దిట్ట.. చంద్రయాన్–2 ప్రాజెక్టుకు డైరెక్టర్గా పనిచేసిన ఎం.వనిత ఉపగ్రహాల రూపకల్పనలో నిపుణురాలు. ఆమె డిజైన్ ఇంజినీర్గా శిక్షణ తీసుకుని చంద్రయాన్–2 అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. ‘‘ఆస్ట్రనామికల్ సొసైటీ అఫ్ ఇండియా ’’నుంచి 2006లో బెస్ట్ ఉమెన్ సైంటిస్టు అవార్డును అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్ బాధ్యతలన్నింటిని వనిత చూసుకుని ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు: గవర్నర్ చంద్రయాన్–2 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో చంద్రయాన్2 మిషన్ భారీ ముందడుగు అని అన్నారు. గొప్ప ముందడుగు: ఏపీ సీఎం జగన్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం అయినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను అభినందించారు. అంతరిక్ష రంగంలో ఈ విజయం అతి గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ విజయంతో భారత్ చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్న దేశాల సరసన చేరిందని అన్నారు. సీఎం కేసీఆర్ అభినందనలు చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో భారతీయ శాస్త్రవేత్తల కఠోర శ్రమ, మేథా సంపత్తి దాగి ఉందని కొనియాడారు. -
చంద్రుడి గుట్టు విప్పేందుకే..!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): చంద్రుడు ఎలా ఉద్భవించాడు? చంద్రుడి ఉపరితలంపై ఉన్న మూలకాలు ఏంటి? భూమి ఏర్పడిన తొలినాళ్లలో చంద్రుడిలాగే ఉండేదా? అనే విషయాలను అధ్యయనం చేయడం కోసమే ఇస్రో చంద్రయాన్–2ను ప్రయోగించింది. చంద్రుడిని అధ్యయనం చేయడం వల్ల తొలినాళ్లలో భూవాతావరణం ఎలా ఉండేదన్న విషయాన్ని అర్థం చేసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు పదేళ్లపాటు కష్టపడ్డారు. జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్–2 కాంపోజిట్ మాడ్యూల్స్లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉంటాయి. ముందుగా ఆర్బిటర్ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ అక్కడి సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. అనంతరం కొద్దిసేపటికే ల్యాండర్ నుంచి రోవర్ బయటకొచ్చి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు జరుపుతుంది. ఈ మూడు పరికరాలు సమన్వయంతో పనిచేస్తూ బెంగళూరులోని బైలాలులోని భూనియంత్రిత కేంద్రానికి డేలా పంపిస్తాయి. ఇందులో ల్యాండర్ 14 రోజులే పనిచేస్తుంది. ఆర్బిటర్ చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఏడాది పాటు సేవలు అందిస్తుంది. ఈ ప్రయోగానికి రూ. 978 కోట్లు వెచ్చించారు. ల్యాండర్ ‘విక్రమ్’అత్యంత కీలకం.. చంద్రయాన్2 మిషన్లోని ల్యాండర్ను శాస్త్రవేత్తలు ‘విక్రమ్’గా నామకరణం చేశారు. 1471 కేజీల బరువున్న ఈ ల్యాండరే ప్రయోగంలో అత్యంత కీలకమైనది. ఇలా చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ను దించే ప్రయత్నం చేస్తున్న మొట్టమొదటి దేశం భారతే కావడం విశేషం. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా దేశాలు బాల్స్ ద్వారా రోవర్లు పంపారు. అయితే భారత్ మాత్రం నేరుగా ల్యాండర్ను దించే ప్రయత్నం చేస్తోంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడిపైకి దిగే 15 నిమిషాలే ఈ ప్రయోగంలో కీలకమైనవి. ల్యాండర్ ‘విక్రమ్’చంద్రుడివైపు నిమిషానికి 2 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే ప్రక్రియ సంక్లిష్టమైంది. ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగగలిగితే ప్రయోగం సక్సెస్ అయినట్లే. ఈ ల్యాండర్లో శాస్త్రవేత్తలు 3 పేలోడ్స్ను అమర్చారు. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ‘థర్మో–ఫికల్ ఎక్స్ఫర్మెంట్’ప్లాస్మా సాంద్రతను పరిశోధించేందుకు ‘లాంగ్ ముయిర్ ప్రోబ్’, చంద్రుని మూలాలను తెలుసుకోవడానికి ‘ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీయాస్మిక్ యాక్టివిటి’అనే పరికాలను చంద్రయాన్–2లో ప్రయోగించారు. ప్రజ్ఞాన్ ‘రోవర్’తో త్రీడీ చిత్రాలు ఓసారి ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్నాక అందులోని రోవర్ విడిపోతుంది. దీనికి ‘ప్రజ్ఞాన్’ అని పేరుపెట్టారు. 27 కిలోల బరువుంటే ప్రజ్ఞాన్ సౌరశక్తితో ప్రయాణిస్తుంది. సెకన్కు ఒక సెంటీమీటర్ చొప్పున చంద్రుడిపై రోజుకు 500 మీటర్లు ప్రయాణిస్తూ అక్కడి ఉపరితలంపై ఉన్న అణువులను విశ్లేషించి డేటాను ల్యాండర్కు పంపుతుంది. ల్యాండర్ ఈ డేటాను ఆర్బిటర్కు చేరవేస్తే, అక్కడి నుంచి సమాచారం బెంగళూరులోని భూనియంత్రిత కేంద్రానికి చేరుతుంది. ఈ రోవర్కు ముందుభాగంలో మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు మోనోక్రోమాటిక్ నావ్ కెమెరాలున్నాయి. ఇవి ప్రజ్ఞాన్ ఉన్న ప్రదేశానికి సంబంధించిన 3డీ ఫొటోలను పంపుతాయి. ఈ రోవర్లో 2 పేలోడ్స్ ఉన్నాయి. ఇందులోని ఆల్ఫా పర్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, లాజర్ ఇన్డ్యూసెడ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే పరికరాలు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? అక్కడి పరిస్థితులు ఏంటి? అనే విషయాలతో పాటు పలు అంశాలపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టనుంది. ఈ రోవర్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన లాజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే పరికరాన్ని కూడా అమర్చారు. ఈ పరికరం చంద్రుడి అంతర్భాగంతో ఏముందో పరిశోధించి నాసాకు పంపిస్తుంది. ఆర్బిటర్లో అయిదు పేలోడ్స్ ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. దీంట్లో 5 పేలోడ్స్ వున్నాయి. ‘లార్ట్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్’అనే ఉపకరణం చంద్రుడి ఉపరితలంపై ప్రధాన మూలకాల మ్యాపింగ్ చేపడుతుంది. ‘ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్’చంద్రునిపై నీరు, మంచు జాడను అన్వేషిస్తుంది. ఇక ‘ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రో మీటర్’ ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని చేరవేస్తుంది. ‘టెరియన్ మ్యాపింగ్ కెమెరా’ ఖనిజాల అధ్యయనం, త్రీడీ మ్యాపింగ్లో సాయపడనుంది. -
భారత సంకల్పానికి నిదర్శనం
న్యూఢిల్లీ: చంద్రయాన్–2 ప్రయోగం మన శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలను, శాస్త్రరంగంలో కొత్త లక్ష్యాలను సాధించాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని ట్విట్టర్ ద్వారా ఈ ప్రయోగంలో పాలు పంచుకున్నవారందరికీ ఆడియో మెసేజ్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రయాన్–1 ప్రయోగంలో ఏర్పడిన అవాంతరాలను శాస్త్రవేత్తలు అధిగమించారు. ఈ ప్రయోగం ద్వారా వారి పట్టుదల, సంకల్పం మరోసారి రుజువయ్యాయి. ప్రతి భారతీయుడు ఎంతో గర్వపడుతున్నాడు’ అని పేర్కొన్నారు. ‘ఈ ప్రయోగం ద్వారా భారత్కు కొత్త ఉత్సాహం వచ్చింది. చంద్రుని గురించిన మరెన్నో విషయాలు తెలిసే అవకాశాలున్నాయి..ఇప్పటి వరకు ఎవరూ చేపట్టని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంపై అధ్యయనం జరగనుంది. ఘనమైన మన దేశ చరిత్రలో ఇది చాలా ప్రత్యేకమైన సమయం’ అని పేర్కొన్నారు. భారీ టీవీ స్క్రీన్పై చంద్రయాన్–2 ఉపగ్రహం ప్రయోగాన్ని తిలకిస్తున్నట్లు ఉన్న తన ఫొటోలను కూడా ప్రధాని జత చేశారు. ట్విట్టర్ ఆడియో సందేశంలో ప్రధాని.. ఇస్రో చైర్మన్ కె.శివన్తోపాటు శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు. నైపుణ్యం, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం కలిగిన మన శాస్త్రవేత్తలు ఎలాంటి సవాల్నైనా స్వీకరిస్తారనేందుకు ఇది గొప్ప ఉదాహరణ అని తెలిపారు. ‘సవాల్ ఎంత పెద్దదైతే, పట్టుదల కూడా అంతే ఉంటుంది. ప్రయోగం వారం ఆలస్యమైనా సరే, చంద్రయాన్–2 చంద్రుని చేరాలనే లక్ష్యం మాత్రం మారలేదు. ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపైకి మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం చేరనుంది. అలాగే, చంద్రునిపైకి చేరనున్న నాలుగో దేశం భారత్ కానుంది’ అని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలకు పార్లమెంట్ అభినందనలు చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభించిన ఇస్రో శాస్త్రవేత్తలను పార్లమెంట్ అభినందించింది. ఈ ప్రయోగం ద్వారా దేశ అంతరిక్ష ప్రయోగాల్లో భారత దేశం ఆధిక్యత మరోసారి రుజువైందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ‘మన శాస్త్రవేత్తలు సాధించిన ఘనత దేశానికి గర్వకారణం. భారత శాస్త్రవేత్తలకు, ఇందుకు తోడ్పాటు అందించిన ప్రధాని మోదీకి అభినందనలు’ అని స్పీకర్ అన్నారు. దేశీయ పరిజ్ఞానంతో చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు. నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన సమయం: కాంగ్రెస్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ ఘనత తమ పాలనతోనే సాధ్యమైందని కాంగ్రెస్ అంటుండగా, భవిష్యత్తు నాయకత్వం కనిపించనప్పుడు గతాన్ని తవ్వుకోవడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ తిప్పికొట్టింది. చంద్రయాన్–2పై కాంగ్రెస్ పార్టీ ..‘ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన మంచి సమయమిది. అంతరిక్ష పరిశోధనలకు గాను 1962లో ఆయన ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను ఆ తర్వాత ఇస్రోగా పేరు మార్చారు. అలాగే, ప్రధాని మన్మోహన్సింగ్ 2008లో చంద్రయాన్–2కు ఆమోదం తెలి పారు’ అని తెలిపింది. దీనిపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. ‘ఇది నిజంగా దిగజారుడుతనం. ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన ఈ క్షణాన్ని రాజకీయం చేయడం తగదు’ అని పేర్కొన్నారు. -
చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!
శ్రీహరికోట(సూళ్లూరుపేట): నెలలో సగం రోజులు చీకటిలో ఉండి, మరో సగం రోజులు చల్లని వెన్నెల కురిపించే నెల రాజు గురించి తెలుసుకోవడానికి 60 ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. చందమామ విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. చంద్రుని చుట్టు కొలత 10,921 కిలోమీటర్లు అని నాసా శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. నానాటికీ చంద్రుని పరిమాణం కూడా తగ్గిపోతోందనే విషయం కూడా వారి పరిశోధనల్లోనే వెల్లడైంది. అదే విధంగానే చంద్రుడు భూమికి మధ్య దూరం పెరిగిపోతోందని, ఏడాదికి సుమారు 15 అంగుళాల చొప్పున చంద్రుడు దూరంగా వెళుతున్నాడని కూడా నాసా వెల్లడించింది. ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలు చాలా వరకు ఇప్పటికి 125 ప్రయోగాలు చంద్రుడిపైకి చేపట్టినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 1958 నుంచి అమెరికా చంద్రుడిపై పరిశోధనలను ప్రారంభించింది. 12 ప్రయోగాలు చేసిన తరువాత 13వ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించగలిగింది. అలా ఇప్పటిదాకా 58 ప్రయోగాలు చేసి 41 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. 1969లో అపోలో రాకెట్ ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్ అనే ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించిన ఘనత అమెరికాదే. ఈ ప్రయోగం జరిగి కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. రష్యా 1958 నుంచి చంద్రునిపైకి 53 ప్రయోగాలు చేసింది. అందులో 35 మాత్రమే విజయం అయ్యాయి. 1990 నుంచి జపాన్ ఆరు ప్రయోగాలు సొంతంగా, ఒక్క ప్రయోగం నాసాతో కలిసి చేసింది. ఇందులో ఐదు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 2010 నుంచి చైనా ఏడు ప్రయోగాలు చేయగా ఒక్క ప్రయోగం మాత్రమే చంద్రుని దాకా వెళ్లగలిగింది. ఇజ్రాయెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రునిపైకి ల్యాండర్ను çపంపించినా అది విజయవంతం కాలేదు. జర్మనీ 2003లో చంద్రుని మీదకు ఆర్బిటర్ను విజయవంతంగా పంపించింది. 2008లో భారత్ చంద్రుడి మీదకు చంద్రయాన్–1 పేరుతో ఆర్బిటర్ ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని కనుగొంది. అమెరికా, రష్యా, జపాన్, చైనా, జర్మనీ, ఇజ్రాయెల్, భారత్ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగాలు చేసినప్పటికీ అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలే ఇప్పటికీ ముందంజలో ఉన్నాయి. తాజాగా, భారత్ రెండో సారి ఆర్బిటర్ ద్వారా ల్యాండర్ను చంద్రుని ఉపరితలంపై దింపి అందులో అమర్చిన రోవర్తో చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, రోవర్ను ల్యాండర్ ద్వారా పంపి దాన్ని చంద్రుడిపైకి దించడం మాత్రం చేస్తున్నది భారత్ మాత్రమేనని చెప్పుకోవచ్చు. చంద్రుడు, అంగారకుడు మీదకు రోవర్లు పంపిన వారు పెద్ద పెద్ద బాల్స్ వంటి వాటిలో రోవర్లను అమర్చి పంపారు. భారత్ మాత్రం ల్యాండర్ను చందమామపై దించే మొట్టమొదటి దేశంగా ఖ్యాతి సాధిస్తోంది. -
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే
శ్రీహరికోట: చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినందుకు గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ తెలిపారు. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిందని వెల్లడించారు. ‘సాంకేతిక కారణాలతో ప్రయోగం నిలిచినా మేం మళ్లీ పుంజుకున్నాం. ప్రయోగానికి కొద్దిసేపటి ముందు సమస్యను గుర్తించగానే మా బృందం రంగంలోకి దిగింది. అప్పట్నుంచి 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించి చంద్రయాన్–2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశాం. జీఎస్ఎల్వీ మార్క్–3 చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించడం ఎంతో సంతోషంగా ఉంది. మేం అనుకున్న దానికంటే 6,000 కి.మీ ఎత్తులో చంద్రయాన్–2ను వాహకనౌక విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చారిత్రాత్మక ప్రయాణం మొదలైంది. కేవలం భారత్ ఒక్కటే కాదు. ప్రపంచమంతా చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కావాలని ఎదురుచూసింది. మేం దాన్ని సాధించాం. చంద్రయాన్–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా సిబ్బందే ఉన్నారు. వీరిలో శాస్త్రవేత్తలు రీతూ కరిథల్, ఎం వనితలు కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్–2 ప్రయోగం ఇంకా పూర్తికాలేదు. చంద్రుడిపై ల్యాండర్ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైనవి. ఈ దశను ల్యాండర్ దాటితే ప్రయోగం విజయవంతం అయినట్లే. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. -
అందరి చూపూ ఇక సెప్టెంబర్ 7 వైపు!
హమ్మయ్యా...! ఒక ఘట్టం ముగిసింది. చంద్రయాన్ –2 ప్రయోగం విజవంతమైంది. ఇంకేముంది.. అంతా హ్యాపీయేనా?. ఊహూ.. అస్సలు కాదు. ఇస్రోకు అసలు పరీక్ష ముందుంది. కచ్చితంగా చెప్పాలంటే సెప్టెంబరు 7వ తేదీన! ఆ రోజు ఏం జరగబోతోంది? చక్కగా వేసిన రహదారిపై వాహనాన్ని నడపడం చాలా సులువే. రహదారి అస్సలు లేకపోతేనే సమస్య. ఇస్రో పరిస్థితి ఇప్పుడు ఇదే. ఇప్పటివరకూ ఎవ్వరూ చేయని విధంగా జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ –2ను దింపాలన్న ఇస్రో ఆలోచన చాలా సమస్యలతో కూడుకున్నది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ స్వయంగా అంగీకరించారు కూడా. జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్ –2 ముందుగా భూమి చుట్టూ కొన్ని చక్కర్లు కొట్టి.. ఆ తరువాత జాబిల్లి కక్ష్యలోకి చేరుతుంది. చందమామను కూడా కొన్నిసార్లు చుట్టేసిన తరువాత ఆచితూచి జాబిల్లిపైకి దిగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంక్లిష్టమైన, సమస్యా పూర్వక ఘట్టం.. జాబిల్లిపై చంద్రయాన్ దిగే చివరి 15 నిమిషాలు మాత్రమే! భూమి చుట్టూ 23 రోజులు, చంద్రుడి చుట్టూ 12 రోజులు భూమికి అతిదగ్గరగా 170 కిలోమీటర్లు (అపోజీ) అతి దూరంగా 40,000 కిలోమీటర్లు (పెరిజీ) ఉండేలా దాదాపు 23 రోజుల పాటు చక్కర్లు కొడుతూ ఉంటుంది. పూర్తిస్థాయి వేగం అందుకున్న తరువాత చంద్రయాన్ –2ను జాబిల్లి కక్ష్యలోకి పంపుతారు. ఇందుకు ఐదు రోజుల సమయం అవసరమవుతుంది. ఒక్కసారి జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞ్యాన్లతో కూడిన చంద్రయాన్–2 మాడ్యూల్ దాదాపు 12 రోజుల పాటు చక్కర్లు కొడుతూ క్రమేపీ తన వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరగా చేరుతుంది. ప్రయోగం జరిగిన 48వ రోజున.. అంటే సెప్టెంబరు ఏడున ఆర్బిటర్ (జాబిల్లి చుట్టూ తిరిగి వివరాలు సేకరించే భాగం) నుంచి రోవర్తో కూడిన ల్యాండర్ వేరుపడుతుంది. జరిగేది జూలై 15 ప్రణాళిక ప్రకారమే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరుపడటంతో మొత్తం ప్రయోగంలో అత్యంత కీలకమైన ఘట్టం మొదలవుతుంది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇప్పటికే గుర్తించిన రెండు భారీ గుంతల మధ్య దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ల్యాండర్ తన వేగాన్ని నియంత్రించుకుంటూ.. నిర్దిష్ట ప్రాంతంలో దిగాల్సి ఉండటం ఇందుకు కారణం. ఈ ప్రక్రియ కాస్తా విజయవంతమైతే.. కొంత సమయం తరువాత ల్యాండర్ లోపలి నుంచి రోవర్ కిందకు దిగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముందుగా అనుకున్నట్లు చంద్రయాన్ –2 ప్రయోగం జూలై 15న జరిగి ఉంటే.. జాబిల్లిపై ల్యాండింగ్ 54వ రోజు జరగాల్సి ఉండింది. కానీ ప్రయోగం వాయిదా పడింది. అయినాసరే.. సెప్టెంబరు 6–7 మధ్యకాలంలో జాబిల్లిపై ల్యాండ్ అయితే వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇస్రో కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. భూమి చుట్టూ తిరిగే కాలాన్ని 17 నుంచి 23 రోజులకు పెంచింది. అదేసమయంలో జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించడం, అక్కడ చక్కర్లు కొట్టే కాలాన్ని తగ్గించింది. జాబిల్లిపై రోవర్, ల్యాండర్లు చేయాల్సిన ప్రయోగాలకు ఇది కీలకం. ఈ రెండు పరికరాలూ సోలార్ ప్యానెల్స్తో విద్యుదుత్పత్తి చేసుకుని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు ఆరవ తేదీ మొదలుకొని కొన్ని రోజుల పాటు ల్యాండర్, రోవర్లు దిగే ప్రాంతం భూమికి అభిముఖంగా ఉంటూ సూర్యుడి కిరణాలు ప్రసారమవుతూంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నిప్పులు చిమ్ముతూ...
జాబిల్లి రహస్యాలను శోధించే లక్ష్యంతో చేపట్టిన చంద్రయాన్ 2 తొలి అడుగు విజయవంతంగా పడింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం 1 రాకెట్.. చంద్రయాన్ 2ను నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇక.. సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండర్ను దింపడమనే మలి అడుగు కోసం మానవాళి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా భారత దేశ అంతరిక్ష పరిశోధన శక్తి సామర్థ్యాలను ఇస్రో మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది. శ్రీహరికోట (సూళ్లూరుపేట)/సాక్షి ప్రతినిధి, అమరావతి: చంద్రుణ్ని చేరుకునే ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. బాహుబలిగా పిలిచే, 640 టన్నుల బరువుండే జీఎస్ఎల్వీ–మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్–2ను విజయవంతంగా భూ కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. 3,850 కేజీల బరువున్న చంద్రయాన్–2ను సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో వేదిక నుంచి నింగికి పంపారు. ప్రయోగం సమయంలో మేఘావృతమై ఉన్న ఆకాశంలోకి రాకెట్ నారింజ, పసుపు వర్ణాల్లో నిప్పులు చిమ్ముతూ ఎగిరింది. సరిగ్గా 16.14 నిమిషాల్లో చంద్రయాన్–2 మాడ్యూల్ను భూ కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగం సమయంలో ఎంతో ఉత్కంఠతో ఊపిరిబిగబట్టుకుని కూర్చున్న శాస్త్రవేత్తలు, తొలిదశ విజయవంతమైందన్న ప్రకటనతో ఒక్కసారిగా హర్షధ్వానాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 15న తెల్లవారుజామున 2.51 గంటలకే చంద్రయాన్–2 ప్రయోగం జరగాల్సి ఉండగా.. రాకెట్లోని మూడో దశ క్రయోజనిక్లో పోగో గ్యాస్ బాటిల్స్ నుంచి క్రయోఇంజిన్ ట్యాంక్కు వెళ్లే పైపులు బయట ప్రాంతంలో లీకేజిని గుర్తించి ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇస్రో శాస్త్రవేత్తలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 24 గంటల్లోనే లోపాన్ని సరిచేశారు. 48 రోజుల పాటు లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం సెప్టెంబర్ 7న ఈ ఉపగ్రహం జాబిల్లిపై అడుగుమోపనుంది. టెన్షన్.. టెన్షన్ చంద్రుడిపైకి మొట్టమొదటిగా ఆర్బిటర్ ద్వారా ల్యాండర్, ల్యాండర్లో అమర్చిన రోవర్ ప్రయోగం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలందరిలో ఎడతెగని టెన్షన్.. ఈ భారీ ప్రయోగంపైనే అందరి ధ్యాస. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 20 గంటలు ముగిసే సమయం దగ్గర పడింది. షార్లోని మీడియా సెంటర్, మిషన్ కంట్రోల్ సెంటర్లోని మైక్లలో 6.. 5.. 4.. 3.. 2.. 1.. 0 అనగానే ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పు దిక్కున ఆకాశం వైపునకు మళ్లాయి. క్షణాల్లో ఆకాశంలో కమ్ముకున్న మబ్బులను చీల్చుకుంటూ జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక చంద్రయాన్–2ను మోసుకుని నింగివైపుకెళ్లింది. మిషన్ కంట్రోల్రూంలోని శాస్త్రవేత్తలు కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఒక్కో దశ విజయవంతంగా దూసుకుపోవడంతో శాస్త్రవేత్తల వదనాల్లో చిరునవ్వులు. ఇలా మూడు దశలను సమర్థవంతంగా పూర్తి చేశారు. చంద్రయాన్–2ను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో మిషన్ కంట్రోల్రూంలోని శాస్త్రవేత్తల్లో విజయగర్వం తొణికిసలాడింది. చంద్రయాన్–2 భూ కక్ష్యలోకి చేరిందనీ, అంతా సవ్యంగా సాగుతోందని బెంగళూరులోని ఇస్రో మాస్టర్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది.శ్రీహరికోట నుంచి చేసిన అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 75వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. ప్రయోగం ఇలా జరిగింది.. మొత్తం 3,850 కేజీల బరువైన చంద్రయాన్–2 మిషన్లో 2,379 కేజీల బరువైన ఆర్బిటర్, 1,471 కిలోల బరువు కలిగిన ల్యాండర్ (విక్రమ్), 27కేజీల బరువైన రోవర్ (ప్రజ్ఞాన్) ఉన్నాయి. ఇందులో మొత్తంగా 13 పేలోడ్లు ఉండగా, వాటిలో 3 యూరప్వి, రెండు అమెరికావి, ఒకటి బల్గేరియాది. నాసాకు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ ఎరే (ఎల్ఆర్ఏ) కూడా వాటిలో ఓ పే లోడ్. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ మొదటి దశలో ఇరువైపులా అత్యంత శక్తివంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి తన ప్రయాణాన్ని దిగ్విజయంగా ప్రారంభించింది. ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 132.7 సెకన్లలో మొదటి దశను పూర్తి చేశారు. రెండో దశలో ఎల్–110 అంటే ద్రవ ఇంజిన్ మోటార్లు 110.84 సెకన్లకే స్టార్ట్ అయ్యాయి. 205 సెకన్లకు రాకెట్ శిఖరభాగాన అమర్చిన చంద్రయాన్–2 మిషన్కు ఉన్న హీట్షీల్డ్స్ విజయవంతంగా విడిపోయాయి. ఇక్కడ 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 307 సెకన్లకు రెండో దశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. క్రయోజనిక్ (సీ–25) మోటార్లు 311.22 సెకన్లకు మండించి 978 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను పూర్తి చేశారు. ఈ దశ నుంచి రాకెట్కు శిఖర భాగాన అమర్చిన త్రీ–ఇన్–ఒన్ చంద్రయాన్–2 మిషన్ను క్రయోజనిక్ దశతో 978.8 సెకన్లకు (16.55 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 40,000 కి.మీ. ఎత్తులో హైలీ ఎసిన్ట్రిక్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. రాకెట్ గమన తీరు అత్యంత సజావుగా సాగడంతో అపోజిని మరో 6,000 కి.మీ. దూరం ముందుకు పంపించి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ తన సత్తాను చాటుకుంది. అంటే 46,000 కి.మీ. దూరంలోకి తీసుకెళ్లారు. దీనివల్ల చంద్రయాన్–2 కాలపరిమితి పెరగడమే కాకుండా ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియ తగ్గింది. దీంతోచంద్రయాన్–2లో ఉన్న ఇంధనం కూడా ఆదా అయ్యి దాని జీవిత గమనం పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటినుంచి చంద్రుడిపైకి వెళ్లే వరకు మిషన్ను బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్లోనే పూర్తి చేస్తారు. చంద్రుడిపైకి ఇలా... ముందుగా 16 రోజుల్లో ఆర్బిటర్లో నింపిన ఇంధనాన్ని మండించి అపోజిని 46,000 కి.మీ. నుంచి 1,41,000 కి.మీ.కు పెంచేందుకు ఆర్బిటర్ను మండించి 4సార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్కు ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడివైపు ప్రయా ణం చేసేందుకు మళ్లిస్తారు. అనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూ రెట్రోబర్న్ చేసి వంద కి.మీ. వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి 4సార్లు ఆపరేషన్ చేపడతారు. 100 కి.మీ. నుంచి 30 కి.మీ. ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత ల్యాండర్ను 15 నిమిషాలు మండించి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దించే ప్రక్రియను చేపడతారు. ఆ 15 నిమిషాలు... చంద్రయాన్–1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లోనూ ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్ను చంద్రు డిపై దించే ప్రక్రియను కొత్తగా రూపొందించారు. ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే కీలకమైన సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతాయోనని ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. ఈ 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు ఈ ప్రయోగంలో ఇస్రో మొదటిసారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించనున్నారు. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మృదువైన చోట ల్యాండ్ అయిన తరువాత ల్యాండర్ తలుపులు తెరుచుకోకుంటే ల్యాండర్ తలుపు బయటకొచ్చేలా డిజైన్ చేశారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి 4 గంటల సమయం తీసుకుంటుంది. తొలిసారిగా చంద్రు ని దక్షిణ ధృవంపై అడుగుపెడుతున్న దేశంగా భారత్ రికార్డులకు ఎక్కనుంది. 14 రోజుల్లో 500 మీటర్లు రోవర్ సెకెండ్కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుం ది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమి మీద మనకు 14 రోజులు. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోది.ఇప్పటి వరకూ రష్యా, అమెరికా, చైనాలకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ఇప్పుడు చంద్రయాన్–2 పేరుతో చంద్రుడి ఉపరితలంపైకి ఆర్బిటర్ ద్వారా ల్యాండర్ను, ల్యాండర్ ద్వారా రోవర్ను పంపించే నాలుగోదేశంగా నిలిచింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు ఈ ఘనత సాధించాయి. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ ఒన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చందమామ కథ ఇదీ.. అంతరిక్షంపై పట్టు బిగించడానికి అమెరికా గట్టి ప్రయత్నాలే చేసింది. అపోలో మిషన్ ద్వారా చంద్రలోకంపైకి తొలి అడుగు వేసింది. ప్రాజెక్టు జెమినీ ప్రారంభించి అపోలోకు సాంకేతికపరంగా కొత్త హంగులు అద్దడానికి కృషి చేసింది. మొదట్లో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. అపోలో–1 ప్రయోగం విఫలమై ముగ్గురు వ్యోమగాములు మృతి చెందారు. ఆ తర్వాత మరిన్ని పరిశోధనలు చేసింది. మొత్తంగా 6,300 టెక్నాలజీలపై ఆధిపత్యం సాధించింది. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అపోలో–11ను ప్రయోగించింది. 1969 జూలై 16న నాసా కేప్ కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి శాటర్న్–5 రాకెట్ ద్వారా అపోలో–11 నింగికి ఎగిసింది. ఈ ప్రయోగం జరిగిన 3 రోజుల తర్వాత అపోలో–11 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. జూలై 20న జాబిల్లిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తొలి అడుగు వేశారు. ఆ తర్వాత ఆరు గంటల పైగా తేడాతో లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ అల్డ్రిన్ జాబిల్లిపైకి దిగారు. ఇద్దరు వ్యోమగాములు జాబిల్లిపై 21.38 గంటలు గడిపారు. 21.7 కేజీల మట్టి, రాతి నమూనాలను సేకరించారు. జూలై 22న లూనార్ మాడ్యూల్ను విడుదల చేసిన తర్వాత అపోలో భూమికి తిరుగు ప్రయాణమైంది. 1969 జూలై 24న ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి వచ్చారు. ఇక సూర్యుడిపై... 2020లో ఆదిత్య ఎల్1 ప్రయోగం న్యూఢిల్లీ: చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై దృష్టి సారించింది. సూర్యుడి ఉపరితలంపై కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ‘కరోనా’ను అధ్యయనం చేసేందుకు ‘ఆదిత్య –ఎల్1’ అనే వ్యోమనౌకను ప్రయోగించనుంది. 2020 ప్రధమార్థంలో ఈ ప్రయోగాన్ని చేపడతామని ఇస్రో తెలిపింది. ‘సూర్యుడి ఉపరితంలపై సాధారణంగా 6,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి బాహ్య ఉపరితల ప్రాంతమైన ‘కరోనా’లో 9.99 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదువుతోంది. కరోనాలో ఇంతభారీగా ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తాజాగా మేం ప్రయోగించనున్న ఆదిత్య–ఎల్1 నౌక కరోనాతో పాటు ట్రోపోస్పియర్, ఫొటోస్పియర్, సూర్యుడి నుంచి కణాల ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది’ అని ఇస్రో వెల్లడించింది. వాతావరణ మార్పులపై కరోనా గణనీయమైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. భూమికి సూర్యుడు 14.96 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రయాన్–1తో పరిశోధనలిలా.. శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2007 దాకా వివిధ రకాలైన రాకెట్ల ద్వారా రిమోట్ సెన్సింగ్, సమాచారం, వాతావరణ పరిశోధన, ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలు మాత్రమే చేస్తూ వచ్చింది. గ్రహాంతర ప్రయోగాలు చేయాలని నిశ్చయించుకుని 2008లో చంద్రయాన్–1 ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా చేపట్టింది. ఆ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపి పరిశోధనలు చేసింది. అయితే చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసే లా రూపొందించారు. అయితే, అందులో పంపిన పరికరాలు పది నెలలకే పనిచేయడం మానేశాయి. అంటే చంద్రయా న్–1 పది నెలలు పనిచేసిన తరువాత సాంకేతికపరమైన లోపంతో పనిచేయడం మానేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి ఇస్రో చరిత్ర సృష్టించి ంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొట్టమొదటి ప్రయోగం ఇదే. అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టి చంద్రుడిపై పరిశోధనలు జరిపింది. చంద్రయాన్–1 మిషన్ పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో దానికి కొనసాగింపుగా చంద్రయాన్–2 మిషన్ను ప్రయోగించారు. ఇస్రోకు నాసా అభినందనలు చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా అభినందనలు తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం గురించి ఇస్రో వెలుగులోకి తెచ్చే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తామని తెలిపింది. ‘చంద్రునిపై అధ్యయనానికి చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రోకు అభినందనలు. విశ్వాంతరాళంలో ఉన్న మా సాంకేతిక వనరులను మీకు సాయంగా అందించడానికి గర్విస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువం గురించి మీరు కనుగొనే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే మేం కూడా ఆర్టిమిస్ మిషన్ ద్వారా ఆ ప్రాంతంలోకి వ్యోమగాములను పంపనున్నాం’ అని ట్విట్టర్లో నాసా పేర్కొంది. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కావడం దేశ ప్రజలందరికీ గర్వించదగ్గ క్షణం. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు. – ట్విట్టర్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇది ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం. సాంకేతిక కారణాలతో గత వారం ఈ ప్రయోగం వాయిదాపడినా.. వారంలోనే విజయవంతంగా ప్రయోగం పూర్తి చేశారు. మీకు (ఇస్రో శాస్త్రవేత్తలకు) అభినందనలు. – ట్విట్టర్ ఆడియో సందేశంలో మోదీ గర్వంగా ఉంది. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చరిత్రాత్మక ప్రయాణం మొదలైంది. – డాక్టర్ కె.శివన్, ఇస్రో చైర్మన్ -
జాబిలమ్మ మీదకు చంద్రయాన్–2
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్న చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 15న వేకువజామున 2.51 గంటలకు ప్రయోగించాలని అనుకున్న చంద్రయాన్–2 మిషన్లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. వారం రోజులు తిరగకముందే మళ్లీ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. సాక్షి, సూళ్లూరుపేట (శ్రీహరికోట): జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా ‘త్రీ–ఇన్–వన్గా చెప్పకునే ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్) కాంపోజిట్ ఎర్త్స్టాక్ (పీఈఎస్)ను జాబిల్లి మీదకు పంపించే సమయం ఆసన్నమైంది. జీఎస్ఎల్వీ మార్క్3, ఎం1 రాకెట్ 16.22 నిమిషాల తరువాత భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 38,000 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసిన్ట్రిక్ ఆర్బిట్ (అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి ప్రవేశపెడుతుంది. ఈ ప్రయోగం జరిగిన 16 రోజుల్లో అపోజిని 38,000 కిలోమీటర్లు నుంచి 1,41,000 పెంచేందుకు ఆర్బిటర్ను మం డించి నాలుగుసార్లు కక్ష్యదూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్కు ట్రాన్స్ లూ నార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడివైపు ప్రయాణం చేసేందుకు మళ్లి స్తారు. తదనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూరా రెట్రోబర్న్ చేసి వంద కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి నాలుగుసార్లు ఆపరేషన్ చేపడతారు. 100 కిలోమీటర్లు నుంచి 30 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దిగుతుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయిన తరువాత ల్యాండర్ను 15 నిమిషాల పాటు మండించి దాన్ని చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను చేపడతారు. అయితే ఈ 15 నిమిషాలనే ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. చంద్రయాన్–1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లో ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్ను చంద్రుడిపై దించే ప్రక్రియను నూతనంగా రూపొందించారు. చంద్రయాన్–1కి చంద్రయాన్–2కు మధ్య 15 నిమిషాల వ్యవధి అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే కీలకమైన సమయంలో ఎలాంటి సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతాయోనని ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత ఆందోళనగా ఉంది. ఈ 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించనుంది. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మృదువైన చోట ల్యాండ్ అయిన తరువాత రోవర్ లోపల ఉండే తలుపు తెరుచుకునే విధంగా డిజైన్ చేశారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి సుమారు నాలుగు గంటల సమయాన్ని తీసుకుని మరీ బయటకు వస్తుంది. రోవర్ సెకెన్కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మాలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. అయితే ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోదేశంగా ఖ్యాతి గడించనుంది. ఇప్పటి దాకా రష్యా, అమెరికా, చైనాకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశారు. చంద్రయాన్–1 పేరుతో ఉపగ్రహాన్ని చంద్రుడికి చుట్టూ పరిభ్రమించేలా చేసిన మొట్ట మొదటి దేశంగా భారత్కు పేరుంది. ఇప్పుడు చంద్రయాన్–2 పేరుతో ఆర్బిటర్ ద్వారా ల్యాండర్ను, ల్యాండర్ ద్వారా రోవర్ను పంపించే నాలుగోదేశంలో అవతరించనుంది. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ వన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
మూన్పై మన మార్క్
-
ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు..!
రేదొరా నిను చేరగా..! అంతరిక్షంలో.. ఎన్నో వింతలు..విశేషాలు..మరెన్నో అద్భుతాలు..వాటిని శోధించేందుకు అగ్రదేశాల పోటీ. వాటికి దీటుగా భారత్ ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసింది. ఇస్రోను ప్రధాన ఆయుధంగా మలుచుకుని వినువీధిలో ఎదురులేని శక్తిగా నిలిచింది. 1970లో రష్యా వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపారు. ఆ తర్వాత అమెరికా,చైనా దేశాలు చంద్రునిపై ప్రయోగాలు చేశాయి. 2008లో జిల్లాలోని షార్ వేదికగా చంద్రయాన్–1ను ఇస్రో విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి పంపిన తర్వాతే నీటిజాడలు వెలుగుచూశాయి. ఆ తర్వాత మంగళ్యాన్––1ను అంగారకుడి కక్ష్యలోకి పంపింది. నేడు చంద్రయాన్–2తో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ శోధనలు చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. దీనికి వేదికవుతోంది షార్. భారతదేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసే ఈ ప్రయోగంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా శ్రీహరికోట వైపు చూస్తున్నాయి. – సూళ్లూరుపేట సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు భవిష్యత్ అంతా భారీ ప్రయోగాలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి భారీ ఉపగ్రహ వాహకనౌకను రూపొందించేందుకు 2000 సంవత్సరం నుంచి కృషి చేసి పరిపక్వతను సాధించగలిగారు. తొలుతగా 2014 డిసెంబర్ 23 జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి నిర్ధారించుకున్నారు. ఆ ప్రయోగంలో ఎస్–200, ఎల్–110 సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. అందులో సీ–25 లేకుండా క్రూ మాడ్యూల్ను పంపించి మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టి విజయవంతం చేశారు. ఆ తర్వాత 2017 జూన్ 5న జీఎస్ఎల్వీ–మార్క్3డీ1 ద్వారా 3,136 కిలోల బరువు కలిగిన జీశాట్–19 అనే సమాచార ఉపగ్రహాన్ని, నవంబర్ 14న మార్క్ 3డీ2 ద్వారా 3,700 కిలోల బరువు కలిగిన జీశాట్–29 అనే సమాచార ఉపగ్రహాన్ని సునాయాసంగా ప్రయోగించారు. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగాలు విజయాలు సాధించాయంటే అది 19 ఏళ్ల కఠోర శ్రమకు ఫలితమని చెప్పొచ్చు. కీలక దశల్లో స్ట్రాపాన్ బూస్టర్ల తయారీలో పరిణితి ఇందులో కీలకంగా మారిన మొదటి దశ 200 టన్నుల ఘన ఇంధనాన్ని నింపిన రెండు ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్ల అవసరాన్ని గుర్తించారు. మామూలుగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లలో మొదటి దశలో సుమారు 138, 142 టన్నుల ఘన ఇంధనాన్ని వాడతారు. M మార్క్–3 రాకెట్లో అయితే 400 టన్నుల ఘన ఇంధనాన్ని నింపిన రెండు బూస్టర్లు అవసరం కావడంతో వీటిని షార్లోని ఘన ఇంధనం తయారీ విభాగం (స్ప్రాబ్)లోనే తయారు చేశారు. 2000 నుంచి 2010 వరకు దీనికి ఏమి అవసరముంటుందో గుర్తించి 2010 జనవరి 24న ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. రెండో దశలో ఉపయోగించే 110 టన్నుల ద్రవ ఇంధనం నింపిన మోటార్లు (ఎల్–110) వాడతారు. మామూలు ప్రయోగాల్లో అయితే 40 టన్నులకు మించి వాడరు. ఇక్కడేమో ఉపగ్రహం బరువును బట్టి రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తారు. ఎల్–110ను తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్ సెంటర్లో తయారు చేసి 2010 మార్చి 5న భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. ఇక మూడో దశలో అత్యంత శక్తివంతమైన క్రయోజనిక్ ఇంజిన్లను వినియోగిస్తారు. దీన్ని ఇస్రో పరిభాషలో సీ–25గా పిలుస్తారు. మామూలుగా జీఎస్ఎల్వీలో 12.5 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తే అదే మార్క్–3కు వచ్చే సరికి రెట్టింపు క్రయో ఇంధనం అంటే 25 టన్నుల ఇంధనాన్ని వినియోగిస్తారు. 12.5 టన్నుల బరువు కలిగిన క్రయోజనిక్ దశను రూపొందించేందుకు మన శాస్త్రవేత్తలు తీవ్రమైన కృషి చేశారు. 25 టన్నుల క్రయో దశను రూపొందించేందుకు రెండేళ్ల వ్యవధిని తీసుకున్నారు. సీ–25లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించడంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాప్తి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇస్రోకు బాహుబలి రాకెట్గా పేరు పొందిన జీఎస్ఎల్వీ మార్క్–3 సిరీస్లో ఇది మూడో ప్రయోగం కావడం విశేషం. ప్రస్తుతం సుమారు నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 మిషన్ను ముచ్చటగా మూడో సారి రోదసీలోకి తీసుకెళ్లేందుకు జీఎస్ఎల్వీ మార్క్ 3–ఎం1 రాకెట్ ద్వారానే నిర్వహించనున్నారు. గగన్యాన్ లక్ష్యంగా ... సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2022 నాటికి మానవ సహిత ప్రయోగాలే (గగన్యాన్) లక్ష్యంగా 2014, 2016, 2018 సంవత్సరాల్లో మూడు రకాల ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి ముందంజల్లో నిలిచింది. గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్ట్ను వేగవంతం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. గగన్యాన్ తరహా ప్రయోగాలను నిర్వహించేందుకు 2014 డిసెంబర్ 18నే బీజం పడింది. భవిష్యత్లో గగన్యాన్ ప్రయోగాలు చేసేందుకు ముందుస్తుగానే జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి భారీ రాకెట్ను, ఆర్ఎల్వీ టీడీ, పాడ్ అబార్ట్ టెస్ట్ వంటి మూడు ప్రయోగాత్మక ప్రయోగాలను చేపట్టి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు మంచి జోష్ మీదున్నారు. ఆర్ఎల్వీ టీడీ ప్రయోగమూ విజయమే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రియూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ–టీడీ) విజయవంతంగా ప్రయోగించారు. ఈ తరహా రాకెట్ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలో మీటర్లు ఎత్తుకెళ్లిన తర్వాత శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువు కలిగిన హైపర్ సోనిక్ పైలట్ను విడుదల చేసింది. ఆ పైలట్ 65 కిలో మీటర్లు ఎత్తుకెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు రన్వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా హైపర్ సోనిక్ పైలట్ను శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 450 కిలో మీటర్లు దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు. దీనికి ఇండియన్ కోస్టల్ గారŠుడ్స, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్ మెజర్మెంట్, షిప్ బర్న్ టెలీమేట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. వ్యోమనాట్స్ను రోదసీలో వదిలి పెట్టి మళ్లీ క్షేమంగా తీసుకురావడానికి ఉపయోగపడే రియూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు. గగన్యాన్ ప్రయోగం కోసమే పాడ్ అబార్ట్ టెస్ట్ మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగానే నిర్వహించారు. ‘ ప్యాడ్ అబార్ట్æ టెస్ట్’ ప్రయోగాన్ని 259 సెకండ్ల పాటు రాకెట్ను నాలుగు దశల్లో మండించి రెండు కిలో మీటర్లు మేర అంతరిక్షం వైపునకు తీసుకెళ్లి ప్యారాచూట్ల ద్వారా క్రూ మాడ్యూల్ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు వేచి ఉండి వాటిని రికవరీ చేశారు. అయితే ఈ ప్రయోగంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకున్నప్పటికీ విజయవంతగానే నిర్వహించారు. క్రూ మాడ్యూల్ను సముద్రంలో దించే సమయంలో సుమారు 10 నిమిషాల ముందే వదిలేయడంతో మాడ్యూల్ కిందభాగం కొద్దిగా దెబ్బతింది. అయితే వ్యోమగాములే ఉంటే దీని వల్ల ఇబ్బందేమీ ఉండదని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. మానవ సహిత ప్రయోగాల్లో ప్రమాదాల నివారణకే ప్రయోగాలు 2003లో యూఎస్ఏకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ వ్యోమగాములను విజయవంతంగా రోదసీలోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తిరిగి భూమికి చేరుకునే సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే ఉష్ణోగ్రతల్లో తేడాలు వచ్చి ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయింది. ఇందులో ఆమెరికా వ్యోమగాములతో పాటు భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా కొన్ని పరీక్షలు చేసుకుంటున్నారు. ఈ పరీక్షల్లో భాగంగా ఇద్దరు వ్యోమగాములను భూ సమీప కక్ష్యలోకి పంపించి వారిని సురక్షితంగా ముందుగా నిర్ణయించిన ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి. ఆ సమయంలో రాకెట్ ఎలా పని చేస్తుంది. వాతావరణంలోని మార్పులు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ ప్రయోగాన్ని నిర్వహించి వాటి వివరాలను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. భవిష్యత్లో వ్యోమగాములను రోదసీలోకి పంపి మళ్లీ తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు క్రూ మాడ్యూల్, ఆర్ఎల్వీ–టీడీ, పాడ్ అబార్ట్ టెస్ట్ అనే మూడు రకాల ప్రయోగాత్మక ప్రయోగాలతో సాంకేతిక పరంగా పట్టు సాధించారు. ఈ మూడు ప్రయోగాలకు సుమారు రూ.170 కోట్ల దాకా వ్యయం చేశారని తెలుస్తోంది. అయితే మానవ సహిత ప్రయోగాలను నిర్వహించేందుకు మరో రెండు మానవ రహితంగా ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి నిర్ధారించుకున్న తర్వాత గగన్యాన్ ప్రయోగానికి సిద్ధమయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఇస్రో ఇటీవల కాలంలో చేసే ప్రతి ప్రయోగాత్మక ప్రయోగం మొదటి ప్రయత్నంలోనే విజయవంతం అవుతుండడంతో యావత్ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. 2000లో మార్క్–3కి బీజం సుమారు 3 వేల నుంచి 5 వేల కిలోల బరువు కలిగిన కమ్యూనికేషన్ శాటిలైట్స్తో పాటు, మానవుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు, చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనల నిమిత్తం చంద్రయాన్–2 వంటి మిషన్ పంపేందుకు మార్క్–3 వంటి భారీ ఉపగ్రహ వాహకనౌక అవసరమని 2000లో గుర్తించి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 2003లో దీనికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడమే కాకుండా బడ్జెట్లో రూ. 3 వేల కోట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా షార్లోనే రూ.700 కోట్లతో ఈ ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. షార్కు దేశ ప్రథమ పౌరుడు రాక సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు అత్యంత కీలక కేంద్రమైన సతీష్ ధవన్స్పేస్ (షార్) సెంటర్కు దేశ ప్రథమ పౌరుడు రామనాథ్ కోవింద్ రానున్నారు. షార్ను ఇప్పటికి మగ్గురు రాష్ట్రపతులు సందర్శించగా ప్రస్తుతం నాల్గో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఈ నెల 14న షార్ను సందర్శించనున్నారు. అయితే షార్ను సందర్శించిన భారత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాం ఇస్రో శ్రీహరికోట నుంచి చేపట్టిన మొట్టమొదటి ఎస్ఎల్వీ–3డీ1 ప్రయోగ సమయంలో ఆ ప్రాజెక్ట్కు డైరెక్టర్గా, శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి హోదాలో షార్లో రెండో ప్రయోగ వేదికను ప్రారంభించేందుకు విచ్చేశారు. అయితే ఆయన స్వతహాగా శాస్త్రవేత్త కావడంతో రాష్ట్రపతి హోదాలోనే పలుమార్లు ప్రయోగాలను వీక్షించేందుకు విచ్చేసిన సందర్భాలున్నాయి. సుమారు రూ.30 కోట్లతో నిర్మించిన రెండో ప్రయోగ వేదికను 05–05–2005న ఆయన చేతులు మీదుగా ప్రారంభించారు. అదే రోజున రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ06 ద్వారా కార్టోశాట్–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అయితే ఆయన ఆ సమయంలో 4వ తేదీనే షార్కు చేరుకుని ప్రయోగ పనుల్లో కూడా పాలుపంచుకోవడం విశేషం. ఆ తర్వాత 2012 జనవరి 2న అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభాపాటిల్ కూడా షార్ కేంద్రాన్ని సందర్శించారు. భవిష్యత్లో భారీ ప్రయోగాల దృష్ట్యా షార్లో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు రూ. 20 కోట్లతో నిర్మించిన న్యూ మిషన్ కంట్రోల్రూంను ఆమె చేతులు మీదుగా అప్పట్లో ప్రారంభించారు. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 25న అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ముఖర్జీ పీఎస్ఎల్వీ సీ20 ప్రయోగానికి వీక్షించేందుకు విచ్చేశారు. అయితే ఆయన కేవలం ప్రయోగాన్ని వీక్షించేందుకు మాత్రమే వచ్చి వెళ్లారు. ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ నెల 14న షార్ కేంద్రాన్ని సందర్శించిన నాలుగో రాష్ట్రపతి కావడం విశేషం. షార్లో ఇటీవల రూ.695 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ను ప్రారంభించేందుకు షార్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14న సాయంత్రం సెకండ్ వ్యాబ్ను ప్రారంభించనున్నారు. -
రాబోయే ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి రానున్న ఆరు నెలల కాలంలో నాలుగు ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని షార్ డైరెక్టర్ ఎస్.పాండియన్ తెలిపారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ విద్యాలయ మైదానంలో బుధవారం షార్లోని భాస్కర అతిథి భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ రెండో వారంలో పీఎస్ఎల్వీ సీ42 ద్వారా యూరోపియన్కు చెందిన నోవాశాట్, ఎస్–14 అనే రెండు విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నామని చెప్పారు. రెండో ప్రయోగవేదికపై అక్టోబర్ మొదటి వారంలో జీఎస్ఎల్వీ మార్క్–3, డీ–2 ప్రయోగం ద్వారా జీశాట్–29 అనే ఉపగ్రహాన్ని పంపిస్తామన్నారు. వెంటనే నవంబర్, డిసెంబర్ నెలల్లో పీఎస్ఎల్వీ సీ43, సీ 44 రాకెట్లును ప్రయోగిస్తామన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం 2019 ప్రథమార్థంలో ఉంటుందన్నారు. సూర్యుడిపై పరిశోధనకు నాసాతో ఇస్రో ఇప్పటికే చర్చలు జరుపుతోందని, ఫలప్రదమైతే ఆదిత్య–1 పేరుతో ఉపగ్రహాన్ని పంపడం తమ లక్ష్యమన్నారు. -
పీఎస్ఎల్వీ సీ41 ప్రయోగానికి కౌంట్డౌన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ నెల 12న వేకువజామున 4.04 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్ వీ సీ41 ఉపగ్రహ వాహకనౌకకు మంగళవారం రాత్రి 8.04 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. పీఎస్ఎల్వీ సీ41 ద్వారా 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ (రీప్లేస్మెంట్) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 43వ ప్రయోగం కావడం విశేషం. ఈ ప్రయోగంతో దేశానికి సొంత నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. -
ఇస్రో శక్తిమంతమైన ప్రయోగం: పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్ : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగానికి సంసిద్ధమైంది. గురువారం శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేజింగ్(షార్) నుంచి సాయంత్రం 04.56 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ జీశాట్-6ఏ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. జీశాట్-6 తరహాలోనే జీశాట్-6ఏ కూడా శక్తిమంతమైన ఎస్-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఏంటీ జీశాట్-6ఏ..? ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్-6ఏ రెండోది. 2015 ఆగష్టులో జీశాట్-6ను ఇస్రో ప్రయోగించింది. కొత్త సాంకేతికత అభివృద్ధికి దోహదపడేందుకు జీశాట్-6ఏను ప్రయోగిస్తున్నారు. అంతేకాకుండా ఉపగ్రహాల ద్వారా నడిచే మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు జీశాట్-6ఏ మరింత బలం చేకూర్చుతుంది. దాదాపు 2 టన్నులు బరువుండే జీశాట్-6ఏ ఉపగ్రహం పదేళ్ల పాటు అంతరిక్షం నుంచి సేవలు అందిస్తుంది. దీని తయారీ కొరకు ఇస్రో రూ. 270 కోట్లు ఖర్చు చేసింది. ప్రత్యేక యాంటెన్నా వినియోగం.. జీశాట్-6ఏ ఉపగ్రహంలో ఇస్రో ప్రత్యేకమైన యాంటెనాను అమర్చింది. విచ్చుకుంటే ఆరు మీటర్ల వెడల్పు ఉండే ఈ యాంటెనా చూడటానికి గొడుగులా కనిపిస్తుంది. ఉపగ్రహం ఒక్కసారి కక్ష్యలో చేరిన తర్వాత ఇది తెరచుకుంటుంది. ఇప్పటివరకూ ఇస్రో చేసిన ప్రయోగాల్లో వినియోగించిన యాంటెనాలకు ఇది విభిన్నమైనది. మొబైల్ కమ్యూనికేషన్తో పాటు మిలటరీ అవసరాలకు కూడా ఈ యాంటెనా ఉపయోగపడనుంది. ఏంటీ ఎస్-బ్యాండ్..? విద్యుదాయస్కాంత స్పెక్ట్రమ్లో 2 నుంచి 4 గిగాహెర్జ్ పౌనఃపున్యాల మధ్య ఉండే బ్యాండ్ను ‘ఎస్’గా పిలుస్తారు. ప్రస్తుతం ఎస్-బ్యాండ్ను వాతావరణ రాడార్లలో, సముద్ర ఉపరితలంపై సంచరించే ఓడల్లో, కొన్ని కమ్యూనికేషన్ శాటిలైట్లలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వినియోగంలో ఉన్న 4జీ నెట్వర్క్ సైతం ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారానే సేవలు అందిస్తోంది. జీఎస్ఎల్వీ ఎఫ్-08 రాకెట్ ద్వారా.. జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్(జీఎస్ఎల్వీ)-ఎఫ్08 రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-6ఏను ప్రయోగిస్తోంది. జీఎస్ఎల్వీ సిరీస్ రాకెట్లను వినియోగించి ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇది పన్నెండవది. క్రయోజెనిక్ సాంకేతికతను అందిపుచ్చుకున్న తర్వాత చేస్తున్న ప్రయోగాల్లో ఆరవది. షార్లోని రెండో లాంచ్ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్ 08 పొడవు 49.1 మీటర్లు కాగా, బరువు 415.6 టన్నులు. ప్రయోగం చేపట్టిన 17 నిమిషాల 46.50 సెకన్ల కాలంలో 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-6ఏ ఉపగ్రహం చేరుతుంది. -
మార్చి 15కు జీఎస్ఎల్వీ ఎఫ్–08 వాయిదా
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’నుంచి ఈ నెల 26న ప్రయోగించ తలపెట్టిన జీఎస్ఎల్వీ ఎఫ్–08 ప్రయోగం మార్చి 15వ తేదీకి వాయిదా పడింది. మార్చి 15న జీఎస్ఎల్వీ ఎఫ్–08, 22న పీఎస్ఎల్వీ సీ41 ప్రయోగాలు చేసేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్–08 రాకెట్ ద్వారా జీశాట్–6ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. అయితే, ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతో ఈ నెల 26న చేయాలనుకున్న ప్రయోగం మార్చికి వాయిదా పడింది. జీఎస్ఎల్వీ రాకెట్ రెండో దశ అనుసంధానం పనులు సోమవారం చేపట్టారు. 12 నుంచి పీఎస్ఎల్వీ సీ41 క్యాంపెయిన్ పనులు మరోవైపు.. ఈ నెల 12న మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ41 రాకెట్ క్యాంపెయిన్ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇదిలా ఉండగా మార్చి 10న వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్) నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్–08 రాకెట్ను ఊంబ్లికల్ టవర్ మీదకు తరలించిన వెంటనే వ్యాబ్లో జీఎస్ఎల్వీ ఎఫ్10 రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారానే చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే ఏప్రిల్ రెండో వారంలో జీఎస్ఎల్వీ ఎఫ్10 ద్వారా చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేసేందుకు సమాయత్తమవుతున్నారు. -
ఇస్రో గొప్ప విజయాలు సాధించింది
సాక్షి, హైదరాబాద్: ఇస్రో గొప్ప విజయాలు సాధించిందని.. వాటి ఫలితాలను ప్రస్తుతం అనుభవిస్తున్నామని ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఏఎస్ కిరణ్కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన పోలీస్ అకాడమీలో ఐపీఎస్ వ్యాస్ స్మారకోపన్యాసం ఇచ్చారు. రోడ్ నావిగేషన్, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, రైల్వే భద్రతలో టెక్నాలజీ వినియోగం, డిజాస్టర్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ తదితర అంశాల్లో ఇస్రో ప్రవేశపెట్టిన సాంకేతికతను ఆయన పోలీస్ అధికారులకు వివరించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల పోలీస్ విభాగాల సక్సెస్కు వ్యాస్ ఒక మార్గనిర్దేశకుడని అన్నారు. వ్యాస్ ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ ఇప్పుడు దేశంలోనే అత్యంత కీలకమైన బలగంగా పేరు సంపాదించిందన్నారు. కార్యక్రమంలో వ్యాస్ సతీమణి అరుణా వ్యాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం వ్యాస్ బాగా కృషి చేశారని, పోలీస్ శాఖ కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తని గుర్తుచేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, అకాడమీ డైరెక్టర్ జితేందర్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
మరో మైలురాయికి చేరువైన ఇస్రో
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా కార్టోశాట్–2 సిరీస్లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది. అన్ని దశలను విజయవంతంగా దాటుకుని పీఎస్ఎల్వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇందులో మూడు భారత్వి, కాగా మిగిలినవి విదేశాలకు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు. దేశీయ అవసరాల కోసం భౌగోళిక పరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కార్టోశాట్ ఉపగ్రహ వ్యవస్థను 2005లో ప్రారంభించారు. భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ నాణ్యమైన ఛాయాచిత్రాలను ఈ వ్యవస్థ పంపుతోంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, సముద్ర తీర ప్రాంతాల పర్యవేక్షణ, నీటి పంపిణీపై కీలక సమాచారాన్ని సమకూరుస్తోంది. భారత్కు చెందిన చివరి ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే ఇప్పటి వరకు ఇస్రో పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య వందకు చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సీ–40 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇస్రోకు బ్రహ్మాస్త్రం పీఎస్ఎల్వీ ఇస్రోకు పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) తిరుగులేని బ్రహ్మాస్త్రంగా మారింది. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో వెలుగొందుతూ బహుళ ప్రయోజనకారిగా ఇది పేరొందింది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి జరిగిన 61 ప్రయోగాల్లో 41 ప్రయోగాలు పీఎస్ఎల్వీ రాకెట్దే కావడం విశేషం. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఇస్రో ఫ్రాన్స్, రష్యా నుంచి పంపిస్తుంటే అతిచిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయం తెచ్చిపెడుతోంది. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, మళ్లీ 20 ఉపగ్రహాలు మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్ఎల్వీకే సొంతం. ఇప్పటివరకు 41 పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 210 విదేశీ ఉపగ్రహాలు, 39 స్వదేశీ ఉపగ్రహాలు ప్రయోగించారు. రెండు రకాలుగా.. పీఎస్ఎల్వీ రాకెట్ను ఇస్రో రెండు రకాలుగా ఉపయోగిస్తోంది. తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేప్పుడు స్ట్రాఫాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. దీనిని కోర్ అలోన్ ప్రయోగమని ఇస్రో పరిభాషలో అంటారు. అదే ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేందుకు అత్యంత శక్తివంతమైన స్ట్రాఫాన్ బూస్టర్లతో చేస్తారు. ఎక్సెఎల్ స్ట్రాపాన్ బూస్టర్లతో ఇప్పటివరకు 19 ప్రయోగాలు చేశారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా పీఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను పంపుతోంది. అయితే గతేడాది ఆగస్ట్ 31న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ39 ప్రయోగం విఫలమైంది. దిగ్విజయంగా జైత్రయాత్ర చేస్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ రెండోసారి విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగు నెలలు పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం 42వ పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా 28 విదేశీ ఉపగ్రహాలతో పాటు మూడు స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే పీఎస్ఎల్వీ ద్వారా 238 విదేశీ, 40 స్వదేశీ ఉపగ్రహాలను పంపించినట్లవుతుంది. ఇస్రోకు వాణిజ్యపరంగా సంవత్సరానికి సుమారుగా రూ.1,500 కోట్లు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతోంది పీఎస్ఎల్వీ రాకెట్లే కావడం విశేషం. తేదీ వెహికల్ ఉపగ్రహాలు 20–09–1993 పీఎస్ఎల్వీ–డీ1 విఫలం 15–10–1994 పీఎస్ఎల్వీ–డీ2 ఐఆర్ఎస్–పీ2 21–03–1996 పీఎస్ఎల్వీ–డీ3 ఐఆర్ఎస్–పీ3 29–09–1997 పీఎస్ఎల్వీ–సీ1 ఐఆర్ఎస్–1డీ 26–05–1999 పీఎస్ఎల్వీ–సీ2 ఓషన్శాట్–1 22–10–2001 పీఎస్ఎల్వీ–సీ3 టెస్ 12–09–2002 పీఎస్ఎల్వీ–సీ4 కల్పన–1 17–10–2003 పీఎస్ఎల్వీ–సీ5 రీసోర్స్శాట్–1 05–05–2005 పీఎస్ఎల్వీ–సీ6 కార్టోశాట్–1,హామ్శాట్ 10–01–2007 పీఎస్ఎల్వీ– సీ7 కార్టోశాట్–2 23–04–2007 పీఎస్ఎల్వీ–సీ8 వాణిజ్య ప్రయోగం 21–01–2008 పీఎస్ఎల్వీ–సీ10 వాణిజ్య ప్రయోగం 28–04–2008 పీఎస్ఎల్వీ–సీ9 కార్టోశాట్–2ఏతో 10 ఉపగ్రహాలు 22–10–2008 పీఎస్ఎల్వీ–సీ11 చంద్రయాన్–1 20–04–2009 పీఎస్ఎల్వీ–సీ12 రీశాట్–2 23–09–2009 పీఎస్ఎల్వీ–సీ14 ఓషన్శాట్–2 12–07–2010 పీఎస్ఎల్వీ–సీ15 కార్టోశాట్–2బీ 20–04–2011 పీఎస్ఎల్వీ–సీ16 రీసోర్స్శాట్–2, యూత్శాట్ 15–07–2011 పీఎస్ఎల్వీ–సీ17 జీశాట్–12 12–10–2011 పీఎస్ఎల్వీ–సీ18 మెఘాట్రోఫిక్ 26–04–2012 పీఎస్ఎల్వీ–సీ19 రీశాట్–1 09–09–2012 పీఎస్ఎల్వీ–సీ21 వాణిజ్య ప్రయోగం 25–02–2013 పీఎస్ఎల్వీ–సీ20 సరళ్ 01–07–2013 పీఎస్ఎల్వీ–సీ22 ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ 05–11–2013 పీఎస్ఎల్వీ–సీ25 మార్స్ ఆర్బిటర్ ఉపగ్రహం 04–04–2014 పీఎస్ఎల్వీ–సీ24 ఐఆర్ఎన్ఎస్ఎస్–1బీ 30–06–2014 పీఎస్ఎల్వీ–సీ23 వాణిజ్య ప్రయోగం 16–10–2014 పీఎస్ఎల్వీ–సీ26 ఐఆర్ఎన్ఎస్ఎస్–1సీ 28–03–2015 పీఎస్ఎల్వీ–సీ27 ఐఆర్ఎన్ఎస్ఎస్–1డీ 10–07–2015 పీఎస్ఎల్వీ–సీ28 వాణిజ్యపరమైన ఉపగ్రహాలు 28–09–2015 పీఎస్ఎల్వీ–సీ30 ఆస్ట్రోశాట్ 16–12–2015 పీఎస్ఎల్వీ–సీ29 వాణిజ్య ప్రయోగం 20–01–2016 పీఎస్ఎల్వీ–సీ31 ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఈ 16–03–2016 పీఎస్ఎల్వీ–సీ32 ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఎఫ్ 28–04–2016 పీఎస్ఎల్వీ–సీ33 ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ 22–06–2016 పీఎస్ఎల్వీ–సీ34 కార్టోశాట్–సీ, ప్రథమ్, ఫైశాట్తోపాటు 17 విదేశీ ఉపగ్రహాలు 26–09–2016 పీఎస్ఎల్వీ–సీ35 స్కాట్శాట్–1 07–12–2016 పీఎస్ఎల్వీ–సీ36 రీసోర్స్శాట్–2ఏ 15–02–2017 పీఎస్ఎల్వీ–సీ37 కార్టోశాట్–2 సీరిస్ 23–06–2017 పీఎస్ఎల్వీ–సీ38 కార్టోశాట్–2 సీరిస్ 31–08–2017 పీఎస్ఎల్వీ–సీ39 ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ విఫలం 12–01–2018 పీఎస్ఎల్వీ–సీ40 కార్టోశాట్–2సిరీస్లో మైక్రో, నానో శాటిలైట్తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలు -
పీఎస్ఎల్వీ సీ40కి నేడు కౌంట్డౌన్ ప్రారంభం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ40 నింగిలోకి దూసుకెళ్ల నుంది. ఈ విషయాన్ని బుధవారం షార్లోని బ్రహ్మప్రకాష్ హాల్లో జరిగిన మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్)లో అధికారికంగా ప్రకటించారు. రాకెట్కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం సాయంత్రం ఎంఆర్ఆర్ కమిటీ వారు ప్రయోగ పనులను లాంచ్ ఆథరై జేషన్ బోర్డుకి అప్పగించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ పీ కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించి గురువారం తెల్లవారుజామున 5.29 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీఎస్ ఎల్వీ సీ40 ద్వారా 1,323 కిలోల బరువు కలిగిన 31 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 710 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2 సిరీస్లో ఐదో ఉపగ్రహంతో పాటు దేశీయంగా ఒక సూక్ష్మ ఉపగ్రహం, మరో బుల్లి ఉపగ్రహంతో పాటు ఆరు దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలు ప్రయోగించనున్నారు. గతేడాది ఆగస్టు 31న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ39 విఫలమైనందున ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. -
10న పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఈ నెల 10న పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగాన్ని చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ను రోదసీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత నెల 10 నుంచి పీఎస్ఎల్వీ సీ40 క్యాంపెయిన్ను ప్రారంభించి నాలుగు దశల రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసింది. డిసెంబర్ ఆఖరి వారంలో ప్రయోగించాలని తొలుత నిర్ణయించినా, రాకెట్కు సంబంధించిన కొన్ని విడిభాగాలు షార్కు చేరుకోకపోవడంతో జనవరికి వాయిదా వేశారు. ఈ రాకెట్ ద్వారా 30 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఇందులో దేశీయ అవసరాల కోసం కార్టోశాట్–2 సిరీస్లో ఓ ఉపగ్రహం ఉండగా, మిగిలిన 29 విదేశాలకు చెందినవే. గతేడాది ఆగస్టు 31న నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ39 ప్రయోగం విఫలం కావడంతో, ఈసారి ఎలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
పీఎస్ఎల్వీ సీ–39కి కౌంట్డౌన్ ప్రారంభం
-
పీఎస్ఎల్వీ సీ–39కి నేడు కౌంట్డౌన్ ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ సీ–39 రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ (రీప్లేస్మెంట్) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం రాత్రి 7 గంటలకు ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకోసం బుధవారం మధ్యాహ్నం కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మంగళవారం నిర్వహించిన మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్)లో అధికారికంగా ప్రకటించారు. షార్ కేంద్రంలోని బ్రహ్మ ప్రకాశ్ హాలులో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేశ్ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధతా సమావేశం జరిగింది. గురువారం సాయంత్రం 6.59 గంటలకు ప్రయోగం జరుగుతుందని తొలుత ప్రకటించారు. కానీ అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రయోగ సమయాన్ని మరో నిమిషం పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, మంగళవారం మధ్యాహ్నానికి రాకెట్కు అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేశారు. ప్రయోగానికి 29 గంటల ముందు అంటే.. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమవుతుంది. పీఎస్ఎల్వీ సీ–39 ద్వారా 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ (రీప్లేస్మెంట్) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించనున్నారు. -
నేడు పీఎస్ఎల్వీ సీ38 కౌంట్డౌన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి శుక్రవారం నిర్వహించనున్న పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ను గురువారం ఉదయం 5.29కి ప్రారంభించనున్నారు. బుధవారం దీనికి సంబంధిం చిన మిషన్ సంసిద్ధత సమావేశాన్ని నిర్వహిం చారు. లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి కౌంట్ డౌన్, ప్రయోగ సమయాలను అధికారికంగా ప్రకటించారు. 28 గంటల కౌంట్డౌన్ అనంతరం శుక్రవారం ఉదయం 9.29కి రాకెట్ను ప్రయోగిస్తారు. దీని ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్ 2డీ, దేశీయ వర్సిటీకి చెందిన ఓ చిన్న ఉపగ్రహంతో పాటు 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తారు. గురువారం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ షార్ చేరుకుని రాకెట్కు తుది విడత తనిఖీలు నిర్వహిస్తారు. -
సాహో.. బాహుబలి
- జీఎస్ఎల్వీ మార్క్3డీ1 ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు అభినందనల వెల్లువ - సమాచార రంగంలో గొప్ప ముందడుగు: వైఎస్ జగన్ శ్రీహరికోట/హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నూతన చరిత్రను లిఖించిన ఇస్రోకు దేశ ప్రధాని సహా కీలక నేతలు అభినందనలు తెలిపారు. ప్రయోగం విజయవంతమైందని, భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇది చరిత్రలో నిలిచిపోయేరోజని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ప్రకటించగానే శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో చప్పట్లు మారుమోగాయి. ఈ విజయం.. 18 ఏళ్ల కృషికి దక్కిన ఫలితమని, భాగస్వాములైన శాస్త్రవేత్తలందరినీ అభినందిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. గొప్ప ముందడుగు: వైఎస్ జగన్ జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం సమాచార రంగంలో గొప్ప ముందడుగని, అతిభారీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామి దేశాల సరసన భారత్ చేరిందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. (నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన ‘బాహుబలి’) Congratulations to the dedicated scientists of ISRO for the successful launch of GSLV – MKIII D1/GSAT-19 mission. — Narendra Modi (@narendramodi) 5 June 2017 The GSLV – MKIII D1/GSAT-19 mission takes India closer to the next generation launch vehicle and satellite capability. The nation is proud! — Narendra Modi (@narendramodi) 5 June 2017 Congratulations @isro for making Indians all over the world proud by launching GSLV Mk III-D1/GSAT-19 -
నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన ‘బాహుబలి’
- అత్యంత బరువైన జీఎస్ఎల్వీ-మార్క్3 డి1 ప్రయోగం సక్సెస్ - రోదసీలోకి జీశాట్-19 ఉపగ్రహాన్ని పంపిన ఇస్రో శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 640 టన్నుల జీఎ్సఎల్వీ-మార్క్3 డి1 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల సతీష్ ధావన అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్) నుంచి సోమవారం సాయంత్రం 5:28 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. దీనిద్వారా 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్-19ని రోదసీలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ,136 కిలోల బరువైన జీశాట్–19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ప్రయోగమిలా.. జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 పొడవు 43.43 మీటర్లు. బరువు 640 టన్నులు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగాన్ని 16.20 నిమిషాల్లో పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు సంకల్పించారు. కౌంట్డౌన్ ముగిసిన వెంటనే మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్–200)ను మండించటంతో రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్–110) మండించి రాకెట్ ప్రయాణ స్పీడ్ను పెంచుతారు. 2.20 నిమిషాలకు ఎస్–200 రెండు బూస్టర్లు విడిపోయి మొదటిదశను పూర్తి చేస్తాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తయింది. 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనంతో మూడోదశను ప్రారంభించి 16.20 నిమిషాలకు రాకెట్కు శిఖర భాగంలో అమర్చిన 3,136 కిలోల బరువైన జీశాట్–19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బెంగళూరు హసన్లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని.. ఉపగ్రహంలో నింపిన అపోజీ మోటార్లను మండించి భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపరుస్తారు. 17 ఏళ్లనాటి కల సాకారం భారత అంతరిక్ష సంస్థ.. ఇస్రో నమ్మినబంటు పీఎ్సఎల్వీ వాహకనౌక 1,850 కిలోల బరువున్న ఉపగ్రహాలను దిగ్విజయంగా రోదసిలోకి చేరవేస్తోంది. జీఎ్సఎల్వీ రాకెట్ 2,200 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. అంతకంటే బరువైన ఉపగ్రహాలను ప్రయోగించాలంటే మనదేశం విదేశాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో మార్పువచ్చేలా నాలుగు టన్నుల బరువున్న భారీ ఉపగ్రహాలనూ రోదసిలోకి చేరవేసేందుకు ఓ వాహకనౌకను రూపొందించుకోవాలని ఇస్రో సంకల్పించింది. జీశాట్–19తో ఉపయోగాలివీ.. జీశాట్–19 సమాచార ఉపగ్రహం బరువు 3,136 కిలోలు. ఇది దేశంలో టెలివిజన్ ప్రసారాలు, టెలికం రంగంలో విస్తృతసేవలు, ఇంటర్నెట్ వేగవంతంగా పనిచేయడమేగాక అధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి తెస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఇంటర్నెట్ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఉపగ్రహంలో కేయూ బాండ్ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్పాండర్స్తోపాటు జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ పేలోడ్స్ను అమర్చి పంపుతున్నారు. 3,136 కిలోల ఉపగ్రహంలో 1,742 కిలోల ఇంధనం నింపారు. పేలోడ్స్ బరువు 1,394 కిలోలు. జీశాట్–9 ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందిస్తుంది. -
శ్రీహరికోటలో ఉద్యోగులకు తప్పిన ప్రమాదం
నెల్లూరు: శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉద్యోగులకు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ముగ్గురు ఉద్యోగులు పని చేస్తున్న కంటైనర్లో ఆక్సిజన్ ఖాళీ కావడంతో వారందరూ శ్వాస అందక ఇబ్బంది పడ్డారు. సరైన సమయంలో స్పందించిన ఫైర్ సిబ్బంది ముగ్గురు ఉద్యోగులను ప్రాణాపాయ స్ధితి నుంచి కాపాడారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
మార్చి 31న జీఎస్ఎల్వీ ఎఫ్ 09 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి మార్చి 31న జీఎస్ఎల్వీ ఎప్–09, ఏప్రిల్లో జీఎస్ఎల్వీ మార్క్–3, అదే నెలలోనే పీఎస్ఎల్వీ సీ38 ప్రయోగాలను నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దమవుతున్నారు. ఈనెల 15న ఫ్రయోగించిన 104 ఉపగ్రహాల ప్రయోగంతో మంచి జోష్ మీదున్న ఇస్రో శాస్త్రవేత్తలు ఏకకాలంలో మూడు రాకెట్ల అనుసంధానం పనులు చేస్తున్నారు. రెండవ ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ భవనం (వీఏబీ)లో జీఎస్ఎల్వీ ఎఫ్09 అనుసంధానం పనులు జరుగుతున్నాయి. అదే విధంగా సాలిడ్ స్టేజీ అసెంబ్లింగ్ బిల్డింగ్ (ఎస్ఎస్ఏబీ)లో జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ అనుసంధానం పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎస్–200, ఎల్–110, సీ–25 అనే మూడుదశలకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయవంతమయ్యాక ఆ దశలను అనుసంధానం చేస్తున్నారు. జీఎస్ఎల్వీ ఎప్–09 రాకెట్ ద్వారా 2 టన్నుల బరువైన జీశాట్–9, జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా నాలుగు టన్నుల బరువు కలిగిన జీశాట్–19 అనే సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపించేందుకు సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నారు. మొదటి ఫ్రయోగ వేదికపై మరో వారం రోజుల్లో పీఎస్ఎల్వీ సీ38 పనులు ప్రారంభించేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఇందులో దూరపరిశీలనా ఉపగ్రహంతో పాటు వాణిజ్యపరమైన ఉపగ్రహాలుండే అవకాశం వుంది. ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించి చరిత్ర సృష్టించి ఇప్పుడు మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఈ మూడు ఫ్రయోగాలను చేసి మరో రికార్డును సృష్టించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు కృషి చేస్తున్నారు. -
విజయవంతంగా క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశో ధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఏప్రిల్లో ప్రయోగిం చబోయే జీఎస్ఎల్వీ మార్క్–3లో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్ (సీ–25) పరీక్షను ఇస్రో శాస్త్రవే త్తలు శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. తమిళనా డులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో వున్న ఇస్రో ప్రపొల్షన్ సెంటర్లో క్రయోజనిక్ ఇంజి న్ను రూపొందించి చేసిన పరీక్ష సక్సెస్ కావడంతో ఇక ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. జీఎస్ఎల్వీ మార్క్ 3 భారీ రాకెట్ ద్వారా సుమారు 4 టన్నుల బరువు కలిగిన జీశాట్–19 అనే సమాచారం ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. షార్కు చేరుకున్న ఎల్–40: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి మార్చి నెలాఖరులోపు ప్రయోగించాలనుకున్న జీఎస్ఎల్వీ ఎఫ్–09 రాకెట్కు సంబంధించిన ఎల్–40 దశ శనివారం షార్కు చేరుకుంది. ఈ దశను జీఎస్ఎల్వీ ఎఫ్–09 కోర్అలోన్ దశలో ఉపయోగిస్తారు. -
నింగిలోకి దూసుకెళ్లిన సీ-37
-
నేడే ఇస్రో అద్వితీయ ప్రయోగం
-
ఒక రాకెట్.. 104 ఉపగ్రహాలు!
► నేడే ఇస్రో అద్వితీయ ప్రయోగం ► ఉదయం 9.28కి నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ ► రికార్డు స్థాయిలో ఒకే ప్రయోగంలో కక్ష్యలోకి 104 ఉపగ్రహాలు ► కార్టోశాట్ 2డీ సహా మూడు స్వదేశీ శాటిలైట్లు అంతరిక్ష ప్రయోగాల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ప్రపంచస్థాయి ప్రయోగాలకు వేదికైన షార్ నుంచి, గెలుపు గుర్రం పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. రికార్డు స్థాయిలో ఒకే ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను గ‘ఘన’ ప్రయాణానికి సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 9.28 గంటలను ఇందుకు ముహూర్తంగా నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలను నింగికి పంపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో ఘన చరిత మరోసారి ప్రపంచానికి తేటతెల్లమవుతుంది. ఆల్ ది బెస్ట్ ఇస్రో టీమ్..! ఆల్ ది బెస్ట్ ఇండియా..!! శ్రీహరికోట (సూళ్లూరుపేట): రికార్డు స్థాయిలో ఒకే రాకెట్తో 104 ఉపగ్రహాలను నింగికి మోసుకెళ్లే అద్వితీయ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్డౌన్ ను మంగళవారం ఉదయం 5.28 గంటలకు ప్రారంభించారు. దాదాపు 28 గంటల కౌంట్డౌన్ నంతరం పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ప్రయోగం నాలుగు దశల్లో, 28.42 నిమిషాల్లో పూర్తయ్యేలా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది పీఎస్ఎల్వీకి 39వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. 714 కిలోల బరువైన కార్టోశాట్ 2డీ, ఇస్రో నానో శాటిలైట్స్ అయిన ఐఎన్ ఎస్–1ఏ, ఐఎన్ ఎస్–1బీలు స్వదేశీ ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాల్లో 96 అమెరికాకు చెందినవి కాగా, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నాయి. కార్టొశాట్ 2డీ ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ సేవలను ఐదేళ్ల పాటు అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒకే రాకెట్తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. గతంలో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకే రాకెట్తో 37 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించింది. జూన్ 2015లో ఇస్రో సైతం ఒకే ప్రయోగంలో 23 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మంగళవారం ఉదయం కౌంట్డౌన్ ప్రారంభమైన వెంటనే రాకెట్కు నాలుగో దశలో అవసరమైన 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దశలో మోనో మిథైల్ హైడ్రోజన్ (ఎంఎంహెచ్), మిక్స్డ్ ఆక్సిడైజడ్ ఆఫ్ నైట్రోజన్ (ఎంఓఎన్ –3) ఇంధనాన్ని నింపారు. అనంతరం నాలుగో దశకు అన్ని పరీక్షలు చేసి బాగుంది అని నిర్ధారించుకున్నాక సోమవారం రాత్రి రెండోదశలో అవసరమైన 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. అనంతరం ఇంధనం నింపే ప్రక్రియను పూర్తి చేసి రాకెట్కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమవుతారు. కాగా, మంగళవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ షార్ చేరుకుని కౌంట్డౌన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రాకెట్కు తుదివిడత తనిఖీలు నిర్వహించారు. ఆ తరువాత సహచర సైంటిస్టులతో సమీక్ష నిర్వహించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమవ్వాలని దేశవ్యాప్తంగా ప్రజలు పూజలు, ర్యాలీల ద్వారా తమ ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సైతం దీనిపై భారీ చర్చ సాగుతోంది. శ్రీవారి చెంత పూజలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పీఎస్ఎల్వీ సీ–37 నమూనా రాకెట్కు మంగళవారం పూజలు నిర్వహించారు. మంగళవారం ఇస్రో డైరెక్టర్లు జయరామన్, డాక్టర్ కనుంగో, డాక్టర్ జగదీశ్ శ్రీవారిని దర్శించుకున్నారు. నమూనా రాకెట్తో శ్రీవారి పాదాల చెంత పూజలు నిర్వహించారు. -
షార్కు సేవలు అభినందనీయం
సూళ్లూరుపేట: శ్రీహరికోట రాకెట్కేంద్రలోనే 25ఏళ్లు సేవలందించి, ఈ ఏడాది 9 ప్రయోగాలు విజయవంతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన ఉద్యోగుల సేవలు అభినందనీయమని షార్ డైరెక్టర్ పి.కున్హీకృష్ణన్ అన్నారు. మంగళవారం రాత్రి షార్లో బ్రహ్మప్రకాష్హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అందరి శ్రమ దాగి ఉందన్నారు. అనంతరం షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డి మాట్లాడుతూ 24 గంటలు పని చేసే మనస్తత్వం కలిగిన శ్రీహరికోట ఉద్యోగులు రాకెట్ ప్రయోగాలైనా, ప్రకృతి వైపరీత్యాలైనా మేము ఉన్నాం అని ముందుకొచ్చి పనిచేయడం నిజంగా అభినందనీయమన్నారు. 2014–15 సంవత్సరం నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 45 మంది ఉద్యోగులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో షార్ అధికారులు ఎంబీఎన్ మూర్తి, వి.రంగనాథన్, ఆర్.వెంకట్రామన్, సెల్వరాజ్, గోపీకృష్ణ పాల్గొన్నారు. -
పీఎస్ఎల్వీ సీ-36 ప్రయోగం విజయవంతం
-
పీఎస్ఎల్వీ సీ-36 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ-36 విజయవంతంగా నింగికి దూసుకెళ్లింది. సోమవారం రాత్రి 10.25 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 36 గంటల కౌంట్డౌన్ అనంతరం పీఎస్ఎల్వీ సీ-36 రాకెట్ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 17.9 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ-36 రాకెట్ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా 321 టన్నుల బరువును తీసుకుని రాకెట్ భూమి నుంచి నింగికి పయనమైంది. ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనంతోపాటు కోర్అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సాయంతో 110.48 సెకన్లకు మొదటిదశను పూర్తి చేసుకుంది. ఆ తరువాత 41.7 టన్నుల ద్రవ ఇంధనంతో 261.9 సెకన్లకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 521.7 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1,028.26 సెకన్లకు నాలుగోదశను పూర్తి చేసుకుంది. అనంతరం నాలుగోదశకు శిఖరభాగంలో పొందికగా అమర్చిన 1,235 కిలోల బరువు కలిగిన రిసోర్స్శాట్-2ఏ 1,075.26 (17.9 నిమిషాల్లో) సెకన్లకు భూమికి 827 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో 98.719 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇంధనం బరువు తగ్గించి ఉపగ్రహాల బరువును పెంచేందుకు దోహదపడేలా ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. రిసోర్స్శాట్-2ఏతో ఉపయోగాలు 2003 అక్టోబర్ 10న పీఎస్ఎల్వీ సీ5 ద్వారా రిసోర్స్శాట్-1, 2011 ఏప్రిల్ 20న పీఎస్ఎల్వీ సీ16 ద్వారా రిసోర్స్శాట్-2 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ రెండు ఉపగ్రహాలకు అనుసంధానంగా 1,235 కిలోలు బరువు కలిగిన రిసోర్స్శాట్-2ఏ రోదసీలోకి పంపించారు. భూమిపై జలవనరులు, అర్బన్ ప్లానింగ్, వ్యవసాయ రంగం, రక్షణశాఖకు ఎంతో ఉపయోగకరంగా మూడు ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఉపగ్రహంలో మూడు రకాల పేలోడ్స్ (త్రీ టైర్ ఇమేజింగ్ సిస్టం) అమర్చి పంపించారు. ఇందులో లీనర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్స్ (లిస్-3), (లిస్ -4) అనే రెండు పేలోడ్స్తోపాటు అడ్వాన్స్డ్ వైడ్ ఫీల్డ్ సెన్సార్ పరికరాలను అమర్చి పంపించారు. ప్రస్తుతం రెండు ఉపగ్రహాలు ఒకచోటును స్కానింగ్ చేసిన తరువాత మళ్లీ అదే చోటును స్కానింగ్ చేయడానికి 24 రోజుల సమయం పడుతుంది. రిసోర్స్శాట్-2ఏ ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తే మూడు ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై 12 రోజులకు ఒకసారి లోకేట్ చేస్తుంది. అంటే భూమిపై వనరుల విషయంలో అత్యుత్తమైన సేవలు అందిస్తాయి. -
పీఎస్ఎల్వీ సీ-36 ప్రయోగం నేడు
-
పీఎస్ఎల్వీ సీ-36 ప్రయోగం నేడు
- నిర్విఘ్నంగా కొనసాగుతున్న కౌంట్డౌన్ - ఉదయం 10.25 గంటలకు నాలుగు దశల్లో ప్రయోగం శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ-36 ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. సోమవారం రాత్రి 10.25 గంటలకు ప్రారంభించిన కౌంట్డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 36 గంటల కౌంట్డౌన్ అనంతరం పీఎస్ఎల్వీ సీ-36 రాకెట్ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 17.9 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ-36 రాకెట్ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించనున్నారు. ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువును తీసుకుని రాకెట్ భూమి నుంచి నింగికి పయనమవుతుంది. ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనంతోపాటు కోర్అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సాయంతో 110.48 సెకన్లకు మొదటిదశను పూర్తి చేస్తారు. ఆ తరువాత 41.7 టన్నుల ద్రవ ఇంధనంతో 261.9 సెకన్లకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 521.7 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1,028.26 సెకన్లకు నాలుగోదశను పూర్తి చేసే విధంగా లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. అనంతరం నాలుగోదశకు శిఖరభాగంలో పొందికగా అమర్చిన 1,235 కిలోల బరువు కలిగిన రిసోర్స్శాట్-2ఏ 1,075.26 (17.9 నిమిషాల్లో) సెకన్లకు భూమికి 827 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో 98.719 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు భవిష్యత్తులో ఇంధనం బరువు తగ్గించి ఉపగ్రహాల బరువును పెంచేందుకు ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు. రిసోర్స్శాట్-2ఏతో ఉపయోగాలు 2003 అక్టోబర్ 10న పీఎస్ఎల్వీ సీ5 ద్వారా రిసోర్స్శాట్-1, 2011 ఏప్రిల్ 20న పీఎస్ఎల్వీ సీ16 ద్వారా రిసోర్స్శాట్-2 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ రెండు ఉపగ్రహాలకు అనుసంధానంగా 1,235 కిలోలు బరువు కలిగిన రిసోర్స్శాట్-2ఏ రోదసీలోకి పంపుతున్నారు. భూమిపై జలవనరులు, అర్బన్ ప్లానింగ్, వ్యవసాయ రంగం, రక్షణశాఖకు ఎంతో ఉపయోగకరంగా మూడు ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఉపగ్రహంలో మూడు రకాల పేలోడ్స (త్రీ టైర్ ఇమేజింగ్ సిస్టం) అమర్చి పంపుతున్నారు. ఇందులో లీనర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్స్ (లిస్-3), (లిస్ -4) అనే రెండు పేలోడ్సతోపాటు అడ్వాన్సడ్ వైడ్ ఫీల్డ్ సెన్సార్ పరికరాలను అమర్చి పంపుతున్నారు. ప్రస్తుతం రెండు ఉపగ్రహాలు ఒకచోటును స్కానింగ్ చేసిన తరువాత మళ్లీ అదే చోటును స్కానింగ్ చేయడానికి 24 రోజుల సమయం పడుతుంది. రిసోర్స్శాట్-2ఏ ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తే మూడు ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై 12 రోజులకు ఒకసారి లోకేట్ చేస్తుంది. అంటే భూమిపై వనరుల విషయంలో అత్యుత్తమైన సేవలు అందిస్తాయి. నమూనా రాకెట్కు పూజలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పీఎస్ఎల్వీ సీ36 నమూనా రాకెట్కు పూజలు చేశారు. ఇస్రో డెరైక్టర్లు కనుంగు, అర్జునన్, సిబ్బంది నమూనా రాకెట్ను మంగళవారం గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు. -
పీఎస్ఎల్వీ సీ-36 కౌంట్డౌన్ ప్రారంభం
- బుధవారం ఉదయం 10.25 గంటలకు ప్రయోగం శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 10.25 గంట లకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ-36 ఉపగ్రహ వాహక నౌకకు 36 గంటల ముందు సోమవారం రాత్రి 10.25 కౌంట్డౌన్ ప్రారంభించారు. షార్లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని నిర్వహించి ప్రయోగంలో కొన్ని మార్పులు చేశారు. రాకెట్లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు నిర్వహించి సమావేశంలో ప్రయోగపనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ కున్హికృష్ణన్కు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో రాకెట్కు లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి చిన్న మార్పులు చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ల సిరీస్లో ఇది 38వ ప్రయోగం. 1994-2016 నుంచి ఇప్పటిదాకా 121 ఉపగ్రహాలను రోదసీలోకి పంపారు. ఇందులో 42 స్వదేశీ, 79 విదేశీ ఉపగ్రహాలు కావడం విశేషం. 2003 అక్టోబర్ 10న పీఎస్ఎల్వీ సీ5 ద్వారా రిసోర్స్శాట్-1, 2011 ఏప్రిల్ 20న పీఎస్ఎల్వీ సీ-16 ద్వారా రిసోర్స్శాట్-2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆ రెండు ఉపగ్రహాలకు ఫాలోఅప్గా బుధవారం రిసోర్స్శాట్-2ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. -
‘అంతరిక్షం’లో భారత కీర్తి ప్రత్యేకం
భారతీయ జన్యువుల్లో పరిశోధన సంపత్తి ఏయూ వీసీ నాగేశ్వరరావు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం ఏయూక్యాంపస్ : అపజయ మెరుగని విజయాల చరిత్ర భారత అంతరిక్ష రంగం సొంతమని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో శనివారం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. అణుశాస్త్రం, అంతరిక్ష రంగాలలో అగ్రదేశాలకు మించిన ప్రగతిని భారతదేశం సాధిస్తుందన్నారు. భారతీయుల జన్యువులలో పరిశోధన ఆసక్తి, జ్ఞానం దాగి ఉన్నాయన్నారు. యువత శాస్త్ర సంబంధ అంశాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి కనబరచాలని సూచించారు. షార్ డిప్యూటీ డైరెక్టర్ వి.రంగనాథన్ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయోగాల అనువర్తనాలు అపారమన్నారు. హుద్హుద్ సమయంలో శాటిలైట్ సహాయంతో వాతావరణ మార్పులను ప్రభుత్వానికి అందించడం జరిగిందన్నారు. తద్వారా ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు. దేశంలో వ్యవసాయ రంగం ప్రగతి, పంటల విస్తృతిని గణించడానికి ఈ సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. మత్స్యకారులకు మత్స్య సంపదను అందించడానికి, ప్రమాదంలో ఉన్న సమయాలలో ఆదుకోవడానికి శాటిలైట్ల సహకారం తీసుకుంటున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్తో విభిన్న రంగాలకు అవసరమైన సేవలను అందించే దిశగా పనిచేస్తున్నామన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ప్రపంచ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందన్నారు. ఇస్రో ప్రగతి, పటిమను విద్యార్థులకు తెలియజేస్తూ వారిని శాస్త్ర అధ్యయనం దిశగా నడిపించాలన్నారు. షార్ డీజీఎం బి.వి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ శాంతికి, దేశ ప్రగతికి శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించడం జరుగుతోందన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. దేశంలోని 14 ప్రాంతాలలో ఈ తరహా కార్యక్రమాలను విద్యార్థుల మధ్య నిర్వహిస్తున్నామన్నారు. స్పేస్ టెక్నాలజీ రంగంలో భారత్ స్వయం సంమృద్ధి సాధించి సుసంపన్నం అయ్యిందన్నారు. యువతరం పరిశోధన రంగంలో అడిగిడాలని సూచించారు. షార్ను దర్శించాలని విద్యార్థులను ఆహ్వనించారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. ఇస్రో ప్రయోగాలు, పనితీరును వివరించే ప్రదర్శన, సమాచార కరపత్రాలు ఆకట్టుకున్నాయి. సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాకెట్ నమూనాలు విద్యార్థులలో ఆసక్తిని కలిగించాయి. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధక్షుడు ఆచార్య పి.విజయప్రకాష్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్, ఆచార్య కె.వి.ఎస్.ఆర్ ప్రసాద్, రాజశేఖర్, షార్ అధికారులు పాల్గొన్నారు. -
షార్లో అప్రమత్తత
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశానికే తలమానికమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో కూడా అప్రమత్తత ప్రకటించారు. షార్కు నిత్యం పహారా కాస్తున్న కేంద్ర ప్రాథమిక భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సుభాష్ సిన్హా తెలిపారు. హైఅలర్ట్తో సిబ్బంది నిత్యం మరో మూడు గంటలపాటు అదనంగా విధులు నిర్వహిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులను అప్రమత్తం చేశారు. షార్ ఐల్యాండ్కు దక్షిణాన పల్వేరికాడ్ వైపు, ఉత్తరాన రాయదొరువు వైపు, సముద్రతీరప్రాంతం వైపు ప్రత్యేకంగా సాయుధ దళాలను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి భద్రతా సిబ్బందితో నాలుగు మొబైల్ పార్టీలను గస్తీ ఏర్పాటు చేశారు. బకింగ్హాం కెనాల్, అటకానితిప్ప, షార్ పరిసర ప్రాంతాల్లోనూ గస్తీని ముమ్మరం చేశారు. పులికాట్ సరస్సులో, బంగాళాఖాతంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని జాలర్లకు ఆదేశాలిచ్చారు. షార్లోకి అపరిచిత వ్యక్తులు చొచ్చుకు రాకుండా చూసేందుకు కూడా సరిహద్దుల్లో సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. షార్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి సతీష్ ధవన్
షార్ డైరెక్టర్ పీ కున్హికృష్ణన్ షార్లో ఘనంగా ధవన్ జయంతి వేడుకలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పితామహుల్లో ప్రొఫెసర్ సతీష్ ధవన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకోవచ్చునని, ఆయన హయాంలోనే భారత అంతరిక్ష ప్రయోగాల బుడి బుడి అడుగులతో ప్రారంభమయ్యాయని షార్ డెరెక్టర్ పీ కున్హికృష్ణన్ పేర్కొన్నారు. అంతరిక్ష పితామహుల్లో తొలితరం శాస్త్రవేత్త అయిన సతీష్ ధవన్ 97వ జయంతి ఉత్సవాలను ఆదివారం షార్లో ఘనంగా జరుపుకున్నారు. షార్లోని రెండోగేట అవతలవైపు ఉన్న సతీష్ ధవన్ మెమోరియల్లో ఆయన విగ్రహానికి, బ్రహ్మప్రకాష్ హాల్లో ఉన్న ఆయన చిత్రపటానికి షార్ డైరెక్టర్ పీ కున్హికృష్ణన్, వీఎస్ఎస్సీ డైరెక్టర్ డాక్టర్ పీ శివన్ పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష ప్రయోగాల్లో తొలితరం శాస్త్రవేత్తల్లో ఒకరైన సతీష్ ధవన్ ఇస్రో అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. అంతరిక్ష ప్రయోగాలు చేయాలని తొలినాళ్లలో ఎంటీసీఆర్ ఆంక్షలతో ఇతర దేశాలు మనకు సాంకేతిక పరిజ్ఞానం అందించకపోవడంతో దాన్ని సవాల్గా తీసుకుని డాక్టర్ విక్రమ్సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్ లాంటి ఎందరో శాస్త్రవేత్తలు తమ మేధా సంపత్తితో అంతరిక్ష శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించారన్నారు. తొలినాళ్లలో సౌండింగ్ రాకెట్లు ప్రయోగించే స్థాయి గ్రహాంతర ప్రయోగాలు చేయడమే కాకుండా ఖగోళ పరిశోధన, నావిగేషన్ ఏర్పాటు చేసుకోవడం వంటì ఉపగ్రహాలను తయారు చేసి పంపించే స్థాయికి ఎదిగామంటే ఆనాడు సతీష ధవన్ లాంటి శాస్త్రవేత్తలు వేసి బీజమేనన్నారు. ఆయన ఆలోచనలకు ప్రతిరూపమే నేడు షార్ రెండో ప్రయోగవేదిక అని చెప్పారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ శివన్, కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, గ్రూప్ డైరెక్టర్ పీ విజయసారధితో పాటు పీఎస్ఎల్వీ సీ35 ప్రయోగానికి విచ్చేసిన శాస్త్రవేత్తలందరూ నివాళులర్పించారు. అదే విధంగా సూళ్లూరుపేట పట్టణంలోని కేఆర్పీ కాలనీ సమీపంలో ఉన్న సతీష్ ధవన్ స్మారక ఆసుపత్రిలో కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి సన్నాహాలు
సూళ్లూరుపేట: పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ను షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ మార్కెట్ దుస్థితిని మున్సిపల్ అధికారులు గతంలో షార్ అధికారుల దష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నూతన నిర్మాణానికి సహకారం అందించేందుకు వారు అంగీకరించారు. రూ.2 కోట్లు అంచనాలతో 44 గదులను నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో కంట్రోలర్ రాజారెడ్డి మార్కెట్ను పరిశీలించారు. వెంటనే గదులను ఖాళీ చేసి అప్పగిస్తే సుందరంగా తీర్చిదిద్ది ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. మొదట షార్ కంట్రోలర్కు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్.విజయలక్ష్మి, కమిషనర్ పాయసం వెంకటేశ్వర్లు ఘనస్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో డీఈ చంద్రయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రెండు ప్రయోగాలకు సిద్ధమవుతోన్న ఇస్రో
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగస్టులో రెండు ప్రయోగాలకు సిద్ధమవుతోంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ లో జూన్ 30 నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-06 అనుసంధానం పనులను ప్రారంభించారు. తొలి దశలో అమర్చే 5 సెగ్మెంట్లులో ఇప్పటికే నాజల్ సెగ్మెంట్, మిడిల్ సెగ్మెంట్ అనుసంధానం చేయగా, సోమవారం మిడిల్-2 సెగ్మెంట్ను అనుసంధానం చేయనున్నారు. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి పీఎస్ఎల్వీ సీ35 అనుసంధానం పనులను మొదటి ప్రయోగవేదికపై ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
అంతరిక్షంలో ‘స్వదేశీ’యానం
స్వదేశీ స్పేస్ షటిల్ నమూనా ప్రయోగం దిగ్విజయం ఆర్ఎల్వీ-టీడీని షార్ నుంచి విజయవంతంగా పరీక్షించిన ఇస్రో శ్రీహరికోట (సూళ్లూరుపేట) : అంతరిక్ష యాత్రలో భారత్ మరో ముందడుగు వేసింది. తొలి ‘స్వదేశీ’ అంతరిక్షనౌకను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. రెక్కలతో కూడిన పునర్వినియోగించగల వాహక నౌక (ఆర్ఎల్వీ-టీడీ) ను నింగికి పంపి తిరిగి తీసుకువచ్చే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసింది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం మరింత సులభంగా, చౌకగా మారేందుకు దోహదం చేయగల ఈ కీలకమైన ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో గల సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా నిలిచింది. అంతరిక్షనౌక తయారీలో భాగంగా చేపట్టిన ప్రయోగాల తొలి అంకంలో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ - టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ - టీడీ)ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఈ మానవ రహిత నమూనా వ్యోమనౌక ప్రయోగానికి ఆదివారం అర్థరాత్రి దాటాక ఒంటి గంటకు కౌంట్డౌన్ ప్రారంభించారు. సరిగ్గా సోమవారం ఉదయం 7 గంటలకు షార్ మొదటి ప్రయోగవేదిక నుంచి ప్రత్యేక రాకెట్ బూస్టర్ మీద అమర్చిన అంతరిక్షనౌకను నింగిలోకి పంపించారు. రాకెట్ బూస్టర్ 65 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకు వెళ్లి అక్కడ నౌకను విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఈ నౌక ధ్వని వేగం కన్నా ఐదు రెట్ల వేగంతో భూ వాతావరణంలోకి తిరిగి రావటం మొదలుపెట్టింది. నౌకలోని నావిగేషన్, మార్గదర్శనం, నియంత్రణ వ్యవస్థ ద్వారా దానిని ఖచ్చితంగా నడుపుతూ కిందికి దించారు. భూ వాతావరణంలోకి ప్రవేశించేటపుడు ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలను ఈ నౌక థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా విజయవంతంగా తట్టుకుంది. అనంతరం.. బంగాళాఖాతంలో ముందే నిర్ణయించిన ఊహాజనిత రన్వేపైకి విజయవంతంగా దించారు. దీనిని నేలపై దించటానికి పెద్ద రన్వే అవసరం. కానీ షార్లో ఆ సౌకర్యం లేకపోవడంతో.. శ్రీహరికోటకు 450 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై విజయవంతంగా దిగటంతో ఈ ప్రయోగపు లక్ష్యం నెరవేరింది. అయితే.. ఈ వ్యోమనౌకను నీటిలో తేలే విధంగా రూపొందించకపోవటంతో అది సముద్రతలాన్ని తాకగానే ముక్కలైంది. కాబట్టి దానిని తిరిగి తీసుకురాలేదు. శ్రీహరికోటతో పాటు.. సముద్రం మీద ఒక ఓడలో ఏర్పాటు చేసిన టెర్మినల్ నుంచి ఈ అంతరిక్ష నౌక గమనాన్ని ఆద్యంతం పరిశీలిస్తూ నియంత్రించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ విభాగాలు.. సముద్రం మీద విండ్ మెజర్మెంట్, షిప్ బర్న్ టెలీమెట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించాయి. ఇది నింగిలోకి వెళ్లి తిరిగి నేలకు దిగటానికి పట్టిన మొత్తం ప్రయాణ సమయం 770 సెకన్లు. అంటే 12.50 నిమిషాల్లోనే ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయోగం ద్వారా.. ఆర్ఎల్వీ-టీడీ స్వీయ నియంత్రిత మార్గ ప్రయాణం, మార్గదర్శనం, నియంత్రణ, పునర్వినియోగించగల థర్మల్ రక్షణ వ్యవస్థ, పునఃప్రవేశ కార్యక్రమ నిర్వహణ వంటి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాలను విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఖర్చు తగ్గించేందుకు అనేక ఉపాయాలు... ఆర్ఎల్వీ ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చు పదిరెట్ల వరకూ తగ్గుతుందని అంచనా. ఇంకా ఖర్చు తగ్గించే దిశగా ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రస్తుతం 2.2 టన్నుల ఉపగ్రహాలను ప్రయోగించేందు కు అవకాశముండగా.. ఈ సామర్థ్యాన్ని 3.5 టన్నులకు పెంచడం ర్వారా ఒక్కో కిలోగ్రాము బరువును అంతరిక్షంలోకి పంపేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఇదే రాకెట్ ఆధునిక రూపం మార్క్-2 సామర్థ్యాన్ని కూడా నాలుగు టన్నుల నుంచి 7.5 టన్నులకు పెంచే ప్రయత్నాల్లో ఉంది. దీంతోపాటు వీటిలో ఉపయోగించే వికాస్ బూస్టర్లలో సెమీక్రయోజెనిక్ ఇంజన్లను (ఆర్ఎల్వీ-టీడీలో ఉపయోగించారు) వాడటం ద్వారా వాటి బరువును తగ్గించవచ్చునని, తద్వారా మొత్తం వాహక నౌక తయారీకయ్యే ఖర్చు కూడా తగ్గుతుందని అంచనా. పూర్తిస్థాయి తయారీకి మరో పదేళ్లు... అమెరికాకు చెందిన నాసా 2011లో స్పేస్ షటిల్ కార్యక్రమాన్ని నిలిపివేసిన తర్వాత.. అంతరిక్ష కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపించేందుకు పునర్వినియోగించగల స్పేస్ షటిల్ తయారీ పోటీలోకి భారత్ కూడా ప్రవేశించింది. ఉపగ్రహాలను భూమి చుట్టూ అంతరిక్ష కక్ష్యలోకి చేర్చి మళ్లీ భూమికి తిరిగి రాగల అంతరిక్షనౌకను అభివృద్ధి చేయటం ద్వారా.. ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు అయ్యే ఖర్చును పదింతలు తగ్గించటం లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. అటువంటి పునర్వినియోగించగల రాకెట్ను అభివృద్ధి చేయటంలో ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం చాలా ప్రాథమిక దశ. అమెరికా అంతరిక్షనౌకను పోలివున్న ఈ ఆర్ఎల్వీ-టీడీ నిడివి 6.5 మీటర్లు. ఇది వాస్తవంగా తయారు చేయదలచుకున్న అంతిరక్ష నౌక నిడివిలో ఆరో వంతు మాత్రమే. దీని బరువు 1.75 టన్నులు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 95 కోట్లు వ్యయం చేసింది. పూర్తిస్థాయిలో తుది రాకెట్ను రూపొందించటానికి ముందు ఈ తరహా ప్రయోగాలు రెండు, మూడు నిర్వహించాల్సి ఉంటుందని.. తుది స్పేస్ షటిల్ను సిద్ధం చేయటానికి 10-15 ఏళ్ల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొత్త సాంకేతికతల ఆవిష్కరణ... ద్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల వ్యోమనౌకను ఇస్రో అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు అనేక కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించారు. బూస్టర్ రాకెట్లో వాడిన ఇంధనం నెమ్మదిగా మండేలా చేయడం వీటిలో ఒకటి. వ్యోమనౌకలో వాడిన సిలికా టైల్స్ వాటర్ ప్రూఫింగ్ కోసం ప్రత్యేకమైన రసాయనాన్ని అభివృద్ధి చేశారు. ఆర్ఎల్వీ-టీడీ ముందు భాగంలోని శంఖు ఆకారపు నిర్మాణాన్ని కార్బన్- కార్బన్ మిశ్రధాతువుతో తయారు చేశారు. భారీ సైజున్న విమానం తనంతట తానే ల్యాండ్ అయ్యేలా చేయడం కూడా ఇస్రో సాధించిన ఘనతల్లో ఒకటిగా చెప్పవచ్చు. తొలిదశ రాకెట్ల పునర్ వినియోగం ఆర్ఎల్వీ-టీడీ వ్యోమనౌక 65 కిలోమీటర్ల ఎత్తుకు రెండు దశల్లో చేరింది. తొలి దశలో ఉపయోగించిన రాకెట్.. మధ్యలోనే ఆర్ఎల్వీ-టీడీ నుంచి విడిపోయి బంగాళాఖాతంలో పడిపోయింది. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీల్లోనూ తొలి దశ రాకెట్ భాగాలు ఇలాగే వృథా అవుతుంటాయి. వీటిని కూడా మళ్లీమళ్లీ వాడుకునేలా చేయగలిగితే ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. జీఎస్ఎల్వీ మార్క్- 3 తొలి దశ, దానికి తోడుగా ఉండే నాలుగు స్ట్రాప్ ఆన్ బూస్టర్ల ఖర్చు మొత్తం ప్రాజెక్టు ఖర్చులో మూడొంతుల వరకూ ఉంటుందని అంచనా. తొలి దశ రాకెట్ విడిపోయిన తరువాత అది అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. కీలక టెక్నాలజీలు సక్సెస్ ‘‘ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతం కావడాన్ని పునర్వినియోగించగల వ్యోమనౌకల తయారీ దిశగా ఇస్రో వేసిన తొలి అడుగుగా చూడాలి. అంతరిక్ష రంగంలో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపయోగపడే ఈ వ్యోమనౌక తయారీలో ఇంకా అనేక మజిలీలు ఉన్నాయి. నావిగేషన్ మొదలుకొని, భూమి పైకి తిరిగి రావటం, ప్యారాచ్యూట్ తదితర ఇతర టెక్నాలజీలన్నీ తొలి ప్రయోగంలోనే విజయవంతం కావడం మనకు గర్వకారణం. ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం ద్వారా లభించిన సమాచారంతో ఉన్న చిన్నపాటి లోటుపాట్లను కూడా సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ఇస్రో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తారనడంలో సందేహం లేదు. - జి.సతీశ్రెడ్డి (రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, డెరైక్టర్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్, హైదరాబాద్) -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. గురువారం ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ32 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పీఎస్ఎల్వీ-సీ32 రాకెట్ ను నింగిలోకి విజయవంతగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 20 నిమిషాల తర్వాత రాకెట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 1425 కిలోలు బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1ఎఫ్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ32 రోదసీలోకి మోసుకెళ్లింది. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇక పీఎస్ఎల్వీ సీ-32 ప్రయోగం విజయవంతంతో షార్లో సంబరాలు జరుపుకుంటున్నారు. -
పీఎస్ఎల్వీ సీ32 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ సీ32 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 54 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ తర్వాత సతీష్ ధవన్ స్పేస్సెంటర్(షార్) నుంచి ఆకాశంలోకి ప్రయోగించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 1425 కిలోలు బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1ఎఫ్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ32 రోదసీలోకి మోసుకెళ్లింది. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్లో ఇది ఆరో ఉపగ్రహం. -
నెల్లూరు షార్ లో అగంతకుడు
శ్రీహరి కోట రాకెట్ కేంద్రంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎస్.కరణ్(33) అనే వ్యక్తిని షార్ భద్రతా సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. అనంతరం శ్రీహరి కోట పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా నవగార్ తాలుకా పరిధిలోని మొహిత్రి గ్రామానికి చెందిన కరణ్ దక్షిణం వైపు కేటీఎన్ గేట్ వద్ద తిరుగుతుండగా.. భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది ప్రశ్నించగా.. తాను సముద్రం అంచునే నడిచి వచ్చానని తెలిపాడు. అతడి సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు అప్పగించారు. -
పీఎస్ఎల్వీ సీ-30 ప్రయోగం విజయవంతం
-
పీఎస్ఎల్వీ సీ-30 ప్రయోగం విజయవంతం
-
హాఫ్ సెంచరీ కొట్టిన భారత్
విదేశీ శాటిలైట్స్ ప్రయోగంలో హాఫ్ సెంచరీ శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ఖగోళ పరిశోధన కోసం చేసిన పీఎస్ఎల్వీ సీ30 ప్రయోగం విజయవంతమవడంతో విదేశీ శాటిలైట్స్ ప్రయోగంలో భారత్ హాఫ్ సెంచరీ చేసినట్టయింది. పీఎస్ఎల్వీ సీ30 ప్రయోగంలో ఆరు విదేశీ శాటిలైట్స్ను పంపారు. ఇండోనేసియాకు చెందిన 76 కిలోల లపాన్-ఏ2, కెనడాకు చెందిన 14 కిలోల ఎన్ఎల్ఎస్14, అమెరికాకు చెందిన 28 కిలోల లీమూర్ అనే నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపారు. ఈ ఆరు విదేశీ ఉపగ్రహాలతో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50 ని దాటింది. ఇప్పటి వరకూ ఇస్రో 45 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫీజు తీసుకుని ఇస్రో ఇలా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వస్తోంది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇది మూడో సారి. -
పీఎస్ఎల్వీ సీ-30 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం చేసిన పీఎస్ఎల్వీ సీ30 ప్రయోగం విజయవంతంమైంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్ను పంపించారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగి సోమవారం ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ30 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం ప్రారంభంకావడానికి కొద్దినిమిషాల ముందు లాంచ్ కోసం వెహికిల్ డైరెక్టర్ కు మిషన్ డైరెక్టర్ అనుమతి ఇచ్చారు. దాంతో ఆటో మెటిక్ లాంచ్ సీక్వేన్స్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. పదేళ్ల శ్రమ ఫలితమే ఆస్ట్రోశాట్.. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేసిన తొలి ప్రయోగం ఇది. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి దీన్ని ప్రయోగించారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి, న్యూట్రాన్స్టార్స్, బ్లాక్హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం, మన గెలాక్సీ ఆవల పరిస్థితుల గురించి అధ్యయనం కోసం ఆస్ట్రోశాట్ను ప్రయోగించారు. ఆస్ట్రోశాట్ వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం ఉంది. ఈ ఉపగ్రహంలో ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలిస్కోప్, లార్జ్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్, సాప్ట్ ఎక్స్రే టెలిస్కోప్, కాడ్మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. ఆస్ట్రోశాట్లో అమర్చిన ఐదు పేలోడ్స్ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది. ఈ శాటిలైట్ జీవితకాలాన్ని ఐదేళ్లుగా అంచనా వేస్తున్నారు. -
ఇస్రో సూపర్ సిక్స్
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం మరో ఘనమైన విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని షార్ వేదికగా ఇస్రో గురువారం ప్రయోగించిన జీఎస్ఎల్వీ - డీ6 రాకెట్.. 2,117 కిలోల బరువున్న జీశాట్-6 ఉపగ్రహాన్ని దిగ్విజయంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్లో వినియోగించిన క్రయోజనిక్ ఇంజన్.. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజన్ కావటం ఈ ప్రయోగంలో ప్రధాన విశేషం. దేశీయ క్రయోజనిక్ ఇంజన్ వినియోగంతో ఇస్రో మూడు రాకెట్లు ప్రయోగించగా.. తొలి రాకెట్ విఫలమవగా.. వరుసగా రెండు రాకెట్లు విజయవంతమయ్యాయి. దీంతో.. శాస్త్రవేత్తల్లో విజయగర్వం తొణికిసలాడుతోంది. అత్యంత బరువైన ఉపగ్రహాలను ఇతర దేశాల మీద ఆధారపడకుండా దేశీయంగానే ప్రయోగించే సామర్థ్యాన్ని ఇస్రో బలోపేతం చేసుకున్నట్లయింది. జీశాట్ ఉపగ్రహాల వరుసలో తాజాగా ప్రయోగించిన జీశాట్-6 రజతోత్సవ ఉపగ్రహం కావటం ఒక విశేషమైతే.. ఉపగ్రహ వాహకనౌక ‘సిక్స్’ కావటం, ఉపగ్రహం కూడా ‘సిక్స్’ కావటమే కాదు.. జీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగంలో కూడా ఇస్రోకు ఇది ఆరో విజయం. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో 48వ విజయం. జీఎస్ఎల్వీ డీ6 రాకెట్తో నింగిలోకి జీశాట్-6 ప్రయోగం స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్తో రెండవ విజయం ♦ రజతోత్సవ జీశాట్-6 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి పంపిన రాకెట్ ♦ రక్షణ, అంతరిక్ష, వైమానిక రంగాలకు భద్రమైన సమాచార వ్యవస్థ ♦ ఈ విజయం శాస్త్రవేత్తల 17 ఏళ్ల కృషి ఫలితం: ఇస్రో చైర్మన్ కితాబు సాక్షి, శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఆంధ్రప్రదేశ్లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్). గురువారం సాయంత్రం 4:30గంటల సమయం. మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తల వదనాల్లో ఉత్కంఠ. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ ను వినియోగించి మూడోసారి చేస్తున్న ప్రయోగం. ఈ ఇంజన్తో తొలి ప్రయోగం విఫలమైంది.. మలి ప్రయోగం విజయవంతమైంది. మూడో ప్రయోగ మూ దిగ్విజయం కావాలన్న పట్టుదల. ఈ ఇంజన్ తో జీఎస్ఎల్వీ - డీ6 రాకెట్ ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 11:52 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 29 గంటలు నిర్విఘ్నంగా కొనసాగింది. గురువారం సాయంత్రం 4:52 గంటలకు.. సిక్స్, ఫైవ్, ఫోర్, త్రీ, టు, వన్, జీరో అనగానే ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పు దిక్కున ఆకాశం వైపు మళ్లాయి. క్షణాల్లో ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ జీఎస్ఎల్వీ- డీ6 నింగిలోకి దూసుకెళ్లింది. నిర్దేశిత గమనంలో దశల వారీగా విజయవంతంగా ప్రయాణించింది. బయల్దేరిన తర్వాత సరిగ్గా 17:04 నిమిషాల్లో జీశాట్-6 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మిషన్ కం ట్రోల్ రూంలోని శాస్త్రవేత్తల్లో విజయగర్వం తొణికిసలాడింది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. విజయానంతరం ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్కుమార్ మాట్లాడుతూ ఇది సమష్టి విజయమని పేర్కొన్నారు. క్రయోజనిక్ ఇంజన్ను రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు 17ఏళ్లుగా చేసిన కృషి ఫలించిందని ప్రశంసించారు. రాకెట్ ప్రయోగం సాగిందిలా:జీఎస్ఎల్వీ-డీ6 ప్రయోగంలో.. 170.4 టన్నుల నాలుగు ద్రవ ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లతో పాటు కోర్అలోన్ దశలో 138.1 టన్నుల ఘన ఇంధనం సాయంతో 151సెకన్లలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశారు. 39.5 టన్నుల ద్రవ ఇంధనం సాయం తో 293 సెకన్లలో రెండో దశను దిగ్విజయంగా పూర్తిచేశారు. తరువాత అత్యంత కీలక దశ అయిన మూడో దశను కూడా 12.8 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,012 సెకన్లలో పూర్తి చేశారు. మొత్తం 17.04 నిమిషాల్లోనే 170 కిలోమీటర్లు పెరూజీ (భూమికి అతి దగ్గరగా), 35,975 కిలోమీటర్లు అపోజి (భూమికి దూరంగా) భూ సమాంతర కక్ష్యలో 19.95 డిగ్రీల వాలులో జీశాట్-6 ఉపగ్రహాన్ని విజయవంతంగా చేర్చింది. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం ఆరోగ్యంగా ఉన్నట్లు హసన్ (కర్ణాటక) లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది. మాస్టర్కంట్రోల్ శాస్త్రవేత్తలు జీశాట్-6 ఉపగ్రహం లో ఉన్న ఇంధనాన్ని మండించి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 74 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద స్థిరపరిచే ప్రక్రియ చేపడతారు. ఇస్రో ప్రయోగించిన 25 సమాచార ఉపగ్రహాలలో ప్రస్తుతం 10 సమాచార ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో పనిచేస్తూ 225 ట్రాన్స్పాండర్లతో దేశవాళికి డీటీహెచ్ ప్రసారాలు, టెలికం సేవలు, టెలీ మెడిసన్, టెలీ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తున్నాయి. సమాచార రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుండడంతో అందుకు తగినట్టుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు దేశంలో 500 ట్రాన్స్పాండర్ల దాకా డిమాండ్ ఉన్నాయి. రాబోయే మూడు, నాలుగేళ్లలో 450 ట్రాన్స్పాండర్లను అందుబాటులోకి తేవటం ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఉపగ్రహం ఉపయోగాలు జీశాట్-6 సమాచార ఉపగ్రహ ప్రయోగంతో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. దీనిద్వారా రక్షణ, అంతరిక్ష, వైమానిక రంగాలకు మరింత భద్రమైన సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. శాటిలైట్ ఫోన్లతో ఈ వర్గాల వారు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఇతర ప్రాంతాల వారితో సంభాషించేందుకు అవకాశమేర్పడుతుంది. జీశాట్ -6లో ఎస్ బ్యాండ్ ద్వారా 5 స్పాట్ బీమ్స్, సీ బ్యాండ్లో ఒక జాతీయ స్థాయి బీమ్ అందుబాటులోకి వస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీని అత్యంత సమర్థంగా వాడుకునేందుకు ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. మొబైల్ ఫోన్లలో సమాచారాన్ని సురక్షితంగా ఇచ్చిపుచ్చుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. గతంలో ఏ ఉపగ్రహంలో లేని అతి పెద్ద యాంటెన్నాను ఈ ఉపగ్రహంలో ఏర్పాటు చేశారు. ఆరు మీటర్ల వ్యాసార్థం కలిగిన ఈ యాంటెన్నా వల్ల ఉపగ్రహం నుంచి సమాచారాన్ని ఎక్కువగా తెలుసుకునే వీలుంటుంది. ఈ ఉపగ్రహం తొమ్మిదేళ్ల పాటు సేవలందిస్తుందని ఇస్రో ప్రకటించింది. ‘అద్భుత విజయం’ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: జీశాట్-6ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించిన ఇస్రో బృందానికి ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావులు అభినందనలు తెలిపారు. ఇది భారత శాస్త్రవేత్తల అద్భుత విజ యమని ప్రధాని ట్విటర్లో అభినందించారు. ఈ గెలుపు మరో గర్వకారణమైనదని సోనియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని చంద్రబాబు అన్నారు. ఇస్రో మరెన్నో విజయాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రయోగం వివరాలివీ... ప్రయోగ వ్యయం : రూ. 210 కోట్లు జీఎస్ఎల్వీ-డీ6 రాకెట్ ఖర్చు : రూ. 160 కోట్లు జీశాట్-6 ఉపగ్రహం ఖర్చు : రూ. 50 కోట్లు జీఎస్ఎల్వీ డీ6 రాకెట్ పొడవు : 49.1 మీటర్లు రాకెట్ ప్రయోగంలో మొత్తం బరువు : 416 టన్నులు జీశాట్-6 ఉపగ్రహం మొత్తం బరువు : 2,117 కిలోలు ఉపగ్రహంలో ఇంధనం బరువు : 1,132 కిలోలు కేవలం ఉపగ్రహం బరువు : 985 కిలోలు నింగికి చేరిన సమయం : 17.04 నిమిషాలు -
జీఎస్ఎల్వీ డీ6 ప్రయోగం సక్సెస్
-
జీఎస్ఎల్వీ డీ6 ప్రయోగం సక్సెస్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష కీర్తి కీరిటంలో మరో కలికితురాయి చేరింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్ దశతో వరుసగా రెండోసారి విజయాన్ని అందుకుంది. ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ డీ6 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. గురువారం సాయంత్రం 4.52 గంటలకు జీఎస్ఎల్వీ డీ6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జీశాట్-6 ఉపగ్రహాన్ని 1,024 సెకన్ల తర్వాత నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. మిషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరన్ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో ద్వారా డిజిటల్ మల్టీమీడియాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో తెలిపింది. జీశాట్-6 ఉపగ్రహం 9 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. దేశ కమ్యూనికేషన్ వ్యవస్థలో 25వ శాటిలైట్ గా జీశాట్-6 నిలవనుంది. ఈ ప్రయోగానికి రూ.250 కోట్లు వ్యయం అయింది. -
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ డీ6
-
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ డీ6
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ డీ6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్డౌన్ ప్రారంభమైన 29 గంటల అనంతరం గురువారం సాయంత్రం 4.52 గంటలకు దీన్ని ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ జీఎస్ఎల్వీ డీ6 అంతరిక్షంలోకి దూసుకుపోయింది. 2,117 కిలోలు బరువున్న జీశాట్-6 ఉపగ్రహాన్ని నింగికి మోసుకెళ్లింది. 1,024 సెకన్లకు 170 కిలోమీటర్ల పెరూజీ (భూమికి అతి దగ్గరగా), 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా) 19.95 డిగ్రీల భూ సమాంతర కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్ దశతో రెండోసారి చేస్తున్న ప్రయోగం ఇది. -
షార్లో గుర్తు తెలియని వ్యక్తి సంచారం
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని షార్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం రెండవ లాంచ్ప్యాడ్ వద్ద సుమారు 25 ఏళ్ల వయసున్న వ్యక్తి సంచరిస్తుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. తన పేరు వెంకటేష్ అని అతడు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం. మతిస్థిమితం లేనివాడిగా భావిస్తున్నారు. తమిళనాడులోని వేలూరుకి చెందిన వ్యక్తి అని ప్రాథమికంగా తెలిసింది. కాగా, ఈ నెల 27న జీఎస్ఎల్వీ డీ 6 ప్రయోగం ఉన్న నేపథ్యంలో ఇలా ఓ వ్యక్తి పట్టుబడడం అధికారుల్లో అలజడి రేపింది. -
జీఎస్ఎల్వీ డీ6 ప్రయోగానికి రంగం సిద్ధం
నెల్లూరు: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 27న రోదసిలోకి పంపనున్న జీశాట్-6 ఉపగ్రహ ప్రయోగానికి బుధవారం మొదటి అడుగు పడింది. జీఎస్ఎల్వీ డీ6 ఉపగ్రహ వాహక నౌకను రాకెట్ అనుసంధాన భవనం నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. 24న ప్రయోగ సన్నాహాలు చేయనున్నారు. 26 వ తేదీ మధ్యాహ్నం 11.52 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. 27వ తేదీ సాయంత్రం 4.52 గంటలకు రోదసీలోకి ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ డీ6 రాకెట్ ద్వారా 2,200 కిలోల బరువు గల జీశాట్-6ను రోదసిలోకి పంపనున్నారు. దీని ద్వారా డిజిటల్ మల్టీమీడియాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో తెలిపింది. -
'షార్' లో వివాదం
శ్రీహరికోట (నెల్లూరు) : షార్లో పని చేసే కాంట్రాక్ట్ లేబర్, సీఎస్ఎఫ్ పోలీసులకు మధ్య వివాదం చెలరేగింది. ఈ సంఘటన సోమవారం శ్రీహరికోటలోని షార్లో వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది కార్మికులు శ్రీహరికోట షార్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. కాగా ఆదివారం శెలవు కావడంతో 10 మంది కార్మికులు సాయంత్రం షార్ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఒక సీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇది చూసి వారిని దూషించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు అతనిపై దాడి చేశారు. ఈ విషయం మరి కొంతమంది సీఎస్ఎఫ్ కానిస్టేబుల్స్కు తెలియడంతో వారు అక్కడికి చేరుకున్నారు. విషయం పెద్దదై పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై సోమవారం కార్మికులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది. -
షార్ శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : షార్ శాస్త్రవేత్తలకు అభినందనల పరంపర కొనసాగుతోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం షార్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్వీ సీ- 23 ప్రయోగం విజయవంతం కావటంపై ఆయన అభినందించారు. అంతరిక్ష ప్రయోగ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ ఎదుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. భారత్ కీర్తి కిరీటంలో పీఎస్ఎల్వీ సి-23 ప్రయోగం మరో మైలురాయిగా ఆయన అభివర్ణించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా శాస్త్రవేత్తలను అభినందనలు తెలిపారు. అంతకు ముందు ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాకెట్ వివిధ దశలను దాటుతూ కక్ష్యలోని విజయవంతంగా ప్రవేశించగానే శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ23
నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో మైలురాయిని దాటింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ23 రాకెట్ సోమవారం ఉదయం 9.52 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహననౌక పీఎస్ఎల్వీ సీ23 ఫ్రాన్స్కు చెందిన 714 కిలోల స్పాట్ 07, జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్ఎల్ఎస్-7.1, ఎన్ఎల్ఎస్ 7.2 ఉపగ్రహాలు, సింగపూర్కు చెందిన 7 కిలోల వెలాక్సీ, ఇస్రోకు చెందిన 60 కిలోల అడ్వాన్స్డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్ఎస్)ను నింగిలోకి తీసుకెళ్లింది. షార్ నుండి ఇప్పటివరకు మొత్తం 42 ప్రయోగాలు జరిగాయి. ఈ పిఎస్ఎల్వి-సి 23 ప్రయోగం 43వది కాగా పిఎస్ఎల్వి ప్రయోగాల్లో 27వది కావడం విశేషం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షార్కు చేరుకొని స్వయంగా రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్ ఉన్నారు. కాగా ప్రయోగం అనంతరం ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. -
పీఎస్ఎల్వీ కౌంట్డౌన్ ప్రారంభం
భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న పీఎస్ఎల్వీ -సి24కు కౌంట్డౌన్ ప్రారంభం అయ్యింది. బుధవారం ఉదయం 6.44 గంటలకు ఈ కౌంట్డౌన్ మొదలైంది. మొత్తం 58 గంటల 30 నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రంలో రాకెట్ కు సంబంధించిన అన్ని అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నాలుగో తేదీ శుక్రవారం సాయంత్రం 5.14 గంటలకు పీఎస్ఎల్వీ-సి24 నింగిలోకి వెళ్లనుంది. దీని సాయంతో ఐఆర్ఎన్ఎస్ఎస్1-బి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. పీఎస్ఎల్వీ భారత అంతరిక్ష చరిత్రలో గెలుపుగుర్రంగా నిలిచింది. ఇప్పటివరకు దీని వైఫల్యాలు చాలా తక్కువ, విజయాల శాతం చాలా ఎక్కువగా ఉంది. -
2017 నాటికి 12 ప్రయోగాలు
షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వెల్లడి సూళ్లూరుపేట, న్యూస్లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నుంచి 2017వ సంవత్సరానికి 12 ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. 64వ గణతంత్ర వేడుకల అనంతరం ఆదివారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా షార్లో విలేకరులతో మాట్లాడారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం అభివృద్ధిలో భాగంగా రూ.250 కోట్ల వ్యయంతో మల్టీ ఆబ్జెక్టివ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైందని తెలిపారు. ఆయన తెలిపిన మరికొన్ని వివరాలు... ఒకేసారి రెండు రాకెట్లు అనుసంధానం చేసేందుకు సెకెండ్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (స్వాబ్)ను రూ.360 కోట్లతో నిర్మించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాదిలో ఐదు ప్రయోగాలకు సిద్ధం. మార్చి రెండోవారంలో పీఎస్ఎల్వీ సీ24 రాకెట్ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ ఉపగ్రహం, మేలో పీఎస్ఎల్వీ సీ26 ద్వారా జర్మనీకి చెందిన స్పాట్-07 ఉపగ్రహాన్ని, మళ్లీ ఆరు నెలల్లో మరో రెండు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలను పంపనున్నాం. -
నేడు జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్లైన్: భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో కీలక ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం సాయంత్రం 4.18 గంటలకు జీశాట్-14 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ(జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-డీ5 రాకెట్ నింగికి దూసుకుపోనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగానికి 29 గంటల కౌంట్డౌన్ శనివారం ఉదయం 11.18 గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కౌంట్డౌన్ సమయంలో శనివారం జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ రెండో దశలో 39.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. రాకెట్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను ప్రయోగానికి ఆరు గంటల ముందు అప్రమత్తం చేస్తారు. ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19ననే చేపట్టాల్సి ఉండగా.. రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టగా.. రెండే విజయవంతం అయ్యాయి. జీఎస్ఎల్వీ రాకెట్లో కీలక దశ అయిన అప్పర్ క్రయోజెనిక్ దశను ఇస్రో స్వదేశీయంగానే తయారుచేసింది. షార్లో కౌంట్డౌన్ ప్రక్రియను శనివారం సాయంత్రం ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ పరిశీలించారు. ప్రయోగం నేపథ్యంలో షార్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మత్స్యకారులు ఆదివారం చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేశారు. ప్రత్యేకతలు ఇవే... జీఎస్ఎల్వీ డీ5 పొడవు: 49.13 మీటర్లు బరువు: 414.75 టన్నులు ప్రయోగం ఖర్చు: రూ.205 కోట్లు (రాకెట్కు రూ.160 కోట్లు, ఉపగ్రహానికి రూ.45 కోట్లు) జీశాట్-14 బరువు:1,982 కిలోలు పనిచేసే కాలం: 12 ఏళ్లు