-
Pawan Kalyan: అక్కడ బ్రేక్ వేస్తే..ఇక్కడ చిక్కే!
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా హీరో శివరాజ్కుమార్ కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం ప్రారంభించారు. శివరాజ్ కుమార్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ పెంచుకోవాలనుకున్న కాంగ్రెస్ స్పీడ్కు కర్ణాటక బీజేపీ బ్రేకులు వేసే పనిలో ఉంది. శివరాజ్ కుమార్ టార్గెట్గా కన్నడ చిత్రపరిశ్రమలో ఆయనకు సంబంధించిన సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్స్ను ఎక్కడా కనిపించకుండా నిషేధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కర్ణాటక బీజేపీ ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగులను ప్రదర్శించకుండా ఆదేశించాలని బీజేపీ తాజాగా కోరింది. బీజేపీ ఫిర్యాదును అక్కడి ఎన్నికల కమిషన్ అమలు చేస్తే ఏపీలో పవన్ కల్యాణ్కు సంబంధించిన సినిమాలు, టీజర్లు, ట్రైలర్లు, ప్రకటనలు వంటి వాటిని కూడా నిషేధించాల్సి వస్తుంది. కన్నడలో శివరాజ్ కుమార్ కూడా పాపులర్ హీరో.. ఆయన గురించి బీజేపీ ఎలాంటి ఫిర్యాదు చేసిందో ఇప్పుడు ఏపీలో కూడా అవన్నీ పవన్కు వర్తిస్తాయి అనేది పాయింట్. -
మెగాస్టార్ను కలిసిన శివన్న.. చిరు ఇంట్లో భోజనం..
సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. దీంతో చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనను ఇంటికి వెళ్లి మరీ అభినందించారు. ఈ క్రమంలో చిరంజీవి.. రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేక విందు పార్టీ ఇచ్చాడు. ఇకపోతే ఈ రోజు(ఫిబ్రవరి 4న) తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని సన్మానించింది. ఆయనతో పాటు పద్మ పురస్కారాలు అందుకున్న అందరినీ ఘనంగా సత్కరించింది. ఆత్మీయంగా కలిసి మరీ.. తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ మెగాస్టార్ను అభినందించాడు. ఫోన్లోనో, సోషల్ మీడియాలోనో కాదు.. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి మరీ చిరంజీవిని ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించాడు. 'ప్రియమైన స్నేహితుడు శివన్న నా కోసం ఇక్కడివరకు రావడం చాలా సంతోషం. ఆయన చేసిన పనికి ఉప్పొంగిపోయాను. మెగాస్టార్తో శివన్న లంచ్ మేమిద్దరం కలిసి భోజనం చేశాం, చాలాసేపు కబుర్లాడుకున్నాం. లెజెండరీ నటుడు రాజ్ కుమార్తో ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాం. ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం' అని కాస్త ఎమోషనలయ్యాడు. శివన్నతో కలిసి భోజనం చేసిన ఫోటోలను సైతం ట్వీట్ చేశాడు. ఇది చూసిన జనాలు ఖుషీ అవుతున్నారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Very touched that my dear @NimmaShivanna came all the way from Bangalore to congratulate me 🤗 Spent some wonderful time over lunch and fondly recalled our association and so many cherished memories with the Legendary Rajkumar garu and his entire family.🙏 Delighted. pic.twitter.com/gbWizevDso — Chiranjeevi Konidela (@KChiruTweets) February 4, 2024 చదవండి: హనీమూన్ పిక్స్ షేర్ చేసిన స్టార్ హీరో కూతురు.. అక్కడ కూడా యోగా వదల్లేదు! -
శివరాజ్ కుమార్తో ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ పాన్ ఇండియా మూవీ!
"సప్త సాగరాలు దాటి" సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు దర్శకుడు హేమంత్ ఎమ్ రావు. 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు. కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్నట్లు సమాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. -
Captain Miller HD Stills: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ స్టిల్స్
-
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’ అనే బ్యాక్గ్రౌండ్ వాయిస్తో మొదలవుతుంది ‘యుఐ’ చిత్రం టీజర్. ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుఐ’. జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహనిర్మాత. బందీలుగా ఉన్నవారి హాహాకారాలు, విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు కనిపిస్తుండగా, వారిని రక్షించడానికే అన్నట్లు హీరో ఉపేంద్ర ఎంట్రీతో టీజర్ ముగుస్తుంది. సోమవారం జరిగిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు శివ రాజ్కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఈ చిత్రానికి ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ (ఐఎల్ఎమ్) క్రియేషన్ టెక్నాలజీని వాడాం. దాదాపు 90 శాతం వీఎఫ్ఎక్స్ ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర సరసన రీష్మా నానయ్య నటిస్తున్న ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్నాథ్, కెమెరా: హెచ్సి వేణుగోపాల్. -
రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్..
-
డీకే శివకుమార్ భారీ ఆఫర్.. నో చెప్పిన హీరో శివ రాజ్కుమార్
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దేశ వ్యాప్తంగా 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం అన్నీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. ఈ ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్లపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అందరూ ఎన్నికల కోసం సిద్ధం కావాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల కోసం కన్నడ స్టార్ హీరో అయిన శివ రాజ్కుమార్ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకోవాలనే కాంగ్రెస్ ప్లాన్కు శివన్న బ్రేకులు వేశాడు. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్కుమార్కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ను డీకే శివకుమార్ ఆఫర్ చేశారు. కర్ణాటకలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అక్కడ టికెట్ ఇస్తామని శివన్నతో డీకే చెప్పారు. కానీ అందుకు శివరాజ్కుమారు నిరాకరించారు. తన ముందు ఐదారు సినిమా ప్రాజెక్ట్లు ఉన్నాయని తెలిపారు. దీనికి సమాధానంగా డీకే కూడా ఇలా చెప్పారు... సినిమాలు ఎప్పుడైనా తీయవచ్చు. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ప్రజలకు సేవ చేద్దాం. పార్లమెంటులో మీ లాంటి వారు ఉండాలి. కన్నడిగుల వాయిస్ వినిపించాలి.' అని కోరారు. అప్పటికీ కూడా శివరాజ్ కూమార్ అంగీకరించలేదు. అనంతరం శివరాజ్కుమార్ మాట్లాడుతూ.. 'నేనెప్పటికీ రాజకీయాల్లోకి రాను. మా నాన్న మాకు తెరపై మాత్రమే నటించమని అడిగారు. రాజకీయాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ చెప్పలేదు. ముఖానికి రంగులు వేసుకుని నటించి మీ అందరినీ మెప్పించడం మా నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్.. అక్కడే నా లైన్ ముగుస్తుంది. వెండితెరపై మా నటన మాత్రమే చూసి అభిమానులు మమ్మల్ని ఆధరించారు. అది చాలు మాకు .. రాజకీయాలు మాకొద్దు. వాటి కోసం ప్రత్యేకంగా మంచిపని చేసేవాళ్లు కూడా ఉన్నారు. అది వారి పని.. వెండితెరపై నటించడం మాత్రమే నా పని. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప (జనతాదళ్ JDS) కూతుర్ని నేను వివాహం చేసుకున్నాను. ఆయన కూడా మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఏనాడు పిలవలేదు. కానీ రాజకీయాలకు అతీతంగా మాత్రమే నా భార్య గీతకు అండగా నిలుస్తాను. తను రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ప్రజలతో మమేకంగా ఉండాలని కోరుకుంటుంది. ఆమె వరకు మాత్రమే నా పాత్ర ఉంటుంది.' అని శివన్న చెప్పాడు. దీంతో కొందరు శివన్న ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రాజకీయాలు వద్దు.. సినిమానే ముద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. (డీకే శివకుమార్తో గీత, ఆమె సోదరుడు మధు బంగారప్ప) గీత జనతాదళ్ అభ్యర్థిగా 2013లో పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు. గీత కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భగా ఆమె డీకే శివకుమార్ కాళ్లకు నమస్కరించారు. ఈ చర్యను శివరాజ్ కుమార్, రాజ్కుమార్ అభిమానులు అప్పట్లో ఖండించారు. గీత సోదరుడు అయిన మధు బంగారప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. -
కన్నడ సూపర్స్టార్ను కలిసిన టాలీవుడ్ హీరో నాని (ఫొటోలు)
-
రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా
ఓటీటీల దెబ్బకు స్టార్ హీరోలు మిడ్ రేంజ్ హీరోలని తేడా లేకుండా పోయింది. ఏదో కొన్ని మూవీస్ మినహా మిగతావన్నీ కూడా నెలలోపే లేదంటే ఐదు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన రెండు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకీ ఏ సినిమా? కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు తెలుసు. పునీత్ రాజ్కుమార్కి ఇతడు సొంత అన్న. మొన్నీమధ్య రజనీ 'జైలర్'లో గెస్ట్ రోల్ చేసి విజిల్స్ వేయించారు. ఇకపోతే ఈయన హీరోగా నటించిన 'ఘోస్ట్' అనే యాక్షన్ మూవీ.. సెప్టెంబరు 19న కన్నడలో రిలీజైంది. యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తీసిన ఈ చిత్రం.. తెలుగులో రెండు వారాలు లేటుగా అంటే నవంబరు 4న విడుదలైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) ఓటీటీలో ఎప్పుడు? పెద్దగా బజ్ లేకుండానే తెలుగులో రిలీజైన ఈ చిత్రం.. ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలీదు. అలా ఇప్పుడు తెలుగులో రిలీజైన రెండు వారాల్లోలోపే అంటే నవంబరు 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ వారం వీకెండ్లో ఏదైనా యాక్షన్ మూవీ చూడాలనుకుంటే శివన్న 'ఘోస్ట్' ట్రై చేయొచ్చు. 'ఘోస్ట్' కథేంటి? వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్) సీబీఐ మాజీ అధికారి. 10 ఏళ్లు పోరాటం చేసి కర్ణాటకలోని సెంట్రల్ జైలు ప్రైవేటీకరణ బిల్లుకు అనుమతి తెచ్చుకుంటాడు. భూమిపూజ కోసం జైల్లో అడుగుపెట్టిన వామన్, అతడి టీమ్ని ఓ ముఠా కిడ్నాప్ చేస్తుంది. అయితే వామన్ని అదుపులోకి తీసుకున్నది పదేళ్ల క్రితం చనిపోయిన బిగ్ డాడీ(శివరాజ్ కుమార్) అని తెలుస్తుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు? ఆ జైలులోని వెయ్యి కిలోల బంగారం కథేంటి? చివరకు ఏమైందనేదే 'ఘోస్ట్' స్టోరీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?) -
యాక్షన్ ఘోస్ట్
కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ హీరోగా శ్రీని దర్శకత్వంలో రూపొందిన కన్నడ యాక్షన్ చిత్రం ‘ఘోస్ట్’. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చనా జాయిస్, సత్య ప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్ . సందేశ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించిందని, దీంతో ఈ సినిమాను నవంబరు 4న తెలుగులోనూ విడుదల చేయనున్నట్లుగా చిత్రం యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య. -
పునీత్ రాజ్కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్
కన్నడ సినిమా యువరాజు, పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెంది నేటికి రెండేళ్లు. నేటికీ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆయన సజీవంగానే ఉన్నాడు. సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు సామాజిక సేవలో కూడా అప్పూ నిమగ్నమయ్యాడు. అందుకే నేటికీ ఆయన అభిమానుల మదిలో మరపురాని జ్ఞాపకం. కంఠీర స్టూడియోలోని అప్పు స్మారకాన్ని పూలతో అలంకరించారు. సంస్మరణ సభకు సన్నాహాలు కంఠీరవ స్టూడియోలోని ఆయన సమాధి దగ్గర శనివారం అప్పు సంస్మరణ సభకు సన్నాహాలు చేశారు. ఈ సమాధిని పునీత్ రాజ్ కుటుంబం నిర్మించింది. పునీత్ రాజ్కుమార్ సమాధిని తెల్లటి పాలరాతితో నిర్మించారు. దానిపై పునీత్ ఫోటో పెట్టారు. సమాధి చుట్టూ ఉన్న ప్రాంతం తెల్లటి రాతి పలకతో కప్పబడి ఉంటుంది. తన తండ్రి స్మారకం మాదిరిగానే పుత్ర స్మారకం కూడా ఏర్పాటు చేశారు. నేడు ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్కుమార్, పిల్లలు సమాధి దగ్గరకు వచ్చి పూజలు చేశారు. వారితో పాటుగా శివరాజ్ కుమార్ కూడా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నాడు. అక్కడకు భారీగా ఆయన అభిమానులు తరలి వచ్చారు. క్యూలో నిల్చున్న అభిమానులు డాక్టర్ రాజ్కుమార్, పార్వతమ్మ, పునీత్ రాజ్కుమార్ సమాధులను రకరకాల పూలతో అలంకరించారు. పూజలు చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో సమాధి వద్దకు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడి నివాళీలు అర్పిస్తున్నారు. అప్పా (నాన్న) ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడని వారు నినాదాలు చేస్తున్నారు. పునీత్ మరణం తర్వాత జూ. ఎన్టీఆర్ మాట్లాడిన మాటాలను తాజాగా ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అభిమానులకు అన్నదాన ఏర్పాట్లు పునీత్ సమాధి దర్శనానికి వచ్చే అభిమానులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మందికి పులావ్, పెరుగు, కుంకుమపువ్వు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు. 20 మందితో కూడిన బృందం వంట చేస్తోంది. రోజంతా అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాట్లను శివరాజ్ కుమార్ ఏర్పాటు చేశాడు. ► పునీత్ రాజ్కుమార్ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడం, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధుల ఆశ్రమాలు, 19 గోశాలలు ఏర్పాటు చేశాడు. అవి ఇప్పటికీ ఆయన భార్య అశ్విని పునీత్ రాజ్కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ► పునీత్ రాజ్కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది. We Will Never Miss You....🥺 Untill See You Again......🙏🏻💐 ನಿಮ್ಮನು ಪಡೆದ ನಾವು ಪುನೀತ.... Atleast,We Are Waiting In Our Dream To See You 🥺😭🙏🏻#DrPuneethRajkumar pic.twitter.com/ntLaMstVmP — POWER STAR (@Yuva_PRK) October 28, 2023 #Appuliveson #DrPuneethRajkumar Day 730, Still love for him remains same ♥️pic.twitter.com/qWgQEfy0iu — Insulter (@Insulter3730010) October 29, 2023 We miss you @PuneethRajkumar garu 😭#WeMissYouAppu #AppuLiveOn #PowerStar #DrPuneethRajkumar #PuneethRajkumarLivesOn#DrPuneethRajkumar pic.twitter.com/mtGZEwdMNG — NTR Fans AnaNTapuR (@Anantapur_FCNTR) October 29, 2023 -
వాళ్లకు లక్కీ నటుడిగా మారిపోయిన శివరాజ్ కుమార్?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఈయన దివంగత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడు అన్న విషయం తెలిసిందే. శివ రాజ్కుమార్ నటించిన చిత్రాలకు కన్నడ ప్రేక్షకులు జేజేలు పలుకుతారు. అంత ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు ఈయన. అలాంటిది ఎప్పుడు తమిళంలో ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించడానికి వెనుకాడటం లేదు. రజనీకాంత్తో ఇటీవల జైలర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. దీంతో జైలర్ చిత్రం తమిళనాడుతో పాటు కర్ణాటకలోనూ మంచి వసూళ్లు సాధించింది. దీనికి కారణం అక్కడ శివరాజ్ కుమార్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఏదేమైనా ఆయన ఇప్పుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటించే చిత్రంలోని శివరాజ్ కుమార్ నటించే అవకాశం ఉన్ట్లు ప్రచారం జరుగుతోంది. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఘోస్ట్ చిత్రం ఈనెల 19వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా కమలహాసన్తో దిగిన ఫొటోను శివరాజ్ కుమార్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి కమలహాసన్ వీరాభిమానినైనా తాను ఆయనను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీంతో రజనీకాంత్, ధనుష్ తర్వాత కమలహాసన్ చిత్రంలో కూడా శివరాజ్ కుమార్ నటించబోతున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. -
పేరుకే నా తమ్ముడు.. తండ్రిలా నా కోసం ఏం చేశాడంటే: పునీత్ అన్నయ్య
మనిషికి కష్టాలు వచ్చినప్పుడే జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. తన వాళ్లు ఎవరో.. పరాయి వాళ్లు ఎవరో తెలుస్తుంది. జీవితంలో నిజమైన ఆప్తులు ఎవరో తెలియాలంటే బలమైన కష్టాలు రావాలి అనే మాట నూటికి నూరు శాతం నిజం. అలా ఎన్నో కష్టాలను ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎదుర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరిని చూస్తే మరొకరికి ప్రేమ... కన్నడ సినీ ఇండస్ట్రీలో పునీత్ రాజ్కుమార్, శివ రాజ్కుమార్ (శివన్న),రాఘవేంద్ర రాజ్కుమార్లు రక్తసంబంధానికి ఉన్న విలువలను అనేకమార్లు చాటిచెప్పారు. ఈ ముగ్గురిలో అందరి కంటే పెద్దవారు శివన్న.. చివరి వాడు పునీత్ రాజ్కుమారు అని తెలిసిందే. (ఇదీ చదవండి: అనారోగ్యంతో తండ్రి.. తన పంతాన్ని పక్కన పెట్టేసిన విజయ్) తాజాగా పునీత్ గురించి తన రెండో అన్న రాఘవేంద్ర పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. పునీత్ రాజ్కుమార్ను తామందరం ఇంట్లో 'అప్పు' అని ప్రేమగా పిలుచుకుంటామని ఆయన గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబంలోని అందరిపై అప్పు ప్రేమ ఒకేలా ఉంటుందని రాఘవేంద్ర ఇలా చెప్పాడు. 'నాకంటే అప్పు పదేళ్లు చిన్నవాడు.. అందుకే వాడిని నేను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూశాను. పునీత్ బతికి ఉన్నప్పుడు కూడా కొడుకులానే భావించేవాడిని... అప్పును చిన్నప్పటి నుంచి నేనే షూటింగ్కి తీసుకెళ్లేవాడిని.. వాడికి స్నానం కూడా చెయించేవాడిని అలా మా మధ్య తండ్రీకొడుకుల బంధం ఏర్పడింది. ఒక సినిమాలో కూడా ఇద్దరం కలిసి అలాంటి పాత్రలలోనే కనిపించాం.' అని రాఘవేంద్ర చెప్పాడు పునీత్ రాజ్కుమార్ రక్తసంబంధానికి మంచి మెసేజ్ ఇచ్చి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తన అన్నయ్య గుర్తుచేసుకున్నారు. శివన్న, పునీత్లకు ఇద్దరికీ చెరో ఇల్లు ఉండేది. కానీ తనకు మాత్రమే సొంత ఇల్లు లేదని రాఘవేంద్ర చెప్పాడు. అలాంటి సమయంలో అప్పునే తనకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు. వారిద్దరి ఇంటి కంటే ఎంతో గొప్పగా ఇంటిని నిర్మించి తనకు ఇచ్చాడని పేర్కొన్నాడు. పునీత్ లేకుంటే ఇప్పటికి కూడా తాను ఇంత ఖరీదైన ఇల్లు నిర్మించుకునే వాడిని కాదని ఆయన చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్) 'అప్పట్లో నేను సినిమాల్లో నటించడం మానేశాను.. దీంతో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అప్పట్లో నేను ఒంటరిగా ఆ కష్టాలను భరించేవాడిని ఎవరితోను చెప్పుకునే వాడిని కాదు. అలాంటి సమయంలో నా పరిస్థితిని గమనించి మా ఇంటి బాధ్యతను పునీత్ తీసుకున్నాడు. ఆర్థిక సాయంతో పాటు కొన్ని సినిమా అవకాశాలను కూడా అప్పూనే ఇప్పించాడు. ఏ సినిమా చేసినా నన్నూ వాడి వెంట ఎక్కడికైనా తీసుకెళ్లేవాడు. అతను నాకు అన్నయ్య స్థానం ఇచ్చాడు, కానీ.. తండ్రిగా నా జీవితాన్ని నిలబెట్టి ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.' అని పునీత్ రాజ్కుమార్ను ఆయన గుర్తుచేసుకున్నాడు. -
రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్
కన్నడ సూపర్ స్టార్స్ పునీత్ రాజ్కుమార్, శివ రాజ్కుమార్లకు ఎంతోమంది వీరాభిమానులున్నారు. వీరి తండ్రి, దివంగత నటుడు డాక్టర్ రాజ్కుమార్ కూడా పెద్ద నటుడు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్గా వెలుగొందిన ఈయనను అప్పట్లో గంధపు చెక్కల దొంగ వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. ఇప్పటికీ కన్నడ ప్రజలు ఆ సంఘటనను అంత ఈజీగా మర్చిపోలేరు. రజనీకాంత్ను ఎప్పుడెప్పుడు కలుద్దామా.. తండ్రి రాజ్ కుమార్ను కిడ్నాప్ చేసిన సమయంలో రజనీకాంత్ తమ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు శివ రాజ్కుమార్. ఆయన ఇటీవల కీలక పాత్రలో నటించిన జైలర్ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రజనీకాంత్ను ఎప్పుడెప్పుడు కలుద్దామా? అని ఉందని చెప్పుకొచ్చాడు. తండ్రిని వీరప్పన్ కిడ్నాప్ చేసిన సమయంలో రజనీ తన కుటుంబానికి ఎంతో సాయం చేశాడని పేర్కొన్నాడు. ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. అసలేం జరిగిందంటే.. 2000 జూలై 30న రాత్రి 9.30 గంటలకు వీరప్పన్ గాజనూరు ఫాంహౌస్ నుంచి రాజ్కుమార్ను కిడ్నాప్ చేశాడు. రాజ్కుమార్తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి వారిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. రాజ్కుమార్కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇది క్షమించరాని నేరమని సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి వీరప్పన్.. రాజ్కుమార్ను టార్గెట్ చేశాడని 1999లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వం రాజ్కుమార్కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించింది. రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన సమయంలో ఆయన కోసం లక్షలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో చివరకు వీరప్పన్తో చర్చలు జరిపింది. అటు వీరప్పన్.. ఏకంగా రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్ పుస్తకంలో పేర్కొన్నదాని ప్రకారం.. అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ ప్రభుత్వం మూడు విడతలుగా మొత్తం రూ.15.22 కోట్లను వీరప్పన్కు అందజేసినట్లు తెలుస్తోంది. 108 రోజుల తర్వాత నవంబర్ 15న రాజ్కుమార్ను విడుదల చేశాడు. 2004 అక్టోబర్ 18న వీరప్పన్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. చదవండి: Niharika: నిహారిక మీద బ్యాడ్ కామెంట్.. నోరు అదుపులో పెట్టుకో అంటూ మెగా హీరో వార్నింగ్ -
Kannada Superstar Shivarajkumar: కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్ అరుదైన ఫోటోలు.. ఓ లుక్కేయండి
-
టీజర్ సూపర్ ఉంది కానీ ఆ ఒక్కటే!
Ghost Teaser Telugu: సినిమాపై అంచనాలు పెరగాలంటే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి చాలా ముఖ్యం. ఈ మధ్య వచ్చిన 'సలార్' టీజర్ బాగుంది. మేం ఒప్పుకొంటాం. కానీ అందులో ప్రభాస్ ని సరిగా చూపించలేదని బాధ ఫ్యాన్స్కి ఇప్పటికీ ఉండిపోయింది. సరే దాని గురించి వదిలేస్తే తాజాగా ఓ డబ్బింగ్ సినిమా టీజర్ రిలీజైంది. దీన్ని చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ప్రభాస్ కటౌట్కి ఇలాంటి పడాల్సింది అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి? సూపర్ టీజర్ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఎంత ఫేమస్ అనేది మీలో చాలామందికి తెలుసు. ఇతడి అన్న శివరాజ్ కుమార్ కూడా అక్కడ వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఆయన నటించిన సినిమానే 'ఘోస్ట్'. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ చిత్ర టీజర్ ని శివన్న పుట్టినరోజు సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. నెక్స్ట్ లెవల్ ఎలివేషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్కి అవమానం!) టీజర్లో ఉన్నది ఇదే ఓ పాడుబడిన బిల్డింగ్ లో ఓ వ్యక్తి. అతడు ప్రాణాలతో కావాలని వాయిస్ ఓవర్లో ఓ వ్యక్తి ఆర్డర్. అతడితో జాగ్రత్త అని గన్స్ తో ఉన్నవాళ్లకు హెచ్చరిక. అప్పుడు శివరాజ్ కుమార్ ఎంట్రీ. ఆయుధాలతో ఉన్న వాళ్లు తనని చుట్టుముట్టినా సరే స్టైల్గా విస్కీతో పానిపూరీ తింటాడు. ఓ కర్రకి నిప్పి అంటించి దాంతో సిగరెట్ వెలిగిస్తాడు. దాన్ని వెనక్కి విసిరితే కవర్ కాలిపోయి వార్ ట్యాంకర్ బయటపడుతుంది. 'మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ... ఒరిజినల్ గ్యాంగ్స్టర్' అనే డైలాగ్ కూడా బాగుంది. వేరే హీరో ఉంటే మాత్రం టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సూపర్ ఉన్నాయి. కాకపోతే హీరో శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇలాంటి టీజర్ లో ప్రభాస్, అల్లు అర్జున్, యష్ లాంటి స్టార్ హీరోలు ఎవరైనా ఉండుంటే మాత్రం నెక్స్ట్ లెవల్ ఉండేది. ఇకపోతే 'ఘోస్ట్' చిత్రానికి శ్రీని దర్శకుడు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. దసరాకి ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. (ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!) -
కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షిస్తున్న సినీ గ్లామర్
-
‘గెస్ట్’గా వచ్చేస్తున్న స్టార్ హీరోలు!
ఒక స్టార్ సినిమాలో మరో స్టార్ కనిపిస్తే.. ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్కి పండగే పండగ. అలా కాకుండా ఓ మామూలు బడ్జెట్ సినిమాలో ఒక స్టార్ గెస్ట్గా కనిపించినా ఆ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. ఇలా ఫ్యాన్స్ పండగ చేసుకునే ‘గెస్ట్’ రోల్స్లో కొందరు స్టార్స్ కనిపించనున్నారు. ఈ ‘స్టార్ గెస్ట్’ల గురించి తెలుసుకుందాం. గ్రౌండ్లో తలైవర్ క్రికెట్ గ్రౌండ్లో అతిథిగా ‘లాల్ సలామ్’ అంటున్నారు తలైవర్ (నాయకుడు) రజనీకాంత్. తమిళ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ముఖ్య తారలుగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో రజనీకాంత్కు చెల్లెలి పాత్రలో నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ నటించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అతిథిగా ఖైదీ ‘జైలర్’ కోసం రజనీకాంత్కు గెస్ట్ అయ్యారు మోహన్లాల్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్లాల్ గెస్ట్ రోల్ చేశారు. ఇందులో ఆయన ఓ ఖైదీ పాత్రలో కనిపిస్తారట. ఆల్రెడీ మోహన్లాల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. భాయ్కి గెస్ట్ సిల్వర్ స్క్రీన్పై సల్మాన్ భాయ్కి గెస్ట్ అయ్యారు రామ్చరణ్. సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్లపై చిత్రీకరించిన ఓ పాటలో రామ్చరణ్ గెస్ట్గా కనిపిస్తారు. నిర్మాతే అతిథి! సూర్య కెరీర్లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే హద్దురా..!) ఒకటి. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ కిలాడి అక్షయ్కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ను తెరకెక్కించిన సుధానే హిందీ రీమేక్కూ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ వెర్షన్లో హీరోగా నటించిన సూర్య హిందీ రీమేక్కి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు... ఈ రీమేక్లో సూర్య ఓ గెస్ట్ రోల్ కూడా చేశారు. కబ్జా కోసం... ఉపేంద్ర ‘కబ్జా’కు సాయం చేశారు శివ రాజ్కుమార్. ఉపేంద్ర, సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్ ఓ గెస్ట్ రోల్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ‘స్టార్ గెస్ట్’ లిస్ట్లో మరికొందరు స్టార్స్ ఉన్నారు. -
పల్లి.. పల్లి.. బెల్లంపల్లి...
‘‘చంద్రు ఇదివరకే అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు కన్నడ స్టార్ శివరాజ్కుమార్. ఉపేంద్ర హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కబ్జా’. పునీత్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని ‘పల్లి.. పల్లి.. బెల్లంపల్లి..’ అంటూ సాగే మూడో పాటను కన్నడ స్టార్ శివరాజ్కుమార్ విడుదల చేశారు. ఉపేంద్ర, తాన్యా హోప్పై ఈ మాస్ సాంగ్ని చిత్రీకరించారు. రవి బస్రూర్ స్వరపరచిన ఈ పాటను తెలుగులో చంద్రబోస్ రాయగా హరిణి ఇవటూరి, సంతోష్ వెంకీ పాడారు. దర్శక–నిర్మాత ఆర్. చంద్రు హోమ్ టౌన్ షిడ్ల గట్ట (కర్నాటక)లో జరిగిన ఈ పాట విడుదల వేడుకలో కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్, మాజీ మంత్రి హెచ్.ఎం. రెవన్న, కోప్రొడ్యూసర్ అలంకార్ పాండియన్ తదితరులు పాల్గొన్నారు. -
‘శివ వేద’ మూవీ రివ్యూ
టైటిల్: శివ వేద నటీనటులు: శివ రాజ్ కుమార్, గానవి లక్ష్మణ్, భరత్ సాగర్, శ్వేతా చంగప్ప, ఉమాశ్రీ, అదితి సాగర్, తదితరులు నిర్మాత : గీతాశివరాజ్కుమార్ తెలుగు విడుదల: ఎంవీఆర్ కృష్ణ దర్శకత్వం : హర్ష సంగీతం: అర్జున్జన్య సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్ ఎడిటర్: దీపు ఎస్ కుమార్ విడుదల తేది: ఫిబ్రవరి 9, 2023 కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన 125వ చిత్రం శివ వేద. ఇటీవలే కన్నడలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ సినిమాను అదే పేరుతో ఫిబ్రవరి 9న తెలుగులో విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేటంటే.. ఈ సినిమా కథంతా 1985, 1965 ప్రాంతాల కాలంలో జరుగుతుంది. 1985లో వేద(శివరాజ్ కుమార్) కూతురు కనక(అదితి సాగర్) జైలు నుంచి విడుదలవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి చంద్రగిరి వెళ్తారు. అక్కడ పోలీసు అధికార రుద్ర(భరత్ సాగర్)ని కొట్టి చంపుతారు. ఆ తర్వాత మరో ఊరు వెళ్తారు.. అక్కడ ఒకరిని చంపుతారు. ఇలా ఊరు ఊరు తిరుగుతూ నలుగురిని చంపేస్తారు. రౌడీగా చలమణీ అవుతున్న గిరయ్యను చంపాలన్నదే వాళ్ల లక్ష్యం. అసలు తండ్రి కూతురు కలిసి ఈ మారణ హోమం ఎందుకు కొనసాగిస్తున్నారు? వేద గతం ఏంటి? అతని భార్య పుష్ప(గానవి లక్ష్మణ్) ఎలా చనిపోయింది? వరుస హత్యలు చేస్తున్నప్పటికీ మహిళా పోలీసు అధికారిణి రమా( వీణా పొన్నప్ప) ఎందుకు అడ్డుకోలేదు? కనకకు జరిగిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో శివ వేద చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కేజీయఫ్ సినిమా ప్రభావం చిత్రపరిశ్రమపై బాగా పడింది. ఈ మధ్య కాలంలో వచ్చే వాటిలో ఎక్కువ చిత్రాలు కేజీయఫ్ తరహాలోనే ఉంటున్నాయి. కథను ఎవరో ఒకరు నేరేట్ చేయడం.. పీరియాడిక్ డ్రామా, ప్లాష్బ్యాక్ని అక్కడక్కడ చూపించడం.. ఇవన్నీ కేజీయఫ్ తర్వాతే మొదలయ్యాయి. శివవేద కూడా అలానే ఉంటుంది.ఈ సినిమా కథను ఓ బామ్మ తన మనవరాలికి చెబుతుంది. బస్సులో ఆఫీస్కు వెళ్లే ఓ యువతిని ఓ పోకిరి ఇబ్బంది పెడతాడు. ఇంటికొచ్చిన ఆ యువతి ఇకపై ఆఫీస్కు వెళ్లను అని బామ్మకి చెబుతుంది. మరుసటి రోజు ఇంట్లోనే ఉంటే.. పాత పుస్తకాలు చదవమని చెప్పడం.. నేను చదవను కానీ అందులో ఏం ఉందో చదివి చెప్పు అని ఆ యువతి బామ్మని అడగడంతో కథ మొదలవుతుంది. కథా నేపథ్యం అంతా 1985, 1965లలో ఉంటుంది. ఓ యాక్షన్ డ్రామాను ఎంచుకున్న దర్శకుడు హర్ష.. అందులో అంతర్లీనంగా ఒక చిన్న సందేశం కూడా పెట్టాడు. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఓ సమస్యను బలంగా చెప్పారు. అమ్మాయిలు బయటకు వెళ్తే భయపడకూడదని, ధైర్యంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. కథనం అంతా యాక్షన్ నేపథ్యంలో సాగడం.. తండ్రి కూతుళ్లు కలిసి కొంతమందిని ఎందుకు చంపుతున్నారనే విషయం చివరి వరకు చెప్పకపోవడంతో.. సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. అయితే వేద పెళ్లి ఎపిసోడ్... ఆ తర్వాత వచ్చే కామెడీ సీన్స్ తెలుగు ఆడియన్స్కి అంతగా ఎక్కకపోవచ్చు. కామెడీలో కన్నడ వాసనలే కనిపిస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంటుంది. సెకండాఫ్లో ఎక్కువగా ప్లాష్బ్యాక్నే చూపించారు. వేద భార్య పుష్పగా గానవి లక్ష్మణ్ చేసే ఫైట్ సీన్స్ అయితే అదిరిపోతుంది. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమాలో హింస ఎక్కువైనప్పటికీ.. మంచి సందేశాన్ని ఇచ్చారు. ఎవరెలా చేశారంటే.. వేద పాత్రలో శివరాజ్ కుమార్ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అలా అని కథ మొత్తం ఆయన పాత్ర చుట్టే నడవదు. స్టార్డమ్ని పక్కనబెట్టి హీరోయిన్ పాత్రకు ప్రాధన్యత ఇచ్చారు. మహిళల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఇలాంటి సినిమాలను ఒప్పుకొని నటించినందుకు నిజంగా శివరాజ్ కుమార్ని అభినందించాల్సిందే. వేద భార్య పుప్పగా గానవి లక్ష్మణ్ చక్కగా నటించారు. ఆమె చేసే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. అలాగే వేద కూతురు కనకగా అదితి సాగర్ అద్భుతమైన నటనను కనబరిచారు. క్లైమాక్స్లో యాక్షన్స్ సీన్స్ ఇరగదీసింది. పోలీసు అధికారిణి రమా పాత్ర పోషించిన వీణా పొన్నప్ప తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అర్జున్జన్య నేపథ్య సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు తెలుగు ప్రేక్షకులను అలరించలేలా ఉండవు. సినిమాటోగ్రపీ, ఎడిటింగ్ బాగుంది. గీతా శివరాజ్ కుమార్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఉలవచారు బిర్యానీ చాలా ఇష్టం
‘‘ముప్పైఏళ్లుగా తెలుగువారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి ఉలవచారు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ గార్లు, ఎన్టీఆర్, రామ్చరణ్.. ఇలా అందరూ నాకు మంచి స్నేహితులు.. చాలా మోటివేట్ చేస్తారు’’ అని కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శివ’. శివ రాజ్కుమార్ భార్య గీత నిర్మించిన ఈ చిత్రం కన్నడలో గత డిసెంబరు 23న రిలీజైంది. ఈ చిత్రాన్ని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి నేడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శివ రాజ్కుమార్ చెప్పిన విశేషాలు. ► రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో నేను నటించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ (2016) చిత్రం తెలుగులో విడుదలైంది. ఆ సినిమాని ఇక్కడి ప్రేక్షకులు బాగా ఆదరించడం హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ‘శివ వేద’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం వెరీ హ్యాపీ. ► ‘వేద’ కన్నడలో విడుదలై 50 రోజులు కావస్తున్నా ఇప్పటికీ మంచి ఆదరణ వస్తోంది. ‘శివ వేద’లో వినోదం, భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం ఉంది. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అనేది ఈ చిత్రంలో ఉంటుంది. ‘వేద’ అనేది క్యారెక్టర్ పేరు. లవ్, లైఫ్, హ్యాపీనెస్, ట్రస్ట్.. ఇవన్నీ వేద లైఫ్లో ఉంటాయి. ► ‘శివ వేద’ని కన్నడ, తెలుగులో ఒకే రోజు రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, పబ్లిసిటీకి సమయం లేకపోవ డంతో ఇక్కడ విడుదల చేయలేదు. కన్నడ, తమిళ్లో రిలీజ్ చేయగా మంచి హిట్టయ్యింది. తమిళంలోనూ బాగా ఆదరిస్తున్నారు. హర్షకి నాపై ఉన్న నమ్మకం వల్లే మా కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు చేశాం. ► తెలుగు, కన్నడ ఇండస్ట్రీలు ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. నేను కన్నడ, తమిళ్, హిందీ, తెలుగు మాట్లాడగలను. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకరే ఉండలేరు.. ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు కాబట్టి కొత్తవారిని ప్రోత్సహించాలి. ► భక్తి నేపథ్యంలో ఓ మూవీ చేయాలని ఉంది. పునీత్ రాజ్కుమార్ బయోపిక్ తీసే ఆలోచన లేదు. ప్రస్తుతం రజనీ సార్తో ‘జైలర్’, ధనుష్తో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ చేస్తున్నాను. తెలుగులో రెండు, మూడు ప్రాజెక్ట్స్ విన్నాను. -
తమ్ముడి ఏవీ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన శివరాజ్ కుమార్.. వీడియో వైరల్
కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ ఈ లోకాన్ని విడిచి ఏడాదిన్నర కావొచ్చినా.. అతని అకాల మరణాన్ని మాత్రం అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికీ కన్నడలో ఏ సినిమా ఈవెంట్ జరిగినా పునీత్ పేరును స్మరించుకుంటున్నారు. ఆయన సినిమాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా పునీత్ని తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు ఆయన సోదరుడు, హీరో శివరాజ్ కుమార్. ఆయన నటించిన వేద సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారాయన. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటలో వేద ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ ఏవీని ప్లే చేశారు. అందులో పునీత్ చిన్నప్పటి నుంచి నటించిన చిత్రాలతో సహా చివరి సినిమా వరకు చూపించారు. దాన్ని చూస్తూ ఒక్కసారిగా కన్నీళ్లు పెంటుకున్నాడు శివరాజ్ కుమార్. వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో పక్కనే ఉన్న బాలకృష్ణ అతన్ని ఓదార్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 💔💔#ShivaRajKumar gets emotional about #PuneethRajkumar at #Vedha Pre Release Event ♥️♥️#PuneethRajkumarLivesOn #NandamuriBalakrishna #TeluguFilmNagar pic.twitter.com/a1WiMDD6YV — Telugu FilmNagar (@telugufilmnagar) February 8, 2023 -
తెలుగు ప్రేక్షకులకు ఆ మాట ఇస్తున్నా: శివ రాజ్కుమార్
‘‘నాన్నగారు (కన్నడ స్టార్ రాజ్కుమార్), ఎన్టీఆర్, నాగేశ్వర రావు, శివాజీ గణేశన్, ఎంజీఆర్సార్లు బ్రదర్స్లా ఉండేవాళ్లు. ఆ వారసత్వాన్ని తర్వాతి తరంలో మేం ముందుకు తీసుకెళుతున్నాం. తారకరత్నగారిని వెళ్లి చూశాను. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు కన్నడ స్టార్ శివ రాజ్కుమార్. ఆయన నటించిన 125వ కన్నడ చిత్రం ‘వేద’. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్కుమార్ భార్య గీత నిర్మించిన ఈ సినిమాని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి ఈ నెల 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ రాజ్కుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, మంచి సందేశం ఉన్నాయి. నా తర్వాతి చిత్రాలను కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తానని మాట ఇస్తున్నా’’ అన్నారు. ‘కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ వేధ సినిమా పాన్ ఇండియా లెవల్ లో బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. -
తెలుగులో రిలీజ్ కానున్న కన్నడ హిట్ మూవీ వేద, ఫస్ట్ లుక్ చూశారా?
కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ "వేద". ఈ సినిమా శివ రాజ్కుమార్కు చాలా ప్రత్యేకమైనది. అదెలాగంటే? ఈ సినిమాతో అతడు 125 చిత్రాల మైలురాయిని దాటేశాడు. అతని భార్య గీతా శివ రాజ్కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగులో విడుదలకు సిద్దమవుతోంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ను ఆవిష్కరించింది చిత్ర బృందం. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కన్నడలో డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ సహా తదితరులు ఈ చిత్రంలో నటించారు. చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. చివరికి వదిలేశాడు.. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే! -
యాక్షన్ థ్రిల్లర్గా 'ఘోస్ట్' .. న్యూ ఇయర్ మోషన్ పోస్టర్ అదిరింది!
కన్నడ స్టార్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఘోస్ట్’. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బీర్బల్’ ఫేం శ్రీని దర్శకత్వం వహిహిస్తున్నాడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ ఓ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది. చిత్రానికి సంబందించిన కీలక అంశాలు అన్నీ కలగలిపి థీమ్ కి తగ్గట్లు ఆసక్తి రేపేలా ఈ మోషన్ పోస్టర్ ఉంది. కార్ స్పీడో మీటర్ తో మొదలై, ఎగిరే బుల్లెట్లు, గన్ ఫైర్ అవగానే కార్ దూసుకు రావడం, మెషీన్ గన్... వీటికి తోడు అర్జున్ జన్య అందించిన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చివరగా శివ రాజ్ వింటేజ్ లుక్ మోషన్ పోస్టర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఈ లుక్ ఘోస్ట్ చిత్రంలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో రానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరెక్కుతున్న ఘోస్ట్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మైసూర్ లో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యుల్ లో శివరాజ్ కుమార్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్ ల మీద భారీగా నిర్మించిన ప్రిజన్ ఇంటీరియర్ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరు లో వేసిన మరో భారీ సెట్ లో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ లో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. Make way for ya’ man #GHOST. Presenting you the MotionPoster of #GHOST.. shooting in progress@lordmgsrinivas @ArjunJanyaMusic@SandeshPro@baraju_SuperHit pic.twitter.com/GGLr3Caxcg — DrShivaRajkumar (@NimmaShivanna) January 1, 2023
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సాక్షి ఆఫీస్లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
ఆప్ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నం: సీఎం కేజ్రీవాల్
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
Play Offs లోకి ఆర్సిబీ
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement