Shiva Rajkumar
-
మరో ఓటీటీకి శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాండల్వుడ్ స్టార్ హీరో శివరాజ్కుమార్ (Shiva Rajkumar) నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరాతి రణగల్ (Bhairathi Ranagal). గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2024లో శివరాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ ప్రియులకు అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నర్తన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా భైరాతి రణగల్ మరో ఓటీటీకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నెల 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ను విడుదల చేసింది.చికిత్స కోసం అమెరికాకు..ఈ మూవీ తర్వాతే శివరాజ్ కుమార్ అమెరికాకు వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత యూఎస్ నుంచే అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. మీ అందరి ప్రేమతో త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తానని శివరాజ్ కుమార్ అన్నారు. ఇటీవలే అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్న ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
స్టార్ హీరోను కలిసిన సీఎం..
శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వెద్య చికిత్స కోసం గతేడాది డిసెంబర్లో అమెరికా వెళ్లారు. ప్రముఖ మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆయన చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని శివరాజ్ కుమార్ తన భార్యతో కలిసి ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు.తాజాగా శివరాజ్ కుమార్ జనవరి 26న బెంగళూరు చేరుకున్నారు. క్యాన్సర్ నుంచి ఆయన పూర్తిగా కోలుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తన వైద్య చికిత్స గురించి అభిమానులతో మాట్లాడారు. నా అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, మద్దతు వల్లే తాను కోలుకున్నానని అన్నారు. మళ్లీ మీ అందరి సినిమాలతో అలరించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శివరాజ్ కుమార్ తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు తనకు శస్త్ర చికిత్స జరిగిందని..రెండో రోజు నుంచే నడవడం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో నా భార్య, కూతురు తనకు అండగా నిలిచారని అన్నారు.కాగా.. శివ రాజ్కుమార్ చివరిగా కన్నడ చిత్రం భైరతి రణగల్లో కనిపించారు. ఈ సినిమా గతేడాది నవంబర్ 15, 2024న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో పని చేయనున్నారు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన చిత్రం ఆర్సీ 16లోనూ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.శివరాజ్ కుమార్ను కలిసిన సీఎం..శివరాజ్ కుమార్ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆరోగ్యం, చికిత్సపై ఆరా తీశారు. -
క్యాన్సర్ నుంచి కోలుకున్నా.. త్వరలోనే మీ ముందుకు వస్తా: శివరాజ్ కుమార్
శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. వైద్య చికిత్స కోసం ఆయన అమెరికా చేరుకున్నారు. అక్కడికి వెళ్లేముందు అభిమానులకు సందేశం ఇచ్చారు. త్వరలోనే తిరిగి వస్తానన ఫ్యాన్స్తో చెప్పారు.ఇటీవల నాన్నకు క్యాన్సర్కు సంబంధించిన సర్జరీ పూర్తయిందని ఆయన కూతురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శివరాజ్ కుమార్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. త్వరలోనే అభిమానులతో నాన్న మాట్లాడతారని పేర్కొంది. కాగా.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు.తాజాగా శివరాజ్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు. తన భార్యతో కలిసి ఆయన మాట్లాడారు. తాను క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. మీ అందరి అభిమానం వెలకట్టలేనిదని శివరాజ్ కుమార్ అన్నారు. న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్ను ఉద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.శివరాజ్ కుమార్ మాట్లాడుతూ..'క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయం దూరం చేసేందుకు నా భార్య గీత, అభిమానులు ఎంతో సహకరించారు. వారందరికీ రుణపడి ఉంటా. నేను పూర్తి చేయాల్సిన సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాను. కీమో థెరపీ చేయించుకుంటూనే '45' సినిమా షూటింగ్ పూర్తి చేశా. ఈ ప్రయాణంలో వైద్యులు అందించిన సహకారం మర్చిపోలేను' అని అన్నారు.కాగా.. శివ రాజ్కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్సీ16లోనూ కనిపించనున్నారు. అంతేకాకుండా కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. #ShivarajKumar spoke after his surgery, explaining what had happened and expressing gratitude to all those who helped him to win this situation pic.twitter.com/NU41k5mLUD— Yogitha RJ (@iamyogitharj) January 1, 2025 -
సర్జరీ కోసం వెళ్తున్నా.. కాస్త ఆందోళనగానే ఉంది: శివరాజ్ కుమార్
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సర్జరీ కోసం తాజాగా ఆయన అమెరికాకు వెళ్లారు. ఈమేరకు ఏయిర్పోర్ట్ వద్ద మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. 'భైరతి రంగల్' సినిమా విడుదల తర్వాత ఆయన మరో కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈ సినిమా సమయం నుంచే ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రిలో డిసెంబర్ 24న సర్జరీ జరగనుంది. మీడియాతో శివరాజ్ కుమార్ తన అనారోగ్యం గురించి ఇలా చెప్పుకొచ్చారు.'ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఎందరో అభిమానులు, సహ నటీనటులు నుంచి ఎంతో ప్రేమ నాకు అందుతుంది. వారందరి ఆశీస్సులు నేను పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను కాస్త అనారోగ్యంగా ఉన్నానని గతంలోనే పంచుకున్నాను. అయితే, ఈ విషయంలో మీడియా చాలా సంయమనం పాటించి తప్పుగా వార్తలు ప్రచారం చేయలేదు. వారందరికీ ధన్యవాదాలు. సర్జరీ కోసం ఇలా వెళ్తున్నప్పుడు ఎవరిలోనైనా కాస్త ఆందోళన ఉంటుంది. చాలా విషయాల్లో నేను చాలా డేర్గా ఉంటాను. అయితే, ఇలాంటి సమయంలో అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను చూసినప్పుడు కాస్త ఎక్కువగానే ఎమోషనల్ అవుతాం. అంతా మంచిగానే జరుగుతుంది. ఎవరూ అందోళన చెందకండి. సర్జరీ పూర్తి అయ్యాక యూఐ, మ్యాక్స్ సినిమాలను తప్పకుండా చూస్తాను.' అని ఆయన అన్నారు.శివరాజ్ కుమార్ ఆరోగ్య సమస్య గురించి మీడియాతో పంచుకోలేదు. తన అనారోగ్యం గురించి చెప్పి అభిమానులను బాధ పెట్టడం ఇష్టం లేదని ఆయన అన్నారు. అయితే, ఫ్లోరిడాలోని మయామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆయన చేరనున్నారని తెలుస్తోంది. 'భైరతి రంగల్' సినిమా కోసం ఆయన భారీగానే ప్రచారం చేశారు. అయితే, ఒప్పుకొన్న సినిమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన తన చిత్రం కోసం కష్టపడ్డారు. సర్జరీ తర్వాత సుమారు నెల రోజుల పాటు ఆయన అమెరికాలోనే ఉండనున్నారు. రెండు నెలల తర్వాత మళ్లీ అందరి ముందుకు వస్తానని శివ అన్నారు. ఉత్తరకాండ, భైరవుడు, రామ్చరణ్-బుచ్చిబాబుల చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. -
తెలుగులో రిలీజ్ కాబోతున్న మరో కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ!
ఈ మధ్యకాలంలో కన్నడ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. అయితే కొన్ని అక్కడ రిలీజ్ అయిన రోజే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని మాత్రం అక్కడ సూపర్ హిట్ అయితేనే కొంత సమయం తీసుకొని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా మరో కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కూడా తెలుగులో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. అదే భైరతి రణగల్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం కర్ణాటకలో రిలీజ్ అయి హిట్ టాక్ని సంపాదించుకుంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. సూపర్ హిట్ మూవీ "మఫ్తీ"కి ప్రీక్వెల్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ భైరతి రణగల్ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ తో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంతోషంలో శివరాజ్ కుమార్ అభిమానులు సినిమాలోని ఆయన మేకోవర్ తో థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. "భైరతి రణగల్" చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో రాహుల్ బోస్, నానా పటేకర్, రుక్మిణి వసంత్, అవినాష్, యోగి బాబు, దేవరాజ్ నటించారు. -
విజయ్ సినిమాలో రోల్.. ఎందుకు వెనక్కి తగ్గారో తెలీదు: శివరాజ్ కుమార్
ది గోట్ సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం దళపతి69. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నికల పోటీకి ముందు విజయ్ కెరీర్లో ఇదే చివరి చిత్రం కానుంది. అయితే ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ విపిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కోలీవుడ్లో ఈ వార్త తెగ వైరలవుతోంది.అయితే ఈ వార్తలపై తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పందించారు. దళపతి69 మూవీ డైరెక్టర్తో తాను మాట్లాడిన మాట వాస్తవమేనని తెలిపారు. దర్శకుడు హెచ్ వినోద్ బెంగళూరులో తనను వ్యక్తిగతంగా కలిశాడని.. అంతేకాకుండా నా పాత్రకు సంబంధించి వివరించాడని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అదొక అద్భుతమైన రోల్ అని అన్నారు.అయితే మళ్లీ కొద్ది రోజుల తర్వాత వినోద్ మరోసారి తనతో భేటీ అయ్యారని శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ రోల్ ప్రస్తుతానికి వర్కవుట్ కాదని వివరించారని.. మీకోసం భవిష్యత్తులో మరో ఆఫర్తో వస్తానని చెప్పాడని శివరాజ్ అన్నారు. అయితే అసలేం జరిగిందో.. ఆఫర్ను ఎందుకు విత్డ్రా చేసుకున్నారో కారణాలు మాత్రం తెలియదన్నారు. ఈ ఆఫర్ రాకపోయినప్పటికీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని శివరాజ్ కుమార్ తెలిపారు. కాగా.. ఇవాళ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బైరాతి రనగల్ థియేటర్లలో విడుదలైంది.కాగా.. శివరాజ్ కుమార్కు కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా పేరుంది. శాండల్వుడ్తో పాటు తమిళ సినిమాలలో అనేక చిత్రాలలో నటించారు. మరోవైపు రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మూవీలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు కన్నడ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం వచ్చేనెల డిసెంబర్లో యుఎస్ వెళ్తున్నట్లు శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటున్నట్లు వివరించారు. జనవరి 2025లో ఇండియాకు తిరిగి వచ్చాక సినిమాల్లో నటిస్తానని తెలిపారు. -
పవర్ఫుల్ రోల్
శివన్నగా పాపులర్ అయిన కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ కెరీర్లోని 131వ సినిమా పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ అద్వైత్ దర్శకుడు. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో ఈ చిత్రాన్ని ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ .పి నిర్మిస్తున్నారు.‘‘శివ రాజ్కుమార్ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్న ఈ చిత్రంపై ఆయన అభిమానులకు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు చేరుకునే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని డిజైన్ చేశారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలో తెలియజేస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, కెమెరా: ఎ.జె. శెట్టి. -
ఓటీటీలో శివన్న, ప్రభుదేవా సినిమా స్ట్రీమింగ్
శివరాజ్కుమార్, ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన కన్నడ సినిమా 'కరటక దమనక'. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక సాంగ్ దేశవ్యాప్తంగా ఊపేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కన్నడ ప్రముఖ డైరెక్టర్ యోగరాజ్ భట్ తెరకెక్కించారు. రాక్లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా మార్చి నెలలో విడుదలైంది. అయితే, తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సడన్గా స్ట్రీమింగ్ అవుతుంది.శివరాజ్ కుమార్తో యోగరాజ్ భట్ మొదటి సారి ఈ సినిమా తెరకెక్కించారు. ఆపై శివన్న- ప్రభదేవా కాంబినేషన్లో నటించిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభుదేవా హీరోగా కన్నడ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, వారు ఆశించనంతగా ఈ చిత్రం మెప్పించలేదని టాక్ వచ్చింది. అయితే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో తెలుగు, తమిళ్ వర్షన్స్ కూడా విడుదల కానున్నాయని సమాచారం.కరటక (శివరాజ్కుమార్), దమనక (ప్రభుదేవా) పాత్రలలో ఇద్దరూ పోటీపడి నటించారు. ఒక కేసు కారణంతో జైలులో ఉన్న వారిద్దరిని ఒక పనిచేసి పెట్టాలని జైలర్ విడుదల చేస్తాడు. అప్పుడు వారిద్దరూ ఒక పల్లెటూరుకు వెళ్తారు. అక్కడ ఊరును మోసం చేసి, దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే మోసగాళ్లలా ఉంటారు. అదే గ్రామంలో నీటి కోసం అల్లాడుతున్న ప్రజల ఇబ్బందులు చూసి చలించిపోతారు. నీళ్లు లేకపోవడంతో కొందరు ప్రజలు అక్కడి నుంచి పట్టణాలకు వెళ్లిపోతారు. కానీ, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా అక్కడే ఉండాలని కొందరు అనుకుంటారు. ఇలాంటి సమయంలో జిత్తులమారి నక్కలుగా ఉన్న వారిద్దరూ ఆ గ్రామం కోసం ఏం చేశారు. వారికి ఆ జైలర్ అప్పగించిన పని ఏంటి..? అనేది ఆసక్తిని పెంచుతుంది. ప్రియా ఆనంద్, నిశ్విక నాయుడు, రవిశంకర్, రంగాయణ రఘు, తనికెళ్ల భరణి తదితరలు ఈ సినిమాలో నటించారు. తనికెళ్ల భరణి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఇంటి వద్దే చూసేయండి. -
హిట్ సినిమాకు ప్రీక్వెల్.. ఫస్ట్ గ్లింమ్స్ విడుదల
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా నుంచి ఫస్ట్ వెర్డిక్ట్ పేరుతో ఒక వీడియోను పంచుకున్నారు. పాన్ ఇండియా రేంజ్లో శివ రాజ్కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో 'భైరతి రంగల్' ఒకటి. శ్రీమతి గీతా శివ రాజ్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.'భైరతి రంగల్' సినిమాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15, 2024న విడుదల చేస్తామని గతంలో శివరాజ్కుమార్ ప్రకటించారు. అయితే, తాజాగా విడుదలైన వెర్డిక్ వీడియోలో సెప్టెంబర్లో సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. అందులో శివన్న రగ్గడ్ లుక్లో కనిపస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ చిత్రమైన 'ముఫ్తీ'కి 'భైరతి రంగల్' ప్రీక్వెల్గా రానుంది. -
ఒక్క సినిమాతో తెలుగోళ్లకు నచ్చేశాడు.. శివరాజ్ కుమార్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
నా భర్తతో హోటల్ రూమ్లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి
రాఘవేంద్ర రాజ్కుమార్ రెండో కుమారుడు యువ రాజ్కుమార్, భార్య శ్రీదేవి భైరప్ప మధ్య విడాకుల గొడవ కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. భార్య శ్రీదేవితో విడిపోవడానికి జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ను యువ రాజ్కుమార్ దాఖలు చేశాడు. దానిని ఖండించిన శ్రీదేవి తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భర్తకు కన్నడ హీరోయిన్ సప్తమిగౌడతో ఎఫైర్ ఉందని ఆరోపించింది. ఇదే సమయంలో యువ రాజ్కుమార్ లాయర్ కూడా శ్రీదేవిపై తీవ్రమైన ఆరోపణలే చేశాడు. మరోక వ్యక్తితో శ్రీదేవికి సంబంధం ఉందని, ఆస్తి కోసమే ఇలాంటి చెత్త పనులు చేస్తుందని ఆయన తెలిపాడు.కోర్టును ఆశ్రయించిన సప్తమిగౌడశ్రీదేవిపై కాంతార నటి సప్తమిగౌడ కోర్టును ఆశ్రయించింది. యువరాజ్కుమార్ కేసులో తన పేరు ప్రస్తావిస్తూ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ సప్తమిగౌడ బెంగళూరు సిటీ సివిల్కోర్టులో కేసు వేసింది. దీంతో ఆమె పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయరాదని జడ్జి ఆదేశాలిచ్చారు. శ్రీదేవికి కూడా నోటీసులు జారీ చేశారు. యువ రాజ్కుమార్ కాపురంలో కలతలకు నటి సప్తమిగౌడ కారణమని శ్రీదేవి ఆరోపిస్తోంది. 'యువ' సినిమాలో సప్తమిగౌడతో యువ రాజ్కుమార్ కలిసి నటించారు. ఈ సినిమా 2024 మార్చి ఆఖరులో విడుదలై మిశ్రమ ఫలితాల్ని చవిచూసింది. కానీ భారీగా వసూళ్లను రాబట్టింది. యువ రాజ్కుమార్, సప్తమి మధ్య అపైర్ ఉందని శ్రీదేవి ఆరోపించింది. ఇద్దరిని హోటల్ రూమ్లో చూశానని చెబుతోంది. ఇది సప్తమిగౌడకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో కోర్టును ఆశ్రయించింది.దివంగత నటుడు రాజ్ కుమార్కు ముగ్గురు కుమారులు శివ రాజ్కుమార్,రాఘవేంద్ర రాజ్కుమార్, పునీత్ రాజ్కుమార్ అనే విషయం తెలిసిందే. వీరిలో రాఘవేంద్ర కుమారుడే యువ రాజ్కుమార్. అయితే, ఈ వివాదంపై శివ రాజ్కుమార్ ఎలాంటి కామెంట్ చేయలేదు. -
యువ రాజ్కుమార్, శ్రీదేవి దాంపత్య జీవితంలో 'ఎఫైర్స్' చిచ్చు
కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి బైరప్పతో విడిపోవడానికి సిద్ధమయ్యాడు. జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. తనను క్రూరంగా శ్రీదేవి హింసిస్తుందంటూ అందులో పేర్కొన్నాడు. దానిని ఖండించిన శ్రీదేవి కూడా తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.రాఘవేంద్ర రాజ్కుమార్ రెండో కుమారుడు యువ రాజ్కుమార్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తన భార్య శ్రీదేవి భైరప్పపై లీగల్ నోటీసులో తీవ్ర ఆరోపణలు చేశారు. వాటిపై శ్రీదేవి భైరప్ప కూడా కౌంటర్ ఇచ్చింది. యువ రాజ్కుమార్కు అక్రమ సంబంధం ఉందని శ్రీదేవి సంచలన ఆరోపణ చేసింది. విడాకుల కేసుకు సంబంధించి యువ రాజ్కుమార్ తరఫు న్యాయవాది విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శ్రీదేవి భైరప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు. అది గమనించిన శ్రీదేవి భైరప్ప.. ‘సత్యం ఎప్పుడూ గెలుస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దివంగత నటుడు రాజ్ కుమార్కు ముగ్గురు కుమారులు శివ రాజ్కుమార్,రాఘవేంద్ర రాజ్కుమార్, పునీత్ రాజ్కుమార్ అనే విషయం తెలిసిందే.న్యాయవాది చేసిన తీవ్రమైన ఆరోపణలు ఏమిటి..?'శ్రీదేవికి మరొకరితో అక్రమ సంబంధం ఉంది. శ్రీదేవి తన భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఇంటి పేరు దుర్వినియోగం చేస్తుంది. ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తితో శ్రీదేవికి ఎఫైర్ ఉంది. తన అక్రమ సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ నటితో యువ రాజ్కుమార్కు సంబంధం ఉందంటూ తప్పుడు కథనం చెబుతుంది. యువ రాజ్కుమార్కు లైంగిక సమస్య ఉందని నా లీగల్ నోటీసుకు శ్రీదేవి సమాధానంగా ఇచ్చింది. లైంగిక సమస్య ఉంటే అక్రమ సంబంధం ఎలా సాధ్యమవుతుంది..?' అని ప్రెస్మీట్లో న్యాయవాది ప్రశ్నించారు.ఆయనకు ఒక నటితో ఎఫైర్ ఉంది: శ్రీదేవి భైరప్ప 'వృత్తిపరమైన సమగ్రతను కాపాడుకోవాల్సిన వ్యక్తి బహిరంగంగా ఒక మహిళ పాత్రపై తక్కువ స్థాయిలో తప్పుడు ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనది. గత కొన్ని నెలలుగా నేను ఎన్నో బాధలు పడ్డా, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు మౌనంగా ఉన్నాను. కానీ నా మర్యాదను, మానవత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరం. యువ రాజ్కుమార్కు ఒక నటితో అక్రమ సంబంధం ఉంది. నిజం, న్యాయం తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్నాను.' అని శ్రీదేవి భైరప్ప సోషల్ మీడియాలో రాశారు.యువ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్టుగా ఓమ్ చిత్రంలో మెప్పించాడు. ఈ ఏడాదిలోనే 'యువ' అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మైసూరుకు చెందిన శ్రీదేవిని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు మొదట అంగీకరించలేదు. అయితే పునీత్ రాజ్కుమార్ జోక్యంతో వీరిద్దరి పెళ్లి జరిగింది. నివేదిక ప్రకారం, శ్రీదేవి మొదట్లో డాక్టర్ రాజ్కుమార్ సివిల్ సర్వీస్ అకాడమీని చూసుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నత చదువులు చదువుతోంది. జూలై 4 విడాకుల విషయం కోర్టులో విచారణ జరగనుంది. View this post on Instagram A post shared by Sridevi Byrappa (@sridevibyrappa) -
550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్... ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన 'ఓం' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్వరల్డ్లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్టైమ్ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా శివరాజ్కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ను శివరాజ్కుమార్ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో 'అర్జున్పండిట్' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు. -
Pawan Kalyan: అక్కడ బ్రేక్ వేస్తే..ఇక్కడ చిక్కే!
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా హీరో శివరాజ్కుమార్ కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం ప్రారంభించారు. శివరాజ్ కుమార్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ పెంచుకోవాలనుకున్న కాంగ్రెస్ స్పీడ్కు కర్ణాటక బీజేపీ బ్రేకులు వేసే పనిలో ఉంది. శివరాజ్ కుమార్ టార్గెట్గా కన్నడ చిత్రపరిశ్రమలో ఆయనకు సంబంధించిన సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్స్ను ఎక్కడా కనిపించకుండా నిషేధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కర్ణాటక బీజేపీ ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగులను ప్రదర్శించకుండా ఆదేశించాలని బీజేపీ తాజాగా కోరింది. బీజేపీ ఫిర్యాదును అక్కడి ఎన్నికల కమిషన్ అమలు చేస్తే ఏపీలో పవన్ కల్యాణ్కు సంబంధించిన సినిమాలు, టీజర్లు, ట్రైలర్లు, ప్రకటనలు వంటి వాటిని కూడా నిషేధించాల్సి వస్తుంది. కన్నడలో శివరాజ్ కుమార్ కూడా పాపులర్ హీరో.. ఆయన గురించి బీజేపీ ఎలాంటి ఫిర్యాదు చేసిందో ఇప్పుడు ఏపీలో కూడా అవన్నీ పవన్కు వర్తిస్తాయి అనేది పాయింట్. -
మెగాస్టార్ను కలిసిన శివన్న.. చిరు ఇంట్లో భోజనం..
సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. దీంతో చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనను ఇంటికి వెళ్లి మరీ అభినందించారు. ఈ క్రమంలో చిరంజీవి.. రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేక విందు పార్టీ ఇచ్చాడు. ఇకపోతే ఈ రోజు(ఫిబ్రవరి 4న) తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని సన్మానించింది. ఆయనతో పాటు పద్మ పురస్కారాలు అందుకున్న అందరినీ ఘనంగా సత్కరించింది. ఆత్మీయంగా కలిసి మరీ.. తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ మెగాస్టార్ను అభినందించాడు. ఫోన్లోనో, సోషల్ మీడియాలోనో కాదు.. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి మరీ చిరంజీవిని ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించాడు. 'ప్రియమైన స్నేహితుడు శివన్న నా కోసం ఇక్కడివరకు రావడం చాలా సంతోషం. ఆయన చేసిన పనికి ఉప్పొంగిపోయాను. మెగాస్టార్తో శివన్న లంచ్ మేమిద్దరం కలిసి భోజనం చేశాం, చాలాసేపు కబుర్లాడుకున్నాం. లెజెండరీ నటుడు రాజ్ కుమార్తో ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాం. ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం' అని కాస్త ఎమోషనలయ్యాడు. శివన్నతో కలిసి భోజనం చేసిన ఫోటోలను సైతం ట్వీట్ చేశాడు. ఇది చూసిన జనాలు ఖుషీ అవుతున్నారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Very touched that my dear @NimmaShivanna came all the way from Bangalore to congratulate me 🤗 Spent some wonderful time over lunch and fondly recalled our association and so many cherished memories with the Legendary Rajkumar garu and his entire family.🙏 Delighted. pic.twitter.com/gbWizevDso — Chiranjeevi Konidela (@KChiruTweets) February 4, 2024 చదవండి: హనీమూన్ పిక్స్ షేర్ చేసిన స్టార్ హీరో కూతురు.. అక్కడ కూడా యోగా వదల్లేదు! -
శివరాజ్ కుమార్తో ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ పాన్ ఇండియా మూవీ!
"సప్త సాగరాలు దాటి" సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు దర్శకుడు హేమంత్ ఎమ్ రావు. 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు. కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్నట్లు సమాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. -
Captain Miller HD Stills: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ స్టిల్స్
-
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’ అనే బ్యాక్గ్రౌండ్ వాయిస్తో మొదలవుతుంది ‘యుఐ’ చిత్రం టీజర్. ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుఐ’. జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహనిర్మాత. బందీలుగా ఉన్నవారి హాహాకారాలు, విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు కనిపిస్తుండగా, వారిని రక్షించడానికే అన్నట్లు హీరో ఉపేంద్ర ఎంట్రీతో టీజర్ ముగుస్తుంది. సోమవారం జరిగిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు శివ రాజ్కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఈ చిత్రానికి ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ (ఐఎల్ఎమ్) క్రియేషన్ టెక్నాలజీని వాడాం. దాదాపు 90 శాతం వీఎఫ్ఎక్స్ ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర సరసన రీష్మా నానయ్య నటిస్తున్న ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్నాథ్, కెమెరా: హెచ్సి వేణుగోపాల్. -
రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్..
-
డీకే శివకుమార్ భారీ ఆఫర్.. నో చెప్పిన హీరో శివ రాజ్కుమార్
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దేశ వ్యాప్తంగా 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం అన్నీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. ఈ ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్లపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అందరూ ఎన్నికల కోసం సిద్ధం కావాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల కోసం కన్నడ స్టార్ హీరో అయిన శివ రాజ్కుమార్ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకోవాలనే కాంగ్రెస్ ప్లాన్కు శివన్న బ్రేకులు వేశాడు. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్కుమార్కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ను డీకే శివకుమార్ ఆఫర్ చేశారు. కర్ణాటకలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అక్కడ టికెట్ ఇస్తామని శివన్నతో డీకే చెప్పారు. కానీ అందుకు శివరాజ్కుమారు నిరాకరించారు. తన ముందు ఐదారు సినిమా ప్రాజెక్ట్లు ఉన్నాయని తెలిపారు. దీనికి సమాధానంగా డీకే కూడా ఇలా చెప్పారు... సినిమాలు ఎప్పుడైనా తీయవచ్చు. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ప్రజలకు సేవ చేద్దాం. పార్లమెంటులో మీ లాంటి వారు ఉండాలి. కన్నడిగుల వాయిస్ వినిపించాలి.' అని కోరారు. అప్పటికీ కూడా శివరాజ్ కూమార్ అంగీకరించలేదు. అనంతరం శివరాజ్కుమార్ మాట్లాడుతూ.. 'నేనెప్పటికీ రాజకీయాల్లోకి రాను. మా నాన్న మాకు తెరపై మాత్రమే నటించమని అడిగారు. రాజకీయాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ చెప్పలేదు. ముఖానికి రంగులు వేసుకుని నటించి మీ అందరినీ మెప్పించడం మా నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్.. అక్కడే నా లైన్ ముగుస్తుంది. వెండితెరపై మా నటన మాత్రమే చూసి అభిమానులు మమ్మల్ని ఆధరించారు. అది చాలు మాకు .. రాజకీయాలు మాకొద్దు. వాటి కోసం ప్రత్యేకంగా మంచిపని చేసేవాళ్లు కూడా ఉన్నారు. అది వారి పని.. వెండితెరపై నటించడం మాత్రమే నా పని. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప (జనతాదళ్ JDS) కూతుర్ని నేను వివాహం చేసుకున్నాను. ఆయన కూడా మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఏనాడు పిలవలేదు. కానీ రాజకీయాలకు అతీతంగా మాత్రమే నా భార్య గీతకు అండగా నిలుస్తాను. తను రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ప్రజలతో మమేకంగా ఉండాలని కోరుకుంటుంది. ఆమె వరకు మాత్రమే నా పాత్ర ఉంటుంది.' అని శివన్న చెప్పాడు. దీంతో కొందరు శివన్న ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రాజకీయాలు వద్దు.. సినిమానే ముద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. (డీకే శివకుమార్తో గీత, ఆమె సోదరుడు మధు బంగారప్ప) గీత జనతాదళ్ అభ్యర్థిగా 2013లో పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు. గీత కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భగా ఆమె డీకే శివకుమార్ కాళ్లకు నమస్కరించారు. ఈ చర్యను శివరాజ్ కుమార్, రాజ్కుమార్ అభిమానులు అప్పట్లో ఖండించారు. గీత సోదరుడు అయిన మధు బంగారప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. -
కన్నడ సూపర్స్టార్ను కలిసిన టాలీవుడ్ హీరో నాని (ఫొటోలు)
-
రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా
ఓటీటీల దెబ్బకు స్టార్ హీరోలు మిడ్ రేంజ్ హీరోలని తేడా లేకుండా పోయింది. ఏదో కొన్ని మూవీస్ మినహా మిగతావన్నీ కూడా నెలలోపే లేదంటే ఐదు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన రెండు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకీ ఏ సినిమా? కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు తెలుసు. పునీత్ రాజ్కుమార్కి ఇతడు సొంత అన్న. మొన్నీమధ్య రజనీ 'జైలర్'లో గెస్ట్ రోల్ చేసి విజిల్స్ వేయించారు. ఇకపోతే ఈయన హీరోగా నటించిన 'ఘోస్ట్' అనే యాక్షన్ మూవీ.. సెప్టెంబరు 19న కన్నడలో రిలీజైంది. యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తీసిన ఈ చిత్రం.. తెలుగులో రెండు వారాలు లేటుగా అంటే నవంబరు 4న విడుదలైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) ఓటీటీలో ఎప్పుడు? పెద్దగా బజ్ లేకుండానే తెలుగులో రిలీజైన ఈ చిత్రం.. ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలీదు. అలా ఇప్పుడు తెలుగులో రిలీజైన రెండు వారాల్లోలోపే అంటే నవంబరు 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ వారం వీకెండ్లో ఏదైనా యాక్షన్ మూవీ చూడాలనుకుంటే శివన్న 'ఘోస్ట్' ట్రై చేయొచ్చు. 'ఘోస్ట్' కథేంటి? వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్) సీబీఐ మాజీ అధికారి. 10 ఏళ్లు పోరాటం చేసి కర్ణాటకలోని సెంట్రల్ జైలు ప్రైవేటీకరణ బిల్లుకు అనుమతి తెచ్చుకుంటాడు. భూమిపూజ కోసం జైల్లో అడుగుపెట్టిన వామన్, అతడి టీమ్ని ఓ ముఠా కిడ్నాప్ చేస్తుంది. అయితే వామన్ని అదుపులోకి తీసుకున్నది పదేళ్ల క్రితం చనిపోయిన బిగ్ డాడీ(శివరాజ్ కుమార్) అని తెలుస్తుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు? ఆ జైలులోని వెయ్యి కిలోల బంగారం కథేంటి? చివరకు ఏమైందనేదే 'ఘోస్ట్' స్టోరీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?) -
యాక్షన్ ఘోస్ట్
కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ హీరోగా శ్రీని దర్శకత్వంలో రూపొందిన కన్నడ యాక్షన్ చిత్రం ‘ఘోస్ట్’. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చనా జాయిస్, సత్య ప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్ . సందేశ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించిందని, దీంతో ఈ సినిమాను నవంబరు 4న తెలుగులోనూ విడుదల చేయనున్నట్లుగా చిత్రం యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య. -
పునీత్ రాజ్కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్
కన్నడ సినిమా యువరాజు, పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెంది నేటికి రెండేళ్లు. నేటికీ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆయన సజీవంగానే ఉన్నాడు. సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు సామాజిక సేవలో కూడా అప్పూ నిమగ్నమయ్యాడు. అందుకే నేటికీ ఆయన అభిమానుల మదిలో మరపురాని జ్ఞాపకం. కంఠీర స్టూడియోలోని అప్పు స్మారకాన్ని పూలతో అలంకరించారు. సంస్మరణ సభకు సన్నాహాలు కంఠీరవ స్టూడియోలోని ఆయన సమాధి దగ్గర శనివారం అప్పు సంస్మరణ సభకు సన్నాహాలు చేశారు. ఈ సమాధిని పునీత్ రాజ్ కుటుంబం నిర్మించింది. పునీత్ రాజ్కుమార్ సమాధిని తెల్లటి పాలరాతితో నిర్మించారు. దానిపై పునీత్ ఫోటో పెట్టారు. సమాధి చుట్టూ ఉన్న ప్రాంతం తెల్లటి రాతి పలకతో కప్పబడి ఉంటుంది. తన తండ్రి స్మారకం మాదిరిగానే పుత్ర స్మారకం కూడా ఏర్పాటు చేశారు. నేడు ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్కుమార్, పిల్లలు సమాధి దగ్గరకు వచ్చి పూజలు చేశారు. వారితో పాటుగా శివరాజ్ కుమార్ కూడా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నాడు. అక్కడకు భారీగా ఆయన అభిమానులు తరలి వచ్చారు. క్యూలో నిల్చున్న అభిమానులు డాక్టర్ రాజ్కుమార్, పార్వతమ్మ, పునీత్ రాజ్కుమార్ సమాధులను రకరకాల పూలతో అలంకరించారు. పూజలు చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో సమాధి వద్దకు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడి నివాళీలు అర్పిస్తున్నారు. అప్పా (నాన్న) ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడని వారు నినాదాలు చేస్తున్నారు. పునీత్ మరణం తర్వాత జూ. ఎన్టీఆర్ మాట్లాడిన మాటాలను తాజాగా ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అభిమానులకు అన్నదాన ఏర్పాట్లు పునీత్ సమాధి దర్శనానికి వచ్చే అభిమానులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మందికి పులావ్, పెరుగు, కుంకుమపువ్వు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు. 20 మందితో కూడిన బృందం వంట చేస్తోంది. రోజంతా అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాట్లను శివరాజ్ కుమార్ ఏర్పాటు చేశాడు. ► పునీత్ రాజ్కుమార్ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడం, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధుల ఆశ్రమాలు, 19 గోశాలలు ఏర్పాటు చేశాడు. అవి ఇప్పటికీ ఆయన భార్య అశ్విని పునీత్ రాజ్కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ► పునీత్ రాజ్కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది. We Will Never Miss You....🥺 Untill See You Again......🙏🏻💐 ನಿಮ್ಮನು ಪಡೆದ ನಾವು ಪುನೀತ.... Atleast,We Are Waiting In Our Dream To See You 🥺😭🙏🏻#DrPuneethRajkumar pic.twitter.com/ntLaMstVmP — POWER STAR (@Yuva_PRK) October 28, 2023 #Appuliveson #DrPuneethRajkumar Day 730, Still love for him remains same ♥️pic.twitter.com/qWgQEfy0iu — Insulter (@Insulter3730010) October 29, 2023 We miss you @PuneethRajkumar garu 😭#WeMissYouAppu #AppuLiveOn #PowerStar #DrPuneethRajkumar #PuneethRajkumarLivesOn#DrPuneethRajkumar pic.twitter.com/mtGZEwdMNG — NTR Fans AnaNTapuR (@Anantapur_FCNTR) October 29, 2023 -
వాళ్లకు లక్కీ నటుడిగా మారిపోయిన శివరాజ్ కుమార్?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఈయన దివంగత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడు అన్న విషయం తెలిసిందే. శివ రాజ్కుమార్ నటించిన చిత్రాలకు కన్నడ ప్రేక్షకులు జేజేలు పలుకుతారు. అంత ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు ఈయన. అలాంటిది ఎప్పుడు తమిళంలో ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించడానికి వెనుకాడటం లేదు. రజనీకాంత్తో ఇటీవల జైలర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. దీంతో జైలర్ చిత్రం తమిళనాడుతో పాటు కర్ణాటకలోనూ మంచి వసూళ్లు సాధించింది. దీనికి కారణం అక్కడ శివరాజ్ కుమార్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఏదేమైనా ఆయన ఇప్పుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటించే చిత్రంలోని శివరాజ్ కుమార్ నటించే అవకాశం ఉన్ట్లు ప్రచారం జరుగుతోంది. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఘోస్ట్ చిత్రం ఈనెల 19వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా కమలహాసన్తో దిగిన ఫొటోను శివరాజ్ కుమార్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి కమలహాసన్ వీరాభిమానినైనా తాను ఆయనను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీంతో రజనీకాంత్, ధనుష్ తర్వాత కమలహాసన్ చిత్రంలో కూడా శివరాజ్ కుమార్ నటించబోతున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. -
పేరుకే నా తమ్ముడు.. తండ్రిలా నా కోసం ఏం చేశాడంటే: పునీత్ అన్నయ్య
మనిషికి కష్టాలు వచ్చినప్పుడే జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. తన వాళ్లు ఎవరో.. పరాయి వాళ్లు ఎవరో తెలుస్తుంది. జీవితంలో నిజమైన ఆప్తులు ఎవరో తెలియాలంటే బలమైన కష్టాలు రావాలి అనే మాట నూటికి నూరు శాతం నిజం. అలా ఎన్నో కష్టాలను ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎదుర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరిని చూస్తే మరొకరికి ప్రేమ... కన్నడ సినీ ఇండస్ట్రీలో పునీత్ రాజ్కుమార్, శివ రాజ్కుమార్ (శివన్న),రాఘవేంద్ర రాజ్కుమార్లు రక్తసంబంధానికి ఉన్న విలువలను అనేకమార్లు చాటిచెప్పారు. ఈ ముగ్గురిలో అందరి కంటే పెద్దవారు శివన్న.. చివరి వాడు పునీత్ రాజ్కుమారు అని తెలిసిందే. (ఇదీ చదవండి: అనారోగ్యంతో తండ్రి.. తన పంతాన్ని పక్కన పెట్టేసిన విజయ్) తాజాగా పునీత్ గురించి తన రెండో అన్న రాఘవేంద్ర పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. పునీత్ రాజ్కుమార్ను తామందరం ఇంట్లో 'అప్పు' అని ప్రేమగా పిలుచుకుంటామని ఆయన గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబంలోని అందరిపై అప్పు ప్రేమ ఒకేలా ఉంటుందని రాఘవేంద్ర ఇలా చెప్పాడు. 'నాకంటే అప్పు పదేళ్లు చిన్నవాడు.. అందుకే వాడిని నేను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూశాను. పునీత్ బతికి ఉన్నప్పుడు కూడా కొడుకులానే భావించేవాడిని... అప్పును చిన్నప్పటి నుంచి నేనే షూటింగ్కి తీసుకెళ్లేవాడిని.. వాడికి స్నానం కూడా చెయించేవాడిని అలా మా మధ్య తండ్రీకొడుకుల బంధం ఏర్పడింది. ఒక సినిమాలో కూడా ఇద్దరం కలిసి అలాంటి పాత్రలలోనే కనిపించాం.' అని రాఘవేంద్ర చెప్పాడు పునీత్ రాజ్కుమార్ రక్తసంబంధానికి మంచి మెసేజ్ ఇచ్చి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తన అన్నయ్య గుర్తుచేసుకున్నారు. శివన్న, పునీత్లకు ఇద్దరికీ చెరో ఇల్లు ఉండేది. కానీ తనకు మాత్రమే సొంత ఇల్లు లేదని రాఘవేంద్ర చెప్పాడు. అలాంటి సమయంలో అప్పునే తనకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు. వారిద్దరి ఇంటి కంటే ఎంతో గొప్పగా ఇంటిని నిర్మించి తనకు ఇచ్చాడని పేర్కొన్నాడు. పునీత్ లేకుంటే ఇప్పటికి కూడా తాను ఇంత ఖరీదైన ఇల్లు నిర్మించుకునే వాడిని కాదని ఆయన చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్) 'అప్పట్లో నేను సినిమాల్లో నటించడం మానేశాను.. దీంతో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అప్పట్లో నేను ఒంటరిగా ఆ కష్టాలను భరించేవాడిని ఎవరితోను చెప్పుకునే వాడిని కాదు. అలాంటి సమయంలో నా పరిస్థితిని గమనించి మా ఇంటి బాధ్యతను పునీత్ తీసుకున్నాడు. ఆర్థిక సాయంతో పాటు కొన్ని సినిమా అవకాశాలను కూడా అప్పూనే ఇప్పించాడు. ఏ సినిమా చేసినా నన్నూ వాడి వెంట ఎక్కడికైనా తీసుకెళ్లేవాడు. అతను నాకు అన్నయ్య స్థానం ఇచ్చాడు, కానీ.. తండ్రిగా నా జీవితాన్ని నిలబెట్టి ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.' అని పునీత్ రాజ్కుమార్ను ఆయన గుర్తుచేసుకున్నాడు. -
రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్
కన్నడ సూపర్ స్టార్స్ పునీత్ రాజ్కుమార్, శివ రాజ్కుమార్లకు ఎంతోమంది వీరాభిమానులున్నారు. వీరి తండ్రి, దివంగత నటుడు డాక్టర్ రాజ్కుమార్ కూడా పెద్ద నటుడు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్గా వెలుగొందిన ఈయనను అప్పట్లో గంధపు చెక్కల దొంగ వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. ఇప్పటికీ కన్నడ ప్రజలు ఆ సంఘటనను అంత ఈజీగా మర్చిపోలేరు. రజనీకాంత్ను ఎప్పుడెప్పుడు కలుద్దామా.. తండ్రి రాజ్ కుమార్ను కిడ్నాప్ చేసిన సమయంలో రజనీకాంత్ తమ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు శివ రాజ్కుమార్. ఆయన ఇటీవల కీలక పాత్రలో నటించిన జైలర్ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రజనీకాంత్ను ఎప్పుడెప్పుడు కలుద్దామా? అని ఉందని చెప్పుకొచ్చాడు. తండ్రిని వీరప్పన్ కిడ్నాప్ చేసిన సమయంలో రజనీ తన కుటుంబానికి ఎంతో సాయం చేశాడని పేర్కొన్నాడు. ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. అసలేం జరిగిందంటే.. 2000 జూలై 30న రాత్రి 9.30 గంటలకు వీరప్పన్ గాజనూరు ఫాంహౌస్ నుంచి రాజ్కుమార్ను కిడ్నాప్ చేశాడు. రాజ్కుమార్తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి వారిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. రాజ్కుమార్కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇది క్షమించరాని నేరమని సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి వీరప్పన్.. రాజ్కుమార్ను టార్గెట్ చేశాడని 1999లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వం రాజ్కుమార్కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించింది. రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన సమయంలో ఆయన కోసం లక్షలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో చివరకు వీరప్పన్తో చర్చలు జరిపింది. అటు వీరప్పన్.. ఏకంగా రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్ పుస్తకంలో పేర్కొన్నదాని ప్రకారం.. అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ ప్రభుత్వం మూడు విడతలుగా మొత్తం రూ.15.22 కోట్లను వీరప్పన్కు అందజేసినట్లు తెలుస్తోంది. 108 రోజుల తర్వాత నవంబర్ 15న రాజ్కుమార్ను విడుదల చేశాడు. 2004 అక్టోబర్ 18న వీరప్పన్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. చదవండి: Niharika: నిహారిక మీద బ్యాడ్ కామెంట్.. నోరు అదుపులో పెట్టుకో అంటూ మెగా హీరో వార్నింగ్ -
Kannada Superstar Shivarajkumar: కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్ అరుదైన ఫోటోలు.. ఓ లుక్కేయండి
-
టీజర్ సూపర్ ఉంది కానీ ఆ ఒక్కటే!
Ghost Teaser Telugu: సినిమాపై అంచనాలు పెరగాలంటే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి చాలా ముఖ్యం. ఈ మధ్య వచ్చిన 'సలార్' టీజర్ బాగుంది. మేం ఒప్పుకొంటాం. కానీ అందులో ప్రభాస్ ని సరిగా చూపించలేదని బాధ ఫ్యాన్స్కి ఇప్పటికీ ఉండిపోయింది. సరే దాని గురించి వదిలేస్తే తాజాగా ఓ డబ్బింగ్ సినిమా టీజర్ రిలీజైంది. దీన్ని చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ప్రభాస్ కటౌట్కి ఇలాంటి పడాల్సింది అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి? సూపర్ టీజర్ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఎంత ఫేమస్ అనేది మీలో చాలామందికి తెలుసు. ఇతడి అన్న శివరాజ్ కుమార్ కూడా అక్కడ వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఆయన నటించిన సినిమానే 'ఘోస్ట్'. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ చిత్ర టీజర్ ని శివన్న పుట్టినరోజు సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. నెక్స్ట్ లెవల్ ఎలివేషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్కి అవమానం!) టీజర్లో ఉన్నది ఇదే ఓ పాడుబడిన బిల్డింగ్ లో ఓ వ్యక్తి. అతడు ప్రాణాలతో కావాలని వాయిస్ ఓవర్లో ఓ వ్యక్తి ఆర్డర్. అతడితో జాగ్రత్త అని గన్స్ తో ఉన్నవాళ్లకు హెచ్చరిక. అప్పుడు శివరాజ్ కుమార్ ఎంట్రీ. ఆయుధాలతో ఉన్న వాళ్లు తనని చుట్టుముట్టినా సరే స్టైల్గా విస్కీతో పానిపూరీ తింటాడు. ఓ కర్రకి నిప్పి అంటించి దాంతో సిగరెట్ వెలిగిస్తాడు. దాన్ని వెనక్కి విసిరితే కవర్ కాలిపోయి వార్ ట్యాంకర్ బయటపడుతుంది. 'మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ... ఒరిజినల్ గ్యాంగ్స్టర్' అనే డైలాగ్ కూడా బాగుంది. వేరే హీరో ఉంటే మాత్రం టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సూపర్ ఉన్నాయి. కాకపోతే హీరో శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇలాంటి టీజర్ లో ప్రభాస్, అల్లు అర్జున్, యష్ లాంటి స్టార్ హీరోలు ఎవరైనా ఉండుంటే మాత్రం నెక్స్ట్ లెవల్ ఉండేది. ఇకపోతే 'ఘోస్ట్' చిత్రానికి శ్రీని దర్శకుడు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. దసరాకి ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. (ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!) -
కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షిస్తున్న సినీ గ్లామర్
-
‘గెస్ట్’గా వచ్చేస్తున్న స్టార్ హీరోలు!
ఒక స్టార్ సినిమాలో మరో స్టార్ కనిపిస్తే.. ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్కి పండగే పండగ. అలా కాకుండా ఓ మామూలు బడ్జెట్ సినిమాలో ఒక స్టార్ గెస్ట్గా కనిపించినా ఆ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. ఇలా ఫ్యాన్స్ పండగ చేసుకునే ‘గెస్ట్’ రోల్స్లో కొందరు స్టార్స్ కనిపించనున్నారు. ఈ ‘స్టార్ గెస్ట్’ల గురించి తెలుసుకుందాం. గ్రౌండ్లో తలైవర్ క్రికెట్ గ్రౌండ్లో అతిథిగా ‘లాల్ సలామ్’ అంటున్నారు తలైవర్ (నాయకుడు) రజనీకాంత్. తమిళ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ముఖ్య తారలుగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో రజనీకాంత్కు చెల్లెలి పాత్రలో నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ నటించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అతిథిగా ఖైదీ ‘జైలర్’ కోసం రజనీకాంత్కు గెస్ట్ అయ్యారు మోహన్లాల్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్లాల్ గెస్ట్ రోల్ చేశారు. ఇందులో ఆయన ఓ ఖైదీ పాత్రలో కనిపిస్తారట. ఆల్రెడీ మోహన్లాల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. భాయ్కి గెస్ట్ సిల్వర్ స్క్రీన్పై సల్మాన్ భాయ్కి గెస్ట్ అయ్యారు రామ్చరణ్. సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్లపై చిత్రీకరించిన ఓ పాటలో రామ్చరణ్ గెస్ట్గా కనిపిస్తారు. నిర్మాతే అతిథి! సూర్య కెరీర్లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే హద్దురా..!) ఒకటి. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ కిలాడి అక్షయ్కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ను తెరకెక్కించిన సుధానే హిందీ రీమేక్కూ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ వెర్షన్లో హీరోగా నటించిన సూర్య హిందీ రీమేక్కి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు... ఈ రీమేక్లో సూర్య ఓ గెస్ట్ రోల్ కూడా చేశారు. కబ్జా కోసం... ఉపేంద్ర ‘కబ్జా’కు సాయం చేశారు శివ రాజ్కుమార్. ఉపేంద్ర, సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్ ఓ గెస్ట్ రోల్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ‘స్టార్ గెస్ట్’ లిస్ట్లో మరికొందరు స్టార్స్ ఉన్నారు. -
పల్లి.. పల్లి.. బెల్లంపల్లి...
‘‘చంద్రు ఇదివరకే అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు కన్నడ స్టార్ శివరాజ్కుమార్. ఉపేంద్ర హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కబ్జా’. పునీత్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని ‘పల్లి.. పల్లి.. బెల్లంపల్లి..’ అంటూ సాగే మూడో పాటను కన్నడ స్టార్ శివరాజ్కుమార్ విడుదల చేశారు. ఉపేంద్ర, తాన్యా హోప్పై ఈ మాస్ సాంగ్ని చిత్రీకరించారు. రవి బస్రూర్ స్వరపరచిన ఈ పాటను తెలుగులో చంద్రబోస్ రాయగా హరిణి ఇవటూరి, సంతోష్ వెంకీ పాడారు. దర్శక–నిర్మాత ఆర్. చంద్రు హోమ్ టౌన్ షిడ్ల గట్ట (కర్నాటక)లో జరిగిన ఈ పాట విడుదల వేడుకలో కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్, మాజీ మంత్రి హెచ్.ఎం. రెవన్న, కోప్రొడ్యూసర్ అలంకార్ పాండియన్ తదితరులు పాల్గొన్నారు. -
‘శివ వేద’ మూవీ రివ్యూ
టైటిల్: శివ వేద నటీనటులు: శివ రాజ్ కుమార్, గానవి లక్ష్మణ్, భరత్ సాగర్, శ్వేతా చంగప్ప, ఉమాశ్రీ, అదితి సాగర్, తదితరులు నిర్మాత : గీతాశివరాజ్కుమార్ తెలుగు విడుదల: ఎంవీఆర్ కృష్ణ దర్శకత్వం : హర్ష సంగీతం: అర్జున్జన్య సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్ ఎడిటర్: దీపు ఎస్ కుమార్ విడుదల తేది: ఫిబ్రవరి 9, 2023 కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన 125వ చిత్రం శివ వేద. ఇటీవలే కన్నడలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ సినిమాను అదే పేరుతో ఫిబ్రవరి 9న తెలుగులో విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేటంటే.. ఈ సినిమా కథంతా 1985, 1965 ప్రాంతాల కాలంలో జరుగుతుంది. 1985లో వేద(శివరాజ్ కుమార్) కూతురు కనక(అదితి సాగర్) జైలు నుంచి విడుదలవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి చంద్రగిరి వెళ్తారు. అక్కడ పోలీసు అధికార రుద్ర(భరత్ సాగర్)ని కొట్టి చంపుతారు. ఆ తర్వాత మరో ఊరు వెళ్తారు.. అక్కడ ఒకరిని చంపుతారు. ఇలా ఊరు ఊరు తిరుగుతూ నలుగురిని చంపేస్తారు. రౌడీగా చలమణీ అవుతున్న గిరయ్యను చంపాలన్నదే వాళ్ల లక్ష్యం. అసలు తండ్రి కూతురు కలిసి ఈ మారణ హోమం ఎందుకు కొనసాగిస్తున్నారు? వేద గతం ఏంటి? అతని భార్య పుష్ప(గానవి లక్ష్మణ్) ఎలా చనిపోయింది? వరుస హత్యలు చేస్తున్నప్పటికీ మహిళా పోలీసు అధికారిణి రమా( వీణా పొన్నప్ప) ఎందుకు అడ్డుకోలేదు? కనకకు జరిగిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో శివ వేద చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కేజీయఫ్ సినిమా ప్రభావం చిత్రపరిశ్రమపై బాగా పడింది. ఈ మధ్య కాలంలో వచ్చే వాటిలో ఎక్కువ చిత్రాలు కేజీయఫ్ తరహాలోనే ఉంటున్నాయి. కథను ఎవరో ఒకరు నేరేట్ చేయడం.. పీరియాడిక్ డ్రామా, ప్లాష్బ్యాక్ని అక్కడక్కడ చూపించడం.. ఇవన్నీ కేజీయఫ్ తర్వాతే మొదలయ్యాయి. శివవేద కూడా అలానే ఉంటుంది.ఈ సినిమా కథను ఓ బామ్మ తన మనవరాలికి చెబుతుంది. బస్సులో ఆఫీస్కు వెళ్లే ఓ యువతిని ఓ పోకిరి ఇబ్బంది పెడతాడు. ఇంటికొచ్చిన ఆ యువతి ఇకపై ఆఫీస్కు వెళ్లను అని బామ్మకి చెబుతుంది. మరుసటి రోజు ఇంట్లోనే ఉంటే.. పాత పుస్తకాలు చదవమని చెప్పడం.. నేను చదవను కానీ అందులో ఏం ఉందో చదివి చెప్పు అని ఆ యువతి బామ్మని అడగడంతో కథ మొదలవుతుంది. కథా నేపథ్యం అంతా 1985, 1965లలో ఉంటుంది. ఓ యాక్షన్ డ్రామాను ఎంచుకున్న దర్శకుడు హర్ష.. అందులో అంతర్లీనంగా ఒక చిన్న సందేశం కూడా పెట్టాడు. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఓ సమస్యను బలంగా చెప్పారు. అమ్మాయిలు బయటకు వెళ్తే భయపడకూడదని, ధైర్యంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. కథనం అంతా యాక్షన్ నేపథ్యంలో సాగడం.. తండ్రి కూతుళ్లు కలిసి కొంతమందిని ఎందుకు చంపుతున్నారనే విషయం చివరి వరకు చెప్పకపోవడంతో.. సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. అయితే వేద పెళ్లి ఎపిసోడ్... ఆ తర్వాత వచ్చే కామెడీ సీన్స్ తెలుగు ఆడియన్స్కి అంతగా ఎక్కకపోవచ్చు. కామెడీలో కన్నడ వాసనలే కనిపిస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంటుంది. సెకండాఫ్లో ఎక్కువగా ప్లాష్బ్యాక్నే చూపించారు. వేద భార్య పుష్పగా గానవి లక్ష్మణ్ చేసే ఫైట్ సీన్స్ అయితే అదిరిపోతుంది. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమాలో హింస ఎక్కువైనప్పటికీ.. మంచి సందేశాన్ని ఇచ్చారు. ఎవరెలా చేశారంటే.. వేద పాత్రలో శివరాజ్ కుమార్ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అలా అని కథ మొత్తం ఆయన పాత్ర చుట్టే నడవదు. స్టార్డమ్ని పక్కనబెట్టి హీరోయిన్ పాత్రకు ప్రాధన్యత ఇచ్చారు. మహిళల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఇలాంటి సినిమాలను ఒప్పుకొని నటించినందుకు నిజంగా శివరాజ్ కుమార్ని అభినందించాల్సిందే. వేద భార్య పుప్పగా గానవి లక్ష్మణ్ చక్కగా నటించారు. ఆమె చేసే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. అలాగే వేద కూతురు కనకగా అదితి సాగర్ అద్భుతమైన నటనను కనబరిచారు. క్లైమాక్స్లో యాక్షన్స్ సీన్స్ ఇరగదీసింది. పోలీసు అధికారిణి రమా పాత్ర పోషించిన వీణా పొన్నప్ప తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అర్జున్జన్య నేపథ్య సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు తెలుగు ప్రేక్షకులను అలరించలేలా ఉండవు. సినిమాటోగ్రపీ, ఎడిటింగ్ బాగుంది. గీతా శివరాజ్ కుమార్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఉలవచారు బిర్యానీ చాలా ఇష్టం
‘‘ముప్పైఏళ్లుగా తెలుగువారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి ఉలవచారు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ గార్లు, ఎన్టీఆర్, రామ్చరణ్.. ఇలా అందరూ నాకు మంచి స్నేహితులు.. చాలా మోటివేట్ చేస్తారు’’ అని కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శివ’. శివ రాజ్కుమార్ భార్య గీత నిర్మించిన ఈ చిత్రం కన్నడలో గత డిసెంబరు 23న రిలీజైంది. ఈ చిత్రాన్ని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి నేడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శివ రాజ్కుమార్ చెప్పిన విశేషాలు. ► రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో నేను నటించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ (2016) చిత్రం తెలుగులో విడుదలైంది. ఆ సినిమాని ఇక్కడి ప్రేక్షకులు బాగా ఆదరించడం హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ‘శివ వేద’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం వెరీ హ్యాపీ. ► ‘వేద’ కన్నడలో విడుదలై 50 రోజులు కావస్తున్నా ఇప్పటికీ మంచి ఆదరణ వస్తోంది. ‘శివ వేద’లో వినోదం, భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం ఉంది. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అనేది ఈ చిత్రంలో ఉంటుంది. ‘వేద’ అనేది క్యారెక్టర్ పేరు. లవ్, లైఫ్, హ్యాపీనెస్, ట్రస్ట్.. ఇవన్నీ వేద లైఫ్లో ఉంటాయి. ► ‘శివ వేద’ని కన్నడ, తెలుగులో ఒకే రోజు రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, పబ్లిసిటీకి సమయం లేకపోవ డంతో ఇక్కడ విడుదల చేయలేదు. కన్నడ, తమిళ్లో రిలీజ్ చేయగా మంచి హిట్టయ్యింది. తమిళంలోనూ బాగా ఆదరిస్తున్నారు. హర్షకి నాపై ఉన్న నమ్మకం వల్లే మా కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు చేశాం. ► తెలుగు, కన్నడ ఇండస్ట్రీలు ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. నేను కన్నడ, తమిళ్, హిందీ, తెలుగు మాట్లాడగలను. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకరే ఉండలేరు.. ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు కాబట్టి కొత్తవారిని ప్రోత్సహించాలి. ► భక్తి నేపథ్యంలో ఓ మూవీ చేయాలని ఉంది. పునీత్ రాజ్కుమార్ బయోపిక్ తీసే ఆలోచన లేదు. ప్రస్తుతం రజనీ సార్తో ‘జైలర్’, ధనుష్తో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ చేస్తున్నాను. తెలుగులో రెండు, మూడు ప్రాజెక్ట్స్ విన్నాను. -
తమ్ముడి ఏవీ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన శివరాజ్ కుమార్.. వీడియో వైరల్
కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ ఈ లోకాన్ని విడిచి ఏడాదిన్నర కావొచ్చినా.. అతని అకాల మరణాన్ని మాత్రం అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికీ కన్నడలో ఏ సినిమా ఈవెంట్ జరిగినా పునీత్ పేరును స్మరించుకుంటున్నారు. ఆయన సినిమాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా పునీత్ని తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు ఆయన సోదరుడు, హీరో శివరాజ్ కుమార్. ఆయన నటించిన వేద సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారాయన. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటలో వేద ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ ఏవీని ప్లే చేశారు. అందులో పునీత్ చిన్నప్పటి నుంచి నటించిన చిత్రాలతో సహా చివరి సినిమా వరకు చూపించారు. దాన్ని చూస్తూ ఒక్కసారిగా కన్నీళ్లు పెంటుకున్నాడు శివరాజ్ కుమార్. వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో పక్కనే ఉన్న బాలకృష్ణ అతన్ని ఓదార్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 💔💔#ShivaRajKumar gets emotional about #PuneethRajkumar at #Vedha Pre Release Event ♥️♥️#PuneethRajkumarLivesOn #NandamuriBalakrishna #TeluguFilmNagar pic.twitter.com/a1WiMDD6YV — Telugu FilmNagar (@telugufilmnagar) February 8, 2023 -
తెలుగు ప్రేక్షకులకు ఆ మాట ఇస్తున్నా: శివ రాజ్కుమార్
‘‘నాన్నగారు (కన్నడ స్టార్ రాజ్కుమార్), ఎన్టీఆర్, నాగేశ్వర రావు, శివాజీ గణేశన్, ఎంజీఆర్సార్లు బ్రదర్స్లా ఉండేవాళ్లు. ఆ వారసత్వాన్ని తర్వాతి తరంలో మేం ముందుకు తీసుకెళుతున్నాం. తారకరత్నగారిని వెళ్లి చూశాను. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు కన్నడ స్టార్ శివ రాజ్కుమార్. ఆయన నటించిన 125వ కన్నడ చిత్రం ‘వేద’. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్కుమార్ భార్య గీత నిర్మించిన ఈ సినిమాని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి ఈ నెల 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ రాజ్కుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, మంచి సందేశం ఉన్నాయి. నా తర్వాతి చిత్రాలను కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తానని మాట ఇస్తున్నా’’ అన్నారు. ‘కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ వేధ సినిమా పాన్ ఇండియా లెవల్ లో బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. -
తెలుగులో రిలీజ్ కానున్న కన్నడ హిట్ మూవీ వేద, ఫస్ట్ లుక్ చూశారా?
కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ "వేద". ఈ సినిమా శివ రాజ్కుమార్కు చాలా ప్రత్యేకమైనది. అదెలాగంటే? ఈ సినిమాతో అతడు 125 చిత్రాల మైలురాయిని దాటేశాడు. అతని భార్య గీతా శివ రాజ్కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగులో విడుదలకు సిద్దమవుతోంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ను ఆవిష్కరించింది చిత్ర బృందం. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కన్నడలో డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ సహా తదితరులు ఈ చిత్రంలో నటించారు. చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. చివరికి వదిలేశాడు.. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే! -
యాక్షన్ థ్రిల్లర్గా 'ఘోస్ట్' .. న్యూ ఇయర్ మోషన్ పోస్టర్ అదిరింది!
కన్నడ స్టార్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఘోస్ట్’. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బీర్బల్’ ఫేం శ్రీని దర్శకత్వం వహిహిస్తున్నాడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ ఓ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది. చిత్రానికి సంబందించిన కీలక అంశాలు అన్నీ కలగలిపి థీమ్ కి తగ్గట్లు ఆసక్తి రేపేలా ఈ మోషన్ పోస్టర్ ఉంది. కార్ స్పీడో మీటర్ తో మొదలై, ఎగిరే బుల్లెట్లు, గన్ ఫైర్ అవగానే కార్ దూసుకు రావడం, మెషీన్ గన్... వీటికి తోడు అర్జున్ జన్య అందించిన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చివరగా శివ రాజ్ వింటేజ్ లుక్ మోషన్ పోస్టర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఈ లుక్ ఘోస్ట్ చిత్రంలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో రానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరెక్కుతున్న ఘోస్ట్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మైసూర్ లో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యుల్ లో శివరాజ్ కుమార్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్ ల మీద భారీగా నిర్మించిన ప్రిజన్ ఇంటీరియర్ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరు లో వేసిన మరో భారీ సెట్ లో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ లో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. Make way for ya’ man #GHOST. Presenting you the MotionPoster of #GHOST.. shooting in progress@lordmgsrinivas @ArjunJanyaMusic@SandeshPro@baraju_SuperHit pic.twitter.com/GGLr3Caxcg — DrShivaRajkumar (@NimmaShivanna) January 1, 2023 -
ధనుష్కి వీరాభిమాని: కన్నడ స్టార్ హీరో
చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్. కోలీవుడ్, హాలీవుడ్ వయా బాలీవుడ్ అంటూ పరుగులు పెడుతున్న ఈయన ఇప్పటికే తెలుగు చిత్రపశ్రమంలోనూ అడుగు పెట్టారు. ఈ ఏడాది ఈయన నటించిన మారన్, ది గ్రే మెన్, తిరుచ్చిట్రం ఫలం, నానే వరువేన్ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. తాజాగా తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్న వాతి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెరపై రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా మరో తెలుగు చిత్రంలో కూడా నటిస్తున్నారు. తమిళంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం చేస్తున్నారు. రాఖీ, సానికాగితం చిత్రాల ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇందులో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ధనుష్కు అన్నయ్యగా నటించడం విశేషం. ప్రస్తుతం ఈయన ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ధనుష్తో కలిసి నటించడం గురించి శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తాను ధనుష్కు వీరాభిమాని అన్నారు. ఆయన నటించిన అన్ని చిత్రాలు చూస్తానని చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. కాగా శివరాజ్ కుమార్, రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న జైలర్ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషి స్తున్నారు. ఇలా ఒకేసారి ధనుష్, ఆయన మామతోనూ శివరాజ్ కుమార్ కలిసి నటించడం విశేషం. చదవండి: హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్కు మృణాల్ ఘాటు రిప్లై తొలిసారి కాస్టింగ్ కౌచ్పై స్పందించిన కీర్తి సురేశ్ -
శివరాజ్ కుమార్ యాక్షన్ షురూ.. ‘ఘోస్ట్’ కొత్త పోస్టర్ వైరల్
కన్నడ స్టార్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఘోస్ట్’. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బీర్బల్’ ఫేం శ్రీని దర్శకత్వం వహిహిస్తున్నాడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. ఇటీవల 28 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ని తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ కోసం దాదాపు ఆరు కోట్లతో అదిరిపోయే జైల్ సెట్ వేశారు. అందులోనే ఎన్నో యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ మూవీ రెండో షెడ్యూల్ను త్వరలోనే ప్రారంభించబోతోన్నారట. డిసెంబర్ రెండో వారం నుండి రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ కోసం ప్రిజన్ బయటి లుక్ సెట్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో శివ రాజ్ కుమార్ కొత్త పోస్టర్ను మేకర్లు రిలీజ్ చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ చిత్రంలో జయరామ్, అచ్యుత్ కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
తలైవాతో ఢీ అంటున్న శివరాజ్కుమార్
తమిళసినిమా: సూపర్స్టార్ రజనీకాంత్ అన్నాత్తే తరువాత నటిస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. పడయప్పా తరువాత నటి రమ్యకృష్ణ రజనీకాంత్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అదే విధంగా నటుడు వసంత్ రవి, యోగిబాబు, వినాయగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోకి తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వచ్చారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న జైలర్ చిత్రం గత ఆగస్టు నెలలో ప్రారంభమైంది. ఇటీవల కడలూర్ ప్రాంతంలో రెండో షెడ్యూల్ జరుపుకుంది. ఇప్పటికే 59 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై జైలర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. చిత్రంలో తలైవా యాక్షన్ సన్నివేశాలు హైఓల్టేజ్లో ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేయగా అది ట్రెండింగ్ అవుతోంది. కాగా జైలర్ చిత్రంలో శివరాజ్ కుమార్ రజనీకాంత్కు ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంతో రజినీకాంత్కు ఎంతో అనుబంధం ఉంది. అలాంటిది జైలర్ చిత్రంలో రజనీకాంత్ను శివ రాజ్ కుమార్ ఢీ కొనే సన్నివేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. -
జైలర్తో పోరాటం!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. ఇందులో రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా చెన్నైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్లో జాయిన్ అయ్యారు కన్నడ స్టార్ శివరాజ్కుమార్. ఈ చిత్రంలో ఆయన ముఖ్య పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్, శివరాజ్కుమార్ కాంబినేషన్లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ టాక్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. -
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఘోస్ట్ పోస్టర్ విడుదల
కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా సందేశ్ నాగరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ఆకట్టుకుంటోంది. భారీ వేడుకతో ప్రారంభమైన ఘోస్ట్ ప్రస్తుతం రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. -
తమ్ముడిని తలుచుకొని కన్నీటి పర్యంతమయిన శివరాజ్కుమార్
Shiva Rajkumar Watches Puneeth Rajkumar Last Film James In Mysuru: దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' గురువారం ఆయన జన్మదినం సందర్భంగా విడుదలైంది. ఉదయం ఆరు గంటల నుంచే అభిమానులు థియేటర్ల వద్ద గుమిగూడారు. కొందరు తెరపై పునీత్ను చూసి నృత్యం చేయగా మరి కొందరు విలపించారు. పవర్ స్టార్ 47వ పుట్టిన రోజును అభిమానులు ఒక పండుగలా జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో సినిమా విడుదలైంది.చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ పునీత్ తెరపై కనపడగానే అభిమానుల ఈలలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయ్యాయి. మైసూరులో ఒక థియేటర్లో పునీత్ పెద్దన్న, నటుడు శివరాజ్కుమార్ సినిమాను చూశారు.ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ఫిలిం సిటీకి పునీత్ పేరు పెడితే సంతోషం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హిమ్మావు గ్రామంలో నిర్మిస్తున్న ఫిలిం సిటీకి తన తమ్ముడు, దివంగత పునీత్ రాజ్కుమార్ పేరు పెడితే సంతోషిస్తామని హీరో శివరాజ్ కుమార్ అన్నారు. పునీత్ లేకుండా అతని పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో బాధగా ఉందని, ఇప్పటికీ తమ కుటుంబం అప్పు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ఇప్పటికీ సీక్రెట్గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట -
శివన్న అని ప్రేమగా పునీత్ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తోంది: శివ రాజ్కుమార్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణించిన నేటికి నెల రోజులు. ఆయన మన మధ్య లేరనే చేదు నిజాన్ని నిజాన్ని ఫ్యాన్స్, సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికీ పునీత్ సమాధికి ఆయన అమిమానులు, సన్నిహితులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న పునీత్ అన్న, హీరో శివరాజ్ కుమార్ తమ్ముడి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతరం అయ్యారు. చదవండి: పునీత్ చనిపోయాకే ఆ విషయం తెలిసింది, షాకయ్యా: రాజమౌళి తన చిన్న తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటా భావోద్వేగానికి లోనయ్యారు. తాను జీవించి ఉన్నంతవరకూ పునీత్ కుటుంబానికి సాయం చేస్తూనే ఉంటానని భరోసా ఇచ్చాడు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ‘పునీత్.. మరణాన్ని ఇప్పటికీ నేనింకా నమ్మలేకపోతున్నాను. అప్పూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది. శివన్న అని ప్రేమగా పిలుస్తున్న గొంతు వినిపిస్తోంది. నెల రోజులు ఎలా గడిచాయో కూడా అర్థం కావడం లేదు. ఈ బాధ నుంచి బయట పడేందుకు సినిమాలపై దృష్టి పెడుతున్నా. చదవండి: పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం అయినప్పటికీ ఎక్కడికి వెళ్లినా పూల దండలతో ఉన్న పునీత్ ఫొటోలే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ ఒక్కసారి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అందుకే వాటిని చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ భూమ్మీద ప్రతి ఒక్కరికి మరణం అనివార్యమని తెలుసు. ఎప్పుడో ఒకసారి నా ఫొటోలు కూడా అలాగే పెడతారని కూడా తెలుసు. కానీ నాకంటే ముందు నా చిన్న తమ్ముడి ఫొటోలను అలా చూడలేకపోతున్నా. సమయంలో అన్నింటిని మర్చిపోయేలా చేస్తుందంటారు. కానీ అది చాలా అబద్ధం’ అంటూ ఆయన ఏమోషనల్ అయ్యారు. -
జూ. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన శివరాజ్ కుమార్
పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం కేవలం పునీత్ కుటుంబ సభ్యులనే కాదు కన్నడిగులను, భారత సినీ పరిశ్రమ సైతం విషాదంలోకి నెట్టింది. ఆయన మరణించిన రోజు సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు పునీత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ మరణించ రెండు వారాలు దగ్గరపడుతున్నాయి. చదవండి: పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు ఈ నేపథ్యంలో తొలిసారిగా ఆయన అన్నయ్య, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పునీత్ అకాల మరణంతో తమ కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక పునీత్ మరణించిన రోజు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుందని, ఆ రోజు అక్కడికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గరికి వచ్చి ‘మీకు నేను ఉన్నా అన్న’ అంటూ ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా శివరాజ్ చెప్పారు. చదవండి: Upasana: ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్జెండర్.. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను’ అలాగే ఎన్టీఆర్పై తనకు ఉన్న అనుబంధం, అభిమానంను శివ రాజ్కుమార్ తెలియజేశారు. కాగా ఎన్టీఆర్కు కన్నడ ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ కోసం ఎన్టీఆర్ ఆయన సినిమాలో ఒక పాట పాడి కన్నడిగులను తన గొంతుతో ఆకట్టుకున్నారు. ఈ పాట తర్వాత పునీత్, ఎన్టీఆర్ల మధ్య సన్నిహిత్యం మరింత బలపడింది. అంతేగాక ఎన్టీర్ తనకు బ్రదర్ లాంటి వాడంటూ పునీత్ గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. "నేనున్నాను అన్నా మీకు" - ఎన్.టి.ఆర్ శివరాజ్ కుమార్ @NimmaShivanna గారిని పరామర్శించిన ఎన్.టి.ఆర్@tarak9999 @PuneethRajkumar pic.twitter.com/Qijeqlagc9 — MilagRRRo Movies (@MilagroMovies) November 11, 2021 -
పునీత్ మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అశ్విని
Puneeth Rajkumar Family Appeals Fans Not To End Lifes: కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణం చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. గుండెపోటుతో చిన్న వయసులోనే పునీత్ హఠాన్మరణానికి గురవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేరన్న వార్త తెలిసి ఇప్పటికే సుమారు 12మంది అభిమానులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వరుసగా అభిమానులు సూసైడ్కు పాల్పడుతుండటంపై పునీత్ భార్య అశ్విని స్పందించారు. 'పునీత్ మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఇలాంటి పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదు. అప్పు లేడన్న విషయాన్ని మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు' అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు అప్పు సోదరులు శివరాజ్కుమార్, రాఘవేంద్రలు సైతం అభిమానులెవరూ అఘాయిత్యాలకు పాల్పడద్దని కోరారు. అంత్యక్రియల దృశ్యాలకు కూడా పదేపదే ప్రసారం చేయవద్దని మీడియాకు సైతం విజ్ఞప్తి చేశారు. చదవండి: పునీత్ మరణాన్ని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ ఆగ్రహం -
నా చేతులతో ఎత్తుకుని ఆడించా.. ఈ బాధలు ఎవరికీ రాకూడదు: శివ రాజ్కుమార్
సాక్షి, యశవంతపుర: ప్రముఖ నటుడు పునీత్ రాజ్కుమార్ మరణంతో ఆయన కుటుంబంతో పాటు లక్షలాది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కన్నుమూసి నాలుగురోజులు దాటింది. సోమవారం ఆయన పెద్దన్న, హీరో శివ రాజ్కుమార్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పునీత్ మరణం మా కుటుంబానికి తీరని శోకం. నా చేతులతో ఎత్తుకుని ఆడించా. ఈ బాధలు ఎవరికీ రాకూడదు. పునీత్కు పాల శాస్త్రం చేయడం ఎంతవరకు సరి అనేది అర్థం కావడం లేదన్నారు. పాలశాస్త్రం తంతు ముగియగానే అభిమానులను కంఠీరవ స్టూడియోలో సమాధి వద్దకు అనుమతించటంపై సీఎంతో చర్చిస్తాన్నారు. చదవండి: (‘పునీత్’ కళ్లు నలుగురికి చూపునిచ్చాయి) మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి పునీత్ రాజ్కుమార్ దేవునివంటివాడు అని ఇంటి సెక్యూరిటీ గార్డు రామచంద్రప్ప విలపించారు. ఇంత మంచి పేరు సంపాదించిన వ్యక్తిని దేవునిగా భావించాం. ఎవరైనా అభిమానులు ఇంటి వద్దకు వస్తే కసురుకోవద్దని చెప్పేవారు. మమ్మల్ని అన్నా అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ఇక అభిమానులు కంఠీరవ స్టూడియో వద్ద సమాధిని చూడాలని పడిగాపులు కాస్తున్నారు. పోలీసులు వారిని అనుమతించడం లేదు. చదవండి: (పునీత్కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్) శివాజీప్రభు పరామర్శ పునీత్ కుటుంబాన్ని తమిళ సీనియర్ నటుడు శివాజీ ప్రభు సోమవారం పరామర్శించారు. తమ తండ్రి శివాజీ గణేశన్, కంఠీరవ రాజ్కుమార్లు మంచి స్నేహితులు. నేను శివరాజ్, రాఘవేంద్ర, పునీత్లు మంచి మిత్రులమని ఆయన చెప్పారు. పవర్ సినిమాలో పునీత్తో కలిసి నటించానన్నారు. పునీత్ తనను ఎప్పుడు ఆన్న అని పిలిచేవాడని తెలిపారు. -
పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ కుటుంబాన్ని హార్ట్ ఎటాక్స్ వెంటాడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది జరిగిన సంఘటనలను చూస్తుంటే. అగ్ర కథానాయకుడైన పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ, రాజ్కుమార్ గుండెపోటుతోనే చనిపోయారు. అలాగే ఆయన సోదరుడు, స్టార్ హీరో శివరాజ్ కుమార్ గతంలో గుండెపోటుతోనే చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. జిమ్ హెవీ వర్కౌట్స్ చేయడం వల్లే శివరాజ్ కుమార్కు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి ఆయన జిమ్లో అతిగా కష్టపడటం తగ్గించారు. ఇక నేడు అదే కారణంతో పునీత్ రాజ్కుమార్ మరణించడం బాధాకరం. చదవండి: మరణం, డెస్టినీ గురించి పునీత్ రాజ్కుమార్ ఏమన్నారంటే.. పునీత్ తండ్రి రాజ్కుమార్ 77 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఇక 54 ఏళ్ల వయసులో జిమ్లో భారీ కసరత్తులు చేస్తుండగా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్కు ఆకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయనను వెంటనే బెంగళూరు విఠల్మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో ఆయనకు వైద్యం అందడంతో ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి ఆయన జిమ్లో తక్కువగా కనిపిస్తారు. కానీ పునీత్ రాజ్కుమార్ మాత్రం ఎక్కువ సమయంలో జిమ్లోనే గడుపుతారని తాజాగా వైరల్ అవుతున్న తన జిమ్ వీడియోలు చూస్తే అర్థం అవుతోంది. చదవండి: పునీత్ రాజ్కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్.. కన్నడ సినీ పరిశ్రమలో పునీత్ రాజ్కుమార్.. ఎనర్జిటిక్ అండ్ చార్మింగ్ హీరోగా పేరు కూడా ఉంది. జిమ్లోనే కాదూ షూటింగ్ కోసం ఎక్కడికెళ్లినా వర్కౌట్స్ మాత్రం వదలరట. ఫిట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. తాజాగా జేమ్స్ అనే సినిమాకు సైన్ చేసిన పునీత్.. ఇందులో బాడీ బిల్డర్గా కనిపించబోతున్నారట. ఇందుకోసం బాడీ బిల్డర్గా తనని తాను మేకోవర్ చేసుకునేందుకు జిమ్లో ఓవర్గా ఎక్స్ర్సైజులు చేస్తున్నారట. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వర్కవుట్ చేస్తూ సడెన్గా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన జిమ్ సిబ్బంది, సహాయకులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ డేంజర్ స్ట్రోక్ పునీత్ను బలితీసుకుంది. భారత సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. -
పునీత్ రాజ్కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్..
Puneeth Rajkumar Last Tweet Goes Viral: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్(46)ఈరోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. నటుడిగా నేపథ్య గాయడకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యతగా, ఆడియో కంపెనీ ఓనర్గా, నిర్మాతగా ఎన్నో రంగాల్లో కన్నడ ఇండస్ట్రీకి సేవలందించారు పునీత్ రాజ్కుమార్. శాండల్ వుడ్ పవర్ స్టార్గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ మరణం వార్త తెలిసి అభిమానులంతా ఆసుపత్రికి భారీగా తరలి వస్తున్నారు. చదవండి: పునీత్ రాజ్కుమార్ మృతి, షాక్లో భారత సినీ పరిశ్రమ అంతేగాక పునీత్ మృతిని జీర్ణించుకోలేని ఆయన ఫ్యాన్స్ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. దీంతో కర్ణాటకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే పునీత్ మరణాంతరం పలువురు ఆయన సోషల్ మీడియా పోస్టులు సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఆయన చేసిన ఆఖరి ట్వీట్, మాటలు, ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. చివరగా ఆయన తన సోదరుడు, హీరో శివ రాజ్కుమార్కు ట్వీట్ చేశారు. ఆయన నటిస్తున్న భజరంగీ 2 మూవీ విజయం సాధించాలని అన్నయ్యకు, మూవీ టీంకు బెస్ట్ విషెస్ చెబుతూ పునీత్ లాస్ట్ ట్వీట్ చేశారు. చదవండి: తారక్ నా సోదరుడు: పునీత్ పాత వీడియో వైరల్ ದಶಕಗಳ ಹಿಂದೆ ಕಥೆಯೊಂದು ಹುಟ್ಟಿತ್ತು. ನಮ್ಮ ಜನ, ನಮ್ಮ ನೆಲದ ಹಿರಿಮೆಯನ್ನು ಮೆರೆದಿತ್ತು. ನಮ್ಮ ಅಡವಿಯ ಹಸಿರನ್ನು ಜಗತ್ತಿಗೇ ಹರಡಿತ್ತು. ಪೀಳಿಗೆಗೆ ಸ್ಫೂರ್ತಿ ನೀಡಿ ಅಜರಾಮರವಾಗಿತ್ತು. ಆ ಚರಿತ್ರೆ ಮರುಕಳಿಸುವ ಸಮಯವೀಗ ಬಂದಿದೆ. @amoghavarsha @AJANEESHB @PRK_Productions @PRKAudio #mudskipper pic.twitter.com/ncE6CxOQrg — Puneeth Rajkumar (@PuneethRajkumar) October 27, 2021 కన్నడ కంఠీరవ రాజ్కుమార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్కుమార్ వెండితెర మీద తిరుగులేని స్టార్ డమ్ సాధించారు. కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా, అత్యథిక పారితోషికం అందుకున్న హీరోగానూ రికార్డ్ సృష్టించారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్లో 29 సినిమాలు చేశారు పునీత్ రాజ్కుమార్. చివరగా యువరత్న సినిమాలో నటించారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయటంతో పాటు తెలుగు ఆడియన్స్కు చేరవయ్యేందుకు టాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం హోంబలే బ్యానర్లో ద్విత్వ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారాలనుకున్నారాయన. Best wishes for the entire team of #Bhajarangi2. @NimmaShivanna @NimmaAHarsha @JayannaFilms — Puneeth Rajkumar (@PuneethRajkumar) October 29, 2021 -
మాజీ మంత్రిని కలిసిన ప్రముఖ కన్నడ నటుడు
మైసూరు: మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్పను హ్యాట్రిక్ హీరో శివ రాజ్కుమార్ కలిశారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా మైసూరు వచ్చిన ఈశ్వరప్ప అల్పాహారం కోసం ఓ హోటల్కు వెళ్లిన సమయంలో అక్కడే ఉన్న శివరాజ్ కుమార్ ఈశ్వరప్పను కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. -
కన్నడంలోకి ఖైదీ
తెలుగు–తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించారు. ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. హిందీ రీమేక్లో అజయ్ దేవగన్ నటించనున్నారు. తాజాగా ‘ఖైదీ’ కన్నడంలో రీమేక్ కాబోతున్నట్టు తెలిసింది. కార్తీ చేసిన ఖైదీ పాత్రలో కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్ నటిస్తారట. నంద కిశోర్ దర్శకుడు. -
‘విలన్’ వివాదంపై స్పందించిన హీరో
కరునాడ చక్రవర్తి, హ్యాట్రిక్ హీరో శివరాజ్కుమార్ 36 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారని, సినిమా కథ వినకుండా నటించేంందుకు ఆయన ఒప్పుకుంటారా అని శివన్న అభిమానులను కిచ్చా సుదీప్ ప్రశ్నించారు. సుదీప్, శివరాజ్కుమార్ ప్రధాన పాత్రధారులుగా గురువారం ‘విలన్’ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో శివరాజ్కుమార్పై సుదీప్ చేయి చేసుకునే సన్నివేశం ఉంది. ఈ సందర్భంగా తమ అభిమాన నటుడిపై సుదీప్ చేయి చేసుకున్నారని సుదీప్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పెద్ద వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో దావణగెరెలో మీడియాతో సుదీప్ మాట్లాడుతూ... చిత్రరంగంలో ఎంతో అనుభవం ఉన్న శివరాజ్కుమార్ కథ వినకుండా సినిమాలో నటిస్తారా అని ప్రశ్నించారు. అనవసరంగా రాద్ధాంతం చేయకుండా సినిమాను సినిమాగా చూడాలని సూచించారు. కావాలంటే ఆ ఫైట్ సీన్ సినిమా నుంచి తొలగిస్తే తనకు ఏలాంటి అభ్యంతరంలేదని సుదీప్ స్పష్టం చేశారు. సినిమాను చూసిన శివరాజ్కుమార్ అభిమానులు డైరెక్టర్ ప్రేమ్పై ఆక్రోశంను వ్యక్తం చేస్తున్నారు. ఆ సీన్ను సినిమా నుండి తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే అందోళన చేయాలని శివరాజ్కుమార్ అభిమానులు నిర్ణయించారు. అలాగే మరో సీనియర్ నటుడు దర్శన్పై కూడా సుదీప్ స్పందించారు. దర్శన్కు తనకు ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరి మధ్య కొద్దిపాటి మనస్పర్థలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. -
కన్నడ పిలుస్తోంది!
‘అంతకు ముందు ఆ తర్వాత’తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు తెలుగమ్మాయి ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘అమీ తుమీ, అ!’ వంటి హిట్ చిత్రాల్లో భాగమయ్యారు. తాజాగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ తెలుగు భామ కన్నడంలో కాలు పెట్టనున్నారు. కన్నడ నుంచి బంపర్ ఆఫర్ కొట్టేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరసన హీరోయిన్గా ఎంపికయ్యారు. శివరాజ్ కుమార్ హీరోగా లక్కీ గోపాల్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఈషా కాలేజ్ ప్రొఫెసర్గా కనిపిస్తారట. కన్నడంలో వచ్చిన ఈ భారీ ఆఫర్ ఈషా కెరీర్కు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి. -
ఇద్దరు రావణుల కథ
అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ టీజర్ రీలీజ్ వచ్చేసింది. కన్నడ స్టార్ హీరోలు శివరాజ్కుమార్, సుదీప్లు నటించిన ‘ది విలన్’ టీజర్ గ్రాండ్గా విడుదలయ్యింది. ఒక్కటి కాదు.. ఇద్దరు హీరోలకు సంబంధించిన టీజర్లను విడివిడిగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముందుగా ఫ్యాన్స్ కోసం మల్టీఫ్లెక్స్లలో(గురువారం) ఎంపిక చేసిన స్క్రీన్లలో పెయిడ్ టీజర్ను వదిలిన చిత్ర నిర్మాతలు, తర్వాత నిన్న థియేటర్లలో, సోషల్ మీడియాలో వాటిని విడుదల చేశారు. విజువల్ ఎఫెక్ట్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి టీజర్లను కట్ చేశారు. శివన్న, కిచ్చ సుదీప్లు ఇద్దరు ‘రావణ పాత్ర’ గురించి డైలాగ్ చెప్పటం బావుంది. అయితే అసలు విలన్ ఎవరు అన్న విషయంలో సస్పెన్స్ మెయింటెన్ చేశారు. జోగి ఫేమ్ ప్రేమ్(తెలుగులో యోగి) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ దిగ్గజం మిథున్ చక్రవర్తి, టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫ్యాన్స్ అసంతృప్తి... నిజానికి ఈ ప్రాజెక్టు ప్రకటించి మూడేళ్లపైనే గడుస్తోంది. 2015లో కాళి టైటిల్తో తొలుత ఈ ప్రాజెక్టు తెరకెక్కించాలని ప్రేమ్ యత్నించాడు. అయితే ఇద్దరు హీరోలు కథపై అసంతృప్తి వ్యక్తం చేయటంతో డిలే అయ్యింది. చివరకు ఏడాదిన్నర తర్వాత స్క్రిప్ట్ పనులు ఓకే కావటంతో.. ది విలన్ టైటిల్తో షూటింగ్ ప్రారంభమైంది. టీజర్, ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీటీ మాల్లో జరిగిన ఈవెంట్లో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేతుల మీదుగా గురువారం సాయంత్రం టీజర్లు లాంఛ్ చేశారు. తొలుత పెయిడ్ టీజర్ అని ప్రకటించగానే ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయి ఆందోళన చేపట్టారు. అయితే డైరెక్షన్ వెల్ఫెర్ ఫండ్ కోసం ఇదంతా అని డైరెక్టర్ ప్రేమ్ ప్రకటించటంతో అంతా శాంతించారు. వచ్చే నెలలో ఆడియోను విడుదల చేసి, ఆగష్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్ కావటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. -
‘ది విలన్’ టీజర్
-
సూపర్ హిట్ రీమేక్లో బాలయ్య..?
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల జై సింహా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఇలా వరుస సినిమాలో బిజీగా ఉన్న బాలయ్య ఓ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారట. కన్నడలో శివరాజ్ కుమార్, శ్రీ మురళి, శాన్వీలు ప్రధాన పాత్రల్లో నార్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మఫ్టీ. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఈ సినిమాను బాలకృష్ణ హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య మఫ్టీ రీమేక్కు అంగీకరిస్తాడా లేదా చూడాలి. -
ఘనంగా పునీత్ పుట్టినరోజు వేడుకలు
కన్నడ పవర్స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ 43వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. శనివారం బెంగళూరు సదాశివనగరలో ఆయన నివా సం వద్ద అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు చెప్పారు. శుక్రవారం రాత్రి నుంచే నివాసం వద్ద అభిమానుల సందడి ఆరంభమైంది. అభిమానులు అయనకు ప్రీతియ అప్పు, రాజరత్న, నటసార్వభౌమ తదితర బిరుదలతో అభినందనలు తెలిపారు. వారంరోజుల నుంచి అభిమానులు పునీత్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. దివ్యాంగులు, అభిమానులు తెచ్చిన కేక్లను పునీత్ వద్దనకుండా కట్ చేసి వారికి తినిపించారు. పలువురు నటులు, సినీ ప్రముఖులు పునీత్కు జన్మదిన శుభాకాంక్షులు తెలిపారు. అన్న శివరాజ్కుమార్ ఉదయం పునీత్ నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మంచి కథ ఉంటే ఇద్దరం తప్పకుండా కలిసి నటిస్తామన్నారు. సదాశివనగర పోలీసులు కూడా పునీత్ జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ను తినిపించారు. పునీత్, తల్లి పార్వతమ్మ చిత్రపటాన్ని చూసి ఉద్వేగానికి గురయ్యారు. -
ఐ యామ్ సారీ!
... అని చెప్పారట హీరోయిన్ అమీ జాక్సన్. ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. శివరాజ్ కుమార్, సుదీప్, అమీ జాక్సన్ కీలకపాత్రల్లో ‘ది విలన్’ అనే కన్నడ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు కిరణ్కుమార్ (స్క్రీన్ నేమ్ ప్రేమ్). ఈ ఏడాది జూలైలో ఈ సినిమా షూట్ను స్టార్ట్ చేశారు. ఆ షూట్లో అమీ జాక్సన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ నెలలో మరో షెడ్యూల్ను ప్లాన్ చేశారట డైరెక్టర్ ప్రేమ్. ఆ షెడ్యూల్ షూట్ స్టార్ట్ కాకపోయే సరికి ఇండస్ట్రీలో ఈ సినిమాపై రూమర్లు వచ్చాయి. వీటిపై దర్శకుడు స్పందిచారు. ‘‘సినిమా లేట్ అవ్వడంలో నా ప్రమేయం ఏమీ లేదు. అమీ జాక్సన్ వీసా పాబ్లమ్స్ వల్ల ఫిక్స్ చేసిన షెడ్యూల్ టైమ్కి రాలేనని చెప్పారు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిన వెంటనే షూట్లో జాయిన్ అవుతానన్నారు. రాలేకపోయినందుకు ఆమె సారీ కూడా చెప్పారు. అలాగే హీరోలు శివరాజ్ కుమార్, సుదీప్లు బాగా సహకరిస్తున్నారు. షూటింగ్ను డిసెంబర్ కల్లా కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. కానీ, ఇప్పుడు జనవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ప్రేమ్. -
శివన్న కొత్త టీజర్ ఊపేస్తోంది
-
శివన్న కొత్త టీజర్ ఊపేస్తోంది
సాక్షి, సినిమా : కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొత్త సినిమా తగరు టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రం ద్వారా శివరాజ్కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నేరమూ-శిక్ష కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి దునియా సూరీ దర్శకత్వం వహించగా.. భావన, మన్వితాలు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రతీకార నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు టీజర్ను చూస్తే అర్థమౌతోంది. కత్తి.. రక్తపు మరకలు.. పగతో రగిలిపోయే హీరో.. క్రూరమైన విలన్, వరుస హత్యలు... ఇలా టీజర్ ను కట్ చేశారు. ఈ మధ్య సాఫ్ట్ చిత్రాలలో నటిస్తున్న శివన్నను ఒకేసారి మాస్ రోల్లో చూసే సరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి శివరాజ్ సోదరుడు పునీత్తోపాటు తెలుగు హీరో అల్లు శిరీష్ కూడా హాజరు కావటం విశేషం. ఈ మేరకు శిరీష్ తన ట్విట్టర్లో ఫోటోలను పోస్ట్ చేశాడు. తగరుతోపాటు శివరాజ్ కుమార్ మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి నార్తన్ డైరెక్షన్ లో తెరకెక్కే ముఫ్తీ కాగా, మరోకటి ప్రేమ్ దర్శకత్వంలో మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న ది విలన్. ఇందులో కిచ్ఛా సుదీప్(ఈగ ఫేమ్)తోపాటు బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, అమీజాక్సన్ నటిస్తున్నారు. -
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు : సూపర్ స్టార్
సాక్షి, బెంగళూరు : తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ప్రస్తుతం సినిమాల్లో సంతోషంగా ఉన్నానని నటుడు శివరాజ్కుమార్ అన్నారు. శుక్రవారం హాసన్ నగరంలో కళ్యాణ్ జువెలరీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చిన శివరాజ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ... తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ వదంతులేనని అందులో నిజం లేదని అన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే మొదట మీడియాకే చెబుతానని అన్నారు. తాను ప్రస్తుతం కళ్యాణ్ జువెలరి ప్రచారకర్తగా ఉన్నానని చెప్పారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తన తల్లి మృతి చెందిన సందర్భంగా తమను పరామర్శించడానికి వచ్చారని, ఇందులో ఎటువంటి రాజకీయం లేదన్నారు. -
కాళహస్తీశ్వరగా...
హీరోగా వందకు పైగా సినిమాలు... ‘అభినవ కన్నడ కంఠీరవ’గా కర్ణాటక ప్రేక్షకుల కితాబులు... వెరసి తండ్రి రాజ్కుమార్కి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కన్నడ హీరో శివరాజ్ కుమార్. త్వరలో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారీయన. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో అతిథి పాత్ర చేశారాయన. ఈ చిత్రంలో కాళహస్తీశ్వర పాత్రలో కనిపించనున్నారు. నేడు శివరాజ్ కుమార్ తల్లి పార్వతమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆ లుక్ని విడుదల చేశారు. ఈ నెల 16న తిరుపతిలో పాటల్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. హేమమాలిని, శ్రీయ, కబీర్బేడి నటించిన ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరావు. -
శాతకర్ణిలో శివరాజ్?
నందమూరి తారక రామారావు నటించిన పలు చిరస్మరణీయ సినిమాల్లో ‘భూకైలాస్’, ‘శ్రీకృష్ణ దేవరాయ’ సినిమాలు కూడా ఉంటాయి. ఈ రెండూ కన్నడ కంఠీరవ రాజ్కుమార్ నటించిన సినిమాలకు రీమేక్. అలాగే తెలుగులో ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలను కన్నడలో రాజ్కుమార్, ఆయన సినిమాల తెలుగు రీమేక్లో ఎన్టీఆర్ చేశారు. ఎన్టీఆర్, రాజ్కుమార్లు మంచి స్నేహితులు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ఈ స్నేహితులిద్దరి తనయులు కలసి నటించనున్నారట. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో రాజ్కుమార్ తనయుడు శివ రాజ్కుమార్ అతిథి పాత్ర చేయనున్నారని సమాచారం. ఓ పవర్ఫుల్ పాత్రలో కన్నడ హీరో కనిపిస్తారట. శాతకర్ణిగా బాలకృష్ణ, వశిష్ఠదేవిగా శ్రీయ, గౌతమి బాలాశ్రీగా హేమమాలిని తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. మహేశ్తో నో మల్టీస్టారర్: బాలకృష్ణ, మహేశ్బాబు హీరోలుగా ఓ మల్టీస్టారర్ రూపొందించడానికి దర్శకుడు కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. ‘జనతా గ్యారేజ్’ తర్వాతి సినిమా మహేశ్తోనే అని కొరటాల ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. ఆ సినిమా ఈ మల్టీస్టారరేనంటూ ఫిల్మ్నగర్లో షికారు చేస్తున్న పుకారుకి దర్శకుడు చెక్ పెట్టారు. ‘నా నెక్ట్స్ సినిమాలో ఫ్యాన్సీ కాంబినేషన్లు లేవు, మల్టీస్టారర్ కూడా కాదు’ అని కొరటాల చెప్పారు. అంటే... బాలకృష్ణ-మహేశ్ మల్టీస్టారర్ జస్ట్ రూమర్ అన్నమాట. లెజెండ్.. 950 టు 1000!: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సినిమా ‘లెజెండ్’. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అర్చన థియేటర్లో ఈ చిత్రం 950 రోజులు పూర్తి చేసుకుని 1000 రోజుల దిశగా పయనిస్తోంది. నేడు 964వ రోజు. గతంలో రజనీకాంత్ ‘చంద్రముఖి’ సినిమా చెన్నైలోని ఓ థియేటర్లో 891 రోజులు ప్రదర్శింపబడింది. దక్షిణాదిలో వెయ్యి రోజులకు చేరువ కానున్న సినిమా ‘లెజెండ్’ కావడం గమనార్హం.