SonyLIV
-
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ ఏడాదిలో విడుదలై తొలి విజయాన్ని అందుకున్న మలయాళ సినిమా 'రేఖా చిత్రం' ఓటీటీలోకి రానుంది. మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేటివ్ చేస్తారు..? అనే కాన్సెప్ట్తో ప్రతి సీన్ ఆసక్తిగా ఈ మూవీని తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చే చిత్రాలు మీకు ఇష్టం అయితే.. 'రేఖా చిత్రం'ను చూసేయండి. మిమ్మల్ని ఎక్కడా కూడా నిరుత్సాహపరచదు. ఆసిఫ్ అలీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి క్యామియో రోల్లో కనిపించడం విశేషం. ఈ మూవీకి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు.జనవరి 9న మలయాళంలో మాత్రమే విడుదలైన రేఖాచిత్రం. మార్చి 7న ఓటీటీలోకి వచ్చేస్తుంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో ఆసిఫ్ అలీతో పాటు అనస్వర రాజన్, మనోజ్ కే జయన్, సిద్ధిఖీ, జగదీశ్, సాయికుమార్ వంటి వారు నటించారు. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 25 రోజ్లులోనే రూ. 75 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.బాక్సాఫీస్ వద్ద ఇంకా థియేటరికల్ రన్ మంచిగానే కొనసాగుతుంది. అయినప్పటికీ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానున్నడం విశేషం. ఇదొక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కథలో భాగంగా ఒక ఆత్మహత్య కేసును సీఐ వివేక్ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) విచారణ చేపడుతాడు. గ్యాంబ్లింగ్ స్కామ్ లో దొరికిపోయి సస్పెండ్ అయిన ఈ కేసు కోసం మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలో 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో ఈ ఆత్మహత్యకు లింక్ ఉందని ఆయన గుర్తిస్తాడు. 1985 సమయంలో ఓ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి మిస్ అయిన బాలిక కేసును కూడా వివేక్ దర్యాప్తు చేస్తాడు. ఇలా ఒక సంఘటనతో ఎన్నో ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఫైనల్గా చిక్కుముడి లాంటి ఈ కేసులను ఆయన ఎలా ఛేదిస్తాడనేది కీలకంగా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్గా వివేక్ దర్యాప్తు ఎలా ఉంటుందో తెలియాలంటే రేఖాచిత్రం చూడాల్సిందే. -
ఓటీటీకి మోస్ట్ వయొలెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గతేడాది రిలీజైన మోస్ట్ వయలెంట్ చిత్రం మార్కో(Marco). ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్బస్టర్గా నిలిచింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం.. మలయాళంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది.అంతేకాకుండా మలయాళంతో(Malayalam Movie) పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ(OTT) విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల 14న లవర్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మార్కో ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్(Sony Liv) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.మార్కో కథేంటంటే..?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
ఓటీటీలోకి రూ.100 కోట్ల సంచలనం ‘మార్కో’.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మార్కో(Marco Movie).. గతేడాది రిలీజైన మోస్ట్ వయలెంట్ చిత్రమిది. ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా..మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ ఈ మూవీ రైట్స్ కొనేందుకు పోటీ పడ్డాయట. చివరకు సోనీలివ్ (Sony LIV) ఈ సినిమాను అన్ని భాషల హక్కులతో భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.స్ట్రీమింగ్ అప్పుడేనా?మోస్ట్ వయలెంట్ చిత్రంగా చరిత్రకెక్కిన ఈ మూవీ అన్ని భాషల డిజిటల్ రైట్స్ని సోనీలివ్ కొనుగోలు చేసింది. మలయాళ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఏ సినిమాకు పెట్టని రేటు ఈ చిత్రానికి పెట్టారట. థియేటర్స్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో..ఓటీటీలోనూ మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రంపై భారీ పోటీ ఏర్పడింది. (చదవండి: ఓటీటీలో రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా.. సడెన్గా తెలుగులో స్ట్రీమింగ్)అయితే ఇప్పుడప్పుడే కాకుండా కాస్త ఆలస్యంగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని సోనీలివ్ భావిస్తోందట. పిభ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటిటిలో వచ్చే అవకాసం ఉందంటోంది మాలీవుడ్ టాక్.త్వరలోనే ఓటీటీ రిలీజ్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.మార్కో కథేంటి?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.Both #Marco & #Rekhachithram OTT deals are closed with Sony Liv. Figures somewhat the same range only with #Marco slightly ahead. pic.twitter.com/FZl8oQvEIj— Friday Matinee (@VRFridayMatinee) January 25, 2025 -
ఓటీటీలో మలయాళ హిట్ మూవీ.. ఎప్పుడంటే?
జోజు జార్జ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం పానీ. ఒకే ఒక సంఘటన సాధారణ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసి, దాచిన రహస్యాలను బహిర్గతం చేసే, విధేయతలను పరీక్షించే భయంకరమైన భయాలను ఎదుర్కొనేలా చేసే ప్రపంచంలోకి తీసుకెళుతుంది. నీడల నుంచి నిజం బయటపడుతుందా? లేదా దానిని బహిర్గతం చేసే ప్రయత్నంలో ప్రేమించే ప్రతిదాన్ని నాశనం చేస్తుందా? థియేట్రికల్ రన్ తర్వాత పానీ ఇప్పుడు జనవరి 16 నుంచి సోనీ లివ్లో అందుబాటులోకి వస్తోంది. ఈ సందర్భంగా జోజు జార్జ్ (Joju George) మాట్లాడుతూ, ‘‘దాగి ఉన్న నిజాలను వెలికి తీయడానికి మించినది పానీ. ఇది వాటిని బహిర్గతం చేయడానికి అయ్యే వ్యయ ప్రయాసలను వెల్లడిస్తుంది. ఇది కుటుంబం, విధేయత, న్యాయం, ప్రతీకారానికి సంబంధించినది, ఇక్కడ ప్రతి నిర్ణయం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, మానవ మనస్తత్వాన్ని లోతుగా ప్రతిబింబిస్తుంది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, పానీ ఇప్పుడు సోనీ లివ్లో మరింత మంది ప్రేక్షకులను చేరుకుంటోంది. ఇదో భావోద్వేగ ప్రయాణం’’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.దర్శకత్వం, రచనతో పాటు నటుడిగానూ జోజు జార్జ్ కనిపించే ఈ చిత్రంలో సాగర్ సూర్య, జునైజ్ వి.పి, బాబీ కురియన్, అభినయ, (Abhinaya) అభయ హిరణ్మయి, సీమ, చాందిని శ్రీధరన్, ప్రశాంత్ అలెగ్జాండర్, సుజిత్ శంకర్, రినోష్ జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రియాజ్ ఆడమ్ నిర్మాతలు ఎడి స్టూడియోస్ పతాకంపై సిజో వడక్కన్ నిర్మిస్తుండగా... సినిమాటోగ్రఫీని వేణు, జింటో జార్జ్ అందిస్తున్నారు.చదవండి: డబ్బు కోసం నన్నే చంపాలనుకుంది.. నా కూతురికి తండ్రి ఇంకెవరో..?: దేవిక మాజీ భర్త -
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సిరీస్ రివ్యూ
భారతదేశ స్వాతంత్య్రం కోసం సాగిన బహుముఖ పోరాటాన్ని వివరిస్తూ చరిత్ర, నాటకం యాక్షన్లను మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' అందించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ సిరీస్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), లార్డ్ లూయిస్ మౌంట్బాటెన్ (ల్యూక్ మెక్గిబ్నీ) పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయ కుట్రల సూక్ష్మమైన విశ్లేషణ, వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లు ఆసక్తికరంగా సాగుతాయి.నెహ్రూ, పటేల్, గాంధీల విభిన్న భావజాలంతో కూడిన సన్నివేశాలతో ఈ సిరీస్ వైవిధ్యభరిత అనుభూతిని అందిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురివీ.. వేటికవే విభిన్న థృక్కోణాలైనా సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. దేశ నిర్మాణం ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణ నెహ్రూ పాత్ర చిత్రణలో తెలుస్తుంది. ముహమ్మద్ అలీ జిన్నాలోని అహం, ఆశయం, తెలివిని నటుడు ఆరిఫ్ జకారియా చక్కగా చూపించాడు. సర్దార్ పటేల్గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్గా రాజేష్ కుమార్, లార్డ్ లేడీ మౌంట్బాటన్గా కార్డెలియా బుగేజా మెరుస్తారు. మలిష్కా మెండోన్సా సరోజినీ నాయుడుగా కనిపిస్తారు.ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. పునర్నిర్మించిన వైస్రాయ్ హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు..ఇలా ప్రతి ఫ్రేమ్ సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. కథ, కథనాలను భావోద్వేగభరితంగా అందించటంలో అద్వానీ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుటుంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఇతర చిత్రీకరణల మాదిరిగా కాకుండా, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు దాని పరిధిని కుదించింది. ఇది గాంధీ–జిన్నా చర్చలు విభజనకు దారితీసిన వంటి సంఘటనలపైనే దృష్టి పెట్టింది. రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెరవెనుక చర్చలను చక్కగా చూపించారు.చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్' -
ఈ వారం ఓటీటీల్లో 34 సినిమాలు రిలీజ్.. అవేంటంటే? (ఫొటోలు)
-
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం టాలీవుడ్ సినిమాలదే హవా!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. అంతా వినాయక చవితి పండుగ సందడితో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. గతనెల రిలీజైన హిట్ కొట్టిన టాలీవుడ్ చిత్రాలు ఈ వారంలో ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. అవేంటో తెలుసుకుందాం.ఈ వారం ఓటీటీల్లో ఎక్కువగా తెలుగు సినిమాలు ఉండడం అభిమానుల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ ఈ వారం నుంచే డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సందడి చేయనుంది. దీంతో పాటు హిట్ మూవీ ఆయ్, బెంచ్ లైఫ్ లాంటి టాలీవుడ్ వెబ్ సిరీస్ అభిమానులకు కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మిస్టర్ బచ్చన్(టాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12ఆయ్ (టాలీవుడ్ చిత్రం) - సెప్టెంబర్ 12సెక్టార్ 36- (బాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13బ్రేకింగ్ డౌన్ ది వాల్(డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్-2 (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12మిడ్నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్-2- (వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12అగ్లీస్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 13అమెజాన్ ప్రైమ్ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ సిరీస్)-సెప్టెంబర్ 10జీ5బెర్లిన్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 13నునాకుజి(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 13సోనిలివ్తలవన్(మలయాళ సినిమా)- సెప్టెంబర్ 10బెంచ్ లైఫ్(తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12డిస్నీ ప్లస్ హాట్స్టార్గోలి సోడా రైజింగ్ (తమిళ సినిమా)- సెప్టెంబర్ 13హౌ టు డై ఆలోన్ -సెప్టెంబర్ 13ఇన్ వోగ్ ది 90ఎస్(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13లెగో స్టార్ వార్స్: రిబిల్డ్ ది గెలాక్సీ- సెప్టెంబర్ 13జియో సినిమాకల్బలి రికార్డ్స్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 12లయన్స్ గేట్ ప్లేలేట్ నైట్ విత్ ది డెవిల్(హారర్ మూవీ)- సెప్టెంబర్ 13 -
ఓటీటీకి టాలీవుడ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన టాలీవుడ్ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్. ఈ వెబ్ సిరీస్కు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల నిర్మించారు. ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.ఐటీరంగంలో బెంచ్పై ఉండడం అనే మాటలు తరచుగా వింటుంటాం. ఆ సబ్జెక్ట్నే వెబ్ సిరీస్గా ఆవిష్కరించారు. ట్రైలర్లో డైలాగ్స్, సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు దాదాపు ఏడు భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్లో ఈ సిరీస్ ప్రసారమవ్వనుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, నయన్ సారిక, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్కు పీకే దండి సంగీతమందించారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బిజు మీనన్, ఆసీఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'తలవన్'. ఈ సినిమాను జిస్ జాయ్ దర్శకత్వంలో తెరకెక్కించరు. ఈ ఏడాది మే నెలలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రేక్షకులను మెప్పించింది. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో హిట్ టాక్ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12 నుంచి సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడతో సహా మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పోలీస్ అధికారి ఓ కేసును ఎలా చేధించాడనేది ఈ సినిమాలో చూపించారు. #Thalavan will be streaming from Sept 12 on SONY LIV. pic.twitter.com/5A1GE3jXs6— Christopher Kanagaraj (@Chrissuccess) August 11, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టర్బో. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ మూవీగా మలయాళంలో తెరకెక్కించారు. మే 23న మలయాళంలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో మెప్పించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనిలివ్ ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో అంజనా జయ ప్రకాశ్, రాజ్ బి.శెట్టి, శబరీష్ వర్మ, సునీల్, కబిర్ దుహాన్ సింగ్లు కీలక పాత్రలు పోషించారు.Hold on to your seats as Mammootty takes you on a roller coaster ride of thrills and twists. Stream Turbo from August 9th only on Sony LIV.#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Action #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas pic.twitter.com/xhwBhfFxbk— Sony LIV (@SonyLIV) July 27, 2024 -
2024 OTT ఫస్టాఫ్: ఎక్కువమంది చూసిన సిరీస్, సినిమాలివే!
బాక్సాఫీస్ వద్ద రిలీజయ్యే పెద్ద సినిమాలన్నీ కచ్చితంగా ఏదో ఒక ఓటీటీలోకి రావాల్సిందే! ఈ పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్నాయి. వీటిమీదే ఆధారపడకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ను తీసుకువస్తున్నాయి. సినిమాలు, సిరీస్లు, రియాలిటీ షోలతో కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. అలా ఈ ఏడాది బోలెడన్ని చిత్రాలు, సిరీస్లు ఓటీటీలో సందడి చేశాయి. మరి ఈ ఆరు నెలల్లో (జనవరి- జూన్) ఎక్కువమంది చూసిన సినిమాలేంటో చూసేద్దాం..ఆర్మాక్స్ నివేదికల ప్రకారం.. ఎక్కువ మంది చూసిన హిందీ ఓటీటీ కంటెంట్ ఇదే..1. పంచాయత్- సీజన్ 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 2.82 కోట్లమంది వీక్షించారు.2. హీరామండి (నెట్ఫ్లిక్స్) -2.30 కోట్ల మంది చూశారు.3. ఇండియన్ పోలీస్ ఫోర్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 1.95 కోట్ల మంది వీక్షించారు.4. కోట ఫ్యాక్టరీ సీజన్ 3 (నెట్ఫ్లిక్స్) - 1.57 కోట్ల మంది చూశారు.5. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 & 4 (హాట్స్టార్) -1.48 మంది చూశారు.6. షో టైమ్ (హాట్స్టార్) - 1.25 కోట్ల మంది వీక్షించారు.7. గుల్లక్ సీజన్ 4 (సోనిలివ్) -1.21 కోట్ల మంది చూశారు.8.మహారాణి సీజన్ 3 (సోనీలివ్) - 1.02 కోట్ల మంది వీక్షించారు.9. కిల్లర్ సూప్ (నెట్ఫ్లిక్స్) - 92 లక్షల మంది చూశారు.10. జంనపార్ (అమెజాన్ మినీ టీవీ) - 92 లక్షల మంది చూశారు.11. కర్మ కాలింగ్ (హాట్స్టార్) - 91 లక్షల మంది వీక్షించారు.12. రైసింఘని వర్సెస్ రైసింఘని (సోనిలివ్) - 85 లక్షల మంది చూశారు.13. మామ్లా లీగల్ హై (నెట్ఫ్లిక్స్)- 81 లక్షల మంది వీక్షించారు.14. లూటెర్ (హాట్స్టార్) - 80 లక్షల మంది చూశారు.15. బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హాట్స్టార్) - 80 లక్షల మంది చూశారు.చదవండి: సింగర్కు అధ్భుతమైన టాలెంట్.. ట్రాన్స్జెండర్ అంటూ కామెంట్స్ -
ఓటీటీకి మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ టర్బో. మే 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ నటుడు సునీల్ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ అగ్ర నటుడు రాజ్ బీ శెట్టి విలన్గా మెప్పించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు రిలీజైన రెండు నెలల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 9 నుంచి సోనీలివ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ഒരു മാസ്സ് ആക്ഷൻ മമ്മൂട്ടി ചിത്രം!ടർബോ ഓഗസ്റ്റ് 9 മുതൽ Sony LIVൽA mass action entertainer starring Mammootty opposite Raj B Shetty!Turbo, coming on Sony LIV from August 9th#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas #SamadTruth pic.twitter.com/LZ88S0wOxq— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?
అక్కినేని హీరో అఖిల్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమా విడుదలైన ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. పెద్ద పెద్ద సినిమాలే రిలీజైన 50 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా.. ఏజెంట్ ఓటీటీ రైట్స్ సోని లివ్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీ రావచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ స్ట్రీమింగ్ తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల ఏజెంట్ సినిమాను సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత సోనిలివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుంచి ఏజెంట్ ప్రీమియర్ పోస్టర్ లను తొలగించింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో స్ట్రీమింగ్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. మరోవైపు అఖిల్ ధీర అనే చిత్రంలో నటిస్తున్నారు. -
ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. టీజర్ చూస్తే చాలు!
కోలీవుడ్ భామ త్రిష గతేడాది లియోతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించనున్నారు. స్టాలిన్ తర్వాత మెగాస్టార్తో మరోసారి జతకట్టనున్నారు. వశిష్ట డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ జాబితాలో హీరోయిన్ త్రిష కూడా చేరిపోయారు. త్రిష కృష్ణన్, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న ఎమోషనల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్రింద. సూర్య మనోజ్ వంగలదర్శకత్వంలో ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే 'ఈ ప్రపంచంలో మనం రాకముందు ఎంత చెడైనా ఉండొచ్చు.. కానీ వెళ్లేముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్లడం మన బాధ్యత అనే డైలాగ్' విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 2వ తేదీ నుంచి సోనిలివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్లో జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఏడాది తర్వాత ఓటీటీకి ఏజెంట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టాలీవుడ్ యంగ్ అఖిల్ అక్కినేని, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఈ చిత్రం గతేడాది థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. సురేందర్ 2 సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 28, 2023 థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏజెంట్ ఓటీటీకి రాలేదు. దీంతో అభిమానులు ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో చాలాసార్లు స్ట్రీమింగ్కు వస్తుందని భావించినా అలా జరగలేదు. అయితే తాజాగా జూలైలో ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్కుమార్, మురళీ శర్మ, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో వెబ్ సిరీస్ కంటెంట్పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. దీంతో సరికొత్త కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. హుమా ఖురేషి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన పొలిటికల్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాకపోతే అది టాలీవుడ్కు సంబంధించినది మాత్రం కాదు. మొదటి, రెండు సీజన్స్ సూపర్ హిట్గా మహారాణి సీజన్-3 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈనెల 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ సిరీస్లో బీహార్లో హానికరమైన మద్యం వ్యాపారం గురించి చూపించనున్నారు. ఈ సిరీస్ను సుభాష్ కపూర్ కథను అందించగా.. కరణ్ శర్మ దర్శకత్వం వహించారు. రాజకీయాలు నేపథ్యంగా కల్పిత కథ ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించారు. కాంగ్రా టాకీస్ పతాకంపై డింపుల్ ఖర్బందా, నరేన్ కుమార్ ఈ వెబ్ సిరీస్ను నిర్మించారు. కాకపోతే ఈ సిరీస్ కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలో 37 సినిమాలు/ సిరీస్లు.. ఓ పట్టు పట్టేయండి మరి!
ఓటీటీలకు గిరాకీ పెరిగిపోయింది. అటు థియేటర్లో రిలీజైన సినిమాలను, ఇటు సొంతంగా సినిమాలు, సిరీస్లు నిర్మిస్తూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు ట్రెండ్కు తగ్గట్లుగా విభిన్న కంటెంట్తో సినీప్రియులను ఆకర్షిస్తున్నాయి. 2023కి ముగింపు పలకడానికి ఇంకా ఒక్క నెల మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ ఏడాదికిగానూ ఎక్కువ పాపులర్ అయిన సిరీస్లు ఇవే అని ఐఎమ్డీబీ ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో ఫర్జి, గన్స్ అండ్ గులాబ్స్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లు టాప్ 3లో వరుసగా చోటు దక్కించుకున్నాయి. కోహ్రా, అసుర్ 2 నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. రానా నాయుడు ఆరో స్థానంలో ఉండగా దహాద్, సాస్, బహు ఔర్ ఫ్లెమింగో, స్కూప్, జూబ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటికి పోటీనిచ్చేందుకు కొత్త సినిమాలు, సిరీస్లు రిలీజ్కు రెడీ అయ్యాయి. మరి డిసెంబర్ నెలలో ఓటీటీలోకి వచ్చే చిత్రాలు, సిరీస్లేంటో చూసేద్దాం... అమెజాన్ ప్రైమ్ ► క్యాండీ కేన్ లేన్ - డిసెంబర్ 1 ► మేరీ లిటిల్ బ్యాట్మెన్ - డిసెంబర్ 8 ► యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ - డిసెంబర్ 8 ► రేచర్ 2 - డిసెంబర్ 15 హాట్స్టార్ ♦ ద షెఫర్డ్ - డిసెంబర్ 1 ♦ మాన్స్టర్ ఇన్సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ - డిసెంబర్ 1 ♦ ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ - డిసెంబర్ 1 ♦ ద ఫ్రీలాన్సర్: ద కన్క్లూజన్ - డిసెంబర్ 15 ♦ బీటీఎస్ మోనమెంట్స్: బియాండ్ ద స్టార్స్ - డిసెంబర్ 20 ♦ పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలంపియన్స్ - డిసెంబర్ 20 నెట్ఫ్లిక్స్ ► మే డిసెంబర్ - డిసెంబర్ 1 ► మిషన్ రాణిగంజ్ - డిసెంబర్ 1 ► స్వీట్ హోమ్ 2 - డిసెంబర్ 1 ► ద ఆర్చీస్ - డిసెంబర్ 7 ► మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ - డిసెంబర్ 7 ► జిగర్తాండ డబుల్ ఎక్స్ - డిసెంబర్ 8 ► లీవ్ ద వరల్డ్ బిహైండ్ - డిసెంబర్ 8 ► ద క్రౌన్ సీజన్ 6, రెండో భాగం - డిసెంబర్ 14 ► చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ యానిమేట్ ఫిలిం - డిసెంబర్ 15 ► ట్రెవర్ నోవా: వేర్ వాస్ ఐ - డిసెంబర్ 19 ► మాస్ట్రో - డిసెంబర్ 20 ► రెబల్ మూన్: ద చైల్డ్ ఆఫ్ ఫైర్ - డిసెంబర్ 22 ► జియోంగ్సియోంగ్ క్రియేచర్ సీజన్ 1 పార్ట్ 1 - డిసెంబర్ 22 ► కర్రీ అండ్ సైనేడ్: ద జెల్లీ జోసెఫ్ కేస్ డాక్యుమెంటరీ - డిసెంబర్ 22 ► రిక్కీ జెర్వాయిస్: అర్మగెడాన్ - డిసెంబర్ 25 ► మనీ హెయిస్ట్ బెర్లిన్ - డిసెంబర్ 29 లయన్స్ గేట్ ప్లే ♦ డిటెక్టివ్ నైట్: రోగ్ - డిసెంబర్ 1 జియో సినిమా ► 800 (సినిమా) - డిసెంబర్ 2 ► జర హట్కే జర బచ్కే - డిసెంబర్ 2 ► స్మోదర్డ్ - డిసెంబర్ 8 ► స్కూబీ డూ అండ్ క్రిప్టో టూ - డిసెంబర్ 10 ► ద బ్లాకెనింగ్ - డిసెంబర్ 16 ► ఆస్టరాయిడ్ సిటీ - డిసెంబర్ 25 సోనీలివ్ ♦ చమక్ సిరీస్ - డిసెంబర్ 7 జీ5 ► కడక్ సింగ్ - డిసెంబర్ 8 ► కూసే మునిస్వామి వీరప్పన్ - డిసెంబర్ 8 యాపిల్ టీవీ ♦ ద ఫ్యామిలీ ప్లాన్ - డిసెంబర్ 15 చదవండి: ఆ కంటెస్టెంట్ చేతికి ఫినాలే అస్త్ర.. ఎలిమినేషన్ గండం గట్టెక్కితేనే టాప్ 5లోకి -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంపూర్ణేశ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ నెల రోజులు కాకముందే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ త్వరలోనే ఓటీటీలో అలరించనుంది. నవంబర్ 17న లేదా 24న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ మూవీ సోనీ లివ్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా.. తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్ర పోషించారు. అసలు కథేంటంటే.. 'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్
చాలామంది వీకెండ్లో థియేటర్కు వెళ్లి సినిమా చూసి కాలక్షేపం చేస్తుంటారు. అయితే రోజుకో సినిమా చూడాలంటే మాత్రం ఓటీటీని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదనే చెప్పాలి. అటు ఒక వారంలో థియేటర్లో ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో అంతకు మించిన చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్ల కంటెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. మరి ఈ శుక్రవారం (నవంబర్ 3న) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అలాగే స్ట్రీమింగ్ అవుతోంది అని రాసి ఉన్న సినిమాలు ఈ రోజే ఓటీటీలోకి వచ్చాయని అర్థం. అమెజాన్ ప్రైమ్ వీడియో ► తకేశి క్యాటిల్ గేమ్ షో - స్ట్రీమింగ్ అవుతోంది ► ఇన్విజిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► రత్తం - నవంబర్ 3 ► PI మీనా (హిందీ సిరీస్) - నవంబర్ 3 హాట్స్టార్ ► స్కంద - నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► కాఫీ విత్ కరణ్ షో రెండో ఎపిసోడ్ -స్ట్రీమింగ్ అవుతోంది ► లోకి రెండో సీజన్, ఐదవ ఎపిసోడ్ - స్ట్రీమింగ్ అవుతోంది ► ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 నెట్ఫ్లిక్స్ ► జవాన్ - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆల్ ద లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఒనిముషా (జపనీస్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► యునికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► మ్యాడ్ - నవంబర్ 3 ► బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► డైలీ డోస్ ఆఫ్ సన్షైన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 3 ► ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబర్ 3 ► న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► సెల్లింగ్ సన్సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 3 ► ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబర్ 3 సోనీలివ్ ► స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 బుక్ మై షో ► హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబర్ 3 ► మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► ద థీఫ్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబర్ 3 ఆపిల్ ప్లస్ టీవీ ► ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 జియో సినిమా ► టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 3 చదవండి: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్పై రతికా ఫైర్! -
ఉచితంగా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. అదిరిపోయే జియో కొత్త ప్లాన్స్
రిలయన్స్ జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్లు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తాయి. అపరిమిత కాలింగ్, డేటా అలాగే సోనీ లివ్ (SonyLiv), జీ5 (Zee5) కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ను అందిస్తాయి. రూ. 3662 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2.5 GB డేటా, అపరిమిత 5G డేటా, రోజుకు 100 SMSలతో వస్తుంది. ఈ ప్లాన్లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్తో పాటు సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు ఉచితంగా వస్తాయి. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 3226 ప్లాన్: ఈ ప్లాన్లో అపరిమిత కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMSలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్తో పాటు సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్తో పాటు సోనీలివ్ సబ్స్క్రిప్షన్లు ఇతర ప్రయోజనాలు. రూ. 3225 ప్లాన్: ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా కోటా, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్తో పాటు ఈ ప్లాన్లో జీ5 సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇక ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వద్దనుకున్నవారికి తక్కువ ధరకు మరో వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంది. అదే రూ. 1,999 ప్లాన్. ఇది అపరిమిత 5G డేటా, కాలింగ్తో వస్తుంది. వీటితో పాటు 2.5GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMS కూడా అందిస్తుంది. ఈ ప్లాన్లో థర్డ్-పార్టీ ఓటీటీ ప్రయోజనాలేవీ లేవు కానీ ఇందులో జియో యాప్లు, సేవలకు యాక్సెస్ ఉంటుంది. -
అఖిల్ ఫ్యాన్స్కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!
అక్కినేని అఖిల్ ఇటీవలే నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే) అయితే ఈ విషయంలో ఈ మూవీకి మరో షాక్ తగిలింది. అయితే వైజాగ్కు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ సతీశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 29న ఏజెంట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే విధించింది. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన అఖిల్ ఫ్యాన్స్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఏజెంట్ మూవీ ఇప్పుడైన వస్తోందని ఆశించిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు) -
ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత ఆ రోజే రిలీజ్
ఏ సినిమా అయినా మహా అయితే నెల.. లేదంటే నెలన్నరలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ అక్కినేని హీరో అఖిల్ నటించిన 'ఏజెంట్' మాత్రం పత్తా లేకుండా పోయింది. అప్పుడెప్పుడో ఏప్రిల్ చివర్లో థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నా.. దాన్ని అలా వదిలేశారు. దీంతో అందరూ ఆ మూవీ గురించి మర్చిపోయారు. ఇన్నాళ్లకు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏమైంది? దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్తో తీసిన యాక్షన్ మూవీ 'ఏజెంట్'. అయితే రిలీజ్కి ముందు అంచనాలు బాగానే ఉండటంతో.. హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఘోరంగా బోల్తా కొట్టింది. పదుల కోట్ల నష్టాన్ని నిర్మాతకు మిగిల్చింది. దీంతో డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన సోనీ లివ్.. ఓటీటీ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసింది. (ఇదీ చదవండి: సమ్మోహనుడా పాట షూటింగ్లో దర్శకుడితో గొడవ, ఏడ్చేసిన హీరోయిన్!) ఐదు నెలల తర్వాత అయితే మే 19నే తొలుత ఓటీటీ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ సమయానికి విడుదల చేయలేదు. అప్పుడు ఇప్పుడు అనుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా పక్కనబెట్టేశారు. దీంతో అందరూ 'ఏజెంట్' గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో సెప్టెంబరు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు ఐదు నెలల తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇది నిజంగా విశేషమే. కథేంటి? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) The wait is over! Brace yourself for the wild adrenaline rush! The Agent starring Mammotty and Akhil Akkineni will be streaming on Sony LIV from 29th Sept.#SonyLIV #AgentOnSonyLIV #Agent @AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 pic.twitter.com/zYL0ljh8M1 — Sony LIV (@SonyLIV) September 22, 2023 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ, మరో థ్రిల్లర్ సిరీస్ కూడా!
సినిమా సినిమానే.. ఓటీటీ ఓటీటీనే! వీకెండ్లో థియేటర్కు వెళ్లి సినిమా చూశాం కదా అని ఓటీటీలో మూవీస్, వెబ్ సిరీస్ చూడకుండా ఉండలేం కదా! అందుకే ఓటీటీలు సినీప్రియులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్తో ముందుకు వస్తూనే ఉంది. ప్రతివారం ఏదో ఒక ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజవుతూనే ఉన్నాయి. ఇప్పటికే భోళా శంకర్ సెప్టెంబర్ 15న నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యేందుకు రెడీ అయింది. తాజాగా మరో సినిమా అదే రోజు రిలీజ్ అయ్యేందుకు సంసిద్ధమైంది. అదే 'జర్నీ ఆఫ్ లవ్ 18+'. నస్లీన్ కె.గపూర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అరుణ్ డి.జోస్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో జూలై 7న రిలీజైన ఈ చిత్రం అక్కడి యూత్ను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీని సోనీలివ్లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి ఈ చిత్రం సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ జానర్కు సబంధించిన కంటెంట్ను ఇష్టపడతారు. అందుకే మేకర్స్ కూడా ఈ తరహా సినిమాలు, సిరీస్లపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అలా రూపొందిన వెబ్ సిరీసే 'బంబై మేరీ జాన్'. 1960లో ముంబై పోలీసులకు, గ్యాంగ్స్టర్స్కు మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. షుజాత్ సౌదాగర్ డైరెక్ట్ చేసిన బంబై మేరీ జాన్ సిరీస్లో కేకే మీనన్, అవినాశ్ తివారి ప్రధాన పాత్రలు పోషించారు. నివేదిత భట్టాచార్య, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఈ నెల 14 నుంచి అందుబాటులోకి రానుంది. చదవండి: ఆ హీరో నా కొడుకే, కానీ మా మధ్య ఆ అనుబంధం లేదు.. కలిసి దిగిన ఫోటో ఒక్కటీ లేదు! -
ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఎంటర్టైన్మెంట్ను అన్నివేళలా అందుబాటులోకి ఉంచేందుకు ఓటీటీలు ఉపయోగపడుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్లు, కామెడీ షోలు, రియాలిటీ షోలు.. ఇలా భిన్నరకాల కంటెంట్తో బోలెడంత వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు థియేటర్లో రిలీజయ్యేవాటితో పాటు ఓటీటీ రిలీజెస్ మీద కూడా ఓ కన్నేస్తున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ఓటీటీలో కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. నెట్ఫ్లిక్స్లో రంగబలి టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగబలి. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజ హీరోయిన్గా నటించింది. జూలై 7న థియేటర్లో విడుదలైన ఈ సినిమా తాజాగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. నేటి(ఆగస్టు 4) నుంచి రంగబలి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీలో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 4 నుంచి ఈ చిత్రం సోనీలివ్లో అందుబాటులోకి వచ్చింది. దయ సిరీస్ ఎందులో అంటే? ఇకపోతే అటు దయ అనే వెబ్ సిరీస్ హాట్స్టార్లో ప్రసారం అవుతోంది. ఇందులో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. అలాగే భాగ్సాలే అనే మూవీ సైతం ఓటీటీలోకి వచ్చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. చదవండి: రీఎంట్రీకి రెడీ అయిన నజ్రియా -
ఓటీటీలోకి ఆ బ్లాక్బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ
మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే దాన్ని ఆదరించాలి. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు చాలామంది మూవీ లవర్స్కి మనసులో ఉన్నమాట. అలా వాళ్లు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిపోయింది. పేరుకే ఇది థ్రిల్లర్ సినిమా అయ్యుండొచ్చు కానీ ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే సమ్థింగ్ డిఫరెంట్. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) స్ట్రీమింగ్ డేట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనేది ఎప్పటికీ బోర్ కొట్టని జానర్. కరెక్ట్గా తీయాలే గానీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. అలా తమిళంలో జూన్ 9న రిలీజై సెన్సేషన్ సృష్టించిన సినిమా 'పోర్ తొడిల్'. యంగ్ హీరో అశోక్ సెల్వన్, సీనియర్ నటుడు శరత్ కుమార్ నటించిన ఈ సినిమా.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. అయితే పోలీసులు-మర్డర్ మిస్టరీ ఇలాంటివి చాలా చూశాం కదా అని మీరనుకోవచ్చు కానీ వాటితో పోలిస్తే ఇది స్పెషల్. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 4న ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడది మారింది. ఆగస్టు 11 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. 'పోర్ తొడిల్' కథేంటి?ప్రకాశ్(అశోక్ సెల్వన్) క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. మనోడికి కాస్త బిడియం, భయం. అడిషనల్ డీజీపై ఆదేశాల మేరకు క్రైమ్ బ్రాంచ్లోని సీనియర్ ఆఫీసర్ లోకనాథ్(శరత్ కుమార్) దగ్గర ట్రైనీగా పనిచేసేందుకు వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా వీళ్లతో కలిసి పనిచేస్తుంది. తిరుచ్చిలో ఓ బాలిక హత్య కేసు వీళ్ల ముగ్గురు టేకప్ చేస్తారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే నగరంలో ఇదే రీతిలో జరుగుతున్న హత్యలు గురించి తెలుస్తుంది. ఇంతకీ వీళ్లని చంపుతన్నది ఎవరు? ప్రకాశ్-లోకనాథ్ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మెయిన్ స్టోరీ. తమిళంలో సెన్సేషన్గా నిలిచిన ఈ మూవీ తెలుగులో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో? The wait is over! The Thriller Sensation that Shattered Box Office Records, "Por Thozhil" is streaming on Sony LIV from Aug 11th.#PorThozhilOnSonyLIV #PorThozhil #SonyLIV @ApplauseSocial #E4Experiments @epriusstudio @nairsameer @SegalDeepak @e4echennai @cvsarathi pic.twitter.com/LOthMauGbD — Sony LIV (@SonyLIV) August 1, 2023 (ఇదీ చదవండి: సాయితేజ్ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!) -
ఓటీటీలోకి ఆ చిన్న సినిమా.. మరీ ఇంత ఆలస్యమా?
సాధారణంగా ఓటీటీల్లోకి ఏ సినిమా అయినా వీలైనంత త్వరగానే వచ్చేస్తుంటాయి. భారీ బడ్జెట్ చిత్రాలైతే కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతుంటాయి కానీ చిన్న మూవీస్ అయితే నెలలోపే స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేసుకుంటూ ఉంటాయి. రానా సమర్పణలో వచ్చిన 'పరేషాన్' మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ 'మసూద' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తిరువీర్ ఇందులో హీరోగా నటించారు. మిగతా వాళ్లందరూ చాలావరకు కొత్త నటీనటులే. తెలంగాణ బ్యాక్ డ్రాప్తో వచ్చిన ఈ సినిమా జూన్ 2న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో చాలామంది ఈ మూవీ గురించి మర్చిపోయారు. అలాంటి ఆగస్టు 4 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. 'పరేషాన్' కథేంటి? మంచిర్యాలలో జులాయిగా తిరిగే కుర్రాడు ఐజాక్(తిరువీర్). తన జాబ్ కోసం దాచుకున్న డబ్బుల్ని ఫ్రెండ్కి ఇచ్చి సహాయపడే రకం. ఓ రోజు ఊరిలో జరిగిన పెళ్లిలో శిరీష(పావని)ని చూసి లవ్లో పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. వారం తిరక్కుండానే ఆమెకు వాంతులవుతాయి. దీంతో ఇద్దరూ పరేషాన్ అవుతారు. హైదరాబాద్ వెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుందామని అనుకుంటారు. మరి ఐజాక్-శిరీషల పరిస్థితి ఏమైంది? చివరకు ఏం జరిగిందనేదే స్టోరీ. What if your best friends turn out to be your worst nightmares? Rana Daggubati presents the quirkiest film of the year, #Pareshan streaming on Sony LIV from Aug 4th.#Pareshan #PareshanOnSonyLIV #SonyLIV @RanaDaggubati @iamThiruveeR @PavaniKaranam1 @imvishwadev @siddharthr87 pic.twitter.com/Ic8SXK3apg — Sony LIV (@SonyLIV) July 20, 2023 (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!) -
'2018' సినిమాపై వివాదం.. ఆ విషయంలో తీవ్ర అభ్యంతరం!
మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం '2018'. మాలీవుడ్లో సూపర్హిట్గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని జూన్ 7న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!) ఓటీటీ రిలీజ్పై అభ్యంతరం హిట్ టాక్తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలపై కేరళలోని థియేటర్ల యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్ల చేయడంపై 7,8 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సినిమాను కేవలం ఐదు వారాల లోపే ఓటీటీలో విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్తో తాము రూ.200 కోట్లు నష్టపోతామని ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాస్, ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి, అజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అతడి పేరు చెప్పను!) -
ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
మలయాళంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన చిత్రం 2018. ఇటీవలే ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన 25 రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక టాలీవుడ్లోనూ ఈ చిత్రానికి ఊహించని రీతిలో ఆదరణ దక్కింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన వచ్చింది. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ డేట్ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించుకోగా జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యాన్ని కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!) ഒന്നിച്ച് കരകയറിയ ഒരു ദുരന്തത്തിൻ്റെ കഥ! The biggest blockbuster Mollywood has ever seen is now coming to Sony LIV 2018, streaming on Sony LIV from June 7th#SonyLIV #2018OnSonyLIV #BiggestBlockbuster #BasedOnTrueStory @ttovino #JudeAnthanyJoseph @Aparnabala2 #kavyafilmcompany pic.twitter.com/9UzcYSPz1j — Sony LIV (@SonyLIV) May 29, 2023 -
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న గోపీచంద్ 'రామబాణం' మూవీ
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మే5న విడుదలయ్యింది.జగపతిబాబు, ఖుష్భూ కీలక పాత్రలను పోషించారు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రామబాణం మూవీ థియేటర్లలో విడుదలై నెలరోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 3 నుంచి ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే
అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్పై మరో కన్ఫ్యూజన్ వచ్చి పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్ఖాన్కు గాయాలు అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్ను వాయిదా వేసింది. థియేటర్ రిలీజ్కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్ కూడా లేకపోవడంతో మరో వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. మే26న ఏజెంట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Were is #Agent OTT RELEASE MAY 19 @SonyLIV @SonyLIVHelps pic.twitter.com/gLANHasQ1S — OTTGURU (@OTTGURU1) May 19, 2023 -
ఓటీటీలో సందడి చేసే సినిమాలివే, ఆ హిట్ మూవీ కోసం అంతా వెయిటింగ్!
థియేటర్లో సినిమా రిలీజ్ కోసం ఎంత ఎదురుచూస్తున్నారో ఆ మూవీ ఓటీటీలోకి వచ్చే రోజు కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు. కరోనా సమయంలో చిన్నాపెద్దా సినిమాలన్నీ మరో దారి లేక ఓటీటీలోనే నేరుగా విడుదలయ్యాయి. దీంతో అందరూ ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాక థియేటర్లకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కానీ ఇప్పటికీ ఓటీటీకి క్రేజ్ తగ్గలేదు. పైగా థియేటర్లో మెప్పించని కొన్ని సినిమాలు ఓటీటీలో బాగా క్లిక్ అవుతుండటం విశేషం. అలాగే బాక్సాఫీస్ దగ్గర జైత్రయాత్ర చేపట్టిన చిత్రాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా తెరకెక్కుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్లేంటో ఓసారి చూసేద్దాం.. నెట్ఫ్లిక్స్ ► అయాలవాషి(మలయాళం) - మే 19 ► కథల్: ఎ జాక్ఫ్రూట్ మిస్టరీ (హిందీ) - మే 19 ► బయూ అజైబి (ఇంగ్లీష్)- మే 19 ► సెల్లింగ్ సన్సెట్ (ఆరో సీజన్)- మే 19 ► మ్యూటెడ్ (ఇంగ్లీష్) - మే 19 ► విరూపాక్ష - మే 21 హాట్స్టార్ ► డెడ్ పిక్సెల్స్ - మే 19 సోనీలివ్ ► ఏజెంట్ - మే 19 ► కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) - మే 19 అమెజాన్ ప్రైమ్ వీడియో ► బ్యాక్డోర్- స్ట్రీమింగ్ అవుతోంది ► మోడ్రన్ లవ్ చెన్నై (తమిళ్) - స్ట్రీమింగ్ అవుతోంది ► హే మేరీ ఫ్యామిలీ సీజన్ 2 (హిందీ) - మే 19 ఆహా ► ఏమి సేతురా లింగ - మే 19 ► మారుతి నగర్ పోలీస్ స్టేషన్ (తమిళ్) - మే 19 జియో సినిమా ► లవ్ యూ అభి (కన్నడ సిరీస్) - మే 19 ► కచ్చి లింబూ - మే 19 ► క్రాక్ డౌన్ సీజన్ 2 - మే 20 చదవండి: తనకంటే చిన్నవాడితో లవ్.. బ్రేకప్ చెప్పిన నటి -
ఆ ఓటీటీలో ఏజెంట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గత చిత్రాల్లో రొమాంటిక్గా కనిపించిన అఖిల్ ఏజెంట్ సినిమాలో అందుకు భిన్నంగా వైల్డ్గా కనిపించేందుకు ప్రయత్నించాడు. స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కంటే ఎక్కువగా నెగెటివ్ టాకే వస్తోంది. దీంతో హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని అభిమానులు బాధపడుతున్నారు. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అంతంతమాత్రమే స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ ఇదివరకే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఏజెంట్ మూవీ నెల లోపే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మే నెలాఖరులోపు సోనీలివ్లో ఏజెంట్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీలైతే మే మూడో వారంలోపే ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇక ఏజెంట్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా అనిల్ సుంకర నిర్మించారు. చదవండి: స్టార్ హీరోతో హీరోయిన్ లవ్.. నటుడి విరహవేదన.. ఇన్నాళ్లకు స్పందించిన నటి -
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్ సిరీస్లివే!
ప్రస్తుతం సినిమాలు చూసేందుకు ఓటీటీలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లకు వెళ్లలేని కొత్త సినిమాలు ఎప్పుడొస్తాయా ఆసక్తిగా కనబరుస్తున్నారు. అలాంటి వారికి వినోదం అందించేందుకు ఈ వారంలో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. వేసవి సెలవుల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్న చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు'. ఈ చిత్రాన్ని కోనేరు కల్పన నిర్మించారు. సోహెల్, మృణాళిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి సమర్పించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. వర్జిన్ స్టోరి నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘వర్జిన్ స్టోరి’. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. సౌమిక పాండియన్ హీరోయిన్గా నటించింది. ప్రదీప్ బి. అట్లూరి దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈనెల 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వారం ఓటీటీకి వస్తోన్న చిత్రాలు/వెబ్సిరీస్లు జీ5 ఒరు కోడై మర్డర్ మిస్టరీ -తమిళ్- ఏప్రిల్ 21 అమెజాన్ ప్రైమ్ వీడియో డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ -హిందీ -డాక్యుమెంటరీ సిరీస్-ఏప్రిల్ 21 డెడ్ రింగర్స్- ఇంగ్లీష్- సిరీస్- సీజన్-1 నెట్ఫ్లిక్స్ చోటా భీమ్ -సీజన్-17- ఏప్రిల్ 20 టూత్పరి- హిందీ- ఏప్రిల్ 20 డిప్లొమాట్- ఇంగ్లీష్- ఏప్రిల్ 20 సత్య2 - తెలుగు ఏప్రిల్ 21 రెడీ - తెలుగు ఏప్రిల్ 21 ఇండియన్ మ్యాచ్ మేకింగ్- వెబ్సిరీస్- ఏప్రిల్ 21 ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్ -ఇంగ్లీష్- ఏప్రిల్ 21 రఫ్ డైమండ్స్ - బెల్జియం ఏప్రిల్ 21 వన్ మోర్ టైమ్ -స్వీడిష్- ఏప్రిల్ 21 చోక్హోల్డ్ -టర్కిష్-ఏప్రిల్ 21 సోనీలివ్ గర్మీ- సిరీస్ హాట్స్టార్ కన్నా కానుమ్ కాళంగల్- తమిళ్ -సీజన్-2 ఏప్రిల్ 21 సుగా- డాక్యుమెంటరీ స్పెషల్- ఏప్రిల్ 21 -
ఓటీటీలో ఒకేరోజు 15కు పైగా రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్లు
వినోదం కావాలంటే సినిమా ఉండాల్సిందే! వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్తో సినిమాకు వెళ్లేవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ వారం ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఏ మూవీకెళ్దామని ముందుగానే ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. థియేటర్లో ఏ సినిమా రిలీజ్ అవుతుందనేదాని కన్నా కూడా ఏ మూవీ ఓటీటీలో వచ్చింది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది? కొత్తగా వెబ్ సిరీస్లు ఏమొచ్చాయి? ఏవి ట్రెండ్ అవుతున్నాయి? ఏయే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏమేం బ్లాక్బస్టర్స్ ఉన్నాయని ఆరా తీస్తున్నారు. అందరూ కలిసి ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేస్తున్నారు. అలా అని థియేటర్కు వెళ్లడం మానేస్తున్నారని కాదు. ఓపక్క మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్కు వెళ్లి దాన్ని ఆదరిస్తూనే మరోపక్క ఓటీటీలో నిరంతరం ఏదో ఒక సినిమా/సిరీస్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మొత్తానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. సినీప్రియులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలో రేపు ఒక్కరోజే దాదాపు బోలెడన్ని సినిమాలు/ సిరీస్లు రిలీజ్ అవుతున్నాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం.. నెట్ఫ్లిక్స్ ► సార్/వాతి ► కాట్ అవుట్ ► కుత్తే ► ది మెజీషియన్స్ ఎలిఫెంట్ ► నాయిస్ ► స్కై హై: ది సిరీస్ ► ఇన్హిస్ షాడో ► మ్యాస్ట్రో ఇన్ బ్లూ ► డ్యాన్స్ 100 ► ఏజెంట్ ఏల్విస్ జీ5 ► రచయిత ► ఐయామ్ ఐ నెక్స్ట్ ఆహా ► సత్తిగాడి రెండు ఎకరాలు ► లాక్డ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ► గంధదగుడి సన్ నెక్స్ట్ ► వన్స్ అపాన్ ఎ టైమ్ జమాలిగూడ సోనీలివ్ ► రాకెట్ బాయ్స్ - రెండో సిరీస్ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్) ► ది వేల్ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్) హాట్స్టార్ ► పాప్ కౌన్ -
అతడి కంటే అందగాడివా అని హేళన చేశారు: చిరంజీవి
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ప్రారంభమైంది. ఈ షో ద్వారా సినీ, రాజకీయ ప్రముఖుల జీవితంలోని చోటు చేసుకున్న సంఘటనలు, వ్యక్తిగత విషయాలను చర్చించనున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్లో వేదికగా ప్రసారమయ్యే ఈ షో ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ సాయి పల్లవి, దగ్గుబాటి రానా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నట్లు చూపించారు. ఇక ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా తొలి ఎపిసోడ్గా మెగాస్టార్ చిరంజీవి ఇంటర్య్వూను ప్రసారం చేశారు. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్ యశస్వి చీటింగ్ బట్టబయలు! ఇందులో చిరు తన వ్యక్తిగత, సినీ కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నేను నటుడిగా ఈ స్థాయి చేరుకునే క్రమంలో ఎన్నో అవమానాలు పడ్డాను. అవకాశాల కోసం వెళితే హేళన చేశారు. కొన్ని సార్లు అయితే మానసిక క్షోభకు గురయ్యాను. ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదు. దేవుడి ముందుకు నిలబడి నాకు నేను ధైర్యం చెప్పుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ అవకాశాల వేట మొదలు పెట్టేవాడిని’ అని చెప్పారు. అయితే ‘‘సినిమాల్లో నటించాలనే ఆశతో ఓ రోజు మద్రాస్కు వెళ్లాను. పాండీబజార్లోని ఫిలిం ఇన్స్టిట్యూట్కు వెళ్లా. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి ‘ఏంటి ఫిలిం ఇన్స్టిట్యూట్లోకి వచ్చావా? సినిమాలు ట్రై చేద్దామనే! అతను చూడు ఎంత అందంగా ఉన్నాడో. అతడి కంటే నువ్వు అందగాడివా.. తెలిసిన వాళ్లు లేకపోతే అవకాశాలు దొరకడం కష్టం. ఇండస్ట్రలోకి రావాలంటే ఇక్కడ తెలిసిన వాళ్లు ఉండాలి. చదవండి: ఈసారి బిగ్బాస్ హౌజ్లోకి యాంకర్ రష్మీ? భారీగా పారితోషికం..! కాబట్టి నీ కల మర్చిపో’ అంటూ నన్ను హేళన చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధించాయి. ఇంటికి వెళ్లి దేవుడు ముందు కూర్చోని ఇలాంటి వాటికి బెదిరి వెనకడుగు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఏడాది పాటు పాండీ బజార్ వైపు వెళ్లలేదు’’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. కాగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా మెప్పించారు. అలా అంచెలంచెలుగా హీరోగా స్వయం కృషితో ఎదిగిన చిరు ప్రస్తుతం సినీరంగంలో గాడ్ఫాదర్గా అభిమానుల గౌరవ, అభిమానాలను అందుకుంటున్నారు. -
జనాలు నాపై కోడిగుడ్లు విసిరారు: చిరంజీవి
సింగర్ స్మిత త్వరలో నిజం విత్ స్మిత అనే టాక్ షోతో ముందుకు రాబోతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత, కెరియర్ విషయాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ షో ఒక వేదిక కానుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్లో ప్రసారం కానున్న ఈ షో మెగాస్టార్ చిరంజీతో ప్రారంభం కానుంది. ఈమేరకు ఓ ప్రోమో కూడా విడుదలైంది. స్టార్డమ్ అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది, ఆ స్టేజీకి వెళ్లడానికి ఎన్నో అవమానాలు పడి ఉంటారు, అవునా? అని స్మిత అడిగింది. దీనికి చిరు స్పందిస్తూ.. జగిత్యాలలో నాపై నుంచి పూల వర్షం కురిసింది. కొంత ముందుకు వెళ్లగానే కోడిగుడ్లు విసిరారు అని తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించాడు చిరు. అసలు తనపై కోడిగుడ్లు ఎందుకు విసిరారు? మెగాస్టార్ పంచుకున్న ఆసక్తికర విషయాలేంటో తెలియాలంటే ఫిబ్రవరి 10న ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: చేతిపై పచ్చబొట్టు.. నా భార్య.. కన్నతల్లిలా చూసుకుంది: కల్యాణ్ రామ్ -
స్మిత టాక్ షోకు సాయి పల్లవి.. ఫిజికల్ అబ్యూస్ అంటూ సీరియస్ కామెంట్స్!
తెలుగు హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమాల్లో తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతుంది. అందుకే దర్శకులు కూడా సాయి పల్లవి రోల్ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇక ఆమె గ్లామర్స్ పాత్రలకు దూరమనే విషయం తెలిసిందే. స్కీన్ షో ఉంటే అది స్టార్ హీరో బడా డైరెక్టర్ చిత్రమైన నో చెబుతుంది. అందుకే సినిమా ఫలితాలతో సంబంధంగా లేకుండా వ్యక్తిగతం ఆమెను అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. అయితే లవ్స్టోరితో కమర్షియల్ హిట్ అందుకున్న సాయి పల్లవి ఆ తర్వాత నటించిన చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. చదవండి: బ్రహ్మానందం మొత్తం ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా? తన నటనతో మెప్పించినప్పటికి కమర్షియల్గా మాత్రం విజయం సాధించలేకపోతున్నాయి. దాంతో ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అంతేకాదు మీడియాకు, సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. దీంతో సాయి పల్లవి పూర్తిగా నటనకు గుడ్బై చెప్పిందా? అని ఆమె అభిమానలంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు కొద్ది రోజులు ఇకపై ఆమె నటించదనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. మరోవైపు ఆమె పెళ్లి చేసుకుబోతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై ఇంతవరకు ఈ న్యాచురల్ బ్యూటీ నుంచి క్లారిటీ రాలేదు. దాంతో అంతా అదే నిజమనుకుంటున్నారు. చదవండి: కత్రినా వచ్చాక నా లైఫ్ మారిపోయింది.. నేను పర్ఫెక్ట్ హస్భెండ్ కాదు..!: విక్కీ కౌశల్ ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఓ టాక్ షోలో పాల్గొన్నారు. సోనీ లైవ్లో త్వరలో ప్రసారం కానున్న 'నిజం విత్ స్మిత' షోలో ఆమె పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న సాయి పల్లవి ఎపిసోడ్ ప్రసారం కానుంది. చూస్తుంటే ఈ ఎపిసోడ్ కొంచెం వాడివేడిగానే సాగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఇందులో సాయి పల్లవి కాస్తా గట్టిగా రియాక్ట్ అయినట్లుంది. ఈ వీడియోలో ఆమె ఫిజికల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్ అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తూ కనిపించింది. దాంతో సాయి పల్లవి ఎపిసోడ్ ఆసక్తిని సంతరించుకుంది. ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #NijamWithSmita A thought-provoking talk show With @Sai_Pallavi92 ♥️ n few of the Top Stars Episodes exclusively on @SonyLIV, from February 10th.#SaiPallavi @smitapop pic.twitter.com/ujeoUq9r8t — Sai Pallavi FC™ (@SaipallaviFC) February 2, 2023 -
నా ఫోన్ ఆమె ఎత్తుకెళ్లింది.. ఆ పోస్ట్ ఎవరూ నమ్మొద్దు: నమిత
బాలీవుడ్ నటినమితా థాపర్ తన ఫోన్ చోరీకి గురైనట్లు వెల్లడించింది. నా ఫోన్ చోరీ చేయడమే కాకుండా ద్వేషపూరిత కథనాన్ని పోస్ట్ చేశారని తెలిపింది. తన ఇంట్లో పనిమనిషి మొబైల్ దొంగిలించి ఇలా చేసిందని వాపోయింది. సోషల్ మీడియాలో నాపై కావాలనే ఇలా చేసిందని పేర్కొంది నటి. నమితా తాపర్ షార్క్ ట్యాంక్ అనే రియాల్టీ షోతో ఫేమస్ అయ్యారు. నమితా థాపర్ ఫోన్ దొంగిలించిన పని మనిషి ఇన్స్టాగ్రామ్లో ఓ ద్వేషపూరిత పోస్ట్ చేసింది. దీంతో అప్రమత్తమైన నమితా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తన ఫోన్ ఇప్పుడు రికవరీ చేయబడిందని.. ఆందోళనతో ఫోన్ చేసిన స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేసింది. అయితే ఆమె వివరణతో కొంతమంది సోషల్ మీడియా ఫాలోవర్లు ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. ఇది నిజంగా ఆమె కొడుకు ద్వారా పోస్ట్ చేశారా..లేక నమితా థాపర్ కావాలనే పనిమనిషిని నిందిస్తున్నారా అని ఆశ్చర్యపోయారు. షార్క్ ట్యాంక్ ఇండియా అనేది ఒక రియాలిటీ షోలో నమితా థాపర్తో పాటు.. ప్యానెల్లో అనుపమ్ మిట్టల్, వినీతా సింగ్, అమన్ గుప్తా, పీయూష్ బన్సాల్, మరో కొత్త నటుడు అమిత్ జైన్ కూడా ఉన్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 సోనీ టీవీ, సోనీలైవ్లో ప్రసారమవుతుంది. This is what hate does to this world, makes people toxic. An educated house help who was removed stole my phone & put a hateful post on me on social media. Price of being a public figure ! Apologies ! — Namita (@namitathapar) January 14, 2023 -
అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్ కలిస్తే.. ఆసక్తిగా ట్రైలర్
నాని సోదరి దీప్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్గుడ్ వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. ఈ సిరీస్లో సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునయన ప్రధాన పాత్రల్లో నటించారు. ఐదు విభిన్నమైన కథలతో సరికొత్తగా ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఈ సిరీస్ నవంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీ లివ్లో ప్రసారం కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ను న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. (చదవండి: నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అదే.. విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్) ఇక ట్రైలర్ విషయానికొస్తే.. 'మీకు మీచ్ క్యూట్ అంటే తెలుసా.. అంటే అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్ ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు.. ఆ క్యూట్ సిచ్యువేషన్స్.. వారి మధ్య జరిగే సంభాషణలు.' అనే నాని వాయిస్తో ప్రారంభమైంది. 'ఈ మనిషితో గొడవపడటం కూడా అనవసరం కదా అనుకున్నప్పుడే బంధాలు విఫలమవుతాయి. మనం ప్రేమించే వాళ్లతోనే కదా గొడవపడతాం' అంటూ సాగే సత్యరాజ్ మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఏదైనా రిలేషన్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే గొడవలను పరిష్కరించుకుని బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేయాల్సిన పనులను వివరిస్తూ సిరీస్ రూపొందించారు. -
ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిన ఆండ్రియా చిత్రం
ఇంతకు ముందు గ్లామరస్ పాత్రలతో యువతను ఆలోచింప చేసిన నటి ఆండ్రియా సమీప కాలంలో నటనకు అవకాశం ఉన్న వైవిధ్యభరిత పాత్రలో నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలా తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అనిల్ మేలె పని తులి. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్రూట్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా ఆర్.కైసర్ ఆనంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెట్రిమారన్ శిష్యుడైన ఈయన పలు చిత్రాలకు కథా సహకారం అందించారన్నది గమనార్హం. కాగా ఇందులో నటుడు యాదవ్ కనదాసం హీరోగా నటించగా అళగం పెరుమాళ్, ఇళవరసు, అనుపమ కుమార్, లౌవ్లీ చంద్రశేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, వేల్రాజ్ చాయాగ్రహణం అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18వ తేదీ నుంచి సోనీ లైవ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు మాట్లాడుతూ ఇది స్త్రీల నేపథ్యంలో సాగే నేటి సమాజానికి కావాల్సిన అంశాలతో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. కథ విన్న దర్శకుడు వెట్రిమారన్ వెంటనే తన బ్యానర్లోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పారన్నారు. అలాగే కథానాయకి ఇతివృత్తంగా సాగే ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు ఆండ్రియానే కరెక్ట్ అని భావించామని, దీంతో ఆమెకు కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఇది యథార్థ కథతో రూపొందించిన చిత్రం కాకపోయినా ఇందులోని సంఘటనలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయన్నారు. నటి ఆండ్రియా మాట్లాడుతూ.. ఒక పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం ఎన్నో కలలు కంటూ నగరానికి వచ్చిన యువతికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం ఉంటుందన్నారు. కలలు నిజమవుతున్న తరుణంలో ఎదురైన ఒక సంఘటన ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? ఆ సంఘటన ఏమిటి? అన్నదే అనల్ మేలె పని తులి చిత్రం అన్నారు. దర్శకుడు కథ చెప్పగానే తన మనసును టచ్ చేసిందని, అందుకే నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. ఆదవ్ కన్నదాసన్ మాట్లాడుతూ ఇది హీరోయిన్ కథా చిత్రం అయినా తన పాత్రకు, నటనకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక మంచి చిత్రంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. -
ఈ ఫ్రైడే ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!
థియేటర్లలో సినిమా ఆడిందంటే హిట్, లేదంటే ఫ్లాప్గా తేల్చేవారు. కానీ ఓటీటీలు వచ్చాక సీన్ మారింది. థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. ఆల్రెడీ హిట్ అయిన వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీల పుణ్యమా అని ఎప్పుడంటే అప్పుడు వాటిని ఎంచక్కా చూసుకునే వెసులుబాటు ఉంది. అందుకే ఓటీటీలు కూడా కొత్త కంటెంట్తో వస్తూనే అటు థియేటర్లలో రిలీజైన సినిమాలను సైతం విడుదల చేస్తున్నాయి. మరి ఈ శుక్రవారం(అక్టోబర్ 28) ఏమేం రిలీజవుతున్నాయో చూసేద్దాం.. ► ఆహా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ► జీ5 విండోసీట్ ► అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్లేమ్స్ (హిందీ వెబ్సిరీస్) ► నెట్ఫ్లిక్స్ వైల్డ్ ఈజ్ విండ్ (ఇంగ్లీష్) ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఎ కోర్ట్ రూమ్ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్) ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రర్న్ ఫ్రంట్ (ఇంగ్లీష్ బిగ్ మౌత్ (ఇంగ్లీష్ సిరీస్) మై ఎన్కౌంటర్ విత్ ఈవిల్ (ఇంగ్లీష్ సిరీస్) ది బాస్టర్డ్ సన్ అండ్ ది డెవిల్ హిమ్ సెల్ఫ్ (ఇంగ్లీష్ సిరీస్) ► సోనీ లివ్ అప్పన్(మలయాళం) హాట్స్టార్లో ఝాన్సీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్లో నేనే వస్తున్నా సినిమాలు ఈరోజు(అక్టోబర్ 27) నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి. చదవండి: ఆటోలో సిటీ అంతా తిరిగిన నటుడు బిగ్బాస్: ఈ వారం కెప్టెన్ ఎవరంటే? -
‘ఓకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్ తల్లిగా కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళనంలో విశేష ప్రేక్షకులను ఆదరణ అందుకుంది. థియేటర్లో మంచి విజయం సాధించిన ఒకే ఒక జీవితం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసంది. చదవండి: ‘గాడ్ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే అక్టోబరు 20 నుంచి ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తెస్తున్నట్లు సోనీ లీవ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘జీవితం రెండో అవకాశం ఇస్తే విధిరాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతూవర్మ, అమల కలయికలో వచ్చిన ఒకేఒక జీవితం మూవీ ఈ నెల 20 నుంచి మీ సోనీలివ్ ఇంటర్నేషనల్లో రానుంది’ అంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ముగ్గురు యువకుల జీవితాలను ఎమోషన్స్, కామెడీ మిక్స్ చేసి తీశారు. సైన్స్ గొప్పదే కానీ గతాన్ని మర్చగలిగే శక్తి దానికి లేదనే సందేశాన్ని ఈ సినిమాతో ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది.ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV International లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIVInternational #OkeOkaJeevitham pic.twitter.com/QMQPpxiCJq — SonyLIV International (@SonyLIVIntl) October 10, 2022 -
ఓటీటీలో శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'.. రిలీజ్ డేట్ ఫిక్స్
శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్లో ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలోనూ 'కణం' పేరుతో విడుదలైంది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV International లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIVInternational #OkeOkaJeevitham pic.twitter.com/QMQPpxiCJq — SonyLIV International (@SonyLIVIntl) October 10, 2022 -
ఓటీటీలోకి 'ఒకే ఒక జీవితం' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ సుమారు 15 కోట్లకు సొంతం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది.ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీలో విక్రమ్ కోబ్రా మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం 'కోబ్రా'. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్గా నటించింది. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్31న విడుదలై మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్లో ఈనెల 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడైంది. దీంతో థియేటర్స్లో మిస్ అయినవారు ఓటీటీలో హ్యాపీగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి. -
ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?
మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. తొలిసారి డిప్యూటీ కలెక్టర్ పాత్రను పోషించాడీ హీరో. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్గా నటించారు. యంగ్ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 29న విడుదలవగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. థియేటర్లో పెద్దగా సక్సెస్ అవకపోయినా ఓటీటీ రిలీజ్ ఎప్పుడా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీ రిలీజ్ డేట్ రానే వచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి సోనీలివ్లో ప్రసారం కానున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్లలో జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by SonyLIV (@sonylivindia) చదవండి: లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ ఏం చేశాడో తెలుసా? 'నా సినిమా థియేటర్స్లో విడుదలై మూడేళ్లు అయ్యింది' -
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
థియేటర్లో ఈ వారం ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయి? అని ఆరా తీయడం మామూలే! కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అటు థియేటర్తో పాటు ఓటీటీని కూడా పట్టించుకుంటున్నారు సినీ లవర్స్. ఇంకా చెప్పాలంటే ఏరోజుకారోజు కొత్తగా ఏ సినిమాలు ఎక్కడ రిలీజవుతున్నాయి? మొన్నటిదాకా థియేటర్లో ఆడిన సినిమా ఇప్పుడు ఏ ఓటీటీలో ప్రసారం అవుతుందని తెగ సెర్చ్ చేసేస్తున్నారు. మరికొందరైతే థియేటర్లో ఒక్కసారే చూడగలం, అదే ఓటీటీ అయితే వీలైనన్ని సార్లు, ఎక్కడ పడితే అక్కడ ఎంచక్కా చూసేయొచ్చు అంటూ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లకు జై కొడుతున్నారు. మరి ఈ వారం ఓటీటీలో ఏయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో తెలుసా? అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్గన్ మార్వెరిక్ - ఆగస్టు 24 సమరిటన్ - ఆగస్టు 26 హాట్స్టార్ కట్పుట్లి - సెప్టెంబర్ 2 నెట్ఫ్లిక్స్ ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 - ఆగస్టు 26 సోనిలివ్ మహారాణి 2 - ఆగస్టు 25 హేయూ మేడ్ ఇన్ చెల్సియా- మాలోర్కా - ఆగస్టు 23 చదవండి: చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి పుష్ప-2 నుంచి బిగ్ అప్డేట్.. వైరల్ అవుతున్న ఫోటోలు -
వొడాఫోన్ ఐడియా ఆఫర్ అదిరిపోలా!.. కేవలం రూ.82 రీచార్జ్తో ఓటీటీ సబ్స్క్రిప్షన్!
భారత్లో మొబైల్ యూజర్లు పెరిగే కొద్దీ టెలికాం రంగం వృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా పోటీపడి మరీ కస్టమర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బంఫర్ ఆఫర్ల పేరుతో గతంలో రీచార్జ్ ప్లాన్లతో వస్తే, తాజా పరిస్థితుల దృష్ట్యా ఓటీటీని కూడా ఆఫర్ల జాబితాలో జత చేశారు. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్తో తీసుకొచ్చింది. హిందీ పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC 2022)ని చూడడానికి ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అతి కూడా తక్కువ ధరలోనే! ఆఫర్ అదిరిపోలా! వొడాఫోన్ ఐడియా వినియోగదారులు కేవలం రూ. 82 చెల్లిస్తే నేరుగా మీ స్మార్ట్ఫోన్లో ప్రఖ్యాత కేబీసీ 2022 అన్ని ఎపిసోడ్లను వీక్షించవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఇంకో విషయం ఏంటంటే ఇది డేటా వోచర్ ప్లాన్. రూ.82 ప్లాన్ పని చేయడానికి మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్తో కస్టమర్లు 14 రోజుల పాటు 4GB డేటాను పొందుతారు. కానీ సోనీలివ్ సబ్స్క్రిప్షన్ మాత్రం 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మొబైల్ సబ్స్క్రిప్షన్ కాబట్టి కేవలం మొబైల్లో మాత్రమే చూడగలరు. మీ టీవీ లేదా ల్యాప్టాప్లో చూసే సౌకర్యం ఉండదు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత, సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ పాజ్ చేయడం, లేదా డియాక్టివేట్ చేయలేము. అంటే మీరు సోనీలివ్ సబ్స్క్రిప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే, మీరు దాన్ని 28 రోజుల పాటు పొందుతారు. ఈ ప్లాన్తో కేబీసీ 2022 షో మాత్రమే కాదు ఈ ప్లాట్ఫాంలో ప్రసారమయ్యే ఇతర షోలు, సినిమాలను కూడా చూసేయచ్చు. సోనీలివ్ ఒక ఏడాది ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లో టీవీలో చూసే సౌకర్యం కూడా ఉంది. అదే ఒక సంవత్సరం మొబైల్ ప్లాన్ కోసం అయితే రూ. 599 చెల్లిస్తే సరిపోతుంది. చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ 'విక్టిమ్' స్ట్రీమింగ్
విక్టిమ్ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్ఫాంలో స్ట్రీమింగ్ అవుతూ ఆదరణ పొందుతోంది. ఒకే కాన్సెప్టును నలుగురు డైరెక్టర్లు వివిధ కోణాల్లో సిరీస్ను తెరకెక్కించారు. పా.రంజిత్ దమ్మమ్ అనే కథను, వెంకట్ ప్రభు కన్ఫెషన్స్ అనే కథను, ఎం.రాజేష్ విలేజ్ మిర్రర్ కథను, శింబుదేవన్ కోట్టై పాక్కు వత్తలుమ్ మొట్టైమాడి సిత్తరుమ్ అనే కథను రూపొందించారు. ఈ నాలుగు కథలు కాన్సెప్ట్ ఒకటే. భావోద్రేకాలతో కూడిన వినోదాన్ని జోడించిన క్రైమ్ థ్రిల్లర్ కథలతో తెరకెక్కించారు. అయితే నలుగురు దర్శకులు వారి వారి శైలిలో రూపొందించిన వెబ్ సిరీస్ ఇది. కరోనా కాలంలో ఇంటిలోనే ఉండిపోయిన ఒక సహాయ కథా రచయితకు పని పోయే పరిస్థితి. దీంతో అతనికి ఒక సిద్ధ వైద్యుడి గురించి తెలియడంతో ఆయన్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందన్న అంశాలను వినోదభరితంగా రూపొందించిన కథ కోట్టై పాక్కు వత్తలుమ్ మొట్టైమాడి సిత్తరుమ్. ఇందులో సహాయ రచయితగా తంబి రామయ్య, సిద్ధ వైద్యుడిగా నాజర్ నటించారు. అదే విధంగా నటుడు నటరాజన్ ఇంటిలో అద్దెకు నివసిస్తున్న నటి ప్రియా భవాని శంకర్ జీవితంలో జరిగే సంఘటనలతో రూపొందిన కథ విలేజ్ మిర్రర్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కన్ఫెషన్స్ కథలో నటి అమలాపాల్ ప్రధాన భూమిక పోషించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె చక్కగా నటించారు. మరో ముఖ్య పాత్రలో ప్రసన్న నటించారు. ఇక పా.రంజిత్ తెరకెక్కించిన దమ్మమ్ కథ తండ్రీ కూతురు, సమాజం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నటుడు గురు సోమసుందరమ్ ప్రధాన పాత్రలో నటించారు. చదవండి: నాకున్న ప్రేమను ఇలా తెలియజేశాను: రకుల్ ప్రీత్ సింగ్ -
ఓటీటీలోకి సాయి పల్లవి ‘గార్గి’.. ఎప్పుడు?.. ఎక్కడ?
సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. జులై 15న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుంది. కోర్టు డ్రామా నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే దర్శకుడి టేకింగ్కి, , సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ.. కమర్షియల్గా మాత్రం ఈ చిత్రం నిర్మాతలకు నిరాశే మిగిల్చింది. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగస్ట్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోనీలీవ్’లో గార్గి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. (చదవండి: వరుస ఫ్లాపులు.. సాయిపల్లవి షాకింగ్ నిర్ణయం!) ‘గార్గి’ కథేంటంటే.. గార్గి(సాయి పల్లవి) ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్.ఎస్ శివాజీ) హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఓ రోజు బ్రహానందం పనిచేసే అపార్ట్మెంట్లో ఓ చిన్నారిపై అత్యాచారం జరుగుతుంది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో బ్రహ్మానందం అరెస్ట్ అవుతారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయడని బలంగా నమ్మిన గార్గి..అతన్ని నిర్ధోషిగా బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటానికి దిగుతుంది. తండ్రి తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాని సమక్షంలో జునియర్ లాయర్ గిరీశం(కాళీ వెంకట్) గార్గికి మద్దతుగా నిలుస్తాడు. బ్రహ్మానందం తరపున వాదించడానికి ముందుకొస్తాడు. ఆ సమయంలో గార్గి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని ఎలా చూసింది? బ్రహ్మానందాన్ని బయటకు తీసుకొచ్చేందుకు లాయర్ గిరీశం చేసిన ప్రయత్నం ఏంటి? చివరకు తన తండ్రిని గార్గి నిర్ధొషిగా బయటకు తీసుకొచ్చిందా? లేదా? అనేదే మిగతా కథ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎవరు ఊహించని క్లైమాక్స్ తో అందరిని ఆకట్టుకున్న "గార్గి" ఈ నెల 12 నుండి సోనీLIV లో స్ట్రీమ్ అవుతుంది.#GargiOnSonyLIV #SonyLIV #Gargi pic.twitter.com/82SXDYezGH — SonyLIV (@SonyLIV) August 3, 2022 -
ఓటీటీలో రిలీజ్ కానున్న అమలాపాల్ విక్టిమ్
వినూత్న ప్రయోగాత్మక చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తరువాత నిర్మాతలకు మరింత లిబర్టీ లభిస్తుందనే చెప్పాలి. దర్శకుల భావాలను స్వేచ్ఛగా ఆవిష్కరించే అవకాశం లభిస్తోంది. ఆ విధంగా రూపొందుతున్న వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఒక సరికొత్త ప్రయోగమే విక్టిమ్ వెబ్ సిరీస్. నాలుగు ఎపిసోడ్స్తో రూపొందిన ఈ ఆంథాలజీ సిరీస్ను నలుగురు ప్రముఖ దర్శకులు రూపొందించడం విశేషం. ఒకే కాన్పెప్ట్ను నలుగురు దర్శకులు కలిసి తెరకెక్కించారు. దర్శకుడు వెంకట్ ప్రభు కన్ఫెషన్ పేరుతోనూ, పా.రంజిత్ దమ్మమ్ పేరుతోనూ, శింబుదేవన్ మొట్టై మాడి సిద్ధర్ పేరుతోనూ, ఎం.రాజేష్ విరాజ్ పేరుతోనూ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఫైనల్గా విక్టిమ్ పేరుతో రిలీజవుతోంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకులు వెంకట్ ప్రభు, పా.రంజిత్, సింబుదేవన్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ముందుగా దర్శకుడు శింబుదేవన్ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. దానికి రూపమే ఈ వెబ్ సిరీస్ అని తెలిపారు. దర్శకులు అందరం మాట్లాడుకుని ఒకే కాన్సెప్ట్ తమ ఆలోచనల మేరకు రూపొందించాలని అనుకున్నామన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా సాగే సిరీస్ అని, ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అవుతారని పేర్కొన్నారు. పా.రంజిత్ మాట్లాడుతూ ఈ కాన్సెప్ట్ గురించి తనకు చెప్పగానే తాను నిజ జీవితంలో చూసిన సంఘటనకు దగ్గరగా ఉందని భావించానన్నారు. తాను రూపొందించిన దమ్మమ్ ప్లాట్ తనను నిజజీవితంలో ఇన్స్పైర్ చేసిన సంఘటన అని తెలిపారు. కాగా ఇందులో నటుడు ప్రసన్న, ప్రియా భవాని శంకర్, అమలాపాల్, నట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: స్టార్ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! వచ్చే నెల నుంచి కొత్త వీపీఎఫ్ చార్జీలు అమలు! -
Tamilrockerz Official Teaser: పైరసీ వెబ్సైట్పై వెబ్ సిరీస్.. ఆసక్తిగా టీజర్
Arun Vijay New Web Series On Tamil Rockers: సినిమా వేధించే ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. పైరసీ మహమ్మారీ కారణంగా అనేక సూపర్ హిట్ మూవీస్ కలెక్షన్లలో వెనుకపడ్డాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సినిమా.. ఈ పైరసీ భూతానికి బలి అవుతూనే వస్తోంది. గతంలో చిత్రాలు నెలలు, వందల రోజులు ఆడి, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకునేవి. కానీ ఈ పైరసీ ఎంట్రీ ఇచ్చాక సినిమాలు పట్టుమని నెల రోజులు కూడా కనిపించట్లేదు. ఇలాంటి పైరసీ వెబ్సైట్లో ప్రముఖంగా చెప్పుకునేది తమిళ్ రాకర్స్. దక్షిణాది సినిమాలకు ఇది అతిపెద్ద గండగా పరిణిమించిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వాడుతూ పైరసీ ప్రింట్లను తీసుకువచ్చి దర్శకనిర్మాతలకు ముచ్చెటమలు పట్టేలా చేసింది ఈ వెబ్సైట్. తాజాగా ఈ తమిళ్ రాకర్స్పై ఓ వెబ్ సిరీస్ రానుంది. తమిళ్ రాకర్స్ వల్ల నిర్మాతలు ఎదుర్కొన్ని కష్టాలను ఈ వెబ్ సిరీస్లో చూపించనున్నారట. ఈ సిరీస్కు ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అరివళగన్ డైరెక్షన్ చేయనున్నారు. ఇందులో అరుణ్ విజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు కుట్రమ్ 23, బోర్డర్ సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్రబృంద నమ్మకంగా ఉంది. తమిళ్ రాకర్స్ పేరుతోనే టైటిల్ ప్రకటన ఇచ్చి ఆసక్తి కలిగించారు. ఈ వెబ్ సిరీస్ టీజర్ను జులై 3న విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: హీరో విశాల్కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్ మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం కమల్ హాసన్కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? -
ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన Top 10 OTT ఒరిజినల్స్ ఇవే..
Top 10 OTT Originals Of The Week By Ormax Media: ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్లు, సినిమాలకు ఆదరణ పెరిగిపోతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్, మూవీస్కు జై కొడుతున్నారు మూవీ లవర్స్. ఇంతకుముందు కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూసేవారు. థియేటర్లలో రిలీజైన వెంటనే చూసేందుకు పోటీపడేవారు ప్రేక్షకులు. ఇప్పుడు థియేటర్లలో వచ్చే సినిమాలను చూస్తూనే ఓటీటీల్లో వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ల కోసం ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఓ సర్వే చేసి ఒక జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఇండియాలో టాప్ 10 ఓటీటీ ఒరిజినల్స్ అందించిన సినిమాలు, వెబ్ సిరీస్లు ఏంటో తెలిపింది. మే 6 నుంచి 12 వరకు ఎక్కువ బజ్ ఉన్న వెబ్ సిరీస్, సినిమాల ఆధారంగా సర్వే నిర్వహించి ఈ జాబితాను ప్రవేశపెట్టింది. ఇందులో ఇప్పటికే విడుదలైనవాటితోపాటు వచ్చే వెబ్ సిరీస్లు, ఒక సినిమాను పేర్కొంది. చదవండి: OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు.. 1. మూన్ నైట్ (డిస్నీ ప్లస్ హాట్స్టార్) 2. గిల్టీ మైండ్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) 3. పంచాయత్ సీజన్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో) (మే 20) 4. మాయి (నెట్ఫ్లిక్స్) 5. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 (నెట్ఫ్లిక్స్) (మే 27) 6. లండన్ ఫైల్స్ (వూట్) 7. రుద్ర (డిస్నీ ప్లస్ హాట్స్టార్) 8. గుల్లక్ సీజన్ 3 (సోనీ లివ్) 9. హోమ్ శాంతి (డిస్నీ ప్లస్ హాట్స్టార్) 10. థార్ (నెట్ఫ్లిక్స్) Ormax Stream Track: Top 10 OTT originals in India, including upcoming shows/ films, based on Buzz (May 6-12) #OrmaxStreamTrack #OTT pic.twitter.com/edep0uTvxa — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఈ హాలీవుడ్ అపరిచితుడు మాములోడు కాదు.. -
తండ్రి క్రమశిక్షణ ఎక్కువైతే.. 'పురు' మూవీ రివ్యూ
టైటిల్: పురు (Puzhu) నటీనటులు: మమ్ముట్టి, పార్వతి తిరువోతు, వాసుదేవ్ సజీత్ తదితరులు నిర్మాత: ఎస్ జార్జ్ దర్శకత్వం: రథీనా పీటీ సంగీతం: జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: థేనీ ఈశ్వరన్ విడుదల తేది: మే 13, 2022 (సోనీ లివ్) మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి విభిన్నమైన సినిమాలతో విలక్షణ నటనతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ 70 ఏళ్ల వయసులోనూ నేటి తరం హీరోలకు గట్టిపోటీ ఇస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇటీవల భీష్మ పర్వం, సీబీఐ5, ది ప్రీస్ట్ సినిమాలతో ఆకట్టుకున్న మమ్ముట్టి, మరో వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్లో నటించిన చిత్రం 'పురు' (Puzhu). ఈ సినిమాతోనే మమ్ముట్టి ఓటీటీలోకి అడుగు పెట్టగా, రథీనా పీటీ దర్శకురాలిగా పరిచయమయ్యారు. మమ్ముట్టి నెగెటివ్ షేడ్స్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంలో పార్వతి తిరువోతు మరో కీ రోల్లో నటించారు. మే 13న ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్లో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: పోలీస్ ఆఫీసర్ కుట్టన్ (మమ్ముట్టి) తన భార్య చనిపోవడంతో కొడుకు కిచ్చు (వాసుదేవ్ సజీత్)తో కలిసి అందిరికీ దూరంగా నివసిస్తూ ఉంటాడు. అనుక్షణం క్రమశిక్షణ పేరుతో కొడుకు కిచ్చుతో కాస్తా కఠినంగా ప్రవర్తిస్తుంటాడు. కానీ కిచ్చుకు మాత్రం తండ్రి ప్రవర్తన చాలా ఇబ్బంది పెడుతుంది. అయినా తండ్రి మీద భయంతో అది పైకి మాత్రం చెప్పడు. మరోవైపు కుట్టన్ చెల్లెలు భారతి (పార్వతి తిరువోత్తు) పెద్దలను ఎదిరించి కేపీ అనే నాటకాలు వేసే వ్యక్తిని ప్రేమవివాహం చేసుకుంటుంది. కేపీది తక్కువ కులం కావడంతో కుట్టన్ ఫ్యామిలీ వారిద్దరిని దూరం పెడతారు. కానీ అనుకోకుండా కుట్టన్ ఉంటున్న ఫ్లాట్లోకి భారతి-కేపీ వచ్చి నివసిస్తుంటారు. మరోవైపు కుట్టన్ను చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తుంటారు. కుట్టన్ చంపేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు ? వారికి కుట్టన్కు సంబంధం ఏంటీ ? తన చెల్లెలు భారతి ప్రేమను కుట్టన్ అంగీకరించాడా ? కుట్టన్తోపాటు భారతి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది తెలియాలంటే 'పురు' చూడాల్సిందే. విశ్లేషణ: ఇది ఒక సింపుల్ స్టోరీ. పరువు హత్యలు, రివేంజ్ కథాంశంగా తెరకెక్కింది. ఈ స్టోరీని మంచి సస్పెన్స్ థ్రిల్లర్గా బాగానే మలిచారు డైరెక్టర్ రథీనా పీటీ. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. క్రమశిక్షణ పేరుతో తండ్రి ప్రవర్తించే తీరు, అది నచ్చకపోయిన తండ్రి మీద భయంతో వాటన్నింటిని కొడుకు భరించే సీన్లను చక్కగా చూపించారు. ఉన్నత కుటుంబాల్లో ఉండే కుల వివక్షత, ఎవరైనా ప్రేమించి పెద్దలను పెళ్లి చేసుకుంటే ఇరుగుపొరుగు వాళ్ల మాటలు, తండ్రి చెప్పిందే వేదం వంటివి ఆలోచింపజేస్తాయి. కానీ స్టోరీ, స్క్రీన్ప్లే చాలా స్లోగా నడుస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారనే చెప్పవచ్చు. తర్వాత ఏదో జరుగబోతోందనిపించే ప్రేక్షకుడికి ప్రతిసారి నిరాశే మిగులుతుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ పర్వాలేదనిపిస్తుంది. కుట్టన్ తీసుకునే సడెన్ డెసిషన్ ఆశ్చర్యపరుస్తుంది. కుట్టన్ను ఎందుకు, ఎవరు చంపుతున్నారనే విషయం ఓకే అనిపిస్తుంది. ఒరిజినల్గా ఇది మలయాళ చిత్రం. తెలుగులోకి డబ్ చేశారు. అయితే పాత్రల లిప్ సింక్కు తగినట్లుగా డబ్ చేస్తారు. డబ్ చేసేటప్పుడు దానికి తగినట్లుగానే డైలాగ్లు రాస్తారు. మలయాళంలో ఉన్న డైలాగ్లనే తెలుగులోనూ పూర్తిగా అదే అర్థం వచ్చేలా చెప్పిస్తే కొంతవరకు బెటర్గా ఉండేది. రివెంజ్ తీర్చుకునే వ్యక్తి ఇంటెన్సిటీ చక్కగా కనిపించేది. ఎందుకంటే ఇంగ్లీష్లో వచ్చే సబ్టైటిల్స్కు తెలుగులో డైలాగ్లకు కొన్నిసార్లు సంబంధం ఉండదు. కేవలం కొద్దిపాటి అర్థం వచ్చేలా మ్యానేజ్ చేశారు. ఎవరెలా చేశారంటే? ఈ మూవీలో హైలెట్ అంటే కేవలం అది మమ్ముట్టి నటనే. కొడుకు మీద ప్రేమతోపాటు క్రమశిక్షణ ఎంత అవసరమో అని చెప్పే తండ్రిగా, భార్య జ్ఞాపకాలను తలుచుకుంటూ జీవించే భర్తగా ఆయన నటన అద్భుతంగా ఉంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్కు నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆయన క్యారెక్టర్, నటన బాగా మ్యాచ్ అయ్యాయి. కుట్టన్ కొడుకు కిచ్లుగా బాల నటుడు వాసుదేవ్ సజీత్ కూడా ఎంతో చక్కగా నటించాడు. తండ్రి మీద భయం, ద్వేషం, ప్రేమ వంటి ఎమోషన్స్ చూపించండలో ఆకట్టుకున్నాడు. పార్వతి తిరువోతు నటన ఆ క్యారెక్టర్కు సరిపోయేలా ఉంది. నెక్ట్స్ సమ్థింగ్ ఏదో జరగుతుందనిపించేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్గా ఉంది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఇక చివరిగా చెప్పాలంటే టైంపాస్ కోసం చూడలనుకునేవారు ఓపికతో 'పురు'ను చూడొచ్చు. -
మమ్ముట్టి మిస్టిక్ థ్రిల్లర్ 'పుజు'.. నేరుగా ఆ ఓటీటీలోకి
Mammootty Puzhu Movie Released On Sony Liv: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల భీష్మ పర్వం, సీబీఐ5 ది బ్రెయిన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. తాజాగా మరో డిఫరెంట్ మూవీ 'పుజు'(Puzhu) తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో 'చార్లీ' సినిమా ఫేమ్ పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంతో రతీనా పీటీ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. అలాగే ఇందులో మమ్ముట్టి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ తండ్రికొడుకుల నేపథ్యంలో మిస్టిక్ థ్రిల్లర్గా తెరెకెక్కినట్లు తెలుస్తోంది. వాసుదేవ్ సజీత్ మరార్ మమ్ముట్టి కొడుకుగా నటిస్తున్నాడు. ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. సోనీ లివ్లో మే 13 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్, సిన్సిల్ సెల్యూలాయిడ్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో లుక్కేయండి!
కరోనా వల్ల పూర్తిగా చతికిలపడ్డ బాక్సాఫీస్ బిజినెస్ అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 హిట్లతో తిరిగి ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాల సక్సెస్ను చూసి మరిన్ని చిత్రాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. ప్రేక్షకుడికి బోలెడంత వినోదాన్ని పంచేందుకు సై అంటున్నాయి. అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలేంటో చూసేయండి.. జెర్సీ షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన జెర్సీకి ఇది రీమేక్. తెలుగు జెర్సీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్కు సైతం దర్శకత్వం వహించాడు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతోంది. 1996 ధర్మపురి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ సమర్పణలో గగన్ విహారి, అపర్ణ హీరోహరోయిన్లుగా నటించిన సినిమా 1996 ధర్మపురి. విశ్వజగత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 22న రిలీజవుతోంది. ఆహా గని - ఏప్రిల్ 22 అమెజాన్ ప్రైమ్ ఓ మై డాగ్ - ఏప్రిల్ 21 గిల్టీ మైండ్స్ - ఏప్రిల్ 22 జీ 5 అనంతం - ఏప్రిల్ 22 నెట్ఫ్లిక్స్ కుథిరైవాల్ - ఏప్రిల్ 20 ద మార్క్డ్ హార్ట్ - ఏప్రిల్ 20 హి ఈజ్ ఎక్స్పెక్టింగ్ (వెబ్సిరీస్) - ఏప్రిల్ 21 సోని లివ్ అంత్యాక్షరి - ఏప్రిల్ 22 వూట్ లండన్ ఫైల్స్ - ఏప్రిల్ 21 చదవండి: అందుకే దక్షిణాది సినిమాలు హిట్ అవుతున్నాయి భారీ ఆఫర్ను తిరస్కరించిన బన్నీ!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్ -
కౌన్ బనేగా కరోడ్పతి 14: రిజిస్ట్రేషన్లు ఈ తేదీ నుంచే!
కౌన్ బనేగా కరోడ్పతి(కేబీసీ) అభిమానులకు గుడ్న్యూస్. కేబీసీ 14వ సీజన్లో త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభవుతుందనేది ఏప్రిల్ 2న తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 9, రాత్రి 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. సోనీ టీవీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ప్రచార ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా విశేష జనాదరణ పొందింది. ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా మంది భారీగా నగదు గెల్చుకున్నారు. అంతేకాదు తమ అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ను కలుసుకోవాలన్న తాపత్రయంతో కూడా కొంతమంది ఈ షోకు వస్తుంటారు. (క్లిక్: దగ్గుతో మోసం.. బహుమతి వెనక్కి, కేబీసీ కథేంటో తెలుసా?) కేబీసీ 14లో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ల సమయంలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు హోస్ట్ అమితాబ్ బచ్చన్ మొదటి రిజిస్ట్రేషన్ ప్రశ్న అడుగుతారు. తర్వాత నుంచి ప్రతి రోజు రాత్రి కొత్త ప్రశ్న ఉంటుంది. సరైన సమాధానాలు ఇచ్చిన వారిని కేబీసీ బృందం సంప్రదించి షార్ట్ లిస్ట్ తయారుచేస్తుంది. ఆశావహులు సోనీలివ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో 200ల సినిమాల్లో అవకాశం.. 'నో' చెప్పిన నటుడు) -
ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాల లిస్ట్!
కరోనా వల్ల ఎక్కడి సినిమాలక్కడే గప్చుప్ అనేట్లుగా అయింది పరిస్థితి. ఇప్పుడా మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో థియేటర్లు మళ్లీ సినిమాలతో కళకళలాడుతున్నాయి. ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన పెద్ద సినిమాలన్నీ రిలీజ్కు సై అంటున్నాయి. ఇప్పటికే రిలీజైన సినిమాలేమో ఓటీటీ బాట పట్టాయి. మరికొన్ని డైరెక్ట్గా ఓటీటీకే వెళ్తామంటూ విడుదల తేదీని లాక్ చేశాయి. మరి లాక్డౌన్లో సినీప్రియులకు నేస్తంగా మారిన ఓటీటీలో ఈవారం ఏయే సినిమాలు, వెబ్సిరీస్లు రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ ప్యాక్ (కన్నడ సినిమా) - ఫిబ్రవరి 17 బెస్ట్ సెల్లర్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 18 హృదయం (మలయాళ చిత్రం) -ఫిబ్రవరి 18 డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఎ థర్స్డే - ఫిబ్రవరి 17 జీ5 మిథ్య (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 18 విలంగు (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 18 నెట్ఫ్లిక్స్ టెక్సాస్ చైన్షా మాసక్కర్- ఫిబ్రవరి 18 సోని లివ్ హోమ్ కమింగ్ - ఫిబ్రవరి 18 ఎనిమి - ఫిబ్రవరి 18 -
ఓటీటీలో ఎనిమి సినిమా, ఎప్పటినుంచంటే?
యాక్షన్ హీరో విశాల్, ఆర్య కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఎనిమి. మమతా మోహన్దాస్, మృణాళిని కథానాయికలు. నోటా డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించాడు. సింగపూర్లో లిటిల్ ఇండియా అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్లు ఎలా కలుస్తారు? అన్నది చిత్ర కథాంశం. గతేడాది దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఎనిమి ఓటీటీ బాట పట్టింది. ఫిబ్రవరి 18 నుంచి సోనీలివ్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను థియేటర్లలో చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసేయండి మరి! Two childhood friends end up on opposite extremes of morality, and face each other in a good vs evil war. #ENEMY starring Vishal and Arya is streaming on Feb 18th only on SonyLIV. #EnemyOnSonyLIV@vishalkofficial @arya_offl @anandshank @mamtamohan @mirnaliniravi @prakashraaj pic.twitter.com/d4MOFivekX — SonyLIV (@SonyLIV) February 10, 2022