South india movies
-
భారత్ నుంచి ఆస్కార్ కోసం నామినేట్ అయిన చిత్రాలు ఇవే
ఆస్కార్ అవార్డుల రేస్లో ఈ ఏడాది సౌత్ ఇండియా నుంచి భారీగానే సినిమాలు పోటీ పడుతున్నాయి. తెలుగు,తమిళ్, మలయాళం నుంచి పలు సినిమాలు ఎంట్రీ కోసం ఊరిస్తున్నాయి. 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలను గుర్తించి వాటిని ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసింది. ఈమేరకు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించింది. 2025 ఆస్కార్కు మన దేశం నుంచి 'లాపతా లేడీస్' ఎంపికైనట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. భారత్ నుంచి పలు భాషలకు చెందిన 29 చిత్రాల్లో లా పతా లేడీస్ను మాత్రమే ఎంపిక చేశారు.అస్కార్ కోసం ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు 'కల్కి 2898 ఏడీ,హనుమాన్,మంగళవారం' ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో 6 తమిళ చిత్రాలు నామినేట్ లిస్ట్లో చోటు సంపాదించుకోవడం విశేషం. వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. మలయాళం నుంచి ఆట్టం, ఆడుజీవితం (ది గోట్ లైఫ్),ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఉళ్ళోజుక్కు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ ఇండియా నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే, భారతీయ చిత్ర పరిశ్రమ పంపిన 29 సినిమాల్లో ప్రస్తుతానికి లపతా లేడిస్ మాత్రమే అస్కార్లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన వస్తుంది. 🤞🏼 pic.twitter.com/YgdeaTsTNi— Prasanth Varma (@PrasanthVarma) September 23, 2024 -
Guess The Actress: ఒక్క చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేమస్.. ఎవరో గుర్తుపట్టారా..?
సల్మాన్ ఖాన్ నటించిన 'వీర్' సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నటి 'అభా పాల్'. ఆ సినిమా తర్వాత 'కామసూత్ర 3డి'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 2013లో విడుదలైన కామసూత్ర 3డి సేన్సేషనల్ చిత్రంగా నిలిచింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. తర్వాత ట్రిపులు ఎక్స్, మస్త్రం, హై తౌబ్బా వంటి రొమాంటిక్ వెబ్ సిరీస్తో యూత్కు దగ్గరైంది. ఇటీవల మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన 'అబా పాల్' తన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఏడాదిలో ఒక్కసారి అయినా భారత్లోని పలు దేవాలయాలను సందర్శిస్తానని ఆమె చెప్పారు. 'ఆబా పాల్' ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో 1987 ఆగస్టు 7న జన్మించింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఆమె. 2005లో తొలిసారి మోడలింగ్లో అడుగుపెట్టింది. 2006లో అందాల పోటీలో మిస్ ఢిల్లీ అవార్డును గెలుచుకుని మొదట పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 2017లో సల్మాన్ ఖాన్ నటించిన 'వీర్'లో ఆమె చిన్న పాత్రను పోషించింది, కానీ ఆమె పాత్రను మాత్రమే ఎడిట్లో మేకర్స్ తొలగించారు. దీంతో ఆమె కొంతమేరకు అసహనానికి గురైంది. సినిమా అవకాశం ఇచ్చిన తర్వాత తన పాత్రను తొలగించడం వల్లే అశ్లీల చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని ఆమె గతంలో చెప్పుకొచ్చింది. 'టేస్ట్' అనే తమిళ చిత్రంతో దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఒక మొబైల్ యాప్ను ప్రారంభించగా దానిని లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 2020లో విడుదలైన శృంగార నాటకం 'మస్త్రం'లో సరితా నాయర్గా కూడా నటించింది. ‘కామసూత్ర’ త్రీడి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. ఏకంగా మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి నిలవడం విశేషం. ఇందులో షెర్లిన్ చోప్రా కూడా ప్రధాన పాత్రలో కనిపించింది. అభా పాల్ మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం వెలుపల నుంచి గోపురం వద్ద నిలబడి సెల్ఫీ దిగింది. ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకుంది. ఆ ఫోటో చూసిన అభిమానులు మీకు గుడికి వెళ్లే అలవాటు కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాంటి సినిమాల్లో నటించే మీలో భక్తి కూడా దాగి ఉందా..? అంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. కామసూత్ర 3డి బ్యూటీ అబా పాల్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Aabha Paul (@aabhapaulofficial) -
స్టార్ హీరోతో సినిమా.. తొలిసారి సౌత్లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ
కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న చిత్రం 'టాక్సిక్'. చాలా కథలను విన్న యష్.. టాక్సిక్ స్టోరీ మెచ్చి ఈ చిత్రాన్ని ఫైనల్ చేశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఫ్యాన్స్లో కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కరీనా కపూర్ కీలక పాత్రలో కనిపించనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద ప్రాజెక్ట్లో కనిపించనున్నట్లు ఆమె ఒక హింట్ అయితే కొద్దిరోజుల క్రితం ఇచ్చింది. దీంతో యష్ తదుపరి చిత్రం 'టాక్సిక్'లో ఆమె నటించబోతున్నట్లు అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. టాక్సిక్లో యష్తో పాటుగా ఆమె కలిసి స్క్రీన్ను పంచుకోనుందని గతంలో కూడా పలు వార్తలు అయితే వచ్చాయి. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పలు విషయాలను పంచుకున్న కరీనా.. సౌత్ ఇండియాలోని స్టార్ హీరో చిత్రంలో నటిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ ప్రాజెక్ట్ తనకు తొలి సౌత్ ఇండియా మూవీ అని పేర్కొంది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నానని ఆమె పేర్కొంది. కానీ షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటానో తెలయదన్న ఈ బ్యూటీ.. ఆ సమయం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ విషయాన్ని కరీనా ప్రకటించడంతో ఆమెను ఫ్యాన్స్ అభినందించారు. 42 ఏళ్ల వయసులో యష్తో పాన్-ఇండియా చిత్రంలో కరీనా భాగం కానున్నడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 2025 ఏప్రిల్లో టాక్సిక్ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు గీతు మోహన్దాస్ తెరకెక్కిస్తున్నారు. యష్, గీతు మోహన్దాస్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇది. కరీనా కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. -
2024.. ఈ సినిమాల కోసం మూవీ లవర్స్ వెయిటింగ్.. (ఫోటోలు)
-
శంకర్ కూతురు.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరో సూర్యకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘సూరరై పొట్రు’(తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమా హిట్గా నిలిచింది. వీరి కాంబినేషన్లో మరో చిత్రం ‘సూర్య 43’(వర్కింగ్ టైటిల్) రూపొందనుంది. ఈ మూవీలో అదితీ శంకర్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారని టాక్. -
కొత్త హీరోతో సినిమా.. అలాంటి డిఫరెంట్ స్టోరీ
'అట్టు' దర్శకుడు రతన్ లింగా, రాజకుమార్, వేలుసామి కలిసి బాంబూ ట్రీస్ సినిమాస్, అల్మురియట్ సంస్థలపై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం బుధవారం చైన్నె, తిరువళ్లూర్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా మన్నవరాజన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడైన రతన్లింగా మరో దర్శకుడికి అవకాశం ఇవ్వడం విశేషం. (ఇదీ చదవండి: డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కొత్త కారు.. ఎన్ని కోట్లో తెలుసా?) మన్నవరాజన్ చెప్పిన కథ నచ్చడంతో ఈయనని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అర్జున్ అనే కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సెంబీ చిత్రం ఫేమ్ ముల్లై హీరోయిన్గా చేస్తోంది. లెనిన్ బాలాజీ సినిమాటోగ్రాఫర్. చిత్ర వివరాలను దర్శకుడు చెబుతూ.. 'చరిత్రలో మరుగున పడ్డ వైవిద్య జాతి గురించి చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుంది' అని అన్నారు. మంచి జనరంజక అంశాలతో పాటు, అవార్డులే లక్ష్యంగా ఈ సినిమా తీస్తున్నట్లు దర్శకుడు చెప్పుకొచ్చారు. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. టైటిల్తో పాటు మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. కాగా పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్ను శరవేగంగా పూర్తి చేసి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తునట్లు నిర్మాతలు తెలిపారు. (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!) -
రాజకీయాల్లోనే కాదు సినిమాల్లో కూడా ఆయన బిజీనే
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేతి నిండా చిత్రాలతో దూసుకుపోతున్న నటుడు శరత్ కుమార్. సుప్రీం హీరోగా అభిమానులు పిలుచుకునే ఈయన మరో పక్క రాజకీయ నాయకుడిగానూ కొనసాగుతున్నారు. కాగా శరత్ కుమార్ ఇప్పుడు డజన్కు పైగా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల అశోక్ సెల్వన్తో కలిసి నటించిన పోర్ తొళిల్ మంచి విజయాన్ని సాధించింది. (ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!) తాజాగా మిస్టర్ ఎక్స్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. నటుడు ఆర్య గౌతమ్ కార్తీక్ నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. నటి అనకా, మంజు వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇందులో నటుడు శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ స్పై థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి దీపం నీనన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
ఓటీటీలోకి సూపర్హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!
'కాదేది కవితకనర్హం' అని ప్రముఖ రచయిత శ్రీశ్రీ చెప్పినట్లు.. సినిమా తీయాలంటే కొత్త కథలేం అక్కర్లేదు. మన చుట్టూ ఉన్న పరిసరాలు గమనిస్తే చాలు బోలెడు లైన్స్ దొరుకుతాయి. వాటిలో ఓ పాయింట్ తీసుకుని, దాన్ని రెండు-రెండున్నర గంటల చిత్రంగా తీసియొచ్చు. అన్నీ కలిసొస్తే హిట్ కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తెలుగులో తక్కువ గానీ తమిళ, మలయాళ డైరెక్టర్లు ఈ విషయంలో దిట్టలు. డైరెక్టర్ మారుతి గతంలో సింపుల్ పాయింట్స్ తో కొన్ని సినిమాలు తీశాడు. 'భలే భలే మగాడివోయ్'లో హీరోకి మతిమరుపు, 'మహానుభావుడు'లో హీరోకి ఓసీడీ(అతిశుభ్రత). ఈ మధ్య తమిళంలోనూ 'గుడ్ నైట్' అని మూవీ వచ్చింది. మనందరికీ తెలిసిన 'గురక' అనే సమస్య ఆధారంగా ఈ సినిమా తీశారు. అద్భుతమైన విజయం అందుకున్నారు. (ఇదీ చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని!) ఇప్పుడీ సినిమాను జూలై 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్ కానుంది. దీని గురించి ఇప్పటికే తెలిసిన కొందరు ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మీరు మూవీ లవర్ అయితే మాత్రం అస్సలు మిస్సవ్వొద్దు. 'గుడ్ నైట్' కథేంటి? మోహన్ (మణికందన్)కు గురక సమస్య. అక్కాబావతో కలిసి ఉంటాడు. తన జబ్బు వల్ల అందరూ తిడుతున్నా ఏదో అలా నెట్టుకొచ్చేస్తుంటాడు. అను(మీరా రఘునాధ్) పరిచయమైన తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరి స్నేహం పెళ్లి వరకు వెళ్తుంది. అయితే తనకు గురక ప్రాబ్లమ్ ఉందని ఆమె దగ్గర దాచిపెడతాడు. కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అనుకి అసలు విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? భార్యభర్తలు సర్దుకున్నారా లేదా అనేదే ఓటీటీలోకి సినిమా వచ్చిన తర్వాత చూసి ఎంజాయ్ చేయండి. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఫస్ట్లుక్.. ఇది గమనించారా?) #GoodNightMovie To Stream from JULY 3rd on Hotstar..🔥 One of the Most Awaited OTT Releases in Recent Times..⭐ pic.twitter.com/wljVfi2cKH — Laxmi Kanth (@iammoviebuff007) June 21, 2023 -
పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది.. ఆ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం
పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది అనేది సామెత కావొచ్చు. ఏఆర్.రెహ్మాన్ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం. ఆ కుటుంబానికి సంగీతం ఒక వరం. ఏఆర్.రెహ్మాన్ తండ్రి శేఖర్ సంగీత కళాకారుడు. దీంతో ఆయన కుటుంబం సంగీత ఆనందనిలయంగా మారింది. ఏఆర్.రెహ్మాన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. భరతమాత ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన ఆస్కార్ నాయకుడు ఆయన. రెహ్మాన్ సోదరీమణులు, పిల్లలు సంగీత సేవకులే. ఏఆర్.రెహ్మాన్ రూపొందించిన వందేమాతరం ఆల్బమ్ జాతీయ గీతంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరి ఇశ్రత్ కాత్రి కూడా ఆయన అడుగు జాడల్లోనే సంగీత పయనం చేస్తున్నారు. అన్నయ్య సంగీత దర్శకత్వంలో ఇప్పటికే పాడుతున్న ఇశ్రత్ కాత్రి సంగీత దర్శకులుగానూ అవతారం ఎత్తారు. చిత్రాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్లకు సంగీతాన్ని అందిస్తున్నారు. అలా తాజాగా ఎందయుమ్ చారుమతి మగిళ్ందు కులావి అనే కవి భారతీయార్ కవితా పదాలతో వందేమాతరం అనే ఆల్బమ్ను తనదైన శైలిలో రూపొందించారు. ఈ పాటకు స్వరాలు సమకూర్చడమే కాకుండా పాడి, నటించి స్వయంగా రూపొందించడం విశేషం. ఇది మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భారతదేశం ఖ్యాతిని కీర్తించే ఆల్బమ్గా ఉంటుందని ఇశ్రత్ కాత్రి తెలిపారు. ప్రముఖ దర్శకుడు మాదేశ్ దర్శకత్వం వహించిన ఈ ఆల్బమ్కు గురుదేవ్ చాయాగ్రహణం, దినేష్ పొన్రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. దీన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆల్బమ్ను దేశానికి అందించడం తన కృతజ్ఞతతో కూడిన బాధ్యత అని సంగీత దర్శకులు ఇశ్రత్ కాత్రి పేర్కొన్నారు. -
Janhvi Kapoor: మళ్లీ రిపీట్ చేస్తున్నా.. రావడం పక్కా.. అది కూడా త్వరలోనే..
అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నటి జాన్వీ కపూర్. హిందీ చిత్రం దడక్ ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈమె అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. అందుకు కారణం ఆమె వారసత్వం కావచ్చు. సినీ రంగ ప్రవేశం చేసి నాలుగేళ్లు అయ్యింది. ఇప్పటివరకు ఆరు చిత్రాల్లోనే నటించింది. అందులో గుంజన్ సక్సేనా, మిల్లి వంటి చిత్రాల్లో నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే ఆ చిత్రాలు మాత్రం ఆశించిన విజయాలను సాధించలేకపోయాయి. ప్రస్తుతం రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అయితే నటనలో కంటే గ్లామర్తోనే జాన్వీకపూర్ ఎక్కువ పాపులర్ అయ్యిందనే చెప్పాలి. తరచూ స్కిన్ షో ప్రదర్శనతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తూ వార్తల్లో ఉంటోంది. కాగా ఆమెను దక్షిణాదిలో పరిచయం చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏ చిత్రానికి పచ్చజెండా ఊపలేదు. ఈ బ్యూటీ కూడా దక్షిణ చిత్రాల్లో నటించాలని కోరుకున్నట్లు చెబుతూనే ఉంది. ఇటీవల చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన జాన్వికపూర్ ఇంతకు ముందు చెప్పిందే మళ్లీ రిపీట్ చేసింది. దక్షిణాది చిత్రాల్లో నటించడం పక్కా అని, త్వరలోనే అది జరుగుతుందని చెప్పింది. -
2022 లో చెలరేగిన దక్షిణబాషా చిత్రాలు
-
Sunny Leone: ఆ సమయంలో వారు పక్కనుండటం ఇష్టపడను
బాలీవుడ్లో శృంగార తారగా రాణిస్తున్న సన్నీలియోన్ దక్షిణాదిలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. లండన్లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. దీంతో 2012 నుంచి అలాంటి చిత్రాలు చేయడం మానేసి హిందీ చిత్రాలు, ఐటమ్ సాంగ్స్లో నటిస్తూ శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈమె డేనియల్ వైబర్ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కవల పిల్లలకు (మగపిల్లలు) సరోగసీ ద్వారా తల్లిదండ్రులయ్యారు. నిషాకౌర్ అనే కూతురు కూడా ఉంది. శృంగార తారగా రాణిస్తున్న సన్నీ లియోన్ తనకు సినిమా, వ్యక్తిగత జీవితం వేర్వేరు అంటోంది. ఈమెకు ఇప్పుడు దక్షిణాదిలోనూ క్రేజ్ ఉంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ఐటెం సాంగ్స్తో క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించడం ప్రారంభించింది. అలా ఓ మై ఘోస్ట్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్న సన్నీ లియోన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను గ్లామరస్గా నటిస్తున్న సమయంలో తన పిల్లలు గాని, ఇతర పిల్లలు గాని అక్కడ ఉండడం ఇష్టపడనని చెప్పింది. వారు అక్కడ ఉంటే షూటింగ్ చేయడమే మానేస్తానని చెప్పింది. -
ఆ ప్యాషనే వేరు, సౌత్ సినిమాలు చేయాలనుంది: సంజయ్ దత్
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అది ఒకప్పుడు, ఇప్పుడు సీన్ మారింది. బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తోంది సౌత్ ఇండస్ట్రీ. వరుస సినిమాలను వదులుతూ హిందీ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది. దక్షిణాది సినిమాలకు ఫిదా అయిపోతున్న జనాలు సౌత్ ఇండస్ట్రీకి జై కొడుతున్నారు. కన్నడ చిత్రాలైన కేజీఎఫ్, కాంతార హిందీలో అఖండ విజయాలను నమోదు చేసుకున్నాయి. తాజాగా మరో కన్నడ చిత్రం కేడీ- ద డెవిల్ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. గురువారం బెంగళూరులో కేడీ టైటిల్ టీజర్ను దర్శకుడు ప్రేమ్, నటుడు సంజయ్ దత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ దక్షిణాదిలో మరిన్ని చిత్రాల్లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. 'నేను కేజీఎఫ్లో చేశాను, ఇప్పుడు డైరెక్టర్ ప్రేమ్తో కేడీ సినిమా చేస్తున్నాను. కేడీ టీజర్ చాలా బాగుంది. సౌత్లో వారి ప్రేమను, శక్తిని, హీరోయిజాన్ని, ప్యాషన్ను.. అన్నింటినీ సినిమాలపై కుమ్మరించి చూపిస్తారు. దక్షిణాదిలో మరిన్ని సినిమాలు చేయాలనుంది. బాలీవుడ్ కూడా తన మూలాలు మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా ధృవ్ సర్జా హీరోగా నటించిన కేడీ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. చదవండి: జిన్నా మూవీ రివ్యూ కాంతారపై కంగనా రనౌత్ రివ్యూ -
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న కాజల్ అగర్వాల్.. ఆ సినిమా కోసమే..!
కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రంలో కమల్కు జోడీగా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రం కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలారిపాయట్టును సాధన చేస్తోంది. తాజాగా ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ చాలా రోజుల తర్వాత తిరిగి షూటింగ్లో అడుగుపెట్టింది. ఇండియన్ 2 సినిమాలో తన పాత్ర కోసం యుద్ధ కళలతో పాటు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటోంది కాజల్. (చదవండి: Kamal Haasan: రెండేళ్ల తర్వాత సెట్స్లో అడుగుపెట్టిన కమల్.. ఫోటోలు వైరల్) ఇన్స్టాలో పోస్టులో "కలరిపాయట్టు ఒక పురాతన మార్షల్ ఆర్ట్స్. షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో క్రీడలు కలరిపాయట్టు నుంచి పుట్టుకొచ్చినవే. ఈ యుద్ధ క్రీడ సాధారణంగా గెరిల్లా యుద్ధంలో వినియోగిస్తారు. ఇది శారీరక, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. మూడేళ్లుగా అడపాదడపా నేర్చుకుంటున్నా. నాకు చాలా ఓపికగా నేర్పిస్తున్న మాస్టర్కు ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపేశారు. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
ధనుష్ లుక్ ఊరమాస్.. కొత్తమూవీ బిగ్ అప్డేట్..!
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ ఇవాళ సాయంత్రం రానుంది. ఈ సినిమాకు 'కెప్టెన్ మిల్లర్' టైటిల్ ఖరారు చేశారు. ఓ రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు మూవీ నుంచి కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ట్విట్టర్లో వెల్లడించింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ధనుష్ లుక్ అదిరిపోయింది. (చదవండి: Thiru OTT Streaming: ఓటీటీలోకి ధనుష్ తిరు మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..) ఈ సినిమాకు అరుణ్ మహేశ్వరన్ డైరెక్షన్ వహించనుండగా.. జీవీ ప్రకాశ్ సంగీత మందిస్తున్నారు. ఈ చిత్రానికి సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇటీవల ధనుష్ నటించిన ‘తిరుచిట్రంపళం’(తెలుగులో తిరు) ఆగష్టు 18న విడుదలై హిట్ సాధించింది. తాజాగా ధనుష్ కొత్త చిత్రం అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. We are very elated to present #CaptainMiller with the indomitable star @dhanushkraja 💫 This will be a very exciting film DIRECTED by the young & maverick @ArunMatheswaran 🔥🤗 A @gvprakash Musical 🥁 pic.twitter.com/FKX2iPL1yr — Sathya Jyothi Films (@SathyaJyothi) July 2, 2022 -
అప్పటికే నాకు గ్లామర్ డాల్ అనే ముద్ర ఉంది: హీరోయిన్
Yashika Anand About Working With SJ Surya In Kadamaiyai Sei: నాగర్ ఫిలిమ్స్ పతాకంపై టి.ఆర్ రమేష్, ఎస్ జహీర్ హుస్సేన్ కలిసి నిర్మింన చిత్రం 'కడమై సెయ్'. ఎస్జే సర్య, యాషిక ఆనంద్ జంటగా నటించిన ఈ త్రానికి వెంకట్ రాఘవన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా ఆదివారం (ఆగస్టు 07) సాయంత్రం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో చిత్ర యూత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నటి యాషిక ఆనంద్ మాట్లాడుతూ.. ''దర్శకుడు కథ చెప్పినప్పుడు అందులోని హీరోయిన్ పాత్రకు నేను న్యాయం చేయగలనా..? అని సందేహం కలిగింది. ఎందుకంటే ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు నా వయస్సు 21. అలాంటిది ఇందులో ఓ బిడ్డకు తల్లిగా నటించే పాత్ర నాది. అప్పటికే నాకు గ్లామర్ డాల్ అనే ముద్ర ఉంది. దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఈ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కడం సంతోషంగా ఉంది. ఎస్జే సూర్యతో కలిసి నటించడం మంచి అనుభవం'' అని పేర్కొంది. నటుడు ఎస్ జే సూర్య మాట్లాడుతూ చిత్ర నిర్మాత రమేష్ చాలా ప్రతిభ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఇది ఆయన శ్రమతోనే రూపొందిన చిత్రమని పేర్కొన్నారు. మరో నిర్మాత జాకీర్ హుస్సేన్ ఆయనకు పక్క బలంగా నిలిచారన్నారు. దర్శకుడు వెంకట్ రాఘవన్ చిత్ర కథను తనకు చెప్పినప్పుడు అందులో కంటెంట్ చాలా ముఖ్యంగా అనిపించిందన్నారు. ఈ చిత్రకథ ప్రత్యేకంగా అనిపించడంతో కచ్చితంగా నటించాలని భావించానన్నారు. 'కడమై సెయ్' చిత్రం మం విజయం సాధిస్తుందని, కచ్చితంగా ఇది హిందీలోను రీమేక్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సౌత్ Vs నార్త్.. 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు
Alia Bhatt On South Industry Says Even All Their Films Not Worked: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కమిట్ అయిన సినిమాలకు ప్రెగ్నెన్సీలోనూ ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల అలియా హాలీవుడ్ డెబ్యూ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రీకరణలో పాల్గొంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన మూవీ డార్లింగ్స్ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ''భారతీయ చిత్రపరిశ్రమ మొత్తానికి ఇది కష్టకాలం. ఇలాంటి పరిస్థితుల్లో మనం హిందీ చిత్రాలపై కాస్త దయ చూపించాలి. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఆహా బాలీవుడ్.. ఓహో హిందీ సినిమాలు అని చెప్పుకుంటున్నాం. కానీ ఇటీవల విడుదలైన ఎన్ని బాలీవుడ్ చిత్రాలు మంచి విజయం సాధించాయి ? సౌత్ ఇండస్ట్రీలో కూడా అన్ని సినిమాలు బాగా ఆడలేదు. అక్కడ కూడా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలే విజయం సాధిస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా. అంతెందుకు నా సినిమా 'గుంగూభాయి కతియావాడి'నే తీసుకోండి. అది మంచి విజయాన్నే సొంతం చేసుకుంది కదా'' అని ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ పేర్కొంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలోనూ ప్రమోషన్స్లో పాల్గొనడంపై అడిగిన ప్రశ్నకు 'ఇలాంటి సమయంలో రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్స్లో పాల్గొనడం ఇబ్బందిగా లేదా? అని చాలామంది అంటున్నారు. నిజానికి, మనం సంపూర్ణ ఆరోగ్యంగా, ఫిట్గా ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్న కూడా పని నుంచి విరామం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే ఉత్సాహాంతో పని చేసుకోవచ్చు. నాకు వృత్తిపట్ల ఉన్న ప్రేమ, అంకితభావంతోనే ఇలా చేయగలుగుతున్నా' అని చెప్పుకొచ్చిందీ క్యూట్ హీరోయిన్. కాగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా భట్ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. -
పునీత్ రాజ్కుమార్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్.. దేవుడి పాత్రలో..
Lucky Man Teaser Released: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ (Puneeth Rajkumar) మరణం సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఇక ఆయన కుటుంబీకులకు, అభిమానులకు ఎనలేని శోకాన్ని మిగిల్చింది. ఇప్పటికీ ఆయన్ను తలచుకోని అభిమాని లేడు. తన ప్రియతమ హీరోను వెండితెరపై చూడలేమన్న నిజాన్ని తట్టుకోలేకపోయారు. అయితే పునీత్ రాజ్కుమార్ మరణం కన్నా ముందు కమిట్ అయి, చిత్రీకరించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో 2022, మార్చి 17న విడుదలైన 'జేమ్స్' ప్రేక్షకులను అలరించింది. పునీత్ రాజ్కుమార్ను వెండితెరపై చూసుకున్న అభిమానులు కంటతడిపెట్టారు. తర్వాత ఆయన్ను మళ్లీ చూస్తామో లేదో అని కుమిలిపోయారు. అయితే పునీత్ రాజ్కుమార్ అభిమానులకు త్వరలోనే సర్ప్రైజ్ దక్కనుంది. మరోసారి పునీత్ రాజ్కుమార్ను వెండితెరపై చూసే అదృష్టం కలగనుంది. పునీత్ మరణం కంటే ముందు ఆయన ఒప్పుకుని, నటించిన చిత్రాల్లో 'జేమ్స్'తోపాటు 'లక్కీ మ్యాన్' కూడా ఉంది. పునీత్ రాజ్కుమార్ గెస్ట్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది చిత్రబృందం. రొమాంటిక్ కామెడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ భగవంతుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పునీత్ రాజ్కుమార్ చేసే డ్యాన్స్ ఫ్యాన్స్తో పాటు ఆడియెన్స్ను ఆకట్టుకునేలా ఉంది. నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డార్లింగ్ కృష్ణ, సంగీత శృంగేరి, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు -
ఆ నిర్మాణ సంస్థలో రెండోసారి విజయ్ సినిమా..
Uriyadi Vijay Kumar New Movie With Reel Good Films: 'ఉరియడి' చిత్రంతో ఆ పేరునే ఇంటి పేరుగా గుర్తింపు పొందిన నటుడు విజయ్ కుమార్. ఆ తర్వాత సూర్య, జ్యోతికల నిర్మాణా సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై 'ఉరియడి-2' చిత్రం చేసిన ఈయన తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. రీల్ గుడ్ ఫిలీంస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఇది ఈ సంస్థలో ఆయన చేస్తున్న రెండో చిత్రం. ప్రీతి అస్రాణి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి 'సేతుమాన్' చిత్రం ఫేమ్ తమిళ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్రన్ జయ రాజ్ ఛాయగ్రహణం, వసంత గోవింద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ.. సామాజిక రాజకీయ సంఘటనలతో పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. షూటింగ్ను ఏకధాటిగా నిర్వహించి 60 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. -
ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు..
The Gray Man Directors Russo Brothers: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఆయన తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్'తో పర్వాలేదనిపించిన ధనుష్.. హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ధనుష్ ఫస్ట్ లుక్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్లు రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరూ త్వరలో ఇండియాకు రానున్నారు. అది కూడా ధనుష్ కోసం భారత్కు వస్తున్నట్లు వాళ్లు తెలిపారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ రూపొందించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో ఇండియాకు వస్తున్నట్లు రూసో బ్రదర్స్ చెప్పుకొచ్చారు. ''మేం తెరకెక్కించిన కొత్త సినిమా 'ది గ్రే మ్యాన్' వీక్షించేందుకు, మా స్నేహితుడు ధనుష్ను చూసేందుకు ఇండియాకు వస్తుండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో కలుద్దాం'' అని తెలిపారు. చదవండి: నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్బ్యాక్ హిట్.. 'కెప్టెన్ అమెరికా: సివిల్ వార్', 'కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్', 'అవేంజర్స్: ఇన్ఫినిటీ వార్', 'అవేంజర్స్: ఎండ్ గేమ్' వంటి తదితర బ్లాక్ బస్టర్ సినిమాలకు రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. కాగా మార్క్ గ్రీన్ రాసిన పుస్తకం ఆధారంగా రూసో బ్రదర్స్ ఈ మూవీని తెరకెక్కించారు. సినిమాకు తగిన విధంగా జో రూసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ఫీల్ స్క్రిప్ట్ రాశారు. ఈ సినిమా జులై 22 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
'విడియుమ్ వరై కార్తిరు' టైటిల్ పోస్టర్ విడుదల
చెన్నై సినిమా: లిబ్రా ప్రొడక్షన్స్ పతాకంపై వీసీ రవీంద్రన్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి 'విడియుమ్ వరై కార్తిరు' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో విద్యార్థి విక్రాంత్, కార్తీక్ కుమార్, మహాలక్ష్మి శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ముండాసిపట్టి, రాక్షసన్ చిత్రాల దర్శకుడు రామ్కుమార్ శిష్యుడు బాజీ సలీమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్ర టైటిల్ పోస్టర్ను శనివారం దర్శకుడు భాగ్యరాజ్ ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి కోయంబత్తూరులో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించి అనంతరం సూపర్ ఫాస్ట్గా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చదవండి: బేబీ బంప్తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. తనకన్నా చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్, ఇద్దరు పుట్టాక పెళ్లి ! ఇది ఎవరికీ తెలియదనుకుంటా: నాగార్జున -
వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్పై అధికారిక ప్రకటన
Raghava Lawrence Chandramukhi 2 Lyca Productions Official Announcement: సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయన తార కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రం 'చంద్రముఖి'. 2005లో వచ్చిన ఈ మూవీకి పి. వాసు దర్శకత్వం వహించారు. కామెడీ, హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఎంతో బాగుంటుందని సగటు ప్రేక్షకుడు కోరుకున్నాడు. అందుకు తగినట్లుగానే ఈ ఆల్టైమ్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరో, హీరోయిన్లు ఎవరు అనే అంశంపై స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. 'చంద్రముఖి' సినిమా విడుదలై సుమారు 17 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' అధికారికంగా తెలిపింది. అయితే ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 'కాంచన' మూవీ సిరీస్లతో హారర్, కామెడీ అందించడంలో దిట్టగా లారెన్స్ నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ 'చంద్రముఖి 2'లో మేయిన్ రోల్లో లారెన్స్ నటించనున్నాడు. మొదటి సినిమాను డైరెక్ట్ చేసిన పి. వాసు ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. చంద్రముఖిలో తనదైన కామెడీని పండించిన వడివేలు ఈ సీక్వెల్లో అలరించనున్నాడు. అలాగే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించునున్నారు. ఆర్డీ రాజశేఖర్ కెమెరామేన్గా బాధ్యలు చెపట్టగా, తోట తరణి ఆర్ట్ వర్క్ను చూసుకోనున్నారు. Elated to announce 🤩 our next Big project #Chandramukhi2 🗝️✨ Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎 Directed by #PVasu 🎬 Music by @mmkeeravaani 🎶 Cinematography by @RDRajasekar 🎥 Art by #ThottaTharani 🎨 PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/NU76VxLrjH — Lyca Productions (@LycaProductions) June 14, 2022 అయితే 'చంద్రముఖి' సినిమాను శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించగా 'చంద్రముఖి 2'ను నిర్మించే బాధ్యతను మాత్రం 'లైకా ప్రొడక్షన్స్' తీసుకుంది. అయితే ఈ మార్పుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా, ఇది బహుభాషా చిత్రంగా ఉంటుందా ? లేదా తమిళంలో మాత్రమే విడుదల చేస్తారా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉంటే చంద్రముఖి తర్వాత వెంకటేశ్, పి. వాసు కాంబినేషన్లో 'నాగవల్లి' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రముఖి సినిమాకు ఇదే సీక్వెల్గా ప్రచారం జరిగింది. కాకపోతే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ఇప్పుడు పక్కా స్క్రిప్ట్తో చంద్రముఖి 2ను రూపొందించనున్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. Positive Vibes ✨ & Happy Faces 😇 all around #Chandramukhi2 🗝️✨ Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎 Directed by #PVasu 🎬 Music by @mmkeeravaani 🎶 Cinematography by @RDRajasekar 🎥 Art by #ThottaTharani 🎨 PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/pf57zgJ7xC — Lyca Productions (@LycaProductions) June 14, 2022 -
అలా చేయాలంటే మేము బయటకు వెళ్లాలి: కమల్ హాసన్
Kamal Haasan About Shankar Indian 2 Says We Cant Sit With One Movie: నాలుగేళ్ల తర్వాత లోకనాయకుడు (ఉలగ నాయగన్) కమల్ హాసన్ వెండితెరపై సందడి చేశాడు. తాజాగా ఆయన నటించిన 'విక్రమ్: హిట్ లిస్ట్' మూవీ అదిరిపోయే రెస్పాన్స్తో దూసుకుపోతోంది. సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న కమల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో 'భారతీయుడు 2' (ఇండియన్ 2) గురించి మాట్లాడారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'భారతీయుడు 2' సినిమాపై కమల్ స్పందనను యాంకర్ కోరగా ఈ వ్యాఖ్యలు చేశాడు. భారతీయుడు 2 సినిమా ఆగిపోలేదు. తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అయితే కరోనా, సెట్లో ప్రమాదం ఇలా రకరకాల కారణాలతో సినిమా చిత్రీకరణ ప్రారంభం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా షూటింగ్ కంటిన్యూ చేశాం. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా వాళ్లతో ఇప్పటికే మాట్లాడాం. వాళ్లు కూడా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇంకో 40 శాతం షూటింగ్ మిగిలి ఉంది. అది కూడా త్వరలోనే చేస్తాం. ఎందుకంటే ఒక చిత్రంపైనే పదేళ్లు పని చేయలేం కదా. రాజ్ కమల్ ఫిల్మ్స్ అని నాకొక నిర్మాణ సంస్థ ఉంది. అలాగే శంకర్కి ఎస్. ప్రొడక్షన్స్ ఉంది. ఈ రెండు చాలా పెద్ద సంస్థలు. ఈ రెండింటిని మేమే పోషించాలి. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాలి. అని కమల్ హాసన్ పేర్కొన్నారు. చదవండి: కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ.. కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
సూర్యను మరోసారి డైరెక్ట్ చేయనున్న ‘జై భీమ్’ డైరెక్టర్ !
చెన్నై సినిమా: జై భీమ్ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటుడు సూర్య కథానా యకుడిగా నటించి తన 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మించిన జై భీమ్ చిత్రం గత ఏడాది ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న విష యం తెలిసిందే. ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. కాగా ఈయన సూర్యను మరోసారి డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తన కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కథ సూర్యకు నచ్చేయడంతో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. కాగా ప్రస్తుతం సూర్య బాలా దర్శకత్వంలో ఓ చిత్రం, వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' చిత్రాలను చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: 👉🏾 'జై భీమ్' చిత్రానికి మరో రెండు అవార్డులు.. -
చిన్నతనంలోనే వేశ్యగా మారిన యువతి బయోపిక్.. త్వరలో ఓటీటీలోకి..
చెన్నై సినిమా: 'మాలై నేర మల్లిపూ' చిత్రం ఫస్ట్ లుక్ సినీ వర్గాలను ఆకట్టుకుంటోంది. 21 ఏళ్ల యువ కుడు సంజయ్ నారాయణన్ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ఇది. కొత్త నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని యాన్ ఎవిరి.ఫేమ్ (మ్యాటర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై) విజయలక్ష్మి నారాయణన్ నిర్మించారు. హృతిక్ శక్తివేల్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఒక ప్రము ఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోందని నిర్మాత తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఓ వ్యభిచార యువతి బయోపిక్గా పేర్కొన్నారు. చిన్న వయసులోనే వ్యభిచార కూపంలోకి నెట్టబడిన లక్ష్మీ అనే యువతి జీవితంలో జరిగిన ఘటనలు, ఎదుర్కొన్న సమస్యలను, చీకటి కోణాలను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. చదవండి: నా సినిమాకు నాకే టికెట్లు దొరకలేదు: యంగ్ హీరో -
కమల్ హాసన్ చిత్రంలో సూర్య.. ఫ్యాన్స్కు పూనకాలే
Vikram: Lokesh Kanagaraj Confirms Suriya Cameo With Kamal Haasan: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్'. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (మే 15) ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2 నిమిషాల 38 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్లో కమల్, విజయ్, ఫాహద్ ఫాజిల్ తమ నటనతో అదరగొట్టారు. కాగా ఈ మూవీలో స్టార్ హీరో సూర్య కూడా నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై డైరెక్టర్ లోకేష్ కనగరాజు స్పందించారు. విక్రమ్ మూవీలో ఈ మూగ్గురు స్టార్ హీరోలతోపాటు సూర్య కూడా నటిస్తున్నాడని స్పష్టం చేశారు. సూర్య ఒక కీలక పాత్రలో అలరించనున్నాడని తెలిపారు. మే 15న చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ట్రైలర్ రిలీజ్తో పాటు మూవీ ఆడియో లాంచ్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలోనే విక్రమ్ చిత్రంలో సూర్య నటిస్తున్నాడని డైరెక్టర్ లోకేష్ తెలిపారు. ఇక ఈ నలుగురు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్పై చూస్తే ప్రేక్షకులకు, అభిమానులకు పూనకాలే. -
'కేజీఎఫ్ 3'పై క్లారిటీ.. మార్వెల్ ఫ్రాంచైజీ తరహాలో సినిమా
KGF Producer Vijay Kiragandur About KGF 3: కేజీఎఫ్ 2.. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది. కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక బాలీవుడ్లో అయితే రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి మరో సీక్వెల్ కూడా వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే గుడ్ న్యూస్ తెలిపారు చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్. ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్ కిరంగదూర్. 'కేజీఎఫ్ 3 మూవీ తెరకెక్కించాలనే అనుకుంటున్నాం. ఈ ఫ్రాంచైజీని మార్వెల్ తరహాలో రూపొందించాలని భావిస్తున్నాం. అక్టోబర్ తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది. 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీతో బిజీగా ఉన్నారు. దాదాపు 30-35% షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి చేయాలనుకుంటున్నాం. కాబట్టి అక్టోబర్ తర్వాత కేజీఎఫ్ 3 షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం.' అని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరంగదూర్ పేర్కొన్నారు. చదవండి: కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్ప్రైజ్.. యువరాజ్ కుమార్ తెరంగేట్రం! సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ తదితరులు కేజీఎఫ్ 2లో నటించారు. ఈ కేజీఎఫ్ 3లో నటీనటుల గురించల విజయ్ను అడగ్గా 'మేము ఒక మార్వెల్ మల్టీవర్స్ తరహాలో తెరకెక్కించాలనుకుంటున్నాం. విభిన్న చిత్రాల నుంచి విభిన్న పాత్రలను తీసుకురావాలనుకుంటున్నాం. అలాగే డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ సినిమా తరహాలో రూపొందించాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.' అని తెలిపారు. చదవండి: హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వినూత్నంగా ‘ఓడ విట్టి చుడలామా’
చైన్నై సినిమా: వినూత్న కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రం 'ఓడ విట్టి చుడలామా'. ఎవరివన్ ప్రొడక్షన్ పతాకంపై వినీత్ మోహన్, ప్రకాష్ వేలాయుధం కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. జీజేష్ ఎంవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమీర్ సుహీల్, గోపిక అనే నవ జంట హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన వినీత్ మోహన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వినూత్న కథ, కథనాలతో వినోదాన్ని మేళవించి ప్రతీకారం ప్రధానాంశంగా రూపొందిస్తున్న చిత్రమని దర్శకుడు తెలిపారు. త్వరలో చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పా రు. దీనికి ప్రకాష్ వేలాయుధం ఛాయాగ్రహణం, అశ్విన్ శివ దాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: మహేశ్ బాబు అన్నదాంట్లో తప్పేముంది? సపోర్ట్గా నిలిచిన కంగనా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇదెక్కడి మాస్ ఎంటర్టైన్మెంట్ మావా.. 80+ సినిమాలు, సిరీస్లు..
ZEE5 Blockbuster Content Slate With 80+ Movies Web Series 2022: సరికొత్త కాన్సెప్ట్స్, జోనర్స్తో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాయి ఓటీటీలు. ఇటీవలే తెలుగు ఓటీటీ సంస్థ ఆహా 40కుపైగా సినిమాలను ఈ నెలలో అందిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతకుముందు అమెజాన్ ప్రైమ్ కూడా ఈ సంవత్సరంలో 40కుపైగా వెబ్ సిరీస్, సినిమాలతో ఎంటర్టైన్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు పేర్కొంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 కూడా మూవీ లవర్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ 2022 ఏడాదిలో వచ్చే బ్లాక్ బస్టర్ కంటెంట్ స్లేట్ను రిలీజ్ చేసింది. హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ, బెంగాలీ భాషలన్నింటిని కలిపి మొత్తంగా 80కుపైగా సినిమాలు, వెబ్ సిరీస్లను అందించనుంది జీ5. వీటికి సంబంధించిన టైటిల్స్తో కంటెంట్ స్లేట్ 2022ను విడుదల చేసింది. ఈ స్లేట్లో 40కుపైగా ఒరిజినల్ షోలు, 40కుపైగా సినిమాలు ఉన్నాయి. అత్యాధునిక థ్రిల్లర్లు, హై-వోల్టేజ్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాలు, లైట్-హార్టెడ్ కామెడీ, రొమాంటిక్ వంటి తదితర జోనర్స్తో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమైంది. చదవండి: వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40 దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి వినియోగదారుడికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా స్ట్రాటజీకి అనుగుణంగా, వీక్షకుల మనసుకు అద్దంపట్టే కథనాలను అందించనున్నట్లు తెలిపింది. జీ5, బీబీసీ స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ది వైరల్ ఫీవర్ (TVF) వంటి తదితర క్రియేటివ్ నిర్మాణ సంస్థలతో వెట్రిమారన్, ప్రకాశ్ రాజ్, అమితాబ్ బచ్చన్, నాగరాజ్ మంజులే వంటి ప్రతిభగల వారితో వీటిని నిర్మించనుంది. హిందీ ఒరిజినల్ స్లేట్లో తాజ్, ఫొరెన్సిక్, దురంగ, అభయ్ 3, పిట్చర్స్ 2, సన్ ఫ్లవర్ 2, ట్రిప్లింగ్ 3, నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ 2 వంటి కొత్త సీజన్లు ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా రంగ్బాజ్ 3, ది కశ్మీర్ ఫైల్స్, జుండ్, అటాక్ ఉండగా, గాలివాన తెలుగు వెబ్ సిరీస్తోపాటు తమిళం, పంజాబీ, బెంగాలీ భాషల్లో నీలమెల్లం రథం, పింగర్టిప్ సీజన్ 2, పేపర్ రాకెట్ రెక్సే కిన్నెరసాని, యార్ అన్ముల్లే రిటర్న్స్, ఫఫ్ఫాడ్ జీ, మే వివాహ్ నహీ కరోనా తేరే నాల్, షికర్పూర్, రక్తకరాబి, శ్వేత్కాలి వంటి విభిన్న కథాంశాలతో తెరకెక్కిన వెబ్ సిరీస్లు, సినిమాలు ఉన్నాయి. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్! Buckle up to get blown away with these new blockbusters coming your way soon! Can't wait to binge? Us too! #DekhteyRehJaogey sirf #ZEE5 par pic.twitter.com/xDIoDeTD6V — ZEE5 (@ZEE5India) May 9, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మిర్చి శివ హీరోగా మూవీ.. ఆసక్తిగా లుంగీ కట్టిన హల్క్ పోస్టర్
చెన్నై సినిమా: మిర్చి శివ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం 'సింగిల్ శంకరుమ్.. స్మార్ట్ ఫోన్ సిమ్రానుమ్'. నటి మేఘా ఆకాష్, అంజు కురియన్ కథానాయికలుగా, గాయకు డు మనో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. పి.ఎస్.విఘ్నేష్ షా దర్శకుడిగా పరిచయమవు తున్న ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ పతాకంపై కె.కుమార్ నిర్మిస్తున్నారు. ఆర్థర్ ఎ.విల్సన్ చాయాగ్రహణం, లియోస్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈచిత్రం చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను గురువా రం విడుదల చేసినట్లు దర్శకుడు చెప్పారు. ఈ ఫస్ట్లుక్ పోస్టర్లో శివ మోకాళ్లపై వంగి ఉండటం, అతన్ని పట్టుకుని హాలీవుడ్ సూపర్ హీరోస్ హల్క్, ఐరన్ మ్యాన్లు ఉండటం మనం చూడొచ్చు. ఇందులో హల్క్ లుంగీ ధరించి ఉండటమే కాకుండా చెంపై పుట్టుమచ్చ, నుదిటిపై విబూదితో చాలా ఆసక్తిగా ఉంది. ఇక ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ వండర్ వుమెన్ వంటి కేప్ ధరించి, అతని వెనుక కత్తి ఉండటాన్ని మనం గమనించవచ్చు. చదవండి: సల్మాన్కు నటి ముద్దులు, హగ్గులు.. మందు కొట్టావా? అంటూ ట్రోలింగ్ Feeling extremely happy to release the first look of #singleshankarumsmartphonesimranum 😍 @actorshiva @akash_megha @AnjuKurian10 @vignesh_sha @larkstudios_chn @makapa_anand @kumarkarupannan @leon_james @ArthurWisonA @Gdurairaj10 @editorBoopathi @dineshashok_13 @proyuvraaj pic.twitter.com/CgaOmgMBrX — vignesh sha (@vignesh_sha) May 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్రేజీ కాంబినేషన్లో కొత్త సినిమా.. త్వరలో షూటింగ్
చెన్నై సినిమా: కోలీవుడ్లో క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ప్రముఖ నటుడు శరత్కుమార్, యువ నటుడు గౌతమ్ కార్తీక్ (హీరో కార్తీక్ కుమారుడు) కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుంది. బిగ్ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐబీ. కార్తికేయన్ త్రిపుర క్రియేషన్స్, తరాస్ సినీ కార్పొ సంస్థలతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దక్షిణామూర్తి రామర్ దర్శకత్వం వహించనున్నారు. మదురై నేపథ్యంలో సాగే క్రైమ్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు. నటుడు శరత్కుమార్ ఇంతకు ముందు పలు చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించారని, అయితే వాటికి పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపిస్తారని చెప్పారు. ప్రేక్షకులకు కనువిందు చేసే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. శరత్కుమార్, గౌతమ్ కార్తీక్ వంటి అంకిత భావంతో పని చేసే నటులతో కలిసి పన చేయడంతో తన కల నెరవేరినట్లు భావిస్తున్నానన్నారు. వచ్చే నెలలో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి అరవింద్ సింగ్ చాయాగ్రహణ, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఖాన్, కుమార్ చిత్రాలు తిరస్కరించా.. అందుకు అలా చూసేవారు: కంగనా షాకింగ్ : న్యూడ్గా నటించిన హీరోయిన్ ఆండ్రియా? -
పగ, ప్రతీకారంతో త్రిష.. ఎందుకంటే ?
Trisha Upcoming Movie The Road With Debutant Director Arun Vaseegaran: ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు హీరోయిన్ త్రిష. అయితే ఆమె పగ, ప్రతీకారాలు ఎందుకు? ఎవరిపై? అనే సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది రోడ్’. వి.అరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి ‘ది రోడ్’ అనే టైటిల్ని ఖరారు చేశారు. 22 సంవత్సరాల క్రితం మధురైలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మధురైలో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ను దాదాపు 50 రోజులు మధురై లొకేషన్స్లోనే ప్లాన్ చేశారని తెలిసింది. సంతోష్ ప్రతాప్, షబ్బీర్, మీయా జార్జ్, వివేక్, ఎమ్ఎస్ భాస్కర్, వేలా రామ్మూర్తి ఇతర ముఖ్యతారాగణంగా నటిస్తున్న ‘ది రోడ్’ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: హిందీ భాషపై కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు..
Kiccha Sudeep Says Hindi Is No More A National Language: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన 'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. 'ఈగ' సినిమాలో విలన్గా మెప్పించి ఎంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా పాత్రలో కొత్తదనం ఉంటే చాలు వెంటనే సినిమా చేసేస్తాడు. హీరోగానే కాదు.. కథలో తన ప్రాముఖ్యాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తుంటారు. ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశాడు కిచ్చా సుదీప్. ఓ ప్రెస్ మీట్లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారో చూడాలి. చదవండి: కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ? Kannada Actor @KicchaSudeep said ,"correct it,Hindi is no more the National Language, its no more a National language"! In a film launch & a huge applause from the crowd & the media. Hope the efforts of Kannada activists are reaching the intended places.👏👏#stophindilmposition pic.twitter.com/qpj06HJseG — ರವಿ-Ravi ಆಲದಮರ (@AaladaMara) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1531341776.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు.. ఈ వీకెండ్కు మంచి టైంపాస్
Top 5 Best Movies On Disney Plus Hotstar For April 2022: ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లు ప్రారంభమైన వెబ్ సిరీస్లు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాల కోసం ఓటీటీల బాట పడుతున్నారు సినీ ప్రియులు. పెద్ద సినిమాలను అటు థియేటర్లలో వీక్షిస్తూ.. మరోవైపు ఓటీటీలో వచ్చే చిత్రాలపై కూడా ఓ కన్ను వేస్తున్నారు. ఓటీటీలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. అలాంటి ఓటీటీల్లో ఒకటి డిస్నీ ప్లస్ హాట్స్టార్. ఓటీటీ ప్లాట్ఫామ్లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలై డిఫరెంట్ కాన్సెప్ట్లతో దూసుకుపోతున్న టాప్ 5 చిత్రాలపై ఓ లుక్కేద్దామా.! డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాలను చూసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. 1. భీష్మ పర్వం అమల్ నీరద్ దర్శకత్వం వహించిన మలయాళ గ్యాంగ్స్టర్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం భీష్మ పర్వం. ఈ మూవీలో ప్రముఖ సీనియర్ నటుడు మమ్ముట్టి నటించారు. సముద్రపు ఎగుమతిదారునిగా మారిన గ్యాంగ్స్టర్ పాత్రలో నటించి మెప్పించాడు మమ్ముట్టి. ఓ గ్యాంగ్స్టర్కు ఎదురయ్యే చావు బెదిరింపుల చుట్టూ తిరిగుతుంది ఈ మూవీ కథ. మార్చి 3, 2022న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం అవుతోంది. చదవండి: ఐఎమ్డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్లు.. 2. తానక్కరన్ (పోలీసోడు) విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తమిళ పోలీసు డ్రామా చిత్రం 'తానక్కరన్'. తెలుగులో 'పోలీసోడు' అనే టైటిల్తో నేరుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 1997లో జరిగిన పోలీసు శిక్షణకు సంబంధించిన నిజ జీవితపు సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి తమిజా దర్శకత్వం వహించగా.. జిబ్రాన్ స్వరాలు సమకూర్చారు. 3. ప్రవీణ్ తాంబే ఎవరు ? శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్ర పోషించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ప్రవీణ్ తాంబే ఎవరు?. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్ తాంబే జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. జయప్రద్ దేశాయి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 1, 2022న నేరుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైంది. 4. డెత్ ఆన్ ది నైలు ఈ సినిమా ప్రసిద్ధ రచయిత్రి అగాథా క్రిస్టీ రాసిన 'డెత్ ఆన్ ది నైలు' నవల ఆధారంగా తెరకెక్కించారు. వండర్ వుమెన్ గాల్ గాడోట్, బాలీవుడ్ యాక్టర్ అలీ ఫాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కెన్నెత్ బ్రానాగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11, 2022న యూకే, యూఎస్ఏలలో విడుదలైంది. ఓ హత్యకు సంబంధించిన దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుంది. 5. ది కింగ్స్మన్ కింగ్స్మన్ సిరీస్లో మూడో చిత్రంగా వచ్చింది ఈ మూవీ. రాల్ఫ్ ఫియెన్నెస్, గెమ్మ ఆర్టెర్టన్, రైస్ ఇఫాన్స్, టామ్ హోలాండర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నిటించారు. మాథ్యూ వాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మొదటి ప్రపంచ యుద్దం, కింగ్స్మన్ సంస్థ మూలానికి సంబంధించిన సంఘటనల చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. కరోనా కారణంగా అనేక వాయిదాల తర్వాత డిసెంబర్ 22, 2021న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్లు.. సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే..
Top 5 Best Thriller Movies On Zee5 OTT In 2021: సినిమా అనేది ఒక ఊహా ప్రపంచం. సినీ రంగం ఎప్పటికప్పుడూ తన శైలి మార్చు కుంటుంది. ఇదివరకూ సంగీతం, డ్యాన్స్, జానపద, సాంఘిక, రాజకీయ, ఫ్యాక్షన్ కథల ఆధారంగా సినిమాలు వచ్చేవి. అంతేకాకుండా కామెడీ, యాక్షన్, స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ జోనర్లే కాకుండా ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసే జోనర్ థ్రిల్లర్. తమదైన శైలిలో సరికొత్త కథలతో థ్రిల్ అందిస్తున్నారు చిత్ర దర్శకులు. మన ప్రేక్షకులు కూడా థ్రిల్లర్ సినిమాలను ప్రత్యేక ఆసక్తితో వీక్షిస్తారు. కథతో కట్టిపడేస్తూనే, కథనంలో రక్తి కట్టించే మూవీస్ వస్తే ఇక మూవీ లవర్స్కు పండుగే. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. మంచి థ్రిల్తోపాటు, ఊహకందని సస్పెన్స్తో ఉన్న థ్రిల్లర్ సినిమాలు చూస్తే వచ్చే కిక్కే వేరు. దక్షిణ, ఉత్తర భాషల్లోనూ ఈ తరహా ప్రయోగాలు ఎన్నో జరిగాయి. ఏ భాషలో తెరకెక్కించిన వాటిని మిగతా భాషల్లోకి అనువదిస్తున్నారు. దీంతో భాషాబేధం లేకుండా వీక్షకులు ఎంటర్టైన్ అవుతున్నారు. కాగా ఇలాంటి విభిన్నమైన కథలకు నెలవుగా మారాయి ఓటీటీ ప్లాట్ఫామ్లు. వీటిలో తనదైన స్థానం సంపాదించుకున్న ఓటీటీ వేదిక జీ5. 2021 సంవత్సరంలో వచ్చిన టాప్ 5 థ్రిల్లర్ మూవీస్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో కొన్ని చిత్రాలు తెలుగు భాషలోనూ డబ్ అయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. 2021లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ విడుదల వారిగా చూసి ఆనందించండి. 1. ఆపరేషన్ జావా (ఫిబ్రవరి 12, 2021) 2. సైలెన్స్ (మార్చి 26, 2021) 3. స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ (జూలై 9, 2021) 4. డయల్ 100 (ఆగస్టు 6, 2021) 5. 200 హల్లా హో (ఆగస్టు 20, 2021) 6. బాబ్ బిస్వాస్ (డిసెంబర్ 3, 2021) చదవండి: రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఓటీటీ సిత్రాలు.. చదవండి: టాలీవుడ్ టూ హాలీవుడ్.. ఓటీటీల్లో రచ్చ చేస్తున్న సినిమాలు ఇవే -
'విక్రమ్' రిలీజ్ డేట్ అదే.. అదరగొడుతున్న మేకింగ్ వీడియో
Kamal Haasan Vikram Movie Release Date With Making Video: సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో 'విక్రమ్' ఒకటి. లోకనాయకుడు కమల్ హాసన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ మూవీకి 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తెగ ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ను సోమవారం (మార్చి 14) ప్రకటిస్తామని కమల్ హాసన్తో ఉన్న పోస్టర్ విడుదల చేశారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమా విడుదల తేదిని సోమవారం ఉదయం చిత్రృందం అధికారికంగా ప్రకటించింది. సమ్మర్ కానుకగా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ రిలీజ్ డేట్తోపాటు విక్రమ్ మేకింగ్ వీడియోను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంది మూవీ యూనిట్. ఇందులో యాక్షన్ సీన్స్కు సంబంధించిన గ్లింప్స్ను చూపించారు. పొలిటికల్ యాక్షన్ థ్లిల్లర్గా సాగే ఈ మూవీలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళీ పాపులర్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు. ఈ వీడియోలో వీరిద్దరిని చూపించిన తీరు ఆకట్టుకుంది. చూస్తుంటే చాలా రోజుల తర్వాత కమల్హాసన్ పవర్ఫుల్లో రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్కు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
మళ్లీ సింగిల్ లెటర్తో ఉపేంద్ర సినిమా.. ఏడేళ్ల తర్వాత
Upendra Returns To Direction With Single Letter Movie U: ఉపేంద్ర విలక్షణ నటుడు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఓంకారం, ఎ, ఉపేంద్ర’ తదితర చిత్రాల ద్వారా దర్శకుడిగానూ తన విశిష్టతను చాటుకున్నారు. అయితే ‘ఉప్పి 2’ (2015) తర్వాత మళ్లీ ఉపేంద్ర మెగాఫోన్ పట్టలేదు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సింగిల్ లెటర్ టైటిల్ను పెట్టారు. ఒక అక్షరంతో సినిమా తీయడం ఉపేంద్రకు బాగా అలవాటు. ఇదివరకూ ఎ, రా చిత్రాలు కన్నడతోపాటు తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. ఒక సినిమాకు అయితే టైటిలే లేకుండా కేవలం సింబల్ను వాడి సూపర్ అనే మరో మూవీ తీశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు 'యూ' అనే భిన్నమైన టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం (మార్చి 11) విడుదల చేశారు. కన్నడంలో ‘టగరు’, ‘సలగ’ వంటి సినిమాలను నిర్మించిన వీనస్ ఎంటర్టైన్మెంట్స్తో కలసి లహరి మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘భారీ నిర్మాణ సంస్థలతో కలిసి ఈ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉపేంద్ర ‘ఎ’ చిత్రం నుంచి ఆయనతో మాకు మంచి అసోసియేషన్ ఉంది’’ అన్నారు లహరి మ్యూజిక్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. మనోహరన్. ‘‘దేశవ్యాప్తంగా ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుంది’’ అన్నారు వీనస్ ఎంటర్టైన్మెంట్స్ శ్రీకాంత్. In the film Industry, it is you who created the story Upendra, it is you who wrote the screenplay & dialogues for 33 years, it is you who directed through your whistles and claps. I dedicate this film to you the praja prabhu fans 🙏🙏🙏#nimmaupendra #uppidirects #laharifilms pic.twitter.com/h4UsatujyT — Upendra (@nimmaupendra) March 11, 2022 -
మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న బొద్దుగుమ్మ..
Poonam Bajwa Again Back To Kollywood Movies: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేదంటే ఎంట్రీ ఇచ్చిన వెంటనే లేదా కొన్ని రోజులకు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా మంది ముద్దుగుమ్మలే ఉన్నారు. ఈ జాబితాలో చెప్పుకోదగిన వాళ్ల వరుసలో ముందుంటుంది పూనమ్ బజ్వా. టాలీవుడ్లో ‘మొదటి సినిమా’తో తన మొదటి సినిమాను ప్రారంభించింది ఈ అమ్మడు. ఆ తర్వాత బాస్, పరుగు వంటి చిత్రాలతో నటించి మెప్పించింది కూడా. అప్పట్లో అందానికి, అభినయానికి ఏ మాత్రం కొదవ లేకపోవడంతో ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికింది అనుకున్నారంతా. కానీ తరువాత ఏం జరిగిందే ఏమో గానీ సీన్ రివర్స్ అయింది. మెలి మెల్లిగా వెండితెరకు దూరమైంది పూనమ్ బజ్వా. తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో అడపదడపా నటిస్తూ వచ్చిన ఈ బొద్దుగుమ్మ కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చదవండి: హాట్ టాపిక్గా శ్రుతిహాసన్ రెమ్యునరేషన్.. చిరు సినిమాకు అన్ని కోట్లా ? ఈ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ 'గురుమూర్తి' అనే చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమతోంది. నటరాజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ టాకీస్ పతాకంపై శివ చలపతి, సాయి శరవణన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేటీ ధనశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిజాయితీపరుడైన పోలీసు అధికారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఆయన ఎలా ఛేదించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. వంటి పలు ఆసక్తికరమైన ఘటనలతో ఈ చిత్రం రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. చదవండి: 100 కోట్ల క్లబ్లో అలియా చిత్రం.. ఎలా ఎంజాయ్ చేస్తుందంటే ? -
'మధుమతి'గా శ్రియా కొత్త లుక్.. నెట్టింట వైరల్
Shriya Saran First Look Released From Kabzaa Movie: తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్. సుమారు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందుతూనే ఉంది. అయితే వివాహం అనంతరం మాత్రం అరకొర సినిమాలతో సరిపెడుతూ వచ్చింది. ప్రస్తుతం బడా హీరోలా సరసన నటించికపోయిన పెద్ద చిత్రాల్లో మాత్రం కనిపించి అలరిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే హిందీ 'దృశ్యం 2'లోనూ అజయ్ దేవగణ్కు జంటగా యాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రియా మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రియా లీడ్ రోల్లో అలరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రియా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. 'కబ్జా' సినిమాలో శ్రియా మధుమతి అనే పాత్రలో దర్శనమివ్వనుంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ దుస్తుల్ని ధరించి మహరాణిలా సింహాసనంలో కూర్చున్న శ్రియా మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, కబీర్ సింగ్ దుహా, బోమన్ ఇరానీ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో పాన్ ఇండియాగా త్వరలో విడుదల కానుంది. Unveiling the first look of our 1’st queen..Welcoming Shirya Saran aboard.. happy to have you on set @shriya1109 💐✨#Kabzaa#Indianrealstarupendra#KichchaSudeepa#Rchandru#ShriyaSaran#Panindiamoviekabzaa pic.twitter.com/vP2z6eW81i — R.Chandru (@rchandru_movies) March 7, 2022 -
గాలి కిరీటి ‘వారాహి’ మూవీతో స్టార్ హీరోయిన్ రీఎంట్రీ
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు రాధాకృష్ణ ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వారాహి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్, నటీనటుల ఎంపికను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిన్న(మార్చి 4) హైదరాబాద్ ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అనంతరం హీరో గాలి కిరీటి లుక్ను సంబంధించిన వీడియోను చిత్రం బృందం విడుదల చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనిలియా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులో చివరిగా జెనిలియా నా ఇష్టం సినిమాలో కనిపించింది. దాదాపు ఆమె సినిమాలకు దూరమై పదేళ్లు పూర్తయింది. ఈనేపథ్యంలో ఆమె తిరిగి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. కాగా ‘సత్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మెప్పించిన జెనిలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్తో పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. బొమ్మరిల్లులో హాహా హాసిని అంటూ ఆందరిని ఆకట్టుకున్న జెనిలియా ఢీ, రెడీ, ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. తెలుగులో నితిన్, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా. మంచు విష్ణు, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సరసన నటించిన జెనిలియా తమిళ, హిందీ చిత్రాల్లో సైతం హీరోయిన్ నటించింది. అక్కడ కూడా ఆమె మంచి నటిగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో 2013లో రితేశ్ దేశ్ముఖ్ను ప్రేమ వివాహం చేసుకుంది ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. -
ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు.. యాక్షన్ థ్రిల్లర్గా ఈటీ ట్రైలర్
Suriya Etharkkum Thunindhavan Movie Telugu Trailer Out: కోలీవుడ్ స్టార్ సూర్యకు అటు తమిళం ఇటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్లో అదరగొడుతుంటాడు. కథ విభిన్నంగా ఉంటే చేసేందుకు అస్సలు వెనకాడడు. అందుకే ఈ తమిళ హీరో అంటే టాలీవుడ్లోనూ ఫుల్ క్రేజ్. ఈసారి మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలు, దారుణాలను ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నాడు. సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎతర్క్కుమ్ తునిందవన్ (ఈటీ)'. మాస్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈటీలో అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. బుధవారం (మార్చి 2) ఉదయం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. 'వాడేమె సైంటిస్ట్ కావాలని ఆశ పడ్డాడు. నేనేమో వేరేలే చూడాలని ఆశపడ్డాను. కానీ దైవం, కాలం వాడ్ని ఇలా చూడాలని ఆశపడింది' అనే డైలాగ్తో సినిమా ట్రైలర్ ప్రారంభమవుతోంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా చూపించారు. 'ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు', 'పంచె ఎగ్గడితే నేనే జడ్జి' వంటి తదితర డైలాగ్లు ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది. -
జర్నలిస్ట్గా ధనుష్.. ఆకట్టుకుంటున్న 'మారన్' ట్రైలర్
Dhanush Starrer Maaran Movie Trailer Released: తమిళ స్టార్ హీరో ధనుష్ తనదైన విలక్షణమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఆత్రంగి రే చిత్రంతో అలరించిన ధనుష్ తాజాగా నటించిన మూవీ మారన్. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ త్యాగరాజన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో ధనుష్కు సరసన మాళవికా మోహనన్ నటిస్తుండగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్లు ఇప్పటికే అలరించగా మూవీపై అంచనాలు పెంచాయి. తాజాగా మారన్ సినిమా తెలుగు ట్రైలర్ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగు విడుదల చేసింది. ఈ చిత్రం మార్చి 11 నుంచి నేరుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ విషయానికస్తే ధనుష్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. జర్నలిజం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ధనుష్ జర్నలిస్ట్గా కనిపించనన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలాగే ధనుష్, మాళవిక మోహనన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. -
పొలిటికల్ థ్రిల్లర్గా కొత్త చిత్రం.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం
చెన్నై సినిమా: రాజకీయ నేపథ్యంలో మరో థ్రిల్లర్ రూపొందుతోంది. నటులు ప్రాజన్, అజిత్ నాయక్ హీరోలుగా నటిస్తున్న ఇందులో నటి ప్రఖ్యా నయన్, రష్మీ నాయికలుగా నటించనున్నారు. శ్రీకృష్ణ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. సూర్యకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్, కెన్నడీ ద్వయం కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రం ఆదివారం ధర్మపురిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు వినోద్కుమార్ ఛాయాగ్రహణం, విజయ్ యాట్లీ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. దుర్మార్గులైన రాజకీయ నాయకుల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను కొత్తకోణంలో చూపించబోతున్నట్లు చెప్పారు. షూటింగ్ ధర్మపురి, కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
అలరిస్తోన్న చియాన్ విక్రమ్ 'మహాన్' మేకింగ్ వీడియో..
Chiyan Vikram Mahaan Movie Making Video Released: విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది. 'మహాన్' టీజర్లో విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ నటన అలరించింది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో విక్రమ్, ధ్రువ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రన్ తదితరులు తమ పాత్రల కోసం ఏ విధంగా కష్టపడ్డారో చూపించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్లో నేరుగా విడుదల చేశారు. -
దృశ్యం సిరీస్ కాంబో రిపీట్.. నేరుగా ఓటీటీలో విడుదల ?
Mohanlal 12th Man Movie Will Release In OTT: ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు. తాజాగా ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం '12th మ్యాన్'. మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు జీతూ జేసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. '12th మ్యాన్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. త్వరలో ఈ విషయానికి సంబంధించిన ప్రకటనను అఫిషియల్గా అనౌన్స్ చేయనున్నారని ఆ వార్త సారాంశం. మార్చిలో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకూ వచ్చిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. -
సైకలాజికల్ థ్రిల్లర్గా 'కూర్మన్'..
చెన్నై సినిమా: 'కూర్మన్' చిత్రం కొత్తగా ఉంటుందని దర్శకుడు బ్రయన్ బి. జార్జ్ అన్నారు. ఎంకె ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాజాజీ, జనని అయ్యర్ జంటగా నటించారు. బాల సరవణన్, అడుగళం సరేన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. టోనీ బిట్టో సంగీతాన్ని, శక్తి అరవింద్ ఛాయాగ్రహణను అందించిన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. ఇది మైండ్ రీడింగ్ ప్రధానాంశంగా రూపొందిన చిత్రమని, సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
పరీక్షల్లో ఫెయిల్ అయితే.. వినోదాత్మకంగా 'బీఈ బార్'
చెన్నై సినిమా: పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న తమిళ చిత్రం 'బీఈ బార్'. 'కావల్ తురై ఉంగళ్ నన్బన్' వంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని రూపొందించిన టీమ్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. 'కావల్ తురై ఉంగళ్ నన్బన్' మూవీ ఫేమ్ సురేష్ రవి కథానాయకుడి గానూ, 'చతురంగ వేట్టై' సినిమా ఫేమ్ ఇషార నాయకి గాను నటిస్తున్న ఇందులో తంబి రామయ్య, లివింగ్ట్సన్, కల్లూరి వినోద్, మధు, రేణుక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్.డీ.ఎమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శ్రీ.కె.ఎస్, ఆదిత్య అండ్ సూర్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను అబ్జల్యూట్ పిక్చర్స్ తరపున మాల్గమ్, బీఆర్ టాకీస్ కార్పొరేషన్, వైట్ మూన్ టాకీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని దర్శకుడు తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయిన సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడానికి పడే పాటులను వినోదభరితంగా చూపిస్తున్నట్లు తెలిపారు. -
ఆస్కార్కు నామినేట్ అయిన జై భీమ్, మరక్కార్ చిత్రాలు
Suriya Jai Bhim And Mohanlal Marakkar Nominated For Oscars 2022: ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల రేసులో రెండు భారతీయ చిత్రాలు నామినేట్ అయ్యాయి. అందులో ఒకటి సూర్య నటించిన 'జై భీమ్' చిత్రం కాగా, మరోకటి మోహన్ లాల్ నటించిన 'మరక్కార్' చిత్రం. ఆస్కార్ రేసులో మొత్తం 276 సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా అందులో రెండు ఇండియన్ సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ సౌత్ ఇండస్ట్రీకి చెందినవే కావడం విశేషం. గతేడాది అమెజాన్ ప్రైమ్లో విడుదలైన జై భీమ్ 'జై భీమ్' చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జస్టిస్ చంద్రు జీవిత కథతో పాటు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిన ఈ చిత్రానికి టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇక మలయాళ స్టార్ మోహన్లాల్ నటించిన మరక్కార్ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.ఇక ఆయా కేటగిరీలకు చెందిన ఫైనల్ నామినేషన్లను ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది. అవార్డుల వేడుక మార్చి27న అమెరికాలో జరగనుంది. -
ఓటీటీలతో పని లేదు.. బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇలా చూడండి !
కరోనా కల్లోలం ఇంకా తగ్గలేదు. మొన్నటివరకు రెస్ట్ తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పంజా విసురుతోంది మహామ్మారి. దీని ప్రభావం సినీ వర్గాలపై మళ్లీ పడింది. పండుగ వేళ సందడి చేద్దామనుకున్న పెద్ద సినిమాలకు, వాటిని వీక్షిద్దామనుకున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశే కలిగింది. ఇంకా కొవిడ్ కల్లోలం ఎక్కువైతే థియేటర్లు మూసే అవకాశం లేకపోలేదు. అయితే థియేటర్లు మూత పడితే సినీ అభిమానులకు, ఆడియెన్స్కు ఉండే ఏకైక మార్గం ఓటీటీలు. చిన్న, పెద్ద, పర భాష అంటూ తేడా లేకుండా చూసేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఓటీటీల్లో చూడాలంటే వాటిని కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని తీరాలి. లేకుంటే చూడలేం. (చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్ వెబ్ సిరీస్ ఇవే..) ఓటీటీలకు డబ్బు చెల్లించి చూడలేని సినీ వీక్షకుల కోసం ఎలాంటి ఖర్చు లేని దారి ఒకటి ఉంది. అదేంటంటే యూట్యూబ్. హా.. యూట్యూబే. అయితే యూట్యూబ్లో ఏ సినిమాలు ఉన్నాయి ఏంటీ అని మీకు తెలియకపోవచ్చు. అలాంటి వారికోసమే మా ఈ స్టోరీ. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగులోనే చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈసారికి యూట్యూబ్లో లభించే సౌత్ ఇండియన్ తెలుగు డబ్బింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ మీకోసం. ఓ లుక్కేసీ ఆనదించండి మరి ! 1. ఆక్రందన (తీవ్రం-మలయాళం) 2. రక్షకుడు (ధామ్ ధూమ్-తమిళం) 3. ఎన్హెచ్-4 4. పెన్సిల్ 5. సంఘర్షణ (చదవండి: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాలు..) -
జైభీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం.. 'ఆస్కార్' ఛానెల్లో
Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel: మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్లో అదరగొడుతుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల సూర్య నటించిన చిత్రం 'జైభీమ్'. సినిమా అంటే మూడు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్తో ప్రేమాయణం, ఐటెం సాంగ్లు కాదని నిరూపించి, సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం జైభీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి సత్తా చాటింది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా ఐఎండీబీ రేటింగ్స్లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ 'ది షాషాంక్ రిడంప్షన్' చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది. ఇప్పటివరకూ ఏ సౌత్ సినిమాకు ఇలాంటి రేటింగ్ రాలేదు. అలాగే గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామా కథాశంతో తెరకెక్కిన 'జైభీమ్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 'సీన్ ఎట్ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్ను ఉంచటం ఇదే మొదటిసారి. కాగా అకాడమీ యూట్యూబ్ ఛానెల్లో జైభీమ్ సినిమా వీడియో ఉండటంపై చిత్రబృందంతోపాటు అభిమానులు సంతోషపడుతున్నారు. 'జైభీమ్' ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'జస్టిస్ చంద్రు' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? #Suriya's #JaiBhim scenes uploaded to #Oscars Official YouTube channel.👍👏@Suriya_offl ➡️ https://t.co/AXQwY2av72 pic.twitter.com/QmgFrz827n — Suresh Kondi (@SureshKondi_) January 18, 2022 • #JaiBhim is now the only Tamil Movie to be shown in The Academy #Oscars YouTube channel 🔥💯 Ever Proudful @Suriya_offl na 😇❤️ pic.twitter.com/3JhxVZhX1q — CHENTHUR (@ck__tweetz) January 18, 2022 #JaiBhim getting bigger and bigger 🔥 First Tamil movie scenes to shown in #Oscars utube ❤@Suriya_offl #EtharkkumThunindhavan#VaadiVaasal pic.twitter.com/qJcs0TsIQd — Mass Syed 💥 (@SuriyaFanstren4) January 18, 2022 -
పవర్ఫుల్ పాత్రలో రామ్ పోతినేని.. టైటిల్ రివీల్
Ram Pothineni New Movie The Warrior Title Revealed: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ను రివీల్ చేశారు మేకర్స్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ది వారియర్' అనే టైటిల్ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ టైటిల్తోపాటు రామ్ పోతినేని ఫస్ట్ లుక్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీస్ రోల్లో రామ్ చేయలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. #RAPO19 is #𝐓𝐇𝐄𝐖𝐀𝐑𝐑𝐈𝐎𝐑𝐑 🔥#RAPO19FirstLook pic.twitter.com/dedw7G3SBD — RAm POthineni (@ramsayz) January 17, 2022 ఇదీ చదవండి: హీరో రామ్కు గాయాలు.. షూటింగ్కు బ్రేక్ -
మరో నెగెటివ్ రోల్లో సమంత !.. ప్రేమకు అడ్డుగా
Samantha Negative Role In Kaathu Vaakula Rendu Kadhal Movie: స్టార్ హీరోయిన్ సమంత అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 'ఫ్యామిలీ మ్యాన్ 2' హిందీ వెబ్ సిరీస్కు ముందు గ్లామర్ పాత్రలతో అలరించిన సామ్ ఈ సిరీస్తో తన నటనేంటో నిరూపించింది. ఈ సిరీస్తో జాతీయ స్థాయిలో వినపడిన సమంత పేరు ఇంటర్నేషనల్ రేంజ్కు పాకింది. ఇక నుంచి తాను నటనకు ప్రాధాన్యమున్న ఛాలేంజింగ్ రోల్స్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లుగానే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటుంది సామ్. హాలీవుడ్ మూవీ 'అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్' సినిమాలో తాను బై-సెక్సువల్ యువతి పాత్ర పోషిస్తున్న విషయాన్ని తానే ప్రకటించింది. ఇదీ చదవండి: ఏం చేయగలను.. వారిని ఇంతవరకూ చూడలేదు: సమంత అయితే తాజాగా తాను మరో ఛాలేంజింగ్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత మరో నెగెటివ్ పాత్రలో అలరించనుందట. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అందాల అభినయం నయన తారతో కలిసి సమంత నటిస్తున్న చిత్రం 'కాత్తువాక్కుల రెండు కాదల్'. ఇందులో నయన తారకు సమానమైన పాత్రలో సామ్ నటించనుందట. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఊహించని రీతిలో 'ఖతిజా'గా సామ్ నెగెటివ్ షేడ్స్లో ఆకట్టుకోనుందని సమాచారం. ఈ పాత్రలో సమంత యాక్టింగ్ సూపర్గా ఉందని కోలీవుడ్ సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయట. విజయ్ సేతుపతి, నయన తార ప్రేమాయణానికి అడ్డుపడి సమంత తన విలనిజంతో కథను మలుపు తిప్పనుందట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో రాజీగా ఆకట్టుకున్న సామ్ ఈ సినిమాలో ఎలాంటి విలనిజం చూపెట్టనుందో వేచి చూడాలి. ఇదీ చదవండి: 'ఊ అంటావా' సాంగ్ పూర్తి వీడియో వచ్చేసింది.. చూశారా ! -
సంక్రాంతి బరిలో మరో హీరో.. కలిసొచ్చిన 'ఆర్ఆర్ఆర్' వాయిదా
Dulquer Salman Salute Movie Release In Sankranti Festival: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న రౌద్రం రణం రుధిరం ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. అయితే దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసుల నేపథ్యం, పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ, థియేటర్లు మూసివేయడం వంటి తదితర కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయితే తమ చిత్రాలకు నష్టం కలుగుతుందని భావించి వాయిదా వేసుకున్న నిర్మాతలు ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా అనేక చిత్రాలకు కలసివచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అందుబాటులో ఉండేసరికి తమ సినిమాలకు మార్గం సుగమం అయినట్లు భావించి విడుదలకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన కొత్త సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. దుల్కర్ సల్మాన్ నటించి సెల్యూట్ చిత్రాన్ని మలయాళంలో జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు ఇదీ వరకే ప్రకటించింది చిత్రబృందం. అయితే ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో థియేటర్లు అందుబాటులో ఉండటంతో తెలుగులోనూ అదే రోజున విడుదల చేస్టున్నట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ డైరెక్టర్. ఈ చిత్రంతో పాటు ఆది సాయి కుమార్ నటించిన 'అతిథి దేవోభవ' (జనవరి 7), సిద్దు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' (జనవరి 14), సూపర్ మచ్చి (జనవరి 14), మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' (జనవరి 15) తదితర సినిమాలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్ -
మోహన్ లాల్ కొత్త అవతారం.. గుండు, గుబురు గడ్డంతో అదిరిపోయిందిగా ఫస్ట్ లుక్
Mohan Lal Barroz Movie First Look Poster Released: ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన మెగాఫోన్ పట్టుకొని దర్శకుడిగా మారారు. మోహన్లాల్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న సినిమా 'బరోజ్'. ఈ చిత్రంలో ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మోహన్ లాల్. ఈ పోస్టర్లో మోహన్ లాల్ గుండు, గుబురు గడ్డం, మీసంతో బంగారు సింహాసనంపై దర్జాగా కూర్చున్నారు. మోహన్ లాల్ సరికొత్త లుక్ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ 'బరోజ్' అనే జీనీ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మోహన్ లాల్ ఈ పోస్టర్ను ప్రకటిస్తూ 'మనముందు మరో సంవత్సరం ప్రకాశించనుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది మీకు అత్యంత విలువైన కాలంగా మారాలని ఆశిస్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్. బరోజ్ ఫస్ట్ లుక్.' అని పోస్ట్ చేశాడు. ఈ బరోజ్ చిత్రం మైథలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాను త్రీడీ విధానంలో చిత్రీకరిస్తున్నారు. ఇండియాలోనే మొదటి త్రీడీ చిత్రం మై డియర్ కుట్టిచాతన్కు దర్శకత్వం వహించిన జిజో పున్నూస్ కథను అందించారు. సినిమాటోగ్రాఫర్గా సంతోష్ శివన్ చేయనున్నారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. Here's a toast to another year that rises before us. Wishing all good fortunes and prosperity upon each one of you! May this year turn out to be one of the most treasured time frames of your life! #HappyNewYear #BarrozFirstLook pic.twitter.com/x3ZaawlMZ6 — Mohanlal (@Mohanlal) December 31, 2021 -
కమల్తో 'అన్బరివు' చిత్ర యూనిట్
చెన్నై సినిమా: తమిళ బిగ్బాస్ రియాల్టీ గేమ్ షోలో 'అన్బరివు' చిత్ర యూనిట్ సందడి చేసింది. హిప్ హాప్ ఆది హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ. త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను బిగ్ బాస్ హౌస్లో కమల్ హాసన్ ఆవిష్కరించారు. నిర్మాత టీజీ. త్యాగరాజన్, నటుడు హిప్ హాప్ ఆది, దర్శకు డు అశ్విన్ రామ్ పాల్గొన్నారు. -
మీడియా సమావేశంలో రైటర్ చిత్ర యూనిట్
చెన్నై సినిమా: తన భావాలతో ఏకీభవిస్తేనే ఎవరికైనా తన కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని దర్శక నిర్మాత పా.రంజిత్ అన్నారు. 'అట్టకత్తి'తో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత మద్రాస్, కబాలి, కాలా, సర్పట్టా వంటి విజయవంత చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే విధంగా నిర్మాతగానూ నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నవ దర్శకులకు అవకాశం కల్పిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను నిర్మిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రాటీయో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం 'రైటర్'. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఇనియా నాయికగా నటించారు. ఈ చిత్రం ద్వారా ఫ్రాంక్లిన్ జాకోబ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోవింద్ వసంత సంగీతాన్ని అందించిన 'రైటర్' చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియో సమావేశంలో పా.రంజిత్ మాట్లాడుతూ.. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే విధంగా తన చిత్రాలు ఉంటాయన్నారు. -
కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ?
Kicha Sudeep 3D Movie Vikrant Rona Release Date Out: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రధారులుగా అనూప్ భండారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మంగళవారం విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘మిస్టరీ థ్రిల్లర్గా త్రీ డీ టెక్నాలజీతో రూపొందించిన ‘విక్రాంత్ రోణ’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రపంచానికి సరికొత్త సూపర్ హీరోను పరిచయం చేస్తున్నాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా విజువల్ ట్రీట్లా ఉంటుంది. దాదాపు 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’అని చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇందులో కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్తో కనిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను ఇస్తూ అంచనాలను పెంచుతూ వచ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయడంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ ఎలాంటి ఎక్స్పీరియెన్స్ను ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
కథానాయకుడిగా ఆ దర్శకుడి మరో ప్రయత్నం..
చైన్నై సినిమా: దర్శకుడు అమీర్ చాలా గ్యాప్ తర్వాత మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం అమీర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేశారు. తన అమీర్ ఫిలిమ్స్ కార్పొరేషన్ సంస్థ, జేఎస్ఎమ్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. తనతో పాటు నటుడు ఆర్య సోదరుడు సత్య మరో కథానాయకుడిగా నటించనున్నట్లు చెప్పారు. నటి సంచితా శెట్టి హీరోయిన్గా కాగా విన్సెంట్ అశోక్, దినా, చరణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తారని తెలిపారు. రాంజీ ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారని పేర్కొన్నారు. 'అధర్మం, పగైవన్' చిత్రాల ఫేమ్ రమేష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తారన్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. -
'ఎన్న సొల్ల పొగిరాయి' చిత్రంపై నిర్మాత ఏమన్నారంటే..?
చైన్నై సినిమా: 'ఎన్న సొల్ల పోగిరాయ్' చిత్రం యువత పండుగ చేసుకునే విధంగా ఉంటుందని నిర్మాత ఆర్. రవీంద్రన్ పేర్కొన్నారు. తన ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'కుక్ విత్ కోమలి' ఫేమ్ అశ్విన్ కుమార్ లక్ష్మి కాంతన్ కథానాయకుడిగా, అవంతిక, తేజస్విని నాయికలుగా నటించారు. హరిహరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిచర్డ్ ఛాయాగ్రహణను, వివేక్, మెర్లిన్ సంగీతాన్ని అందించారు. ఈనెల 24వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం చెన్నైలో నిర్వహించారు. నిర్మాత ఆర్. రవీంద్రన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పూర్తిగా కొత్తవారిని పరిచయం చేసినట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటుడు అశ్విన్ కుమార్ లక్ష్మీ కాంతన్ పేర్కొన్నారు. -
అందుకే ప్రమోషన్స్కు రావడం లేదట.. అగ్రనటిపై విమర్శలు
చైన్నై సినిమా: ఒక తమిళ అగ్రనటిని నిర్మాత, నటుడు కె.రాజన్ ఘాటుగా విమర్శించారు. జీఎన్ఏ ఫిలిమ్స్ పతాకంపై జయరాజ్ ఆర్. వినాయక సునీల్ కలిసి నిర్మించిన చిత్రం 'గ్రాండ్ మా'. షిజన్ లాల్ ఎస్ఎస్ దర్శకత్వం వహించిన ఇందులో సోనియ అగర్వాల్, విమలారామన్, ఛార్మిళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళం, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైనా కె. రాజన్ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమ మలయాళ చిత్ర పరిశ్రమను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ చిత్ర షూటింగ్ను 23 రోజుల్లో పూర్తి చేసినట్లు, షూటింగ్లో ఒక్క కేరవాన్ కూడా వాడలేదని దర్శకుడు చెప్పారన్నారు. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నటీనటులందరూ విచ్చేశారని, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ఒక నటి మాత్రం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావడం లేదన్నారు. అదేమని అడిగితే తాను వెళ్లి చిత్రం బాగుందని చెప్పి ఆ చిత్రం ఫ్లాప్ అయితే తనకు చెడ్డ పేరు వస్తుందని చెబుతోందన్నారు. రూ.5 కోట్లు తీసుకుంటున్న ఆమెకు చిత్రం ఫ్లాప్ అవుతుందని ముందుగా తెలియదా అంటూ విమర్శించారు. -
'ఇండియన్ 2' హీరోయిన్ కోసం అన్వేషణ.. మిల్క్ బ్యూటీ పక్కానా ?
Indian 2 Movie Team Approach Tamanna For Doing Heroine Role: లోక నాయకుడు కమల్హాసన్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఇండియన్ 2' (భారతీయుడు 2). సినిమా సెట్స్పైకి వెళ్లినప్పటినుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అనేక వివాదాలతో లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ కోర్టును ఆశ్రయించారు. అనంతరం ఆ వివాదాలన్ని సద్దుమణిగాయి. ఇక షూటింగ్ ప్రారంభిద్దాం అని అనుకునే సరికి కమల్హాసన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలే ఆయన కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ రూపంలో సమస్య వచ్చింది. 'ఇండియన్ 2' చిత్రం నుంచి చందమామ కాజల్ అగర్వాల్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రెగ్నెంట్ అని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కాజల్ స్థానాన్ని బర్తీ చేయడానికి చిత్రబృందం అన్వేషణలో పడింది. మొదటగా కాజల్ స్థానంలో త్రిషను తీసుకోడానికి ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా పేరు తెరపైకి వచ్చింది. 'ఇండియన్ 2'లో హీరోయిన్గా, వయసు మళ్లిన పాత్రలో కనిపించాల్సి ఉంది. తమన్నా ఈ రెండు పాత్రలకు న్యాయం చేస్తారని చిత్ర బృందం భావించదట. తమ్ము బేబీకి కూడా పాత్ర నచ్చడంతో హీరోయిన్గా చేసేందుకు అంగీకరంచిందని టాక్ వినిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నాయి కోలీవుడ్ వార్గాలు. ఇదీ చదవండి: ఇండియన్ 2 నుంచి కాజల్ ఔట్.. మరో స్టార్ హీరోయిన్కు ఛాన్స్? -
ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది.. చెల్లిపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్
Sai Pallavi Post About Her Sister Debut Movie: సాయి పల్లవి పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన నటనతో, డ్యాన్స్తో ఎంతగానో అలరించింది. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా కన్నన్ అరంగ్రేటం చేసిన తమిళ చిత్రం 'చితిరై సెవ్వానమ్' ఇవాళ (డిసెంబర్ 3) ఓటీటీ సంస్థ జీ5లో విడదలైంది. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫొటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది సాయి పల్లవి. డిసెంబర్ 3 తనకు ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించింది. తన చెల్లెలు పూజా కన్నన్ నటించే ప్రతి సినిమాతో ఎదగాలని ప్రార్థిస్థున్నాని తెలిపింది సాయి పల్లవి. సాయి పల్లవి తన ఇన్స్టా గ్రామ్లో 'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, అనారోగ్యంతో ఉన్నట్లు నటించడం, అమ్మనాన్నలకు అబద్ధాలు చెప్పడం నుంచి క్లాస్లకు బంక్ కొట్టడం, డిప్రెషన్ సమంయలో కూడా చలాకీగా ఉండటం వరకు ఎదిగిన నా చెల్లిని, తన నటనను నేను మాత్రమే చూశాను. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. ఈరోజు చితిరై సెవ్వానమ్ చిత్రంతో నటిగా అరంగ్రేటం చేస్తోంది. మీరందరూ ఆ చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దర్శకుడిగా అరంగ్రేటం చేస్తున్న సిల్వా మాస్టర్కు, దర్శక నిర్మాత విజయ్ సర్ మీకు శుభాకాంక్షలు. పూజా ఇది నీకోసం. నువ్ ఎంతగా ఆస్వాదించి పాత్రలో లీనమైతే ప్రేక్షకులు నిన్ను అంతలా ఆదరిస్తారు. నువ్ నీ జర్నీని ఆస్వాదించాలని, నీ చుట్టూ ఎప్పుడూ పాజిటివిటీ ఉండి మెరుగైన వ్యక్తిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. ఐ లవ్ యూ, నేను నిన్ను ఎప్పటికీ కాపాడుతూ ఉంటాను.' అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) 'చితిరై సెవ్వానమ్' చిత్రంతో స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా దర్శకుడిగా అరంగ్రేటం చేశాడు. తన వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వగానే తప్పిపోయిన ఐశ్వర్య అనే అమ్మాయి గురించి తండ్రి వెతుకుతూ ఉంటాడు. ఇందుకోసం పోలీసుల సహాయం తీసుకుంటాడు. మరీ అతను తన కుమార్తెను కనిపెట్టాడా లేదా అనేదే సినిమా కథ. ఇందులో సముద్ర ఖని, రిమా కల్లింగల్ కీలక పాత్రల్లో నటించారు. -
ధనుష్ను వరించిన బ్రిక్స్ అవార్డు.. ఎందుకో తెలుసా ?
Hero Dhanush Got Best Actor Award In BRICS Film Festival: తమిళ స్టార్ హీరో ధనుష్కు మరో గౌరవం దక్కింది. నవంబర్ 28న జరిగిన బ్రిక్స్ (BRICS) ఫిల్మ్ ఫెస్టివల్లో 'అసురన్' చిత్రానికి గాను ధనుష్ని ఉత్తమ నటుడి అవార్డు వరించింది. ఇటీవల గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IIF)తో పాటు బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరిగింది. ఈ ఆనందకర విషయాన్ని ధనుష్ ట్విటర్లో పంచుకున్నాడు. ఈ అవార్డు గురించి చెబుతూ 'ఒక పరిపూర్ణ గౌరవం' అని ట్వీట్ చేశాడు. అలాగే ఈ సినిమాకు 3 జాతీయ అవార్డులు వచ్చాయి. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. An absolute honour 🙏🙏🙏 pic.twitter.com/DBPo5mTJGV — Dhanush (@dhanushkraja) November 28, 2021 ఈ అసురన్ సినిమా పూమణి రచించిన వెక్కయ్ నవల ఆధారంగా తీసిన పీరియాడికల్ చిత్రం. ఇందులో ధనుష్, మంజూ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'అసురన్' సినిమాను 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో 'ఉత్తమ విదేశీ చిత్రం' కేటగిరీ కింద ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్, ప్రియమణి లీడ్ రోల్స్లో నారప్ప పేరుతో రీమెక్ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ చివరిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన జగమే తంధిరమ్ సినిమాలో నటించాడు. ఇది నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ప్రస్తుతం మారన్, తిరుచిత్రంబళం షూటింగ్లో బిజీగా ఉన్నాడు ధనుష్. -
పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ ! క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Director Santhosh Gave Clarity On Puneet Raj Kumar Biopic: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంటే ఇప్పుడు తెలియనివారుండరు. పునీత్ మరణాంతరం ఆయన చేసిన గొప్పతనం అందరికీ తెలిసింది. అన్నిటికిమించి ఆయన చనిపోయాక సేవా కార్యక్రమాలు ఆగిపోకూడదని రూ. 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మహానుభావుడు పునీత్ రాజ్ కుమార్. అలాంటి వ్యక్తిపై బయోపిక్ రానుంది. ఇంతకుముందు పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ రానుందని కన్నడ నాట పుకార్లు వచ్చాయి. వీటిపై దర్శకకుడు సంతోష్ ఆనంద్ రామ్ స్పందించారు. పునీత్ మరణించిన తర్వాత ఒక అభిమాని ఆయనపై బయోపిక్ నిర్మించే ఆలోచన ఉందా అని ట్వీటర్లో ప్రశ్నించగా, 'బయోపిక్ తీయడానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను' అని దర్శకుడు సంతోష్ తెలిపారు. I’ll try my level best to bring this idea on screen 🙏 #appusirliveson https://t.co/ivcPkm7HyF — Santhosh Ananddram (@SanthoshAnand15) November 21, 2021 చదవండి: పునీత్ రాజ్ కుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్.. అప్పుకు అంకితంగా చాలా మంది అభిమానులు పునీత్ బయోపిక్ రావాలనే ఆలోచనను స్వాగతించారు. ఆయన ఫ్యాన్స్ అతన్ని అప్పు అని పిలుస్తారు. ఒక అభిమాని 'అవును, నిజంగా చాలా గొప్ప ఆలోచన. దయచేసి మా ప్రియమైన అప్పు బయోపిక్తో రండి' అని ట్వీట్ చేశాడు. మరొకరు 'దయచేసి మా అప్పు సర్ బయోపిక్ తీయండి. ఆయన మంచితనాన్ని రేపటి తరానికి చాటుదాం. అప్పు ఈ ప్రపంచంలో మంచి గుర్తింపుతో చిరస్మణీయుడవుతాడు.' రాసుకొచ్చారు. ఈ బయోపిక్తో అప్పును మరోసారి బిగ్ స్క్రీన్పై చూసి తరిస్తాం. మీ దర్శకత్వంతో ఆయనకు ఉత్తమ నివాళి అవుతుంది.' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన యువరత్న చిత్రంతో పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా తెరపై కనిపించారు. దీనికి సంతోశ్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల క్రితం కూడా పునీత్ 'రాజకుమార' సినిమాను డైరెక్ట్ చేశారు సంతోష్. ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడమే గాక రూ. 45 కోట్లు వసూలు చేసింది. అలాగే పునీత్ చివరిగా నటించిన కన్నడ చిత్రం 'జేమ్స్'. దీనికి ఒక యాక్షన్ సీక్వెన్స్, డబ్బింగ్ తప్ప మిగతా షూట్ అంతా పూర్తి చేశారు పునీత్ రాజ్ కుమార్. అయితే ఈ సినిమాను థియేటర్లలో విడదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ మేకర్స్. చదవండి: పునీత్ రాజ్ కుమార్కు అరుదైన గౌరవం.. 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం -
సూర్య తర్వాతి చిత్రం విడుదల ఎప్పుడో తెలుసా ?
Suriya Etharkkum Thunindhavan Movie Release Date Out: తమిళ స్టార్ హీరో సూర్యకు పిచ్చి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆయన సినిమాల వేగాన్ని పెంచేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'జై భీమ్' తో మంచి విజయాన్ని అందుకున్నారు. మరో మూడు నెలల్లో తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'ఎతర్కుమ్ తునింధవన్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని ట్విటర్లో ఓ వీడియోని పోస్ట్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. చదవండి: సూర్య మంచి మనసు.. ఆ చిత్ర యూనిట్కు బంగారు నాణేలు ఈ వీడియోలో సూర్య మాస్ లుక్లో మాస్ బీట్కు అదిరిపోయే స్టెప్పులేస్తూ కనిపించారు. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్లో సాగనుంది. వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, శరణ్య, ఎం.ఎస్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. సినిమాకు ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా, డి. ఇమ్మాన్ స్వరాలు సమకూర్చారు. తమిళ హీరో శివ కార్తికేయన్, నిర్మాత, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సాహిత్యమందించారు. కొవిడ్ కారణంగా సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' రెండు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో 'ఎతర్కుమ్ తునింధవన్'ను థియేటర్లలో విడుదలవనుంది. సుమారు రెండేళ్ల తర్వాత సూర్య వెండితెరపై కనిపించనున్నారు. #EtharkkumThunindhavan is releasing on Feb 4th, 2022!@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop #SaranyaPonvannan #MSBhaskar @priyankaamohan #Vinay @sooriofficial @AntonyLRuben @VijaytvpugazhO #ETOnFeb4th pic.twitter.com/hwuwEkX3Bm — Sun Pictures (@sunpictures) November 19, 2021 చదవండి: ఇంత ప్రేమ ఇంతకుముందెన్నడూ చూడలేదు :హీరో -
సూర్య మంచి మనసు.. ఆ చిత్ర యూనిట్కు బంగారు నాణేలు
తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తాజాగా సూర్య నటిస్తున్న 'ఎతర్కుం తునింధావన్' చిత్ర యూనిట్కు గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇచ్చి వారిని ఆశ్చర్యపరిచారు. ఇంతకుముందు తమిళనాడుకు చెందిన ఇరులర్ ట్రైబ్ (ఆదివాసీల) సంక్షేమం కోసం రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ను సూర్య దంపతులు కలిసి ఈ చెక్కును అందజేశారు. 'ఎతర్కుం తునింధావన్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఆ చిత్ర దర్శకుడు పాండిరాజ్ ఇటీవల ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణలు, ఆర్టిస్టులందరికీ బంగారు నాణేలు బహుకరించినట్లు చిత్ర యూనిట్ నుంచి సమాచారం. అలాగే దర్శకత్వం, సినిమాటోగ్రఫీ వంటి పలు విభాగాల్లోని సీనియర్లకు 'సావరీన్ కాయిన్స్' బహుమతిగా ఇచ్చారట. ఈ బహుమతితో మొత్తం యూనిట్ సంతోషంగా ఉన్నారట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా చేస్తుంది. సూర్య ఇదివరకు లానే ఈ సినిమాలో కూడా సామాజిక అంశాలతో రాబోతున్నారు. -
ఓ సౌత్ ఇండియా సినిమా మూడు విదేశీ భాషల్లోకి..
ఓ భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం సినీ పరిశ్రమల్లో మాములుగా జరిగేదే. కానీ ఓ భారతీయ సినిమా విదేశీ భాషల్లో రీమేక్ అవడం మాత్రం అరుదనే చెప్పాలి. అది ఓ సౌత్ ఇండియన్ మూవీ అవడం చాలా తక్కువ. ఇప్పుడు మాలయాళం సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’ త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మోహన్లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’ ఇప్పటి వరకు 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో రీమేకైంది. ఇండియన్ లాంగ్వేజేస్తోపాటు చైనీస్, శ్రీలంకన్ భాషల్లో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో నిర్మితం కానుంది. ఇలా మా సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని ఆంటోని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలోని పీటీ ఫాల్కన్ అనే సంస్థ నిర్మించనుంది. చైనీస్లో రీమేక్ అయిన మొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. చదవండి: ‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లో అత్యధిక రేటింగ్ కాగా, ఈ సినిమాకి సీక్వెల్గా వచ్చిన ‘దృశ్యం 2’ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్లో ఈ ఫిబ్రవరి విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రం కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్లు అవుతోంది. View this post on Instagram A post shared by Antony Perumbavoor (@antonyperumbavoor) -
అనుపమ పరమేశ్వరన్ మనసు పారేసుకుంది, కానీ!
చారడేసి కళ్లు, అమాయకత్వం నిండిన చూపు, కల్మషం లేని నవ్వు, ఒత్తైన జుట్టు.. ఒక్కమాటలో చెప్పాలంటే అందానికి పర్యాయ పదం అనుపమ పరమేశ్వరన్. అందం ఒకటేనా, అభినయంతోనూ ప్రేక్షకుల మనసు దోచుకుందామె. నేడు(ఫిబ్రవరి 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి మీకు తెలిసిన విషయాలను గుర్తు చేస్తూ, తెలియని విషయాలను చెప్పుకుందాం.. కేరళలోని త్రిసూర్ జిల్లా, ఇరంజలకుడ పట్టణం అనుపమ పరమేశ్వరన్ స్వస్థలం. పరమేశ్వరన్, సునీత దంపతులకు 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. ఆమెకు ఓ సోదరుడు(అక్షయ్ పరమేశ్వరన్) ఉన్నాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన అనుపమ డిగ్రీ అభ్యసిస్తున్న సమయంలో సినిమా అవకాశం వచ్చింది. దీంతో చదువు అటకెక్కింది. కానీ తర్వాత వీలు చూసుకుని దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. అనుపమకు కూడా ఓ ముద్దుపేరు ఉంది. ఆమె ఇంట్లోనే కాదు, బంధువులు, స్నేహితులు కూడా అనుపమను పొన్ను అని ప్రేమగా పిలుచుకుంటారు. పొన్ను అంటే బంగారం అని అర్థం. చిన్నప్పుడు ఆమె తన ఇంటి దగ్గరలోని థియేటర్ ఆర్ట్స్కు సంబంధించిన స్కూల్లో జాయిన్ అయి యాక్టింగ్ నేర్చుకుంది. స్కూలు డ్రామాల్లో కూడా నటించేది. ఆమె టాలెంట్ను గుర్తించిన స్నేహితురాలు మలయాళ 'ప్రేమమ్' సినిమా ఆడిషన్స్కు ఫొటోలు పంపమని అనుపమను ఒత్తిడి చేసింది. మొదట్లో అంత ఆసక్తి చూపకపోయినా స్నేహితురాలు బలవంతంతో ఫొటోలు పంపించింది. అయినా హీరో నివిన్ పౌలి పక్కన నటించే ఛాన్స్ అంత ఈజీగా రాదని పెద్దగా ఆశలు కూడా పెట్టుకోలేదీ బ్యూటీ. కానీ కొన్ని రోజులకు చిత్రయూనిట్ ఫోన్ చేసి రమ్మనడం, ఆడిషన్స్కు హాజరై ఎంపికవడంతో షాక్ తింది. ఇంట్లో వాళ్లకు మొదట్లో నచ్చకపోయినా ప్రేమమ్ తర్వాత ఆమె ఇష్టానికే ఓటేశారు. ప్రేమమ్లో నటించే సమయానికి అనుపమకు 19 ఏళ్లే. తెలుగులో మొదటి చిత్రం 'అఆ'లో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. ఇందులో నాగవల్లిగా మెప్పించిన అనుపమను బోలెడన్ని అవకాశాలు వరించాయి. ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ.. ఇలా ఆమె చేసిన ప్రతి సినిమా హిట్టవుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నిఖిల్ సరసన 18 పేజీస్లో నటిస్తోంది. దీనితోపాటు మరో రెండు తెలుగు చిత్రాలకు సంతకం చేసినట్లు సమాచారం. తమిళంలో ఆమె నటించిన రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్నాయి. అందరికీ నటిగానే సుపరిచితురాలైన అనుపమ ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసింది. ఓటీటీలో విడుదలైన మనియారయిలే అశోకన్లో నటించడంతోపాటు సహాయ దర్శకురాలిగా మెప్పించింది. ఇక ఈ హీరోయిన్ చాలాసార్లు మనసు పారేసుకుందట. కాకపోతే అందులో ఒక్కటీ సీరియస్ కాదట. ఇష్టాలు: పెయింటింగ్ పాటలు పాడటం సాధు జంతువులు చదవండి: FCUK Movie Review: ఎఫ్.సి.యు.కె మూవీ రివ్యూ -
పెళ్లికి రెడీ అవుతోన్న 'దృశ్యం' నటుడు
తిరువనంతపురం: 'దృశ్యం' నటుడు రోషన్ బషీర్కు పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి. కేరళలో తన ప్రేయసి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి దగ్గరి బంధువైన ఫర్జానాను ఆగస్టు 5న వివాహం చేసుకోనున్నారు. కేరళ ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు కేవలం ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ వివాహం జరగనుంది. కాగా ఎప్పటినుంచో ప్రేమ ఊసులు చెప్పుకుంటున్న వీరిద్దరినీ పెళ్లి బంధంతో ఒక్కటి చేసేందుకు పెద్దలు నిర్ణయించుకోవడంతో జూలై 5న వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను రోషన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫర్జానా న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. (సెలబ్రిటీల పెళ్లిపై మాధవీలత విసుర్లు) రోషన్ బషీర్ "ప్లస్ టూ" చిత్రంతో మలయాళీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 'ఇన్నను ఆ కల్యాణం', 'బ్యాంకింగ్ అవర్స్', 'రెడ్ వైన్' వంటి పలు సినిమాల్లో కనిపించారు. కానీ అతనికి మంచి బ్రేక్నిచ్చింది మాత్రం 'దృశ్యం' సినిమానే. మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రోషన్ నెగెటివ్ పాత్రలో మెరుగైన నటన కనబరిచారు. ఈ సినిమా బంపర్ హిట్ సాధించడంతో ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో వెంకటేశ్ (దృశ్యం), తమిళంలో కమల్ హాసన్ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్ (దృశ్య), హిందీలో అజయ్ దేవగన్ (దృశ్యం) హీరోలుగా రీమేక్ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్ అయింది. చైనీస్లోనూ ‘షీప్ వితౌట్ ఏ షెపర్డ్’ టైటిల్తో రీమేక్ అయింది. (భారీ వ్యూస్ సాధించిన ‘గడ్డి తింటావా’ సాంగ్) -
సదరన్ స్పైస్ 23rd Feb 2020
-
2019: బుక్మై షోలో రికార్డు సృష్టించిన సినిమాలు
భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. బయోపిక్ ట్రెండ్లను దాటి ఇప్పుడు మరో ముందడుగు వేసింది. దేశంలో చోటు చేసుకుంటున్న ప్రధాన సంఘటనలను కూడా తెరకెక్కించవచ్చని ఉరి: ద సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ నిరూపించాయి. కొత్తదనాన్ని కోరుకుంటున్న జనం చిన్న సినిమాలను ఆదరిస్తున్నారని ప్రాంతీయ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి కావాల్సిన కొలమానాలు మారిపోయాయి. కేవలం కలెక్షన్లు వచ్చిన సినిమాలే కాకుండా ప్రేక్షకులు అక్కున చేర్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ పరీక్షలో పాస్ అయినట్టు లెక్క. ఇది కొత్తసంవత్సరంలోనూ కొనసాగనుంది. ఇక ఈ ఏడాది భారత చిత్రపరిశ్రమలో సాహసాలు చేసిన సినిమాలు కొన్ని అంచనాలకు మించి సక్సెస్ అవుతే మరికొన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. సినిమా బాగుందంటే చాలు.. ప్రాంతీయ, జాతీయ బేధాలను లెక్క చేయకుండా ఆ సినిమాలను నెత్తిన పెట్టుకుని ఆదరించడమే భారతీయ చిత్ర పరిశ్రమ లక్షణం. ఈ క్రమంలో 2019కు గానూ జాతీయ అంతర్జాతీయ సినిమాలు ఏవి టాప్లో నిలిచాయో రౌండేద్దాం.. బుక్మైషోలో రికార్డు ఒకప్పటిలా సినిమా చూడాలంటే పొద్దునే లేచి బారెడంత క్యూలో నిలబడాల్సిన పని లేదు. సినిమా విడుదల కాక ముందే ఫోన్లో ఉన్న యాప్తో టికెట్ కొనేసి రెడీగా ఉండచ్చు. ఇలాంటి యాప్లు ఈ మధ్య కాలంలో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే సినిమా టికెట్లతో పాటు, పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలకు సైతం టికెట్లు బుక్ చేసుకునే ‘బుక్ మై షో’ ఓ ముఖ్య విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం ఈ ఏడాది బుక్మైషోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘అవెంజర్స్: ది ఎండ్గేమ్’ అనే హాలీవుడ్ మూవీ రికార్డు సృష్టించింది. 5.7 మిలియన్ల టికెట్ల అమ్మకాలతో భారతీయ చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ రెండో స్థానంలో చోటు దక్కించుకుంది. విమ టాప్ టెన్ ఇండియన్ సినిమాలు ► అవెంజర్స్: ఎండ్గేమ్ ► ఉరి: ద సర్జికల్ స్టైక్ ► కబీర్ సింగ్ ► సాహో ► వార్ ► ద లయన్ కింగ్ ► మిషన్ మంగళ్ ► సింబా ► గల్లీబాయ్ ► చిచోరే భారత్లో హవా కనబర్చిన అంతర్జాతీయ సినిమాలు జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్ వండర్ వెధరింగ్ విత్ యు పాడింగ్టన్ 2 బ్లూ ప్లానెట్ 2 హస్ట్లర్స్ విలేజ్ రాక్స్టార్స్ మైల్ 22 హరే కృష్ణ ఎ ప్రైవేట్ వార్ టాప్ 5 తెలుగు సినిమాలు ⇔ సైరా సరసింహ రెడ్డి ⇔ సాహో ⇔ మహర్షి ⇔ ఎఫ్2 ⇔ మజిలీ టాప్ 5 బెంగాలీ సినిమాలు ♦ దుర్గేష్గోరర్ గుప్తోధోన్ ♦ గుమ్నామీ ♦ కొంఠో ♦ మిటిన్ మషి ♦ గోట్రో టాప్ 5 తమిళ సినిమాలు ⇒ బిగిల్ ⇒ పేట ⇒ విశ్వాసం ⇒ నెర్కొండ పార్వై ⇒ ఖైదీ టాప్ 5 మరాఠీ సినిమాలు • ముంబై పుణె ముంబై 3 • ఠాక్రే • హిర్కానీ • ఆనంది గోపాల్ • భాయ్- వ్యక్తి కి వల్లి -
రూటు మార్చిన రితికాసింగ్
తమిళసినిమా: నటి రితికాసింగ్ రూటు మార్చేసింది. ఈ బ్యూటీ రియల్ లైఫ్లో బాక్సర్. అయితే ఆ క్రీడారంగంలో ఆసక్తి ఉన్నవారికి మాత్రమే తెలిసిన రితికాసింగ్ను మరింత మందికి పరిచయం చేసింది ఇరుదుచుట్రు చిత్రం. చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే బాక్సర్ కంటే ముందే యాక్టర్స్ అయ్యింది. అవును ఈ ముంబయి భామ 2002లోనే బాలనటిగా టార్జాన్ భేటీ అనే చిత్రంతో నటించింది. కథానాయకిగా సుధా కొంగర దర్శకత్వం వహించిన ఇరుదుచుట్రు చిత్రంతో కోలీవుడ్లో రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అదే చిత్రంతో బాలీవుడ్కు, ఆ తరువాత రీమేక్ చిత్రం గురుతో తెలుగుకు ఎంట్రీ ఇచ్చేసింది. ఆ చిత్రంలో చాలా సహజంగా చక్కని నటనను ప్రదర్శించిన ఈ బ్యూటీపై దక్షిణాది దృష్టి పడింది. ముఖ్యంగా కోలీవుడ్లో ఆండవన్ కట్టళై, శివలింగ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంది. ఆ రెండూ సక్సెస్ అయ్యాయి. వాటితోనూ కుటుంబ కథా చిత్రాల నాయకిగా గుర్తింపు పొందింది. అయితే అదే రితికాసింగ్కు మైనస్ అయ్యిందేమో. అవకాశాలు కొరవడ్డాయి. దీంతో చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే గ్లామర్కు మారక తప్పలేదు. మడి కట్టుకుని కూర్చుంటే ఎవరూ పట్టించుకోరనుకుందో ఏమో. ఇటీవల అందాలను ఆరబోసే విధంగా ఫొటోసెషన్ చేయించుకున్న రితిక వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ ప్రయత్నం ఫలించినట్లుంది. ప్రస్తుతం కోలీవుడ్లో ఒక అవకాశం తలుపు తట్టింది. నటుడు అరుణ్విజయ్కు జంటగా నటించనుంది. పాత్ర నచ్చితే హీరో, విలన్ అని చూడకుండా నటించడానికి రెడీ అంటున్న అరుణ్విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తడం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్సేతుపతికి జంటగా అగ్నిసిరగుగళ్ చిత్రంలోనూ,తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రంలో ముఖ్య పాత్రలోనూ నటిస్తున్న అరుణ్ విజయ్ తాజాగా బాక్సర్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో రితికాసింగ్ ఆయనకు జంటగా నటించే అవకాశం దక్కించుకుంది. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ ఇతి వృత్తంతో తెర కెక్కుతోందట. ఈ చిత్రంతోనైనా రితిక హీరోయిన్గా బిజీ అవుతుందేమో చూడాలి. ఈ అమ్మడు నటించిన వడంగాముడి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. -
సదరన్ స్పైస్ 14th march 2019
-
కటౌట్ ఎవరిది?
ఎవరి స్టోరీ వారిదే.. ఎవరి స్టైల్ వారిదే. ఎవరి ప్లే వారిదే.. ఎవరి పవర్ వారిదే.కానీ ఏదో మ్యాచ్ అయింది. ఎక్కడో కంపారిజన్ మొదలైంది.రజనీ డైలాగ్స్ అజిత్ ఫ్యాన్స్కి వచ్చి తగిలాయి. అజిత్ డైలాగ్స్ రజనీ ఫ్యాన్స్ని టార్గెట్ చేశాయి.నిజానికి ఎవరూ ఎవర్నీ టార్గెట్ చెయ్యలేదు. ఫ్యాన్సే వెళ్లి టార్గెట్ అయ్యారు. పేట్ట, విశ్వాసం.. ఒకే రోజు రిలీజ్ అవడంతో..హీరోలకేం కాలేదు కానీ..ఫ్యాన్స్ అనే పెద్ద కటౌట్ కూలిపోయింది! ‘‘ఇరవైమందిని పంపించాను. అందర్నీ చితక్కొట్టి తరిమాడు.’’ ‘‘ఎవర్రా వాడు?’’‘‘పేరు కాళీ. ఇంకే డీటెయిల్స్ తెలీదు.’’ ‘‘వాడు కూర్చున్న తీరును బట్టే పసిగట్టగలను. వాడు భయపడేవాడా కాదా అని.’’ ‘‘వీడు మామూలోడు కాదు మయీ’’ అవును మామూలోడు కాదు! వాడికి సెంటిమెంట్లు ఉండవు. ‘‘రేయ్.. ఎవరికైనా పెళ్లాం పిల్లలని సెంటిమెంట్లు ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. మండిపోతుందిక్కడ. దొరికారా.. భస్మమే’’ కుర్చీలో కూర్చొని తల వెనక్కి చేతులు పెట్టుకుని ఊగిపోతున్నాడు. ఆ డైలాగ్కి నిన్నట్నుంచీ తమిళనాడు ఊగిపోతోంది. ‘పేట్ట’ (తెలుగులో పేట) లోని ఆ ఇరవైమందిని కొట్టినవాడు, కాళీ అనే పేరు తప్ప ఇంకే డీటెయిల్సూ తెలియనివ్వనివాడు, ప్రత్యర్థి దొరికితే మాడ్చి మసిచేసేవాడు. అతడే.. రజనీకాంత్. ∙ ∙ ‘‘పేరు తూకు దొరై. ఊరు కొడువులపట్టి. తేని డిస్ట్రిక్ట్. భార్య నిరంజన. కూతురు పేరు శ్వేత. రా రా చూసుకుందాం’’అడ్రస్ చెప్పేశాడు. ఎవరిని అతడు చాలెంజ్ చేసింది? ‘‘నిన్ను వేసేస్తా’’నని తిరుగుతున్నవాడిని. ఎవరు ఆ తిరుగుతున్నది? తన కథలో తనే హీరో అని చెప్పుకున్నవాడిని. మరి చాలెంజ్ చేసినతను? తన కథలో తను విలన్ అని చెప్పినవాడు. ‘కంటి చుక్క రాలిపడని సంపన్నుడు లేడు. జీవితంలో ఒక్కసారైన నవ్వని నిరుపేద లేడు’.. విలన్ ఫిలాసఫీ. మనిషి భూమిని నమ్ముకుని నిలబడితే, భూమి నమ్ముకున్న మనిషి పక్కన నిలుచుని, ఆ మనిషి కోసం రక్తాన్ని కన్నీటిలా కురిపించిన చల్లని మేఘం ఆ విలన్. సడన్గా ఓ రోజు..తన కథలో తనే హీరో అయినవాడు వచ్చాడు లాండ్ లాగేసుకోడానికి. తన కథలో తనే విలన్ అయినవాడూ వచ్చాడు ‘‘దిస్ లాండ్ బిలాంగ్స్ టు పేదవాళ్లు. చెయ్యేస్తే నరికేస్తా. స్టాంప్ పేపర్లు చింపేస్తా’’ అని. మాటా మాటా నడిచింది. ఫైటింగ్కి మొదలవబోతోంది. ‘నెంబర్ వన్ పొజిషనే నా ఐడెంటిటీ’ అన్నాడు సెల్ఫ్ స్టెయిల్డ్ హీరో. నవ్వాడు విలన్. ఇద్దరికీ పడింది. థియేటర్ అదిరిపోయింది. నిన్నట్నుంచీ తమిళనాడు అదిరిపోతూనే ఉంది. హీరోనని చెప్పుకున్న విలన్.. జగపతిబాబు.విలన్నని చెప్పుకున్న హీరో.. అజిత్. సినిమా పేరు ‘విశ్వాసం’ అదీ నిన్ననే రిలీజ్ అయింది. ∙ ∙ ‘పేట్ట’, ‘విశ్వాసం’.. రెండూ బాక్సులు బద్దలు కొట్టేస్తున్నాయి. ‘పేట్ట’లో రజనీ పాత రజనీలా రెచ్చిపోయాడు. ‘విశ్వాసం’లో అజిత్ కొత్త అజిత్లా ఉత్సాహం తెచ్చాడు. మరి.. బాక్సులు బద్దలవుతుంటే.. ఫ్యాన్స్ కదా విజిల్స్ వెయ్యాలి? పోలీసులెందుకు విజిల్స్ వేస్తున్నారు. ఎందుకు లాఠీచార్జి చేస్తున్నారు. ఎందుకు డిస్పర్స్ అంటున్నారు. ఎందుకు వన్ఫార్టీఫోర్ సెక్షన్ విధించారు. ఎందుకంటే.. బాక్సు బద్దలయ్యే చప్పుడును మించిపోయింది ఫ్యాన్స్ గొడవ. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పనడంతో మొదలైంది స్ట్రీట్ ఫైట్. కటౌట్లు విరిగాయి. వాల్పోస్టర్ల మీద పేడముద్దలు పడ్డాయి. రజనీ, అజిత్.. ఎవరో ఒకరే ఉండాలి స్టేట్లో అన్నంతగా ఆయన అభిమానులు, ఈయన అభిమానులు కత్తిపోట్లు పొడుచుకున్నారు. వేలూరులోని ఒక థియేటర్ బయటి కొట్లాట ఇది. పదిహేను మందికి గాయాలయ్యాయి. నలుగురు హాస్పిటల్ పాలయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న విడుదలైన రెండు పిక్చర్లూ హిట్ కొట్టినట్లే. రజనీ, అజిత్ హ్యాపీగా ఉండి ఉంటారు. అభిమానులు కూడా సినిమా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉంటే బాగుండేది. ∙ ∙ రజనీ, విజయ్సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికీ, సిమ్రాన్, త్రిష, సింహా, శశికుమార్, సనంత్, మేఘా ఆకాష్, మోమనన్.. మంచి స్టారింగ్ ఉంది పేట్టాలో. సంగీతం అనిరు«ద్. కెమెరా తిరునావక్కరుసు. ఫ్యాన్స్కి కిక్ ఎక్కించే టీమ్ ఇదంతా. ‘‘నా పని అయిపోయిందనుకున్నార్రా?’ అని అడుగుతారు రజనీ ఎంట్రీ ఇస్తూ. ఆ ప్రశ్న కథలోని విలన్ని అడిగినట్లు ఉండదు రజనీ ఫ్యాన్స్కి. అజిత్ ఫ్యాన్స్ని అడిగినట్లు ఉంటుంది. అజిత్ ఫ్యాన్స్ రజనీ సినిమాలను చాలాకాలంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకు రిటార్ట్గా ఈ డైలాగ్ కొట్టినట్టు ఫ్యాన్స్ అర్థం చేసుకున్నట్లున్నారు! బయటికొచ్చి, అజిత్ ఫ్యాన్స్ని చూసి సేమ్ డైలాగ్, సేమ్ అదే స్టెయిల్లో కొట్టారు. అజిత్ అభిమానులకు రోషం వచ్చింది. అసలే ఈ సినిమా తీసింది రజనీ ‘డైహార్డ్ ఫాన్’ కార్తీక్ సుబ్బరాజ్. కనుక తమనే టార్గెట్ చేశాడని అజిత్ అభిమానులు అనుకున్నారు. పేట్ట ఫ్లెక్సీలను చింపేయడం కోసం తీసిన కత్తుల్ని పేట్ట ఫ్యాన్ వైపు తిప్పారు. అభిమానం షార్ప్గా ఉంటుంది కానీ, ఇంత షార్ప్గా ఉండడం తగదు. ∙ ∙ ‘విశ్వాసం’ చిత్రంలో మీసం తిప్పుతాడు అజిత్. పంచె ఎగ్గడతాడు. కత్తులు దూస్తాడు. నడక స్టెయిల్గా ఉంటుంది. అవన్నీ రజనీకి దీటుగా ఉంటాయి! అతడి కోపం రజనీ కోపంలా ఉంటుంది. అతడి డైలాగ్ డెలివరీ రజనీ డెలివరీలా ఉంటుంది. అతడి ఫైటింగ్, అతడి నవ్వు, అతడి రొమాన్స్, ఆ థ్రిల్స్ అవన్నీ! రజనీలా అంటే.. రజనీ ఫ్యాన్స్ని లక్ష్యం చేసినట్లుగా. అయితే అది నిజం కాదు. స్టోరీ, స్క్రీన్ప్లే అలాంటివి. రజనీకీ, అజిత్కీ ఒకేలా వర్కవుట్ అయ్యేలా ఉన్నాయి. కథను ఐదుగురు రాశారు. శివ, మణికందన్, శావరి, భాగ్యరాజ్, చంద్రన్. శివ మెయిన్గా డైరెక్షన్. కెమెరా వేత్రి. ఆయనదంతా యాక్షన్ టేకింగ్. సైలెన్స్ని కూడా తన లెన్స్లతో యాక్ట్ చేయిస్తారు. ‘పేట్ట’లో నవాజుద్దీన్ సిద్ధికీతో రజనీ, ‘విశ్వాసం’లో జగపతిబాబుతో అజిత్ తలపడడం, సవాల్ విసరడం, పంచ్ డైలాగ్స్ కొట్టడం పోటా పోటీగా ఉంటాయి. అందుకే ఫ్యాన్స్కి తమ హీరో సినిమా మీదకన్నా, అవతలి వాళ్ల హీరో మూవీ మీద ధ్యాస పడి కంపేరిజన్ ఎక్కువైంది. కాన్ఫ్లిక్టూ మొదలైంది. ∙ ∙ అభిమానించడం మంచి విషయం. ఆ రెండు గంటల సినిమా చూసి ఎంజాయ్ చేసి వచ్చేడం మరీ మంచి విషయం. అభిమానాన్ని దురభిమానం స్థాయికి పెంచుకుని అవతలి హీరోని కించపరచడం, ఆ హీరో అభిమానుల్ని రెచ్చగొట్టడం మంచి విషయం కాదు. కథ కోసం రాసిన ఆవేశాన్ని, కోపాన్ని, ప్రతీకారాన్నీ, పంటికి పన్నును, కంటికి కన్నును అభిమానానికి అప్లయ్ చేసుకోకూడదు. -
అంతా పోగొట్టుకున్నా.. అవకాశాలివ్వండి
తమిళసినిమా: సినీ రంగం ప్రతిభను గౌరవిస్తుంది. అవకాశాలను అందిస్తుంది. డబ్బు, పేరు, అంతస్తు అన్నీ ఇస్తుంది. అయితే దాన్ని నిలబెట్టుకోవాలి. లేకపోతే జీవితం కడగళ్ల పాలే. ఎప్పుడో తనువు చాలించిన మహానటి సావిత్రి కడ జీవితం గురించి ఇప్పటికీ చర్చించుకుంటుంటాం. అయితే ఈ తరం హీరోయిన్లు చాలా ప్రీ ప్లాన్డ్గా జాగ్రత్త పడుతూ సంపాదించింది కూడబెట్టుకుంటున్నారు. ఇతర రంగాల్లో ఇన్వెస్ట్ చేసి పలు రెట్లు పెంచుకుంటున్నారు. అలాంటిది నటి చార్మీళ లాంటి కొందరు హీరోయిన్లు భవిష్యత్ గురించి ఆలోచించకుండా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. తమిళంలో నల్లదోరు కుటుంబం, తైయల్క్కారన్, కిళక్కే వరుమ్ పాట్టు, ముస్తాఫా మనసే మౌనమా తదితర చిత్రాల్లో కథానాయకిగా నటించి బాగా వెలిగిన నటి ఛార్మిళ. అలాంటిది ఇప్పుడు అన్నీ కోల్పోయాను అవకాశాలు ఇచ్చి ఆదుకోండి అని అభ్యర్థించే స్థాయికి దిగజారింది. ఆమె ఏమంటుందో చూద్దాం. నేను ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగినా, నా జీవితంలో అనూహ్య సంఘటనలు జరిగాయి. ఇప్పుడు నా వద్ద డబ్బు లేదు. ఆరోగ్యం పాడయ్యింది. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ముందే జరిగి ఉంటే ఆత్మహత్య చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది కూడా చేయలేను. మంచంలో పడ్డ నా తల్లిని చూసుకోవాలి. కొడుకు బాగోగులు చూసుకోవాలి. అందుకే ఆత్మహత్యకు పాల్పడలేదు. ఒక కాలంలో చాలా చిత్రాల్లో నటించాను. ఇప్పుడు ప్రముఖ దర్శకులను అవకాశాలు అడిగితే ఇవ్వడం లేదు. నాకు నటించడానికి అవకాశాలు ఇవ్వండి. భవిష్యత్ కోసం డబ్బును కూడబెట్టుకోలేకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. సినిమాల్లో ముమ్మరంగా నటిస్తున్నప్పుడు ఆడంబర జీవితాన్ని అనుభవించాను.తరచూ విదేశాలకు వెళ్లి నక్షత్ర హోటళ్లలో గడిపాను. సంపాదించిన దానిలో సగం విదేశాలకు వెళ్లడానికే ఖర్చు చేశాను. వివాహానంతరం నా జీవితం తలకిందులైంది. ఇంటిని, స్థిరాస్తులను విక్రయించేశాను. నేను చేసిన మరో పెద్ద తప్పు ఇంటిని అమ్మడం. ఆ ఇల్లు నాకు చాలా ఆత్మస్ధైర్యాన్నిచ్చింది. అలాంటి ఇల్లు పోయిన తరువాత మానసికంగా, శారీరకంగా నష్టపోయాను. ఆవకాశాలు ఇచ్చి ఆదుకోండి అని ధీనంగా అభ్యర్థిస్తున్నారు. -
స్క్రీన్ ప్లే 15th feb 2018
-
‘స్పైడర్’ సంచలనం
హైదరాబాద్: టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు తాజా చిత్రం ‘స్పైడర్’ విడుదలకు ముందే సంచనాలు సృష్టిస్తొంది. జూన్ 1 విడుదల చేసిన స్పైడర్ టీజర్ రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. అత్యధిక మంది వీక్షించిన దక్షిణాది సినిమా టీజర్గా ఘనత సాధించింది. 24 గంటల్లో 63 లక్షల వ్యూస్ తెచ్చుకుని గత రికార్డులను తుడిచిపెట్టేసింది. వివేగమ్ పేరిట ఉన్న రికార్డు(60 లక్షల వ్యూస్) పేరిట ఉన్న రికార్డును అధిగమించి టాప్లో నిలిచింది. యూట్యూబ్లో ఇప్పటివరకు 6,904,003 వ్యూస్ నమోదయ్యాయి. స్పైడర్ టీజర్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. మరుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకు విడుదలకానుంది. మహేష్బాబు సరసన రకుల్ప్రీత్ హీరోయిన్గా నటించింది. ఠాగూర్ మధు సమర్పణలో భారీ బడ్జెట్తో ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన దక్షిణాది చిత్రాలు 1. స్పైడర్ (63 లక్షలు) 2. వివేగమ్ (60 లక్షలు) 3. కబాలి (51 లక్షలు) 4. కాటమరాయుడు (37 లక్షలు) 5. భైరవ (20 లక్షల 85 వేలు) 6. సింగం 3 (20 లక్షల 74 వేలు) 7. ఖైదీ నెంబర్ 150 (20 లక్షల 70 వేలు) 8. డీజే దువ్వాగ జగన్నాథం (20 లక్షల 30 వేలు) 9. తెరీ (20 లక్షల 30 వేలు) 10. సాహో (20 లక్షల 20 వేలు) -
బలమెంత...!