Sudha Kongara
-
'పరాశక్తి' కోసం పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. మరోవైపు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాకి కూడా ‘పరాశక్తి’ టైటిల్ ఖరారు చేయడం విశేషం. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న ‘పరాశక్తి’కి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు టీజర్ని విడుదల చేశారు. ‘సైన్యమై కదిలిరా... పెను సైన్యమై కదిలిరా...’ అంటూ శివ కార్తికేయన్ చెప్పే డైలాగులు టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. → విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘పరాశక్తి’ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ పై ‘పరాశక్తి’రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ‘‘విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ప్రముఖ నిర్మాత మృతి.. సుధా కొంగర ఎమోషనల్ నోట్
ప్రముఖ కోలీవుడ్ చిత్ర నిర్మాత మనో అక్కినేని కన్నుమూశారు. రెండు రోజుల క్రితమే ఆమె చెన్నైలో మరణించారు. ఫేమస్ డైరెక్టర్ సుధా కొంగర తొలి చిత్రానికి మనో నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుడా అజిత్ కుమార్ చిత్రం కిరీడం, మాధవన నటించిన 13బీ సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ఈ సందర్భంగా సుధా కొంగర ఆమెకు నివాళులర్పించారు. ఆమెతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.సుధా తన ఇన్స్టాలో రాస్తూ.. 'నా తొలి చిత్ర నిర్మాత, నా ప్రాణ స్నేహితురాలు మనో అక్కినేనికి ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ భూమిపై మీరెలా జీవించారో.. అక్కడ కూడా ప్రకాశిస్తారని నమ్ముతున్నా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. మీరు నా మొదటి సినిమాకు పనిచేయడం ఎప్పటికీ గుర్తుంటుంది. నీతో కలిసి తీసిన ద్రోహి చిత్రాన్ని అంకితమిస్తున్నా. ఎందుకంటే సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారిలో ఒకరిగా నువ్వు నా ప్రతి కదలికను గమనిస్తావని నాకు తెలుసు' అని పోస్ట్ చేశారు. కాగా.. 2008లో సల్మాన్ ఖాన్తో దిగిన ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశారు. A long journey through life and cinema.Miss you Mano... pic.twitter.com/pQ1iTuhwHv— Sudha Kongara (@Sudha_Kongara) January 21, 2025 View this post on Instagram A post shared by Sudha Kongara (@sudha_kongara) -
1965లో ఏం జరిగిందో చెప్పనున్న శివకార్తికేయన్
అయలాన్, మావీరన్ చిత్ర వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్కు తాజాగా అమరన్ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో ఆయన, సాయిపల్లవి నటన పలువురి ప్రశంసలను అందుకుంది. కాగా ప్రస్తుతం శివకార్తికేయన్ తన 23వ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. అదేవిధంగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో 24వ చిత్రాన్ని చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్ హీరోగా నటించే 25వ చిత్రానికి మహిళా దర్శకురాలు సుధా కొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించాల్సి ఉంది. దీనికి పురనానూరు అనే టైటిల్ను కూడా నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల సూర్య ఈ చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో ఈ చిత్రంలో శివకార్తికేయన్ను ఎంపిక చేశారు. ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనుండడం విశేషం. అదేవిధంగా మరో నటుడు అధర్వ ముఖ్యపాత్ర పోషించనున్నారు. నటి శ్రీలీల నాయకిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈమె ఈ చిత్రం ద్వారా నేరుగా కోలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. డాన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 1965లో జరిగే చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలిసింది. కాగా ఇంతకుముందు దీనికి పురనానూరు అనే టైటిల్ను నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా పేరును మార్చినట్లు, 1965 అనే టైటిల్ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
రూ.150 కోట్ల బడ్జెట్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివ కార్తికేయన్. ఈయన ఇటీవల రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో హీరోగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించారు. ప్రస్తుతం శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటి శ్రీలీల నాయకిగా నటించనున్నారు. ఇదే ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం. పుష్ప సినిమా తర్వాత ఆమెకు భారీగా ఛాన్స్లు పెరుగుతున్నాయి. అయితే, ఆమె సెలక్టెడ్ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందకు వెళ్తుంది. ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు. మరో ముఖ్య పాత్రలో నటుడు అధర్వ పోషించనున్నారు. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఆయనకు 100వ చిత్రం కావడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రానికి రవి కె.చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీని గురించి నిర్మాత అధికారిక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో ఈ ఎస్.కె 25 చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని నిర్మాత ఆకాష్ భాస్కరన్ వ్యక్తం చేశారు. ఇది పీరియడ్ కాల కథాంశంతో రూపొందుతున్న చిత్రం. దీనికి పురనానూరు అనే టైటిల్ ఇంతకుముందే ఖరారు చేశారు అన్నది గమనార్హం. ఈ చిత్రం రూ.150 కోట్ల బడ్జెట్లో రూపొందుతున్నట్లు సమాచారం. మల్టీ స్టార్స్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. -
శివకార్తికేయన్, సుధా కొంగర మధ్య వివాదం..
నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయలాన్, మావీరన్,ఇటీవల విడుదలైన అమరన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా మరో మూడు చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. అందులో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి 'డాన్' చిత్రం ఫేమ్ సిబి.చక్రవర్తి డైరెక్షన్లో ఒక చిత్రం రానుంది. అదేవిధంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తన 25వ చిత్రంలో శివకార్తీకేయన్ నటించడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. పురనానూరు పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. కాగా ఈ చిత్ర షూటింగ్ను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా అందులో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో షూట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. అయితే, దర్శకురాలు సుధా కొంగర, నటుడు శివకార్తికేయన్ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రోమో షూట్ రద్దు అయినట్లు సోషల్మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రోమో షూట్కు పూర్తి గడ్డంతో శివకార్తికేయన్ రావడం వల్ల సుధా కొంగర అభ్యంతరం చెప్పారట. గడ్డం తొలగించి రావాలని దర్శకురాలు సుధా కొంగర చెప్పడంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయట. అయితే, కథ చెప్పినప్పుడు గడ్డంతోనే ఉండాలని చెప్పారు కదా అంటూ శివకార్తికేయన్ కాస్త అసహనం చెందారట. లైట్ బియార్డ్తో ఉండాలని చెబితే.. పరుత్తివీరన్లో కార్తీ మాదిరి ఉంటే ఎలా అని దర్శకురాలు సుధా కొంగర అనడంతో తన అభ్యంతరాన్ని తెలిపి షూటింగ్ స్పాట్ నుంచి శివకార్తికేయన్ వెళ్లిపోయినట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించి మళ్లీ త్వరలోనే ప్రోమో షూట్ నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ద్వారా నటి శ్రీలీల కోలీవుడ్కు పరిచయం కానున్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. అదే విధంగా ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
సూర్య ప్లేస్లో శివకార్తికేయ.. ఓకే చెప్పిన శ్రీలీల!
కోలీవుడ్ నుంచి శ్రీలీలకు మళ్లీ కాల్ వెళ్లిందా అంటే తమిళ పరిశ్రమలో అవుననే మాట వినిపిస్తోంది. ఇంతకుముందు కూడా శ్రీలీలకు తమిళంలో అవకాశాలు వచ్చాయని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఈసారి ప్రచారంలో ఉన్న వార్త నిజం అని కోలీవుడ్ అంటోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించనున్నారన్నది ఆ వార్త సారాంశం. ‘గురు, ఆకాశం నీ హద్దు రా’ వంటి చిత్రాలతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధ కొంగర తెరకెక్కించనున్న చిత్రంలోనే శివ కార్తికేయన్, శ్రీలీల నటించనున్నారని సమాచారం. ఈ ఇద్దరూ పాల్గొనగా ఫొటోషూట్ కూడా జరిగిందట. త్వరలో అధికారికంగా ప్రకటిస్తుందట చిత్రబృందం. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించాల్సి ఉండగా ఆయన తప్పుకున్న నేపథ్యంలో శివకార్తికేయన్ని తీసుకున్నారట. సూర్యతో ‘పురనానూరు’ అనే టైటిల్తో తెరకెక్కించనున్నట్లు పేర్కొన్నారు. మరి.. శివ కార్తికేయన్తో అనుకుంటున్నది ఈ చిత్రమేనా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
టాలెంటెడ్ లేడీ డైరెక్షన్లో శివకార్తికేయన్
మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇంతకుముందు సుధా కొంగర సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 2020లో విడుదలైన ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం విదితమే. కాక సుధా కొంగర తాజాగా సూర్య హీరోగా మరో చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు. దీనికి పురనానూరు అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన 2 డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాణానికి చాలా సమయం అవసరం అవుతుందని అందువల్ల చిత్ర నిర్మాణాన్ని వాయిదా వేస్తున్నట్లు దర్శకురాలు సుధా కొంగర, నటుడు సూర్య కలిసి ప్రకటన చేశారు. అలాంటిది తాజాగా దర్శకురాలు సుధా కొంగర తన తాజా చిత్రాన్ని నటుడు శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రసారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. కాగా నటుడు శివ కార్తికేయన్ అమరన్ చిత్రాన్ని పూర్తిచేసి ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తన 23వ చిత్రాన్ని చేస్తున్నారు. అదేవిధంగా సుధా కొంగర సూరరై పోట్రు చిత్రానికి రీమేక్ అయిన సర్ఫరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో సూర్య కథానాయకుడిగా నటించిన పురనానూరు చిత్రం పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. -
సూర్య మూవీ వాయిదా.. విక్రమ్ కొడుకుతో సుధాకొంగర కొత్త చిత్రం!
తమిళసినిమా: నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 2010లో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన సుధా కొంగర, 2016లో మాధవన్ హీరోగా తెరకెక్కించిన ఇరుదు చుట్రు చిత్రంతో సంచలన విజయాన్ని సాధించారు. ఆ చిత్రం ద్వారా బాలీవుడ్ రియల్ బాక్సర్ రిత్వికాసింగ్ను కథానాయకిగా పరిచయం చేశారు. ఆ తరువాత అదే చిత్రాన్ని తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. కాగా 2022లో సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్హిట్ అయ్యింది.ప్రస్తుతం అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. కాగా తదుపరి మరోసారి సూర్య హీరోగా పురనానూరు పేరుతో చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మరింత సమయం అవసరం కావడంతో వాయిదా వేసినట్లు, నటుడు సూర్య, దర్శకురాలు సుధాకొంగర సంయుక్తంగా ఓ ప్రకటనను ఇటీవల మీడియాకు విడుదల చేశారు. దీంతో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్. అయితే ఇది ఏ బ్యానర్లో రూపొందనుంది? ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? వంటి వివరాలు తెలియా ల్సి ఉంది. కాగా ప్రస్తుతం నటుడు ధ్రువ్ విక్రమ్ మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని దర్శకుడు పా.రంజిత్ తన నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
సూపర్ హిట్ డైరెక్టర్తో జతకట్టనున్న శింబు?
కోలీవుడ్లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న హీరో శింబు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్య మాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల శింబు నటించిన పత్తుతల చిత్రం పెద్దగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే అవకాశాలకు మాత్రం తగ్గడం లేదు. తాజాగా నటుడు కమలహాస న్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో శింబు కథానాయకుడిగా నటించనున్నారు. దేశింగు పెరియ సామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నా యి. ఈ చిత్రం కోసం శింబు ప్రత్యేకంగా కసరత్తు చేయడంతో పాటు కరాటే వంటి ఆత్మ రక్షణ విద్యల్లోనూ శిక్షణ పొందారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా శింబు తన 49, 50వ చిత్రాలకు కూడా కమిట్ అయిన ట్లు తాజా సమాచారం. ఆయన తన 49వ చి త్రాన్ని అశ్వంత్ మారి ముత్తు దర్శకత్వంలో చే యనున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన కథ డబుల్ ఓకే అనిపించడంతో వెంటనే అందులో నటించడాని కి సమ్మతించినట్లు తెలిసింది. ఇ కపోతే శింబు తాను 50వ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్న ట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో టా క్ వైరల్ అవుతోంది. సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర తాజాగా మరోసారి సూర్యతో పురనానూరు అనే చి త్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ చి త్రం తర్వాత శింబుతో చేసే చిత్రం ఉండే అ వకాశం ఉంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఆ సూపర్ హిట్ కాంబో.. మళ్లీ రిపీట్ చేస్తామంటోన్న మేకర్స్!
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా సూర్యకు నిర్మాతగానూ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2డీ ఎంటర్టైయిన్మెంట్ పతాకంపై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా సూర్య హీరోగా గతంలోనే సుధా కొంగర దర్శకత్వంలో సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంబో రిపీట్ కాబోతోంది. త్వరలో ప్రారంభం కానున్న ఇందులో సూర్యతో పాటు, దుల్కర్ సల్మాన్, విజయ్వర్మ ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. నటి నజ్రియా నాయకిగా నటించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. దీన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టెన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్ను ఖరారు చేశారు. కాగా ఈ చిత్రం గురించి నటుడు, నిర్మాత సూర్య, దర్శకురాలు సుధా కొంగర సోమవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పురనానూరు చిత్రానికి అదనంగా సమయం అవసరం అవుతుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తాము కలిసి పని చేయడం చాలా ప్రత్యేకమన్నారు. ఇది తమ మనసులను హత్తుకునే కథా చిత్రంగా ఉంటుందన్నారు. మీకు మంచి చిత్రాన్ని అందించాలని పని చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతో నటుడు సూర్య పురనానూరు చిత్రానికి ముందు మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. -
ఆకాశమే నీ హద్దురా కాంబో రిపీట్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో సూర్య. సూరరై పోట్రు, జై భీమ్ చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రల్లో తన అసమాన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించిన ఈయన చేతిలో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం కంగువ చిత్రానికి తన గొంతుతో పరిపూర్ణత చేకూర్చే పనిలో ఉన్నారు. సోషల్ అంశాలకు పీరియడ్ కథాంశాలను జోడించి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. ఇందులో సూర్యలోని మరో కోణాన్ని చూస్తారు. 10 భాషల్లో కంగువా బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని చిరుతై శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 3డీ ఫార్మాట్లో తెరకెక్కుతున్న కంగువ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు కాగా తదుపరి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సూర్య సిద్ధం అవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు సూరరై పోట్రు (ఆకాశమే నీ హద్దురా) వంటి హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే! విద్యార్థిగా సూర్య! తాజా చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఏమిటంటే ఇందులో సూర్యతో పాటు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, నజ్రియా ముఖ్యపాత్రలు పోషించనున్నారట. ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సూర్య కళాశాల విద్యార్థిగా నటిస్తున్నట్లు సమాచారం. కంగువ చిత్రంలో గిరి వాసుల తరఫున పోరాడే వీరుడు పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకుని నటించిన సూర్య తాజా చిత్రం పురనానూరు కోసం విద్యార్థిగా మారడానికి కసరత్తులు చేస్తున్నారట. సూర్య తన 2 డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం మేలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. చదవండి: టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు -
ఆ హిట్ డైరెక్టర్తో స్టార్ హీరో మరో సినిమా.. !
వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. గతంలో సూర్య నటించిన సూరారై పోట్రు, జై భీమ్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కంగువ అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిరుతై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జేఈ జ్ఞానవేల్ రాజా యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. త్రీడీ ఫార్మాట్లో రూపొందుతున్న కంగువ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ ఇప్పటికే విడుదల కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కాగా ఈ చిత్ర షూటింగ్లోనే నటుడు సూర్య గాయాల పాలై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. కంగువ తర్వాత మరోసారి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది సూర్య నటించే 43వ చిత్రం కానుంది. దీనిని సూర్య తన 2డీ ఎంటర్టైన్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో నటి నజ్రియా నాయకిగా నటించనుండగా.. మలయాళ యువ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. అదే విధంగా విజయవర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడుగా 100వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ చిత్ర పాటల రికార్డింగ్ మొదలైంది. తొలిపాటను ఓ యువ గాయని పాడారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్కుమార్ మంగళవారం తన ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. అందులో సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్ గాయని ‘దీ‘తో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. -
స్టూడెంట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ కీలక పాత్రలు పోషించనున్నారు. పీరియాడికల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా 1970 నేపథ్యంలో ఉంటుందని, సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, అందులో ఒకటి స్టూడెంట్ రోల్ అని కోలీవుడ్ సమాచారం. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందట. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
1965 యదార్థ ఘటన ఆధారంగానే సూర్య కొత్త సినిమా
పాత్రలో పరకాయ ప్రవేశం చేసే అతికొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. అలా ఆయన ఇటీవల నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందాయి. ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నారు. చారిత్రక కథాచిత్రంగా రూపొంతున్న ఈ చిత్రం కోసం సూర్య తనను తాను చాలానే మార్చుకున్నారు. ఒక విప్లవ నాయకుడిగా సూర్య గెటప్, ఆ చిత్రం గ్లిమ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం రూపొందించడంతో పాటు 36 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే పేర్కొన్నారు. కంగువ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా తెరపై రావడానికి ముస్తాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ను కూడా సూర్య పూర్తి చేశారు. దీంతో ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో వీరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ఆకాశం నీ హద్దురా అనే సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇదే చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నిర్మాతగా హిందీలో నిర్మించి సక్సెస్ అయ్యారు. కాగా ఈ కాంబినేషన్లో మూడోసారి చిత్రం తెరకెక్కనుంది. దీన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్ టెయిన్మెంట్ పతాకంపై నిర్మించనున్నారు. ఇది కూడా 1965 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. అప్పట్లో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే ఈ చిత్రానికి నేపథ్యం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1965లో భాషాయుద్ధంలో మరణించిన రాజేంద్రన్ ఫోటో, సూర్య ఫోటోలు ఒకేసారి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇందులో సూర్య కాలేజీ విద్యార్థిగా నటించనున్నారు. ఇందుకోసం ఆయన కాలేజీ బుల్లోడుగా మేకోవర్ అవ్వడానికి తన సతీమణి జ్యోతికతో కలిసి ముంబైలో మకాం పెట్టినట్లు సమాచారం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ ముఖ్య భూమిక పోషించడం ఉండగా, నటి నజ్రియా కథానాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా ఈ చిత్రం వచ్చే నెల సెట్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. -
ఆ సినిమా రీమేక్ హక్కులు సూర్య సొంతం
కథానాయకుడుగాను, నిర్మాతగాను దూసుకెళుతున్న నటుడు సూర్య. నటుడిగా నిర్మాతగా ఈయన గ్రాఫ్ చూస్తుంటే ఎవరికై నా ఈర్ష్య కలగక మానదు. కారణం సూరరైపోట్రు (ఆకాశం నీ హద్దురా), జైభీమ్ వంటి చిత్రాలు సంచలన విజయాలే. తాజాగా 'కంగువ' అనే మరో సూపర్ హిట్ కథా చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం తొలిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై 10 భాషల్లో త్రీడీ ఫార్మెట్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మరోపక్క తాను తమిళ్,తెలుగులో నటించి, నిర్మించిన సూపర్ హిట్ సినిమా సూరరైపోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. సూర్య త్వరలో సుధా కొంగర దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈయన నటించే 43వ చిత్రం అవుతుంది మలయాళ స్టార్ నటుడు దుల్కర్సల్మాన్, విజయ్వర్మ, నటి నజ్రియా ముఖ్య పాత్రలు పోషించనున్నారు. జీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం కంగువా చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత సెట్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా హిందీలో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘టువల్త్ ఫైల్’ చిత్ర తమిళ రీమేక్ హక్కులను సూర్య పొందినట్లు సమాచారం. యదార్థ సంఘటన ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు విను వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్ర తమిళ్ రీమేక్లో సూర్య నటిస్తారా లేక మరో నటుడిని నటింపజేస్తారా వేచి చూడాల్సి ఉంది. -
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్.. తొలి సినిమాలో హీరోగా టాలీవుడ్ కమెడియన్!
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకురాలు సుధా కొంగర. ఈ చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. సూర్య హీరోగా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. గురు, ఆకాశం నీ హద్దురా సక్సెస్ కావడంతో ఆమెతో సినిమాలు చేసేందుకు సౌత్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం కోలీవుడ్లో టాప్ డైరెక్టర్గా కొనసాగుతోన్న సుధా కొంగర సినీ ప్రయాణం మొదలైంది ఏ హీరోతో తెలుసా? ఆ విషయంపై ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ నటుడు, కమెడియన్ కృష్ణ భగవాన్ హీరోగా 2008లో విడుదలైన చిత్రం ఆంధ్ర అందగాడు. ఈ సినిమాతోనే దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది సుధా కొంగర. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం విడుదలైన సంగతి చాలా మందికి తెలియదు కూడా. ఆంధ్ర అందగాడు మూవీలో అభినయశ్రీ, చిత్రం శ్రీను, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సుధా కొంగరకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మణిరత్నం వద్ద అసిస్టెంట్గా జాయిన్ ఆయిన సుధా కొంగర ఆ తర్వాత మాధవన్ హీరోగా తెరకెక్కించిన ఇరుది సుట్రు సినిమాతో డైరెక్టర్గా ఫస్ట్ సక్సెస్ను అందుకున్నది. ఆ తర్వాత ఆకాశం నీ హద్దురా సినిమాతో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని బాలీవుడ్లోనూ రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా సూర్య గెస్ట్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ తర్వాత మరోసారి సూర్యతో జతకట్టనున్నారు సుధా కొంగర. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్గా ప్రకటించారు. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్ కాంబో రిపీట్ అవుతోంది. -
మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్.. అదిరిపోయిన గ్లింప్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో చిత్రానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే కంగువా షూటింగ్లో బిజీగా ఉన్న హీరో.. సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా) ఫేమ్ సుధా కొంగరతో మరోసారి జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం సూర్య 43 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: ఇంటర్నెట్లో అసలు ఏం నడుస్తోంది?.. ఆ డైలాగ్ ఒక్కటేనా!) గ్లింప్స్ చూస్తే తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో 'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్, తమన్నా ప్రియుడు విజయ్ వర్మ, మలయాళ నటి నజ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. సుధా కొంగర, సూర్య కాంబినేషన్లో వచ్చిన సూరారై పోట్రు చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో జాతీయ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాని సుధా కొంగర హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. సూర్య అతిథిగా కనిపించనున్నారు. (ఇది చదవండి: అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?) My next! With an awesome bundle of talents@Suriya_offl @dulQuer #Nazriya @MrVijayVarma @gvprakash #Jyotika @rajsekarpandian @meenakshicini #Suriya43 has begun! pic.twitter.com/6EBQNUL301 — Sudha Kongara (@Sudha_Kongara) October 26, 2023 -
మరో సాహసం చేస్తున్న హీరో సూర్య
నటుడు సూర్య ఇటీవల వైవిద్య భరిత పాత్రలకు కేరాఫ్గా మారారనే చెప్పాలి. ఆయన సమీపకాలంలో నటించిన జై భీమ్, ఆకాశం నీ హద్దురా చిత్రాలలో సరికొత్తగా కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కంగువ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. చారిత్రక కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక యోధుడుగా సూర్య పాత్ర గానీ గెటప్ గానీ ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్న్స్ సంస్థతో కలిసి కేఈ. జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఇందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నాయకిగా నటిస్తోంది. ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. కాగా విచిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ విడుదలై కంగువపై ఆసక్తిని పెంచేశాయి. కాగా ఈ చిత్రాన్ని 2024లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి నిర్మాతలు చేస్తున్నారు. కాగా నటుడు సూర్య తన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు ఆకాశం నీ హద్దురా వంటి సూపర్ హిట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి హిట్ కొట్టడానికి ఈ కాంబో సిద్ధమవుతోంది. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో సూర్య మరోసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. అందులో కొడుకు కళాశాల విద్యార్థిగా నటిస్తున్నట్లు అందుకు తగ్గట్టుగా ఆయన తనను మలుచుకోవడానికి వర్కౌట్ చేస్తున్నట్లు తెలిసింది. అందుకు గాను ఆయన 20 ఏళ్ల వ్యక్తిలా కనిపించనున్నాడట. ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేయడం సూర్యకు మాత్రమే సాధ్యం అని ఆయన ఫాన్స్ చెప్తున్నారు. కాగా మరో ముఖ్య పాత్రలో మలయాళ యువస్టార్ దుల్కర్సల్మాన్ను నటింప చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా నవంబర్ రెండో వారంలో ఈ చిత్రం సెట్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. జీవి ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించనున్న 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తాజా సమాచారం. -
సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ
సౌత్ ఇండియా స్టార్ హీరో 'సూర్య' ఇప్పుడు తన పాన్ ఇండియా చిత్రం 'కంగువ' షూటింగ్లో బిజీగా ఉన్నాడు, ఇందులో అతను గిరిజన లెజెండ్గా నటిస్తున్నాడు. ఇదీ పూర్తి అయిన వెంటనే తన 43వ చిత్రం కోసం దర్శకురాలు సుధా కొంగర, స్వరకర్త జివి ప్రకాష్తో మళ్లీ జతకట్టనున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ ముగ్గురూ ఇప్పటికే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా)లో కలిసి పనిచేశారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) 'సూర్య 43' ప్రాజెక్ట్ అక్టోబర్లో ప్రారంభం కానుందని సూర్య ఇటీవల ధృవీకరించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తకరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ప్రముఖ నటి నజ్రియా నజీమ్ ఫహద్ కూడా సూర్య 43 లో ఒక ప్రధాన పాత్రతో తమిళ సినిమాలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్లో ఇది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆమె గతంలో తమిళ చిత్రసీమలో భారీ హిట్ సినిమాల్లో నటించి పలు విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆమె తగ్గించారని చెప్పవచ్చు. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమచారం. అలాగే, సూర్య 43లో విలన్గా నటించడానికి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. వెండితెరపై ఆతని విలనిజం సరికొత్తగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ వర్మ డార్లింగ్స్ వంటి పలు చిత్రాలలో తన నటనతో విశ్వసనీయ నటుడిగా స్థిరపడ్డాడు, దహాద్, పింక్, గల్లీ బాయ్, సూపర్ 30, లస్ట్ స్టోరీస్ 2 వంటి చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు ఉంది. దీంతో దర్శకులు,నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. సుధా కొంగర ప్రస్తుతం అక్షయ్ కుమార్ కథానాయకుడిగా సూరరై పొట్రు హిందీ రీమేక్ని పూర్తి చేసే దశలో ఉంది. అది పూర్తి అయిన వెంటనే సూర్య 43 ప్రాజెక్ట్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సెట్స్పైకి వెళ్తుందని సమచారం. -
'రాజా రాణి' బ్యూటీ.. బంపరాఫర్ కొట్టేసింది!
మలయాళ బ్యూటీ నజ్రియా మరో బంపరాఫర్ కొట్టేసినట్లు అనిపిస్తుంది. నాని 'అంటే సుందరానికీ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'జవాన్' డైరెక్టర్ అట్లీ తీసిన 'రాజా రాణి'లో నజ్రియా ఓ హీరోయిన్ గా చేసింది. అప్పటి నుంచి ఈమెకు తెలుగులో బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు. ఏరికోరి సినిమాలు చేసే ఈమె.. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్టులో భాగమైందట. (ఇదీ చదవండి: పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో) కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడివాసల్' మూవీ చేస్తాడు. మరోవైపు 'ఆకాశమే హద్దురా'తో సూపర్ హిట్ ఇచ్చిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించాల్సి ఉంది. ఇందులో హీరోయిన్ గా అదితి శంకర్ అన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు నజ్రియా పేరు వినిపిస్తోంది. అయితే ఇందులో నజ్రియాని హీరోయిన్ పాత్ర కోసం సెలెక్ట్ చేశారా? లేదా స్పెషల్ రోల్ అనేది తెలియాల్సి ఉంది. ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో కొత్త గొడవలు.. లవ్బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?)) -
శంకర్ కూతురు.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరో సూర్యకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘సూరరై పొట్రు’(తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమా హిట్గా నిలిచింది. వీరి కాంబినేషన్లో మరో చిత్రం ‘సూర్య 43’(వర్కింగ్ టైటిల్) రూపొందనుంది. ఈ మూవీలో అదితీ శంకర్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారని టాక్. -
సూర్య కొత్త సినిమా ప్రకటన.. విశాఖలో పుట్టిన సుధకే డైరెక్టర్ ఛాన్స్
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ అగ్ర నటుడిగా గుర్తింపు పొందాడు. కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సూర్య తన పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’తో ఫుల్ బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో కీలక పాత్రలో మెరవనుంది. (ఇదీ చదవండి: చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్) సూర్య బర్త్డే జులై 23న ఘనంగ జరగనుంది. అందులో భాగంగానే కంగువ సినిమా తొలి గ్లింప్స్ను జులై 22న మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇందులో సూర్య ఐదు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారు. దీన్ని త్రీడీలో దాదాపు పదికి పైగా భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సూర్య పుట్టినరోజు నాడే అభిమానులకు మరో శుభవార్త ఆయన చెప్పనున్నారు. తన తదుపరి చిత్రం వివరాలు ప్రకటించనున్నారు. దానిని ఒక లేడీ డైరెక్టర్కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 'సూరారై పోట్రు' (ఆకాశమే నీ హద్దురా) చిత్రాన్ని రూపొందించిన సుధ కొంగరనే సూర్య 43 సినిమాకు దర్శకురాలు కానుందని టాక్. తను తెలుగులో కూడా వెంకటేశ్తో 'గురు' సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. సుధ కొంగర పుట్టింది విశాఖలో అయినా ఆమె చెన్నైలో స్థిరపడింది. సినిమా గురించి సుధ ఏం చెప్పిందంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుధ ఇలా చెప్పింది. ఆకాశమే నీ హద్దురా సినిమా కంటే సూర్యతో భారీ బడ్జెట్లో సినిమా తీయబోతున్నట్లు చెప్పింది. ఆ కథకు భారీగా ఖర్చు అవుంతుందని, అందుకు కొంచెం భయం కూడా ఉందని చెప్పుకొచ్చింది. నిజ జీవిత కథ ఆధారంగానే సినిమా తీస్తున్నా బయోపిక్ మాత్రం కాదని పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఇవ్వనున్నారు. సుధ కొంగరకు సూర్య మరో అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్ అర్థం ఇదేనా?) -
మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్.. సూర్య రిపీట్ చేస్తాడా?
నటుడు సూర్య కథానాయకుడిగా నటించనున్న వాడివాసల్ చిత్రం సెట్పైకి వెళ్లడానికి మరింత జాప్యం కానుందనే ప్రచారం జరుగుతోంది. సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించనున్న చిత్రం వాడివాసల్. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇంతకుముందే రిహార్సల్స్ నిర్వహించారు. షూటింగ్ ప్రారంభించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో దర్శకుడు వెట్రిమారన్ హాస్యనటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ విడుదలై చిత్రాన్ని చేయడానికి వెళ్లారు. ఈ చిత్రాన్ని ఆయన రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలిభాగం ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. (ఇది చదవండి: సినిమాలకు గుడ్బై చెప్పనున్న కాజల్.. కారణం ఇదేనా?) తర్వాత సూర్య కథానాయకుడిగా నటించే వాడివాసల్ చిత్రాన్ని మొదలెడతారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదలై చిత్ర రెండవ భాగంపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి విడుదలై–2 చిత్రం చిన్నచిన్న ప్యాచ్ వర్క్ మినహా పూర్తయిందని చిత్ర వర్గాలు ప్రకటించాయి. విడుదలై చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో దాని సీక్వెల్ను ఇంకా బెటర్మెంట్ కోసం దర్శకుడు వెట్రిమారన్ పలు మార్పులు చేర్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగైదు రోజులు అనుకున్నది మరో 40 రోజులు చిత్రీకరించ తలపెట్టినట్లు సమాచారం. తొలి భాగం సక్సెస్ కావడంతో నిర్మాత రెండవ భాగం చేర్పులు, మార్పులు చేయడానికి మరింత ఖర్చు భరించడానికి సమ్మతించినట్లు టాక్. ఇకపోతే ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా చిత్రం చేస్తున్న సూర్య వాడివాసల్ చిత్రం సెట్పైకి వెళ్లాడానికి ఇంకా సమయం పట్టనుండడంతో, ఈలోపు మరో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సుధాకొంగర దర్శకత్వంలో మరోసారి నటించనున్నట్లు తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు సూరరై పోట్రు వంటి సూపర్హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!) -
సుధా కొంగర దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా!
ఏడు పదుల వయసు పైబడిన సూపర్ స్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈయనతో చిత్రాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈయన ఏక కాలంలో రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న జైలర్ చిత్రం. కాగా రెండవది ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రం. ఇందులో రజనీకాంత్ అతిథిగా ఓ పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. కాగా, ఈ రెండు చిత్రాల షూటింగులను రజనీకాంత్ పూర్తి చేశారు. తదుపరి జై భీమ్ చిత్రం ఫేమ్ టీజే.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది రజనీకాంత్ నటించనున్న 170వ చిత్రం అవుతుంది. దీన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా రజినీకాంత్ నటించే 171 వ చిత్రానికి కూడా ఇప్పుడు పోటీ నెలకొంది. దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కారణం ఇద్దరు దర్శకులు, పలువురు నిర్మాతలు క్యూలో ఉండటమే. రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీన్ని నిర్మించడానికి పలువురు దర్శకులు పోటీ పడుతున్నారని, అందులో విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా ఉస్ట్లు ప్రచారం జరుగుతోంది. (చదవండి: రూ. 37 కోట్లతో ఇల్లు కొన్న అలియా.. ఆ వ్యాపారం కోసమేనట!) తాజాగా మరో ఆసక్తికరమైన ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు ఇరుదు చుట్రు, సూరరైపోట్రు వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వహించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర కూడా రజనీకాంత్ను దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈమె ఇప్పటికే రజనీకాంత్కు కథను వినిపించినట్లు అది ఆయనకు నచ్చినట్లు ప్రచారం జరిగింది. కాగా దీన్ని కేజీఎఫ్ చిత్రం ప్రేమ్ హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం బెంగళూరులోని ఒక ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్ ను దర్శకురాలు సుధా కొంగర, హోంబలి చిత్ర నిర్మాత కలిసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
రంగుల ప్రపంచంలో వెండితెరను ఏలిన మహిళా దర్శకులు..
సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాను రూపొందించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే దర్శకత్వ విభాగంలోనూ తొలితరం నుంచే తమదైన ముద్ర వేశారు మహిళా దర్శకులు. మరికొంత మంది నటిగా వెండితెరకు పరిచయమైనా, ఆ తర్వాత దర్శకురాలిగానూ సత్తాచాటారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళా దర్శకులపై స్పెషల్ స్టోరీ. సావిత్రి మహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉండగానే చిన్నారి పాపలు, మాతృ దేవత, వింత సంసారం వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి సత్తా చాటారు. జీవితా రాజశేఖర్ జీవితా రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అరంగేట్రం చేసిన జానకి రాముడు, ఆహుతి, అంకుశం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. 1990లో డా.రాజశేఖర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనకు దూరమైన ఆమె శేషు సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత సత్యమేవజయతే, మహంకాళి, శేఖర్ వంటి సినిమాలను రూపొందించారు. తాజాగా 33 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి నటిగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. విజయనిర్మల విజయనిర్మల తన ఏడో ఏటనే ‘మత్స్యరేఖ’అనే సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 44 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకోవడం విశేషం. నందినీ రెడ్డి అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా మారింది నందినీ రెడ్డి. తొలి సినిమాతోనే ఆమె డైరెక్షన్కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జబర్ధస్థ్, కల్యాణ వైభోగమే వంటి చిత్రాలు తెరకెక్కించింది. సమంతతో తీసిన ఓ బేబీ సినిమా దర్శకురాలిగా నందినీరెడ్డిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా అన్నీ మంచి శకునములే అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. మంజుల ఘట్టమనేని సూపర్స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంజుల ఘట్టమనేని. తొలుత మళయాళ చిత్రం ‘సమ్మర్ ఇన్ బెత్లేహామ్’లో నటించిన ఆమె ఆ తర్వాత తొలిసారిగా ‘షో’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత నాని, పోకిరి,కావ్యాస్ డైరీ వంటి చిత్రాలను నిర్మించింది. మెగాఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది’ వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం నిర్మాతగా, నటిగా, దర్శకురాలిగా కొనసాగుతున్నారు. సుధా కొంగర ఒకప్పుడు విమర్శించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నారు డైరెక్టర్ సుధా కొంగర.2008లో కృష్ణ భగవాన్ హీరోగా వచ్చిన ఆంధ్రా అందగాడు సినిమాతో దర్శకురాలిగా మారింది సుధా కొంగర. ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత ద్రోహి, గురు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2020లో సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది సుధా కొంగర. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా సూపర్ హిట్తో ఎంతోమంది స్టార్ హీరోలు ఆమెతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
స్టార్ డైరెక్టర్కు ప్రమాదం.. ఓ చేయి పూర్తిగా.. !
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుధా కొంగరకు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని తెలిపారు. ప్రస్తుతం 'సూరరై పోట్రు' సినిమా హిందీ రీమెక్ షూట్లో జరిగిన ప్రమాదంలో చేతికి గాయమయ్యిందని సమాచారం. గాయంతో విపరీతమైన నొప్పి ఉందని అందుకే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆ ఫోటోలు చూస్తే చేతికి బలమైన గాయాలైనట్లు కనిపిస్తోంది. గురు', 'ఆకాశమే నీ హద్దురా' లాంటి సూపర్హిట్ మూవీస్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారామె. ప్రస్తుతం 'సూరరై పోట్రు' సినిమా హిందీ రీమెక్ తెరకెక్కిస్తుండగా అక్షయ్ కుమార్ లీడ్రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రాధిక మదన్ నటిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. మరోవైపు ఈ స్టార్ డైరెక్టర్ తమిళ హీరో సూర్యతో మరో ప్రాజెక్ట్ తీయడానికి రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. Super painful. Super annoying! On a break for a month 😒 #NotTheKindOfBreakIWanted pic.twitter.com/AHVR4Nfumf — Sudha Kongara (@Sudha_Kongara) February 5, 2023 -
Simbu-Sudha Kongara: కేజీఎఫ్ చిత్ర బ్యానర్లో శింబు
కేజీఎఫ్ చాప్టర్–1, చాప్టర్–2 చిత్రాలు కన్నడ సినీ చరిత్రను మార్చేశాయని చెప్పవచ్చు. అప్పటి వరకు లో బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన కన్నడ నిర్మాతలు కేజీఎఫ్ చిత్రం తరువాత పాన్ ఇండియాస్థాయిలో చిత్రాలను రూపొందించడం మొదలుపెట్టారు. ఆ రెండు చిత్రాల విజయాల ప్రభావం కన్నడ చిత్ర పరిశ్రమపై విశేష ప్రభావం చూపింది. ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ హూంబాలే ఫిలిమ్స్ అన్నది తెలిసిందే. కాగా ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా సలార్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా తమిళంలో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి సూరరైపోట్రు చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకురాలి అవార్డు అందుకున్న సుధాకొంగర దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికార పూర్వక ప్రకటనను నిర్మాణ సంస్థ ఇటీవలే మీడియాకు విడుదల చేసింది. సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనుండడం సంతోషంగా ఉందని అందులో ప్రకటించారు. కాగా తాజాగా ఈ చిత్రంలో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల విడుదలైన వెందు తనిందదు కాడు చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న శింబు ప్రస్తుతం పత్తు తల చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత ఆయన సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతారని సమాచారం. అదే విధంగా దర్శకురాలు సుధా కొంగర ప్రస్తుతం సూరరై పోట్రు చిత్ర హిందీ రీమేక్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాత శింబు కథానాయకుడిగా నటించే భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్
సినిమా డైరెక్టర్ అనగానే మన మదిలో మెదిలేది మేల్ పోస్టరే. హాలీవుడ్ కావచ్చు. బాలీవుడ్, టాలీవుడ్ కావచ్చు. కెప్టెన్ ఆఫ్ హౌస్ మాత్రం ఖచ్చితంగా మగవాడే అన్న అభిప్రాయం అంద రిలో బలంగా పడిపోయింది. తొలి నుంచి పూర్తి స్థాయిలో మేల్ డామినేషన్ ఉండటమే అందు కు కారణం కావచ్చు. కానీ…అప్పుడు….ఇప్పుడు… మహిళా దర్శకులు స్టార్ కెమెరా, యాక్ష న్ అంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఆ సౌండ్ వినిపిస్తూ వచ్చింది. ఇకపై టాలీవుడ్లో మహిళా దర్శకులు పెరగబోతున్నారా ? హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, ఆదుర్తి సుబ్బారావు. ఇలా మొదలు పెట్టి చెప్పుకుంటూ పోతే....రాజమోళి, పూరి జగన్నాధ్, త్రివ్రికమ్, సుకుమార్ ఇలా పూర్తి చేయచ్చు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. అంతా బానే ఉంది కానీ… మహానుభావురాళ్ల మాటేంటి ? తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల ఉనికి తక్కువే. అస్సలు లేదు అనడానికి వీల్లేదు. అయితే… ఇప్పుడు పెరుగుతోంది. సక్సెస్ మంత్ర జపిస్తూ తెలుగు సినిమాని సరికొత్తగా ప్రేక్షకులకు ప్రెజంట్ చేయడానికి ఆమె రెడీ అయింది. సినిమా. రంగుల ప్రపంచం. మరో లోకం. 24 ఫ్రేమ్స్ క్రియేటివిటీ కళకళలాడే చోటు. అలాంటి సినిమాని లీడ్ చేసేది డైరెక్టర్ మాత్రమే. డైరెక్టర్ ఆలోచనలకు తగట్టుగానే ఒక కథ సినిమాగా మారుతుంది. అంత కీలకమైన దర్శకత్వ శాఖలో మహిళలు తమ ఉనికిని చాటుకోవడం తొలి నుంచి చాలా తక్కువే. ఇప్పుడు టాలీవుడ్లో మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతోంది. కొత్త కొత్త ఆలోచనలతో… సరికొత్త సినిమాలకి యాక్షన్ చెప్పేస్తున్నారు. (చదవండి: వెండితెరపై హీరోయిన్ల విశ్వరూపం) సూర్య చేత ఆకాశమే హద్దు అనిపించింది మహిళా దర్శకురాలే. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశమే నీ హద్దు రా సినిమా… న్యూ థాట్స్తో వస్తున్న ఉమెన్ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పకనే చెబుతుంది. త్వరలోనే సూర్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది సుధా. సూర్యతో చేయబోయే సినిమా ఓ బయోపిక్ అని ఆ మధ్య తమిళ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది ఎవరి జీవిత చరిత్ర అనేది మాత్రం బయట పెట్టలేదు. (చదవండి: హీరోయినే..హీరో) వైజాగ్లో పుట్టి, పెరిగిన సుధ కొంగర తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేశారు. మొదట్లో స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేశారు. బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాతో ఆమె తీసిన చిత్రం అటు హిందీ, ఇటు తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించింది. హిందీ, తమిళంలో మాధవన్ హీరోగా చేస్తే…తెలుగులో గురు పేరుతో తీసిన చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్ ప్లే చేశారు. సమంత హిట్స్ లిస్ట్పై ఒక లుక్ వేస్తే వెంటనే కనిపించే సినిమా ఓ బేబీ. పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూళ్లు సాధించిందీ చిత్రం. ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డి. సౌత్ కొరియా చిత్రం మిస్ గ్రానీకి రీమేక్ ఈ చిత్రం. అయితే…కథా వస్తువు ఆ చిత్రం నుంచి తీసు కున్నా…సినిమా అంతటా నందిని రెడ్డి మార్క్ ఫీల్, కామెడీ కనిపిస్తూనే ఉంటాయి. లిటిల్ సోల్జర్స్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నందిని రెడ్డి…ఆ తర్వాత కృష్ణవంశీ టీమ్లో చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లోనూ పనిచేశారు. దర్శకు రాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్లో తన ప్రయాణం కొనసాగించారు నందిని రెడ్డి. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి…ఆ తర్వాత ఓ…బేబీ అంటూ ప్రేక్షకులకు మరో మంచి మూవీని అందించారు. నందిని రెడ్డి నుంచి సుధా కొంగర దాకా ఫీమేల్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కొత్త కళని సంతరించుకుం టోంది కదా. కరోనా ముప్పు పూర్తిగా తగ్గిన తర్వాత ఆ జోష్ మరింత పెరిగింది. అయి తే….తెలుగు చిత్ర పరిశ్రమకి మహిళా దర్శకులు కొత్తేం కాదు. గతంలోనూ ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆ మాటకొస్తే…గిన్నీస్ బుక్లో తెలుగు సినిమాని ఎక్కించింది కూడా తెలుగు దర్శకురాలే. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆయా పాత్రల్లో జీవించిన కథానాయికలు… మెగాఫోన్ పట్టి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించారు. టాలీవుడ్లో లేడీ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట ప్రస్తావించాల్సింది విజయ నిర్మల గురించే. మొత్తం 44 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ప్రపంచంలో ఏ భాష లోనూ ఇన్ని సినిమాలను ఏ లేడీ డైరెక్టర్ తీయలేదు. అందుకే…ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన మహిళా దర్శకురాలుగా ఆమె గిన్నీస్ బుక్ లో పేరు సంపాదించారు. 1971లో తొలి చిత్రానికి దర్శకత్వం వహించారు విజయనిర్మల. అదే మీనా. ఫస్ట్ మూవీనే భారీ విజ యం సాధించింది. భానుమతి. నటి, నిర్మాత, గాయని మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. సొంత నిర్మాణ సంస్థలో చండీరాణి చిత్రాన్ని తీశారు భానుమతి. 1953 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి హీరో, హీరోయిన్స్గా నటించారు. అటు నిర్మాతగా, ఇటు దర్శకురాలిగా, మరోవైపు కథానాయికగా…ఈ చిత్రంలో చాలా బాధ్యతలు పంచుకున్నారు భానువతి. అంతే కాదు. సినిమాలో ఆరు పాటలు కూడా ఆమె పాడారు. అన్నట్టు చిత్రానికి కథ అందించింది కూడా భానుమతే. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాణం వైపు చూస్తారు. కానీ…మహానటి సావిత్రి మాత్రం దర్శకత్వం వైపు దృష్టి పెట్టారు. నటనతోనే కాదు. విభిన్న దర్శకురాలిగా కూడా ప్రేక్ష కులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. ఈక్రమంలోనే చిన్నారి పాపలు, మాతృదేవత చిత్రా లకు దర్శకత్వం వహించారు. సావిత్రి, విజయనిర్మల తర్వాత సక్సెస్ మూవీస్తో అందరినీ ఆకట్టుకున్న మరో దర్శకురాలు బి.జయ. జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసిన జయ…సూపర్ హిట్ అనే సినీ వార పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారు. ఆ తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మొత్తం 7 సినిమాలను డైరెక్ట్ చేశారు. -
'ఆకాశం నీ హద్దురా'డైరెక్టర్తో కీర్తి సురేశ్?
ఇరుది సుట్రు చిత్రంతో వెలుగులోకి వచ్చిన మహిళా దర్శకురాలు సుధా కొంగర. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించగా సంచలన విజయం సాధించింది. తెలుగులో వెంకటేష్ హీరోగా గురు పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా విశేష ప్రేక్షకాదరణ అందుకుంది. తదుపరి సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు తెరకెక్కించారు. ఎయిర్డెక్కన్ సంస్థ అధినేత గోపీనాథ్ జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. విమర్శకులను సైతం మెప్పించింది. ఐదు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ప్రస్తుతం సుధా కొంగర ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ఏంటి అన్న ప్రశ్నకు ఈమె గత నెల ఏప్రిల్లోనే బదులిచ్చారు. సంచలన విజయాన్ని సాధించిన కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థలో సుధా కొంగర చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో నటి కీర్తి సురేష్ కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కీర్తి సురేష్కు హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల నటిగా మంచి పేరు ఉంది. మహానటి చిత్రంతో తానేంటో నిరూపించుకుని జాతీయ ఉత్తమనటి అవార్డును సైతం గెలుచుకుంది. ఇటీవల తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో సెంట్రిక్ కథా చిత్రంలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న కీర్తి సురేష్ దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో నటించడం నిజమైతే, ఆమెను ఎలాంటి పాత్రలో చూపించనున్నారు? చిత్ర కథ ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో నెలకొంది. -
కాంబినేషన్ రిపీట్
హీరో సూర్య – దర్శకురాలు సుధ కొంగరది హిట్ కాంబినేషన్. సూర్య హీరోగా సుధ దర్శకత్వంలో రూపొందిన ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దు రా’) మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఈ చిత్రానికి ఐదు అవార్డులు దక్కాయి. కాగా సుధ కొంగర దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సూర్య అంగీకరించారు. గ్యాంగ్స్టర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో సుధ పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ఆరంభానికి కొంత టైమ్ పడుతుంది. ప్రస్తుతం బాల దర్శకత్వంలో సూర్య ‘వణంగాన్’ (తెలుగులో ‘అచలుడు’) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుధ దర్శకత్వంలో సూర్య చేసే సినిమా ఆరంభం అవుతుందని సమాచారం. పక్కా మాస్ మసాలా కథతో కమర్షియల్ చిత్రంగా సుధ తెరకెక్కించనున్నారని తెలిసింది. -
లేడీ డైరెక్టర్తో మూవీ అనౌన్స్ చేసిన 'కేజీఎఫ్' నిర్మాతలు
ఇండస్ట్రీలో అతికొద్ది మందే లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర కూడా ఒకరు. స్టార్ హీరో సూర్యతో తమిళంలో ఆమె చేసిన 'సురారైపోట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్యతో పాటు సుధా కొంగరకి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడీ లేడీ డైరెక్టర్కు క్రేజీ ఆఫర్ దక్కింది. కేజీఎఫ్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ తమ కొత్త సినిమాని సుధా కొంగరతో చేస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించారు. ఈసారి కూడా వాస్తవ సంఘటనల ఆధారంగానే ఆమె కథను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. కానీ సూర్యనే ఈ ప్రాజెక్టులో నటించనున్నట్లు కోలీవుడ్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 𝐒𝐨𝐦𝐞 𝐭𝐫𝐮𝐞 𝐬𝐭𝐨𝐫𝐢𝐞𝐬 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞 𝐭𝐨 𝐛𝐞 𝐭𝐨𝐥𝐝, 𝐚𝐧𝐝 𝐭𝐨𝐥𝐝 𝐫𝐢𝐠𝐡𝐭. To a new beginning with a riveting story @Sudha_Kongara, based on true events.@VKiragandur @hombalefilms @HombaleGroup pic.twitter.com/mFwiGOEZ0K — Hombale Films (@hombalefilms) April 21, 2022 -
అంతర్జాతీయంగా మరో గుర్తింపు సాధించిన ‘ఆకాశమే నీ హద్దురా’
సూర్య హీరోగా నటించిన ‘శూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) చిత్రానికి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఎస్ఐఎఫ్ఐ)లో ప్రదర్శితం కానుంది. ఈ చిత్రోత్సవాలు ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20 వరకు జరగనున్నాయి. పనోరమ విభాగంలో ‘శూరరై పోట్రు’ చిత్రం ఎంపికయింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని సుధ కొంగర తెరకెక్కించారు. ఆల్రెడీ 93వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్కు పరిశీలించిన చిత్రాల్లో ‘శూరరై పోట్రు’ ఉన్న విషయం తెలిసిందే. అయితే నామినేషన్ దక్కలేదు. మరో ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్కు కూడా ఈ చిత్రం వెళ్లింది. ఇప్పుడు షాంఘై చలన చిత్రోత్సవాలకు వెళ్లడం ఈ చిత్రానికి దక్కిన మరో గౌరవంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే... మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ కూడా ప్రదర్శనకు ఎంపికైంది. కొత్తగా పెళ్లయిన యువతి అత్తింటివాళ్లు, భర్తకు తగ్గట్టుగా ఒదిగిపోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు–తమిళ భాషల్లో కన్నన్ దర్శకత్వంలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించనున్నారు. . @Suriya_offl - #SudhaKongara 's Blockbuster #AakaasamNeeHaddhuRa Enters Panorama Section Of Shanghai International Film Festival 2021. 🔥#PraiseTheBrave #SooraraiPottru @rajsekarpandian @Aparnabala2 @gvprakash @2D_ENTPVTLTD #Suriya #Suriya40 pic.twitter.com/JHy2TW7Aa8 — Telugu Film Producers Council (@tfpcin) May 13, 2021 చదవండి: సీఎం స్టాలిన్ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం -
ప్రభాస్–సుధ కాంబినేషన్లో సినిమా ఉంటుందా?
తమిళ చిత్రం ‘శూరరైపోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’)తో బంపర్ హిట్ సాధించారు దర్శకురాలు సుధ కొంగర. ఈ చిత్రం ఓటీటీలో విడుదలైనప్పటికీ ఇటు వ్యూయర్స్ నుంచి అటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. దీంతో సుధ తర్వాతి చిత్రంలో ఎవరు హీరోగా నటించనున్నారు? అనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే మహేశ్బాబు, తమిళ హీరో విజయ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రభాస్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ప్రభాస్కు ఓ కథ వినిపించారట సు«ధ. ఈ కథ ప్రభాస్కు నచ్చిందట. త్వరలో మరోసారి ఈ సినిమా గురించి ఇద్దరూ చర్చించుకోనున్నారని టాక్. ఇప్పటికే ‘రాధేశ్యామ్’, ‘సలార్’, ‘ఆది పురుష్’, నాగ్ అశ్విన్తో సినిమా.. ఇలా వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సమయంలో మరో కొత్త సినిమా కమిట్ అవుతారా? ప్రభాస్–సుధ కాంబినేషన్లో సినిమా ఉంటుందా? వేచి చూడాల్సిందే. -
ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్..
తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం ‘సూరారై పోట్రు’(తెలుగులో ఆకాశమే నీ హద్దురా). సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల ఆస్కార్ అవార్డ్ పోటీలో నామినేషన్ సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 366 చిత్రాలను నిర్వాహకులు ఎంపిక చేయగా.. అందులో మన దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ బరిలో నుంచి వైదొలిగింది. అకాడమీ స్క్రీనింగ్కు ఎంపిక అయిన సూరారై పోట్రు ఆ తర్వాతి రౌండ్స్కు నామినేట్ అవ్వలేకపోయింది. దీంతో మార్చి 15న ఆస్కార్ నుంచి అధికారికంగా తప్పకుంది. ఇదిలా ఉండగా 93వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 2021 ఏప్రిల్ 25న జరగనుంది. కాగా ఉత్తమ చిత్రం విభాగంలో భారత్ నుంచి ఎంపికైన చిత్రాల్లో సూరారై పోట్రు ఒక్కటే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ ఒరిజనల్ స్కోర్తోపాటు ఇతర పలు విభాగాల్లో ఎంపికైంది. తమిళ సినిమాకు ఇంతటి అరుదైన ఘనత లభించడంతో ఆనందంలో మునిగిపోయిన అభిమానులు ప్రస్తుతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా తమిళంలో సూరారై పోట్రుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో వచ్చిన విషయం తెలిసిందే. తక్కువ ధరకే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన ఏయిర్ డెక్కన్ సీఈఓ గోపినాథ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య, 2డీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. చదవండి: హీరో సూర్య కొత్త ప్రయాణం బర్త్డే పార్టీలో అల్లు అర్జున్ హంగామా -
ఆస్కార్ బరిలో సూర్య సినిమా.. భారత్ నుంచి ఆ ఒక్కటే
తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటించిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రానికి అద్భుత ఘనత లభించింది. మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి ఎంటర్ అయ్యింది. 93వ ఆస్కార్ పోటీల్లో భాగంగా.. ఉత్తమ చిత్రం విభాగంలో పోటీకి సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం ట్విటర్లో పేర్కొంది. మొత్తం 366 చిత్రాలను నిర్వాహకులు ఎంపిక చేయగా.. అందులో మన దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది. దీనికి సంబంధించిన లిస్ట్ను ఆస్కార్ అవకాడమీ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో మార్చి 5 నుంచి 10 వరకు ఈ మూవీకి ఓటింగ్ జరగనుంది. తుది జాబితాలోని విజేత చిత్రాలను మార్చి 15న ప్రకటించనున్నారు. అయితే ఆ మధ్యనే సూరారై పొట్రు ఆస్కార్ అవార్డు బరిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. జనరల్ కేటగిరీలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు/దర్శకురాలు, ఉత్తమ ఒరిజనల్ స్కోర్తో కేటగిరిల్లో ఈ చిత్రం పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా తమిళంలో సూరారై పోట్రుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురాగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా తక్కువ ధరకే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన ఏయిర్ డెక్కన్ సీఈఓ గోపినాథ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య, 2డీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. We are elated and thrilled!!! #SooraraiPottru joins OSCARS!!!https://t.co/JEDGgDWdZ9#SooraraiPottru🔥@Suriya_offl #SudhaKongara @rajsekarpandian @gvprakash @nikethbommi @Aparnabala2 @editorsuriya @jacki_art @deepakbhojraj @thanga18 @guneetm — 2D Entertainment (@2D_ENTPVTLTD) February 26, 2021 ఇదిలా ఉంటే ఆస్కార్ నామినేషన్కి పంపిన `జల్లికట్టు` చిత్రం నామినేషన్స్ కి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం సూర్య తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. సూర్య 40గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల సూర్య కోవిడ్ నుంచి కోలుకోగా త్వరలోనే షూటింగ్లో జాయిన్ కానున్నాడు. చదవండి: చెక్’ మూవీ రివ్యూ అదీ ప్రభాస్ రేంజ్: వంద కోట్ల రెమ్యునరేషన్! -
కొత్త కాంబినేషన్
‘గురు, ఆకాశమే నీ హద్దురా!’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకురాలు సుధ కొంగర. సూర్యతో ఆమె తెరకెక్కించిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రం ఆస్కార్ బరిలోనూ నిలిచింది. సుధ తదుపరి చిత్రంలో హీరో ఎవరు? అంటే.. మహేశ్బాబుతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్ కోసం ఆమె ఒక సబ్జెక్ట్ రెడీ చేశారట. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మహేశ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్లో జరుగుతోంది. దుబాయ్ షెడ్యూల్ పూర్తయి, మహేశ్ హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత సుధ సినిమాకు సంబంధించిన చర్చలు ఫైనల్ అవుతాయని ఫిల్మ్నగర్ టాక్. -
పండగవేళ సుదాకాశం
-
సూర్యకు డబ్బింగ్ చెప్పిన యంగ్ హీరో
హీరో సూర్య కథానాయకుడిగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూరరై పోట్రు’ ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. అపర్ణ బాల మురళి హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫాం అయిన అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయబోతున్నట్లు హీరో సూర్య ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట ఈ మూవీని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నప్పటికీ కానీ కరోనా వైరస్ ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో చివరకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న అమెజాన్లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. (మోహన్బాబు నా గాడ్ ఫాదర్: సూర్య) ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ'సినిమాలో కలెక్షన్కింగ్ మోహన్బాబు కీలక పాత్రలో కన్పించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ఆకాశం నీ హద్దురా’లో హీరో సూర్యకు విభిన్న పాత్రలతో నటుడుగా ప్రేక్షకాభిమానుల నుంచి మన్ననలు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని నిర్మాత బీఏ రాజు తన ట్విటర్లో వెల్లడించారు. సూర్యకు సత్యదేవ్ వాయిస్ అయితే సరిగా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సత్యదేవ్ ఇటీవల విడుదలైన విలక్షణ చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం’తో ప్రేక్షకులను అలరించారు. -
కాటుక కనులే మెరిసిపోయే..
కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్తో విడుదల చేయనున్నారు. అపర్ణా బాలమురళి కథానాయికగా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పిల్లా పులి సాంగ్ వీడియో ప్రోమో, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. (మోహన్బాబు నా గాడ్ ఫాదర్: సూర్య) ఈ క్రమంలో సూర్య పుట్టిన రోజు(జూలై 23) కానుకగా ‘కాటుక కనులే’ అంటూ సాగే మరో రొమాంటిక్ సాంగ్ వీడియో ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం.‘‘కాటుక కనులే మెరిసిపోయే.. పిలడా నిను చూసి.. మాటలు అన్నీ మరచిపోయా నీళ్లే నమిలేసి.. ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు.. గుండెకెంత సందడొచ్చెరా...’’ అంటూ సాగే ఈ పాట హీరోహీరోయిన్ల ప్రణయ బంధానికి అద్దం పడుతోంది. సూర్య, అపర్ణ తమ సహజ నటన, నాచురల్ లుక్స్తో కట్టిపడేశారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. -
విజయ్తో సినిమా.. సుధ క్లారిటీ
తీసింది రెండు చిత్రాలే అయినప్పటికీ విభిన్న చిత్రాల దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు సుధ కొంగర. మణిరత్నం దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ఇప్పటికే ‘ద్రోహి’, ‘గురు’ వంటి భారీ విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో సుధ బిజీగా ఉన్నారు. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్తో ఓ సినిమా చేయనున్నట్లు అనేక వార్తల వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా సుధ స్పందించారు. ప్రస్తుతం తన దృష్టంతా ‘ఆకాశం నీ హద్దురా’పైనే ఉందని, మరో సినిమాపై లేదని తేల్చిచెప్పారు. ఇప్పటివరకు ఏ హీరోకు కథ వినిపించలేదని, మరే సినిమాకు కమిట్ కాలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ లాక్డౌన్ సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాలని, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఇక ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ‘మాస్టర్’ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత విజయ్ను సుధ డైరెక్ట్ చేయబోతున్నారని వార్తలు రాగా తాజాగా ఆ వార్తలను ఆమె కొట్టిపారేశారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆకాశం నీ హద్దురా’ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్బాబు కీలక పాత్ర పోషించారు. చదవండి: పవర్ స్టార్ సరసన అనుష్క? ‘ఆచార్య’లో అనసూయ.. చరణ్తో? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_691245605.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సూర్య @ 19
సూర్య వయసు 44 ఏళ్లు. కానీ అలా కనబడరు. అంతెందుకు? ఏ సినిమాలోనూ ఆయన ఒకలా కనబడరు. కథలతో, గెటప్స్తో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తుంటారు సూర్య. తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో ‘సూరరై పోట్రు’ అనే చిత్రం చేశారు. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ టైటిల్ తో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం 19 ఏళ్ల యువకుడిగా మారిపోయారు సూర్య. ఇందులో పైలట్ ‘మారా’ పాత్రలో కనిపించనున్నారు. కొంత భాగం సూర్య 19 ఏళ్ల యువకుడి పాత్రలో కనిపిస్తారు. దానికోసం శారీరకంగా విపరీతమైన శ్రమ పడ్డారట. ఈ పాత్రకు అనుగుణంగా మారడానికి ఆయన ఏం చేశారు అనేది మేకింగ్ వీడియోగా రిలీజ్ చేశారు. పాత్ర కోసం ఆయన శ్రమించే తీరుకు అభిమానులు ఫిదా అవుతూ ఆ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. అపర్ణ బాల మురళి కథానాయిక. ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. -
మోహన్బాబు నా గాడ్ ఫాదర్: సూర్య
సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా!’ టైటిల్తో విడుదల కానుంది. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా దర్శకురాలు సుధ కొంగర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటునే మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం ప్రారంభించింది. ఇక ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్లు, టీజర్ ఓ రేంజ్లో ఉన్నాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ చ్రిత్రంలోని రొమాంటిక్ సాంగ్ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఆకాశంలో విహరించాలనుకునే 100 మంది పిల్లల ను తొలిసారి ఫ్లయిట్లో ప్రయాణించేలా చేశారు చిత్ర యూనిట్. అంతేకాకుండా ఆకాశం సాక్షిగా ఈ వంద మంది పిల్లల సమక్షంలో ‘పిల్ల పులి’అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. ఇలా వినూత్నంగా విమానంలో ఓ సినిమా పాట విడుదల చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఇక ఈ పాటలో హీరో హీరోయిన్లు సూర్య, అపర్ణా బాలమురళి మధ్య రొమాన్స్ సూపర్బ్గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కంపోజ్ చేసిన ఈ పాటలో సూర్య డాషింగ్ లుక్ లో కనిపిస్తుంటే, అపర్ణ స్టన్నింగ్ లుక్లో వావ్ అనిపించేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. పాట విడుదల సందర్భంగా దర్శకురాలు సుధ కొంగర మాట్లాడుతూ.. ‘సూర్య నాకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా అద్భుతంగా రావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదలు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మా నాన్న గారు మరణించారు. మోహన్ బాబు గారి రూపంలో ఒక కొత్త నాన్నను నేను దత్తత తీసుకున్నాను. నా విషయంలో ఎంతో శ్రద్ధ చూపించిన ఏకైక వ్యక్తి ఆయనే’అని అన్నారు. అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ..‘2000 సంవత్సరంలో కేవలం 1 శాతం మందే విమానంలో ప్రయాణించగల స్థితిలో ఉండేవాళ్ళు. కెప్టెన్ గోపీనాథ్ వచ్చి ఈ ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేశారు. కామన్ మ్యాన్ కూడా ఆకాశంలో ప్రయాణించగలిగేలా చేశారు. ఈ మూవీ ఆయనకే అంకితం. ఈ సినిమా సాధ్యపడటానికి సుధ పదేళ్ల కాలం వెచ్చించారు. ఇది ఆమె సినిమా. ఈ సినిమాకు వచ్చే పేరు, ప్రశంసలు ఆమెకే దక్కాలి. నా కెరీర్లో ఇది నిజంగా ముఖ్యమైన కాలం. సోదరి లాంటి సుధ నా పక్కన నిల్చుని, నాకు ఈ సినిమా సాధ్యపడేట్లు చేసింది. ఇక మోహన్ బాబు గారు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. ఫ్లయిట్ మీద కనిపించే ఫొటో సూర్యది కాదు. అది మూవీలో నేను చేస్తున్న మారా పాత్రది. ఇది మన దేశంలోని వీరులకు ఇస్తున్న గౌరవం. దీన్ని స్టార్ డమ్ గా పొరబాటు పడొద్దని నా మనవి’ అని పేర్కొన్నారు. ‘శివాజీ గణేశన్ తర్వాత తమిళంలో బెస్ట్ యాక్టర్ శివకుమార్. ఇప్పుడు ఆయన తనయుడు సూర్యతో కలిసి నటించాను. అతను ఎంత గొప్ప మనిషి. అతనిని చూసి శివకుమార్ గారు గర్వించాలి. అలాంటి గొప్ప నటుడు సూర్య. భగవంతుని ఆశీర్వాదంతో ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. సుధ డిసిప్లిన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా యూనిట్ అందరికీ నా థాంక్స్’ అని కలెక్షన్ కింగ్ మోహన్బాబు చెప్పారు. చదవండి: రానా.. నీకు హ్యాట్సాఫ్! ‘ప్రేమ కూడా ఫీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?’ -
తలవంచదు నా పొగరు
‘జేబులో ఆరు వేలు పెట్టుకుని ఏరోప్లెయిన్ కంపెనీ పెడతానని ఒకడొస్తే... ఎవడ్రా ఈ పిచ్చోడని ఈ లోకం వాణ్ని చూసి నవి్వంది’ అని మోహన్బాబు వాయిస్ ఓవర్తో వచ్చే డైలాగ్తో ఆరంభమైంది ‘ఆకాశం నీ హద్దురా’! టీజర్. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘శూరరై పోట్రు’. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు సూర్య ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. రాజశేఖర్ కర్పూరసుందర పాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి ఈ చిత్రానికి సహ–నిర్మాతలు. ఈ సినిమాకు తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు టీజర్ను మంగళవారం హీరోలు వెంకటేష్, ప్రభాస్, హీరోయిన్ సమంత, దర్శకుడు సందీప్రెడ్డి వంగా, దర్శకురాలు నందినీరెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘గర్జనై నా అరుపు... తలవంచదు నా పొగరు.. అణచాలని నువ్వు చూసినా కరవాలమై తిరిగి వస్తా.... అనే నేపథ్యగానంతో టీజర్ సాగింది. ‘పెద్ద మనుషుల బిజినెస్ నీకు ఎందుకయ్యా... వెళ్లి మీ ఊర్లో పందుల్ని మేపుకో...’, ‘కానీ నువ్వు ఓడిపోయినవారిలా ఇలా ఓ మూలన కూర్చుండి పోతావనుకోలేదు మహా’ , ‘బాగా కోపం ఎక్కువనుకుంటా నీకు’ అంటూ సాగే టీజర్లోని డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘‘1984 నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ సాధారణ వ్యక్తి ఓ అసాధారణమైన కలను ఎలా సాధించాడు? అనే అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందించాం. మధ్యతరగతి యువకునిలా సూర్య నటన సినిమాకు హైలైట్గా ఉంటుంది. ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మోహన్బాబు, పరేష్ రావల్, అపర్ణా బాలమురళి, ప్రకాష్ బెలవాది, ఊర్వశి, కరుణాస్, వివేక్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందించారు. -
సూర్య రెండో లుక్.. పక్షి ఎందుకుంది?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ హీరోకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. దీంతో ఆయన హీరోగా తమిళంలో తెరకెక్కే ప్రతీ సినిమాను తెలుగులోకి డబ్ చేస్తుంటారు. అయితే గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపంచేలేకపోయాయి. అయితే ప్రస్తుతం ఓ విలక్షణమైన కథతో అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు హీరో సూర్య. తెలుగులో విక్టరీ వెంకటేష్కు ‘గురు’ తో మంచి విజయాన్ని అందించిన దర్శకురాలు సుధ కొంగర డైరెక్షన్లో సూర్య ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. సురరై పోట్రుగా తమిళంలో వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’అనే టైటిల్తో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. తాజాగా న్యూఇయర్ కానుకగా సూర్య ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ చిత్రంలో సూర్యకు సంబంధించిన రెండో లుక్ను మూవీ యూనిట్ కాసేపటి క్రితమే విడదల చేసింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్, మాసిన గడ్డంతో గంభీరంగా ఉన్న సూర్యతో పాటు ఓ పక్షి కూడా పోస్టర్లో కనిపిస్తుంది. దీంతో సినిమా కథపై నెటిజన్లు ఏవేవో ఊహించుకుంటున్నారు. ఇక ఈ లుక్లో పక్షి ఎందుకు ఉందనే దానిపై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో సూర్య ఖాతాలో భారీ విజయం పడటం ఖాయమని పలువురు నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. ఈ సినిమాలో అపర్ణా బాలమురళి హీరోయిన్గా కాగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. జాకీష్రాఫ్, కరుణాస్లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. Wishing you all a year full of great moments! Here's #SooraraiPottruSecondLook#AakaasamNeeHaddhuRa#SudhaKongara @gvprakash @nikethbommi @Aparnabala2 @gopiprasannaa @2D_ENTPVTLTD @rajsekarpandian @SakthiFilmFctry @guneetm @sikhyaent pic.twitter.com/JXbW2oUSPz — Suriya Sivakumar (@Suriya_offl) January 1, 2020 -
సూర్య నోట రాప్ పాట
ఇప్పుడు హీరోలు గాయకులుగా మారడం పరిపాటిగా మారిపోయింది. విజయ్, ధనుష్, శింబు వంటి హీరోలు తమ చిత్రాలకు పాడుకుంటుంటారు. ఇక విశ్వనటుడు కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు. ఇటీవల నటుడు సూర్య, కార్తీలు కూడా పాడటం ప్రారంభించారు. నటుడు సూర్య తాను నటించిన అంజాన్ చిత్రం కోసమే ఒక పాట పాడారు. ఇక దర్శకుడు వెంకట్ప్రభు పార్టీ చిత్రం కోసం సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి పాడారు. తాజాగా నటుడు సూర్య రాప్ పాటను పాడటం విశేషం. కాప్పాన్ చిత్రం తరువాత ఈయన నటిస్తున్న చిత్రం సూరరై పోట్రు. ఇరుదుచుట్రు చిత్రం ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అపర్ణ బాలమురళీ నాయకిగా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్బాబు, బాలీవుడ్ స్టార్ జాకీష్రాప్, కరుణాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న సూరరై పోట్రు చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాం జరుపుకుంటోంది. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో.. ముఖ్యంగా సూర్య అభిమానుల్లో క్రేజ్ను తెచ్చుకుంది. కాగా త్వరలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ధీమ్ ఉంటుందని, దానికి సంగీతాన్ని జీవీ సమకూర్చుతున్నారనే వార్తలు వెలువడి ఆసక్తిని రేకరెత్తిస్తున్నాయి. కాగా తాజాగా ఆ ధీమ్ మ్యూజిక్కు నటుడు సూర్యతోనే జీవీ.ప్రకాశ్కుమార్ రాప్ పాటను పాడించారు. దీంతో సూరరై పోట్రు చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది. సూర్య అభిమానులు సూరరై పోట్రు చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తరువాత సూర్య వెట్రిమారన్ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. అదే విధంగా గౌతమ్మీనన్తో చిత్రం చేయడానికి గ్రీస్సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. -
ఆకాశమే హద్దు
‘ఆకాశమే నీ హద్దురా.. ఎవరు ఆపినా ఆగొద్దురా’ అంటున్నారు సూర్య. అనడమే కాదు.. ఆకాశానికి ఎగరడానికి ప్రయత్నిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్తో విడుదల కానుంది. ‘అసాధారణ కలలు కన్న సాధారణ వ్యక్తి కథ’ అన్నది ట్యాగ్లైన్. సూర్య నటిస్తూ, నిర్మిస్తున్నారు. మోహన్బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మారా అనే పైలెట్ పాత్రలో సూర్య కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రం ఫస్ట్లుక్ని ఆదివారం విడుదల చేశారు. అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీప్రకాశ్ కుమార్, కెమెరా: నికేత్ బొమ్మి. -
‘ఆకాశం నీ హద్దురా!’
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సురరై పోట్రుగా తమిళంలో వస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం సూర్యకు సంబంధించిన లుక్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అపర్ణా బాలమురళి హీరోయిన్గా కాగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కాగా ఈ మూవీలో సూర్య పైలట్గా కనిపించనున్నట్లు సమాచారం. తెలుగులో ‘గురు’సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటం విశేషం. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్య నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. జాకీష్రాఫ్, కరుణాస్లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. -
జీవీ హాలీవుడ్ ఎంట్రీ షురూ
యువ సంగీతదర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్కుమార్ హాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. కోలీవుడ్లో వెయిల్ చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయమయ్యి అతి పిన్న వయసు సంగీత దర్శకుడిగా పేరొందారు జీవీ. ఇక డార్లింగ్ చిత్రంతో హీరోగా తెరపైకి వచ్చారు. ఈ తర్వాత సంగీతం, నటన అంటూ రెండు పడవల ప్రయాణాన్ని సక్సెస్పుల్గా కొనసాగిస్తున్నారు. తాజాగా నటుడిగా కోలీవుడ్ నుంచి ఏకంగా హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘ట్రాప్ సిటీ’అనే హాలీవుడ్ చిత్రంలో జీవీ ప్రకాశ్కుమార్ నటించనున్నారు. దీనికి బాలీవుడ్ దర్శకుడు నిక్కీ బ్రూచ్చల్ దర్శకత్వం విహించనున్నారు. దీన్ని కైబా అనే హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థపై టెల్ గణేశన్ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు నెపోలియన్ ప్రధాన పాత్రలో నటించిన వెవిల్స్ నైట్, క్రిస్మస్ కూపన్ వంటి హాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. కాగా జీవీ నటించనున్న చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాండన్ టీ.జాక్సన్ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. జీవీ.ప్రకాశ్కుమార్ ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నా రు. ఆయన నటించిన 100% కాదల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదే విధంగా ఐన్గరన్, అడంగాదే, జెయిల్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం బ్యాచ్చిలర్, ఆయిరం జన్మంగళ్,కాదలిక్క యారుమిల్లై చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక సంగీత దర్శకుడిగానూ ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాంభినేషన్లో తెరకెక్కుతున్న అసురన్, సూర్య దర్శకురాలు సుధ కొంగరల కాంభినేషన్లో రూపొందుతున్న సూరరై పోట్రు చిత్రాలకు పని చేస్తున్నారు. కాగా కోలీవుడ్ నుంచి హాలీవుడ్కు వెళ్లిన ధనుష్ వంటి అతి కొద్ది మంది నటుల సరసన ఇప్పుడు జీవీ ప్రకాశ్కుమార్ చేరనున్నారన్నమాట. -
డిజిటల్ ఎంట్రీ
నెట్ఫ్లిక్స్ తమిళంలో ఓ వెబ్ యాంథాలజీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ వెబ్ యాంథాలజీ (పలువురు దర్శకులు పలు కథలతో ఒక సినిమాగా రూపొందించడాన్ని యాంథాలజీ అంటారు) రూపొందించడం కోసం నలుగురు దర్శకులను కూడా సంప్రదించింది. గౌతమ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్ ఒక్కో భాగాన్ని డైరెక్ట్ చేస్తారు. పరువు హత్యల నేపథ్యంలో ఈ యాంథాలజీ సాగు తుందని సమాచారం. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించే భాగం చిత్రీకరణ కూడా మొదలైందట. ఇందులో అంజలి, బాలీవుడ్ నటి కల్కీ కొచ్లిన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇదే అంజలి డిజిటల్ ఎంట్రీ కావడం విశేషం. మిగతా దర్శకుల భాగాల్లో నటించే వారి వివరాలు తెలియాలి. -
నలుగురు దర్శకులు.. నెట్ఫ్లిక్స్ కథలు
బాలీవుడ్ అగ్ర దర్శకులు జోయా అక్తర్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్లతో ‘లస్ట్ స్టోరీస్’ అనే యాంథాలజీ (ఇద్దరు ముగ్గురు దర్శకులు కలసి ఒక్కో భాగానికి దర్శకత్వం వహించడం) రూపొందించింది నెట్ఫ్లిక్. తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’ను తీసుకు రాబోతోంది. సందీప్రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి ఒక్కో భాగాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పుడు తమిళంలోనూ నెట్ఫ్లిక్ ఓ యాంథాలజీ ప్లాన్ చేసిందని సమాచారం. దర్శకులు గౌతమ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్లు ఈ యాంథాలజీను డైరెక్ట్ చేయనున్నారట. ఇది తమిళ వెర్షన్ ‘లస్ట్ స్టోరీస్’ అని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్?
సూపర్హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులే వస్తోంది. నటుడు సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్లో ఇంతకుముందు ఆరు, వేల్, సింగం 1,2,3 సీక్వెల్స్ వచ్చాయి. వాటిలో సింగం 3 చిత్రం మినహా అన్నీ హిట్ అయ్యాయి. కాగా వీర్దిరూ కలిసి మరో చిత్రం చేయబోతున్నారని సమాచారం. సూర్య నటించిన ఎన్జీకే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. కాగా ప్రస్తుతం ఆయన కేవీ. ఆనంద్ దర్శకత్వంలో కాప్పాన్ చిత్రాన్ని పూర్తి చేశారు. నటి సాయేషా సైగల్ నాయకిగా నటించిన ఈ సినిమాలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, ఆర్య వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. సూర్య ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్.గోపీనాథ్ బయోపిక్తో తెరకెక్కుతున్న చిత్రం అని సమాచారం. ఈ చిత్రం షూటింగ్లో ఉండగానే నటుడు సూర్య దర్శకుడు శివతో చిత్రం చేయడానికి పచ్చజెండా ఊపారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ కేఈ.జ్ఞానవేల్రాజా నిర్మించనున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో సూర్య మరో చిత్రానికి సై అన్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికే హరి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది కాలం ఆగాల్సిందే. ఇటీవల తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించే చిన్న బడ్జెట్ చిత్రాలనే నిర్మిస్తున్న సూర్య ఈ సారి తనే హీరోగా భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఎందుకంటే హరి దర్శకుడంటేనే కత్తులు, కార్ల బ్లాస్టింగ్, భారీ యాక్షన్ సన్నివేశాలు కచ్చితంగా చోటుచేసుకుంటాయి. అలా పక్కా మాస్ చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్న హరి ఇటీవల నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కించిన సామి స్క్వేర్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.దీంతో ఈ సారి కథ విషయంలో దర్శకుడు హారి, నటుడు సూర్య తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. -
సూర్యకు ధన్యవాదాలు తెలిపిన మోహన్ బాబు
తాజాగా ‘ఎన్జీకే’ చిత్రంతో పలకరించిన సూర్య.. తన తదుపరి చిత్రంతో బిజీ అయ్యాడు. సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కుతున్న సూరారై పొట్రు చిత్రంలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్లో తాజాగా మోహన్ బాబు జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా సూర్య ఓ ట్వీట్ చేశారు. మోహన్బాబుతో కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఆయనొక క్రమశిక్షణ గల నటుడని, 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయనతో యాక్ట్ చేయడం వల్ల ఎంతో నేర్చుకోవచ్చని.. తన సినిమాల్లో భాగం పంచుకున్నందుకు ధన్యవాదాలు అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ.. ‘ఈ జెనరేషన్లో టాప్ స్టార్ అయిన సూర్య, ఆయన మాటలు, సెట్స్లో ప్రవర్తించే విదానమే ఆయన గురించి చెబుతాయి. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవాడు. ఆయనతో కలిసి నటించేందుకు తదుపరి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాను మిత్రమా.. నా గురించి ట్విటర్లో స్పందించినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. Thank you @Suriya_offl for the kind words. Being one of this gen top star, Your discipline and humbleness on sets speaks about your wonderful character. Looking forward for the next schedule, my young friend. https://t.co/f6aCa1rKWl — Mohan Babu M (@themohanbabu) June 17, 2019 -
చెన్నైకి వణక్కం
నాయకుడిగా, ప్రతినాయకుడిగా విభిన్నపాత్రల్లో 44 ఏళ్లుగా మోహన్బాబు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కెరీర్లో కొన్ని వందల చిత్రాలు చేసినప్పటికీ లేడీ డైరెక్టర్తో ఆయన చేసింది కేవలం ఒక్క సినిమానే. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ఓ చిత్రంలో నెగటివ్ పాత్ర చేశారాయన. తాజాగా మరో లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో నటించనున్నారు. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరరై పోట్రు’ అనే చిత్రం తెరకెక్కుతోంది. సూర్యనే ఈ చిత్రానికి నిర్మాత. అపర్ణ బాలమురళి కథానాయిక. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు మోహన్బాబు కరెక్ట్గా సరిపోతారని చిత్రబృందం భావించింది. సూర్య, సుధ ఇద్దరూ లక్ష్మీ మంచుకి స్నేహితులు కావడంతో తన ద్వారా మోహన్ బాబుని సంప్రదించారట. స్క్రిప్ట్ విన్న మోహన్బాబు వెంటనే నటించడానికి అంగీకరించారు. గతంలో శివాజీ గణేశన్, రజనీకాంత్తో తమిళ సినిమాల్లో స్క్రీన్షేర్ చేసుకున్నారు మోహన్బాబు. సావిత్రి జీవితం ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘మహానటి’తో చాలా గ్యాప్ తర్వాత తమిళ తెరపై కనిపించారాయన. ఇప్పుడు చేస్తున్న చిత్రంతో చెన్నైకి మళ్లీ వణక్కమ్ (నమస్కారం) చెప్పారాయన. ఈ చిత్రం షూటింగ్లో ఇవాళ (శుక్రవారం) జాయిన్ అవనున్నారు మోహన్బాబు. చెన్నైలోని ఎయిర్పోర్ట్లో చిత్రీకరించే కీలక సన్నివేశాల్లో పాల్గొంటారు. -
సూర్య సినిమాలో మోహన్బాబు
నాయకుడిగా, ప్రతినాయకుడిగా... ఇలా 44 ఏళ్ల నటజీవితంలో ఏ పాత్ర అయినా చేయగలనని మంచు మోహన్బాబు నిరూపించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్లో ఇప్పటివరకూ ఆయన ఒకే ఒక్క లేడీ డైరెక్టర్తో సినిమా చేశారు. కృష్ణ నాయకుడిగా గతంలో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో మోహన్బాబు ప్రతినాయకుడిగా నటించారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మరో లైడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘సూరరై పోట్రు’ అనే టైటిల్తో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూర్యే నిర్మాత కావడం విశేషం. ఇందులో కథకు కీలకంగా నిలిచే అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రకు మోహన్బాబు మాత్రమే యాప్ట్ అని ఆయన్ను అప్రోచ్ అయ్యారు చిత్రయూనిట్. కథ, పాత్ర నచ్చి ఈ చిత్రంలో నటించడానికి ఆయన అంగీకరించారు. ఈ మూవీ షూటింగ్లో పాల్గొనడానికి గురువారం మోహన్బాబు చెన్నై వెళ్లారు. శుక్రవారం చెన్నై ఎయిర్పోర్ట్లో జరిగే షూటింగ్లో మోహన్ బాబు పాల్గొననున్నారు. ఈ సినిమాలో మోహన్బాబుని నటింపజేయాలనుకున్నప్పుడు ఆయన కుమార్తె లక్ష్మీప్రసన్నను సంప్రదించారు సూర్య, సుధ. ఆరునెలల క్రితం మోహన్బాబు ఈ సినిమా అంగీకరించారు. బాక్సింగ్ నేపథ్యంలో హిందీలో ‘సాలా కదూస్’, తమిళంలో ‘ఇరుది సుట్రు’ పేరుతో సుధ కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే. ‘ఇరుది సుట్రు’ని తెలుగులో ‘గురు’ పేరుతో సుధ కొంగర తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన డైరెక్టర్స్లో డిఫరెంట్ డైరెక్టర్ అనిపించుకున్న సుధ కొంగర తాజాగా సూర్య, మోహన్బాబు కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. -
రీ ఎంట్రీ షురూ?
తమిళసినిమా: ఎవరు? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? సక్సెస్ అవుతారో తెలియదు. అదే జీవితం అంటే. తారల విషయానికి వస్తే, ఒక భాషలో నిరాకరింపబడిన వారు మరో భాషలో ఆదరింపబడవచ్చు. ప్రస్తుతం అగ్రనటిగా రాణిస్తున్న అనుష్క, ఇలియానా, రకుల్ప్రీత్సింగ్, పూజాహెగ్డే ఇలా చాలా మంది ఆదిలో కోలీవుడ్లో తిరస్కరించబడ్డవాళ్లే. అలాగని నిరాశ పడకుండా ప్రయత్నించి చూద్దాం అన్నట్లుగా టాలీవుడ్లో అవకాశాలను అందుకుని అక్కడ సక్సెస్ అయ్యి ఆ తరువాత కోలీవుడ్లో క్రేజీ నటిమణులుగా రీఎంట్రీ ఇచ్చారు. నటి పూజాహెగ్డే విషయానికి వస్తే ఈ ఉత్తరాది బ్యూటీని దర్శకుడు మిష్కిన్ కోలీవుడ్కు పరిచయం చేశారు. జీవాకు జంటగా ముఖముడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి దాదాపు ఏడేళ్ల అయినా ఇప్పటివరకూ అదే చివరి చిత్రం అయ్యింది. అయితే టాలీవుడ్లో అల్లుఅర్జున్, మహేశ్బాబు వంటి టాప్ స్టార్స్తో నటిస్తూ క్రేజీ కథానాయకిగా వెలుగొందుతోంది. అలాంటిది తాజాగా మరో లక్కీఛాన్స్ పూజాహెగ్డే ఇంటి తలపులు తట్టినట్లు సమాచారం. నటుడు సూర్యతో రొమాన్స్ చేయనున్నట్లు ఒక టాక్ స్ప్రెడ్ అయ్యింది. సూర్య నటించిన తాజా చిత్రం ఎన్జీకే ఇటీవల తెరపైకి వచ్చి మిశ్రమ స్పందననే తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన కేవీ.ఆనంద్ దర్శకత్వలో కాప్పాన్ చిత్రాన్ని పూర్తి చేసి ఇరుదుచుట్రు చిత్రం ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్టు చిత్రంలో నటిస్తున్నారు. తొలి షెడ్యూల్ షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్ను చత్తీస్ఘడ్లో జరుపుకుంటోంది. ఇందులో మలయాళ నటి అపర్ణ బాలమురళిని హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇప్పటివరకూ చిన్న హీరోలతో నటిస్తున్న ఈ అమ్మడికి సూర్య వంటి స్టార్ హీరోతో నటించడం ఇదే ప్రథమం. అయితే చిత్ర కథ పాత్రను బట్టి ఆమెను ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో మరో ముఖ్య పాత్ర ఉంటుందని, ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను మూడో షెడ్యూల్ నుంచే చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. ఆ పాత్రలో నటి పూజాహెగ్డే నటించనుందని తాజా సమాచారం. ఇదే నిజం అయితే సూరరై పోట్టు చిత్రం తరువాత పూజాహెగ్డే ఇక్కడ తన మార్కెట్ను విస్తరించుకుంటుందని భావించవచ్చు. -
మస్త్ యాక్షన్
సూర్య సినిమాల్లో మస్త్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఆయన ఫైట్స్, చేజ్లను ప్రేక్షకులు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈ విషయాన్నే డైరెక్టర్ సుధా కొంగర తన కొత్త చిత్రంలో బాగా ఉపయోగించుకుంటున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘సురరై పోట్రు’. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్మేన్ను టీమ్లో తీసుకున్నారు. ‘హ్యారీ పోటర్, అవెంజర్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమాలకు యాక్షన్ పార్ట్ను హ్యాండిల్ చేసిన గ్రెగ్ పొవెల్ ‘సూరరై పోట్రు’కు యాక్షన్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేయనున్నారు. అంటే.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్లో ప్లాన్ చేశారో ఊహించవచ్చు. అపర్ణా బాలమురళి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. -
అలాంటి ఐరన్ లేడీ ఉండరు
తమిళసినిమా: నటుడు సూర్య ఇంతకు ముందెప్పుడూ లేనట్లుగా చిత్రాల విషయలో స్పీడ్ పెంచారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఎన్జీకే చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. మే 31న తెరపైకి రానుంది. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చిత్ర ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నటి రకుల్ప్రీత్సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించారు. సూర్య నటిస్తున్న మరో చిత్రం కాప్పాన్. కేవీ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి సాయేషాసైగల్ హీరోయిన్గా నటిస్తోంది. మోహన్లాల్, ఆర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. దీన్ని ఆగస్ట్ 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ఈ రెండు చిత్రాలు తెరపైకి రాకముందే సూర్య మరో చిత్రంలోనూ నటించేస్తున్నారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూరరై పోట్రు అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో సూర్యకు జంటగా అపర్ణ బాలమురళి నటిస్తోంది. ఈ చిత్రం గురించి ఈమె తన ఇన్స్ట్రాగామ్లో పేర్కొంటూ సూరరై పోట్రు చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి అయ్యిందని తెలిపారు. ఈ యూనిట్లో అందరూ సహృదయులేనని, ఇక దర్శకురాలు సుధ కొంగర లాంటి ఐరన్లేడీ ఎవరూ ఉండరని పేర్కొంది. కాగా ఇది ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారత సైనికుడు అయిన జీఆర్.గోపీనాథ్ జీవిత చరిత్ర ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం అని తెలిసింది. గోపీనాథ్ సతీమణి భార్గవి పాత్రలో నటి అపర్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. భార్గవిని పోలి ఉండడం వల్లే అపర్ణను ఆ పాత్రకు ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. కాగా సగటు మనిషి కూడా విమానపయనాన్ని వినియోగించుకునే విధంగా టికెట్ ధరలను తీసుకొచ్చిన ఏయిర్ డెక్కన్ సంస్థ అధినేత జీఆర్.గోపీనాథ్ అన్నది గమనార్హం. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, సిఖ్యా ఎంటర్టెయిన్మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు. -
సూర్య శూరుడు
వీరాధి వీరుడు.. శూరాధి సూరుడు అంటూ పొగిడేస్తారు ఏదైనా గొప్ప పని చేస్తే. లేటెస్ట్గా సూర్యని కూడా ఇలానే అంటున్నారు. కారణం ఏంటో సరిగ్గా తెలియాలంటే సినిమా చూడటమే. సూర్య నటిస్తున్న తాజా చిత్రానికి ‘శూరరై పోట్రు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నల్ల చొక్కా, తెల్ల పంచె. చూపులేమో విమానం వైపు. ఆలోచనలు ఎటో? ఇదీ ఫస్ట్ లుక్. ఎవరెలా అర్థం చేసుకుంటే అలా. ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘శూరరై పోట్రు’. (శూరులను కీర్తించాలన్నది తెలుగు అర్థం) తమిళ కొత్త సంవత్సరం (ఏప్రిల్ 14) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఎయిర్ డెక్కెన్ వ్యవస్థాపకులు పైలెట్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘సర్వం తాళమయం’ ఫేమ్ అపర్ణా బాలమురళి హీరోయిన్గా నటిస్తున్నారు. మోహన్బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్కుమార్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత్ గునీత్ మోంగ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ∙ -
జెట్ స్పీడ్
ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను పట్టాలెక్కిస్తూ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు సూర్య. ఆల్రెడీ సూర్య నటించిన పొలిటికల్ మూవీ ‘ఎన్జీకే’ రిలీజ్కు రెడీ అయింది. ‘కాప్పాన్’ అనే యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ను దాదాపు పూర్తి చేసేశారు. ఇప్పుడు ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఈ చిత్రం ముహూర్తం ఆదివారం జరిగింది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. సూర్య సొంత బ్యానర్పై రూపొందనున్న ఈ సినిమాలో మోహన్బాబు కీలక పాత్ర చేయనున్నారు. ‘సర్వం తాళ మయం’ ఫేమ్ అపర్ణ బాలమురళి హీరోయిన్. జీవీ ప్రకాశ్ స్వరకర్త. -
వాంగ.. వాంగ...
నాయకుడు.. ప్రతినాయకుడు.. సహాయ నటుడు.. ఏ పాత్రని అయినా అవలీలగా చేయగల నటుడు మోహన్బాబు. అందుకే చెన్నై ఇప్పుడు ఆయన్ను ‘వాంగ.. వాంగ..’ అంటోంది. అంటే.. రండి.. రండి. అని అర్థం. అసలు చెన్నై ఆయన్ను ఇప్పుడు రమ్మనడమేంటి? ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఆయన తమిళ సినిమాల్లో నటించారు. వాటిలో 1980లో చేసిన ‘గురు’ అనే సినిమా ఒకటి. ఇప్పుడు కూడా మోహన్బాబు కోసం కబురు పంపింది నేటి ‘గురు’ (2017) డైరెక్టర్ సుధా కొంగర. వెంకటేశ్ హీరోగా ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన సుధ తెలుగమ్మాయి. ఈ చిత్రం తర్వాత సూర్య హీరోగా ఓ చిత్రం చేయడానికి సుధ సన్నాహాలు చేస్తున్నారు. కథ రాసుకునేటప్పుడు సినిమాకి అతికీలకమైన ఓ పాత్రను మోహన్బాబు చేస్తే బాగుంటుందని ఆమె అనుకున్నారట. కథ విన్న సూర్య కూడా మోహన్బాబు అయితే న్యాయం జరుగుతుందని భావించారట. ఇటీవల మోహన్బాబుకు సుధ కథ చెప్పడం, ఆయన గ్రీన్సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇప్పటివరకూ కనిపించన విలక్షణ పాత్రలో ఆయన కనిపించనున్నారని సమాచారం. -
విలన్గా మోహన్ బాబు..!
టాలీవుడ్లో ఎన్నో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న సీనియర్ నటుడు మోహన్ బాబు కొంత కాలంగా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల గాయత్రి సినిమాలో మరోసారి తనదైన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న కలెక్షన్ కింగ్ త్వరలో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్లో మోహన్ బాబు ప్రతినాయక పాత్రల్లో నటించినా.. హీరోగా మారిన తరువాత నెగెటివ్ రోల్స్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఒకటి రెండు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించినా.. దాదాపు ఆ సినిమాల్లో ఆయనే హీరో.. అన్న స్థాయి పాత్రలు మాత్రమే చేశారు. అయితే త్వరలో ఓ బైలింగ్యువల్ సినిమా కోసం పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా మారబోతున్నారు మోహన్ బాబు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా గురు ఫేం సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విలన్ రోల్కు మోహన్ బాబు అయితే కరెక్ట్ గా సరిపోతారని చిత్రయూనిట్ ఆయన్ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. తన క్యారెక్టర్తో పాటు కథా కథనాలు కూడా నచ్చటంతో విలన్గా నటించేందుకు మోహన్ బాబు అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
లేడీ డైరెక్టర్ సినిమాకి యస్
హీరో సూర్య టాప్ గేర్లో దూసుకెళ్తున్నారు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ను మస్త్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్, కేవీ ఆనంద్ దర్శకత్వంలో హీరోగా సినిమాలు చేస్తోన్న సూర్య తర్వాతి చిత్రం ‘ఇరుది సుట్రు’ ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్లో రూపొందనుందని కోలీవుడ్ సమాచారం. తొలిసారి ఓ లేడీ డైరెక్టర్తో సూర్య చేయనున్న చిత్రం ఇది. ‘ఇరుది సుట్రు’ తెలుగు రీమేక్ ‘గురు’ చిత్రం కూడా సుధా కొంగర దర్శకత్వంలోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘మెర్సెల్, వేలైక్కారన్, సర్కార్’ చిత్రాలకు పాటలు రాసిన వివేక్ ఈ సినిమాకు కూడా లిరిక్స్ రాయనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు. ‘‘సూర్య సార్తో తొలిసారి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాశ్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సుధా మేడమ్కి థ్యాంక్స్’’ అన్నారు వివేక్. -
మరో పీరియాడిక్ డ్రామాలో సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే సినిమాలో నటిస్తున్న సూర్య, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే కేవీ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్లో జరగుతోంది. త్వరలో మరో సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. ఎన్జీకే షూటింగ్ పూర్తయిన వెంటనే కేవీ ఆనంద్ సినిమాతో పాటు ఓ మహిళ దర్శకురాలితో కలిసి పనిచేసేందుకు సూర్య ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మాధవన్ హీరోగా సాలా ఖదూస్ సినిమాను రూపొందించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ జానర్లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ కూడా పీరియాడిక్ జానర్లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
బాబాయ్ సినిమా సీక్వల్లో అబ్బాయ్..!
సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా గురు. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సీక్వల్ను తెరకెక్కించే ప్లాన్లో ఉంది దర్శకురాలు సుధ కొంగర. ఇప్పటికే సీక్వల్కు సంబంధించి ఓ స్టోరి లైన్ కూడా రెడీ చేసుకుందట. ప్రస్తుతం పూర్తి స్క్రీప్ట్ రెడీ చేసే పనిలో ఉంది. అయితే తొలి భాగాన్ని వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన దర్శకురాలు, సీక్వల్లో హీరోను మార్చాలని నిర్ణయించింది. గురు సినిమా సీక్వల్కు యంగ్ హీరో రానాను లీడ్ రోల్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే లైన్ విన్న రానా ఫుల్ స్క్రీప్ట్ రెడీ చేయమన్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్లో పాల్గొంటున్న రానా, బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత సుధ దర్శకత్వంలో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అయితే తొలి భాగంలో వెంకీ చేసిన పాత్రకు రానా పాత్రను ఎలా కనెక్ట్ చేస్తారో చూడాలి. బాబాయ్ ఆకట్టుకున్న కోచ్ పాత్రకు అబ్బాయి రానా ఎంత వరకు న్యాయం చేస్తాడో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
వారం ముందే వస్తోన్న గురు
సీనియర్ విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గురు. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన సాలా ఖద్దూస్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్లో నటించిన రితికా సింగ్ కీలక పాత్రలో నటించింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, చాలా కాలం క్రితమే పూర్తయినా.. రిలీజ్ను మాత్రం వాయిదా వేశారు. ముందుగా జనవరి 26నే సినిమా రిలీజ్ చేయాలని భావించినా.. తరువాత ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అనుకున్న సమయం కన్నా వారం ముందుగా అంటే మార్చి 31న రిలీజ్ చేయాలని నిర్ణయించారట. ఏప్రిల్ 7న మణిరత్నం, కార్తీల చెలియా రిలీజ్ అవుతుండటంతో అనవసరమైన పోటీ ఎందుకున్న ఆలోచనతో సినిమాను ముందుగానే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గురు రిలీజ్ ప్రీ పోన్ అయిన విషయాన్ని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. అయితే అభిమానులు మాత్రం ప్రీ పోన్ చేయటమే బెటర్ అని భావిస్తున్నారు. -
అబ్బాయి చేతుల మీదుగా బాబాయ్ ఫస్ట్ లుక్
బాబు బంగారం సినిమాతో ఆకట్టుకున్న సీనియర్ హీరో వెంకటేష్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టనున్నాడు. అయితే కాస్త భిన్నంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వటానికి ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. హిందీ, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సాలా ఖద్దూస్ సినిమాను తెలుగులో గురు పేరుతో రీమేక్ చేస్తున్నాడు వెంకీ. ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. ఒరిజినల్ వర్షన్లో బాక్సింగ్ స్టూడెంట్గా నటించిన రితికా సింగ్, ఈ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వనుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఈ రోజు( శనివారం) సాయంత్రం 5 గంటలకు యంగ్ హీరో రానా తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయనున్నాడు. -
ముహూర్తం కుదిరింది గురూ!
వెంకటేశ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో పీవీపీ సంస్థ ఓ చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. హిందీలో సుధ కొంగర దర్శకత్వంలోనే ఘనవిజయం సాధించిన ‘సాలా ఖద్దూస్’కి రీమేక్ ఇది. తమిళంలో ‘ఇరుది సుట్రు’ పేరుతో సూపర్ హిట్ అయిన ఈ కథ ఇప్పుడు తెలుగు తెరపైకి కొత్త హంగులతో వస్తోంది. చిత్ర షూటింగ్ ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఇందులో వెంకీ బాక్సింగ్ కోచ్గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘గురు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. హిందీలో హీరోయిన్గా నటించిన రితికా సింగ్నే ఇప్పుడీ తెలుగు ‘గురు’లోనూ ఎంపిక చేశారు. విశాఖపట్నం, చెన్నై, ఊటీలలో షూటింగ్ చేసి, క్రిస్మస్కి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ స్వరకర్త. -
స్పెషల్ డైట్!
వెంకటేశ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మాధవన్ హీరోగా తమిళంలో ‘ఇరుది సుట్రు’, హిందీలో ‘సాలా కడూస్’గా విడుదలైన సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 7న మొదలు కానుందని సమాచారం. కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారట. ఒరిజినల్ వెర్షన్లో కథానాయికగా నటించిన రితికా సింగ్ తెలుగులోనూ నటించనున్నారు. ఒరిజినల్ సినిమాకి స్వరాలందించిన సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణ్ తెలుగు సినిమాకీ బాణీలు అందిస్తున్నారు. రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్ కోచ్గా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ప్రస్తుతం కాస్త కండలు పెంచే పనిలో నిమగ్నమయ్యారు. స్పెషల్ డైట్ తీసుకుంటున్నారాయన. విశాఖ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.